ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు
బస్వరాజ్ పాటిల్
కల్హేర్(నారాయణఖేడ్): వికలాంగుల పట్ల సమాజంలో వివక్షత కొనసాగుతోందని జాతీయ వికలాంగుల హక్కుల వేదిక (ఎన్పీఆర్డీ) జిల్లా అధ్యక్షుడు బస్వరాజ్ పాటిల్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం కల్హేర్లో విలేకరులతో మాట్లడారు. వికలాంగుల కోసం ఉన్న చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. విద్యా, ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వికలాంగులపై దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల విద్య కోసం ప్రత్యేక విద్య పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు అక్టోబర్ 25–27 జరుగుతాయని తెలిపారు. మహసభలను జయప్రదం చేయాలని కోరారు.
రూ.10నాణేలు స్వీకరించాలి
సంగారెడ్డి జోన్: వ్యాపారస్తులు రూ.10 నాణెలు స్వీకరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ శాంతినగర్ శాఖ మేనేజరు సమత అన్నారు. బుధవారం సంగారెడ్డిలో రూ.10 నాణెల స్వీకరణపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను అందించారు. అన్ని ఏపీజీవీబీ శాఖలలో డిపాజిట్తో పాటు విత్డ్రా చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో శాఖ చీఫ్ మేనేజర్ ఎస్.ప్రకాశం, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment