ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీపాల్రెడ్డిని గెలిపించాలి
గరిడేపల్లి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీపాల్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తంగెళ్ల జితేందర్రెడ్డి, తీగల నరేష్ కోరారు. బుధవారం గరిడేపల్లి మండలం గడ్డిపల్లి, పొనుగోడు, గరిడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గడ్డిపల్లి ఆదర్శ పాఠశాలతోపాటు పాలకవీడు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్, కేజీబీవీలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో కందుకూరి శివశంకర్, గోదేశి దయాకర్, కట్కూరి మధుసూదన్రెడ్డి, కందిమళ్ల సైదులు, శ్రీనివాస్, సువర్ణ, నరసకుమారి, నిమ్మల శ్రీనివాస్, కామల్ల పెంటయ్య, పులుసు వెంకటేశ్వరు నాగరాజు, మేకల సందీప్, మైనం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment