యాలాల: కులం పేరుతో ఓ దళిత వ్యక్తిని దూషించి, దాడికి దిగిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని నాగసముందర్లో నెలరోజుల క్రితం జరిగిన ఘటనపై సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, వ్యకాస జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప శుక్రవారం మాట్లాడారు. గ్రామానికి చెందిన మాల వెంకటప్ప తన పొలంలో సర్వే చేయించి హద్దురాళ్లు వేయిస్తుండగా, అదే గ్రామానికి చెందిన జోగు మల్లప్ప, జోగు వెంకటప్ప, జోగు రాములు కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇప్పటికీ అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని లేనిపక్షంలో వచ్చే నెల 10న డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజు, శేఖర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment