● ఒంగోలు నగరంలో రూ.62.79 కోట్లతో సీసీ రోడ్లు, రూ.2.50 కోట్లతో డివైడర్లు, రూ.6.20 కోట్లతో హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఒంగోలు రూరల్, కొత్తపట్నం మండలాల్లో రూ.15 కోట్లతో ఇంటర్నల్ సీసీ రోడ్లు, రూ.20 కోట్లతో లింకు రోడ్లు అభివృద్ధి చేశారు. రూ.80 లక్షలతో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టారు. చేజర్ల–ముదిగొండవాగు–అల్లూరు రోడ్డులో రూ.15 కోట్లతో రెండు వంతెనల పనుల ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు.
● నగరంలో రూ.42.71 కోట్లతో డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేశారు. పోతురాజు కాలువ పనులకు ఇప్పటి వరకు రూ.58 కోట్లకు పైగా ఖర్చు చేశారు. కొప్పోలు సమీపంలో రూ.30.79 కోట్లతో మురుగునీటి శుద్ధి కర్మాగారం నిర్మించారు.
● రూ.28.83 కోట్ల వ్యయంతో గ్యాస్ క్రిమిటోరియం ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో రూ.70 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
● కొత్తపట్నం సముద్ర తీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం రూ.399 కోట్లు కేటాయించారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. పనులు చేపట్టడమే తరువాయి.
Comments
Please login to add a commentAdd a comment