ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో హార్దిక్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. హార్దిక్ తన చెత్త బౌలింగ్తో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ మ్యాచ్లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన పాండ్యా.. 20.50 పైగా ఏకానమితో ఏకంగా 41 పరుగులిచ్చాడు. హార్దిక్ ప్రతీ మ్యాచ్లోనూ ఈ తరహా ప్రదర్శన చేస్తున్నాడు. కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా బ్యాటింగ్, కెప్టెన్సీ పరంగా తీవ్ర నిరాశ పరుస్తున్నాడు.
ఈ క్రమంలో హార్దిక్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. నీకంటే గల్లీ బౌలర్ బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నాడు. అదే విధంగా బ్యాటింగ్ అనుకూలించే వికెట్పై తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాండ్యా నిర్ణయాన్ని చాలా మంది తప్పబడుతున్నారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ.. ముంబై బౌలర్లకు చుక్కలు చూపిస్తోంది. 16 ఓవర్లలోనే 200 పరుగుల మార్క్ను ఢిల్లీ క్రాస్ చేసింది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో మరో భారీ స్కోర్ నమోదు అవ్వడం ఖాయమన్పిస్తోంది.