వరంగల్ ఎంపీ కడియం కావ్య
కాజీపేట అర్బన్ : వీరనారి చాకలి ఐలమ్మ పోరాట జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలిపారు. ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా 31వ డివిజన్ న్యూశాయంపేటలోని ఆమె విగ్రహానికి ఎంపీ కావ్యతోపాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్యలు పూలమాలవేసి నివాళులర్పించారు. అదేవిధంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీ కావ్య మాట్లాడుతూ రాబోయే తరాలకు చాకలి ఐలమ్మ జీవితం తెలిసేలా సీఎం రేవంత్రెడ్డి మహిళా విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ వెంకటేష్, రజక సంఘం అధ్యక్షుడు చెట్ట ముచ్చేందర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment