పట్టు పురుగులతో పుట్టెడు లాభాలు
జహీరాబాద్ టౌన్: పట్టు పురుగుల పెంపకం వల్ల మంచి లాభాలు పొందవచ్చని ఉద్యావన శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు (డీడీ) సోమేశ్వర్రావు అన్నారు. మండల కేంద్రమైన మొగుడంపల్లిలో బుధవారం ఓ రైతు సాగు చేస్తున్న మల్బరీ తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాణిజ్య పంటల కన్నా పట్టు పరిశ్రమ ద్వారా అధిక ఆదాయం పొందవచ్చన్నారు. ప్రభుత్వం కూడా అనేక ప్రోత్సహకాలు అందిస్తుందని చెప్పారు. మల్బరీ మొక్కల పెంపకం, షెడ్డు నిర్మాణం, పరికరాలు, మందులు తదితర ఖర్చులపై రాయితీలు ఇస్తుందన్నారు. ఈ ఏడాది జిల్లాలో 40 ఎకరాల్లో మల్బరీ తోటల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే సగం లక్ష్యం పూర్తయిందని చెప్పారు. రైతులు ముందుకు వచ్చి మల్బరీ తోటల ద్వారా లాభాలు అర్జించాలని కోరారు. ఆయన వెంట సెరీకల్చర్ జిల్లా అధికారి శ్రీనివాస్, జహీరాబాద్ హార్టికల్చర్ అధికారి పండరీ ఉన్నారు.
ఉద్యావన శాఖ డీడీ సోమేశ్వర్రావు
Comments
Please login to add a commentAdd a comment