గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వచ్ఛతా హీ సేవ నిత్య జీవితంలో భాగం కావాలని, దానిపై అవగాహన పెరగాలని సినీ హీరో సుధీర్బాబు అన్నారు. ఎంజీ రోడ్డులో ఆదివారం ఆదాయ పన్ను శాఖ స్వచ్ఛతా హీ సేవ లో భాగంగా వాక్థాన్ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీని బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, సినీ హీరో సుధీర్ బాబు ప్రారంభించారు. ఈ రన్ బందరు రోడ్డు కార్యాలయం నుంచి మొగల్రాజపురం ఆదాయ పన్ను శాఖ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో విద్యార్థులతో వాక్ థాన్ రన్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తాను పుట్టి పెరిగింది విజయవాడలోనే అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విజయవాడ ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ వీరేందర్ మెహెతా, హైదరాబాద్ ఆదాయపన్ను శాఖ ప్రధాన కమిషనర్ సురేష్ బత్తిని మాట్లాడుతూ ప్రచారంలో విద్యార్థులు పాల్గొనడం చాలా సంతోషదాయమన్నారు. విజయవాడ ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ సునీత బిల్లా, పీఐబీ డీజీ రాజేంద్ర చౌదరి, గుంటూరు ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ సుప్రియ, విజయవాడ ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ అభినయ తదితరులు పాల్గొన్నారు.
సినీ హీరో సుధీర్ బాబు
Comments
Please login to add a commentAdd a comment