ఐదుగురూ టీచర్లే.. | - | Sakshi
Sakshi News home page

ఐదుగురూ టీచర్లే..

Published Sun, Oct 20 2024 1:28 AM | Last Updated on Sun, Oct 20 2024 1:28 AM

  ఐదుగురూ టీచర్లే..

కమలాపూర్‌: హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం గూడూరుకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అంకతి జనార్దన్‌ కుటుంబంలో ఐదుగురు టీచర్లే ఉన్నారు. జనార్దన్‌ స్ఫూ ర్తితో ఆయన పెద్ద కుమారుడు లక్ష్మణ్‌, చిన్న కుమారుడు కృష్ణ, కూతురు శైలజ ఉపాధ్యాయ వృత్తి ఎంచుకున్నారు. ఇద్దరు కోడళ్లు ప్రభావతి, జ్యోతి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే కావడం విశేషం. లక్ష్మణ్‌ ప్రస్తుతం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభావతి కమలాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పని చేస్తున్నారు. కృష్ణ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మంచినీళ్లబండ ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా పని చేస్తున్నారు. జ్యోతి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం జెడ్పీహెచ్‌ఎస్‌లో పాఠాలు బోధిస్తున్నారు. శైలజ కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట ఉన్నత పాఠశాలలో చదువు చెబుతున్నారు. విద్యను పంచుతున్న ఈ కుటుంబాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement