ముగిసిన నామినేషన్ల పర్వం
● ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి చివరి రోజు రెండు నామినేషన్ల దాఖలు
● మొత్తం 10 మంది నామినేషన్లు
● రేపు పరిశీలన, 13న ఉపసంహరణ
మహారాణిపేట (విశాఖ): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఆఖరి రోజు స్వతంత్ర అభ్యర్థులు పెదపెంకి శివప్రసాద్, సుంకర శ్రీనివాసరావు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడగా, నామినేషన్ల పర్వం ముగిసే సరికి 10 నామినేషన్లు దాఖలైనట్టు కలెక్టర్ వెల్లడించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ఉంటుంది.
నామినేషన్లు వేసిన అభ్యర్థులు
కోసూరు రాధాకృష్ణ, పాకలపాటి రఘువర్మ, సత్తలూరి శ్రీరంగ పద్మావతి, కోరెడ్ల విజయ గౌరి, నూకల సూర్యప్రకాశ్, రాయల సత్యనారాయణ, గాదె శ్రీనివాసులు నాయుడు, పోతల దుర్గారావు, పెదపెంకి శివప్రసాద్, సుంకర శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment