శ్రీమందిరంలోకి మొబైళ్లు వద్దు
భువనేశ్వర్:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న పూరీ శ్రీ జగన్నాథ మందిరం తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఎప్పటికప్పుడు ఈ మందిరం లోపలి దృశ్యాలు, కట్టడాలకు సంబంధించిన సమాచారం సాంఘిక మాధ్యమాల్లో వస్తున్నాయి. ఈ పరిస్థితిపై సర్వత్రా విచారం వ్యక్తం అవుతుంది. ఈ పరిస్థితి నివారణకు ఆలయ నిర్వాహక యంత్రాంగం నడుం బిగించింది. పలు ప్రాంతాల నుంచి విచ్చేసే యాత్రికులు, పర్యాటకులు, భక్తుల్ని చైతన్య పరిచేందుకు శ్రీ మందిరం నలు వైపుల మొబైల్ ఫోను వినియోగం నిషేధంపై అవగాహన పోస్టర్లు అంటించింది. ఒడియా, ఆంగ్ల భాషల్లో ఈ పోస్టర్లు రూపొందించారు. నిషేధ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని ఈ పోస్టర్లలో హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment