సైబర్ బాధితులకు సత్వర న్యాయం
ఎస్పీ రూపేష్
సంగారెడ్డి జోన్: సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేస్తామని ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. రెండేళ్ల క్రితం హత్నూర మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి నవీన్ సైబర్ ఉచ్చులో పడి ఆన్లైన్ ద్వారా రూ.30లక్షలు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న మొత్తం డబ్బుల్లో రూ.12.5లక్షలను హోల్డ్ చేశారు. బుధవారం తన కార్యాలయంలో బాధితుడికి ఆ డబ్బు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం బాధితుడు ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తే అధిక డబ్బులు సంపాదించాలనే అత్యాశతో అపరిచిత వ్యక్తి అకౌంట్లో రూ.30లక్షలు వేశాడు. చివరకు సైబర్ మోసం జరిగినట్లు గుర్తించి వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 ఫోన్ చేశాడు. అతడు కోల్పోయిన డబ్బులో నుంచి రూ.12.5 లక్షలను హోల్డ్ చేశారు. అనంతరం హత్నూర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేశారు. కాగా, ఆన్లైన్లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలని, అత్యాశకు పోయి అనవసర లింకులను ఓపెన్ చేయడం, ఆన్లైన్ గేమ్స్ ఆడటం వంటివి చేయకూడదని సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్లో నమోదు చేయడం లేదా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment