మొదలైన ప్రాక్టికల్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

మొదలైన ప్రాక్టికల్‌ పరీక్షలు

Published Tue, Feb 11 2025 1:08 AM | Last Updated on Tue, Feb 11 2025 1:08 AM

మొదలైన ప్రాక్టికల్‌ పరీక్షలు

మొదలైన ప్రాక్టికల్‌ పరీక్షలు

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొత్తం 113 కేంద్రాలు కేటాయించగా తొలి విడతగా 61 కేంద్రాల్లో సోమవారం ప్రాక్టికల్స్‌ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరలా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు బ్యాచ్‌లుగా పరీక్షలు కొనసాగాయి. ప్రాక్టికల్స్‌కు ఫిజిక్స్‌ పరీక్షకు 14,923 మంది, కెమిస్ట్రీ పరీక్షకు 14,922 మంది, జువాలజీ పరీక్షకు 4,808 మంది, బోటనీ పరీక్షకు 4,808 మంది, ఒకేషనల్‌ పరీక్షలకు 2,360 మంది హాజరవుతారు. డీఈవో కన్వీనర్‌/ఆర్‌ఐవో ప్రగద దుర్గారావు, డీఈవో కమిటీ సభ్యులు, తనిఖీ బృందాలు పరీక్ష కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement