ఉదయం 10 గంటలకు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్లో సీఎం వైఎస్ జగన్ సభ
మధ్యాహ్నం 12.30 గంటలకు ఇచ్ఛాపురంలో.. 3 గంటలకు పాత గాజువాక సెంటర్లో..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోని రాజానగరం నియోజకవర్గంలో ఉన్న కోరుకొండ జంక్షన్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలోని ఇచ్ఛాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం లోక్సభ పరిధిలో గాజువాక నియోజకవర్గంలో ఉన్న పాత గాజువాక సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.