నిత్యావసరాలు పక్కదారి పడితే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిత్యావసరాలు పక్కదారి పడితే కఠిన చర్యలు

Published Sun, Oct 20 2024 3:20 AM | Last Updated on Sun, Oct 20 2024 3:20 AM

నిత్యావసరాలు పక్కదారి పడితే కఠిన చర్యలు

ఇన్‌చార్జి కలెక్టర్‌ నిధి మీనా

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించబోమని ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ నిధి మీనా హెచ్చరించారు. అక్రమా లకు పాల్పడేవారిపై 6–ఏ చట్టం కింద కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రేషన్‌షాపుల డీలర్ల నియామక ప్రక్రియపై రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ అధికారులతో ఇన్‌చార్జి కలెక్టర్‌ శనివారం సమావేశం నిర్వహించారు. 800 కార్డులు పైబడిన రేషన్‌ దుకాణాన్ని రెండుగా విభజించాల్సి ఉందని నిధిమీనా తెలిపారు. జిల్లాలో అదనంగా 82 రేషన్‌ దుకాణాలను ఏర్పాటు చేయాలని, కొత్త డీలర్ల నియామకానికి ఈ నెల 20న నోటిఫి కేషన్‌ జారీ చేయాలని సూచించారు. దర ఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్‌ ఐదో తేదీన రాతపరీక్ష, ఏడో తేదీన మౌఖిక పరీక్షలు జరుగుతాయని వివరించారు. అర్హులైన డీలర్ల నియామక ప్రక్రియ 12వ తేదీన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రేషన్‌ షాపుల్లో జొన్నల పంపిణీ

రేషన్‌ షాపుల్లో బియ్యంతో పాటు జొన్నల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ నిధి మీనా సంబంధిత అధికారులకు సూచించారు. నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో భాగంగా జిల్లాలోని అన్ని రైతు బజార్లలో వంట నూనెలు, కందిపప్పు, ఉల్లిని అందుబాటులో ఉంచి ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌ ధ్యాన చంద్ర, డీఆర్వో వి.శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శుభం, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement