మోటార్లకు కెపాసిటర్లు బిగించుకోవాలి
వర్ధన్నపేట: రైతులు తమ వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లు బిగించుకుని లోవోల్టేజీ సమస్య లేకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ వరంగల్ రూరల్ టెక్నికల్ డీఈ ఆనందం, వర్ధన్నపేట ఏడీఈ నటరాజు సూచించారు. పొలం బాటలో భాగంగా బుధవారం మండలంలోని కట్య్రాల గ్రామంలో కట్య్రాల, కడారిగూడెం రైతులకు బుధవారం విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏమైనా సమస్యలు ఏర్పడినప్పుడు సిబ్బందికి సమాచారం అందించి పరిష్కరించుకోవాలని కోరారు. అదేవిధంగా విద్యుత్ తీగలు తెగిపోయినప్పుడు, వేలాడుతున్నపుడు రైతులు సరిచేస్తే ప్రమాదాలు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు బిగించుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. లోవోల్టేజీ లేకుండా విద్యుత్ మోటార్లు కాలిపోకుండా కాపాడుకోవచ్చన్నారు. ఏఈ తరుణ్, లైన్మెన్ రమణరెడ్డి, లక్ష్మణ్, ఏసీఎం సుమన్, జూనియర్ లైన్మెన్లు విజయ్, రశీద్, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment