యూపీలో బీజేపీ త్రివర్ణ పతాక మార్చ్‌ | BJP To Hold 3 Day Tricolour March In UP | Sakshi
Sakshi News home page

Independence Day: యూపీలో బీజేపీ త్రివర్ణ పతాక మార్చ్‌

Published Sun, Aug 11 2024 8:55 AM | Last Updated on Sun, Aug 11 2024 11:32 AM

BJP To Hold 3 Day Tricolour March In UP

లక్నో: ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘త్రివర్ణ పతాక మార్చ్‌’నిర్వహించాలని ఉత్తరప్రదేశ్‌ బీజేపీ నిర్ణయించింది. ఆదివారం(ఆగస్టు11) నుంచి 13 దాకా మూడురోజులపాటు  మార్చ్‌ జరగనుంది.  ఈ విషయాన్ని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.  హర్‌ఘర్‌తిరంగా క్యాంపెయిన్‌లో భాగంగా త్రివర్ణ పతాక మార్చ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు అన్నింటికంటే దేశమే ముందు అని ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపింది.  ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కలిసి నియోజకవర్గాల్లో త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు నిర్వహిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement