డ్రైపోర్టు పేరు చెప్పి సిమెంట్ కంపెనీ పెడతారా | - | Sakshi
Sakshi News home page

డ్రైపోర్టు పేరు చెప్పి సిమెంట్ కంపెనీ పెడతారా

Published Thu, Oct 24 2024 1:56 AM | Last Updated on Thu, Oct 24 2024 12:19 PM

ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న ప్రజలు

ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న ప్రజలు

పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనను వెనక్కి తీసుకునే వరకు పోరాడుతాం

ప్రజాభిప్రాయ సేకరణలో స్పష్టం చేసిన నాయకులు

రామన్నపేట: అదానీ సంస్థ యాజమాన్యం డ్రైపోర్టు పేరు చెప్పి ఇప్పుడు సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయడం ఆక్షేపణీయమని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి పేర్కొన్నారు. రామన్నపేట శివారులో అంబుజా సిమెంట్‌ పరిశ్రమ స్థాపనపై కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన మాట్లాడారు. నిబంధనలను తుంగలో తొక్కి ప్రజల కంఠంపై కంపనీలు పెడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

సిమెంట్‌ పరిశ్రమల కాలుష్యం వల్ల దామరచర్ల, నేరేడుచర్ల ప్రాంతాల ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తే వ్యవసాయంతోపాటు చేతివృత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నారు. కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనను వెనక్కి తీసుకునే వరకు పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కంపెనీ ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇవ్వద్దని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణలో వివిధ పార్టీల నాయకులు మాట్లాడి కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement