వన్టౌన్(విజయవాడపశ్చిమ): వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో తీర ప్రాంతం తీవ్రమైన ఒడుదొడుకులకు లోనవుతోందని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగులేటి నారాయణ అన్నారు. భారతీయ సంప్రదాయ, సాంకేతిక పద్ధతుల్లో తీర ప్రాంత పర్యావరణ రక్షణపై స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యాన రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ తీరప్రాంత ప్రజలతో పాటు సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవనోపాధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తీర ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసి పోర్టులను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. సముద్రంపై ఆధారపడిన వారికి, తీరప్రాంత వాసులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందన్నారు. సభాధ్యక్షుడు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ శ్రీకొండ మాట్లాడుతూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా (ఐటీపీఐ), ఏపీ రీజనల్ చాప్టర్ సౌజన్యంతో రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీపీఐకు చెందిన ప్రముఖులు ప్రదీప్కుమార్, అనూప్కుమార్ శ్రీవాత్సవ తదితరులు ప్రసంగించారు.
ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ తీరప్రాంత పర్యావరణ రక్షణపై స్పా కాలేజీలో జాతీయ సదస్సు
Comments
Please login to add a commentAdd a comment