విద్యుత్‌ పొదుపుపై ప్రతిజ్ఞ | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ పొదుపుపై ప్రతిజ్ఞ

Published Sun, May 5 2024 3:25 AM

విద్యుత్‌ పొదుపుపై ప్రతిజ్ఞ

సోన్‌: మండలంలోని విద్యుత్‌ సెక్షన్‌ కార్యాలయంలో శనివారం వరంగల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ కేఎ న్‌ గుట్ట ఆధ్వర్యంలో విద్యుత్‌ పొదుపు, భద్రత ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుట్ట మాట్లాడుతూ.. వినియోగదారులు విద్యుత్‌ను పొదుపు చేయడం అలవాటు చేసుకోవా లని సూచించారు. విద్యుత్‌ సిబ్బంది భద్రతను నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. విద్యుత్‌ ప్రవహిస్తున్న తీగలు, వ్యవసాయ బావులు, ఇంటి వద్ద విద్యుత్‌ పరికరాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం విద్యుత్‌శాఖ సిబ్బందితో పొదుపు, భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. నిర్మల్‌ డీఈ నాగరాజ్‌, ఏఈ శ్రీనివాస్‌, రవి, లైన్‌ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లు, జూనియర్‌ లైన్‌మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement