హైదరాబాద్–విజయవాడ
జగ్గయ్యపేట: హైదరాబాద్–విజయవాడ రహదారిలో వాహనాల రాకపోకలకు డైవర్షన్ ఏర్పాటు చేశారు. ఆదివారం ‘మరమ్మత్తులు’ శీర్షికతో ప్రయాణం దినదిన గండం అనే కథనాన్ని సాక్షి ప్రచురించింది. దీనిపై స్పందించిన నేషనల్ హైవే అథారిటీ అధికారులు, జీఎమ్మార్ టోల్ప్లాజా సిబ్బంది పాలేరు బ్రిడ్జి కోతకు గురైన సమీపంలో.. ఏపీలోకి వచ్చే ప్రాంతంలోని డివైడర్ను అర కిలోమీటరు మేర తొలగించారు. రెండు లైన్లలో వాహనాల రాకపోకలకు డైవర్షన్ ఇచ్చారు. దీంతో సాయంత్రం నుంచి వాహనాలు వన్వేలో వెళ్లకుండా రెండు లైన్లుగా వెళ్తున్నాయి. డైవర్షన్ పనుల పర్యవేక్షణను చిల్లకల్లు ఎస్సై తోట సూర్య శ్రీనివాస్, టోల్ప్లాజా పీఆర్వో నాగకృష్ణ పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment