కాజీపేట అర్బన్: ‘పక్క జిల్లాలో మేం పని చేయలేకపోతున్నాం. మా జిల్లాకు మేం వస్తాం. మాపై కరుణ చూపండి’ అంటూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోని జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలకే పరిమితమైన బదిలీలు ఈసారి బ్యాన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ పేరిట సబ్ రిజిస్ట్రార్ల మాదిరిగా జోనల్ ట్రాన్స్ఫర్ నియమాన్ని పాటించిన మాదిరిగా ఉమ్మడి వరంగల్ జిల్లా జూనియర్, సీనియర్ అసిస్టెంట్లను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు బదిలీ అయిన కొందరు ఉద్యోగులు టీఎస్పీఎస్కు దరఖాస్తు చేసుకుని రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నారు. కాగా.. బదిలీ అయిన స్థానం నుంచి తిరిగి యథాస్థానానికి డిప్యుటేషన్పై వెళ్లారు. ఖమ్మం జిల్లాకు వెళ్లిన సదరు ఉద్యోగులు టీఎస్పీఎస్ ఫలితాలు వెలువడేందుకు ఏడాది పట్టే అవకాశం ఉండడంతో తిరిగి వచ్చే అవకాశం కూడా లేకుండా పోలేదు. దీంతో వారు మాత్రం యథాస్థానానికి వెళ్లారు.. మేం మాత్రం అక్కడే ఉండిపోయాం.. మాకు డిప్యుటేషన్లోనైనా చాన్స్ ఇవ్వండి మా జిల్లాకు మేం వస్తామంటూ వాపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సుమారు 14 మంది సీనియర్, 15 మంది జూనియర్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తుంటారు. కాగా.. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. కాగా డైలీ అప్ అండ్ డౌన్ చేసే పరిస్థితి కూడా లేకుండా దూరం అవుతోందని ఇటీవల ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు రెవెన్యూ శాఖ మంత్రిని, డీఐజీని కలిసి వినతులను సమర్పించినట్లు సమాచారం. కాగా.. తమ బదిలీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిప్యూటేషన్కు చాన్స్ ఇవ్వండి
మంత్రి, డీఐజీకి వినతుల వెల్లువ
Comments
Please login to add a commentAdd a comment