నిజామాబాద్ సిటీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేవలం ఆరు పంటలకు మాత్రమే ఎంఎస్పీ ప్రకటించిందని, అందులో పసుపు పంట లేకపోవడం విచారకరమని, వెంటనే పసుపు పంటను కూడా చేర్చాలని ఏఐపీకెఎస్ నాయకులు ప్రభాకర్ ఒక ప్రకటనలో అన్నారు. దేశంలో రైతులు దాదాపు 100 రకాల పంటలు సాగుచేస్తున్నారు. అన్ని పంటలకు స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు కేవలం పేపర్లకే పరిమితం కాకుండా నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్లలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి పంటకు కూడా మార్కెట్లో ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అన్ని పంటలకు ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ ఆయన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment