ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలి

Published Mon, Oct 28 2024 1:50 AM | Last Updated on Mon, Oct 28 2024 1:50 AM

ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలి

ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలి

విజయనగరం అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం 12వ పే రివిజన్‌కు సంబంధించి మధ్యంతర భృతిని ప్రకటించాలని ఎస్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి డి.శ్యామ్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక అమర్‌ భవన్‌లో సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్‌సీకి సంబంధించి గత ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుత పీఆర్‌సీ చైర్మన్‌ రాజీనామా చేయడం వల్ల ఎటువంటి పురోగతి జరగలేదని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలైనా ఇప్పటి వరకు నూతన చైర్మన్‌ నియామకం చేయలేదని, తక్షణమే నూతన చైర్మన్‌ నియామకం జరిపి మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 2003 డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు కేంద్ర మెమో ప్రకారం పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, తక్షణమే పెండింగ్‌ డీఏలు ప్రకటించాలని, అమల్లో ఉన్న డీఏలకు సంబంధించి ఎరియర్స్‌, గత పీఆర్‌సీ ఎరియర్స్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ చొరవ తీసుకుని దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఏకీకృత సర్వీసు రూల్స్‌ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎస్‌టీయూ జిల్లా నాయకులు ఎస్‌ఎస్‌ దొర, డి.శ్రీరామ్‌, బంగారయ్య, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement