ముగిసిన నామినేషన్ల పర్వం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్ల పర్వం

Published Tue, Feb 11 2025 1:09 AM | Last Updated on Tue, Feb 11 2025 1:09 AM

ముగిసిన నామినేషన్ల పర్వం

ముగిసిన నామినేషన్ల పర్వం

మహారాణిపేట (విశాఖ) : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఆఖరి రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు పెదపెంకి శివప్రసాద్‌, సుంకర శ్రీనివాసరావు రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌కు సంబంధిత పత్రాలను అందజేశారు. అభ్యర్థుల చేత రిటర్నింగ్‌ అధికారి ప్రమాణం చేయించారు. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్‌ వెలువడగా, సోమవారం వరకు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల పర్వం ముగిసే సరికి 10 నామినేషన్లు దాఖలైనట్టు కలెక్టర్‌ వెల్లడించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ఉంటుంది. ఆ తరువాత పోటీలో ఎంతమంది ఉన్నారో స్పష్టమవుతుంది. అనంతరం ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు గుర్తుల కేటాయింపు, ఇతర ప్రక్రియలు కొనసాగుతాయని కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్వో, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్‌ భవానీ శంకర్‌ , నోడల్‌ అధికారి దయానిధి, ఎన్నికల సెల్‌ అధికారులు పాల్గొన్నారు.

నామినేషన్లు వేసిన అభ్యర్థులు

కోసూరు రాధాకృష్ణ, పాకలపాటి రఘువర్మ, సత్తలూరి శ్రీరంగ పద్మావతి, కోరెడ్ల విజయ గౌరి, నూకల సూర్యప్రకాశ్‌, రాయల సత్యనారాయణ, గాదె శ్రీనివాసులు నాయుడు, పోతల దుర్గారావు, పెదపెంకి శివప్రసాద్‌, సుంకర శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేశారు.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి చివరి రోజు రెండు నామినేషన్ల దాఖలు

మొత్తం 10 మంది నామినేషన్లు

రేపు పరిశీలన, 13న ఉపసంహరణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement