help
-
వేసవిలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త!
పాలకొల్లు సెంట్రల్: వేసవిలో చిన్నారులకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి ప్రారంభమైందంటే చాలు చికెన్ పాక్స్(ఆటలమ్మ), గవద బిళ్లలు వంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వీటి నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు పాలకొల్లు మండలం లంకలకోడేరు పీహెచ్సీ వైద్యుడు అడ్డాల ప్రతాప్ కుమార్.చికెన్ పాక్స్ అన్ని వయసుల వారికి సోకినా.. ముఖ్యంగా చిన్నారులకు వేగంగా సోకే ప్రమాదం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి సోకిన వారు ఆహారం సరిగా తీసుకోలేకపోవడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో నీరసంగా కనిపిస్తుంటారు. ఆటలమ్మ, గవద బిళ్లల లక్షణాలు కనిపించిన వెంటనే సంబందిత వైద్యులను సంప్రదించాలి. వ్యాధి తీవ్రతను బట్టి వైద్యుల సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీ బయోటిక్ మందులు వాడాల్సి ఉంటుంది.గవద బిళ్లలుచల్లటి పానీయాలు అతిగా తీసుకోవడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గి గవద బిళ్లలు వస్తాయి. ప్రధానంగా లాలాజల గ్రంధులు ఉబ్బడంతో గవద బిళ్లలు ఏర్పడతాయి. గోరు వెచ్చని నీళ్లు తాగాలి. ఏ ఆహారం తిన్నా నోటిలో నీళ్లు వేసుకుని పుక్కిలించాలి. ఎంఎంఆర్ టీకా వేయించుకోవడం వల్ల గవద బిళ్లలు రాకుండా నివారించవచ్చు. గవద బిళ్లలకు మందులు వాడితే మూడు రోజుల్లో తగ్గుతుంది. వాపు ఎక్కువగా ఉంటే తగ్గడానికి ఏడు రోజులు పడుతుంది.చికెన్ పాక్స్ఆటలమ్మ వైరస్ వల్ల వస్తుంది. జ్వరం.. శరీరంలో వేడి ఎక్కువై పొక్కులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో స్కిన్ ఎలర్జీని కూడా ఆటలమ్మ అనుకుంటారు. ఆటలమ్మ అరి చేతులు, పాదాలు, నెత్తి మీద రాదు. అలా వచ్చాయంటే అవి స్కిన్ ఎలర్జీగా గుర్తించాలి. ఆటలమ్మ సోకిన వాళ్లు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ప్రతి రోజూ శుభ్రంగా స్నానం చేయాలి. టీకా అందుబాటులో ఉంది. వేయించుకోవడం మంచిది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి దురద ఎక్కువగా ఉంటుంది. ఒక చోట గోకి మరో చోటు గోకితే అక్కడ పొక్కులు వస్తాయి. అందువల్ల గోర్లు పెరగకుండా చూసుకోవాలి.తీసుకోవాల్సిన జాగ్రత్తలుఆటలమ్మ సోకిన వారిని ఇంట్లో మిగిలిన సభ్యులకు దూరంగా ఉంచాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే అందించాలి. గవద బిళ్లలు వచ్చిన వారికి గొంతు నొప్పి ఎక్కువగా ఉంటుంది. నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కువగా ద్రవ పదార్ధాలు ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. మూఢ నమ్మకాలు, అపోహలకు పోకుండా వైద్య సహాయం తీసుకోవాలి. ఈ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటే మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వైద్యులు చెబుతున్నారు. వ్యాధులు సోకకుండా ఉండాలంటే వేడి నీళ్లు తాగడంతో పాటు.. శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. -
కృతజ్ఞత కనీస సంస్కారం
మనకు మేలు చేసిన వారికి కృతజ్ఞులై ఉండడం మన కనీస ధర్మం... మనం ఎవరి నుంచైతే మేలు పొందుతున్నామో, వారు ప్రత్యుపకారాన్ని ఆశించకపోయినా, వారి ఉదారతను గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన విధిగా భావించాలి. ఎందుకంటే అలా కృతజ్ఞతలు తెలియ చేసినపుడే మన సంస్కారం ఏమిటో ఇతరులకు అర్థమవుతుంది. అంతేకాదు అది మనసుకు కూడా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.మనం ఇతరుల నుంచి ఎలాంటి సహాయం పొందినా వారికి కృతజ్ఞులై ఉండాలి. తల్లితండ్రులు మనకి జన్మనిస్తారు.. మన భవిష్యత్ కు పునాదులు వేస్తారు.. అందువల్ల మనం వారికి జీవితాంతం కృతజ్ఞులై ఉండాలి. మన గురువులు మన భవిష్యత్ కు దిశానిర్దేశం చేస్తారు, మన స్నేహితులు మనకు చేదోడు వాదోడుగా ఉంటారు, ఇలా అనేక మంది పరోక్షంగా మన భవిష్యత్కు ఎంతగానో సహకరిస్తున్నారన్నమాట.. మన భవిష్యత్ను వారంతా తీర్చి దిద్దుతున్నపుడు వారికి మనం కృతజ్ఞతలు చూపించుకోవాలి కదా.. కృతజ్ఞతలు తెలియ చేయడం మన వ్యక్తిత్వాన్ని చాటి చెబుతుంది.. మనం ఎవరి దగ్గర నుంచైనా సహాయం పొందినపుడు నవ్వుతూ ధాంక్సండీ.. మీ మేలు మరచి పోలేను అని చెప్పి వారి కళ్లలోకి ఒక్కసారి తొంగి చూస్తే, వారి కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం మనకు కనిపిస్తుంది.. వారికి మన పట్ల మంచి అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. దానివల్ల అవతలి వారు భవిష్యత్లో వారితో మనకేదైనా పని పడ్డప్పుడు, వారు ఇక ఆలోచించకుండా మనకు సహాయం చేస్తారు.శ్రీరామచంద్రుడ్ని మనం దేవుడిగా పూజిస్తాం.. అయితే రామచంద్రుడు సాక్షాత్తు పరమాత్ముడే అయినా ‘ఆత్మానాం మానుషం మన్యే’ అన్నట్లు తనను ఒక మానవమాత్రునిగానే భావించుకున్నాడు. అందరిలో తాను ఒకడిగా, అందరికోసం తాను అన్నట్లుగా మెలిగాడు. మానవతా విలువలకు, కృతజ్ఞతా భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. అలా రాముడు ప్రతీ విషయంలోనూ కృతజ్ఞతను చాటుకోవడం వల్లనే ఆయనను మనం పూజిస్తున్నాం.. ఆరాధిస్తున్నాం... మనం భూమి మీద నడుస్తున్నాం. పంటలను పండించుకుంటున్నాం... కనుక భూమిని భూదేవి‘ అనీ, మనం బతికుండడానికి ముఖ్య పాత్ర వహిస్తున్న నీటిని ‘గంగాదేవి’ అనీ, గాలిని వాయుదేవుడు అనీ పిలుస్తూ కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ, మన నిత్య జీవితంలో అనేకానేకం మనకు ఉపయోగపడుతూంటాయి. వాటన్నింటి పట్ల, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పట్ల, విద్య నేర్పిన గురువుల పట్ల, అందరి పట్ల కృతజ్ఞతతో వుండాలి. సమస్త ప్రకృతి మన భావాలను గ్రహించి తదనుగుణంగా స్పందిస్తుంది కనుక మనకు చక్కగా ఆక్సిజన్ ఇస్తున్న చెట్లకూ, నీటికీ కృతజ్ఞతలు చెప్పాలి. మన జీవితానికి ఉపయోగపడే ప్రతి వ్యక్తికీ, వస్తువుకు, జీవికి మనం కృతజ్ఞులై ఉంటే, అదే మన భావి జీవితానికి కొత్త బాటలు వేస్తుంది. మన జీవితాన్ని నందనవనం చేస్తుంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ, మన నిత్య జీవితంలో అనేకానేకం మనకు ఉపయోగపడుతూంటాయి. వాటన్నింటి పట్ల, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పట్ల, విద్య నేర్పిన గురువుల పట్ల, అందరి పట్ల కృతజ్ఞతతో వుండాలి.– దాసరి దుర్గా ప్రసాద్, ఆధ్యాత్మిక పర్యాటకులు -
మహా కుంభమేళాలో ఆటో కుర్రాడికి ఊహించని సాయం
-
కష్టం తీర్చిన కుంభమేళ.. ఆటో కుర్రాడి భావోద్వేగం
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం... మహా కుంభమేళ ముగిసింది! త్రివేణీ సంగమ స్థలి ప్రయాగ్రాజ్లో సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కోట్లమంది సందర్శించారు. పవిత్ర గంగలో మునకేసి తమ పాపాలు కడిగేసుకున్న పారవశ్యంలో మునిగితేలారు. వీరందరిది ఒక ఎత్తైతే.. కొందరు పరోపకారాన్ని కూడా అంతే శ్రద్ధాసక్తులతో చేసి ఆత్మానందం పొందారు. అలాంటి ఓ సంఘటన సాగిందిలా...కోట్లమందిలాగే.. స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుద్ధ పరచుకోవడం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించడం కోసం ఆమె కూడా కుంభమేళాకు వెళ్లారు. ఎక్కడో ఓ మూలనున్న రిసార్టులో మకాం. అక్కడి నుంచి సంగమ స్థలికి వెళ్లేందుకు ఓ ఆటో మాట్లాడుకున్నారు.. దాన్ని నడుపుతోంది ఓ నూనూగు మీసాల కుర్రాడు. మాట మాట కలిసింది. కుశల ప్రశ్నలయ్యాయి. బడికెందుకు వెళ్లడం లేదన్న ప్రశ్న వచ్చింది. అంత సౌలభ్యం లేదన్న సమాధానంతోపాటు తప్పనిసరి పరిస్థితుల్లోనే... బతుకు కోసం ఆటో నడపాల్సి వస్తుందని ఆ కుర్రాడు తన బాధను వెళ్లబోసుకున్నాడు. ఈ మాటలు ఆమెలో ఆసక్తిని పెంచాయి. మెల్లిగా మాటలతో అతడి నేపథ్యం గురించి ఆరా తీశారు.మేడమ్ జీ.. అంటూ మొదలుపెట్టి తన గురించి మొత్తం చెప్పుకొచ్చాడతను. చదువుకోవాల్సిన వయసులో తల్లిని పోషించాల్సిన భారం ఆ కుర్రాడిపై పడింది. అందుకే బాడుగకు ఆటోను నడిపిస్తున్నట్లు చెప్పాడతను. రోజుకు రూ.వెయ్యి కిరాయి చెల్లిస్తేనే ఆటో నడుపుకోవచ్చునని, చెల్లించని రోజు లేదా తక్కువ మాత్రమే ఇవ్వగలిగిన రోజు ఆటో యజమాని నానా ఇబ్బందులు పెడుతున్నాడని ఆ కుర్రాడు వాపోయాడు. అతని పరిస్థితి గురించి తెలుసుకుని ఆమె చలించిపోయారు. సొంత ఆటో ఉంటే బాగుంటుంది కదా? అని అన్నారామె. నిజమే.. కానీ నాకెవరు ఇస్తారు మేడమ్ జీ?. అంత స్థోమతెక్కడిది నాకు? అన్నాడా కుర్రాడు. అదంతా నేను చూసుకుంటా.. నీ వివరాలివ్వు అన్న ఆ మేడమ్ జీ.. మరుసటి రోజు ఆ కుర్రాడికి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ఆటో కొనుగోలుకు సంబంధించిన డౌన్పేమెంట్ రసీదును వాట్సప్లో అందుకున్న ఆ కుర్రాడి కళ్లల్లో కచ్చితంగా నాలుగు చుక్కల ఆనందభాష్పాలు రాలే ఉంటాయి. అందుకేనేమో.. కష్టాల ఊబి నుంచి తనను బయటకు లాగేసేందుకు విచ్చేసిన ఇంకో తల్లికి కృతజ్ఞతలు చెప్పాడు. తనతోపాటు జన్మనిచ్చిన తల్లితోనూ ఆ మేడమ్ చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పించాడు. ఆడియో మెసేజీ ద్వారా.. ఆ మేడమ్ జీని దేవుడే పంపించాడని మురిసిపోయారు. మళ్లీ సంగం వస్తే తప్పకుండా తమకు ఇంటికి భోజనానికి రావాలంటూ ఆహ్వానించారు. ఇంతకీ ఆ మేడమ్ ఎవరన్నదేనా మీ సందేహం. పేరు.. భారతి చంద్రశేఖర్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పరిశ్ధోన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ సతీమణి. ఎస్సీఎస్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పలువురి విద్య, ఆరోగ్య అవసరాలకు సాయం చేసిన భారతీ చంద్రశేఖర్ తాజాగా తనకెంతో తృప్తిని కలిగించిన ఈ అనుభవాన్ని ‘సాక్షి.కాం’తో పంచుకున్నారు. -
Hyderabad: శనివారాల్లో ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’
లక్డీకాపూల్ (హైదరాబాద్) : ఆస్తి పన్ను(Property Tax) సమస్యల పరిష్కారం కోసం ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి(GHMC Commissioner) తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ప్రజలకు ఆస్తిపన్ను సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పన్ను సమస్యలు, పునఃసమీక్ష అభ్యర్థనలు (ఆర్పీఎస్) ఆస్తిపన్ను అంచనాల్లో సవరణలు, బిల్ కలెక్టర్ల ద్వారా/ఆరీ్టజీఎస్ ద్వారా చెల్లింపుల నమోదు, ఆన్లైన్ బకాయిలు సరిచేయడం, కోర్టు కేసుల పరిష్కారం, ఐజీఆర్ఎస్ సమస్యలు, స్వయం మూల్యాంకనం (సెల్ఫ్ అసెస్ మెంట్) తదితరాలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార కార్యక్రమం ఈ నెల 22న, మార్చి 1, 8, 15, 22,29 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు డిప్యూటీ కమిషనర్స్ కార్యాలయాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించిన ఏవైనా సమస్యలున్న వారు తమ సంబంధిత జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పైన పేర్కొన్న తేదీలలో నిర్వహించే ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం కార్యక్రమంలో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు. -
అక్కరలేని మనిషి
ఆడవాళ్ళు ఆయన్ని ‘బాబాయిగారు’ అని పిలుస్తారు. మగవాళ్ళలో కొందరు ‘రెడ్డిగారు’ అని పిలిస్తే, మరికొందరు రావుగారు అని, ఇంకొందరు మూర్తిగారు అని పిలుస్తారు. కుర్రాళ్లు ‘అంకుల్’ అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా, ఆయన అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ, వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ పోతాడు .ఆయన అసలు పేరు ఎవరికీ తెలియక పోయినా, ఆయన మొబైల్ నెంబరు మాత్రం ఆ అపార్టుమెంటు వాసులందరికీ సుపరిచితమే!ఆ ఒక్క అపార్టుమెంటే కాదు, అక్కడ ఉన్న నాలుగైదు అపార్టుమెంట్లలో కరెంటు రిపేర్లు, నీళ్ళ ట్యాపులు, సెప్టిక్ టాంకులు, బాత్రూమ్ కమోడ్లు, చెక్క పనులు– ఇలా ఒకటేమిటి, సమస్త రిపేర్లకు ఎవరైనా సరే పిలిచేది ఆయన్నే! ఇంత పెద్ద నగరంలో ఆయన తప్ప ఇంకొకళ్ళు లేరా అని మీకు అనుమానం రావచ్చు. రిపేర్లు ఎవరైనా చేస్తారు. కాని, అడిగిన వెంటనే రావటం; సకాలంలో పని పూర్తి చెయ్యటం; డబ్బులు డిమాండు చెయ్యకుండా ఎవరు ఎంతిచ్చినా చిరునవ్వుతో ‘పర్లేదులెండి’ అంటూ తీసుకోవటం వల్ల అందరూ వాళ్ళ ఇళ్ళలో ఏ రిపేరు పని వచ్చినా ఆయన్నే పిలుస్తారు.కొంతమంది ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని, అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామని, పని చేయించుకుని కూడా డబ్బులిచ్చే వాళ్ళు కాదు. ఆయన కూడా, ‘అలాగేనండి, మీ దగ్గర డబ్బులెక్కడికి పోతాయి’ అంటూ నవ్వేసి వెళ్ళిపోయేవాడు .‘అదేమిటండీ వాళ్ళు అలా మీ చేత పని చేయించుకుని, డబ్బులు తరువాత ఇస్తామంటే ఊరుకుంటారు’ అని అడిగితే, ‘ఏమోలే సార్! వాళ్ళకే ఇబ్బంది వుందో! వాళ్ళకు వీలైనప్పుడు ఇస్తారు లెండి’ అనేవాడు. నాకు మాత్రం ఇతరుల కష్టం ఉంచుకోవటం ఇష్టం వుండదు. ఏ చిన్న పని చేసినా, మా ఇంట్లో ఆయన అడక్క ముందే డబ్బులిచ్చేసేవాడిని. ఆయనే , ‘ఎందుకు సార్, నేనేం పెద్ద పని చేశానని ఇంత పెద్దమొత్తం ఇచ్చారు’ అంటూ తిరిగి ఇవ్వబోయే వాడు. ఆయన మంచితనాన్ని నేనేనాడూ అలుసుగా తీసుకోలేదు. ఆయనంటే నాకు మా ఇంట్లో మనిషి అనే భావన వుండేది. మా నాన్నది ఆయనది ఒకటే వయసు. నాన్న లేకపోవటం వల్ల అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడితే నాన్నతో మాట్లాడినట్లే వుండేది. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆయన హాజరు తప్పనిసరి. భోజనానికి రమ్మని, వాళ్ళ ఆవిడని కూడా తీసుకు రమ్మని మా ఆవిడ మరీ మరీ చెప్పేది. కాని ఆయన మాత్రం ఒక్కడే, సిగ్గుపడుతూ వచ్చేవాడు, ఆ రోజు మా ఇంట్లో ట్యాపు రిపేరు చేసి వెళ్తు వెళ్తూ, ‘సార్, ఓ సెకండ్ హ్యాండ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు చౌకగా అమ్మకానికి వచ్చింది’ అన్నాడు.‘మరింకేం బాబాయిగారు, తీసుకోక పోయారా?’ మా ఆవిడ ప్రోత్సహించింది.‘అదేనమ్మా! తీసుకుందామనే వుంది. కాకపోతే, ఓ యాభైవేలు తగ్గాయి’ నసుగుతూ నావంక చూశాడు.‘యాభై వేలే కదండి, సర్దుతాలెండి’ పెద్దాయనకు భరోసా ఇచ్చాను. ‘సంతోషం సార్! మీ బాకీ చిన్నగా తీర్చుకుంటాను, వుంటాను‘ అంటూ నిష్క్రమించాడు.‘ఆయన గుమ్మం దాటి వెళ్ళాడని నిర్ధారించుకుని, ‘ఏమిటి, నన్నడగకుండా అలా మాట ఇచ్చేయటమేనా?’ మా ఆవిడ నిలదీసింది. ‘నువ్వే కదోయ్, బాబాయిగారు! తీసుకోండి అన్నావు. నీకు ఇష్టమేనని మాట ఇచ్చాను’ చిన్నగా గొణిగాను. ‘ఎదో మాటవరసకు అంటాము. అన్నంత మాత్రాన ఉళ్ళోవాళ్ళకి ఊరికినే డబ్బులిచ్చేస్తామా, ఏమిటి?’ అంది మా ఆవిడ.‘ఆయన మనకు ఎప్పటినుండో తెలుసు. ఆయన్ని చూస్తే మా నాన్నను చూసినట్టే వుంటుంది. మా నాన్నకు సాయం చేశాను అనుకో’ అన్నాను. ఆ మాటలతో, ఆవిడ చల్లబడింది. ‘ఔను, మనల్ని ఉబ్బులడుగుతున్నాడు, ఆయనకు పిల్లలు లేరా?’ అనుమానంగా అడిగింది. ‘లేకేం, వున్నాడులే ఓ సుపుత్రుడు. హైదరాబాద్లో ఏదో పని చేస్తుంటాడు. వాడికే ఈయన నెలనెలా ఉబ్బులు పంపిస్తుంటాడు. ఇంక వాడేం సాయం చేస్తాడు?’ తేల్చి పారేశాను‘పెళ్ళయిందా?’‘ఆ అవ్వకేం, అయ్యింది. ఒక పిల్లాడు కూడా. వాడే సరిగ్గా వుంటే, ఆయనకు ఈ తిప్పలెందుకు చెప్పు?’ శ్రీమతికి అంతా వివరంగా చెప్పిన తరువాత ఇంక ఆవిడ మౌనంగావుండిపోయింది.‘అంతా కలిపి ఒకేసారి ఇస్తాం లెండి‘ ఎదురింటి ఆవిడ ఏమి రిపేరు చేయించుకుందో ఏమో, ఆయనతో అంటూ వుంటే, వరండాలో కూర్చున్న నా చెవిన బడింది ‘లేదమ్మా, కాస్త అవసరం పడింది. ఈమధ్యే ఓ ఇల్లు కొనుక్కున్నాను. అప్పలున్నాయి, తీర్చాలి’ ఆయన మాటలు ఆవిడకే కాదు, నాకు ఆశ్చర్యం అనిపించినా, నా అప్పు తీరబోతుందని సంతోషం వేసింది. ‘అదేమిటండీ. మేమిచ్చే పది, ఇరవైతోనే మీ అప్పులన్నీ తీరతాయా?’ నిష్ఠూరంగా అందావిడ. ‘లేదండి, పాతబాకీ, ఇప్పటిదీ అన్నీ కలిపి రెండువేల దాకా అయ్యిందండీ మీ బిల్లు’ చెప్పాడు పెద్దాయన.‘రెండువేలా? అంత ఎందుకు అవుతుందండి?’ అంటూ రుసరుస లాడింది.‘లేదమ్మా, ఇదిగో మీకు ఏమేం పనులు చేశానో, వాటికి సామాన్లు ఎంతయ్యాయో అన్నీ వివరంగా రాశాను’ అంటూ జేబులోంచి ఒక కాగితం తీసి ఆవిడకిచ్చాడు పెద్దాయన.ఓ క్షణం ఆ కాగితం వంక ఎగాదిగా చూసి, ‘ఇవన్నీ మేము చేయించుకున్నామా?’ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘అవునమ్మా! మీరు చేయించుకున్నవే! పక్కన తారీఖులు కూడా వేశాను’ అన్నాడు పెద్దాయన.ఇక తప్పదన్నట్టు, ‘సరేనండి, ఇంట్లో మావారు లేరు. సాయంత్రం రండి’ అంటూ తలుపేసుకుంది.ఇక చేసేదేమీలేక పెద్దాయన చిన్నగా నిట్టూరుస్తూ మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడని నిర్ధారించుకుని, బయటకొచ్చి, ఒకసారి అటూ ఇటూ చూసి పక్కింటివాళ్ళ తలుపు కొట్టింది. పక్కింట్లో నుంచి బయటకొచ్చిన మరో పెద్దావిడతో ‘చూశారా పిన్నిగారు! ఆయనేదో మంచివాడు అనుకున్నామా’ అంటూ ఆగింది. ‘ఇప్పుడేమైంది’ అన్నట్టు ఆవిడ మొహం పెట్టింది.‘మనకేదో ఉచితంగా సాయం చేస్తున్నాడనుకున్నాం కాని, ఈరోజు రెండువేలు బిల్లంటూ పట్టుకొచ్చాడు’ అంది కాస్త నీరసంగా. ‘అవునమ్మ, మాకూ వేశాడు, ఎప్పుడో మా తాతలకాలం నుండి రిపేర్లు చేస్తున్నాడట! మూడువేలు అంటూ వసూలు చేసుకెళ్ళాడు’ అంది పక్కింటి పెద్దావిడ మరింత నీరసంగా.ఇద్ద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే, అది ప్రపంచం మొత్తం పాకిపోతుంది అన్నట్టు ఆ వార్త ఆగమేఘాల్లో అపార్టుమెంటు మొత్తం పాకిపోయింది. ప్రతి ఒక్కళ్ళూ ఆయన్ని తిట్టు కోవటమే! దాదాపు ఓ యాభై ఇళ్ళవాళ్లైనా పెద్దాయనకు బాకీ వుండి వుంటారు. ఇంటికి రెండువేలు వేసుకున్నా, లక్ష అవుతుంది. అంటే నా బాకీ త్వరగా తీరబోతుంది అని ఆనందంగా వున్నా, అందరూ ఆయన్ని తిట్టుకోవటం కాస్త బాధ అనిపించింది. ఈ మనుషుల మనస్తత్వమే అంత. ఉచితంగా సేవలు చేస్తే రాముడు, దేవుడు అంటూ పొగుడుతారు. అదే చేసిన పనికి డబ్బు అడిగితే రాక్షసుడిలా చూస్తారు. ఆరోజు నుంచి అపార్టుమెంట్లోని వాళ్ళు తమ పనులకు ఆయన్ని పిలవటం తగ్గించారు. అసలు నన్నడిగితే తప్పు వాళ్ళది కాదు, పెద్దాయనదే! పని చేసినప్పుడు ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకునుంటే ఎవ్వరికీ ఏ బాధ వుండేది కాదు. అంతా కలిపి ఒక్కసారి కట్టమని అడిగితే, ఇప్పుడు అందరూ ఆయన్ని ఓ అప్పులోడి కింద చూస్తున్నారు. బహశా అసలు డబ్బులు అడగడులే అనుకున్నారో ఏమో!ఎవరిదో అన్నోన్ నంబరు అదే పనిగా రింగ్ అవుతుంది. ఎవరై వుంటారబ్బా అని అనుకుంటూ ఎత్తాను.‘సార్ శ్రీనివాసరావుగారేనా? ‘అవతలి నుంచి ఎవరో ఆడగొంతు.‘అవునండి!’ సమాధానం ఇచ్చాను. ‘ఉదయ్ హాస్పిటల్స్ నుంచండి, మీ బంధువు ఒకాయన రాత్రి గుండెనొప్పితో హాస్పిటల్లో చేరారు. ఎవరన్నా వున్నారా అని అడిగితే మీ నంబరు ఇచ్చారు’ చెప్పుకు పోతోంది ‘నా బంధువా? గుండెనొప్పితో హాస్పిటల్లో చేరాడా? ఎవరై వుంటారు?’ అప్పటి దాకా ప్రశాంతంగా వున్న నా మనసులో ఆందోళన మొదలైంది.వెంటనే బయలుదేరి, పది నిమిషాల్లో ఉదయ్ హాస్పటల్ రిసెప్షన్ కౌంటర్ ముందు వాలాను. వాళ్ళను అడిగితే, ‘పేషంట్ పేరేమిటండి?’ అనడిగింది రిసెప్షనిస్టు. నిజమే! పేషంట్ పేరేమిటి? గాభరాలో అడగటం మర్చిపోయాను.‘తెలియదండి, మీ దగ్గర నుంచే నాకు కాల్ వచ్చింది’ సమాధానం ఇచ్చాను. నా సమాధానానికి నా వంక విచిత్రంగా చూస్తూ, రిజిస్టరులో వెతకటం ప్రారంభించింది. ఓ రెండు నిమిషాల తరువాత, ‘ఐసీయూలో వున్నారు వెళ్ళండి’ అంది. ఆ జవాబు విన్న నేను ‘ఐసీయూలోనా!’ మనసులో మరింత ఆందోళనతో ఐíసీయూ వైపు నడిచాను. అప్పుడు కూడా పేషంట్ పేరు అడగటం మర్చిపోయాను.ఐసీయూ లోపలకు వెళ్ళి అడిగితే, వాళ్ళు కూడా పేషంట్ పేరేమిటి అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక, ‘రాత్రి చేరారు’ అన్నాను. ఎదురుగా వున్న బెడ్ వంక చూపించింది అక్కడ వున్న నర్సు. కర్టెన్ వేసి వుండటంతో పేషంటు కనపడట్లేదు నాకు. మెల్లిగా రెండడుగులు వేసి, కర్టెన్ పక్కకు తోసి లోపలికి అడుగుపెట్టాను. ఎదురుగా పెద్దాయన, బెడ్ మీద, ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి వుంది, ఛాతీ నిండా ఈసీజీ వైర్లు బిగించి వున్నాయి. పక్కన ఈసీజీ మెషిన్ బీప్.. బీప్.. అంటోంది. బహుశా, నిద్రపోతున్నాడు అనుకుంటా కళ్ళు మూసి వున్నాయి. దగ్గరకు వెళ్ళి నిలబడ్డా, అలికిడికి కళ్ళు తెరిచాడు పెద్దాయన. ఏదో చెప్పాలనుకుంటున్నాడు కాని, ముఖానికి ఆక్సిజన్ మాస్క్ వుండటం వల్ల సాధ్యం కాలేదు. కాని కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్ళు మాత్రం మాట్లాడతున్నాయి.‘ఉళ్ళో అందరికీ సహాయం చేసే నాకెందుకు ఇలా అయ్యింది’ అని అడుగుతున్నట్టు వున్నాయి పెద్దాయన చూపులు. ఇంతలో ఒక పెద్దావిడ నా దగ్గరకు వచ్చి నమస్కారం చేసింది, నావంక చూస్తూ. బహుశా, ఆయన భార్య అనుకుంటా! ‘బాబుగారు! రాత్రి గుండెల్లో బాగా నొప్పిగా వుంది అంటే, వెంటనే హాస్పిటల్లో చేర్చాను. ఆ వెంటనే మీకు కబురు పెట్టమంటే పెట్టాను’ అంది గద్గద స్వరంతో ‘డాక్టర్లు ఏమన్నారు?’ అడగలేక అడిగాను.‘స్టెంట్ వెయ్యాలి, ఓ లక్షదాకా అవుతుంది అన్నారు’ సమాధానమిచ్చింది ‘మీ అబ్బాయికి కబురు పెట్టారా?’ ఓ క్షణం మౌనంగా వుండి పోయిందావిడ.‘ఏమ్మా, మీ అబ్బాయికి ..’ మాట పూర్తయ్యే లోపు ‘చెప్పాను బాబు, నే వచ్చి చేసేదేముంది అన్నాడు’ తలదించుకుని జవాబిచ్చింది.బహుశా ఇలాంటి కొడుకును ఎందుకు కన్నానా అని సిగ్గుపడుతోంది కాబోలు. ఆవిడ చెప్పిన జవాబుకి నా మనసంతా ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్టు అనిపించింది.ఇంతలో పెద్దాయన మెల్లగా నా చెయ్యి మీద చెయ్యి వేసి, నా వంకే చూడటం మొదలు పెట్టాడు. ఆ చూపులలో భావం నాకు అర్థమయ్యింది.‘ఫరవాలేదమ్మా, అధైర్యపడకండి. నేను డాక్టరుతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను’ అన్నాను.నా మాటలకు ఇద్దరి కళ్ళల్లో మెరుపులు మెరవటం స్పష్టంగా చూశాను. ‘అంతదాకా ఇది వుంచండి’ అంటూ, నా పర్సు తీసి రెండువేలు ఆవిడకిచ్చాను. ఆవిడ వాటిని అందుకుంటూ, నాకు నమస్కారం చేసింది కృతజ్ఞతతో. ‘మరి నేను వెళ్ళి వస్తాను, భయపడకండి. సాయంత్రం మళ్లీ వస్తాను’ అంటూ అక్కడి నుంచి బయట పడ్డాను. ‘లక్ష రూపాయలా, మొన్నే కదండీ యాభైవేలు ఇచ్చారు. అవే ఇంకా తీర్చలేదు. ఆయనేమన్నా మనకు చుట్టమా పక్కమా? పోనీ ఏమన్నా దూరపు బంధువా?’ అంది కాస్త చిరాగ్గా మా ఆవిడ. నేను మాట ఇచ్చి తప్పు చేశాను అన్నట్లు నావంక చూసింది. ‘ఆయన మనకు చేస్తున్న సహాయం ముందు ఇదెంత చెప్పు?’ అన్నాను కాస్త శాంతపరుస్తూ.‘మనకొక్కళ్ళకేనా? ఊళ్ళో అందరికీ చేస్తున్నాడు. అయినా ఎప్పటికప్పుడు డబ్బులిచ్చేçస్తూనే ఉన్నాముగా’అంది లెక్క లేస్తూ. ‘ఇచ్చామనుకో, మనిషిని అలా చూస్తూ చూస్తూ వదిలెయ్య లేక’.. ఆ మాత్రం స్వేచ్ఛ లేదా అని మనసులో అనుకుంటూ గొణిగాను ‘అసలు కొడుక్కే పట్టనప్పుడు మనకెందుకండీ?’మా ఆవిడ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో అర్థంకాక మౌనంగా వుండిపోయాను. ఓ నిమిషం తరువాత, మా ఆవిడే, ‘పోనీ అపార్ట్ట్మెంట్లో వాళ్ళందరినీ తలా కొంత సాయం చెయ్యమని అడుగుదాము’ అని సలహా ఇచ్చింది. ఆ సలహా ఏదో బాగుందనిపించి, వెంటనే అపార్ట్మెంట్ సెక్రటరీకి ఫోన్ చేసి విషయం చెప్పాను. వెంటనే ఆయన అర్జంటు మీటింగ్ ఏర్పాటు చేసి, విషయం అందరి ముందు వుంచాడు.‘దీనికా మీరు అర్జంటు మీటింగ్ ఏర్పాటు చేసింది? నేను ఇంకా ఏదో అనుకున్నా’ వాళ్ళలో ఓ వ్యాపారస్థుడు వెకిలి నవ్వు నవ్వుతూ అన్నాడు.‘మేం ఇవ్వాల్సింది ఇచ్చేశాం. ఇంకేమీ బాకీలేదు’ ఎదురింటాయన కుండ బద్దలు కొట్టాడు.‘అపార్ట్మెంటు సర్వీసు చార్జీలే కట్టటం కష్టంగా వుంది. ఇంకా దానాలు, ధర్మాలు ఎక్కడ చేస్తాం’ అంటూ పక్కింటాయన లేచి వెళ్ళి పోయాడు.‘డబ్బులు లేనప్పుడు, ప్రైవేటు హాస్పిటల్లో చేరటం దేనికి, ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే సరిపోయేది కదా, ఆరోగ్యశ్రీ కుడా వస్తుంది’ ఓ ఉచిత సలహా పడేశాడు ఆఫీసర్ కేడర్లో పనిచేసే ఒకాయన.‘మెన్ననేగా ఇల్లు కొన్నాడు. అది తాకట్టు పెట్టుకుంటే సరి, ఇలా మనల్ని దేబిరించటం ఎందుకు’ మరో రిటైర్డ్ ఆఫీసర్.ఇలా తలా ఒక మాట విసిరి అక్కడి నుంచి అందరూ నిష్క్రమించారు. ఇంతకాలం పెద్దాయన చేత సేవలు చేయించుకున్న వీళ్ళకు ఇప్పుడు ఆయన అక్కరలేని మనిషి అయ్యాడు. ఏ మనిషైనా అంతే అవసరం ఉన్నంత వరకే, అవసరం తీరగానే అక్కరలేని మనుషులుగా మారిపోతారు. వాళ్ళ మాటలు, ప్రవర్తనతో నాకు మనుషులంటేనే అసహ్యం వేసింది. తోటి మనిషి ఆపదలో వుంటే సాయం చెయ్యకపోగా, ఇలాగేనా మాట్లాడేది అని నాలో నేనే మనిషిగా పుట్టినందుకు నన్ను నేను తిట్టుకున్నాను. నా పరిస్థితి అర్థమయిన వాడిలా, ‘సార్! అపార్టుమెంట్ వెల్ఫేర్ ఫండ్ నుండి ఓ పదివేలు ఇవ్వగలను’ అన్నాడు సెక్రటరీ. ‘దానికైనా వీళ్ళందరూ ఒప్పుకోవాలిగా!’ అన్పాను అనుమానంగా.‘గణేశ్ నవరాత్రుల ఖాతాలో రాసేస్తాను, ఫరవాలేదు లెండి’ అన్నాడుగణేశ్ నవరాత్రులంటే, కిక్కురుమనకుండా వేలకు వేలు చందాలిస్తారు. ఓ మనిషి ప్రాణం పోతోంది సాయం చెయ్యండి అంటే, ఒక్కరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఏం మనుషులో ఏమో! ఎక్కడికి పోతోంది ఈ లోకం అనుకుంటూ, సెక్రటరీ ఇచ్చిన పదివేలు తీసుకుని అక్కడి నుంచి కదిలాను.నేను ఎదురుపడగానే, ‘ఏమైంది?’ అంటూ అడిగింది మా ఆవిడ. జరిగింది మొత్తం చెప్పాను.‘మరి ఇప్పుడేం చేద్దామని అనుకుంటున్నారు?’ ప్రశ్నించింది. ‘అదే అర్థం కావట్లేదు. తొందరపడ్డానేమో!’ అన్నాను. ఆవిడ నా మాటలకు ఏమీ సమాధానం చెప్పకుండా లోపలికెళ్లింది. ఏం చెయ్యాలి, లక్ష రూపాయలు ఎలా సంపాదించాలి, అనవసరంగా మాట ఇచ్చానా? అని నన్ను నేను తిట్టుకుంటూ సోఫాలో జారగిలపడి కళ్ళు ముశాను. రెండు నిమిషాల తరువాత ఏదో అలికిడి అయితే కళ్ళు తెరిచా. ఎదురుగా మా ఆవిడ చేతిలో డబ్బుతో.. ఓ క్షణం అర్థంకాక, ఆమెవంక ఆశ్చర్యంగా చూశాను. ‘మీరు హాస్పిటల్కు వెళ్ళిన తరువాత నాన్న వచ్చి వెళ్ళారు. నా పేరున రాసిన పొలం పంట తాలుకు కౌలు డబ్బులు ఇచ్చి వెళ్ళారు’ అంటూ నా చేతిలో డబ్బులకట్ట పెట్టింది.‘వీటితో నగలు చేయించుకుంటానన్నావు’ ‘పరవాలేదు లెండి ఓ మనిషి ప్రాణం కన్నా, నా నగలేమీ ఎక్కువ కాదు. మరోసారి చూద్దాం నగల సంగతి’ అంటూ ఓ చిన్న నవ్వు నవ్వింది.ఆ నిమిషాన మా ఆవిడని చూస్తుంటే, మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలి వుంది అనిపించింది. ఆనందంతో శ్రీమతి నుదుట ముద్దాడి, హాస్పిటల్లో డబ్బు కట్టుడానికి బయలుదేరాను.ఓ నెల రోజుల తరువాత పెద్దాయన వాళ్ళ ఆవిడతో మా ఇంటికి వచ్చాడు. ఈ నెల రోజులు ఎక్కడా కనపడకపోతే విశ్రాంతి తీసుకుంటు న్నాడేమో అని సరిపెట్టుకున్నాను. వాళ్లని చూడగానే, ‘ఎలా వున్నారు? రండి కూర్చోండి’ అంటూ లోపలికి ఆహ్వానించింది మా ఆవిడ. ‘కాఫీ తెస్తాను..’ అని లోపలికెళుతుంటే ‘వద్దమ్మా, ఒక్క నిమిషం ఇలా కూర్చో’ అంది పెద్దాయన భార్య. ఆవిడ మాటలు అర్థం కాక వాళ్ల ఎదురుగా కూర్చుంది మా ఆవిడ.‘అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు’ అని నాలో నేను అనుకుంటూ వాళ్ళ వంక చూస్తూ వుండిపోయాను. ఇంతలో పెద్దాయన తనతో తెచ్చిన సంచిలో నుండి కొన్ని కాగితాలు తీసి, ‘అమ్మా! ఇవి మా ఇంటి కాగితాలు, మా తదనంతరం నీ పేరున రాయించాను’ అంటూ మా ఆవిడ చేతిలో పెట్టాడు.ఆ పరిణామానికి ఇద్దరం ఆశ్చర్యపోయాము. ముందుగా తేరుకున్న మా ఆవిడ, ‘ఏంటండి, ఇదంతా, మేం ఏం సాయం చేశామని? ఆ లక్ష చిన్నగా వాయిదాల్లో చెల్లిస్తే పోయేదిగా!’ అంది.ఆవిడ మాటల్లో ఆర్ద్రత నాకు అర్థమయ్యింది. ‘లేదమ్మా! డాక్టరుగారు కాస్త పని తగ్గించుకుని, విశ్రాంతి తీసుకోమన్నారు. మీ డబ్బు చెల్లించే దారి నాకు కనపడటం లేదు. అయినా నా ప్రాణాలు కాపాడిన మీ కన్నా నాకెవరూ ఎక్కువ కాదు. నా కూతురుకి ఇస్తున్నాను అనుకో అమ్మా!’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు.వాళ్ళను చూసి మా ఆవిడ కూడా కళ్ళల్లోనుండి వస్తున్న కన్నీళ్ళను ఆపుకోలేక పోయింది. నిన్నటి దాకా వాళ్ళు ఎవరో, ఊళ్ళోవాళ్ళు అన్న మా ఆవిడను వాళ్ళు సొంత కూతురిలా భావించటంతో మా ఆవిడ మనసులో నుండి పెల్లుబికిన ప్రేమబాష్పాలవి. ఆ నిమిషాన మనుషుల మీద అప్పటిదాకా ఏర్పడిన అసహ్యం పోయి, మళ్ళీ నమ్మకం ఏర్పడటం మొదలయ్యంది. మనిషికి మనిషి సాయం చెయ్యటానికి స్నేహితుడో, బంధువులో కానక్కరలేదు. కాస్తంత గుండెల్లో తడి ఉంటే చాలు. అలా గుండెల్లో తడి ఉన్న మనుషులే నిజమైన ఆత్మబంధువులు అనుకుంటూ మా ఆవిడ వంక చూశాను, తను కూడా ఆనందంతో నా వంకే చూస్తోంది. ‘కాగితాలు తీసుకోవద్దు’ అన్నట్టు సైగ చేశాను. అలాగే అంటూ తల ఆడించింది. -
ఆర్థిక సంక్షోభంలో మాల్దీవులు.. స్పందించిన భారత్
మాల్దీవులు భారీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఆ దేశ ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్, శ్రీలంక మాదిరిగా ఉండబోతోంది. మాల్దీవులలో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నామని భారత్ తెలిపింది. రుణ సంక్షోభం కారణంగా మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది.భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాల్దీవులలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ దేశంలో నెలకొన్న పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. మాల్దీవుల ప్రభుత్వం ఇటీవల భారత్తో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి కూడా జైస్వాల్ ప్రస్తావించారు. మాల్దీవుల ఆర్థిక పరిస్థితుల కారణంగా భారత్కు ఆదాయ నష్టం జరుగుతున్నదని, ఇది ఆందోళన కలిగించే అంశమని జైస్వాల్ పేర్కొన్నారు.బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)మధ్య జరగనున్న చర్చల గురించి జైస్వాల్ మాట్లాడుతూ పరస్పర అంగీకారంతో కూడిన ఈ ఒప్పందాలను గౌరవించాలని భారత్ భావిస్తున్నదన్నారు. ఫిబ్రవరి 17 నుండి 20 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్- బీజేబీ మధ్య డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇవి సరిహద్దు భద్రతా దళాల మధ్య సయోధ్య పరిస్థితులకు సహకరిస్తాయి. భద్రత, వాణిజ్య మౌలిక సదుపాయాల కల్పనను సులభతరం చేయనున్నాయి.ఇది కూడా చదవండి: నాడు నెలకు 10 వేలు.. నేడు లక్షలు.. సందీప్ జీవితం మారిందిలా.. -
శ్రీతేజ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తాడు: వేణుస్వామి
-
ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు: కౌశిక్ తల్లి
జూనియర్ ఎన్టీఆర్ సాయం చేస్తానని మాట తప్పారని ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ బాబు ఆస్పత్రి చికిత్స కోసం ఆర్థికసాయం చేయలేదంటూ మహిళ మాట్లాడిన వీడియో నెట్టింట వైరలైంది. ఆమె చేసిన కామెంట్స్తో ఎన్టీఆర్ టీమ్ రంగంలోకి దిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఆరోగ్యంపై ఎన్టీఆర్ టీమ్ ఆరా తీసింది.క్యాన్సర్తో బాధపడుతూ చెన్నై అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించారు ఎన్టీఆర్ టీమ్.. అంతేకాదు అతని చికిత్సకు అయిన ఖర్చును మొత్తం చెల్లించారు. దీంతో తమను ఆదుకున్న ఎన్టీఆర్కు సోషల్ మీడియా వేదికగా కౌశిక్ తల్లి ధన్యవాదాలు తెలిపింది.(ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన)థాంక్యూ ఎన్టీఆర్ సార్.. కౌశిక్ తల్లిఅయితే తాను ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని ఆమె తెలిపింది. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నా కుమారుడు కౌశిక్ ఆనందంగా, సంతోషంగా ఉన్నాడని పేర్కొంది. ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళుతున్నామని ఆమె వెల్లడించింది. మా కుటుంబం అంతా ఎన్టీఆర్కు అభిమానులు అని.. నాకు అన్ని విధాల సహకరించిన ఎన్టీఆర్ టీమ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. -
25న పేదింటి యువతి వివాహం
ఎలిగేడు(పెద్దపల్లి): ఓ పేదింటి యువతి వివాహం ఈనెల 25న నిశ్చయం కాగా.. చేతిలో చిల్లి గవ్వ లేక దాతల సాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన చీకటి లక్ష్మి–కీ.శే.రామస్వామిల చిన్న కూతురు ప్రత్యూష వివాహం నరసింహులపల్లి గ్రామానికి చెందిన బుర్ర సతీశ్తో ఈనెల 25న బుధవారం జరగనుంది. ప్రత్యూష తండ్రి రామస్వామి పేగు క్యాన్సర్తో పదేళ్ల క్రితం మృతిచెందగా.. తల్లి లక్ష్మికి మతిస్థిమితం సరిగా లేదు. అన్న, వదినలు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీరలేదు. వీరి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రత్యూషను పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన పెళ్లి కుమారుడు ఆదర్శంగా నిలిచాడు. ఐతే పెళ్లికి కనీసం పుస్తెలు, మట్టెలు, పెళ్లి కానుకలు, ఖర్చులకు చిల్లి గవ్వ లేక ఆ కుటుంబం దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నారు.ఇదీ చదవండి: సొంత తమ్ముడే సూత్రధారి! -
తప్పక నేర్చుకోవాల్సిన 7 నైపుణ్యాలు
వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో టీనేజర్లు సంతోషంగా ఉండాలంటే, సక్సెస్ సాధించాలంటే కేవలం మార్కులు, ర్యాంకులు, సోషల్ మీడియా లైకులు, ఫాలోయింగ్లు మాత్రమే సరిపోవు. వాటికి మించి ఏడు నైపుణ్యాలు అవసరం. అవేమిటో ఈ రోజు తెలుసుకుందాం.ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే తన భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియంత్రించడం, అలాగే ఇతరుల భావాలను అంగీకరించడం. కౌమారంలో భావోద్వేగాలు చాలా వేగంగా మారుతుంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే ఈక్యూ అవసరం. తమ బంధాలను నిలబెట్టుకోవడంలో, ఒత్తిడిని నిర్వహించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఈక్యూను అభివృద్ధి చేసుకున్న టీనేజర్లు ఆరోగ్యకరమైన బంధాలు ఏర్పరచుకుంటారు. వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు.టైమ్ మేనేజ్మెంట్స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా వరకు టీనేజర్లను పక్కదారి పట్టించే అంశాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ డిస్ట్రాక్ష¯Œ ్స నుంచి తప్పించుకుని చదువుపై, కెరీర్ పై ధ్యాస నిలపాలంటే టైమ్ మేనేజ్మెంట్ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. తమ పనులను ప్రాధాన్యక్రమంలో అమర్చుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. ప్రణాళికలను రూపొందించుకుని, లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకున్న టీనేజర్లు తమ బాధ్యతలను బ్యాలె¯Œ ్స చేసుకుంటారు. ఒత్తిడి లేకుండా ఉత్సాహంగా తమ లక్ష్యాలను సాధిస్తారు.క్రిటికల్ థింకింగ్ఈ రోజుల్లో సమాచారం సులువుగా లభిస్తోంది. అందులో ఏది నమ్మదగినదో, ఏది కాదో చెప్పలేం! అందుకే క్రిటికల్ థింకింగ్ అవసరం. ఇది టీనేజర్లలో స్వతంత్రతను పెంచుతుంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, అనుసరించకుండా, విశ్లేషించి, వివిధ కోణాలను అంచనా వేసి, సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే టీనేజర్లు ఈ స్కిల్ను అలవరచుకోవడం చాలా ముఖ్యం, అవసరం. దీనివల్ల వారు చదువులో, జీవితంలో మెరుగైన అవకాశాలను ఎంచుకుంటారు.కమ్యూనికేషన్ స్కిల్స్ మానవ సంబంధాలు ఏర్పరచుకోవడంలో, సక్సెస్ సాధించడంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇతరులు చెప్పేది సరిగా వినడం, తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయడం, ఉపయుక్తమైన సంభాషణలు నెరపడం వంటివి నేర్చుకోవడం టీనేజర్లకు అత్యవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న టీనేజర్లు మంచి సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. గ్రూప్ డిస్కషన్స్లో బెరుకులేకుండా పాల్గొనగలుగుతారు. ఇది బడి, పని లేదా సామాజిక వాతావరణాల్లో ఎంతో ఉపయోగపడుతుంది.ఫైనాన్షియల్ లిటరసీఆర్థిక సాక్షరతను టీనేజర్లే కాదు పెద్దలు కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. దాంతో ఆర్థిక చిక్కుల్లో పడతారు. బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం, ఆదా చేయడం, పెట్టుబడులు పెట్టడం, అప్పులను మేనేజ్చేయడం వంటివి టీనేజ్లోనే నేర్చుకుంటే ఆ తర్వాత మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. డబ్బును తెలివిగా ఉపయోగించుకునేవారు త్వరగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు.రెజిలియెన్స్ అండ్ అడాప్టబులిటీ జీవితం ఎప్పుడూ ఊహించినట్లుగా జరగదు, ఎత్తుపల్లాలు ఉంటాయి. టీనేజ్లో ఇవి మరీ ఎక్కువ. చదువుల ఒత్తిడి, రిలేషన్షిప్ సవాళ్లు, వ్యక్తిగత పరాభవాలను ఎదుర్కొంటారు. వీటన్నింటినీ తట్టుకుని నిలబడగలగడం అవసరం. ఫెయిల్యూర్ ముగింపు కాదని, విజయానికి మొదటి అడుగని అర్థం చేసుకోవడం ద్వారా సవాళ్లను సానుకూలంగా ఎదుర్కొంటారు. మార్పుకు అనుకూలంగా ఉండటం, అడ్డంకులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని నేర్చుకోవడం మానసిక శక్తిని పెంచుతుంది.సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే, తాత్కాలిక టెంప్టేషన్స్ను అర్థం చేసుకుని నియంత్రించడం, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించడం, వ్యక్తిగత విలువలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇది అకడమిక్ సక్సెస్కు మాత్రమే కాదు, వ్యక్తిగత వికాసానికీ అనివార్యమైన నైపుణ్యం. స్వీయ నియంత్రణ ఉన్న టీనేజర్లు అవరోధాలను సులువుగా అధిగమిస్తారు. పరీక్షల కోసం చదవడం, లేదా స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి పనులు సులవుగా నిర్వహించగలుగుతారు. -
అనన్య నాగళ్ల గొప్పమనసు.. అలాంటి వారికోసం తానే స్వయంగా!
టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవలే పొట్టేల్ మూవీతో అభిమానులను అలరించింది. సాహిత్ మోత్కూరి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మూవీలో అనన్య నటిస్తోంది. ఎస్డీటీ18 వర్కింగ్ టైటిల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది.అయితే తెలుగమ్మాయి అయిన అనన్య సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ముందుంటోంది. తాజాగా హైదరాబాద్లో అభాగ్యులకు అండగా నిలిచారు. అసలే చలికాలం.. రోడ్లపై ఎక్కడపడితే ఎంతోమంది నిరాశ్రయులు నివసిస్తున్నారు. అలాంటి వారికోసం తానే స్వయంగా దుప్పట్లు అందించింది. బస్టాండ్లో నిద్రిస్తున్న వారికి తన వంతుసాయంగా వారికి దుప్పట్లు అందజేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ అనన్య చేసిన మంచిపనికి అభినందిస్తున్నారు. కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో అనన్య ప్రధాన పాత్రలో తంత్ర మూవీతో ఆకట్టుకుంది. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటించారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. A warm gesture by @AnanyaNagalla as she distributes blankets to those in need 😍Truly Heartwarming #Humanity 💫#AnanyaNagalla 🫶🏻pic.twitter.com/JQQsbxaYWU— #𝐒𝐫𝐢𝐧𝐢𝐯𝐚𝐬 (@srinureddypalli) November 12, 2024 -
అపుడు భిక్షాటన...ఇపుడు డాక్టరమ్మగా! ఇంట్రస్టింగ్ జర్నీ
అదృష్టం కలిసి వస్తే.. ఏ స్థితిలో ఉన్నా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. అందివచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుంటే ఆకాశమంత ఎత్తు ఎదగవచ్చు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన మురికి వాడలో పుట్టిన పింకీ ప్రేరణాత్మక కథ చదివితే ఈ మాటలు అక్షరాలా నిజం అనిపిస్తుంది.స్టోరీ ఏంటీ అంటే: పండుగ సీజన్లో కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలోని మెక్లియోడ్గంజ్లోని బుద్ధ దేవాలయం దగ్గర తన తల్లి కృష్ణతో కలిసి పింకీ హర్యాన్ అనే బాలిక భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునేది. అయితే 2004లో ఆమె అదృష్టవశాత్తూ టిబెటన్ బౌద్ధ సన్యాసి జమ్యాంగ్ కంటపడింది. జమ్యాంగ్ ఆమెను ఆదరించి సాయం చేశాడు. విద్యాబుద్ధులు నేర్పించాడు. చివరికి చైనీస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ధర్మశాలకు తిరిగి వచ్చింది.#WATCH | Dharamshala: "I was 4.5 years old when I came to the hostel and before that, my mother and I used to beg...In 2004 Guru ji selected me and I am grateful for that...I am also grateful to my parents that they gave me a chance to get my education...," says Pinki Haryan,… https://t.co/czbhOFjfHB pic.twitter.com/HTQEg7HsoE— ANI (@ANI) October 4, 2024అయితే ఈ జర్నీ అంత ఈజీగా జరగలేదు. బిచ్చమెత్తుకుంటూ కనిపించిన బాలిక కోసం వెదికి, చరణ్ ఖుద్ వద్ద ఉన్న మురికివాడను సందర్శించి బాలికను గుర్తించాడు. ఆమెను చదివిస్తానని చెప్పాడు. కానీ ఇందుకు ఆమె తండ్రి మొదట్లో ఇష్టపడలేదు. ధర్మశాలలోని దయానంద పబ్లిక్ స్కూల్కు పంపమని పింకీ హర్యాన్ తల్లిదండ్రులను ఒప్పించాడు. చివరికి పింకీ తండ్రి కాశ్మీరీ లాల్ అంగీకరించి, కొత్తగా ప్రారంభించిన టోంగ్లెన్ ఛారిటబుల్ ట్రస్ట్ హాస్టల్కు పంపడంతో అసాధారణ ప్రయాణం మొదలైంది. పింకీ హర్యాన్ చదువులో బాగా రాణించింది. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి తర్వాత నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. కానీ ఇక్కడ ఫీజులు చాలా ఎక్కువ కాబట్టి 2018లో చైనాలోని ప్రతిష్టాత్మకమైన వైద్య విశ్వవిద్యాలయంలో చేరింది. ఆరేళ్ల ఎంబీబీఎస్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ధర్మశాలకు తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా "నా తండ్రి చెప్పులు కుట్టేవాడు , బూట్లకు పాలిష్ చేయడం ద్వారా జీవనం సాగించేవాడు అంటూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుంది. తన విజయానికి తాను టిబెటన్ సన్యాసి జమ్యాంగ్కు రుణపడి ఉన్నానని, ఇప్పుడు పేదరికం కారణంగా చదువుకునే స్థితిలో లేని ఇతర పేద పిల్లలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పింకీ చెప్పింది. చిన్నప్పుడు, మురికివాడలో నివసించాను కాబట్టి నా నేపథ్యమే అతిపెద్ద ప్రేరణ అని తెలిపింది. అంతేకాదు పింకీ ప్రేరణతో ఆమె సోదరుడు, సోదరి అదే ఎన్జీవో పాఠశాలలో చేరడం విశేషం. కాగా డబ్బు సంపాదించే యంత్రాలుగా మారడానికి బదులుగా మంచి మానవులుగా మారడానికి పిల్లలను మార్చడమే సన్యాసి జమ్యాంగ్ లక్ష్యమని, గత 19 సంవత్సరాలుగా ఎన్జీవో టోంగ్లెన్ ట్రస్ట్తో అనుబంధం కలిగి ఉన్న సిమ్లాలోని ఉమంగ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఆయన తన జీవితమంతా ధర్మశాల, మురికివాడల పిల్లలకు అంకితం చేశాడన్నారు. జమ్యాంగ్ దత్తత తీసుకున్న పిల్లలంతా ఒకప్పుడు అడుక్కునేవారు లేదా చెత్తను ఏరేవారే. కానీ ఇప్పుడు వాళ్లంతా డాక్టర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, హోటల్ మేనేజర్లుగా మారారని చెప్పారు. జమ్యాంగ్ 1992లో టిబెట్ నుండి తప్పించుకుని నేపాల్ మీదుగా భారతదేశానికి వచ్చాడు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పేదరికం ఆయనను కదిలించింది. పేదలకు సాయం చేయడం, ముఖ్యంగా మురికివాడల్లో పిల్లల సంక్షేమం కోసం పాటుపడుతున్నాడు -
అసలే పేద... ఆపై కేన్సర్
పొదలకూరు: ఉన్నంతలో హాయిగా సాగిపోతున్న వా రి కుటుంబంలో కేన్సర్ మహమ్మారి అలజడి రేపింది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబంపై పెద్ద ఉపద్రవమే వచ్చి పడింది. ఏడాది నుంచి వివిధ పరీక్షలు, మందుల పేరుతో రూ.6 లక్షల వరకు ఖర్చు చేసినా ఫలితం కానరాలేదు. ఇటీవల బయాప్సీ ద్వారా చర్మ కే న్సర్ అని తెలియడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కు ప్పకూలింది. రూ.లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోలేక దాతల కోసం నిస్సహాయంగా ఎదురుచూస్తోంది.టైలర్ వృత్తే జీవనాధారంమండలంలోని అయ్యగారిపాళెం గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు టైలర్ వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు భార్య మాధవి(32), కుమార్తె వెంకట రోషిణి(10) సంతానం. పేద కుటుంబానికి చెందిన శ్రీనివాసులు పేరున్న టైలర్ వద్ద పనిచేస్తూ దాని ద్వారా వచ్చే కూలి డబ్బులతో జీవిస్తున్నాడు. గతేడాది సెప్టెంబరులో మాధవికి చర్మంపై మచ్చలు వచ్చాయి. నెల్లూరు డాక్టర్ల వద్దకు వెళ్లి పలుమార్లు పరీక్షలు చేయించి మందులు వాడారు. మచ్చలు వస్తూపోతూ ఉండడంతో నెల్లూరు వైద్యానికే రూ.2 లక్షల వరకు ఖర్చుచేశారు. ఎలాంటి గుణం కనిపించకపోవడం వల్ల ఇటీవల చైన్నె విజయ మెడికల్ హెల్త్ ఎడ్యుకేషన్ ట్రస్ట్కు వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి బయాప్సీకి చర్మాన్ని పంపారు. నివేదికలో లింపోమా (తెల్ల రక్తకణాల కేన్సర్)గా నిర్ధారించారు. తెల్లరక్త కణాల జన్యుమార్పులు సంభవించి అవి నియంత్రణ లేకుండా విభజించడం వల్ల చర్మ కేన్సర్ వస్తుందని వెల్లడించారు. ఈ పరీక్షలు, తాత్కాలిక వైద్యానికి శ్రీనివాసులు సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇందుకోసం తనకున్న కొద్దిపాటి నిమ్మచెట్లు, గేదెలను కూడా అమ్మాల్సి వచ్చింది. వైద్యం చేయించిన తర్వాత మాధవికి కొద్దిరోజులు నయమైనట్లు కనిపించినా మళ్లీ వ్యాధి తిరగబెట్టి మెడ, చంకలు, గజ్జలు, మోకలి పక్కన కాలిన మచ్చలు ఉన్నట్టుగా వస్తున్నాయి. దీని ప్రభావం వల్ల దురద, ఆకలి లేకపోవడం, జ్వరం, బరువు తగ్గడం వంటి దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. ఉన్నదంతా ఊడ్చి పెట్టినా మాధవికి నయం కాకపోవడంతో నిస్సహాయంగా వారి కుటుంబం మిగిలింది. పోషణ కూడా కష్టంగా మారడంతో పొదలకూరులోని మాధవి తల్లిదండ్రుల ఇంట్లో తలదాచుకుంటున్నారు.దాతలు దయతలిస్తే..ఆర్థికంగా చితికిపోయిన శ్రీనివాసులు కుటుంబాన్ని దాతలు ముందుకు వచ్చి ఆదుకుంటే మాధవికి వచ్చిన జబ్బు నయం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. రూ.లక్షలు వెచ్చించాల్సి రావడంతో వారు వైద్య పరీక్షలు కూడా చేయించుకోని స్థితిలో ఉన్నారు. రెండో పర్యాయం బయాప్సీ రిపోర్టు ఎలా వస్తుందోనని భయపడుతూ బిక్కుబిక్కుమంటున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకుంటే తన కుమార్తెకు తల్లిలేని లోటు లేకుండా ఉంటుందని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు స్పందిస్తే 9347142240 ఫోన్పేకు నగదు వేయాల్సిందిగా వేడుకుంటున్నారు. -
ఆఫ్రికాపై చైనాకు ఎందుకంత ప్రేమ?
ఆఫ్రికా దేశాలపై చైనా ఎన్నో వరాలు కురిపించింది. 51 బిలియన్ డాలర్ల ఆర్థిక సహకారం, పది లక్షల ఉద్యోగాలు, సైనిక శిక్షణ... ఇలా అనేక హమీల వరదను పారించింది. ఒక వైపు చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతోంది. మరో వైపు అమెరికా సహా పశ్చిమ దేశాలతో భౌగోళిక, రాజకీయ ఘర్షణలు, వ్యాపార ఆంక్షలు ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్ కుంచించుకుపోతోంది. చైనా దౌత్యానికి, ఆర్థిక వ్యవస్థకు ఊపు తేవటానికి ఆఫ్రికా దోహదకారి అవుతుందని భావించింది. ఈ పూర్వరంగంలో ‘బీజింగ్ సమ్మిట్ ఆఫ్ ది ఫోరమ్ ఆన్ చైనా–ఆఫ్రికా కోఆపరేషన్’ (ఎఫ్ఓసీఏసీ) అనే సదస్సును మూడు రోజుల పాటు (2024,సెప్టెంబర్ 4–6) చైనాలో నిర్వహించింది. కోవిడ్ అనంతరం చైనా నిర్వహించిన అతి పెద్ద కార్యక్రమం ఇదే.ఈ సదస్సు ద్వారా ప్రధానంగా రెండు లక్ష్యాలను సాధించాలని భావించింది. మొదటిది గ్లోబల్ సౌత్లో తన ప్రభావాన్ని పెంచుకోవటం. రెండోది చైనా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా చూసుకోవటం. గ్లోబల్ సౌత్ లో ఆఫ్రికా అత్యంత ముఖ్యమైంది. అందుకే ఈ ఖండం మనసు గెలుచుకోవటానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సర్వశక్తులు వెచ్చించారు. ఆఫ్రికాలో మొత్తం దేశాలు 54 ఉంటే 53 దేశాలు సదస్సులో పాల్గొన్నాయి. 2023 నాటికి, అమెరికాను అధిగమించి 282 బిలి యన్ డాలర్లతో చైనా ఆఫ్రికాకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. ఆఫ్రికా మినరల్స్, ఫ్యూయల్స్, మెటల్స్ చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మరో వైపు ఆఫ్రికా రుణదాతల్లో చైనా అగ్రగామిగా ఉంది. గత 20 ఏళ్లలో అది అందించిన రుణం 696 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు ప్రకటించిన 51 బిలియన్ డాలర్లు (360 బిలియన్ యువాన్లు) పెద్ద ఎక్కువేం కాదు అంటున్న వాళ్లూ ఉన్నారు. ఇందులో రుణాలుగా కొంత (210 బిలి యన్ల యువాన్లు), సహాయంగా కొంత (80 బిలియన్ల యువాన్లు), పెట్టుబడులుగా కొంత (70 బిలియన్ల యువాన్లు) అందించాలని బీజింగ్ నిర్ణయించింది. ఇదంతా వచ్చే మూడేళ్ల కాలంలో చేయాలనేది చైనా ఆలోచన. జిన్పింగ్ తన ప్రసంగంలో ఎక్కడా రుణం అన్న మాట వాడకుండా జాగ్రత్తగా ఆర్థిక సాయం అన్న పదాన్ని మాత్రమే ఉపయోగించారు. ఆఫ్రికాతో కేవలం వాణిజ్య సంబంధాలను మాత్రమే కాదు, రాజకీయంగా, ఆర్థికంగా సంబంధాలను ఉన్నతీకరించుకోవాలని భావిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ‘మనం అంతా కలిసి రైళ్లు, రోడ్లు, వంతెనలు, స్కూళ్లు, హాస్పిటళ్లు, స్పెషల్ ఎకనమిక్ జోన్లు నిర్మించుకున్నాం. ఈ ప్రాజెక్టులు ఎంతో మంది ప్రజల జీవితాలను, వారి అదృష్టాన్ని మార్చి వేశాయి’ అని జిన్పింగ్ గుర్తు చేశారు. ఈ దఫా ఆర్థిక సాయం డాలర్లలో కాకుండా చైనా యువాన్ల రూపంలో ఉంటుందని బీజింగ్ ప్రకటించింది. చైనా కరెన్సీని అంతర్జాతీయం చేయాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఆఫ్రికాలో పది లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తారు. ఇందుకోసం కనెక్టివిటీని పెంచేందుకు ప్రత్యే కంగా 30 ప్రాజెక్టులను చేపడతారు. మరో వెయ్యి చిన్న ప్రాజెక్టులను చేపడతారు. 140 మిలియన్ డాలర్లతో సైన్యా నికి ఆర్థిక సహకారం, శిక్షణ అందిస్తారు. ఆరువేల మంది సైనికులకు, వెయ్యి మంది పోలీసు అధికారులకు శిక్షణ అందిస్తారు. ఆఫ్రికా పారిశ్రామికీకరణకు అవరోధంగా నిలిచిన ఇంధన సమస్యను కూడా పరిష్కరిస్తామని చైనా హామీ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి అతి తక్కువ అభివృద్ధి సాధించిన దేశాలుగా పేర్కొన్న 33 ప్రాంతాల్లో ఓపెన్ మార్కెట్లు ప్రారంభిస్తామని (జీరో టారిఫ్లతో) ప్రకటించింది. ఇవన్నీ బీజింగ్కు ఉపయోగపడే అంశాలు. మా సంగతి కూడా ఆలోచించండి అని అడిగారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్ఫోసా. బదులుగా ‘వాణిజ్య మిగులు 64 బిలియన్ డాలర్లు ఉంది. మీ దగ్గర నుంచి రా మెటీరియల్, డెయిరీ ప్రోడక్ట్స్ మేము కొనుగోలు చేస్తాం’ అని చైనా హామీ ఇచ్చింది. అంతే తప్ప మరే రకమైన ప్రకటనలు చేయలేదు. అప్పుల ఊబిలోకి ఆఫ్రికా దేశాలు రుణమాఫీ చేసి తమకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని చాలా ఆఫ్రికా దేశాలు కోరుతున్నాయి. మైనింగ్, ఇంధన రంగంలో ప్రైవేటు పెట్టుబడుల పోర్టుఫోలియోను వికేంద్రీకరించమని కోరుతున్నాయి. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ పెద్ద ప్రాజెక్టులను నిభాయించగలిగే పరిస్థితిలో లేదు. చైనా చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్టులు ఆఫ్రికా దేశాలను అప్పుల ఊబిలోకి లాగేస్తు న్నాయి. దాదాపు ఆరు బిలియన్ డాలర్ల అప్పుతోజాంబియా ఎగవేతదారుల్లో ఉంది. అలాగే ఘనా, ఆంగోలాలు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఇదే విషయాన్ని సదస్సులో చెప్పారు. ‘ఆఫ్రికా రుణాలనేవి భరించలేని దశకు చేరాయి, ఆర్థిక సుస్థిరత దెబ్బతింటోంది’ అని ప్రకటించారు. బీజింగ్ మాత్రం దీనికి స్పందించలేదు. రుణామాఫీ కాదు, కనీసం రుణాలను పునర్వ్యవస్థీకరిస్తుందని ఆఫ్రికా దేశాలు ఆశించాయి. కానీ చైనాది పెట్టుబడి దారు మనస్తత్వం. అది తన వ్యాపార ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. మరి తాజా హామీలు ఆఫ్రికా దేశాలపై ఏ రకమైన ప్రభావం చూపుతాయో భవిష్యత్తులో కానీ ప్రపంచానికి అర్థం కాదు.– డా‘‘ పార్థసారథి చిరువోలు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
వరద బాధితులకు అండగా తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సాయం అందిస్తున్నారు. విరాళాలు సేకరించి వరద బాధతుల సహాయార్థం అందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి ప్రముఖ సినీతారలు విరాళాలు ప్రకటించారు. తాజాగా ఏపీ, తెలంగాణ వరద బాధతుల కోసం తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. తమవంతు సాయంగా అసోసియేషన్ తరఫున విరాళాలు సేకరించి రెండు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్లో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నాయకులంతా పాల్గొన్నారు.తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు మాట్లాడుతూ' వరదల కారణంగా తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారిని చూస్తే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. మా అసోసియేషన్ తరపున వీలైనంత ఆర్థిక సాయం చేయాలని భావించాం. రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు మీకు తోచినంత విరాళం ఇవ్వాలని మా సభ్యులను కోరాం. వాళ్లంతా స్పందించారు. ఈ డబ్బుకు మరికొంత మా అసోసియేషన్ ఫండ్ నుంచి కలిపి రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేస్తాం' అని తెలిపారు. -
‘సాక్షి’లో చూసి సాయమందించాం
ఖమ్మం మయూరిసెంటర్: స్పందించే మనసుంటే ఎక్కడి వారికైనా సాయం చేయొచ్చని నిరూపించారు నిజామాబాద్ జిల్లా యువకులు. ఇటీవలి వరదలతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వీరి కష్టా లపై ఈనెల 6న సాక్షిలో ‘భూమి రాళ్లపాలు.. బతుకు రోడ్డుపాలు’శీర్షికన ప్రచురితమైన కథనం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వన్నెల్ (కె) గ్రామ యువకులను కది లించింది. దీంతో వారు బాధితులను ఆదు కునేందుకు నడుం బిగించి రూ. లక్ష విరాళాలు సేకరించారు. ఖమ్మం్లలో పరిచ యం ఉన్న వారిని తోడ్కొని బుధవారం రాకాసితండాకు వచ్చారు. దీంతో యువకులు 77 కుటుంబాలకు 77 సీలింగ్ ఫ్యాన్లు కొనుగోలు చేసి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వన్నెల్ (కె) గ్రామ యువకులు అర్గుల శ్రీకాంత్, మచ్చేందర్, అనంతుల శ్రీను, డాక్టర్ సాయి, గజానంద్, జి.హనుమాను పాల్గొన్నారు. వైద్య విద్యార్థిని తేజశ్రీకి కూడా... ఈనెల 4న ‘సరి్టఫికెట్లు మున్నేరు పాలు’.. ‘చదువుల తల్లులకు ఎంత కష్టం’శీర్షికతో సాక్షి ప్రధాన సంచికలో వచి్చన కథనానికి దాతలు స్పందిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్కు చెందిన మహిళలు స్థానిక కార్పొరేటర్ మోతారపు శ్రావణి ఆధ్వర్యంలో తేజశ్రీని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. హైమావతి ట్యాబ్ అందించగా, కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మహిళలు రూ.10 వేలు, కొల్లు జ్యోతి రూ.5 వేలు, పారిజాతం కమలం ప్రసాద్ రూ.5 వేలు అందజేశారు. తేజశ్రీ మాట్లాడుతూ అండగా నిలిచిన సాక్షికి, దాతలకు ధన్యవాదాలు చెప్పారు. సాక్షిలో చూసి చలించిపోయానురాకాసితండా పజలు పడిన ఇబ్బందులను సాక్షి పత్రిక లో చూశాను. వారికి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో మా కొంతమంది యువకులను సంప్రదించి, విరాళాలు సేకరించాం. ఖమ్మంలో ఉన్న మిత్రుల ద్వారా ప్రజలకు అందించాం. – అర్గుల శ్రీకాంత్ -
జైనూరు బాధితురాలికి రూ.లక్ష తక్షణ సాయం
గాంధీ ఆస్పత్రి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఘటనలో గాయపడి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క గురువారం పరామర్శించారు. బాధితురాలికి తక్షణసాయంగా లక్ష రూపాయల చెక్కును అందించారు. కాగా మంత్రి వస్తున్న సమాచారం తెలుసుకున్న బీజేపీ మహిళా శ్రేణులు గాంధీ ఆస్పత్రి వద్దకు చేరుకుని మంత్రిని అడ్డుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శించి ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివాసీ బిడ్డగా నాకే ఎక్కువ బాధ్యత... ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ, జైనూరు ఘటనపై కొంతమంది వ్యక్తులు, రాజకీయ పార్టీ లు చేస్తున్న విషప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని తెలియగానే ప్రభుత్వం స్పందించిందని, నిందితునిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని, కఠినశిక్ష పడేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ ఘటనలో దోషులను శిక్షించేందుకు ఆడబిడ్డగా, ఆదివాసీ బిడ్డగా తనకే ఎక్కువ బాధ్యత ఉందన్నారు. జైనూ రు ఘటనకు మతం రంగు పూసేందుకు కొందరు యతి్నస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆదివాసీల జీవితాలతో చెలగాటం: ఏలేటి బంగ్లాదేశ్తోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రోహింగ్యా లు, ముస్లింలు ఏజెన్సీ ప్రాంతాలను ఆక్రమించుకుని, ఆదివాసీల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జైనూరు ఘటనలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గురువారం పరామర్శించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు.కేంద్ర నిబంధనల మేరకు ఆదివాసీల ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు ఉండకూడదని, కానీ జైనూరు అటవీప్రాంతంలో వేలాది మంది ముస్లింలు, గిరిజనేతరులు స్థిరనివాసాలు ఏర్పరుకున్నారని ఆరోపించారు. -
బాధితులకు అండగా జగనన్న సైన్యం
-
వరద బాధితుల కోసం రంగంలోకి దిగిన YSRCP నేతలు
-
గొప్పమనసు చాటుకున్న టాలీవుడ్ హీరో
ఇటీవల రాయన్ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్. ఓ వ్యక్తి తల్లికి వైద్యపరమైన ఖర్చుల కోసం సాయమందించారు. తన వంతుగా రూ.50 వేలను పంపి గొప్ప మనసు చాటుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన విజ్ఞప్తికి స్పందించిన హీరో వెంటనే ఆర్థికసాయం అందించాడు. ఇది చూసిన సందీప్ కిషన్ ఫ్యాన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. సందీప్ ఇప్పటికే ప్రతిరోజూ పేదలకు ఆహారం అందిస్తూ తనవంతుగా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.సినిమాల విషయానికొస్తే ఇటీవల రాయన్ మూవీతో అభిమానులను మెప్పించారు. ధనుశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అతని తమ్ముడిగా నటించారు. ఈ సినిమాతో హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. హీరో ధనుష్తో కెప్టెన్ మిల్లర్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. పేదలకు ఉచితంగా ఆహారం..గతంలో రాయన్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాను నిర్వహిస్తున్న రెస్టారెంట్ల నుంచి ప్రతిరోజు 350 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆశ్రమాలతో పాటు రోడ్ సైడ్ ఉండే పేదలకు రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నట్లు తెలిపారు. దీంతో నెలకు రూ. 4 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సందీప్ తెలిపారు. భవిష్యత్లో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తక్కువ ధరకే క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన ఉన్నట్లు సందీప్ కిషన్ తెలిపాడు.Looked into this & it’s Legitimate …I have done my bit..Please trying helping in whatever you can as well ♥️ https://t.co/MnWlpmMsmY pic.twitter.com/LqIgo4CjRt— Sundeep Kishan (@sundeepkishan) September 1, 2024 -
లక్షల మందిని తరలించలేం
సాక్షి, అమరావతి: ‘వరదల్లో వంద, రెండు వంద కుటుంబాలు చిక్కుకుంటే వెంటనే తరలించగలం.. ఏకంగా 2.76 లక్షల మందిని వెంటనే తరలించలేం. సమయం పడుతుంది. కేంద్ర సాయం కోరాం. వారి నుంచి సాయం అందగానే చర్యలకు ఉపక్రమిస్తాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. లక్షల మందికి సహాయం చేయాల్సిన పరిస్థితులున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఉన్న విస్తృత అధికారాలు ఉపయోగిస్తామన్నారు. ఆదివారం రాత్రి ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బస చేసిన బస్సు వద్ద మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలతో బుడమేరు, మున్నేరు నుంచి వరద వచ్చిందన్నారు.దీంతో ఇబ్రహీంపట్నం, విజయవాడలోని సింగ్నగర్, కృష్ణలంకతో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో ముంపు ప్రభావం ఉందన్నారు. సింగ్నగర్లో 16 వార్డుల్లో 2.76 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారన్నారు. చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. వరద తీవ్రతను కేంద్ర మంత్రి అమిత్షాకు వివరించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీకి పంపుతున్నారని తెలిపారు. ఆదివారం రాత్రి నాలుగు బృందాలు, సోమవారానికి మిగిలిన ఆరు బృందాలు చేరుకుంటాయన్నారు. అదే విధంగా 40 బోట్లు, ఆరు హెలికాప్టర్లు కూడా వస్తాయన్నారు. సీనియర్ ఐఏఎస్లను విజయవాడకు రప్పించాప్రభుత్వ పిలుపుతో పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం సరఫరాకు ముందుకు వచ్చాయని సీఎం చెప్పారు. సింగ్నగర్ 16 డివిజన్లలో 77 సచివాలయాలు ఉండగా, ప్రతి వార్డుకు ఒక సీనియర్, సచివాలయానికి జూనియర్ అధికారిని పర్యవేక్షకులుగా నియమించి సహాయక చర్యలు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులను విజయవాడకు రప్పించానన్నారు. వరద ఎప్పటిలోగా తగ్గుతుందో చెప్పలేమన్నారు. జాతీయ విపత్తుగా గుర్తించి, ఆదుకోవాలని కేంద్ర పభుత్వానికి లేఖ రాస్తామన్నారు. ఇంత వర్షం.. అసాధారణంరాష్ట్రంలో భారీ వర్షాలకు తొమ్మిది మంది మృతి చెందగా ఒకరు గల్లంతయ్యారని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రాణ, పశు నష్టం పెద్దగా జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సోమవారం విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించినట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణ కార్యాలయంలో భారీ వర్షాలు, సహాయక చర్యలపై అధికారులతో ఆదివారం సమీక్షించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. 1,11,259 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 7,360 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు.వరద బాధిత కుటుంబాలకు 25 కేజీలు చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఆయిల్ ఇస్తున్నామన్నారు. మత్స్యకారులకు అదనంగా మరో 25 కేజీలు బియ్యం ఇస్తామన్నారు. అమరావతి రాజధాని శ్మశానం కావాలనుకునే వారే మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రధాని ఫోన్సీఎం చంద్రబాబుకు ఆదివారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి వరద పరిస్థితిపై ఆరా తీశారు.వర్షాల్లో ప్రాణ నష్టం బాధాకరం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు ప్రాంతంలో పదిమంది వరకు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరద ముంపులో చిక్కుకున్న వారికి జనసేన శ్రేణులు సాయం అందజేయాలని ఆయన కోరారు. వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో పార్టీ డాక్టర్స్ సెల్తో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. -
వయనాడ్ వారియర్స్: ఈ తల్లి ఒక అద్భుతం!
ప్రకృతి ప్రమాదాలు సంభవించినప్పుడు పాత బట్టలు, గిన్నెలు తీసుకుని బయల్దేరతారు కొందరు. కానీ, తల్లిని కోల్పోయి పాలకోసం ఏడుస్తున్న చంటిపిల్లలకు తన పాలు ఇవ్వడానికి బయల్దేరింది ఆ తల్లి.ప్రకృతి ప్రకోపంతో వయనాడు తల్లడిల్లితే ఆ విషాదంలో కొందరు శిశువులు తల్లిపాలు లేక అల్లాడారు. అయితే ఆ వార్త తెలిసిన వెంటనే ఇడుక్కికి చెందిన భావన బాధిత శిబిరాల దగ్గరకు వెళ్లి తన పాలు అందించింది. నాలుగేళ్ల వయసు, నాలుగు నెలల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఆమెకు ఉన్నారు. ఆమె భర్త సజిన్ డ్రైవర్గా పనిచేస్తాడు. సేవా కార్యక్రమాలు కూడా చేస్తాడు. వయనాడ్లోని పసికందుల అవస్థను భార్యకు చెప్పి తల్లి పాలు ఇచ్చేందుకు ప్రోత్సహించాడు.ఇడుక్కిలోని వారి ఇంటి నుండి పికప్ ట్రక్లో కేరళలోని వయనాడ్ కొండలపైకి వెళ్లి మెప్పాడిలోని శిబిరాల్లో కుటుంబాలకు సేవ చేసిన తర్వాత ఇడుక్కికి తిరిగి వచ్చారు ఆ దంపతులు. ‘మేం కొన్ని శిబిరాలు, హాస్టళ్లను సందర్శించాం. నేను ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న కొంత మంది పిల్లలకు నా పాలు ఇచ్చాను. కొందరికి ఆహారాన్ని తినిపించాను. కొండచరియలు విరిగిపడి గాయపడిన తల్లులు కోలుకున్న వెంటనే తమ పిల్లల బాధ్యతలు స్వీకరించారు. మేం ఒక కుటుంబంగా పిల్లల్ని చూసుకున్నాం. నేను చేస్తున్న పని తెలిసి చాలా మంది మెచ్చుకున్నారు. కొందరు మా ట్రిప్ను స్పాన్సర్ చేస్తామన్నారు. కానీ, ఆ మాత్రం ఖర్చును భరించలేమా? నేను తల్లిని, పిల్లలకు తల్లి పాలు ఉత్తమమని నాకు తెలుసు. అందుకే, వాటిని కొందరికైనా అందించాలనుకున్నాను’ అని భావన చెప్పింది. -
నూటికో..కోటికో, ఈ అమ్మాయిల్ని చూసి నేర్చుకుందాం.. వైరల్ వీడియో
సాటి మనిషి ఇబ్బందుల్లోనో, కష్టాల్లోనో ఉన్నపుడు స్పందించడం మనుషులుగా మన కర్తవ్యం. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, పిల్లల విషయంలో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. కానీ చేయగలిగి ఉండి కూడా తమకేమీ సంబంధం లేదు అన్నట్టు పక్కనుంచి వెళ్లిపోతారు చాలామంది. ఇద్దరు అమ్మాయిలు మాత్రం మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోఒకటి నెట్టింట వైరల్గా మారింది. విషయం ఏమిటంటే.. మెట్రో స్టేషన్లో ఎక్స్లేటర్ దగ్గర ఒక దివ్యాంగుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇద్దరు అమ్మాయిలు ఇది చూసి కూడా పట్టించుకోకుండా ముందుకెళ్లిపోతారు. కొంచెం దూరం వెళ్లినాక విషయాన్ని అర్థం చేసుకుని ఎక్సలేటర్ మీద నుంచి వెనక్కి నడుచుకుంటూ వచ్చి మరీ ఆయనకు సాయం చేశారు. ‘‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’’ అన్న అందెశ్రీ ఆవేదనను మరిపించేలా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. మానవత్వం ఇంకా బతికే ఉంది, ఈ అమ్మాయిలు చాలా గ్రేట్ అంటూ కమెంట్ చేయడం విశేషం. అయితే ఇది ప్యారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర దృశ్యం అంటూ ఒక యూజర్ పేర్కొన్నారు. ఆర్వీసీజీ మీడియా ఎక్స్లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. &Respect for these girls ❤️📈pic.twitter.com/bc6yeRLXl9— RVCJ Media (@RVCJ_FB) August 1, 2024 -
పొలం పనులకు వెళ్లి.. వరదలో చిక్కుకుని..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/అశ్వారావుపేటరూరల్: ఒక్కసారిగా పెద్దవాగుకు వరద పోటెత్తింది. దీంతో ఆ వరద ఉధృతిలో 28 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు రెండు హెలికాప్టర్లు రంగంలోకి 25 మందిని సురక్షిత ప్రాంతానికి చేర్చగా, మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. వాన తగ్గిందని...భద్రాద్రి కొత్తగూడెంజిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి దగ్గర పెద్దవాగుపై మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టులోకి వరద వచ్చే క్యాచ్మెంట్ ఏరియాలో కొంత ఏపీలోని బుట్టాయిగూడెం మండల పరిధిలో ఉంది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులో ప్రవాహం పెరిగింది. మరోవైపు అశ్వారావుపేట మండలంలో గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. మధ్యాహ్నం 12:30 గంటలకు వాన కొంత తగ్గుముఖం పట్టడంతో స్థానికులు పొలాలకు వెళ్లారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో పెద్దవాగుకు అకస్మాత్తుగా వరద పెరిగి ముందుగా ఒడ్డు వెంట ఉన్న పొలాలను చుట్టుముట్టింది. దీంతో వరదలో చిక్కుకున్న వారు ప్రాణాలు కాపాడుకునేందుకు చెరువుకట్టకు దగ్గరలో ఉన్న ఎత్తయిన ప్రదేశం వైపు వెళ్లారు. ఆ తర్వాత క్రమంగా వరద నీటిమట్టం పెరుగుతూ మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి బాధితుల మోకాళ్లలోతు వరకు వచ్చాయి. క్రమంగా గట్టు దాటుకొని పొలాలను ముంచెత్తింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యానికి మించి వరద రావడంతో ముందుగా ప్రాజెక్టు ఎగువ భాగం ముంపునకు గురైంది. దీంతో వెంటనే ప్రాజెక్టుకు ఉన్న మూడు గేట్లు తెరిచేందుకు ప్రయత్నించగా అందులో ఒకటి తెరుచుకోలేదు. బాధితులు ఫోన్లో సమాచారం ఇవ్వగా, వరద పరిస్థితిని తెలుసుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని సహాయ కార్యక్రమాల కోసం అప్రమత్తం చేశారు. అటు అనుకుంటే ఇటు..: ఏపీలోని వేలేరు పాడు మండలం అల్లూరినగర్ దగ్గర వరద నీటిలో ఒక కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ఐదుగురిని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి నేవీ హెలికాప్టర్ను పంపింది. అయితే హెలికాప్టర్ రావడం ఆలస్యం కావడంతో గ్రామస్తులు ఆ కారులో ఉన్న ఐదుగురిని కాపాడారు. దీంతో నేవీ హెలికాప్టర్ సంఘటనా స్థలానికి రాకుండా ఏలూరులో ఆగిపోయింది. అయితే అదే సమయంలో పెద్దవాగు ప్రాజెక్టు ఎగువన నారాయణపురంలో 28 మంది వరదలో చిక్కుకుపోయిన విషయం వెలుగుచూసింది. దీంతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అక్కడి అధికారులతో మాట్లాడి హెలికాప్టర్ను ఇటు పంపించారు. జాయింట్ ఆపరేషన్: ఏలూరు నుంచి హెలికాప్టర్ ఘటనా స్థలికి 6:15 గంటలకు వచ్చింది. వెలుతురు సరిగ్గా లేదు. సహా య కార్యక్రమాలు ఏమేరకు జరుగుతాయో అనే సందేహం నెలకొంది. నేవీ హెలికాప్టర్ ముందుగా ప్రభావిత ప్రాంతంలో చక్కర్లు కొట్టి బాధితులు ఉన్న లొకేషన్ను గుర్తించింది. ఆ తర్వాత 20 నిమిషాలకు తెలంగాణకు చెందిన హెలికాప్టర్ ఘటనా స్థలికి చేరుకుంది. 6:45 గంటలకు అసలైన రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. నేవీ హెలికాప్టర్ దారి చూపిస్తూ లొకేషన్ దగ్గరికి తీసుకెళ్లి బాధితులు ఉన్న చోటుపై లైట్ వేసింది. రెండో హెలికాప్టర్ ఆ స్థలానికి చేరుకుని బాధితులకు రోప్ అందించింది. విడతల వారీగా బాధితులను బయటకు తీసుకురా వడంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. వైకుంఠధామంలో ల్యాండింగ్..బాధితులు మధ్యాహ్నం 3 గంటలకు వరద నీటిలో చిక్కుకున్నారు. గంటగంటకూ వరద నీరు పెరుగుతూ మోకాళ్ల లోతుకు వచ్చింది. బాధితుల్లో మహేశ్ అనే యువకుడి దగ్గరే ఫోన్ ఉంది. దీంతో ప్రాణభయంతో అందరూ ఆ ఫోన్ నుంచే కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తమ ప్రాణాలు దక్కవేమోనంటూ బోరున విలపించారు. మూడు గంటలు గడిచినా రెస్క్యూఆపరేషన్ మొదలు కాకపోవడం, మరోవైపు చీకటి పడుతుండటంతో పైప్రాణాలు పైనే పోయాయని భావించారు. అయితే ఏడు గంటల సమయంలో వరద నీటి నుంచి వారిని కాపాడిన హెలికాప్టర్ ల్యాండింగ్కు సరైన స్థలం లేక నారాయణపురం గ్రామంలో ఉన్న వైకుంఠధామం (స్మశానం)లో వారిని దించింది. ప్రాణాపాయం నుంచి బయటపడిన వారికి వైకుంఠధామం తొలి ఆశ్రయం ఇచ్చింది.పెద్దవాగుకు గండిరైట్ కెనాల్ తూము దగ్గర 40 మీటర్ల వద్ద....తెలంగాణలో రెండు, ఏపీలో ఏడు గ్రామాలు మునక!ముందుగానే గ్రామాలు ఖాళీ చేసిన ప్రజలు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏపీ, తెలంగాణవాసులను గడగడలాడించిన పెద్దవాగుకు ప్రాజెక్టుకు గండిపడింది. రెండు రాష్ట్రాల పరిధి పెద్దవాగు క్యాచ్మెంట్ ఏరియాలో సుమారు 16 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో గురు వారం ఉదయం నుంచి వాగుకు వరద పోటెత్తింది. ఈ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 40,500 క్యూసెక్కులు కాగా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 70 వేల క్యూసెక్కులు, సాయంత్రం 5గంటలకల్లా 90 వేల క్యూసెక్కుల వరద చేరింది. దీంతో మధ్యాహ్నం నుంచే ప్రాజెక్టుకు ఎగపోటు మొదలైంది. సాయంత్రం 5–30 గంటలకు గేట్లు, మట్టికట్ట మీద నుంచి నీరు ప్రవహించడం మొద లైంది. రాత్రి 7.30గంటల సమయంలో 32 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. అయితే ఉధృతి తగ్గకపోవడంతో రాత్రి 8 గంటల సమయంలో రైట్ కెనాల్ తూము దగ్గర 40 మీటర్ల మేరకు గండి పడగా, అక్కడి నుంచి కొంత దూరంలో మరో 20 మీటర్ల మేరకు గండి పడింది. మొత్తంగా 150 మీటర్ల మేరకు మట్టి కట్ట బలహీనపడిందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. నీట మునిగిన గ్రామాలు: పెద్దవాగు దిగువన తెలంగాణలో గుమ్మడవెల్లి, కొత్తూ రు గ్రామాలు ఉన్నాయి. గురువారం సాయంత్రం వరద ఉధృతి పెరిగిన వెంటనే ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు అధికారులు హుటా హుటిన ఖాళీ చేయించారు. గండి పడిన తర్వాత వచ్చిన వరద నలభై ఇళ్లను ముంచెత్తింది. పశువులు ఇతర ఆస్తి నష్టం వివ రాలు తెల్లవారితే కానీ తెలిసే అవకాశం లేదు. ఏపీలోని వేలేరుపాడు మండలం మేడిపల్లి, రామవరం, గుండ్లవాయి, రెడ్డిగూడెంకాలనీ, మద్దిగట్ల, పూచిరాల గ్రామాల్లోనూ వరద ప్రభావానికి లోనయ్యాయి. -
ప్రమాదం మిగిల్చిన గాయం
దకురవి: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆడబిడ్డ బంగారు భవిష్యత్ను రోడ్డు ప్రమాదం చిదిమేసింది.. కళ్లెదుట ఆడుతూ.. పాడుతూ.. చదువులో రాణిస్తున్న కన్న బిడ్డను చూసి మురిసిపోతున్న ఆ తల్లిదండ్రులకు పెద్దకష్టం వచ్చింది.. రోడ్డు ప్రమాదం కారణంగా నరాల బలహీనతతో కాళ్లు చేతులు పడిపోయి మంచానికే పరిమితమైంది ఆ పసిప్రాణం. ప్రమాదం మిగిల్చిన గాయం నరాల బలహీనతతో 14ఏళ్లకే మాటలు కూడా రాక ఆచేతన స్థితిలో పడిపోయింది. ఏడాదికి రూ.3లక్షలకు పైగా ఖర్చు చేసినా.. కోలుకోలేని స్థితిలో ఉన్న బాలిక దీనగాథపై ‘సాక్షి’ కథనం.మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సీ) శివారు గుజిలి తండాకు చెందిన జాటోత్ శంకర్– సుజాత దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అక్షయ వయసు 14 ఏళ్లు. బయ్యారం మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకులంలో చదువుకుంటుంది. ఈ క్రమంలో 2022లో భద్రాద్రి కొత్తగూడెంలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లారు. కొత్తగూడెం సమీపంలోని చుంచుపల్లి పోలీస్స్టేషన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్షయకు తీవ్రగాయాలయ్యాయి. కొత్తగూడెం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి అక్షయ మెదడులోని రక్తనాళాలు పనిచేయడం లేదని, ఆపరేషన్ చేయడం కుదరదని తెలిపారు. కే వలం మందులతో నయం అవుతుందని చెప్పారు. దీంతో అక్షయను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. నరాలబలహీనత తీవ్రం కావడంతో కాళ్లు, చేతులు పడిపోయి మంచానికే పరిమితమైంది. దీంతో నెలనెలా మందుల కోసం తల్లిదండ్రులు అప్పు చేస్తున్నారు. ప్రస్తుతం బాలిక మాట్లాడలేని పరిస్థితికి చేరుకుంది. నెలకు రూ.25వేల ఖర్చు భరించడం కష్టంగా మారిందని దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కూలి పనిచేస్తే వచ్చే డబ్బుతో బతకడం కష్టంగా మారిందని, బిడ్డ జబ్బు నయం కోసం రూ.25వేలు వెచ్చించడం పెనుభారంగా మారిందని విలపిస్తున్నారు.సాయం అందించాల్సిన ఫోన్ నంబర్ 93466 20224 -
వృద్ధాప్యం బరువై.. ఆదరణ కరువై..
సాక్షి, హైదరాబాద్: పండుటాకులకు ఎంత కష్టం.. జీవనయానం ఎంత దయనీయం.. మలిసంధ్య వేళ వెలుగురేఖల్లేక అంధకారం అలముకుంది. వృద్ధాప్యం బరువైంది.. ఆదరణ కరువైంది. వృద్ధులను నిరాదరణ, నిర్లక్ష్యం ఆవరించాయి. అనువైన జీవనం కోసం ఎక్కువ శాతం మంది వృద్ధులు సంరక్షకులపై ఆధారపడాల్సి వస్తోందని హెల్ప్ఏజ్ ఇండియా నివేదిక వెల్లడించింది. హెల్ప్ ఏజ్ ఇండియా ఈ ఏడాది జాతీయ నివేదిక విడుదల చేసింది. పది రాష్ట్రాల్లో 20 ముఖ్యమైన టైర్ 1, 2 నగరాల్లో 5,169 వృద్ధులు, 1,333 వృద్ధుల సంరక్షకులు, కుటుంబసభ్యులపై అధ్యయనం చేసింది. ఈ సర్వేలో భాగంగా పలు కీలక ఆరి్థక, ఆరోగ్య, ప్రాథమిక సంరక్షణ విషయాలు వెలుగుచూశాయి. ప్రతి ముగ్గురు వృద్ధుల్లో ఒకరు ఆరి్థక సమస్యల్లో ఉన్నారు. వృద్ధుల్లో ఎలాంటి ఆదాయంలేని పురుషులు 27 శాతం, మహిళలు 38 శాతం ఉన్నారు. 32 శాతం వృద్ధులు రూ.50 వేల కంటే తక్కువ వార్షిక ఆదా యం కలిగి ఉన్నారు. 29 శాతం వృద్ధులు మా త్రమే సామాజిక భద్రతా పథకాలైన వృద్ధాప్య పెన్షన్/కాంట్రిబ్యూటరీ పెన్షన్/ప్రావిడెంట్ ఫండ్లను పొందుతున్నారని సర్వే వెల్లడించింది. నిరక్షరాస్యులైన వృద్ధులు (40 శాతం) ఎలాంటి ఆదాయ వనరులు లేక అవస్థలు పడుతున్నారు. 54 శాతం మందికి వ్యాధులు 52 శాతం వృద్ధులు ఆరోగ్యపరంగా నిత్యం ఏదో ఒక ప్రాథమిక సవాలును ఎదుర్కొంటున్నారు. 54 శాతం మంది రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నారు. 31 శాతం మంది వృద్ధులు మాత్రమే ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్, ఈఎస్ఐ–సీజీహెచ్ఎస్ వంటి ఆరోగ్య బీమాలను కలిగి ఉంగా, 3 శాతం మంది మాత్రమే కమర్షియల్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినట్లు నివేదించారు. ఆరోగ్య బీమా లేకపోవడానికి ప్రధాన కారణాలుగా అవగాహన లేకపోవడం(32%), ఆరి్థక స్థోమత లేకపోవడం (24%), దాని అవసరం లేకపోవడం (12%) అని గుర్తించారు. 1.5 శాతం మంది మాత్రమే టెలీ–హెల్త్ సేవలను ఉపయోగించారు. 79 శాతం మంది వృద్ధులు ప్రభుత్వ ఆసుపత్రులు/క్లినిక్లు/పీహెచ్సీలను సందర్శించారు. 80 ఏళ్లు పైబడిన 47 శాతం మందికి ఆసుపత్రులకు వెళ్లడానికి వ్యక్తిగత ఆదాయం లేక అవస్థలను ఎదుర్కొంటున్నారని హెల్ప్ఏజ్ ఇండియా పాలసీ రీసెర్చ్ అండ్ అడ్వకేసీ హెడ్ అనుపమ దత్తా వెల్లడించారు. నిరక్షరాస్యులపట్ల నిర్లక్ష్యం వృద్ధులు నిర్లక్ష్యానికి గురికావడంలో కుమారులు 42 శాతం, కోడళ్లు 28 శాతం కారణంగా ఉన్నారు. నిర్లక్ష్యం ఎదుర్కొన్నవారిలో అత్యధికులు నిరక్షరాస్యులు కాగా, వృద్ధుల ఆదాయం తగ్గడంతో వారిపై నిర్లక్ష్యం పెరిగిందని 73 శాతం బాధితులు నివేదించారు. ఈ బాధితులు (94 శాతం మంది) కనీసం ఒక దీర్ఘకాలిక వ్యాధికి గురికావడం వల్ల కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారని వెల్లడైంది. నిర్లక్ష్యానికి గురైన బాధితులు.. వారిని దూషించడం, కొట్టడం వంటి చర్యలను తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియజేయగా, పరిష్కారం లభించలేదని కుమిలిపోతున్నారు. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు చాలా అత్యల్పమని హెల్ప్ఏజ్ ఇండియా సీఈఓ రోహిత్ ప్రసాద్ పేర్కొన్నారు. మంచాన పడినప్పుడువృద్ధుల సంరక్షణలో కుటుంబసభ్యులు ప్రాథమిక పాత్ర పోషించారని సర్వే తెలిపింది. వృద్ధులు మంచాన పడినప్పుడు వారి జీవిత భాగస్వామి లేదా పిల్లలు చూసుకున్నారని, 68 శాతం మంది సంరక్షకులు వారికి బాసటగా నిలిచామని తెలిపారు. సగటున వారంలో దాదాపు 20 గంటలు వారి సేవలకే అంకితం చేశామని సంరక్షకులు తెలిపారు. అయితే సంరక్షణలో భాగంగా 10 శాతం మంది మాత్రమే సమీపంలో వృద్ధాశ్రమం, డే కేర్ సెంటర్లు, పాలియేటివ్ కేర్(ఉపశమన సేవలు) వినియోగించుకున్నారని వెల్లడైంది. జెరియాట్రిక్ హెల్త్కేర్ సౌకర్యాలను 15 శాతం మంది మాత్రమే అందించారు. -
జొమాటో ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ హీరోలు: గిన్నిస్ వరల్డ్ రికార్డ్
మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి సాయం అందించవచ్చో ట్రైనింగ్ ఇచ్చిన.జొమాటో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. తమ డెలివరీ ఏజెంట్లకు ముంబైలో ఒకే చోట ఈ శిక్షణ అందించింది. ఒకేసారి 4,300 మందికి జూన్ 12వ తేదీన ట్రైనింగ్ ఇచ్చి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించింది. అత్యవసర సమయాల్లో స్పందించేలా అతిపెద్ద శిక్షణా కార్యక్రమం నిర్వహించి ఈ రికార్డు సొంతం చేసుకుంది.ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ నుంచి వచ్చిన సర్టిఫికెట్ను జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ ఎక్స్లో షేర్ చేశారు. ‘ఎమర్జెన్సీ హీరోస్ ఆఫ్ ఇండియా’ అనే క్యాప్షన్తో డెలివరీ పార్ట్నర్స్ శిక్షణా ఫొటోలను ట్వీట్ చేశారు.జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కేవలం ఫుడ్ డెలివరీ చేయడమే కాకుండా ఇకపై అత్యవసర సమయాల్లో కూడా సాయం అందిస్తారని గోయల్ తెలిపారు దాదాపు 30 వేల మందికి ఈ ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిపారు. "ఒకే చోట 4,300 మందికి ఇలా ట్రైనింగ్ ఇచ్చి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాం. దాదాపు 30 వేల మంది ఈ ప్రాథమిక చికిత్సలో శిక్షణ పొందారు. ఇకపై వీళ్లంతా అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడతారు. ఎమర్జెన్సీ హీరోలందరికీ నా సెల్యూట్" అని పోస్ట్ పెట్టారు. -
పేద కుటుంబానికి ఆదుకున్న హీరో.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పరిచయం అక్కర్లేని పేరు. అరుంధతిలో పశుపతి పాత్రలో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. అంతేకాదు.. తెలుగులో అల్లు అర్జున్ చిత్రం జులాయిలో తన నటనతో ఆకట్టుకున్నారు. చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించారు. అయితే సోనూ సూద్ తెరపై మాత్రమే కాదు.. అభిమానుల గుండెల్లో రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచారు.తాజాగా మరో నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి గొప్ప మనసును చాటుకున్నారు. డెహ్రాడూన్కు చెందిన ఓ పేద కుటుంబంలోని మూడేళ్ల బాలుడికి వైద్య సాయమందించారు. అత్యవసరంగా గుండెకు సర్జరీ చేయాల్సి రావడంతో సోనూ సూద్ ఆదుకున్నారు. ఆ బాలుడికి సర్జరీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయించారు. ఇది చూసిన నెటిజన్స్ సోనూ రియల్ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. సోనూ సూద్ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. Appointment fixed with the doctor at 11.30 am today . Will be done ❤️✔️@SoodFoundation 🇮🇳 https://t.co/O1K88v0Pl1— sonu sood (@SonuSood) June 7, 2024 -
మంచి మనసు చాటుకున్న జ్యోతిరాయ్
-
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ సేవలో దూసుకుపోతున్నాడు. పేదరికంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. మాత్రం అనే అనే ఫౌండేష్ ద్వారా సేవలు కొనసాగిస్తున్నారు. ఇటీవలే దివ్యాంగులకు టూవీలర్ వాహనాలు అందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన మాట ప్రకారం మరో పది కుటుంబాలకు ట్రాక్టర్లు అందిస్తున్నారు. ప్రస్తుతం విల్లుపురం జిల్లాలోని ఓ పేద కుటుంబానికి ట్రాక్టర్ను తానే స్వయంగా అందించారు.దీనికి సంబంధించిన వీడియోను రాఘవ లారెన్స్ ట్విటర్లో పంచుకున్నారు. విల్లుపురం జిల్లాలో ప్రభు కుటుంబానికి మూడో ట్రాక్టర్ తాళాలు అందజేశానని తెలిపారు. మీ ప్రేమను చూస్తుంటే.. ఇది నాకు మరింత శక్తిని ఇస్తోందని.. ముందుకు సాగడానికి ప్రేరణనిస్తోందని రాసుకొచ్చారు. మనమంతా కలిసి అందరికీ ఉజ్వల భవిష్యత్తును సృష్టించగలం అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #serviceisgod DAY TWO JOURNEY! I handed over the 3rd tractor key to the Prabu family in the Villupuram district. Seeing all your love, It's giving us more energy and motivation to go forward. Together, we can make a difference and create a brighter future for all. #Maatram… pic.twitter.com/Hq9lY9vylA— Raghava Lawrence (@offl_Lawrence) May 7, 2024 -
స్పీచ్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఒక్క రోజులో ఏం జరుగుతుంది?
ఊరుకున్నంత ఉత్తమం లేదని మన పెద్దలు అంటుంటారు. అతిగా మాట్లాడటం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తడమే కాకుండా మానసిక శక్తి బలహీనపడుతుంది. కొన్నిసార్లు అతిగా మాట్లాడటం పెద్దపెద్ద వివాదాలకు దారితీస్తుంది. మౌనం వహించడం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ షౌనక్ అజింక్యా మౌనం గొప్పదనాన్ని వివరించారు. ఒక రోజంతా నిశ్శబ్దంగా ఉంటే అది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. ‘స్పీచ్ ఫాస్టింగ్’ గొంతులోని స్వర తంతువు (వాయిస్ రీడ్స్)లకు విశ్రాంతిని ఇస్తుంది. రోజంతా నిశ్శబ్దంగా ఉంటడం ఒత్తిడిని తగ్గిస్తుంది. అలసటను తొలగిస్తుంది. కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. శరీరానికి విశ్రాంతినిస్తుంది. ప్రశాంతమైన నిద్రకు దోహదపడుతుంది. రోజంతా మౌనంగా లేదా అధికంగా మాట్లాడకుండా ఉండగలిగితే మానసిక స్వాంతనను పొందుతారు. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినగలుగుతారు. మౌనంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగుపడతాయి. పలు మతాలలో మౌనవ్రతం అనేది భగవంతుడిని చేరుకునేందుకు ఒక మార్గంగా చెబుతారు. మౌనవ్రతం అంతర్గత బలాన్ని పెంచుతుంది. మనలోని అంతరంగాన్ని అర్థం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. రోజంతా మౌనంగా ఉండటం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుందని డాక్టర్ అజింక్య తెలిపారు. స్వర తంతువులు, గొంతు కండరాలు, ముఖ కండరాలు రిలాక్స్ అవుతాయి. అధికసమయం మౌనంగా ఉండటం, గాఢమైన శ్వాస తీసుకోవడం వల్ల శరీరం రిలాక్స్ అవడమే కాకుండా రక్తపోటు అదుపులో ఉంటుంది. బీపీని అదుపులో ఉంచుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. తక్కువగా మాట్లాడటం వల్ల మెదడుకు పదును పెట్టినట్లవువుతుంది. అలాగే పరధ్యానం తొలగి, మరింత ఏకాగ్రత ఏర్పడుతుందని అజింక్య వివరించారు. -
బ్రహ్మనందం గొప్ప మనసు.. వారి కుటుంబానికి ఆర్థికసాయం!
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మనందం ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయాన్నే విఐపీ దర్శన సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు తిరుమలలో ఘనస్వాగతం పలికిన వేద పండితులు.. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మనందం అనంతరం పుస్తాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కళాకారుని కుటుంబాన్ని ఆదుకుని మంచి మనసును చాటుకున్నారు. కళాకారుడు మరణించిన కుటుంబానికి రూ.2.17 లక్షల ఆర్థికసాయం అందించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బ్రహ్మనందం చేసిన పనిని అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మనందం కళాకారులను ఉద్దేశించి మాట్లాడారు. -
CM Jagan: ఏ కష్టం వచ్చినా.. క్షణం కూడా ఆలోచించకుండా సాయం (ఫొటోలు)
-
స్టార్ హీరో గొప్పమనసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు!
పరుత్తివీరన్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు కార్తీ. సూర్య సోదరుడిగా పలు సూపర్ హిట్ చిత్రా లలో నటించారు. గతేడాది జపాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పటిదాకా 25 సినిమాలు చేసిన భారీ ఎత్తున సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్తీ -25 పేరుతో జరిగిన వేడుకలో సమాజంలో మంచి కార్యక్రమాల కోసం రూ.కోటి వెచ్చించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అంతే కాదు చెప్పిన విధంగానే పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న 25 మందిని ఎంపిక చేసి వారికి తలా రూ.లక్ష సాయం చేసే కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో ప్రారంభించారు. ఇందులో స్వచ్ఛందంగా అనాథ పిల్లలను ఆదుకుంటున్న వారికి, విద్య, వైద్య సేవలను అందిస్తున్న వారికి, దివ్యాంగులను ఆదుకుంటున్న వారికి అంటూ 25 మందిని ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు. వారిలో ఒక్కొక్కరికి రూ.లక్ష నగదు సాయాన్ని అందించారు. అనంతరం కార్తీ మాట్లాడుతూ.. తాను నటుడిగా 25 చిత్రాలను పూర్తి చేసిన సందర్భంగా రూ.కోటి రూపాయలతో సహాయ కార్యక్రమాలను నిర్వహించాలని భావించానన్నారు. అందులో భాగంగా ఇటీవల తన అభిమాన తమ్ముళ్లతో చైన్నెలోని ముఖ్యమైన ప్రాంతాల్లో రోజుకు 1000 మందికి చొప్పున 25 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తమ్ముళ్ల ఆలోచన ప్రకారం వివిధ రంగాల్లో స్వచ్ఛంద సేవలను అందిస్తున్న వారిని ప్రోత్సహించే విధంగా నగదు సాయం చేయాలని తలపెట్టిన కార్యక్రమమని పేర్కొన్నారు. ఆ విధంగా సేవాతత్పరులు 25 మందికి రూ.లక్ష అందించినట్లు చెప్పారు. ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలను తన ఉళవన్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా చేపట్టునున్నట్లు కార్తీ తెలిపారు. -
కోలుకుంటున్న రాకేశ్..
భైంసాటౌన్: పట్టణంలోని కిసాన్గల్లికి చెందిన రాకేశ్(రోబో) ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. మెదడులో పలుచోట్ల రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.8లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో బాధితుడి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో ఈనెల 1న ‘ఆపన్నహస్తం అందించరూ’ అన్న శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన దాతలు ఫోన్పే, గూగుల్పే ద్వారా తోచిన సహాయం అందజేశారు. వైద్యులు ఆపరేషన్ చేయడంతో ప్రస్తుతం రాకేశ్ కోలుకుంటున్నాడు. తనకు ఆర్థికసహాయం అందించి ఆదుకున్న దాతలకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆదర్శంగా నిలుస్తున్న యువత.. సాటి మనిషికి ఏమైతే మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు భైంసాకు చెందిన కొందరు యువకులు. ఆపద ఏదైనా తామున్నామంటూ అండగా నిలబడుతున్నారు. వారు చేసేది చిన్నపాటి ఉద్యోగాలే అయినా.. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి సైతం అంతంతమాత్రమే అయినా సాటిమనిషిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటున్నారు. వారే భైంసాకు చెందిన బ్లడ్ డోనర్స్, అయోధ్యభారతి గ్రూప్ సభ్యులు రాకేశ్ స్నేహితులు అతనికి సాయం చేయాలనే ఉద్దేశంతో విరాళాల సేకరణకు విస్తృతంగా కృషి చేశారు. సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కోరారు. దీంతో దాతలు స్పందించి ఫోన్పే, గూగుల్పే ద్వారా ఆర్థికసహాయం అందజేశారు. పట్టణంలోని ప్రముఖులు, వైద్యులను కలిసి రూ.6 లక్షల వరకు విరాళాలు సేకరించి బాధిత కుటుంబానికి అందజేశారు. దీంతో ప్రస్తుతం రాకేశ్ కోలుకోగా, వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆపదలో అండగా నిలిచిన బ్లడ్ డోనర్స్ గ్రూప్ అడ్మిన్ సురేశ్తో పాటు అయోధ్య భారతి సేవా టీం సభ్యులను పలువురు అభినందిస్తున్నారు. -
UN: ఉక్రెయిన్పై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన
న్యూయార్క్: రష్యాతో యుద్ధం కారణంగా చిధ్రమైన ఉక్రెయిన్కు, దేశం విడిచి వెళ్లిన ఉక్రెయిన్ శరణార్థులకు సాయం చేయాల్సిందిగా భాగస్వామ్య దేశాలను ఐక్యరాజ్య సమితి(యూఎన్) విజ్ఞప్తి చేసింది. ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్ను ఆదుకోవడానికి కనీసం 4.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అవసరమని యూఎన్ తెలిపింది. ‘రష్యాతో సుదీర్ఘ యుద్ధం కారణంగా వందల వేల సంఖ్యలో చిన్న పిల్లలు కనీస అవసరాలకు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ దారుణమైన పరిస్థితుల వల్లే ఉక్రెయిన్కు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఉక్రెయిన్ జనాభాలోని 40 శాతం అంటే కోటి నలభైఆరు లక్షల మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో 33 లక్షల మంది ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో బిక్కబిక్కు మంటూ జీవితం గడుపుతున్నారు. 4.2 బిలియన్ డాలర్లలో 3.1 బిలియన్ డాలర్లు ఉక్రెయిన్కు కావాల్సి ఉండగా 1.1 బిలియన్ డాలర్లు ఉక్రెయిన్ శరణార్థులకు అవసరమని యూఎన్ వెల్లడించింది. శరణార్థులకు ఆశ్రయమిస్తున్న దేశాలకు ఈ సాయం అందిస్తామని తెలిపింది. శరణార్థులకు తాము తిరిగి ఉక్రెయిన్ రావాలన్న భావన కలగకుండా ఉండాలంటే వారిని కష్టాల నుంచి గట్టెక్కించాల్సి ఉందని యూఎన్ అధికారి ఫిలిప్పో గ్రాండి అభిప్రాయపడ్డారు. కాగా, 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్ నుంచి 63 లక్షల మంది ఇతర దేశాలకు పారిపోయారు. మరో నలభై లక్షల మంది దేశంలోనే చెల్లాచెదురయ్యారు. వీరిలో ఒక లక్ష మంది దాకా చిన్న పిల్లలు కూడా ఉండటం గమనార్హం. ఇదీచదవండి.. బద్దలైన అగ్ని పర్వతం.. ఇళ్లపైకి లావా ప్రవాహం -
కాకినాడ జిల్లా పర్యటనలో పలువురికి ఆర్థిక సాయం అందజేసిన సీఎం జగన్
-
గంటలో హామీ అమలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ పర్యటన సందర్భంగా బుధవారం తనను కలిసిన పలువురు అనారోగ్య బాధితుల పరిస్థితి చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి జగన్ తక్షణ సాయం అందించాలని కలెక్టర్ కృతికా శుక్లాను ఆదేశించారు. సీఎం కార్యక్రమం ముగించుకుని వెళ్లిన గంటలోపే తొమ్మిది మందికి రూ.13 లక్షల ఆర్థిక సాయాన్ని కలెక్టరేట్లో చెక్కు రూపంలో అందజేశారు. వీరిలో 8 మందికి రూ.లక్ష చొప్పున ఇవ్వగా ఒక బాధితుడికి రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.13 లక్షల విలువైన చెక్కులను కలెక్టర్ అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన గంటలోపే సాయం అందడంపై బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి. సాయివెంకట్కిరణ్ తల్లికి రూ.లక్ష, కోట సత్యసాయి జన్విర్కు రూ.లక్ష, జి.సుష్మశ్రీ తండ్రికి రూ.లక్ష, పత్తికాయల డేవిడ్ రోషన్కు రూ.లక్ష, దూడ రవికుమార్కు రూ.లక్ష, గనిశెట్టి రూపాలక్ష్మికి రూ.లక్ష, మర్రిరపూడి విశ్వేశ్వరరావుకు రూ.5 లక్షలు, పటేల కుష్మిత కుమారికి రూ.లక్ష, గనిశెట్టి కనక మహాలక్ష్మికి రూ.లక్ష చొప్పున చెక్కు రూపంలో ఆర్థిక సాయం అందిస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా ► కాకినాడ భానుగుడి తిరుమలశెట్టి వీధికి చెందిన కృష్ణారావు కుమారుడు 41 ఏళ్ల మర్రిపూడి విశ్వేశ్వరరావుకు రూ.5 లక్షలు. ► కాకినాడ రూరల్ మండలం సర్పవరానికి చెందిన శ్రీనివాస్ కుమారుడు ఏడేళ్ల జి.జయసాయి వెంకట కిరణ్ కిడ్నీ చికిత్సకు రూ.లక్ష. ► కరప మండలం వేములవాడకు చెందిన నాగార్జున కుమారుడు కోట సత్య వెంకట సాయి జశి్వక్ వైద్యానికి రూ.లక్ష. ► పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన రెండేళ్ల బాలిక జి.సుష్మశ్రీ వైద్యానికి రూ.లక్ష. ► కాకినాడ గాం«దీనగర్కు చెందిన పి.శ్రీనివాస్ కుమారుడు 17 ఏళ్ల పత్తికాయల డేవిడ్ రోషన్ వైద్యం నిమిత్తం రూ.లక్ష. ► యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటకు చెందిన చిట్టిబాబు కుమారుడు 17 ఏళ్ల దూడ రవికుమార్ వైద్యానికి రూ.లక్ష. ► పిఠాపురం మండలం కోలంకకు చెందిన రెండేళ్ల బాలిక గనిశెట్టి రూపాలక్ష్మి వైద్య సహాయానికి రూ.లక్ష. ► కాకినాడ పల్లంరాజు నగర్కు చెందిన కులదీప్కుమార్ కుమార్తె మూడేళ్ల పటేలా కుష్మిత కుమారికి రూ.లక్ష. ► కరపకు చెందిన 11 సంవత్సరాల బాలిక గనిశెట్టి కనకమహాలక్ష్మి కి రూ.లక్ష. -
స్వయం ఉపాధి ఒక మంచి త‘రుణం’
సంగారెడ్డి: హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 481 స్వశక్తి మహిళా సంఘాల్లో 5,106 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో గ్రూపునకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు పొందుతున్నారు. ప్రతీ సంఘం ప్రణాళికలు రచించుకుంటూ సీనియార్టీ ప్రకారం బ్యాంక్లో రుణాలు పొందుతూ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటున్నారు. సభ్యుల ఏకగ్రీవ తీర్మాణంతో అప్పులు తీసుకొని వాటిని కీస్తీల వారిగా అప్పులు చెల్లిస్తూ బ్యాంక్లకు నమ్మకం కలిగిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (మార్చి 2024)గాను 99 గ్రూపులకు గాను 8.36 కోట్ల రుణాల టార్గెట్ విధించగా, ఇందులో 85 గ్రూపులు రూ.9.80 కోట్లు టార్గెట్ను మించి రుణాలు పొందారు. మరో రూ.1.50 కోట్లకు రుణాల ప్రతిపాదనలు పంపినట్లు మెప్మా సీఈఓ రాజు తెలిపారు. ఈ నిధులు మంజూరైతే సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల కంటే హుస్నాబాద్ మెప్మా అగ్రగ్రామిగా నిలువనుంది. ఈ రుణాలతో మహిళలు ముఖ్యంగా టైలరింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడర్, పాడి పశువుల పెంపకం వంటి యూనిట్లను ఎంచుకొని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వీధి వ్యాపారులకు రూ.కోట్లలో.. హుస్నాబాద్ పట్టణంలోని వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం కింద చేయూతను అందిస్తుంది. ఒక్కో వ్యాపారికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాన్ని బ్యాంక్ల ద్వారా అందిస్తున్నారు. ఈ ఏడాది హుస్నాబాద్ పట్టణంలో వీధి వ్యాపారుల గుర్తింపుపై సర్వే చేసి 1,566 మందిని గుర్తించారు. ఇందులో 1,365 మంది రుణం కోసం దరఖాస్తు చేసుకోగా, 1332 మందికి మొదటి విడతగా రూ.10 వేల చొప్పున రూ.1.33 కోట్ల రుణం మంజూరు చేశారు. రెండో విడతగా 865 మంది వ్యాపారులకు టార్గెట్ చేయగా, 837 మందిని గుర్తించారు. ఇందులో 712 మందికి బ్యాంక్ అధికారులు సమ్మతం తెలుపగా, 690 మందికి రూ.20 వేల చొప్పున 1.38 కోట్లు రుణం అందజేశారు. మూడో విడతలో 161 మందిలో 154 మంది గుర్తించి 150 మందికి రూ.50వేల చొప్పున రూ.75 లక్షల రుణాన్ని బ్యాంక్ అధికారులు మంజూరు చేశారు. ఈ రుణాలను వీధి వ్యాపారులు క్రమం తప్పకుండా చెల్లిస్తూ, మళ్లీ అధికంగా ఎక్కువ రుణాలు పొందేలా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. పీఎం స్వనిధి రుణాల్లో హుస్నాబాద్ జిల్లాలోనే టాప్గా నిలిచింది. మహిళా సంఘాలు ఆర్థిక పురోగాభివృద్ధికి అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదుగుతున్నారు. హుస్నాబాద్లోని మహిళా సంఘాల సభ్యులు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు టార్గెట్ను మించి పొందారు. మరో కోటి రూపాయలు వస్తే జిల్లాలోనే హుస్నాబాద్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అగ్రభాగాన నిలువనుంది. అలాగే, వీధి వ్యాపారులకు ఇచ్చే పీఎం స్వనిధి రుణాల్లో హుస్నాబాద్ టాప్లో నిలిచింది. వీధి వ్యాపారులకు బ్యాంకు అధికారులు రూ.కోట్లలో రుణాలు ఇవ్వడం గమనార్హం. ఆర్థికంగా ఎదగడానికే.. మహిళలు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. వారు నచ్చిన యూనిట్లను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదుగుతున్నారు. నెల వారి కిస్తీలు సక్రమంగా చెల్లిస్తూ బ్యాంకులకు నమ్మకం కలిగిస్తున్నారు. అలాగే వీధి వ్యాపారులకు బ్యాంక్ల ద్వారా రుణాలు అందిస్తున్నాం. జిల్లాలోనే అత్యధికంగా వీధి వ్యాపారులు రుణాలు పొందారు. – రాజు, మెప్మా సీఈఓ, హుస్నాబాద్ -
యాంకర్ సుమ గొప్ప మనసు.. వారి కోసం ఆర్థిక సాయం!
టాలీవుడ్లో యాంకర్ సుమ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈవెంట్ ఏదైనా సరే సుమక్క లేకపోతే ఏదో కాస్తా తక్కువైనట్లు అనిపిస్తుంది. అంతలా తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వేదికపై గలగల మాట్లాడే యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండున్నర దశాబ్దాలుగా బుల్లితెరపై ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. అయితే సుమ యాంకరింగ్తో పాటు సమాజసేవలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఫెస్టివల్ ఫర్ జాయ్ సంస్థ పేరుతో ఆమె సేవలందిస్తున్నారు. ఏదైనా పండుగ వచ్చిందంటే తన వంతు సహకారంతో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా క్రిస్మస్ సందర్భంగా ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్కు రూ.5 లక్షల చెక్ను అందజేసింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సహకారంతో ఫిల్మ్ జర్నలిస్ట్స్ ఇన్సూరెన్స్ ఫండ్కు సాయం అందజేసినట్లు సుమ వెల్లడించారు. ఈ విషయంలో నాట్స్ సహకారం గొప్పదని సుమ తెలిపారు. కాగా.. సుమ, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. బబుల్ గమ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. A heartfelt thank you to @follownatsworld for their generous 5 Lakh donation to the @FilmJournalists through @ItsSumaKanakala @FestivalsforJoy Special appreciation to #SreedharAppasani Garu, #ArunaGanti, #BapuNuthi , #PrashanthPinnamaneni & #RajAllada garu, #NATS Board of… pic.twitter.com/FJo1Bzzx57 — Telugu Film Journalists Association (@FilmJournalists) December 25, 2023 -
బరువు తగ్గడంలో పనీర్ హెల్ప్ అవుతుందా?
బరువు తగ్గడం కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటాం. అందుకోసం చాలా రకాల కసరత్తులు కూడా చేసేస్తుంటాం. ఫిట్నెస్ కోసం ఇష్టమైన ఆహారం కూడా దూరం పెట్టేస్తా. కొందరైతే భోజనమే తినడం మానేస్తారు. లావుగా ఉన్నామన్నా ఫీల్తో ఇంతలా కష్టపడుతుంటారు చాలామంది. అయితే నిపుణులు బరువు తగ్గాలనుకుంటే ఫిట్నెస్ ఎంత ముఖ్యమో! సరైన డైట్ ఫాలో అవ్వడం అనేది అన్నింటికంటే ప్రధానం అని చెబుతున్నారు. నచ్చిన ఆహారం తినకుండా ఉండడం అనేది చాలా కష్టం. కానీ అందుకోసం మరీ నోటిని కట్టేసినట్లు ఉంచుకోనక్కర్లేదంటున్నారు. నచ్చినవి మితంగా తింటూ డైట్ ఫాలో అవ్వండి. పాటిస్తున్న డైట్ని మన మనసు కూడా ఇష్టంగా ఆస్వాదించేలా ఉండటం అనేది కూడా ముఖ్యమే. అయితే ఆరోగ్య నిపుణులు పనీర్ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు కాబట్టి పనీర్ డైట్ ఫాలో అయితే ఈజీగా బరువు తగ్గొచ్చని సూచిస్తున్నారు. ఏంటీ..? పనీర్తో బరువు తగ్గగలమా అని ఆశ్చర్యపోతున్నారా? ఔను! తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. ఎలా తగ్గొచంటే.. పనీర్ పోషకాలు అధికంగా ఉండే ఆహారం. దీనిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ బీ12, సెలీనియ, ఫాస్పరస్, ఫోలేట్ ఉన్నాయి. ఈ పోషకాలన్నీ బరువు తగ్గడంలో ఉపకరిస్తాయని అంటున్నారు నిపుణులు. ఆరోగ్య మార్గంలో బరువు తగ్గేందుకు ఈ పనీర్ ఎంతగానో ఉపకరిస్తుందని చెబుతున్నారు. పనీర్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇతర పాల ఉత్పత్తులు కంటే మెరుగైన ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల దీన్ని ఆహారంగా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చు. కాటేజ్ చీజ్ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే పనీర్ తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. అతిగా తినడం నివారించొచ్చు. (చదవండి: భారత రెస్టారెంట్కి మిచెలిన్ స్టార్ అవార్డు! ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా చెఫ్గా అరోరా) -
ఉదారంగా సిఫార్సులు చేయండి
సాక్షి, అమరావతి : తుపాను, వర్షాభావ ప్రాంతాల్లో రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాల్సిందిగా కేంద్ర అధికారుల బృందాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. తుపాను, కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన బృందాలు క్షేత్రస్థాయి పర్యటనల అనంతరం శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యాయి. తుపాను బాధిత ప్రాంతాల్లో తాము చూసిన పరిస్థితులను, గుర్తించిన అంశాలను సమావేశంలో వివరించాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. విస్తృత వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి.. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడమే కాకుండా వారికి తక్షణ సహాయాన్ని కూడా అందించాం. సహజంగా.. తుపాను ఏదో ఒక ప్రాంతంలో తీరం దాటుతుంది. కానీ, ఈ తుపాను తీరం వెంబడి కదులుతూ కోస్తా ప్రాంతంలో విస్తృతంగా వర్షాలకు కారణమైంది. దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ నష్టాన్ని అంచనా వేస్తోంది. ఏపీలో ఈ–క్రాపింగ్ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఉంది. నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం పెడతాం. ఎవరైనా నష్టపోయిన రైతు పేరు లేకుంటే వెంటనే దాన్ని సరిదిద్దేలా అత్యంత పారదర్శకత వ్యవస్థను అమలుచేస్తున్నాం. రైతులను తుదివరకూ ఆదుకునేలా వ్యవస్థలు రాష్ట్రంలో ఉన్నాయి. దీనివల్ల రైతులకు అందించే సహాయం, పరిహారం అత్యంత పారదర్శకంగా వారికి చేరుతుంది. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్వయంగా చూసినందున ఆ మేరకు రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయండి. ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా,డీబీటీ పథకాలు బాగున్నాయి.. రాష్ట్రంలో ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, డీబీటీ పథకాలు, ఇన్పుట్ సబ్సిడీ, కంటింజెన్సీ కింద విత్తనాల పంపిణీ, అమూల్ పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా మిల్క్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటూ బాగున్నాయి. అలాగే, గ్రామ సచివాలయాల వ్యవస్థ పనితీరును తాము స్వయంగా చూశామని.. ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయని కేంద్ర బృందం కితాబి చ్చింది. కౌలు రైతులకూ రైతుభరోసా భేష్.. అంతేకాక.. కౌలు రైతులకూ ఎక్కడాలేని విధంగా రైతుభరోసా అందించడం అభినందనీయమని కేంద్ర బృందం పేర్కొంది. వరి కాకుండా పెసలు, మినుములు, మిల్లెట్స్ లాంటి ఇతర పంటల వైపు మళ్లేలా చూడాలని సూచించింది. ఇదే అంశంపై ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అధికారులు వివరించారు. ‘ఉపాధి’ పెండింగ్ నిధులు వెంటనే ఇప్పించండి.. మరోవైపు.. ఉపాధి హామీ పథకం కింద విస్తారంగా కల్పిస్తున్న పనిదినాలపైన కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారులు వివరించారు. పెండింగులో ఉన్న ఉపాధి హామీ పథకం బిల్లులను రాష్ట్రానికి వెంటనే వచ్చేలా చూడాలని వారు కోరారు. అలాగే, తుపాను కారణంగా రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని.. ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రాన్ని అభ్యర్థించామని, వీలైనంత త్వరగా అవి కూడా వచ్చేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐడీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ, వ్యవసాయ శాఖ జేడీ విక్రాంత్సింగ్, డీఏఎఫ్డబ్ల్యూ జాయింట్ సెక్రటరీ పంకజ్ యాదవ్ సహా రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ జవహర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ అంబేద్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుజాగ్రత్తతో నష్టాలనునివారించారు : కేంద్ర బృందం అనంతరం.. కేంద్ర బృందం స్పందిస్తూ.. అనంతపురం జిల్లా నుంచి పర్యటన ప్రారంభమై కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించామని వివరించింది. మూడు బృందాలుగా జిల్లాల్లో పర్యటించి వర్షాభావ పరిస్థితులను పరిశీలించామని అందులోని సభ్యులు తెలిపారు. వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించామని, స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నామన్నారు. అలాగే, జలవనరులు, రిజర్వాయర్లలో నీటిమట్టాల పరిస్థితిని చూడడంతోపాటు ఉపాధి పథకాన్ని పరిశీలించినట్లు కేంద్ర బృందం తెలిపింది. తుపానుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తం కావడంవల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగిందని పేర్కొంది. సచివాలయాల రూపంలో ఇక్కడ గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని, విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు బాగున్నాయని ప్రశంసించింది. ఈ–క్రాపింగ్ లాంటి విధానం దేశంలో ఎక్కడాలేదని, ఇవి ఇతర రాష్ట్రాలూ అనుసరించదగ్గవని, ఆయా ప్రభుత్వాలకు వీటిని తెలియజేస్తామని తెలిపింది. అలాగే, తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని బృందం వెల్లడించింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులనూ బృందం అధికారులు వివరించారు. -
మిచౌంగ్ ఎఫెక్ట్.. గొప్ప మనసు చాటుకున్న స్టార్ హీరోలు!
'మిచౌంగ్' తుపాను వల్ల చెన్నై వణికిపోతుంది. గత నెట 27న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. నిన్న తెల్లవారుజాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్య-పశ్చిమ బంగాళాఖాతంలో చెన్నైకి తూర్పు-ఈశాన్య దిశగా 100 మీటర్ల దూరంలో దీని ప్రభావం ఎక్కవగా ఉంది. ఇదీ నేడు తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో తుపాను ప్రభావం మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. 'మిచౌంగ్' తుపాను ప్రభావంతో చెన్నైలో నివసించే సాదారణ ప్రజలు చాలా ఇబ్బందులకు గురౌతున్నారు. నగరం మొత్తం కూడా జలమయమైంది. టి.నగర్ టన్నెల్, అరంగనాథన్ టన్నెల్, వడపళని మురుగన్ టెంపుల్ చెరువు, అన్నానగర్, కోడంబాక్కం, నుంగంబాక్కం వంటి వివిధ ప్రాంతాలు చెరువులుగా మారాయి. దీంతో కట్టుబట్టలతో వారందరూ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. వారికి సరైన ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వసతిని ప్రభుత్వం కల్పిస్తోంది. అక్కడి ప్రభుత్వం కూడా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. అయితే ఆహారం విషయంలో సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తక్షణ సాయం క్రింద వారు రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. తమ అభిమాన సంఘాల ద్వారా బాధిత ప్రజలకు ఆహారం, నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. చిన్న పిల్లలకు పాలు , మెడిసిన్స్ అందిస్తున్నారు. పరిస్థితి చక్కబడకపోతే మరింత సాయం చేసేందేకు తాము వెనుకాడమని కార్తి తెలిపాడు. ఇప్పటికే మరో హీరో విశాల్ కూడా రోడ్డుపైకి వచ్చి తన వంతుగా ప్రజల కోసం సాయం చేస్తున్నాడు. -
అయ్యయ్యో..ఎంత విషాదం: మంచికోసం వెళ్లి..మృత్యు ఒడిలోకి!
ఎవరికి ఏమైతే నాకేంటిలే అని అనుకోకుండా తోటి మనిషికి సాయం చేయాలని ప్రయత్నించిన వ్యక్తి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో చిక్కుకున్న మనషికి సాయం చేయాలని ప్రయత్నించి తానే ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. నైరుతి ఢిల్లీలోని కార్గిల్ చౌక్ సమీపంలో నవంబర్ 3న ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ప్రమాదంలో గాయపడిన తోటి బైకర్ను రక్షించి, ఆ ప్లేస్ నుంచి బయలుదేరుతున్న సమయంలో వాటర్ ట్యాంక్ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో షంషేర్ సింగ్ అనే వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదైంది. అమర్జీత్ సింగ్ నవంబర్ 3వ తేదీ రాత్రి 10.20 గంటల సమయంలో గురుగ్రామ్కు వెళుతుండగా, అతని కారును వెనుక నుంచి మోటార్ సైకిల్ ఢీకొట్టింది. అతను మద్యం సేవించి ఉండటంతో నియంత్రణ కోల్పోయి కారును ఢీకెట్టాడు. ఫలితంగా అతని తలకు గాయం అయింది. ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు సహాయం కోసం ఆగారు. వారిలో షంషేర్ కూడా ఉన్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో మరొక వ్యక్తి గాయపడిన బైకర్ను తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ముందుకొచ్చాడు. దీంతో అమర్జీత్, షంషేర్ కలిసి గాయపడిన వ్యక్తిని కారులోకి ఎక్కించారు. అనంతరం అక్కడినుంచి షంషేర్ బయలుదేరుతుండగా వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ అతడిని బలంగా ఢీకొట్టింది. దీంతో షంషేర్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. దీంతో అమర్జీత్ ఆ వాహనాన్ని వెంబడించి, దాన్ని ఓవర్టేక్ చేయగలిగాడు. కానీ డ్రైవర్ అప్పటికే అక్కడినుంచి పారాపోయాడు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్పై కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారి చెప్పారు. అలాగే షంషేర్ సాయం చేసిన బైకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాదని ద్వారకా నార్త్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. -
సొరంగ బాధితులకు భారీ ఉపశమనం.. రెండు రోజుల్లో బయటకు..
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో గల సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ వేగంగా జరుగుతోంది. ఆరు అంగుళాల పైప్లైన్ ద్వారా కూలీలకు ఆహార పదార్థాలు, మందులను పంపిణీ చేస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న బాధితులకు లోపల రెండు కిలోమీటర్ల మేర సురక్షిత ప్రాంతం ఉంది. మరో రెండు రోజుల్లో కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువస్తామని రెస్క్యూ నిర్వహిస్తున్న అధికారులు చెబుతున్నారు. బార్కోట్ ఎండ్ నుండి రెస్క్యూ టన్నెల్ నిర్మాణాన్ని టీహెచ్డీసీ ప్రారంభించిందని, ఇందులో ఇప్పటికే రెండు పేలుళ్లు జరిగాయని, ఫలితంగా 6.4 మీటర్ల డ్రిఫ్ట్ ఏర్పడిందని జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఐడిసిఎల్) ఎండీ మహమూద్ అహ్మద్ తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో సంప్రదింపులు జరిపామని, వీడియో ద్వారా వారి పరిస్థితిని తెలుసుకున్నామని ఆయన పేర్కొన్నారు. సొరంగంలో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే తమ లక్ష్యమని ఉత్తరాఖండ్ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ నీరజ్ ఖైర్వాల్ తెలిపారు. అన్ని ఏజెన్సీలు 24 గంటలు సంఘటనా స్థలంలో పని చేస్తున్నాయన్నారు. పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని, రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న అన్ని సంస్థలు/ఏజెన్సీలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. పది కిలోల కిలోల యాపిల్స్, ఆరెంజ్, సీజనల్ పండ్లు, ఐదు డజన్ల అరటిపండ్లను సొరంగం లోపలికి పంపించామన్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితుల ఫొటోలను ఎండోస్కోపిక్ కెమెరా ఎలా తీసింది? -
ఆరోగ్యం కోసం నవవిధ మార్గాలు - చాట్జీపీటీ సలహాలు
ChatGPT For Your Health: ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ప్రతి ప్రశ్నకు సమాధానాలు అందిస్తూ వినియోగదారులను తెగ ఆకర్శించేస్తోంది. ఇప్పటికే మనం చాట్జీపీటీ సాయంతో రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూకు ఎలా సిద్దమవ్వాలనే విషయాలు తెలుసుకున్నాం. ఈ కథనంలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో చాట్జీపీటీ ఎలా సహాయం చేస్తుంది? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. వర్కౌట్ ప్లాన్స్ ఆరోగ్యం అనగానే అందరికి గుర్తొచ్చేది ఫిట్నెస్. కాబట్టి ఫిట్నెస్ విషయంలో మీకు కావలసిన సలహాలను చాట్జీపీటీ ద్వారా పొందవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. మీ ప్రశ్నను బట్టి సమాధానం లభిస్తుంది. మీకు కావలసిన విషయాలను సర్చ్ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే.. సమాధానం వచ్చేస్తుంది. ఇంట్లోనే వ్యాయామం చేసుకోవడానికి టిప్స్, కార్డియో ఫిట్నెస్ కోసం ఎలాంటి ఎక్స్సర్సైజ్ చేయాలి, కేవలం 15 నిమిషాల్లో చేయదగిన బెస్ట్ ఎక్స్సర్సైజ్ ఏంటి అనే విషయాలను గురించి మీరు సులభంగా తెలుసుకోవచ్చు. ఆహారం గురించి ప్లాన్స్ ఆరోగ్యం ప్రధానంగా మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన, రోజూ తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకోవడానికి చాట్జీపీటీ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలామంది బిజీ లైఫ్లో ఏది పడితే అది తినేసి ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాటికి మంగళం పాడటానికి టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు. చాట్జీపీటీ సహాయంతో ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్లాన్స్ రూపొందించుకోవచ్చు. మీ బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకుని మాంసాహారమా? లేక శాఖాహారమా? అనేదానికి సంబంధించి ఒక లిస్ట్ తయారు చేసుకోవడానికి ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. మంచి అలవాట్లు ప్రస్తుతం అనేక టెన్షన్స్ కారణంగా చాలామంది సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. కాబట్టి నేను తప్పకుండా 8 గంటలు నిద్రపోవాలనుకుంటున్నాను, దానికి తగిన సలహాలు ఇవ్వమని చాట్జీపీటీని అడగవచ్చు. మీ ప్రశ్నకు తగిన విధంగా సమాధానం అందిస్తుంది. అది నచ్చితే మీరు పాటించవచ్చు. మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్ మనసు ప్రశాంతంగా ఉండగానే మెడిటేషన్ చాలా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు డబ్బు ఖర్చు చేసి సంబంధిత క్లాసుల్లో చేరటం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ అవసరం లేకుండానే చాట్జీపీటీ మీకు మంచి సలహాలు అందిస్తుంది. మైండ్ఫుల్నెస్ కోసం మంచి ఆలోచనలు చేయడం, ప్రకృతిని ఆస్వాదిస్తూ నడవండం, పుస్తకాలు చదవడం వంటి మరిన్ని సలహాలు ఉచితంగా పొందవచ్చు. జర్నలింగ్ ప్రాంప్ట్ జర్నలింగ్ అనేది మైండ్ఫుల్నెస్ సాధనకు అత్యంత ప్రభావవంతమైన మార్గం. దీని కోసం కూడా చాట్జీపీటీ మంచి సలహాలను అందిస్తుంది. మెడికల్ సింప్టమ్ చెకర్ ఏవైనా ఆరోగ్య లక్షణాలను గుర్తించడం లేదా అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేయడానికి.. ఆ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించడానికి చాట్జీపీటీ వర్చువల్ సింప్టమ్ చెకర్గా ఉపయోగపడుతుంది. చాట్జీపీటీ సలహాలను బట్టి వైద్య సంరక్షణ అవసరమా, లేదా అనేది కూడా మీరు నిరణయించుకోవచ్చు. ఆరోగ్య సలహాలు మీకున్న లక్షణాలను బట్టి కావలసిన వైద్య సలహాలను చాట్జీపీటీ ద్వారా తెలుసుకోవచ్చు. మీ సందేహాలన్నీ అడగవచ్చు, మీ వ్యక్తిగత ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సలహాలను పొందవచ్చు. అపాయింట్మెంట్లు, వైద్య నిపుణులను సంప్రదించాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాలను పొందవచ్చు. మందులను (మెడిసిన్స్) అర్థం చేసుకోవడం మందులను సరిగ్గా ఉపయోగించుకోకపోతే.. చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే మందులను గురించి కూడా చాట్జీపీటీ సాయంతో తెలుసుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ మెడిసిన్ దేనికి పనికొస్తుందో చాట్జీపీటీ చెబుతుంది, కానీ ఎంత మోతాదులో వాడాలో ఖచ్చితంగా డాక్టర్ మాత్రమే చెప్పాలి. దీనిని యూజర్ గుర్తుంచుకోవాలి. మెంటల్ హెల్త్ సపోర్ట్ మనిషి శరీరం మాత్రమే ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ప్రస్తుత కాలంలో మెంటల్ హెల్త్ కోసం పరిష్కారం కనుగొనటం పెద్ద సవాలుగా మారిపోయింది. అయితే చాట్జీపీటీ దీనికి కూడా చక్కని సమాధానాలు అందిస్తుంది. ఇదీ చదవండి 1. రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే! 2. ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి! -
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
దాతలూ దయచూపండి!
సాక్షి, పెద్దపల్లి: హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే కార్మికుడు పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. వైద్యానికి డబ్బు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన నాగపూరి శ్రీనివాస్గౌడ్ నాలుగు నెలల క్రితం హైబీపీతో పక్షవాతానికి గురికాగా, కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. అతడికి భార్య శ్రీలత, ఇద్దరు కూతుర్లు అంజలి, భార్గవి ఉన్నారు. శ్రీనివాస్ పని చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. మంచానికే పరిమితం కావడంతో వైద్యంకోసం కుటుంబసభ్యులు తెలిసినవారి వద్ద రూ.10లక్షల వరకు అప్పు చేసి ఆపరేషన్ చేయించారు. అయినా కోలుకోలేదు. నాలుగు నెలల నుంచి కుటుంబ పోషణ భారం కావడంతో ఇద్దరు ఆడపిల్లలు చదువుకు దూరమయ్యారు. వైద్యానికి దాతలు సాయం చేస్తే కోలుకుంటాడని శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మూత్రపిండాల్లో రాళ్లు తొలగింపునకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని కుటుంబసభ్యులు రోదిస్తూ తెలిపారు. ఆపరేషన్కు రూ.5లక్షలు అవుతాయని, తమ వద్ద చిల్లిగవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు మానవత్వంతో సా యం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. - దాతలు సాయం చేయాల్సిన ఫోన్ పే నంబర్ : 96761 73272 -
భారత్లో ఇరాన్ జంట కష్టాలు.. ఆదుకున్న ఎస్పీ నేత!
సైకిల్ యాత్రపై భారత్కు వచ్చిన ఇరాన్ దంపతులను తిరిగి వారి దేశానికి తిరిగి పంపేందుకు యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆర్థిక సాయం అందించారు. ఈ ఇరాన్ దంపతులు ప్రపంచ శాంతి సందేశాన్ని ఇస్తూ, సైకిల్పై భారతదేశానికి వచ్చారు. సోషల్ మీడియా ప్లాట్పారం ఎక్స్లో అఖిలేష్ యాదవ్ ఈ వివరాలను తెలియజేస్తూ మానవత్వం కంటే గొప్ప మతం లేదని, సహాయానికి మించిన ఆరాధన లేదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా ఇరాన్ నుంచి వచ్చి, మన దేశంలో చిక్కుకుపోయిన ఈ అతిథుల కోసం ఏదో ఒకటి చేయడమనేది తన అదృష్టం అని అఖిలేష్ అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా.. ఈ జంట తిరుగు ప్రయాణపు టికెట్ రద్దయింది. వారి దగ్గర డబ్బలు కూడా లేవు. ఈ విషయాన్ని పార్టీ నేత ఒకరు అఖిలేష్ యాదవ్కు తెలియజేశారు. దీంతో ఈ జంటకు అఖిలేష్ సాయం అందించారు. ఈ జంటను వారి దేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇది కూడా చదవండి: గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ కన్నుమూత! इंसानियत से बड़ा धर्म और मदद से बड़ी इबादत कोई और नहीं, कुछ और नहीं। जंग के हालातों की वजह से, ईरान से आकर हमारे देश में फँसे इन मेहमानों की देश वापसी में हम कुछ कर पा रहे हैं, ये हमारी ख़ुशक़िस्मती है। देश की छवि दुनिया में सिर्फ़ कहने से नहीं, कुछ अच्छा करने से बनती है। pic.twitter.com/RtvlRmhaci — Akhilesh Yadav (@yadavakhilesh) October 27, 2023 -
ఈ పోలీస్ మాములోడు కాదు.. పాముకు సీపీఆర్
మధ్యప్రదేశ్లోని నర్మదాపురంనకు చెందిన ఒక వీడియో వైరల్గా మారింది. ఒక పోలీసు కానిస్టేబుల్ తన నోటి ద్వారా పాముకు ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నిం చేశారు. ఈ విధంగా పాముకి సీపీఆర్ ఇచ్చేందుకు ప్రయత్నించడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. సెమ్రీ హర్చంద్లోని తవా కాలనీలో పాము ఉన్నట్లు పోలీసు కానిస్టేబుల్ అతుల్ శర్మకు సమాచారం అందింది. అతుల్ 2008 నుండి ఇప్పటి వరకూ 500 పాములను రక్షించారు. డిస్కవరీ ఛానెల్ చూసి, పాములను ఎలా రక్షించాలో అతుల్ నేర్చుకున్నారు. తాజా ఘటనలో నీటి పైపులైన్లో పాము ఉందని తెలుసుకున్న అతుల్ శర్మ దానిని బయటకు తెచ్చేందుకు పురుగుమందును నీటిలో కలిపి పైపులైన్లో వేయగా, ఆ పాము అపస్మారక స్థితికి చేరుకుంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో ఒక పాము అపస్మారక స్థితిలో ఉండటం, దానికి పోలీసు కానిస్టేబుల్ సీపీఆర్ ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను చాలా మంది షేర్ చేశారు. మరోవైపు ఈ వీడియో చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో మరికొందరు ఆ పోలీసు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం? #MadhyaPradesh : ज़हरीले सांप की जान बचाने के लिए पुलिस वाले ने दिया CPR, VIDEO देख हैरत में पड़े लोग#CPR #SnakeRescue pic.twitter.com/FK8Xft2Myr — NDTV India (@ndtvindia) October 26, 2023 -
అత్యాచార బాధితురాలిపై శివరాజ్ సర్కార్ నిర్లక్ష్యం
ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో నెల రోజుల క్రితం అత్యాచారానికి గురై, రక్తంతో తడిసిన దుస్తులతో రోడ్డుపై తిరుగుతూ, తనను కాపాడాలంటూ పలువురి ఇంటి తలుపులు తట్టిన యువతి ఉదంతం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉజ్జయిని పోలీసులు రంగంలోకి దిగి యువతిపై అత్యాచారం చేసిన నిందితుడిని, అతనికి సహాయం అందించిన వ్యక్తిని పట్టుకున్నారు. అయినా న్యాయం ఆమెకు అందనంత దూరంలో ఉంది. ఈ ఘటన తర్వాత శివరాజ్ సర్కార్ బాధితురాలిని ఆదుకుంటామని పలు వాగ్దానాలు చేసింది. ఇప్పుడు బాధితురాలు తన ఇంటిలోనే ఉంది. ఆరోగ్యం కూడా మెరుగుపడింది. అయితే ప్రభుత్వ వాగ్దానాలు ఇప్పటికీ నెరవేరలేదు. తాజాగా ఒక మీడియా బృందం ఉజ్జయినికి 700 కిలోమీటర్ల దూరంలోని బాధితురాలి ఇంటికి వెళ్లి, అక్కడి పరిస్థితులు పరిశీలించనప్పుడు అనేక విషయాలు వెలుగు చూశాయి. ఈ ఘటన సెప్టెంబర్ 25న చోటుచేసుకుంది. ఉజ్జయినిలో ఒక ఆటోడ్రైవర్ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు దీనంగా తనను కాపాడాలంటూ కనిపించినవారినందరినీ వేడుకుంది. ఒక సన్యాసి ఆమెకు సహాయం అందించాడు. అనంతరం బాధితురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితురాలు అక్టోబర్ 12న తన ఇంటికి చేరుకుంది. నెల రోజులు దాటినా బాధితురాలికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. బాధితురాలు కుటుంబ సభ్యులతో కలసి ఒక పూరిగుడిసెలో నివసిస్తోంది. భయంభయంగానే కాలం వెళ్లదీస్తోంది. బాధితురాలి ఇంట్లో ఇప్పటికీ మట్టి పొయ్యినే వినియోగిస్తున్నారు. తాగునీటి కోసం 300 మీటర్ల దూరంలోని కుళాయి వద్దకు కుటుంబ సభ్యులు వెళ్లాల్సి వస్తుంటుంది. బాధితురాలు షెడ్యూల్డ్ కులానికి చెందినది. బాధితురాలి సోదరుడు మాట్లాడుతూ తాము తక్కువ కులానికి చెందిన వారమని, తమ మాట వినేవారే లేరని వాపోయాడు. బాధితురాలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రాంత బీజేపీ నేత సురేంద్ర సింగ్ గరేవార్ వారి ఇంటికి వచ్చి, రేషన్ సరుకుల కోసమంటూ రూ. 1500 రూపాయలు ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం నుండి తమకు నెలకు రూ. 600 చొప్పున సామాజిక న్యాయ పింఛను అందుతుందని బాధిత కుటుంబం తెలిపింది. నెల రోజుల క్రితం చావుబతుకుల మధ్య పోరాడిన బాధితురాలు ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత -
భారత్ నుంచి గాజాకు 38 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలు!
ఇజ్రాయెల్ దాడులకు తీవ్రంగా నష్టపోయిన గాజాకు 35 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలను భారత్ అందించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ‘పాలస్తీనాతో సహా మధ్యప్రాచ్యంలో పరిస్థితి’ అనే అంశంపై జరిగిన చర్చలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ నేషన్ డిప్యూటీ పర్మినెంట్ రిప్రజెంటివ్(డీపీఆర్) ఆర్ రవీంద్ర మాట్లాడారు. ఇజ్రాయెల్ నుంచి ప్రతీకారాన్ని ఎదుర్కొంటున్న గాజా స్ట్రిప్కు భారతదేశం అండగా నిలుస్తుందన్నారు. భారత్ తరపున 38 టన్నుల ఆహార పదార్థాలు, ముఖ్యమైన వైద్య పరికరాలను గాజాకు పంపినట్లు తెలిపారు. గాజాలో శాంతి నెలకొల్పేందుకు అవసరమైన పరిస్థితులను సృష్టించాలని, ప్రత్యక్ష సంభాషణల పునరుద్ధరణకు కృషి చేయాలని ఆయా దేశాలను కోరుతున్నామన్నారు. అక్టోబరు 7న హమాస్ దాడి అనంతరం ఇజ్రాయెల్.. గాజాపై బాంబు దాడులను కొనసాగించింది. ఈ నేపధ్యంలో గాజాలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ఉగ్ర దాడిని భారతదేశం నిర్ద్వంద్వంగా ఖండించిందని రవీంద్ర తెలిపారు. గాజాలో జరిగిన ప్రాణనష్టంపై తొలుత సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రపంచ నేతలో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో వందలాది మంది పౌరులు మరణించారని, గాజాలోని అల్ హాలీ ఆసుపత్రిలో విషాదకర వాతావరణం నెలకొన్నదన్నారు. బాధిత కుటుంబాలకు భారత్ తరపున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నామని, బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: స్కై బస్సు సర్వీస్ అంటే ఏమిటి? రవాణాలో ఎంత సౌలభ్యం? -
‘అగ్నివీర్’ అమరుడైతే ఆర్థిక సాయం అందదా? ఇండియన్ ఆర్మీ ఏమంటోంది?
ఇండియన్ ఆర్మీలో ‘అగ్నిపథ్’ పథకం ప్రారంభమైనప్పటి నుంచి విమర్శలకు గురవుతూనే ఉంది. కేవలం నాలుగేళ్ల పరిమితితో సైన్యంలో చేరిన అగ్నివీరుడు అమరుడైతే ఆర్థిక సాయం అందిస్తారా? అనే అంశంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఇటీవల ఒక సైనికుడు మరణించిన నేపధ్యంలో అతనిని ‘అమరవీరుడు’గా గుర్తించలేదు. అలాగే ఆర్మీ తరపున తగిన గౌరవం అందించలేదు. దీనిపై విమర్శలు చెలరేగడంతో సైనికాధికారులు సమాధానమిస్తూ ఆ సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అయితే సియాచిన్లో విధులు నిర్వహిస్తున్న అగ్నివీర్ అక్షయ్ లక్ష్మణ్ గవాటే వీరమరణం పొందారు. లక్ష్మణ్ ‘అగ్నివీరుడు’ కావడంతో అతని కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయరా? అంటూ ప్రతిపక్షం ఇండియన్ ఆర్మీకి సవాల్ విసిరింది. ఈ ఆరోపణలపై భారత సైన్యం స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఆర్మీ ఒక ప్రకటనలో ‘అగ్నివీర్’ స్కీమ్ కింద రిక్రూట్ అయిన సైనికుడు అమరుడైన సందర్భంలో అందించే ఆర్థిక సహాయంపై సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే వాదనలు జరుగుతున్నాయి. అందుకే దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. అగ్నివీర్ యోజన కింద రిక్రూట్ అయిన సైనికులకు అందించే ప్రయోజనాలివే.. రూ. 48 లక్షల జీవిత బీమా సేవా నిధి సొమ్ము. ఇందులో అగ్నివీర్ జీతం నుంచి 30 శాతం జమ అవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వం దానికి జత చేరుస్తుంది. ఈ డబ్బుపై వడ్డీని కూడా అందిస్తారు. రూ. 44 లక్షల ఆర్థిక సహాయం మిగిలిన సర్వీస్ జీతం.. ఇటువంటి సందర్భంలో రూ. 13 లక్షలకు మించి అందిస్తారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్ నుండి రూ.8 లక్షల సహాయం. ఏడబ్ల్యుడబ్ల్యు నుండి రూ.30 వేలు సత్వర సహాయం అగ్నివీర్ అమరవీరుడైతే సుమారు రూ. ఒక కోటి రూపాయల ఆర్థిక సహాయం అతని కుటుంబానికి అందుతుంది. సేవా నిధి రూపంలో వచ్చిన డబ్బుపై పన్ను ఉండదు. ఒక అగ్నివీర్ జవాన్ విధులలో లేని సమయంలో మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 48 లక్షల బీమా, మరణించిన తేదీ వరకు లెక్కించిన సేవా నిధి సొమ్ము, కార్పస్ ఫండ్ సొమ్ము అందిస్తారు. ఇది కూడా చదవండి: లాక్డౌన్ దిశగా ఢిల్లీ? స్కూళ్ల మూసివేత? వర్క్ ఫ్రమ్ హోమ్కు ఆదేశాలు? #Agniveer (Operator) Gawate Akshay Laxman laid down his life in the line of duty in #Siachen. #IndianArmy stands firm with the bereaved family in this hour of grief. In view of conflicting messages on social media regarding financial assistance to the Next of Kin of the… pic.twitter.com/46SVfMbcjl — ADG PI - INDIAN ARMY (@adgpi) October 22, 2023 -
సీఎం జగన్ సార్.. మా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారు! : బాధితురాలు లక్ష్మి
సాక్షి, అనంతపురం: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న భర్త పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి వరకూ గడప దాటి ఎరుగని ఇల్లాలిపై ఇద్దరు చిన్న పిల్లల పోషణ భారం పడింది. దిక్కుతోచని పరిస్థితి. అయినా బిడ్డల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బతుకు పోరాటాన్ని సాగిస్తూ వచ్చింది. అయినా విధి ఆమె పట్ల వక్రీకరించింది. ఏడేళ్ల వయసున్న చిన్న కుమారుడు క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డాడు. తన వద్ద ఉన్న ఆస్తి మొత్తం అమ్మినా.. చికిత్సకు అవసరమైన డబ్బు సమకూరదు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి స్పందించారు. చిన్నారి అంశాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రూ.14 లక్షల ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని ఆదివారం బాధిత కుటుంబానికి విప్ అందజేసినప్పుడు నిస్సహాయురాలైన ఆ తల్లి భావోద్వేగానికి లోనైంది. ఆ వేదన ఆమె మాటల్లోనే... చిన్న వయసులోనే పిల్లల తండ్రి పోయాడు.. నా పేరు వడ్డే లక్ష్మి. రాయదుర్గంలోని పదో వార్డులో నివాసముంటున్న వడ్డే లోకేష్తో నాకు వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. పెద్దొడు చిన్మయ్ 8వ తరగతి, చిన్నోడు లక్షిత్ 3వ తరగతి చదువుకుంటున్నారు. వీరిద్దరూ చిరుప్రాయంలో ఉన్నప్పుడే నా భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ పరిస్థితుల్లో నాకు దిక్కు తోచలేదు. ఇద్దరు చిన్న పిల్లలను పట్టుకుని ఎలా బతకాలో అర్థం కాలేదు. అయినా పిల్లలిద్దరినీ ప్రయోజకులను చేయాలనే ఆశ నన్ను బతుకు పోరాటం సాగించేలా చేసింది. రూ.20 లక్షలు అవుతుందన్నారు.. మా చిన్నోడు లక్షిత్ ఒక రోజు స్కూల్ నుంచి వస్తూ సొమ్మసిల్లి పోయాడు. ఏమైందోనని చాలా భయపడ్డాను. ఆస్పత్రికి తీసుకెళ్లా. పరీక్షించిన వైద్యులు అదేదో క్యాన్సర్ జబ్బు సోకిందన్నారు. నాకేమీ అర్థం కాలేదు. హైదరాబాద్లోని అమెరికన్ సిటిజన్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అతి కష్టంపై పిల్లాడిని తీసుకుని హైదరాబాద్కు వెళ్లా. ఆస్పత్రిలో పరీక్షించిన డాక్టర్లు పిల్లాడికి బోన్మ్యారో చికిత్స చేయాలని, ఇందు కోసం రూ.20 లక్షలు ఖర్చు అవుతుందంటూ ఓ లెటర్ చేతికి ఇచ్చారు. ఆలస్యం చేస్తే పిల్లాడి ప్రాణాలకు ముప్పు తప్పదన్నారు. ఆ సమయంలో అంత డబ్బు ఎలా తీసుకురావాలో అర్థం కాక నాలో నేను ఎంతగా ఏడ్చానో ఆ దేవుడికే తెలుసు. దేవుడిలా మా బాధను అర్థం చేసుకున్నారు.. హైదరాబాద్ నుంచి తిరిగొచ్చిన నేను నెల రోజుల క్రితం మా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సార్ను కలిసేందుకు ఆయన ఇంటి వద్దకెళ్లా. అప్పటికే ఇంటి వద్ద చాలా మంది ఉన్నారు. కాసేపటి తర్వాత సార్ నన్ను చూసి ఆగారు. వెంటనే నేనెళ్లి బిడ్డ పరిస్థితి తెలిపి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకున్నా. గొప్ప మనసుతో ఆయన మా బాధను అర్థం చేసుకున్నారు. విషయాన్ని సీఎం జగనన్న దృష్టికి తీసుకెళ్లారు. దేవుడిలా మమ్మల్ని ఆదుకున్నారు. వైద్యం కోసం రూ.14 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత ఆస్పత్రికి ఉత్తర్వులు పంపారని, నేరుగా అక్కడికెళ్లి పిల్లాడికి చికిత్స చేయించుకుని రమ్మని మా ఎమ్మెల్యే సార్ ధైర్యం చెప్పారు (ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ). లెటర్ కూడా నా చేతికి ఇచ్చారు. మాకు నిజమైన దసరా ఈ రోజే వచ్చింది. నా కుమారుడికి ప్రాణభిక్ష పెట్టిన సీఎం జగనన్న, విప్ కాపు రామచంద్రారెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. చిన్మయ్కు అభినందన.. సీఎం కార్యాలయం నుంచి అందిన లెటర్ ఆఫ్ క్రెడిట్ పత్రాన్ని ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబానికి విప్ కాపు రామచంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే గొప్ప మనసున్న సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. సమస్యను వివరించగానే రూ.14 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేయించారన్నారు. అంతేకాక బాధితుడికి అవసరమైన బోన్మ్యారో ఇవ్వడానికి ముందుకు వచ్చిన సోదరుడు చిన్మయ్ని అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు ఏటూరి మహేష్ పాల్గొన్నారు. -
అభాగ్యులకు ఆపన్నహస్తం
కర్నూలు(సెంట్రల్): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభాగ్యులకు ఆపన్నహస్తం అందించారు. గురువారం ఎమ్మిగనూరుకు వచ్చిన ఆయనను పలువురు కలిసి తమ బాధలు చెప్పుకోవడంతో సీఎం చలించిపోయారు. తక్షణ సాయం చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.సృజనకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఆమె తన కార్యాలయంలో ఆరుగురు బాధితులకు రూ.లక్ష చొప్పున సాయం అందించారు. అలాగే సీఎంను ఉద్యోగాలు అడిగిన వారికి ఉపాధి కల్పన అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన బాధితుల వివరాలు ♦ కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన యు.అశోక్ ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ♦ గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడి గ్రామానికి చెందిన కురువ రాజు కుమార్తె అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ♦ ఎమ్మిగనూరుకు చెందిన షేక్ రేష్మకు బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా రెండు కళ్లు కోల్పోయింది. ♦ ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామానికి చెందిన బి.భాస్కర్ కుడి కాలు ఆపరేషన్ చేయించుకుని ఆరి్థకంగా చితికిపోయారు. ♦ గోనెగండ్ల మండలం పెద్దమరివీడు గ్రామానికి చెందిన డి.ఖాజావలి ఆరేళ్లుగా కిడ్నీ, యూరిన్ బ్లాడర్ సమస్యతో బాధపడుతున్నారు. ♦ ఎమ్మిగనూరుకు చెందిన గొల్ల లక్ష్మన్న కుమార్తె శ్రావణి మానసిక జబ్బుతో బాధపడుతోంది. -
దయచేసి.. మా కుమారుడిని కాపాడండి!
ఖమ్మం: మెదడులో నీరు చేరడంతో అనారోగ్యం పాలైన ఓ విద్యార్థి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. బ్రెయిన్కు సర్జరీ చేస్తేనే బతుకుతాడని వైద్యులు సూచించడంతో కన్నీరుమున్నీరవుతున్న ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం వేచిచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని గాదెపాడు గ్రామానికి చెందిన భూక్యా సంతు, ప్రమీల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడైన భూక్యా హర్షిత్ కారేపల్లిలోని మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. కాగా మూడేళ్ల కిందట హర్షిత్కు జ్వరం రావడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చూపించగా.. చిన్నారి బ్రెయిన్లో నీరు చేరిందని అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని రెయిన్బో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో హర్షిత్కు రెండుసార్లు బ్రెయిన్ సర్జరీ జరిగి కోలుకుంటున్న క్రమంలో ఇటీవల తిరిగి అనారోగ్యానికి గురికావడంతో రెయిన్బోకు తీసుకొచ్చారు. చికిత్స అనంతరం మరోసారి బ్రెయిన్ సర్జరీ చేయాలని, సుమారు రూ.7 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యు లు తెలపడంతో ఇప్పటికే ఇల్లు, వాకిలి అమ్ముకోవడంతో పాటు స్నేహితుల సహకారంతో రూ.12 లక్షల వరకు ఖర్చుచేశామని వాపోయారు. ఇదిలా ఉండగా హర్షిత్ తండ్రి సంతుకు 2021వ సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు గాయమై బ్రెయిన్ సర్జరీ కావడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలతో రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించింది. తమ కుమారుడి ప్రాణాలైనా కాపాడుకుందామని, దాతలు సహకరించాలని హర్షిత్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. చదవండి: బ్యాంకుల వద్ద మఫ్టీలో ఉండి మరీ అరాచకం..! ఒక్కసారిగా ఇలా.. -
అమెరికా అంతరిక్ష ప్రయోగాలలో హిట్లర్ సన్నిహితుడు? 1969లో ఏం జరిగింది?
అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే సూపర్ పవర్ హోదాతో వెలుగొందుతోంది. దీని వెనుక పలువురి సహకారం ఉంది. వీరిలో కొందరు అమెరికన్లు, మరికొందరు ఇతర దేశాల పౌరులు ఉన్నారు. ఈ సహకారం నేపధ్యంలో ఇతర దేశాల వారు అమెరికన్లుగా మారడం విశేషం. అంతరిక్షంలో అమెరికా సాధించిన విజయం వెనుక మరో దేశానికి చెందిన శాస్త్రవేత్తలు కూడా ఉన్నరని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా ఒకప్పుడు అమెరికాకు బద్ధ శత్రువుగా ఉన్న జర్మనీకి చెందిన శాస్త్రవేత్త అమెరికా అంతరిక్ష విజయానికి సహకరించారని తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. చంద్రుడి ఉపరితలంపైకి మనుషులను తీసుకువెళ్లడంలో అమెరికాకు హిట్లర్కు అత్యంత సన్నిహితుడైన శాస్త్రవేత్త సహకరించారు. ఈ ప్రయోగం నేపధ్యంలో నాసా ఖ్యాతిని సదరు శాస్త్రవేత్త ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు. ఈ నేపధ్యంలో ఆ శాస్త్రవేత్తకు అమెరికా.. స్థానిక పౌరసత్వం ఇవ్వడంతోపాటు, భారీగా నగదు బహమానం కూడా అందించింది. ఆ శాస్త్రవేత్త పేరు వెర్నెర్ వాన్ బ్రాన్. ఇతను జర్మనీలోని ధనిక కుటుంబంలో జన్మించాడు. అంతరిక్షంపై అతనికున్న అభిరుచి ఈ రంగంలో అతను మరింత ఎదిగేలా చేసింది. వెర్నెర్ వాన్ బ్రాన్కు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతనికి అంతరిక్షంపై అభిరుచి ఏర్పడింది. బ్రాన్ పుట్టినరోజున అతని తల్లి టెలిస్కోప్ కానుకగా ఇచ్చింది. అది మొదలు బ్రాన్కు ఆకాశంలో ఏముందో చూడాలనే కోరిక మొదలయ్యింది. బ్రాన్ తన 17 ఏళ్ల వయస్సులో బెర్లిన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకున్నాడు. తరువాత తన 18 ఏళ్ల వయసులో జర్మన్ రాకెట్ సొసైటీలో ప్రవేశం పొందాడు. ఈ నేపధ్యంలోనే ద్రవ-ఇంధన రాకెట్ నిర్మాణాన్ని తన లక్ష్యంగా చేసుకున్నాడు. అదే సమయంలో అతనికి హిట్లర్తో అతని సాన్నిహిత్యం ఏర్పడింది. హిట్లర్కు అత్యంత ఇష్టమైన వ్యక్తులలో ఒకనిగా మారాడు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో జర్మనీ అన్ని రంగాలలో ఓటమిని ఎదుర్కొంది. ఈ తరుణంలో హిట్లర్ సన్నిహితులకు ఆశ్రయం కల్పించాలని అమెరికా భావించింది. ఈ నేపధ్యంలోనే అమెరికా ‘ఆపరేషన్ పేపర్క్లిప్’ అనే ఆపరేషన్ చేపట్టింది. అప్పుడే బ్రాన్తో పాటు ఇతర జర్మన్ శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో అమెరికా చేరుకున్నారు. ఈ శాస్త్రవేత్తల బృందం 1946 ఏప్రిల్ 16న అమెరికాలో తొలి క్షిపణి పరీక్ష వీ-2ను చేపట్టింది. ఇది అమెరికా అంతరిక్ష యాత్రను కొత్త ఎత్తులకు తీసుకువెళ్లింది. దీని తర్వాత 1955లో అమెరికా ‘నాసా’ను స్థాపించినప్పుడు, బ్రాన్ను అమెరికా అక్కడకు పంపింది. 1969, జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి ఉపరితలంపైకి చేరుకున్నాడు. ఈ ప్రయోగంలో వెర్నెర్ వాన్ బ్రాన్ సేవలు మరువలేనివి. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ నీలి నక్షత్రం రహస్యం ఏమిటి? -
పారిపోను.. సాయం చేస్తా
శత్రు దేశాలు, ఉగ్రమూకలు, తీవ్రవాదులు విరుచుకుపడినప్పుడు ఎంత శక్తిమంతమైన దేశమైనా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఆ మధ్యన అప్ఘానిస్థాన్ పరిస్థితి ఇలానే ఉండేది. అది మర్చిపోయే లోపు ఉక్రేయిన్ రష్యా యుద్ధం మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది. అప్ఘానిస్థాన్, ఉక్రెయిన్లలో ఏర్పడిన పరిస్థితులకు భయపడిపోయిన చాలామంది ప్రజలు ప్రాణాలు అరచేత బట్టి దేశం విడిచి పారిపోయారు. ఇక ఆయా దేశాల్లో ఉన్న విదేశీయులు ముందుగానే పెట్టే బేడా సర్దుకుని తమ తమ దేశాలకు పరుగెత్తుకెళ్లారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అయినా అక్కడ నివసిస్తోన్న 41 ఏళ్ల ప్రమీలా ప్రభు మాత్రం ‘‘నేను ఇండియా రాను. ఇక్కడే ఉండి సేవలందిస్తాను’’ అని ధైర్యంగా చెబుతోంది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా.. హెర్గాలో పుట్టి పెరిగింది ప్రమీలా ప్రభు. మైసూర్లో చదువుకుంది. చదువు పూర్తయ్యాక ఉడిపిలోని మణిపాల్ ఆసుపత్రిలో నర్స్గా చేరింది. కొన్నాళ్లు ఇక్కడ పనిచేశాక, ఇజ్రాయేల్లో మంచి జీతంతో ఉద్యోగం దొరకడంతో.. తన ఇద్దరు పిల్లలతో ఇజ్రాయెల్కు వెళ్లింది. గత ఆరేళ్లుగా అక్కడే ఉంటోన్న ప్రమీలా ఆ దేశం మీద అక్కడి ప్రజల మీద మమకారం పెంచుకుంది. అందుకే పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ ... ‘‘ఇండియా నాకు జన్మనిస్తే.. ఇజ్రాయెల్ జీవితాన్నిచ్చింది. ఇలాంటి కష్టసమయంలో దేశాన్ని వదిలి రాను. నేను చేయగలిగిన సాయం చేస్తాను’’ అని కరాఖండిగా చెబుతూ అక్కడి పరిస్థితులను ఇలా వివరించింది.... నేను టెల్ అవీవ్ యాఫోలో నివసిస్తున్నాను. అక్టోబర్ 7తేదీన∙రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో భోజనం చేశాము. అప్పుడు ఎమర్జెన్సీ సైరన్ వినిపించింది. వెంటనే మేమంతా బంకర్లోకి వెళ్లిపోయాము. దాదాపు రాత్రంతా సైరన్ వినిపిస్తూనే ఉంది. నేను ఇజ్రాయెల్ వచ్చాక ఇంతపెద్ద హింసను ఎప్పుడూ చూడలేదు. మా ఇంటికి కిలోమీటర్ దూరంలో బాంబులు పడుతున్నాయి. పెద్దపెద్ద శబ్దాలు ఒక్కసారిగా భయపెట్టేశాయి. ఇక్కడ ప్రతి ఇంటికి బంకర్లు ఉన్నాయి. పబ్లిక్ ప్లేసుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బంకర్లు కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ సమయంలో ఎవరైనా వీటిలోకి వెళ్లి తలదాచుకోవచ్చు. సైరన్ మోగిన వెంటనే కనీసం ముప్ఫైసెకన్లపాటు బాంబుల శబ్దాలు వినపడుతున్నాయి. దశాబ్దకాలంగా ఇజ్రాయెల్పై తీవ్రవాద సంస్థ హమాస్ దాడులకు తెగబడుతూనే ఉంది. హమాస్ వల్ల గాజా కూడా దాడులతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. ఇప్పటికే వెయ్యిమందికిపైగా చనిపోయారు. ఇక్కడి ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. టెల్ అవీవ్లో షాపులు అన్నీ మూసేసారు. వీధుల్లో అక్కడక్కడ ఒకరిద్దరు మాత్రమే విక్రయాలు జరుపుతున్నారు. అందరూ కిరాణా సామాన్లు తెచ్చుకుని నిల్వ చేసుకుంటున్నారు. అరగంట లోపలే... మా చెల్లి ప్రవీణ జెరుసలేంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. నేను టెల్ అవీవ్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాను. ఈ అపార్ట్మెంట్లో ముఫ్పైమంది వరకు ఉన్నారు. మేమంతా అత్యవసరమైన ఆహారం, నీళ్లు, టార్చ్లైట్ వంటివాటిని దగ్గర ఉంచుకుని బేస్మెంట్ తలుపులు లె రుచుకుని ...సైరన్ రాగానే బంకర్లోకి పరుగెడుతున్నాం. సైరన్ ఆగినప్పుడు బంకర్ల నుంచి బయటకు వస్తున్నాం. బంకర్లోకి వెళ్లిన ప్రతిసారి అరగంట పాటు లోపలే ఉండాల్సి వస్తోంది. ఊహకందని దాడి ఇజ్రాయెల్మీద పాలస్తీనా దాడులు చేయడం ఇది కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు జరిగిన దాడి అస్సలు ఊహించలేదు. ఊహకందని వికృతదాడికి హమాస్ సంస్థ పాల్పడింది. దక్షిణ ఇజ్రాయెల్లో శాంతికోసం ఏర్పాటు చేసిన ‘మ్యూజిక్ ఫెస్టివల్’ను ఇలా అశాంతిగా మారుస్తారని అసలు ఊహించలేదు. ఆ ఫెస్టివల్ గురించి అత్యంత బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ ఎప్పుడూ.. యుద్ధానికి అన్నిరకాలా సన్నద్ధమై ఉండి, రక్షణాత్మక చర్యలను పర్యవేక్షిస్తుంటుంది. లేదంటే మరింతమంది హమాస్ దాడుల్లోప్రాణాలు కోల్పోయేవారు. ఇప్పుడు రాలేను.. ఇజ్రాయెల్ నాకు జీవితాన్నిచ్చింది. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నా మాతృదేశం వచ్చి సంతోషంగా ఉండలేను. ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతిస్తే నా సేవలు అందించడానికి సిద్ధ్దంగా ఉన్నాను. ఉడిపిలో ఉన్న మా కుటుంబ సభ్యులు పదేపదే ఫోన్ చేస్తున్నారు. నేను క్షేమంగా ఉన్నానా... లేదా... అని కంగారు పడుతున్నారు. ఇక నా పిల్లలు ఇండియా వెళ్లిపోయారు. వారిని విడిచి ఇక్కడ ఉన్నాను. వాళ్లంతా గుర్తొస్తున్నారు. అయినా ఇంతటి విపత్కర పరిస్థితుల నుంచి పారిపోవాలనుకోవడం లేదు. పరిస్థితులు చక్కబడిన తరువాత ఇండియా తిరిగి రావడం గురించి ఆలోచిస్తాను’’ అని చెబుతూ ఎంతోమంది స్ఫూర్తిగా నిలుస్తోంది ప్రమీలా ప్రభు. -
చిన్నారికి పెద్ద కష్టం
ఆత్మకూరురూరల్(మర్రిపాడు) : మర్రిపాడు మండలం పడమటినాయుడుపల్లి గ్రామానికి చెందిన రమేష్, రత్నమ్మ దంపతులకు మూడేళ్ల బిందుశ్రీ కుమార్తె సంతానం. కాగా వీరు నెల రోజుల క్రితం వైఎస్సార్ జిల్లా మైదుకూరు వద్ద వ్యక్తిగత పనులపై వెళ్లినప్పుడు ఆటోలో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులకు స్వల్పగాయాలు కాగా బిందుశ్రీకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడి డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం చైన్నె ఆపోలో ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. కాగా చిన్నారికి మెదడుకు సంబంధించి రక్తనాళాలు చిట్లిపోయాయని, ఆపరేషన్ చేయాలని సూచించారు. నిరుపేదలైన తల్లిదండ్రులు తెలిసిన వారి వద్ద అప్పుచేసి రూ.20 లక్షలకుపైగా చిన్నారి వైద్యం కోసం ఖర్చు చేశారు. అయినప్పటికీ మరో రూ.12 లక్షలు చిన్నారి శస్త్రచికిత్సకు అవసరమని, దాతలు సాయం చేయాలని కోరుతున్నారు. సాయం చేయాలనుకుంటే సంప్రదించాల్సిన నంబర్ – 70956 56091 -
పేద వృద్ధురాలు పట్ల సితార తీరు.. నెటిజన్స్ ఫిదా!
సూపర్ స్టార్ మహేశ్ బాబు రీల్ హీరోనే కాదు రియల్ హీరో కూడా. చాలా మంది పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించి ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నాడు. తండ్రికి తగ్గట్లే పిల్లలు అన్నట్లుగా.. మహేశ్ కొడుకు, కూతురు కూడా సామాజిక సేవలో ముందుంటారు. ముఖ్యంగా సితార అయితే తన వయసుకు మించిన సహాయాన్ని అందిస్తూ.. అందరి మనసులు గెలుచుకుంటుంది. పెద్దలు అంటే ఆమెకు ఎనలేని గౌరవం. ధన, పేద అనే తేడా లేకుండా అందరిని గౌరవిస్తుంది. తాజాగా జరిగిన సంఘటననే దానికి ఉదాహారణ. అసలేం జరిగింది? తాజాగా సితార హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి తల్లి నమ్రతతో కలిసి వెళ్లింది. ఈ సందర్భంగా సదరు షాపింగ్ మాల్ యాజమాన్యం పలువురు పేద వృద్ధులకు, మహిళలకు బహుమతులు అందజేశారు. చాలా మంది వృద్ధ మహిళలు ఆ బహుమతులు అందుకోవడానికి వచ్చారు. అయితే ఓ వృద్ధురాలు మాత్రం స్టేజ్ పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడింది. ఇది గమనించిన సితార.. వెంటనే స్టేజ్ పై నుంచి దిగొచ్చి.. ఆమె చేయి పట్టుకొని వేదికపైకి తీసుకెళ్లింది. అనంతరం..అక్కడి వారందరితో ప్రేమగా మాట్లాడింది. సితార మంచి మనసుకు మురిసిపోయిన వృద్ధురాలు.. అపురూపంగా ఆమెను ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ‘తండ్రి లాగే సితారది కూడా మంచి మనసు’అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మహేశ్ బాబు కూతురి ప్రేమ❤️ చూడండి @urstrulyMahesh #Sitara ❤️ pic.twitter.com/VHSSNLlCfp — Nagendra (@mavillanagendra) October 1, 2023 -
అధైర్య పడద్దు...అండగా ఉంటా: సీఎం వైఎస్ జగన్ భరోసా
-
యువతిని కాపాడిన తాడేపల్లి పోలీసులు
తాడేపల్లిరూరల్: స్థానిక పోలీసులకు మరోసారి అభినందనలు వెల్లువెత్తాయి. గురువారం అర్థరాత్రి విజయవాడ రాణిగారి తోటకు చెందిన ఓ యువతి ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడి.. ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై కనకదుర్గ వారధికి వచ్చింది. తాడేపల్లి వచ్చి గుంటూరు రోడ్డులో నుంచి విజయవాడ వెళ్లే వారధి రహదారిలో 26–27 పిల్లర్ల వద్ద బండి పార్క్ చేసి సదరు యువతి కృష్ణా నదిలోకి దూకింది. గమనించిన యువకుడొకరు పోలీసుల కు సమాచారం అందించడంతో అటు విజయవాడ పోలీసులు, ఇటు తాడేపల్లి పోలీసులు కనకదుర్గ వారధి వద్దకు చేరుకున్నారు. మొదటగా తాడేపల్లి ఎస్ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, బీట్ కానిస్టేబుల్ షరీమ్ స్వామిలతో కలసి కృష్ణానదిలోకి వెళ్లారు. కృష్ణానది కనకదుర్గ వారధిపై కొంతమంది సిబ్బందిని పంపి యువతి ద్విచక్రవాహనం ఉన్న ప్రాంతం వద్ద చూడాలని సూచించారు. సుమారు 1.5 కిలోమీటర్లు ఇసుకలో నడుచుకుంటూ వెళ్లి నది నీటిలో అపస్మారక స్థితిలో పడిఉన్న యువతిని గుర్తించారు. ఒడ్డుకు తీసుకు వచ్చి నీటిని కక్కించి, ప్రాథమిక చికిత్స చేశారు. అప్పటికీ ఆ యువతి తేరుకోకపోవడంతో దుప్పటి సాయంతో యువతినిమోసుకుంటూ వారధి వద్దకు తీసుకు వచ్చారు. 108 సిబ్బందిని సిద్ధంగా ఉంచడంతో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యనిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే యువతి ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని డాక్టర్లు చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అర్థరాత్రి యువతిని కాపాడిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. తమ సిబ్బంది సకాలంలో స్పందించి అతి కష్టం మీద యువతిని బయటకు తీసుకు వచ్చి ప్రాణాలు కాపాడారంటూ ప్రశంసించారు. అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చిన యువకుడికి కూడా పోలీస్శాఖ తరుపున అభినందనలు తెలియజేశారు. తాడేపల్లి ఎస్ఐ రమే ష్, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణలను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అడినల్ ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ రాంబాబు, సీఐ శేషగిరిరావు, పెదకాకాని సీఐ సురేష్ బాబులు అభినందించారు. -
బాలికపై పాశవికం.. ఆర్మీ మేజర్ దంపతుల వికృత చేష్టలు
అసోం: ఓ బాలికపై ఆర్మీ మేజర్, ఆయన భార్య వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఇంట్లో పనిచేసే పదహారేళ్ల బాలికను పాశవికంగా వేధింపులకు గురిచేశారు. బాలిక శరీరంపై ఎక్కడ చూసిన కాల్చిన వాతలు కన్పించాయి. పళ్లు ఊడిపోయాయి. ముక్కు, నాలుక భాగాల్లో బలమైన దెబ్బలు కనిపించాయి. ఆ బాలికను దాదాపుగా నగ్నంగా ఉంచుతున్నారని పోలీసులు తెలిపారు. ఇంట్లో పనులు చేయిస్తూనే గత ఆర్నెళ్లుగా వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు తెలిపారు. ఆహారం సరిగా ఇవ్వకుండా బాలికను బక్కచిక్కిపోయేలా చేశారు. ఆహారం కూడా చెత్తకుప్పలో నుంచి ఏరుకుని తినేలా చేసి పాశవిక ఆనందాన్ని పొందినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. నగ్నంగా ఉంచి రక్తం వచ్చేలా కొట్టేవారని వెల్లడించింది. గదిలో బందించి క్రూరంగా హింసించేవారని బాధితురాలు పేర్కొంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్నారు. అసోం నుంచి వెళ్లినప్పుడు ఓ బాలికను ఇంట్లో పనిచేయడానికి తీసుకువెళ్లారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి అసోంకి తిరిగివచ్చిన క్రమంలో బాలిక తన కుటుంబాన్ని కలిసింది. ఈ క్రమంలో విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదహారేళ్ల వయసులో ఉన్న తన కూతురును వృద్ధురాలిగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: అమానవీయం.. రోడ్డుపై అత్యాచార బాధితురాలు, సాయం కోరినా కనికరించని వైనం -
CM Jagan: జగనన్నకు కృతజ్ఞతలు
సాక్షి, కర్నూల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కృష్ణగిరి మండలం ఆలంకొండ వద్ద రూ.253.72 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్న సంగతి తెలిసిందే. అనంతరం తిరుగు ప్రయాణంలో హెలీప్యాడ్ వద్దకు చేరుకునే క్రమంలో.. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న బాధితులు ఆయన్ని కలిశారు. వైద్యచికిత్స నిమిత్తం ఆర్థిక సాయం కావాలని విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలను సీఎం జగన్ ఓపికగా విని వారితో కాసేపు మాట్లాడారు. అయితే.. వాళ్లలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తూనే ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున నలుగురికి రూ.4 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజనని ఆదేశించారు. ఆర్థిక సహాయంతో పాటు మెరుగైన వైద్య సహాయం అంద చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంగళవారం నలుగురు బాధిత కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తన క్యాంపు కార్యాలయంలో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందచేశారు. ఆర్థిక సహాయం అందుకున్న వారు ► కర్నూలు పట్టణం నరసింహారెడ్డి నగర్ కు చెందిన ఎస్.వెంకటేశ్వర గౌడ్, ఉషారాణి దంపతుల 7 నెలల కుమారుడు నివాన్ష్ స్పైనల్ మస్కులార్ డిజార్డర్ (ఎస్ఎమ్ఏ)తో బాధపడుతున్నాడని, వ్యాధి నివారణ కొరకు ఆర్థిక సాయం అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేయగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆర్థిక సాయం నిమిత్తం లక్ష రూపాయలు చెక్ అందచేశారు.. ► కృష్ణగిరి మండలం, పోతుగల్లు గ్రామానికి చెందిన టి.వెంకట రాముడు నాలుగు సంవత్సరాల నుంచి బ్రైన్ స్ట్రోక్, పక్షవాతంతో బాధపడుతున్నాడని అతని కుమారుడు టి.హరికృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట తన సమస్యల్ని విన్నవించుకోగా.. తక్షణ ఆర్థిక సాయంగా లక్ష రూపాయలు అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.. ఆ మేరకు జిల్లా కలెక్టర్ వారికి లక్ష రూపాయలు చెక్ అందచేశారు.. ► కృష్ణగిరి మండలం, పోతుగల్లు గ్రామానికి చెందిన బి.రామ్ ప్రసాద్ ఆరు సంవత్సరాల నుంచి వెన్నపూస సమస్యతో బాధపడుతున్నాడు. అతని అన్న బి.కౌలుట్ల.. తన సమస్యను విన్నవించుకోగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ అతనికి లక్ష రూపాయలు చెక్ అంద చేశారు. ► తుగ్గలి మండలం, చెన్నంపల్లి గ్రామ నివాసి తన తండ్రి ఓ.వెంకటేశ్వర రెడ్డికి డయాలసిస్ చేయించడంతో పాటు అత్యవసరంగా కిడ్నీ అవసరం కావడంతో తన తల్లి కిడ్నీ ఇచ్చి 24వ తేదిన సర్జరీ చేయగా.. జులై 19వ తేది హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో మరణించారని, అందుకు సంబంధించిన బిల్లుల మొత్తాన్ని మంజూరు చేసి సహాయం చేయాలని ఓ.జనార్ధన్ రెడ్డి.. సీఎం జదన్ ఎదుట సమస్యను విన్నవించుకోగా తక్షణ ఆర్థిక సాయంగా లక్ష రూపాయలు చెక్కును కలెక్టర్ అందచేశారు. ఆర్థిక సహాయం అందచేసిన సందర్భంగా నలుగురు బాధితుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు. ఇదీ చదవండి: సీమ నీటి కష్టాలు నాకు తెలుసు: సీఎం జగన్ -
నేడు ‘కాపు నేస్తం’ నాలుగో విడత
సాక్షి, అమరావతి: పార్టీ మేనిఫెస్టోలో లేకున్నా.. ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ కాపు సామాజిక వర్గానికి అండగా నిలుస్తూ వరుసగా నాలుగో ఏడాదీ ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శనివారం జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా నగదు జమ చేయనున్నారు. అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. నేడు అందచేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లవుతోంది. కాపులను దగా చేసిన టీడీపీ సర్కారు టీడీపీ సర్కారు కాపులను అన్ని రకాలుగా దగా చేసింది. కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేసింది. సంవత్సరానికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకుండా వంచించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 52 నెలల్లో 77,00,628 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు డీబీటీ, నాన్–డీబీటీతో రూ.39,247 కోట్ల మేర లబ్ధి చేకూర్చడం గమనార్హం. కాపు కార్పొరేషన్ ద్వారా ఏడాదికి రూ.2 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనగా అంతకంటే మిన్నగా మేలు చేయడం గమనార్హం. నేడు నిడదవోలుకు సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నిడదవోలు చేరుకుంటారు. అక్కడ సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వైఎస్సార్ కాపునేస్తం ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
ఐదు నెలలుగా మంచానికే పరిమితం
మునగాల(కోదాడ): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంటి పెద్ద మంచానికే పరిమితమయ్యాడు. అతడి కుటుంబ సభ్యులు అప్పులు చేసి మరీ అతడికి వైద్యం చేయించారు. ప్రస్తుతం కుటుంబ పోషణ భారంగా మారడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వివరాలు.. మునగాల మండలంలోని బరాఖత్గూడెం గ్రామానికి చెందిన మొలుగూరి నారాయణ, జయమ్మ దంపతుల రెండో కుమారుడు వెంకటేశ్వర్లు(36) డిగ్రీ పూర్తిచేసి ఓ మెడికల్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 15న తన బైక్పై వెళ్తుండగా మరో బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నల్లగొండ పట్టణంలోని ఐకాన్ ఆస్పత్రిలో చేర్పించి తలకు ఆపరేషన్ చేయించారు. వైద్యం అందిస్తుండగానే వెంకటేశ్వర్లు కోమాలోకి వెళ్లాడు. వైద్యం కోసం కుటుంబ సభ్యులు అప్పు చేసి సుమారు రూ.10 లక్షలు ఖర్చు పెట్టారు. నెల రోజుల చికిత్స అనంతరం ఫిజియోథెరపి చేయించాలని వైద్యులు సూచించడంతో వెంకటేశ్వర్లును హైదరాబాద్లోని బ్రినోవా ఆస్పత్రిలో చేర్పించి నెల రోజుల పాటు రూ.2లక్షలు వెచ్చించి చికిత్స అందించారు. అనంతరం వైద్య ఖర్చులు భరించలేక ఇంటికి తీసుకొవచ్చారు. నెల రోజుల క్రితం వెంకటేశ్వర్లు తలకు రెండోసారి ఐకాన్ ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. వెంకటేశ్వర్లు ప్రాణాలైతే దక్కాయి కాని జ్ఞాపకశక్తి కోల్పోయి ఇంటి వద్ద మంచానికే పరిమితమయ్యాడు. దీంతో వెంకటేశ్ల్రు భార్య నర్మద అతడికి సపర్యలు చేస్తుంది. వీరికి పదేళ్ల లోపు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వెంకటేశ్వర్లు కుటుంబాన్ని అతడి తల్లిదండ్రులు పోషిస్తున్నారు. ప్రతి నెల మందులకు రూ.12వేల ఖర్చవుతుందని, ఇప్పటి వరకు రూ.16.50లక్షలు తమ సోదరుడికి ఖర్చు చేసినట్లు వెంకటేశ్వర్లు అన్న రమేష్ తెలిపాడు. వెంకటేశ్వర్లు ముగ్గురు పిల్లల పోషణ ఆ కుటుంబానికి భారంగా మారింది. దయార్ధ హృదయులు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వెంకటేశ్వర్లు భార్య వేడుకుంటుంది. ఆర్థికసాయం చేయదలచుకున్న దాతలు సంప్రదించాల్సిన వివరాలు పేరు: మొలుగూరి నర్మద బ్యాంకు ఖాతా నంబర్: 7313903356–1 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, మునగాల బ్రాంచ్ గూగుల్ పే, ఫోన్ పే నంబర్: 8919526680 పోషణ భారంగా మారింది రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న నా భర్త ఐదు నెలలుగా జ్ఞాపకశక్తి కోల్పోయి మంచానికే పరిమితమయ్యాడు. మా కుటుంబ సభ్యులు అప్పు చేసి ఇప్పటివరకు వైద్యం చేయించారు. ప్రస్తుతం మా పిల్లల పోషణ భారంగా మారింది. ప్రతి నెల రూ.12వేలు మందులకు వెచ్చించాల్సి వస్తుంది. నా భర్త తిరిగి మామూలు మనిషి కాగలడన్న నమ్మకంతో జీవిస్తున్నాను. దాతలు స్పందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. – మొలుగూరి నర్మద, వెంకటేశ్వర్లు భార్య -
జగనన్న ప్రభుత్వ తోడ్పాటుతో మా కాళ్ళ మీద మేము బ్రతుకుతున్నాం
-
అమెరికా చదువులకు ఐదుగురు గురుకుల విద్యార్థులు
సాక్షి, అమరావతి: అమెరికా చదువులకు ఎంపికైన విద్యార్థులకు అవసరమైన సాయం అందించడమే కాకుండా వాళ్లు తిరిగి వచ్చాక కూడా ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్స్ఛంజ్ అండ్ స్టడీ (కేఎల్–వైఈఎస్)’ కార్యక్రమం ద్వారా ఈ ఏడాది దేశంలో 30 మంది విద్యార్థులకు అమెరికాలో చదువుకునే అవకాశం దక్కింది.వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లనున్న విద్యార్థులు.. డి.నవీన, ఎస్.జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్.ఆకాంక్షలు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎంను కలిశారు. వారితోపాటు గతేడాది అమెరికా వెళ్లి కోర్సు పూర్తి చేసుకుని వచ్చిన విద్యార్థులు.. కె.అక్ష, సి.తేజ కూడా ఉన్నారు. విద్యార్థులను సీఎం జగన్ అభినందించి కుటుంబ నేపథ్యం, విద్యా సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.లక్ష ప్రకటించడంతోపాటు, వారికి శాంసంగ్ ట్యాబ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ముఖ్య కార్యదర్శి జయలక్షి్మ, ఎస్సీ గురుకులాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి తదితరులున్నారు. కేఎల్–వైఈఎస్ ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్స్ఛంజ్ అండ్ స్టడీ ప్రోగ్రామ్ను అమెరికాకు చెందిన సాంస్కృతిక వ్యవహారాల శాఖ సాంస్కృతిక మారి్పడి కోసం నిర్వహిస్తోంది. దీనికి ఎంపికైన విద్యార్థులు పది నెలలపాటు అమెరికాలో ఉంటారు. వారిని అక్కడ ఎంపిక చేసిన పాఠశాలలో నమోదు చేస్తారు. ఎంపికైన విద్యార్థులు పరీక్షలు, క్రీడలతోపాటు మొత్తం పాఠశాల ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. విద్యార్థులకు అమెరికాలో ఎంపిక చేసిన కుటుంబాలు ఆతిథ్యం ఇస్తాయి. ఒక్కో విద్యార్థికి దాదాపు 200 డాలర్లు (సుమారు రూ.16,500) నెలవారీ స్టైఫండ్ను అందిస్తారు. ఈ ఏడాది ఎంపికైన ఐదుగురు విద్యార్థులు సెపె్టంబర్ మొదటివారంలో అమెరికాకు బయలుదేరి వెళ్తారు. వీరికి అవసరమైన నిత్యావసరాలు, దుస్తులు, బ్యాగులు, మొబైల్ ఫోన్ల కొనుగోలుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆర్థిక సాయం అందిస్తోంది. కాగా, ఈ ఏడాది దేశం మొత్తం మీద 30 మంది ఎంపికైతే మన ఒక్క రాష్ట్రం నుంచే ఐదుగురు గురుకుల విద్యార్థులు ఎంపిక కావడం విశేషమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. పేద కుటుంబం నుంచి అమెరికా మాది విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం పెదగంట్యాడ. అమ్మానాన్న.. సుకాంతి, ప్రవీణ్రాజ్. నాన్న చిన్నపాటి కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. పేద కుటుంబానికి చెందిన నేను అమెరికా చదువులకు ఎంపికయ్యానంటే అది ప్రభుత్వ ప్రోత్సాహమే. – రోడా ఇవాంజిలి, ఇంటర్ సెకండ్ ఇయర్ మధురవాడ అంబేడ్కర్ గురుకులం, విశాఖ కలలో కూడా ఊహించలేదు.. మాది అనకాపల్లి జిల్లా జి.కొత్తూరు. నాన్న కృష్ణ మృతి చెందడంతో అమ్మ రాము కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. నేను అమెరికా చదువుకు ఎంపికవుతానని కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వం, ఉపాధ్యాయుల సహకారం వల్లే ఈ స్థాయికి వచ్చాను. – ఎస్.జ్ఞానేశ్వరరావు, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి, శ్రీకృష్ణాపురం గురుకులం, విశాఖ జిల్లా సీఎం సార్ ప్రోత్సాహమే.. మాది సత్యసాయి జిల్లా మల్లెనిపల్లి. నాన్న నరసింహులు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్. తల్లి నాగమణి గృహిణి. నేను అమెరికా చదువులకు ఎంపికయ్యానంటే దానికి సీఎం సార్ ప్రోత్సాహమే కారణం. – బలిగా హాసిని, ఇంటర్ సెకండ్ ఇయర్ ఈడ్పుగల్లు ఐఐటీ–నీట్ అకాడమీ,ఎస్సీ గురుకులం, కృష్ణా జిల్లా విద్యాలయాలను తీర్చిదిద్దారు.. మాది ప్రకాశం జిల్లా పుచ్చకాయలపల్లి. నాన్న కేశయ్య రైతు. అమ్మ ఆదిలక్ష్మి గృహిణి. మా వంటి పేద వర్గాల పిల్లలు చదివే విద్యాలయాలను సీఎం వైఎస్ జగన్ ఎంతో బాగా తీర్చిదిద్దారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు. – డి.నవీన, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని, మార్కాపురం గురుకులం, ప్రకాశం జిల్లా ఎప్పటికీ మర్చిపోలేను.. మాది విజయవాడ. నాన్న సురేశ్.. అటెండర్. అమ్మ వనజ గృహిణి. ప్రభుత్వ గురుకులంలో చదివిన నేను అమెరికా చదువులకు ఎంపిక కావడం పట్ల ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. – ఆకాంక్ష, ఇంటర్ సెకండ్ ఇయర్, ఈడ్పుగల్లు ఐఐటీ–ఎన్ఐటీ అకాడమీ, కృష్ణా జిల్లా -
మా నాన్నకు ప్రాణభిక్ష పెట్టండి.. చేతులెత్తి వేడుకుంటున్న చిన్నారులు
శ్రీకాకుళం: ఆరు నెలలుగా ఆ కుటుంబం నరకయాతన అనుభవిస్తోంది. కూలి పనికి వెళ్తే గానీ రోజు గడవని పరిస్థితుల్లో ఆ ఇంటి యజమాని కాలేయ వ్యాధికి గురై మంచానికే పరిమితమైపోయాడు. కాలేయ మార్పిడి జరిగితే గానీ అతని ప్రాణం దక్కదు. కానీ ఆపరేషన్ చేయించే స్థోమత ఆ నిరుపేద కుటుంబానికి లేదు. ప్రభుత్వ పెద్దలతోపాటు దాతలు సాయం చేస్తే తన భర్త ప్రాణాలు దక్కుతాయని ఆ ఇంటి ఇల్లాలు అభ్యర్థిస్తున్నారు. తండ్రికి వచ్చిన వ్యాధి ఏమిటో తెలియకపోయినా నాన్న ప్రాణాలు కాపాడండి ప్లీజ్ అంటూ ఇద్దరు చిన్నారులు విన్నవిస్తుండడం హృదయాలను ద్రవింపజేస్తోంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని సంతవురిటి గ్రామానికి చెందిన సవలాపురపు వెంకటరావు (41) కాలేయ వ్యాధితో బాధ పడుతున్నారు. ఆరు నెలలుగా పరిస్థితి తీవ్రంగా ఉండగా.. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని నెల కిందటే డాక్టర్లు వారికి సూచించారు. ఆయనకు భార్య రాజేశ్వరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేశ్వరి, వెంకటరావులు కూలి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రెండేళ్ల నుంచి కాలేయ వ్యాధి ఆయనను ఇబ్బంది పెడుతూ ఇప్పుడు ముదిరిపోయింది. ఇప్పటికే విజయనగరం, విశాఖ, విజయవాడ, శ్రీకాకుళంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లి చూపించారు. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే ఆయన ప్రాణాలను కాపాడగలదని వైద్యులు చెప్పడంతో.. ఆపరేషన్ చేయించడానికి ఆ కుటుంబం అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికే రూ.15 లక్షల వరకు అప్పు చేశామని, ఇప్పుడు ఇంకో రూ.50 లక్షల వరకు అవసరమవుతోందని, ఇంత పెద్ద మొత్తం తీసుకురావడం తమ వల్ల కావడం లేదని రాజేశ్వరి కన్నీరు పెట్టుకుంటూ చెబుతున్నారు. దాతలే ముందుకువచ్చి సాయం అందిస్తే తన భర్త ప్రాణాలు కాపాడుకుంటానని అభ్యర్థిస్తున్నారు. కూలి చేసి కాపాడుకుంటున్నాం మాది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. నా భర్తను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాం. రోజువారీ కూలి డబ్బులు బతకడానికే సరిపోవడం లేదు. మరోవైపు ఇద్దరు పిల్లలను పోషించాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.50 లక్షలు వైద్యం కోసం తీసుకురావడం నాకు తలకుమించిన పని. ప్రభుత్వం, దాతలే మమ్మల్ని ఆదుకోవాలి. – ఎస్.రాజేశ్వరి, వెంకటరావు భార్య సాయం చేయాలనుకునేవారు 99598 06655 నంబర్ను సంప్రదించాలని, ఫోన్ పే నంబర్ కూడా అదేనని కుటుంబ సభ్యులు తెలిపారు. -
సంక్షేమ జాతర.. అర్హులకు టోకరా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశ పెడుతోంది. అయితే అవి అర్హులకు అందడం లేదని, నిరుపేదలకు నిరాశే ఎదురవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ దన్ను లేదా బలమైన సిఫారసు ఉంటేనే గృహలక్ష్మి, బీసీ, మైనారిటీ బంధు పథకాల జాబితాలో చోటు దక్కుతోందని ఆయా పథకాలకు అన్ని విధాలా అర్హులైన వారు వాపోతున్నారు పోటీ తీవ్రంగా ఉండటంతో.. ‘ఇప్పటికైతే పార్టీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలకే పంచేద్దాం..ఈ మేరకు గ్రామాల వారీగా జాబితాలు పంపండి’ అంటూ ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జాబితాలు సిద్ధం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లకు గాను 14.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బీసీబంధు పథకం కింద ఒక్కో నియో జకవర్గంలో 300 మందికి, మైనారిటీ బంధు కింద 100 మందికి ఆర్థిక సహా యం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు పథకాలకూ వేలల్లో దర ఖాస్తు లు వచ్చాయి. పలు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపికను దాదాపు పూర్తి చేశారు. వాస్తవానికి అత్యంత నిరుపేదలకు, ఇచ్చే ఆర్థిక సహాయాన్ని జీవనోపాధికి ఉపయోగించుకునే సాంకేతికత, ఇతర పరిజ్ఞానం ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేలు చెప్పినవారికి, బంధుగణానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కొన్ని చోట్ల అర్హుల జాబితాల్లో చేర్చేందుకు 10 నుంచి 30% కమీషన్ మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను తమసిబ్బందితో కలిసి పరిశీలించాల్సిన జిల్లా యంత్రాం గాలు, కనీస పరిశీలన లేకుండానే ఆమోద ముద్ర వేసేసి చేతులు దులుపు కొంటూ సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పథకం ఏదైనా అదే తీరు.. డబుల్ బెడ్రూంలు దక్కని నిరుపేద తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే మూడు దశల్లో రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇందులో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు10, ఇతరులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఆయా కులాల్లో దివ్యాంగులుంటే వారికి 5 శాతం కేటాయించాలి. కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ నిబంధనలు పాటించలేదు. చేతి వృత్తులే జీవనాధారమైన నాయీ బ్రాహ్మణ, రజక, సగర పూసల, మేదరి, వడ్డెర, ఆరెకటిక, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, కంచరి ఇతర ఎంబీసీ కులాల్లో పేదరికం, వృత్తి నైపుణ్యం ఆధారంగా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాధాన్యతలేవీ పాటించటం లేదని జిల్లా కలెక్టర్లకు చేరిన జాబితాలు చూస్తే అర్థం అవుతోంది. మైనారిటీ బంధులో లబ్ధిదారుల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ ఇందులో కూడా నిబంధనలు, ప్రాధాన్యతల పాటింపుపై అక్కడక్కడా ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. పథకాలు కలెక్టర్లకు అప్పగించాలి.. ప్రస్తుతం అమలు చేస్తున్న దళిత, మైనారిటీ, బీసీ బంధుతో పాటు నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం పథకాలు పూర్తి పక్కదారి పట్టాయి. రాష్ట్ర ప్రజలు పన్నులతో వచ్చిన ఆదాయం దుర్వినియోగం అవుతోంది. నిజమైన అర్హులకు కాకుండా గ్రామ స్థాయి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ద్వారా జరుగుతున్న ఎంపికలతో వాస్తవ పేదలకు న్యాయం జరగడం లేదు. వెంటనే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో కలెక్టర్లకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం అందించే ప్రతి పైసా నిరుపేదల ఆర్థిక ప్రగతికి ఉపకరించేలా చర్యలు తీసుకోవాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గృహ‘లక్షీ కటాక్షం’ లేదంట పూరి గుడిసెలో జీవితాన్ని వెల్లదీస్తున్న ఈమె పేరు గాలి ఉపేంద్ర. మహబూబా బాద్ జిల్లా నల్లెల గ్రామం. డబుల్ బెడ్రూం రాలేదు. చివరకు సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షలైనా ఇస్తారన్న ఆశతో దరఖాస్తు చేసింది. అన్ని అర్హతలున్న తనకు లబ్ధి చేకూరుతుందని ఎదురుచూసింది. కానీ ఈ మారు కూడా ఇళ్లు ఇవ్వటం లేదని గ్రామ నాయకులు తేల్చేశారు. అర్హతలున్నా ఎంపిక చేయలేదు..! ఈమె పేరు రాచమల్ల మంజుల. సీఎం కేసీ ఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియో జకవర్గంలోని అలిరాజపేట గ్రామం. ఇటీ వల భర్త చనిపోవటంతో కొడుకు శ్రీకాంత్తో కలిసి ఇస్త్రీ షాపునకు అవసరమయ్యే పని ముట్లు కొనేందుకు బీసీబంధు పథకంలో లక్ష రూపాయల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇలా ఈ ఊరిలో మొత్తం 33 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఇద్దరినే ఎంపిక చేశారు. అయితే ఆ ఇద్దరు తమకంటే అన్ని విధాలుగా బాగా ఉన్నవారేనని మంజుల పేర్కొంది. -
‘అయ్యయ్యో.. లోపలుండిపోయానే’.. మసాజ్ మిషన్లో నుంచి కేకలు..
పెద్దపెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్స్లో మసాజ్ చైర్లు కనిపిస్తుంటాయి. ఇక్కడకు షాపింగ్కు వచ్చిన వినియోగదారులు ఒక్కోసారి ఇటువంటి చైర్లలో సేదతీరుతుంటారు. అయితే ఈ విధంగా మసాజ్చైర్లో కూర్చున్న వ్యక్తికి వింత అనుభవం ఎదురయ్యింది. ఈ ఉదంతం జపాన్లో చోటుచేసుకుంది. ఒక వినియోగదారు మసాజ్ చైర్లో సేద తీరుతూ నిద్రపోయాడు. రాత్రి కావడంతో స్టోర్ బంద్ అయిపోయింది. ఆ వ్యక్తి ఫోనులో ట్వీట్ ద్వారా సాయం అడినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. @_Asphodelus అనే పేరు కలిగిన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ వ్యక్తి ట్వీట్ చేశాడు. చీకటితో కూడిన ఒక ఫొటోను షేర్ చేసిన ఆయన ‘అయ్యయ్యో.. లోపలుండిపోయానే’ అని రాశాడు. కేఎస్ అనే పేరు కలిగిన స్టోర్ బంద్ అయి ఉండటాన్ని ఫోటోలో చూడవచ్చు. కాగా అనంతరం ఆ వ్యక్తి స్టోర్లోని అలారం మోగించగా పోలీసులకు ఈ సమాచారం అందింది. వెంటనే వారు స్టోర్ యజమానికి ఈ విషయాన్ని తెలియజేశారు. మొత్తం 10 మంది పోలీసు అధికారులు స్టోర్లో నుంచి అతనిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అతనిని దొంగ కాదని నిర్ధారించుకున్నారు. కాగా స్టోర్కు తాళాలు వేసిన సిబ్బంది మసాజ్ చైర్లో ఉండిపోయి ఇబ్బందిపడిన వ్యక్తిని క్షమాణలు కోరారు. అయితే ఈ స్టోర్లో ఆ వ్యక్తి ఎంతసేపు బందీ అయిపోయారన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పోస్టుకు 39 వేలకుపైగా షేర్లు వచ్చాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్ ‘డిపార్ట్మెంటల్ స్టోర్లో బంద్కావడం అనేది తన చిన్నప్పటి కల అని అన్నారు. మరొక యూజర్ తాను అలా బందీ అయితే ‘ఎస్కేప్ ది రూమ్’ స్టయిల్ గేమ్స్ ఆడుకుంటానని అన్నారు. ఇది కూడా చదవండి: ‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్ ఈ వీడియో! え…… pic.twitter.com/AalynpL1PB — こばたつ (@afdc1257) August 15, 2016 -
ఆదుకుంటేనే ఆయువు
ప్రకాశం: నేరుగా ఆహారం, శ్వాస తీసుకోలేదు. ముక్కులో పైపుల సహాయంతో ద్రవాహారం, శ్వాస తీసుకునేందుకు గొంతులో పైపులు వేశారు. ఏడాదిగా మంచానికే పరిమితమై వైద్యం చేయించుకునే స్థోమతలేక దాతల సాయం కోసం ఎదురుచూస్తోందా బాలిక. మర్రిపూడి మండలం జువ్విగుంట గ్రామ ఎస్సీకాలనీకి చెందిన పల్లెపోగు దావీదు, సునీతలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నలుగురు సంతానంలో మూడో కుమార్తె అయిన పల్లెపోగు మనీషా మండలంలోని తంగెళ్ల హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. మంచి మెరిట్ కలిగిన విద్యార్థి అయిన మనీషాకు ఓ రోజు జ్వరం వచ్చింది. బంధువులు వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు అనంతరం వైద్యులు ఆమెకు మెదడువాపు ఉన్నట్లుగా గుర్తించారు. ఆపరేషన్ చేస్తేనే అమ్మాయి బతికేది. లేకపోతే చనిపోతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. రోజువారి కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. ఏం చేయాలో తోచని పరిస్థితిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తిరుపతిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మనీషాకు చికిత్స చేయించారు. మెదడులో వాపు తగ్గితే తప్ప ఆపరేషన్ చేయలేమని చెప్పడంతో మూడు నెలల పాటు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స చేశారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షలతో పాటు వారి సొంత డబ్బులు మరో రూ.5 లక్షలు ఖర్చుచేసినా పూర్తిగా కోలుకోలేదు. అప్పటికే ఆరోగ్యశ్రీ పరిధి దాటిపోవడంతో గత్యంతరం లేక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏడాది నుంచి మందులు వాడుకుంటూ నెట్టుకొస్తున్నారు. మనీషా ముక్కులో పైపుల సహాయంతో ఆహారాన్ని ద్రవ రూపంలో అందజేస్తున్నారు. శ్వాస తీసుకునేందుకు గొంతులో పైపులు వేశారు. కుమార్తెకు నెలకు వైద్యానికి రూ.15 వేలు ఖర్చవుతున్నాయని తల్లి సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచం పట్టిన మనీషాకు ఆర్థిక సహాయం చేయాలని తల్లిదండ్రులు దాతలను కోరుతున్నారు. ఏడాది నుంచి మంచంలో ఉన్న మనీషాను ఎడమ కన్నులోపించి పాక్షికంగా అంధురాలైన అక్క అనూషా అన్ని తానై సపర్యలు చేస్తూ దగ్గరుండి మరీ చూసుకుంటోంది. అప్పుచేసి ఇప్పటి వరకు దాదాపు రూ.3 లక్షలు వరకు ఖర్చు చేశామని, అయినా తన బిడ్డ కోలుకోలేదని తల్లి సునీత కంటనీరు పెట్టింది. చిన్న కుమార్తె కోసం పెద్ద కూతురు అనూషా డిగ్రీ మధ్యలోనే ఆపివేసిందని తెలిపింది. మంచం పట్టిన మనీషాకు ఆర్థిక సహాయం చేసి, పాక్షికంగా అంధురాలైన నా పెద్ద కుమార్తె అనూషాకు వికలాంగ సర్టిఫికెట్ అందజేసి పింఛన్ మంజూరు చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఆర్థిక సహాయం చేయదలచిన దాతలు సెల్నంబర్ 6302575798 ను సంప్రదించగలరని వారు కోరారు. -
కేటీఆర్ మనసు దోచుకున్న కార్పెంటర్: మీరు కూడా ఫిదా అవుతారు
ప్రతిభ ఎవడి సొత్తూ కాదు. కానీ అసామాన్య ప్రతిభ మాత్రం కొందరికే సొంతం. రోజూ చేసే పనే అయినా దానిలో బుద్ధి కుశలతను ప్రదర్శించి, మేధో తనాన్ని రంగరించి కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతారు. ఆధునిక పోకడలకు, తమదైన టెక్నాలజీ జోడించి శభాష్ అనుపించుకుంటారు. అలాంటి నైపుణ్యంతో ఒక కార్పెంటర్ వార్తల్లో నిలిచారు. ఈ కళాకారుడు హస్తకళా నైపుణ్యంతో సత్యనారాయణ వ్రత పీఠాన్ని తయారు చేసిన తీరు అద్భుతంగా నిలిచింది. (ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ వీడియో: బిగ్ సెల్యూట్ అంటున్న నెటిజన్లు) నేతన్న నైపుణ్యాన్ని చిన్న అగ్గిపెట్టెలో చీరను మడిచిపెట్టిన చందంగా ఒక కార్పెంటర్ పెట్టెలో పూజా పీఠాన్ని విడిగా అమర్చాడు. ఆ తరువాత ఒక్కో భాగాన్ని తీసి ఒక క్రమంగా పద్దతిలో ఎటాచ్ చేయడం సూపర్బ్గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను రాగుల సంపత్ ట్విటర్లో షేర్ చేశారు. దీన్ని తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేస్తూ ఆయనకు సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనికి ఫిదా అయిన కేటీర్ చాలా గ్రేట్ స్కిల్ అంటూ కమెంట్ చేశారు. అతనికి ఎలా చేయూత అందించవచ్చో పరిశీలించాల్సిందిగా సంబంధింత అధికారులకు ట్విటర్ ద్వారా సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లును విపరీతంగా ఆకట్టుకుంటోంది. (దుబాయ్లో మరో అద్భుతం: ఈ వీడియో చూస్తే మతిపోవాల్సిందే!) Absolutely great skill Request @TWorksHyd to reach out to see how we could help https://t.co/KQe8zKOrCY — KTR (@KTRBRS) August 16, 2023 -
స్రవంతికి అండగా నిలిచిన ఎస్పీ మాధవరెడ్డి..
పుట్టపర్తి టౌన్: నల్లమాడకు చెందిన చిన్నారి స్రవంతికి ఎస్పీ మాధవరెడ్డి ఆర్థికంగా అండగా నిలిచారు. తల్లి మృత్యువాత పడటం, అనారోగ్యంతో తండ్రి మంచం పట్టడంతో కుటుంబ భారం మోస్తున్న స్రవంతి గురించి తెలుసుకున్న ఎస్పీ సోమవారం చిన్నారిని తన కార్యాలయానికి పిలిపించారు. ఈ సందర్భంగా దుస్తులు, నిత్యావసరాలతో పాటు రూ.30 వేల ఆర్థిక సాయం చేశారు. అలాగే చిన్నారి చదువుకు ఇబ్బంది లేకుండా గురుకుల పాఠశాలలో చేర్పిస్తామన్నారు. భవిష్యత్లోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. నల్లమాడకు చెందిన లక్ష్మీదేవి, సూర్యనారాయణ దంపతులు కూలి పనులు చేసుకుంటూ ఒక్కగానొక్క కూతురు స్రవంతిని అల్లారుముద్దుగా పెంచుకున్నారన్నారు. అయితే మూడేళ్ల క్రితం సూర్యనారాయణ చెట్టుమీద నుంచి పడి వెన్నుముక దెబ్బతినడంతో మంచానికే పరిమితం కాగా, భార్య లక్ష్మీదేవి కూలీ పనులు చేస్తూ భర్తను, కుమార్తెను పోషించేదన్నారు. అయితే ఆరు నెలల క్రితం లక్ష్మీదేవి అనారోగ్యంతో మృతి చెందగా, కుటుంబ భారం చిన్నారి స్రవంతిపై పడిందన్నారు. తండ్రిని చూసుకుంటూ ఇరుగుపొరుగు వారు ఇచ్చే సహాయంతో జీవనం కొనసాగిస్తోందన్నారు. చిన్నారి స్రవంతికి తమవంతు సాయం అందిస్తామన్నారు. మానవతావాదులూ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాతలు ఎవరైనా సాయం చేయాలనుకుంటే పుట్టగొలుసుల స్రవంతి, అకౌంట్ నంబర్ 91155144392, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నల్లమాడ (ఐఎఫ్ఎస్సీ కోడ్: ఏపీజీబీ 0001014)కు విరాళాలు పంపాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ వాసుదేవన్, సీఐలు రాజేంద్రనాథ్ యాదవ్, రాగిరి రామయ్య, బాలసుబ్రమణ్యం రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
చావుబతుకుల మధ్య కానిస్టేబుల్ సతీమణి అనిత
అనంతపురం శ్రీకంఠంసర్కిల్/ఆత్మకూరు: రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన కానిస్టేబుల్ సతీమణి అనిత ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నట్లు బెంగళూరు వైద్యులు తెలిపారు. ఆమెకు ఆపరేషన్ చేస్తే కోలుకునే అవకాశం ఉందని, రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఇంటి పెద్ద కిరణ్ చనిపోవడంతో వారి పిల్లలు చిన్నారులు కావడంతో చేతిలో డబ్బులు లేక ఆ కుటుంబం చేయూత కోసం ఎదురుచూస్తోంది. రూ.3 లక్షలు సాయం చేసిన ఎస్పీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్కుమార్ కుటుంబానికి ఎస్పీ కంచి శ్రీనివాసరావు అండగా నిలిచారు. కానిస్టేబుల్ భార్య అనిత చికిత్స నిమిత్తం రూ.3 లక్షలు చెక్కును అనిత కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. ప్రత్యేకంగా కానిస్టేబుల్ను నియమించి అనితకు వైద్యం సక్రమంగా అందేలా చర్యలు తీసుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. కరుణించిన ఖాకీలు ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ మృతిని పోలీసుశాఖ జీర్ణించుకోలేకపోయింది.. చాలా మందితో సన్నిహితంగా మెలిగిన కిరణ్కుమార్ ప్రమాదంలో మృతిచెందడంతో కన్నీరు పెట్టుకోని ఖాకీలేడు. ఈ క్రమంలోనే అతని భార్య అనిత ఆరోగ్యం విషమంగా ఉన్న విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు చేయి చేయి కలిపి సాయం చేసేందుకు ముందుకు కదిలారు. ఇందులో భాగంగానే పీటీసీలో పనిచేస్తున్న డీఎస్పీ మల్లికార్జున వర్మ రూ.25 వేలు ఆర్థిక సహాయం చేశారు. కియా పోలీసు స్టేషన్ సిబ్బంది రూ.10 వేలు సహాయం చేశారు. ఫోన్పే, గూగుల్ పే ద్వారా గంటల వ్యవధిలోనే రూ.2.50 లక్షలను పంపి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. -
జవహార్ నగర్ బాధితురాలికి అండగా మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: జవహార్ నగర్లో జరిగిన దుశ్శాసన పర్వం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనలో బాధితురాలికి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అండగా నిలిచారు. ఆమెకు పెళ్లి చేయడంతో పాటు ఉద్యోగం ఇప్పించే బాధ్యతను ఆయనే తీసుకున్నారు. బాలాజీ నగర్లో మద్యం మత్తులో ఓ కీచకుడు ఆమె దుస్తులు చించేసి.. నగ్నంగా రోడ్డుపై నిలబెట్టిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చుట్టూ వంద మంది ఉన్నా ఎవరూ ఆమెను రక్షించే ప్రయత్నం చేయకపోగా.. ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ ఉదంతంపై బాధితురాలు మీడియా ముందు వాపోయింది కూడా. అయితే.. ఈ కేసులో పోలీసులు బాధితురాలికి అండగా నిలవడంతో పాటు నిందితుడ్ని వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అయితే ఆ బాధితురాలికి మంత్రి మల్లారెడ్డి అండగా నిలబడ్డారు. బాధితురాలికి(28) మున్సిపల్ కార్పోరేషన్లో ఉద్యోగం ఇప్పించడంతో పాటు ఆమె పెళ్లి చేసేందుకు కూడా ఆయన ముందుకొచ్చారు. అంతేకాదు.. ఆమెకు డబుల్ బెడ్రూం ఇవ్వాలంటూ అధికారులకు సైతం మంత్రి మల్లారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్లోనూ ఆమె యోగక్షేమాలన్నీ తానే చూసుకుంటానని ఆమె కుటుంబ సభ్యులకు అభయం ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి. గవర్నర్ ఆరా జవహార్ నగర్లో మహిళను వివస్త్ర చేసిన ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు. మహిళా కమిషన్ సీరియస్ జవహార్ నగర్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సైతం సీరియస్ అయ్యింది. హైదరాబాద్లో శాంతి భద్రతలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయంటూ.. డీజీపీ నుంచి వివరణ కోరింది. -
వరద బాధితులకు వెన్నుదన్నుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
-
వరద ప్రభావిత బాధితులకు ఏపీ ప్రభుత్వం సత్వర సాయం
-
అంత లేదు...నేనూ సంపాదిస్తున్నా: మండిపడిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత మైయోసైటిస్ చికిత్స కోసం టాలీవుడ్ స్టార్ హీరో ఆర్థిక సాయంచేశారన్న వార్తలపై సమంత స్పందించింది. ఇవన్నీ గాలి వార్తలని కొట్టి పారేసింది. తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ఈమేరకు ఆమె ఇన్స్టా స్టోరీని పోస్ట్ చేసింది. సుదీర్ఘ కాలంగా సినిమాల్లో పనిచేసిన తనకు ఆ మాత్రం సామర్థ్యం ఉందని, తనను తాను చూసుకోగలనని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో తెలిపింది. మైయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత త్వరితగతిన తనచేతిలో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసింది. అలాగే ఆరోగ్యం సహకరించని కారణంగా చాలా ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడమేకాదు, కొంత కాలం పాటు సినిమాలకు విరామాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఆమె ప్రకృతి ఒడిలో బాలి వెకేషన్ను ఎంజాయ్ చేస్తోంది. కాగా మైయోసైటిస్ చికిత్స కోసం టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో ఆర్థిక సాయాన్ని చేశారనే తప్పుడు కథనాలు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. సమంత కు ‘యశోద’ సినిమా సమయంలోనే ఆమెకు మైయోసైటిస్ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. కొన్నాళ్ల చికిత్స తరువాత తన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. -
చిన్నారి కుటుంబానికి సీఎం జగన్ ధైర్యం.. తక్షణ సాయం
సాక్షి, కృష్ణా: సాయం కోరితే చాలూ.. అప్పటికప్పుడే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించగలిగే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆ విషయంలో ఆయన మంచి మనసుకు అద్దం పట్టే సందర్భాలు ఇప్పటికే చాలా చూశాం. తాజాగా విజయవాడలోనూ ఓ నిరుపేద కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. ఆ ఇంటి బిడ్డకు చికిత్స కోసం తక్షణ సాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. శ్రీనివాసరావు-కల్లగుంట శ్యామలాదేవి మధురానగర్లో నివాసం ఉంటున్నారు. వీళ్లకు ఓ పాప ఉంది. అయితే 14 నెలల ఆ చిన్నారినిక కంటి క్యాన్సర్ సోకింది. దీంతో స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక భారం ఎక్కువైపోతుండడంతో సీఎంను కలిసి తమ వ్యథను వినిపించాలనుకున్నారు. ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతున్న సంగతి తెలిసి.. ఏ కన్వెన్షన్ హాల్కు వెళ్లారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో.. ఆయన దగ్గరుండి వాళ్లను సీఎం జగన్ దగ్గరికి తీసుకెళ్లారు. చిన్నారి స్థితి గురించి తెలుసుకున్న సీఎం జగన్ అధైర్య పడొద్దని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన ప్రక్కనే వున్న ఎన్టిఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ కలెక్టరు డా. పి సంపత్ కుమార్ కుమార్ ను తక్షణ ఆర్ధిక సహాయానికి ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలతో.. జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి పిలిపించుకుని రూ. లక్ష చెక్కును తక్షణ సాయం రూపంలో అందజేశారు. చిన్నారి చికిత్సకు ప్రభుత్వం తరపు నుంచి అవసరమైన సాయం అన్నివిధాల అందజేస్తామని హామీ ఇచ్చారు. -
ఆపద వేళ.. ఆపన్న హస్తం
వేలేరుపాడు: ‘ఉన్నట్టుండి గోదావరికి వరద పోటు చేరింది. పెద్దవాగులోకి నీళ్లు ఎగదన్నాయి. దారులన్నీ మూసుకుపోయి రుద్రమకోట ఓ ద్వీపంలా మారిపోయింది. అటు కుక్కునూరు వెళ్లలేని పరిస్థితి. ఇటు వేలేరుపాడు రాలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే గుర్తించిన ప్రభుత్వం క్షణాల్లో అధికారులను పంపించింది. వారిచ్చిన సూచనల మేరకు మేమంతా సమీపంలోని ఓడగుట్టపైకి వెళ్లిపోయి తలదాచుకున్నాం. వరదలో మునిగిన పశువుల్ని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బోట్ల సాయంతో ఓడగుట్టపైకి చేర్చారు. తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి.. జనరేటర్ల సాయంతో వెలుగులు నింపారు. వరద తగ్గే వరకు ఇక్కడే ఆశ్రయం కల్పించారు. ఆహారం సమకూర్చా’రంటూ రుద్రమకోట గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నారు. వరదల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ పట్ల ఎంతో ఔదార్యం చూపారని.. ఆపద వేళ ఆపన్న హస్తం అందించి ఆదుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోట వరద బాధితుల కోసం ఓడగుట్టపై ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో గ్రామానికి చెందిన 440 కుటుంబాల వారు ఆశ్రయం పొందుతున్నారు. ఏ లోటూ లేకుండా చూస్తున్నారు వరదల వల్ల తాము గ్రామం వదిలిపోవాల్సి వచ్చిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో అధికారులు తమకు అన్ని సౌకర్యాలు కల్పించారని నిర్వాసితులు చెప్పారు. తమ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నారని తెలిపారు. గోదావరి గట్టుపైనే తమ గ్రామం ఉన్నందున చిన్నపాటి వరదొచ్చినా వరద తాకిడికి గురవుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వరదలు వచ్చినప్పుడల్లా ఓడగుట్ట పైకి చేరి నానా అగచాట్లు పడేవారమని, తమను పట్టించుకునే నాథుడు ఉండేవారు కాదని చెప్పారు. ముఖ్యమంత్రి ముందస్తు ఆదేశాల మేరకు ఇక్కడ జనరేటర్లు ఏర్పాటు చేశారని, గ్రామానికి రెండు బోట్లు కేటాయించారని గ్రామస్తులు వివరించారు. గ్రామాన్ని వరద చుట్టుముట్టిన వెంటనే అధికారులు అప్రమత్తమై గ్రామస్తులందరినీ బోట్లలో ఓడగుట్టకు తరలించారని, పశువులను కూడా బోట్లలో ఓడగుట్టకే తరలించారు. అక్కడే తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసి.. నిత్యావసర వస్తువులన్నీ సమకూర్చారని తెలిపారు. అప్పట్లో రెండు కేజీల బియ్యం ముఖాన కొట్టేవారు తెలుగుదేశం హయాంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు తాము పడిన బాధలను గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. టీడీపీ హయాంలో వరదలు వచ్చినప్పుడు రెండు కిలోల బియ్యం, లీటర్ కిరోసిన్ చొప్పున తమ ముఖాన కొట్టి చేతులు దులుపుకునేవారని చెప్పారు. అవి అయిపోతే తమను పట్టించుకునే నాథుడే ఉండేవాడు కాదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దయ వల్ల తాము అన్ని సౌకర్యాలు పొందగలిగామని, ఏ లోటూ లేకపోవడంతో ఓడగుట్టపై ధైర్యంగా గడపగలుగుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ తమ గ్రామానికి ఎంతో సాయపడిందన్నారు. సచివాలయంలో పనిచేసే వీఆర్వో, వలంటీర్, పోలీస్, ఏఎన్ఎం, పశు వైద్యశాఖ ఏహెచ్ఏ తమను కంటికి రెప్పలా చూసుకున్నారన్నారు. నిత్యావసర వస్తువులతోపాటు తాగునీరు, పాలు, ఐదు రోజులకు సరిపడా కూరగాయలు, బ్రెడ్, చిన్న పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇచ్చారని వివరించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సందర్శించి వరద బాధితులకు కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఎప్పుడూ ఇంత సాయం అందలేదు ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇంత సాయం అందలేదు. మేం గుట్టకు వెళ్లిన వెంటనే మంచినీటి ప్యాకెట్లు అందించారు. కూరగాయలు ఇచ్చారు. ఏ లోటూ రాకుండా చూశారు. – కణితిరెడ్డి లక్ష్మీనర్సయ్య, వరద బాధితుడు పశువుల్ని కూడా కాపాడారు గోదావరి నీటిలో మునిగిన పశువులను కూడా కాపాడారు. గ్రామంలో ఉన్న వందలాది పశువులను బోట్లలో ఓడగుట్టకు తరలించారు. పశు నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. సీఎం జగన్కు ధన్యవాదాలు – షేక్ షఫీ, వరద బాధితుడు అప్పట్లో బియ్యంతో సరిపెట్టారు టీడీపీ హయాంలో కేవలం రెండు కేజీల బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు 25 కేజీల బియ్యంతోపాటు కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్, తక్షణ సాయంగా 2వేల నగదు అందజేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాకు అన్నీ సమకూర్చారు. విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతున్న గ్రామస్తులకు జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఇలా ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. – జి.భాస్కర్, రుద్రమకోట గ్రామస్తుడు -
గొప్ప మనసు చాటుకున్న బేబీ డైరెక్టర్..!
ఎలాంటి అంచనాలు లేకుండా ఇటీవల సెన్సేషన్ సృష్టించిన సినిమా ఏది అంటే అందరినోట వినిపించే పేరు 'బేబీ'. ఈ సూపర్ హిట్ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పెద్ద స్టార్స్ లేకుండానే రిలీజై బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ మూవీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్న సినిమా అయినా కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని బేబీ మరోసారి రుజువు చేసింది. (ఇది చదవండి: హీరో విశ్వక్ సేన్తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!) అయితే తాజాగా బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ తన గొప్పమనసును చాటుకున్నారు. ఓ కుటుంబానికి అండగా నిలిచారు. ఏడాది వయసున్న పిల్లవాడి వైద్యానికి తన వంతు సాయంగా రూ.50 వేల రూపాయలు సాయం చేశారు. ఏపీలోని అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామానికి చెందిన ఏడాది వయసున్న బాలుడు వేడి నూనెలో పడిపోవడంతో ఒళ్లంతా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని మహేశ్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెంటనే స్పందించిన బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ యాభై వేల రూపాయల సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. (ఇది చదవండి: నేను మద్యం, సిగరెట్లు తాగుతా.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!) -
విశాఖ పర్యటనలో మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
‘అక్షర’ భారతికి ఏపీ ప్రభుత్వ సాయం
సాక్షి, అనంతపురం: కూలిపనులు చేసుకుంటూ కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసిన సాకే భారతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయం ప్రకటించింది. రెండు ఎకరాల వ్యవసాయ భూమి కేటాయిస్తూ సంబంధిత పత్రాలకు సోమవారం ఆమెకు అందజేశారు. అలాగే.. ఆమెకు జూనియర్ కాలేజీ లెక్చరర్ ఉద్యోగం ఆఫర్ చేశారు జిల్లా కలెక్టర్ గౌతమి. అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామంలో పేదరికాన్ని జయించి మరీ ఎస్కే యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసిందామె. డాక్టర్ భారతి సక్సెస్ స్టోరీ ఎంతో మందిని కదిలించింది కూడా. ఈమె డాక్టర్ భారతి.. కష్టాల్ని ఈది గెలుపు తీరాన్ని చేరింది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా శింగమనల నాగుల గుడ్డం గూడేనినికి చెందిన భారతి.. ఓవైపు కూలీ పనులు చేసుకుంటూనే భర్త ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, పీజీ చేసింది. పదో తరగతి దాకా శింగనమల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ పామిడి జూనియర్ కాలేజీలో చదివింది. శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ నుంచి కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసింది. సాయం ఎప్పుడూ ఉంటుంది ఎల్లప్పుడూ ప్రభుత్వ సహకారం ఉంటుందని సాకేభారతికి కలెక్టర్ గౌతమి హామీ ఇచ్చారు. కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో రెండు ఎకరాల పొలం పట్టా అందజేసి.. భారతి విజయంపై సంతోషం వ్యక్తం చేశారామె. భారతి ఎన్ని అవాంతరాలు ఎదురైన వెనకడుగు వేయకుండా అనుకున్నది సాధించిన ఆమె ఎందరికో స్పూర్తిగా నిలిచారన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం తరఫున భారతికి శింగనమల మండలం సోదనపల్లి గ్రామ పొలం సర్వేనెంబరు 9–12లో వ్యవసాయ యోగ్యమైన రెండు ఎకరాల భూమి భారతికి అందింఆం. అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటిని నిర్మించి ఇస్తాం. ఎస్కేయూ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జేఎల్ పోస్టు (కెమిస్ట్రీ) ఖాళీగా ఉంది. ఆమె అంగీకరిస్తే ఆ పోస్టుకు నామినేట్ చేస్తామన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి ఆమెకు అన్నివిధాలుగా అవసరమై ప్రొత్సాహం అందిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమెకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, శింగనమల తహసీల్దారు ఈశ్వరమ్మ, సాకేభారతి భర్త శివప్రసాద్, కుమార్తె ప్రసూన, తదితరులు పాల్గొన్నారు. -
వరద బాధితులకు కొండంత అండ
-
వరదలో చిక్కిన కుక్కపిల్లలు.. ఆ తల్లి ఏం చేసిందంటే..? వీడియో వైరల్..
ఆత్మీయత.. అనురాగం.. అనుబంధం.. వీటిని మించి.. అమ్మంటే అంతులేని ప్రేమ. బిడ్డలపై అమ్మ ప్రేమకు సరితూగగలదేది ఈ లోకంలో ఉండదు. తనకోసం గాక పిల్లల కోసం తమను అర్పించగల కరుణామూర్తి తల్లి. ఈ స్వభావం సృష్టిలో అన్ని జీవుల్లోనూ కనిపిస్తుంది. జంతువులు సైతం పిల్లల కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. మాతృప్రేమను చాటే ఓ ఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. వరదల్లో చిక్కుకున్న తన పిల్లల కోసం ఓ కుక్క పడే యాతన ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో వర్షాలు బీబీత్సం సృష్టించాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో వరదలు సంభవించాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో సహాయక చర్యల్లో నిమగ్నమైన పోలీసుల చుట్టే ఓ కుక్క తిరిగింది. ఏదో చెప్పాలన్నట్లు ఆవేదన చెందుతూ పోలీసుల వంకే దీనంగా చూస్తూ ఏడిచింది. దీంతో పోలీసులు కుక్క ఇంతలా వెంబడించడానికి గల కారణమేంటని ఆలోచించారు. దాన్ని అనుసరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులను ఆ కుక్క వరదల్లో మునిగిన ఓ ఇంటి వైపుకు తీసుకెళ్లింది. #APPolice rescued puppies stranded in flood water: In #NTR(D) due to massive floods loomed the puppies were trapped in a house. Cops realized the distress of mother #dog for her children. They immediately rescued them&safely brought them to their mother&showed humanity.(1/2) pic.twitter.com/UdA8KD99XD — Andhra Pradesh Police (@APPOLICE100) July 30, 2023 అక్కడే పోలీసులు ఆ కుక్క పిల్లలను గుర్తించారు. వరద నీటిలో బురదలో చిక్కుకున్న కుక్క పిల్లలు ఆ ఇంటిలో ఉన్నాయి. వెంటనే వాటిని బయటకు తీశారు. వాటికి అంటుకున్న బురదను శుభ్రపరిచి కుక్కకు అందించారు. పిల్లలను ముద్దాడిన తల్లి కుక్క పోలీసుల సహాయానికి కృతజ్ఞత చెప్పుకున్నట్లు సంతోషాన్ని వెలిబుచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు తల్లి ప్రేమను ప్రతిబింబించే సాంగ్ను జోడించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. పోలీసులు చేసిన సహాయానికి జంతుప్రేమికులు ధన్యవాదాలు తెలిపారు. జంతువుల పట్ల మానవత్వాన్ని ప్రదర్శించిన విజయవాడ సిటీ పోలీసులను రాష్ట్ర డీజీపీ కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశంసించారు. ఇదీ చదవండి: నా కొడుకు, భర్తను చంపేశారు..కనీసం వారి శవాలనైనా ఇప్పించండి.. -
జేసీబీలో నిండుగర్భిణి తరలింపు
భీమ్గల్: ఓ నిండుగర్భిణి పురిటినొప్పులతో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకుని వెళ్తుండగా దారి మధ్యలో చెరువుకట్ట తెగి నీటి ప్రవాహం పెరిగింది. జేసీబీ సహాయంతో ఆమెను నీటిప్రవాహంలోంచి దాటించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. భీమ్గల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన నిండుగర్భిణి అనిలకు గురువారం పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరారు. మార్గమధ్యంలో పిప్రి నుంచి బాచన్పల్లి వెళ్లే దారిలో ఉన్న చెరువుకట్ట తెగిపోయింది. దీంతో ఆమెను జేసీబీలో కూర్చోబెట్టి దాని సహాయంతో నీటి ప్రవాహాన్ని దాటించారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్ ద్వారా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
సాక్షి ఎఫెక్ట్.. బాలింతకు జడ్జి ఆసరా!
కర్ణాటక: కులాచారం ప్రకారం బాలింత శిశువుతో కలిసి ఊరిబయట కొబ్బరి మట్టల గుడిసెలో ఉండడం, గాలివానకు శిశువు అనారోగ్యం వచ్చి ఆస్పత్రిలో చనిపోయిన సంఘటనపై జిల్లా సివిల్ న్యాయమూర్తి, న్యాయసేవల ప్రాధికార కార్యదర్శి నూరున్నీసా స్పందించారు. శిశువు మృతిపై గురువారం సాక్షి పత్రికలో ‘‘ఆరుబయట.. గాలీవానలో తల్లీబిడ్డ’’ శీర్షిక పేరిట వార్తాకథనం ప్రచురితం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఆమె జిల్లాలోని బెళ్లావి దగ్గరున్న మల్లేనహళ్లి గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జడ్జితో పాటు పలు శాఖల అధికారులు వచ్చారు. బాలింత వసంతను వెంటనే గుడిసె నుంచి ఇంటికి తరలించారు. బిడ్డలు చనిపోయిన బాలింతను గ్రామంలోకి తీసురాకూడదని గ్రామస్తులు అభ్యంతరం చెప్పగా వారిమీద జడ్జి మండిపడ్డారు. ఊరిబయట ఎలా ఉంచుతారు? ఒంటరిగా బాలింతను చంటిబిడ్డను ఊరి బయట ఉంచుతారా? అని గ్రామస్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వసంత, ఆమె కుటుంబసభ్యులతో జడ్జి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మూడురోజులుగా గుడిసెలో ఎలా ఉంచారని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కవలలు పుట్టినా పురిట్లోనే ఒకరు, గుడిసెలో మరొకరు చనిపోయారని తెలిసి అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బాలింతకు వైద్య పరీక్షలు చేయించి బలహీనంగా ఉండడంతో చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
మా కొడుకును బతికించరూ..!
సంగారెడ్డి: మా కొడుకును బతికించరూ అంటూ బొల్లారం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీనగర్కు చెందిన సుభాష్, మంజుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బొల్లారం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీనగర్కు చెందిన సుభాష్, మంజుల కుమారుడు రోహిత్ (27) పరిశ్రమలో విధులు ముగించుకొని వస్తుండగా జరిగిన ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రోహిత్ చికిత్స పొందుతున్నాడు. రోహిత్ బ్రెయిన్ ఆపరేషన్ కోసం రూ.8లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారు. అప్పులు చేసి రూ. 4లక్షలు ఆపరేషన్ కోసం తల్లిదండ్రులు ఆస్పత్రిలో చెల్లించారు. మరో రూ.4లక్షలు అవసరం కాగా సాయం చేయాలనుకునే దాతలు 9666 493043 నంబర్లో సంప్రదించాలని కోరుతున్నారు. బొల్లారంలోని బీజేపీ నేత ఆనంద్కృష్ణారెడ్డి రూ.10వేల సాయాన్ని అందించారు. -
నేనున్నానంటూ సీఎం జగన్ భరోసా
సాక్షి ప్రతినిధి, విజయవాడ/, గుంటూరు, నరసరావుపేట : అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి నేనున్నానంటూ సీఎం జగన్ అండగా నిలిచారు. తలసేమియాతో బాధపడుతున్న విజయవాడకు చెందిన దుర్గాభవానీ, సీతారామ్ దంపతులు కుమారుడు గౌతమ్వెంకట్, బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన సూర్యఆదిత్యరెడ్డి, ప్రమాదంలో కళ్లు కోల్పోయి, మానసిక స్థితి సరిగా లేని దుగ్గిరాలకు చెందిన నాగూర్తో పాటు కుమార్తె త్రివేణిలు వెంకటపాలెం వద్ద సీఎం జగన్కు గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు ఓపికగా విన్న సీఎం.. తక్షణ ఆర్థిక సాయంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు గంటల వ్యవధిలోని ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. వైద్యం అందిస్తామన్నారు. చదవండి: CM Jagan VenkatapalemTour: అమరావతి అందరిదీ -
పేదల సమస్యలపై తక్షణం స్పందిస్తోన్న సీఎం వైఎస్ జగన్
-
అనాథ వృద్ధుడిని కాపాడిన పోలీసులు
నిజామాబాద్: అటవీ ప్రాంతంలో చలనం లేకుండా పడి ఉన్న అనాథ వృద్ధుడిని కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ పోలీసులు కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం పోచారం శివారు అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వృద్ధుడు వానకు తడిసి చలనం లేకుండా పడి ఉండడాన్ని పశువుల కాపరులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై కోనారెడ్డి తన సిబ్బందితో వెళ్లాడు. వృద్ధుడిని కిలో మీటర్ దురం నుంచి చేతులపై మోసుకొచ్చి పోలీసు వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వృద్ధుడి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఎస్సై కోనారెడ్డి మాట్లాడుతూ.. రెండ్రోజుల కిందట ఈ వృద్ధుడు అటవీ ప్రాంతానికి వచ్చినట్లు స్థానికులు తెలిపారన్నారు. వృద్ధుడు వానకు తడిసి శరీరం బిగిసిపోయి ఉన్నందున వివరాలు చెప్పలేక పోయాడన్నారు. కాగా సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించి వృద్ధుడిని కాపాడిన పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు. ఎస్సైతో పాటు ఏఎస్సై రాములు, సిబ్బంది అంజి, సంజీవ్ తదితరులు ఉన్నారు. -
మహిళలను స్వశక్తితో నిలదొక్కుకునేలా చేయడమే అసలైన అభివృద్ధికి తొలి అడుగు
-
మూగజీవి సమయస్ఫూర్తి.. మనిషిని ఎలా సాయమడిగిందో చూడండి..
జన సంచారం తక్కువగా ఉన్న ఒక వంతెన పైన రెండు కుక్కలు ఆడుకుంటూ ఉండగా ఒక కుక్క పొరపాటున పక్కనే ఉన్న సంపులో పడిపోయింది. దీంతో రెండో కుక్కకు ఏమి చెయ్యాలో పాలుపోక, తన సోదరుడిని ఎలా కాపాడుకోవాలో అర్ధం కాక సహాయం కోసం చుట్టూ చూసింది. సంయమనంతో అలోచించి సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ మనిషిని సాయం కోరింది. అటుగా వెళ్తోన్న ఒక వ్యక్తిని అడ్డుకుని మొరుగుతూ.. తోక ఆడిస్తూ.. తన సమస్యని చెప్పే ప్రయత్నం చేసింది ఆ శునకం. మొదట అదేమీ పట్టించుకోని ఆ వ్యక్తి అలాగే ముందుకు నడుచుకుంటూ పోతుండగా ఆ కుక్క మాత్రం పట్టిన పట్టు విడవకుండా అతడిని వెంబడించింది. దీంతో ఎదో జరిగిందని గ్రహించిన ఆ వ్యక్తి అక్కడే ఆగి వెనక్కు చూశాడు. వెంటనే ఆ కుక్క అతడిని ఆ సంపు వద్దకు తీసుకుని వెళ్లగా మానవత్వంతో ప్రమాదంలో చిక్కుకున్న కుక్కని బయటకు తీసి రక్షించాడు. అనంతరం సంపు పైన మూతను అమర్చి తన దారిన వెళ్తున్న ఆ వ్యక్తిని రెండు కుక్కలు కృతఙ్ఞతలు చెబుతూ వెంబడించాయి. థాంక్ యూ మనిషి.. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి.. "తన సోదరుడిని కాపాడుకునేందుకు మనిషి సాయం కోరిన కుక్క.. మీరు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు.. థాంక్ యూ మనిషి.. " అని మూగజీవాల ధృక్కోణంలో కృతఙ్ఞతలు తెలిపాడు. ఈ వీడియోకి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. Dog seeks help from a random person to rescue his brother. They were happy and grateful for the help. Thank you, hooman...🙏❤️ pic.twitter.com/v0FHIIgZXd — 𝕐o̴g̴ (@Yoda4ever) June 30, 2023 ఇది కూడా చదవండి: వాగ్నర్ గ్రూపులోని 21000 మందిని మట్టుబెట్టాం.. జెలెన్స్కీ -
డాక్టర్ దేవీకుమారి వైద్యానికి సహాయం చేసిన సీఎం వైఎస్ జగన్
-
లోన్ యాప్ వేధింపులు.. మహిళకు అండగా నిలిచిన ‘దిశ’ యాప్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: లోన్ యాప్ నిర్వాహకుల వికృత చేష్టలకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మహిళకు దిశ యాప్ అండగా నిలిచింది. లోన్ తీసుకోకపోయిన డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ టూ టౌన్ పరిధిలోని మహిళకు గుర్తుతెలియని నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి. దుర్భాషలాడుతూ లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేయడంతో దిశ(ఎస్వోఎస్)కు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి లొకేషన్కు చేరుకున్న దిశ పోలీసులు వివరాలు సేకరించారు. బాధితురాలి కుమారుడు సెల్ ఫోన్లో గేమ్ ఆడుకుంటూ పొరపాటున లోన్ యాప్ నోటిఫికేషన్ను క్లిక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నోటిఫికేషన్ క్లిక్ చేయగానే రెండు వేలు ఆటోమెటిక్ గా బాధితురాలి ఖాతాలో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. బాధితురాలి సెల్ ఫోన్కు పంపించిన అసభ్యకరమైన వీడియోలతో పాటు ఇతర టెక్నికల్ ఆధారాలను పోలీసులు సేకరించారు. చదవండి: యాప్లతో సేఫ్టీకి భరోసా! -
బీసీలకు రూ. లక్ష నిరంతర ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలకు రూ. లక్ష సాయం అందించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలలో ఉన్న కుల, చేతి వృత్తులు చేసుకునే వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారని అన్నారు. బీసీలకు లక్ష పథకంపై శనివారం సచివాలయంలో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్లు హాజరై ఇప్పటివరకు ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. పథకం తొలిదశ అమలును బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కేబినెట్ సబ్ కమిటీకి వివరించారు. అమలు తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు.. అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం మంత్రి కమలాకర్ వివరాలను వెల్లడించారు. బీసీల అభ్యున్నతి లక్ష్యంగా... వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం తపిస్తున్న సీఎం కేసీఆర్ చేతి వృత్తులకు చేయూతనిచ్చేందుకు రూ.లక్ష ఆర్థికసాయం పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. కుల, చేతి వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్న వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఈ సాయాన్ని ప్రకటించారన్నారు. శనివారం నాటికి ఈ సాయం కోసం 2,70,000 దరఖాస్తులు అన్లైన్ ద్వారా నమోదయ్యాయని వివరించారు. ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి పారదర్శకంగా చేయనున్నట్లు తెలిపారు. ప్రాధాన్యతాక్రమంలో అర్హత కలిగిన లబ్దిదారుల్లోని అత్యంత పేదవారికి సాయం అందజేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతీనెల 5వ తేదీలోపు కలెక్టర్లు లబ్దిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని, ఇన్చార్జి మంత్రులు ధ్రువీకరించిన జా బితాలోని లబ్దిదారులకు ప్రతీ నెల 15వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీ దుగా సాయం అందజేస్తామన్నారు. దరఖాస్తుదారులు https://tsobmm sbc. cgg.gov.in వెబ్ సైట్లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని, ఆ ఫారంను ఏ ఆఫీసులోగానీ, ఏ అధికారికి గానీ సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఎంపికైన లబ్దిదారులు నెలరోజుల్లోపు తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామగ్రిని కొనుక్కోవాలని సూచించారు. లబ్ధిదారుల నిరంతర అభివృద్ధి కోసం అధికారులు పర్యవేక్షిస్తారని, నెలలోపు లబ్దిదారులతో కూడిన యూనిట్ల ఫొటోల ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుదన్నారు. -
సీఎం దృష్టికి వచ్చిన అర్జీల సమస్యలకు తక్షణ పరిష్కారం
-
ఫాన్స్ కి గుడ్ న్యూస్ ఎవరి సాయం లేకుండానే..!
-
చిన్నారి ఆరోగ్యంపై సీఎం జగన్ స్పందన
రాజమహేంద్రవరం సిటీ: తన బిడ్డకు వైద్యం అందించాలని ఓ తల్లి పెట్టుకున్న అర్జీకి సీఎం జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన సందర్భంగా కొవ్వూరు మండలం ఔరంగబాద్కు చెందిన పాక నాగ వెంకట అపర్ణ తన ఏడు నెలల కుమార్తె నిస్సి ఆరాధ్య కిడ్నీ సంబంధిత క్యాన్సర్తో బాధపడుతోందని అర్జీ అందజేశారు. సీఎం స్పందించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం తన చాంబర్లో నిస్సి తల్లికి రూ.లక్ష చెక్కును కలెక్టర్ మాధవీలత అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత ఆరాధ్య తల్లితండ్రులు పాక స్వరూప్, అపర్ణలకు ధైర్యం చెప్పారు. బిడ్డ ఆరాధ్య అనారోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. పాప వైద్య సేవల పర్యవేక్షణ బాధ్యతలను ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్కు అప్పగించామని వివరించారు. పాప తండ్రి మాట్లాడుతూ వైద్య సేవల కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి సీఎం కార్యాలయం లెటర్ ఆఫ్ అధారటీ లేఖ ఇచ్చిందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఎంబీబీఎస్ లో ఫ్రీ సీటు సాధించిన మధుశ్రీ
-
పేద విద్యార్థులకు కూడా పెద్ద చదువులు
-
జగనన్న విద్యాదీవెనతో మా తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గింది
-
జగనన్న వల్లే మేము ఆర్థికంగా ఎదిగాము.. ప్రభుత్వ సహకారంతో చిరుధాన్యాల వ్యాపారం చేస్తున్నాం..!
-
రామ్- లక్ష్మణ్ చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్
టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ ఫైట్ మాస్టర్స్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేర్లు రామ్- లక్ష్మణ్. సినీ పరిశ్రమలో బీజీగా ఉండే వారిద్దరు ఖాళీ టైమ్ దొరికితే చాలు సొంత గ్రామమైన చీరాల చేరుకుంటారు . అక్కడ వారు సేవ కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ బ్రదర్స్ తమ మానవత్వాన్ని చాటుకున్నారు. చీరాలలో ఉండే 'కోటయ్య వృద్ధాశ్రమం' కోసం ఈ బ్రదర్స్ జోలి పట్టి బిక్షాటన చేశారు. (ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు.. రిజిస్ట్రేషన్ ఇలా చేయండి) వృద్ధాశ్రమానికి ఒక ఆటో అవసరం కావడంతో చీరాలలోని ప్రధాన రహాదారుల్లో బిక్షాటన చేసి.. ప్రజలు నుంచి నగదు సేకరించారు. వచ్చిన డబ్బుతో పాటు వారు కూడా కొంత డబ్బును కలిపి ఆశ్రమానికి అందించారు. అదేంటి..? సినిమాల్లో బాగానే సంపాదిస్తున్నారు కదా? సొంత డబ్బు ఇస్తే సరిపోతుంది కదా? ఇదంతా ఎందుకు అని ప్రశ్నించే వారికి ఇలా సమాధానం చెప్పారు. 'ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. అందుకే తాము బిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టాము.'మానవసేవే మాధవసేవ' అనే సూక్తిని ప్రతి ఒక్కరు పాటించాలి.అపుడే సమాజం బాగుంటుంది' అని అన్నారు. నిస్వార్థ సేవతో ఎంతోమంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్వహకురాలు స్వర్గీయ కోటయ్య సతీమణి ప్రకాశమ్మను ఫైట్ మాస్టర్లు అభినందించారు. వారు చేస్తున్న పనిని మెచ్చుకుంటూ.. ఫ్యాన్స్తో పాటు పలువురు షోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. (ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్) -
సీఎం దగ్గర తమ గోడు వెళ్లబోసుకున్న బాధితులు
-
డ్వాక్రా గ్రూపు ద్వారా ప్రభుత్వం చేసిన సాయంతోనే ఈ కొట్టు పెట్టుకున్నాను
-
సీఎం జగన్ మాట ఇచ్చారు.. నెరవేర్చారు
సాక్షి అమలాపురం: ‘మాట ఇస్తే.. చేస్తానంతే..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. బాధితులు కోరిన ఆర్థిక సహాయాన్ని 24 గంటల్లో రోగులకు, పేదలకు అందేలా చేసి వారిపట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సీఎం జగన్ బుధవారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడి వివాహానికి వచ్చిన సీఎం జగన్ను కలిసి బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. 24 గంటలు తిరగకుండానే 25 మంది బాధితులకు రూ.26 లక్షలను కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా అందజేశారు. లబ్ధిపొందినవారిలో పలువురు దివ్యాంగులు, దీర్ఘకాలికవ్యాధుల బాధితులు ఉన్నారు. సీఎం సహాయనిధి నుంచి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందించడంతోపాటు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యసేవలు అందించాలని సీఎం ఆదేశించినట్టు కలెక్టర్ శుక్లా తెలిపారు. వీరిలో టి.సుజాతకు రూ.రెండులక్షలు అందించారు. డీఎం అండ్ హెచ్వో ఎం. బాబూరావు దొర, జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ రాధాకృష్ణ, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఏవో కాశీవిశ్వేశ్వరరావు పాల్గొన్నారు. చదవండి: గ్రామవార్డు, సచివాలయ ఉద్యోగుల బదిలీలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం! -
వారి లిస్ట్ తీయండి.. ఫ్యాన్స్కు విజయ్ అదేశం
కోలీవుడ్ హీరో విజయ్ అందరికీ సుపరిచితుడే.తమిళ సూపర్ స్టార్గా తిరుగులేని ఫ్యాన్ బేస్తో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలలో ప్రథమ వరుసలో ఉంటాడు. సినిమాల సంగతి పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ విజయ్ ముందుంటారు. గతంలో తమిళనాడులో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా మరోసారి సాయం చేసేందుకు విజయ్ ముందుకొచ్చాడు. (ఇదీ చదవండి: వరుణ్, లావణ్య త్రిపాటి మధ్య ప్రేమ ఎలా మొదలైందంటే..!) “విజయ్ మక్కల్ ఇ యక్కం” తరపున తమిళనాడులోని ప్రతి నియోజకవర్గంలోని ఈ ఏడాది 10వ తరగతి, 12వ తరగతుల్లో మొదటి స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఈనెల 17వ తేదీన ఆయన సన్మానించనున్నాడు. వారికి రూ. 10 వేలు ఆర్థిక సాయం చేయనున్నాడు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు విజయ్ పేర్కొన్నాడు. ఈ నిర్ణయంతో విద్యార్థుల సమాచారం సేకరించాలని తన ఫ్యాన్స్కు ఆదేశాలు కూడా ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్) -
ఒడిశా రైలు ప్రమాద బాధితులకే ఈ డబ్బు: నిర్మాత
తాను హీరోగా నటిస్తూ నిర్మించిన ‘అనంత’ చిత్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ నుంచి వచ్చే ప్రతి రూపాయి (థియేటర్ ఖర్చులు పోను) ఇటీవల ఒడిశాలో ప్రమాదానికి గురైన ‘కోరమండల్’ ఎక్స్ప్రెస్ బాధితుల కుటుంబాల సహాయ నిధికి ఇవ్వనున్నామని ప్రశాంత్ కార్తీ పేర్కొన్నారు. గతంలో రామ్చరణ్ ‘ధృవ’, ‘చెక్’, రాంగోపాల్వర్మ ‘కొండా’ చిత్రాలలో నటించిన ప్రశాంత్ కార్తీ తాజాగా శ్రీనేత్ర క్రియేషన్స్ పతాకంపై ‘అనంత’ చిత్రాన్ని నిర్మించారు. ఆయన సరసన రిత్తిక చక్రవర్తి నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఒక నిమిషం 46 సెకన్ల నిడివిగల ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. (ఇదీ చదవండి: Jr NTR: ఎన్టీఆర్ కోసం క్రేజీ హీరోయిన్ను ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్) అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 9న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అని చిత్ర నిర్మాత, హీరో ప్రశాంత్ కార్తీ మీడియాతో ముచ్చటించారు. ‘‘మా తండ్రి సివిల్ కాంట్రాక్టర్. నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే ప్యాషన్. దాంతో సినిమాలలో నటించాలనే బలమైన కోరిక ఉండడంతో రామ్చరణ్ నటించిన ‘ధృవ’ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేసే అవకాశం దక్కింది. ఆ తరువాత ‘చెక్’, రాంగోపాల్ వర్మ ‘కొండా’ సినిమాలో నక్సలైట్ నాయకుడు ఆర్.కె. పాత్రలో నటించాను. అది నాకు మంచి పేరు తీసుకువచ్చింది. దయచేసి అందరూ థియేటర్స్లో ఈ సినిమాను రైలు ప్రమాద బాధితుల సహాయ నిధి కోసమైనా చూడాలని కోరుకుంటున్నా. మీ టిక్కెట్ డబ్బులు ఆయా కుటుంబాలకు ఎంతో కొంత సహాయపడితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది మీకు’’ అంటూ ముగించారు. (ఇదీ చదవండి: Custody Movie: ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన అమెజాన్ ప్రైమ్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?) -
ఒడిశా రైలు ప్రమాదం: బాధితులకు రూ. 2000 నోట్లు!
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున పరిహారం ప్రకటించారు. దీనికితోడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ టీఎంసీ తరపున బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజూమ్దార్ మాట్లాడుతూ బెంగాల్కు చెందిన ఒక మంత్రి మృతుల కుటుంబాలకు రూ .2 లక్షలు పంపిణీ చేశారని, అయితే అవన్నీ రూ. 2000 నోట్లు అని ఆరోపించారు. ఆయన ఒక వీడియోను ట్వీట్ చేశారు. దానిలో ఇద్దరు మహిళలు చాపమీద కూర్చుని ఉండగా, ఒక మహిళ కుర్చీలో కూర్చున్న దృశ్యం కనిపిస్తోంది. ఆ ముగ్గురు మహిళలు రూ. 2000 నోట్లతో కూడిన బండిల్ పట్టుకుని కనిపిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన సదరు బీజేపీ నేత... బ్లాక్ మనీని వైట్ మనీ చేసేందుకు టీఎంసీ ఈ పని చేయడం లేదు కదా? అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ ఆదేశాలకు అనుగుణంగా తృణమూల్ పార్టీ తరపున రూ. 2 లక్షల సాయం అందిస్తున్నారు. ఇది మంచి విషయమే. కానీ ఈ రూ. 2000 నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. ప్రస్తుతం మార్కెట్లో రూ. 2000 నోట్ల చలామణి తక్కువగా ఉన్నదని, బ్యాంకులలో వీటిని మార్చుకునే ప్రక్రియ జరుగుతున్నదని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు రూ. 2000 నోట్లు ఇవ్వడం వలన వారికి ఇబ్బందిగా మారుతుందన్నారు. నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చేందుకే ఇలా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. అయితే దీనిపై వెంటనే స్పందించిన టీఎంసీ నేత కుణాల్ ఘోష్ మాట్లాడుతూ బీజేపీ నేత సుకాంత్ మజూమ్దార్ చేసిన ఆరోపణలు నిరాధారమన్నారు. రూ. 2000 నోటు మారకంలో లేనిదా? అని ప్రశ్నస్తూ, వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇదేమీ అక్రమం కాదు. ఎవరైనా రూ. 2000 నోటు ఇస్తే అదేమీ నల్ల ధనం అయిపోదని అన్నారు. రైలు ప్రమాద బాధితులకు రూ. 2000 నోటు పంపిణీ చేసిన ఉదంతం పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాలోని బసంతీలో చోటుచేసుకుంది. టీఏంసీ నేత బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా అందరినీ కలచివేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 288 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: 40 మృతదేహాలపై కనిపించని గాయాలు মমতা বন্দ্যোপাধ্যায়ের নির্দেশে তৃণমূল দলের পক্ষ থেকে নিহতদের পরিবারকে 2 লক্ষ টাকার আর্থিক সাহায্য করছেন রাজ্যের একজন মন্ত্রী। সাধুবাদ জানাই। কিন্তু এপ্রসঙ্গে এই প্রশ্নটাও রাখছি, একসাথে 2000 টাকার নোটে 2 লক্ষ টাকার বান্ডিলের উৎস কি? pic.twitter.com/TlisMituGG — Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) June 6, 2023 -
నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ దంపతులు ఒడిశా రైలు ప్రమాద బాధితులకు మద్దతు ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రిలయన్స్ ఫౌండేషన్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ అన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే, తమ ప్రత్యేక విపత్తు నిర్వహణ బృందం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్ని అందించిందన్నారు. రిలయన్స్ స్టోర్ల ద్వారా బాధిత కుటుంబాలకు వచ్చే ఆరు నెలల పాటు పిండి, పంచదార, పప్పు, బియ్యం, ఉప్పు, వంటనూనెతో సహా ఉచిత రేషన్ సరఫరాలను అందించ నున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు అంబులెన్స్లకు ఉచిత ఇంధనాన్ని, ప్రమాదంలో గాయపడిన వారికి ఉచిత మందులు, చికిత్సను అందించనున్నట్టు ప్రకటించింది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్కు చెందిన దాతృత్వ విభాగం రిలయన్స్ ఫౌండేషన్. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే. బాధితుల నష్టాన్ని పూడ్చలేం కానీ మరణించిన కుటుంబాలు ఈ విషాదం నుంచి కోలుకుని వారి జీవితాలను తిరిగి గాడిలో పెట్టుకునేలా, ముందుకు నడిచేలా చేసేందుకు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ లక్ష్యంతో 10-పాయింట్ల ప్రోగ్రామ్ను నీతా అంబానీ ప్రకటించారు. (ఆకాష్ అంబానీ ముద్దుల తనయ ఫస్ట్ పిక్ - వీడియో వైరల్) బాధితులకు అండగా పది పాయింట్ల ప్రోగ్రామ్ ►గాయపడిన వారి తక్షణ కోలుకోవడానికి అవసరమైన మందులు, ప్రమాదాల కారణంగా ఆసుపత్రిలో చేరిన వారికి వైద్య చికిత్స. ► విషాదం నుంచి కోలుకునేందుకు మద్దతు కోసం కౌన్సెలింగ్ సేవలు. ►జియో, రిలయన్స్ రీటైల్ ద్వారా మరణించిన వారి కుటుంబంలోని సభ్యునికి ఉపాధి అవకాశాలు ►వీల్చైర్లు, ప్రొస్థెసెస్తో సహా వైకల్యాలున్న వ్యక్తులకు సహాయ సహకారాలు అందించడం. ►కొత్త ఉపాధి అవకాశాలను కనుగొనడానికి బాధిత ప్రజలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ. ►తమ కుటుంబంలోని ఏకైక సంపాదన సభ్యుడిని కోల్పోయిన మహిళలకు మైక్రోఫైనాన్స్ , శిక్షణ అవకాశాలు. ►ప్రమాదంలో ప్రభావితమైన గ్రామీణ కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం ఆవు, గేదె, మేక, కోడి వంటి పశువులను అందించడం. ►మరణించిన కుటుంబ సభ్యునికి జియో ద్వారా ఒక సంవత్సరం పాటు ఉచిత మొబైల్ కనెక్టివిటీ -
విద్యా దీవెనతో మారిన బతుకుచక్రం..!
-
సొంత ఇల్లు కట్టుకోగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది..!
-
తల ఎత్తుకుని వ్యవసాయం చేసేలా చేసారు..!
-
జగనన్న ప్రభుత్వం చొరవతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు..!
-
జగనన్న చేసిన సాయంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాం.. ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికీ మర్చిపోము..!
-
మా గ్రూపునకు ₹5 లక్షలు రుణమాఫీ..జగన్ గారి ప్రభుత్వం అందించిన సహాయ
-
గోడు విని.. తోడుగా నిలిచి..
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజల కష్టాలు విని.. చలించి.. స్పందించి.. అవసరమైన సహాయం అందించి.. తోడుగా ఉన్నాననే మనోధైర్యం కల్పించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది అగ్రస్థానమనే విషయం మరోసారి రుజువైంది. ఇటీవల కొవ్వూరులో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన సభకు వచ్చిన ఆయనకు.. పలువురు వివిధ సమస్యలపై వినతులు ఇవ్వడం.. వారిలో ఇటీవల అనేక మందికి రూ.21 లక్షల మేర ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఓ దివ్యాంగుడికి రూ.5 లక్షలు మంజూరు చేస్తూ భరోసా కల్పించారు. జిల్లాలోని గోపాలపురానికి చెందిన చల్లా వీర నాగరాజు బీకాం పూర్తి చేసి, ప్రస్తుతం ఎంకాం చదువుతున్నాడు. 2015లో ప్రమావశాత్తూ విద్యుత్ షాక్తో 98 శాతం శారీరక అంగవైకల్యానికి గురయ్యాడు. నాటి టీడీపీ ప్రభుత్వంలో ఇతడికి ఎటువంటి సహాయమూ అందలేదు. ప్రస్తుతం మానవత్వంతో స్పందించే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలన రావడంతో.. అతడు తన సమస్యను స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, హోం మంత్రి తానేటి వనిత దృష్టికి తీసుకువెళ్లాడు. నాగరాజు దుస్థితి చూసి ఎమ్మెల్యే, మంత్రి చలించిపోయారు. వారి సూచన మేరకు ఈ నెల 24న కొవ్వూరు సభకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నేరుగా కలిశాడు. అతడి కష్టాలపై స్పందించిన సీఎం జగన్.. రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు. ఈమేరకు చెక్కును కలెక్టర్ కె.మాధవీలత శనివారం కలెక్టరేట్లో నాగరాజుకు అందజేశారు. చదువుతో సమాజంలో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉందని, చదువు కొనసాగించాలని అతడికి సూచించారు. ముఖ్యమంత్రి అందజేసిన ఆర్థిక సహాయంతో జీవనోపాధికి అవసరమైన యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఆసక్తి మేరకు జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన నైపుణ్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద వలంటీర్ ప్రతి నెలా తన ఇంటికి వచ్చి రూ.3 వేలు పెన్షన్ అందిస్తున్నారని నాగరాజు చెప్పాడు. తనకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించిన సీఎంకు, హోం మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. తన కష్టంపై స్పందించి, సాయం అందించిన సీఎం జగన్ మనసున్న మారాజు అని నాగరాజు కొనియాడాడు. -
థాంక్యూ జగనన్న.. వాలంటీర్ సోంబాబు కృతజ్ఞతలు
సాక్షి, ఎన్టీఆర్: సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు.. ఈ నినాదం మాటేమోగానీ దానిని చేతల్లో చూపిస్తున్న నేత మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ‘‘మీరే నా కుటుంబం, మీకు అండగా నేను ఉన్నాను. మీ జీవితాలకు నాదీ భరోసా. మీ బాధలను నేను చెరిపేస్తా’’ అంటూ సహాయం కోసం అర్థించిన కుటుంబాల్లో స్వయంగా వెలుగులు నింపుతున్నారాయన. సహయం కోసం వచ్చేవాళ్లతో ఫొటోలకు ఫోజులు ఇచ్చే బాపతి కాదు ఆయన. సావధానంగా వాళ్ల సమస్యలను విని.. అప్పటికప్పుడే అధికారులతో ఆ సమస్య గురించి చర్చించి.. గంటల వ్యవధిలోనే సహయం అందేలా చూస్తున్నారు కూడా. తాజాగా.. అలా సాయం అందుకున్న వాలంటీర్ జక్కుల సోంబాబు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేశాడు. పెనమలూరు మండలం కానూరు మురళి నగర్, 20వ వార్డులో ఐదవ నెంబర్ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నాడతను. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సోంబాబుకి.. పెద్ద ఆపదే వచ్చిపడింది. అతని రెండు కిడ్నీలు చెడిపోయాయి. అయినా ఆ సమస్యను లెక్కచేయకుండా వాలంటీర్గా చిత్తశుద్ధితో పని చేస్తున్నాడతను. అందుకే సీఎం జగన్పై ఉన్న అభిమానం కూడా ఓ కారణమని చెబుతున్నాడతను. కిడ్నీలు పూర్తిగా చెడిపోయి.. డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి అతనిది. తల్లి సాధారణ కూలీ కావడంతో ఆర్థికంగా ఇబ్బందిగా మారుతూ వస్తోంది. అయినా కూడా వాలంటీర్ బాధ్యతలను ఏమాత్రం విస్మరించలేదతను. ఈలోపు అతని సమస్య సీఎం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లింది. శుక్రవారం ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమంలో పాల్గొని సభ ముగించుకొని బయలుదేరిన సీఎం జగన్ను.. సోంబాబు, అతని తల్లి కలిశారు. అతని సమస్య తెలుసుకున్న సీఎం జగన్ చలించిపోయారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుని పిలిచి సోంబాబుకు తక్షణసాయంగా రెండు లక్షల రూపాయలు అందించాలని ఆదేశించారు. ఈ సాయంతో పాటుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సాయం అక్కడితోనే ఆగలేదు.. డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం ఇస్తున్న పదివేల రూపాయల పెన్షన్ కూడా అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక కిడ్నీ మార్పిడికి అవసరమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా తక్షణమే పూర్తిచేయాలని చెప్పారు. ఆ సర్జరీకి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని సోంబాబు కుటుంబానికి హామీ ఇచ్చారు సీఎం జగన్. ఆ సహాయం తన జీవితంలో మర్చిపోలేనని చెబుతూ సోంబాబు సంతోషంగా సీఎం జగన్కు పాదాభివందనం చేయబోగా.. ఆయన వద్దని వారించారు. తన ప్రభుత్వంలో వాలంటీర్లకు ఎటువంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని సీఎం జగన్ ప్రకటించారు. రెండు లక్షల చెక్కు అందజేత ఒక వాలంటీర్కు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేసి చూపించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. గంట లోపే సోంబాబు కుటుంబాన్ని తన కార్యాలయానికి పిలిపించుకుని సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల చెక్ అందించారు. అలాగే సోంబాబుకు సీఎం జగన్ ప్రకటించిన ఇతర సహాయాలనూ కలెక్టర్ కార్యాలయం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారాయన. ఇదీ చదవండి: సీఎం జగన్ ‘సూత్రం’.. వారికి గుణపాఠం అవుతుందా? -
అలేఖ్యకు రూ.50వేలు ఆర్థికసాయం అందజేత
నల్గొండ: గుర్రంపోడు మండలం కొత్తలాపురం గ్రామానికి చెందిన కట్టెబోయిన అలేఖ్య నిడమనూరు ఆదర్శ పాఠశాలలో చదువుతూ ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో 9.7 జీపీఏ సాధించింది. అలేఖ్య తల్లి లక్ష్మమ్మ కేన్సర్తో బాధపడుతూ ఫిబ్రవరి 11న మృతిచెందింది. ఆమె తండ్రి వారిని వదిలి వెళ్లిపోయాడు. ‘పది’లో సత్తా చాటిన విద్యార్థిని, అలేఖ్యకు బాసటగా నిలుస్తాం అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనాలకు పలువురు దాతలు స్పందించి ఆమెకు ఆర్థికసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు పటాన్చెరువు సీఐ నూకల వేణుగోపాల్రెడ్డి తాను చేపట్టిన వన్ చాలెంజ్ ద్వారా హైదరాబాద్లోని ఓ బట్టల షాపులో పనిచేస్తున్న కట్టెబోయిన అలేఖ్యను బుధవారం కలిసి రూ.50వేలు ఆర్థికసాయం అందజేశారు. సాయం అందిచాలనుకునే వారు: కట్టెబోయిన అలేఖ్య యూనియన్ బ్యాంక్(పెద్దవూర బ్రాంచ్) A/C NO: 194612120000001 IFSC CODE:UBIN 0819468 -
విజయానికి చేయూత
-
ఆదుకోవాలని వచ్చిన వారికి తక్షణ సాయం
ఆపదలో ఉన్న వారు సాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు వస్తే ఆయన తక్షణమే స్పందించి చేయూతనిస్తుంటారు. గతంలో పలుచోట్ల నేరుగా బాధితుల వద్దకు వెళ్లి సాయం చేసిన సందర్భాలు కోకొల్లలు. అదేవిధంగా శుక్రవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి వచ్చి న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పలువురు తమ సమస్యలు చెప్పుకోగా వారికీ ఆర్థిక సాయం అందించి సీఎం మరోసారి తన గొప్ప మనస్సు చాటుకున్నారు. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. – నెల్లూరు (సెంట్రల్) ♦ కలిగిరికి చెందిన బత్తిన షణ్ముఖకుమార్ అనే చిన్నారిని తండ్రి శ్రీనివాసులు ముఖ్యమంత్రి వద్దకు తీసుకుకొచ్చారు. జన్యుపరమైన సమస్యతో ఎదుగుదలలేక ఇబ్బందులు పడుతున్నాడని, తమకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. దీంతో ముఖ్యమంత్రి స్పందించి మెరుగైన వైద్యం చేయించాలని కలెక్టర్కు సూచించి, తక్షణ సాయం కింద రూ.లక్ష నగదును అందేలా చేశారు. ♦ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం వేల్పుచర్లవల్లపల్లి గ్రామానికి చెందిన పి. నాగరాజు అనే వికలాంగుడు ముఖ్యమంత్రికి తన వేదనను మొరపెట్టుకున్నాడు. తనకు కాలు, చెయ్యిలేదని ఆదుకోవాలని కోరాడు. ముఖ్యమంత్రి స్పందించి తక్షణమే ఆర్థిక సాయాన్ని అందిస్తూ అవసరమైన వైద్యాన్ని అందించేలా చూడాలని కలెక్టర్కు సూచించారు. ♦ ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన మర్రిపూడి సుబ్బారావు అనే వికలాంగుడు ముఖ్యమంత్రిని కలిసి రోడ్డు ప్రమాదంలో కాలు దెబ్బతినిందని, తనకెవరూ లేరని, ఆర్థిక సాయంచేస్తే వైద్యం చేయించుకుంటానని చెప్పుకొచ్చాడు. సీఎం వెంటనే స్పందించి రూ.లక్ష ఆర్థిక సాయం అందేలా చూశారు. ♦ కావలికి చెందిన పోసిన వెంకట్రావు అనే వికలాంగుడు తనకు ఆరోగ్యం సరిగాలేదని, ఆర్థిక సాయంచేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాడు. స్పందించిన వైఎస్ జగన్ తక్షణ ఆర్థిక సాయంగా రూ.లక్ష అందించేలా చేశారు. ♦ సర్వేపల్లికి చెందిన దంపతులు తమ కుమార్తె నోసం అమూల్య అరుదైనవ్యాధితో బాధపడుతోందని నాలుగేళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి వారు తీసుకొచ్చారు. చలించిన సీఎం జగన్మోహన్రెడ్డి తక్షణ సాయంగా రూ.లక్ష అందించి, మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ♦ కందుకూరు సమీపంలోని కళవళ్ల గ్రామానికి చెందిన దుగ్గిరాల రాధ తన ఇద్దరు చిన్నారులను తీసుకుని ముఖ్యమంత్రి వద్దకు వచ్చింది. తన భర్త దుగ్గిరాల రాఘవులుకు (గ్రామ సర్పంచ్) కిడ్నీలు చెడిపోయాయని, వైద్యం చేయించే ఆర్థిక స్థోమత తమకు లేదని, తన భర్తను ఆదుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. స్పందించిన ముఖ్యమంత్రి.. అతనికి ఖర్చులు చూడాలని, మెరుగైన వైద్యం చేయించాలని కలెక్టర్కు సూచించారు. తక్షణ ఆర్థిక సాయం కింద రూ.లక్ష చెక్కును అందచేశారు. అలాగే, కిడ్నీ బాధితులకు ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేల పింఛన్ వెంటనే మంజూరు చేయాలని కూడా అధికారులను సీఎం ఆదేశించారు. ♦ పొదలకూరు మండలం ఊట్లపాళెంకు చెందిన వెంకట అఖిల్ అనే వ్యక్తి తనకు వెన్నెముక ఆపరేషన్ జరిగిందని.. ఆరోగ్యం సరిగాలేదని, మరింత మెరుగైన వైద్యం చేయించుకునే స్థోమత లేదని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాడు. దీంతో సీఎం స్పందించి తక్షణ సాయం కింద రూ.లక్ష అందజేసేలా చూశారు. -
ఐసీయూలో తల్లి .. ఆకలితో చిన్నారి
(హైదరాబాద్, గాందీఆస్పత్రి): చావుబతుకుల మధ్య తల్లిప్రాణం కొట్టుకుంటుంది.. ఆరుబయట చిన్నారి ఆకలితో అల్లాడుతున్నాడు. నేనున్నాను అనే భరోసా ఇవ్వాల్సిన వ్యక్తి తనకేమి పట్టనట్లు ఇద్దరినీ అలాగే వదిలేసి వెల్లిపోయాడు. ఆకలితో పాటు అమ్మకోసం ఏడుస్తున్న చిన్నారిని చేరదీసి, ఆకలి తీర్చి వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న తల్లిని చూపించి మానవత్వం చాటుకున్నారు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ సలూరాకేంపు ప్రాంతానికి చెందిన గంగాధర్, మాధవి భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల బాబు సాతి్వక్ ఉన్నాడు. రెండవ కాన్పు కోసం ఈ నెల 1న మాధవి గాంధీ ఆస్పత్రిలో చేరింది. అదే రోజు ఆడశిశువు పుట్టిన వెంటనే చనిపోయింది. తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయస్థితి చేరిన మాధవికి మెటరీ్నటీ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ (ఎంఐసీయూ) లో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. జాడలేని భర్త ఆచూకీ.. కారణం తెలియదు కానీ మాధవి భర్త గంగాధర్ ఈనెల 2వ తేదీన కుమారుడు సాతి్వక్ను గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో వదిలేసి వెల్లిపోయాడు. ఆకలితో అల్లాడుతూ అమ్మ కోసం రోధిస్తున్న చిన్నారిని గాంధీ సెక్యూరిటీ సిబ్బంది గమనించి అన్నం పెట్టి బుజ్జగించి ఆరా తీశారు. పలు వార్డులను తిప్పుగా వెంటిలేటర్పై అపస్మారకస్థితిలో ఉన్న అమ్మను చిన్నారి సాతి్వక్ గుర్తించాడు. కేస్ ట్లో ఉన్న గంగాధర్ సెల్ఫోన్ నంబరుకు కాల్ చేయగా స్విచ్చాఫ్ వస్తోంది. గాంధీ సెక్యూరిటీ సూపర్వైజర్ శివాజీ నేతృత్వంలో సిబ్బంది ఆంజనేయులు, శ్రీకాంత్, నర్సింహా, కళ్యాణ్, నాగరాజు, శివకుమార్, వరలక్ష్మీ, లావణ్య, అనురాధలు గత మూడు రోజులుగా చిన్నారి సాతి్వక్ను షిఫ్ట్డ్యూటీ ప్రకారం వంతుల వారీగా చేరదీసి అన్నం పెట్టి ఆకలి తీర్చి అమ్మను మరిపిస్తున్నారు. ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న మాధవికి రోగి సహాయకులు లేకపోవడంతో మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)గా పరిగణించి వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. మాధవి కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు ఆధారంగా ఉన్న ఫోన్ నంబరు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోందన్నారు. చిన్నారిని చేరదీసి మానవత్వం చాటుకున్న సెక్యూరిటీ సిబ్బందిని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, జీడీఎక్స్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధి రవికుమార్లతోపాటు పలువురు వైద్యులు, రోగి సహాయకులు అభినందిస్తున్నారు. -
స్కిల్ హబ్స్ ద్వారా నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
-
మరోసారి వాత్సల్యం చూపిన సీఎం వైఎస్ జగన్
-
పేదింటి చిన్నోడికి.. పెద్ద కష్టం
నిర్మల్రూరల్: ఆడుతూ పాడుతూ తిరిగే చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో నిరుపేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన వైశాలి, రవి దంపతుల కుమారుడు రాహుల్ (9 నెలలు) రక్తప్రసరణ వ్యవస్థలో ఇబ్బంది తలెత్తింది. వైద్యానికి రూ.లక్షలు కావడంతో ఆ పేద కుటుంబం ఒక్కగానొక్క బిడ్డను కాపాడుకునేందుకు అల్లాడుతోంది. వైశాలి, రవి దంపతులకు మూడేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల తర్వాత రాహుల్ జన్మించాడు. ఏడు నెలల వయసులో జ్వరం రావడంతో జిల్లా కేంద్రంతో పాటు నిజామాబాద్లో వైద్యులకు చూపించారు. ఎంతకీ నయం కాకపోవడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు పిల్లల ఆసుపత్రిని సంప్రదించారు. అయితే అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం రాహుల్కు రక్తప్రసరణ వ్యవస్థలో లోపం ఉందని, తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆపరేషన్ ఖర్చు సుమారుగా రూ.3.50 లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆ నిరుపేద తల్లిదండ్రులు ఆపరేషన్కు డబ్బులు లేక తల్లడిల్లుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో తమను ఆదుకోవాలని, దాతల తమ కుమారుడిని కాపాడాలని వేడుకుంటున్నారు. సంప్రదించాల్సిన నం. 9676034110 -
పోలీసులకు చుక్కలు చూపించిన దొంగ.. ఈ డెలివరి బాయ్ ఏం చేశాడంటే..
-
మాటిచ్చారు..నిలబెట్టుకున్నారు
‘మీ బిడ్డలకు నేను ఉన్నాను అక్కా..’ ఓ సామాన్య పేదరాలితో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న మాట ఇది. ఆ ఒక్క మాట ఇద్దరు బిడ్డల ప్రాణాలకు సంజీవనిగా మారింది. ఏళ్లకు ఏళ్లు ఏడుస్తూ బతుకుతున్న ఆ కుటుంబంలో ఆశల దీపాన్ని వెలిగించింది. చిన్నారుల చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేస్తూ అవస్థలు పడుతున్న వారికి ఓ దారిని చూపించింది. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ మందులతో ఆకలి తీర్చుకుంటున్న పసివాళ్లకు శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చింది. సికిల్ సెల్ ఎనీమియా అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న జి.సిగడాంకు చెందిన ఇద్దరు చిన్నారుల ఆపరేషన్ కోసం వైఎస్ జగన్ సర్కారు రూ.32 లక్షల నగదు విడుదల చేసింది. శ్రీకాకుళం: మండల పరిధిలోని డీఆర్ వలస గ్రామానికి చెందిన పాండ్రంగి సుబ్బలక్ష్మి, రామారావు దంపతుల కుమారులు తిరుపతిరావు(12), యశ్వంత్ (10)లు సికిల్ సెల్ ఎనీమియా అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నారు. ఈ బిడ్డల దీనస్థితిపై ‘సాక్షి’లో గత ఏడాది జూన్ 29 కథనం కూడా ప్రచురితమైంది. ఇన్నాళ్లకు ఆ ఇద్దరు చిన్నారుల జబ్బు శాశ్వతంగా నయమయ్యే మార్గం కనిపించింది. గత ఏడాది ఆగస్టు 26న విశాఖకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాగా.. ఆయన వద్దకు వెళ్లిన సుబ్బలక్ష్మి, రామారావు దంపతులు బిడ్డల పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. చిన్నారులకు సాయం చేస్తానని ఆనాడే సీఎం మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆస్పత్రిలో శస్త్ర చికిత్సకు అయ్యే ఖర్చును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రక్తహీనతతో ఇబ్బంది.. తిరుపతిరావు, యశ్వంత్లు ఐదేళ్లుగా ఈ రక్తహీనత వ్యాధితో బాధ పడుతున్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్తో ఈ వ్యాధి నయమయ్యే అవకాశం ఉందని తెలియడంతో.. బోన్మ్యారో ఇవ్వడానికి కూడా తల్లిదండ్రులు ముందుకువచ్చారు. కానీ ఆ ఆపరేషన్కు చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉండడంతో ముందుకు వెళ్లలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విశా ఖ వెళ్లి సీఎం జగన్కు తమ పరిస్థితి చెప్పారు. ‘మీ బిడ్డలకు నేను ఉన్నాను అక్కా..’ అంటూ ఆప్యాయంగా మాట్లాడిన సీఎం.. ఒక్కో చిన్నారికి చికిత్సకు రూ.16 లక్షల చొప్పున రూ.32 లక్షలు మంజూరు చేశారు. హైదరాబాద్లోని అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్లో ముందుగా పెద్ద కుమారుడికి ఆపరేషన్ చేసి ఆ తర్వాత చిన్నోడికి కూడా శస్త్ర చికిత్స చేస్తారు. -
మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్
-
బంధాలన్నీ దూరమాయే.. ఆఖరి మజిలీలో అనాథలా..
కాకినాడ క్రైం: నవమాసాలూ మోసి, కని పెంచిన కొడుకులున్నారు.. అయినవారందరూ ఉన్నారు.. అయినా ఆఖరి మజిలీలో ఆ తల్లిని పట్టించుకోలేదు. కడసారి చూపు కూడా వద్దనుకున్నారు.. దీంతో అన్నీ తానే అయి ఓ ట్రాన్స్జెండర్ ఆ పిచ్చితల్లికి అంతిమ సంస్కారం చేసింది. వివరాలివీ.. కాకినాడ పర్లోవపేటలోని రాజీవ్ గృహకల్ప ఫ్లాట్ నంబర్–8లో యల్ల ప్రభావతి (50) నివాసం ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కొన్నేళ్ల క్రితం కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ దంపతులకు ఏడేళ్ల కుమారుడు లక్కీ ఉన్నాడు. భర్త బాధ్యతా రాహిత్యాన్ని భరించలేక దుర్గాప్రసాద్ భార్య లక్ష్మి మరొకరితో వెళ్లిపోయింది. అప్పటి నుంచీ మనవడు లక్కీ, కొడుకు దుర్గాప్రసాద్తో కలిసి ప్రభావతి జీవిస్తోంది. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం దుర్గాప్రసాద్ కూడా వారిని వదిలిపెట్టి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. మనవడు లక్కీ అంటే ప్రభావతికి ప్రాణం. మనవడికి ఏ లోటూ రానిచ్చేది కాదు. తాను తిన్నా తినకపోయినా తనకు వచ్చే వైఎస్సార్ వితంతు పెన్షన్తో ఉన్నంతలోనే ఆ పసివాడిని కంటికి రెప్పలా చూసుకునేది. ఇది చూసి చుట్టుపక్కల వారు అబ్బురపడేవారు. ఇదిలా ఉండగా, గత నెల 30వ తేదీన కోడలు లక్ష్మి ఉన్నట్టుండి వచ్చింది. ఇంట్లోని పలు సామగ్రిని తనవంటూ తీసుకువెళ్లిపోబోయింది. అయితే తమ వద్ద చేసిన అప్పు తీర్చి సామాన్లు తీసుకెళ్లమంటూ ఆమెను చుట్టుపక్కల వారు నిలువరించారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో అత్త ప్రభావతితో లక్ష్మి గొడవ పడింది. కావాలనే అప్పుల వాళ్లను పిలిచావంటూ మండిపడింది. తగిన శాస్తి చేస్తానని బెదిరింది. తను కన్న కొడుకు లక్కీని తనకు ఇచ్చేయమంటూ పట్టుబట్టింది. బలవంతంగా తీసుకెళ్లిపోతుంటే ప్రభావతి ఏడుస్తూ కాళ్లావేళ్లా పడింది. చుట్టుపక్కల వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా, తన కొడుకునే తీసుకువెళ్తున్నానంటూ లక్కీని తీసుకుని లక్ష్మి వెళ్లిపోయింది. మనవడిపై బెంగతో ఏడుస్తున్న ప్రభావతిని ఇరుగు పొరుగు వారు రాత్రి ఓదార్చి పడుకోమని చెప్పి వెళ్లారు. ఉదయం చూసేసరికి ప్రభావతి ఇంట్లో విగతజీవిగా కనిపించింది. పక్కనే ఉన్న గ్లాసులో మామిడి కాయలు మగ్గించే కాల్షియం కార్బయిడ్ ద్రావణాన్ని గుర్తించారు. ఆమె మృతి విషయం ఆ ప్రాంతంలో అందరికీ తెలిసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. సమాచారం ఇచ్చినా సమీపంలోని బంధువులూ రాలేదు. అదే ఫ్లాట్ సమీపంలో ట్రాన్స్జెండర్ కావ్య నివాసం ఉంటోంది. ప్రభావతి దుస్థితి గమనించి చలించిపోయింది. జరిగిందంతా హైదరాబాద్లో ఉంటున్న సర్వీస్ హార్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు ఆనంద్కు ఫోన్లో వివరించి, సహాయం కోసం అర్థించింది. ఆయన సూచనల మేరకు ప్రభావతి మృతదేహాన్ని కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్కు అంబులెన్సులో తీసుకెళ్లింది. ప్రభావతి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీజీహెచ్కు తరలించాలని సూచించారు. వారి సూచనల మేరకు ప్రభావతి మృతదేహాన్ని కావ్య జీజీహెచ్ మార్చురీకి తరలించింది. తల్లి మరణంపై కుమారుడికి పోలీసులు సమాచారం ఇచ్చినా రాలేనని చెప్పాడు. సమీప బంధువులు, రక్త సంబంధీకుల రాక కోసం ఎదురు చూశారు. ఏ ఒక్కరూ రాకపోవడంతో ఫోరెన్సిక్ వైద్యులు ప్రభావతి మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ డ్రైవర్ సాయంతో కాకినాడ బస్టాండు వద్ద ఉన్న శ్మశాన వాటికకు కావ్య తరలించింది. ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అంబేద్కర్ సాయంతో ప్రభావతి మృతదేహాన్ని ఖననం చేసింది. -
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
-
గర్లఫ్రెండ్ని టైంకి డ్రాప్ చేయాలన్న ఇంటెన్షన్ పోలీసులకు పట్టించి..చివరికి..
గర్లఫ్రెండ్ కోసం అరెస్టు అయ్యాడో ఓ వ్యక్తి. చివరికి అదే అతడి బండారం మొత్తం బయట పెట్టించి.. జైలు పాలయ్యేలా చేసింది. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకు చెందిన జెవోన్ పియర్ జాక్సన్ అనే వ్యక్తి తన స్నేహితురాలికి ఇంటర్యూ ఉండటంతో తానే డ్రాప్ చేయాలని అనుకున్నాడు. ఆమెను కరెక్ట్ టైంకి తీసుకెళ్లి సాయం చేయాలనకున్నాడు జాక్సన్. ఐతే అప్పటికే అతని కారు వెనుక సీటులో తన ముగ్గురు పిల్లలు ఉన్నా..ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు. ఐతే అతను తన గర్లఫ్రెండ్కి సాయం చేసి ఇంప్రెస్ చేయాలన్న ఆతృతలో వేగంగా కారుని నడిపాడు. ఈ క్రమంలో రద్దీగా ఉండే ఫాల్స్ చర్చ్రోడ్ వద్ద స్పీడ్గా కారుని పోనిచ్చాడు. బ్లాక్ మెర్సిడేజ్ కారులో వేగంగ వెళ్లిపోతున్న జాక్సన్ పోలీసుల వాహనాన్ని సైతం పట్టించుకోకుండా క్రాస్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. దీంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమై జాక్సన్ కారుని అడ్డుకున్నారు. అతను రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఒక తెల్లటి పికప్ కారుని ఢీ కొట్టయేబోతుండగా..త్రుటిలో ప్రమాదం తప్పినట్టు సమాచారం దీంతో పోలీసులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని.. విచారించడం ప్రారంభించారు. అతడు గతంలో పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. అదీగాక కారులో పిల్లలు ఉన్నా కూడా ఇంత ప్రమాదకరమైన వేగంతో నడిపినందుకుగానూ జాక్సన్పై పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తి 22 ఏళ్ల జాక్సన్ని బ్రెవార్డు కౌంటి జైలుకి తరలించారు. అతను ఈ కేసు విషయమై ఏప్రిల్ 18న కోర్టు ఎదుట హాజరుకావల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. (చదవండి: టాయిలెట్కి వెళ్లలేని అరుదైన సమస్య! పగవాడికూడా వద్దంటూ విలపిస్తున్న మహిళ) -
పాము కాటేస్తే విషం పీల్చి ప్రాణరక్షణ
యశవంతపుర: కంటే కూతుర్నే కనాలి అనే మాటకు ఆ బాలిక నిదర్శనంగా నిలిచింది. తల్లికి పాము కాటు వేయగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమె ప్రాణాలను కాపాడిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకా కెయ్యూరు గ్రామంలో జరిగింది. సతీశ్ రై భార్య మమత వారం రోజుల క్రితం పొలంలో పనిచేస్తుండగా ఒక నాగుపాము కాటు వేసింది. ఆమె పరుగున ఇంటికి వెళ్లింది. కూతురు శ్రమ్య తల్లికి పాము కాటేసిన చోట నోటితో మూడుసార్లు విషం లాగి ఉమ్మేసింది. తరువాత ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు చికిత్స చేయడంతో మమత కోలుకుంది. విషం శరీరంలోకి చేరని కారణంగా ప్రమాదం నుండి బయట పడినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా, శ్రమ్యను స్థానికులు అభినందనలతో ముంచెత్తారు. శ్రమ్య బీసీఎ చదువుతోంది. -
అర్ధరాత్రి నడిరోడ్డుపై ఉన్న కుటుంబానికి జవాన్ల సాయం.. ఆకట్టుకుంటున్న వీడియో
-
దీనస్థితిలో పాకీజా.. అండగా నిలిచిన మంచు విష్ణు
సినీ నటుల జీవితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. వారి జీవితంలో ఒడుదొడుకులు రావడం సహజం. ఇక కొందరి జీవితాలు మరీ దుర్భరమైన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. అలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ నటి పాకీజా. ఆమె దీన స్థితిని చూసిన టాలీవుడ్ హీరోలు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలు సాయం చేయగా.. తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు అండగా నిలిచారు. అసెంబ్లీ రౌడీ చిత్రంలో ఆమె పాత్రకు బాగా గుర్తింపు వచ్చింది. బ్రహ్మనందంతో కలిసి ఆమె చేసిన కామెడీకి తెలుగు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. చాలా సినిమాల్లో ఆర్టిస్ట్గా రాణించిన ఆమె పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వెంటనే పాకీజాకి లక్షరూపాయలు అందించి మరోసారి మంచి మనసును చాటుకున్నారు. ఆ తర్వాత ఆమె విషయం తెలుసుకున్న మోహన్ బాబు.. స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. తాను అమెరికాలో ఉన్నానని ఇండియా రాగానే సాయం చేస్తానని మాట ఇచ్చినట్లుగా పాకీజా తెలిపింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మంచు విష్ణు ఆమెకు అండగా నిలిచారు. తన సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డును ఆమెకు అందించనున్నాడు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మా అసోసియేషన్ కార్డుకు గతంలో రూ.లక్ష రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు రూ. 90 వేలకు తగ్గించారు. మా అసోసియేషన్కు కట్టాల్సిన రూ.90 వేల రూపాయలను మంచు విష్ణు చెల్లించి పాకీజాకు కార్డు ఇస్తారంటూ కల్యాణి వెల్లడించింది. దీంతో ఆమె కుటుంబానికి మా అసోసియేషన్ ద్వారా లభించే అన్నింటికీ అర్హత దక్కుతుందని తెలిపింది. -
గొప్ప మనసు చాటుకున్న నమ్రతా
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో మహేశ్ బాబు-నమ్రతా శిరోద్కర్ల ఒకటి. వెండితెరపై హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన వీరు నిజజీవితంలోనూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే మహేశ్ బాబు సమాజసేవలోనూ ముందున్నారు. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిన్నారులకు గుండె ఆపరేషన్ల కోసం అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నమ్రతా శిరోద్కర్ తన ఉదారతను చాటుకున్నారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఓ పేద విద్యార్థినికి అండగా నిలిచారు. ఏవియేషన్ చదువుకునేందుకు ల్యాప్ టాప్ అందించారు. బాగా చదువుకుని మీ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలని నమ్రతా విద్యార్థికి సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో నెటిజన్ల నుంచి మహేశ్, నమ్రతలకు ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ సందర్బంగా నమ్రతా సాయంపై ఏవియేషన్ విద్యార్థి, ఆమె తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. నా చదువుకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న మహేశ్ బాబు ఫ్యామిలీకి నేను రుణపడి ఉంటానని తెలిపింది. On this #InternationalWomensDay2023, #NamrataMaheshGhattamaneni & @urstrulyMahesh sponsored laptop and educational support for a bright Aviation student through @MBfoundationorg. ❤️ #IWD2023 #WomensDay #MaheshBabu pic.twitter.com/hMqulMbiWw — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 8, 2023 -
ప్రభుత్వ సాయంతో నిలదొక్కుకుంటున్న పేద కుటుంబాలు
-
'సహాయం చేయడమే మా కర్తవ్యం': మోదీ
తుర్కియే, సిరియాలో ఫిబ్రవరి 6న భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు భారత బలగాలు భూకంప ప్రభావిత దేశానికి సహాయా సహకారాలు అందించేందుకు సమయాత్తమయ్యాయి. అందులో భాగంగా ఆపరేషన్ దోస్త్ పేరుతో మొత్తం మూడు ఎన్డీఆర్ఎప్ బృందాలు ఫిబ్రవరి 7న ప్రభావిత ప్రాంతాలకు తరలి వెళ్లాయి. అంతేగాదు భూకంప బాధిత ప్రజలకు విస్తృతమైన సేవలందించడానికి భారత సైన్యం, వైద్య బృందం భారీ సంఖ్యలో మోహరించి సహాయ సహకారాలు అందించింది. ఈ క్రమంలో టర్కీ నుంచి తిరిగి వచ్చిన సిబ్బందిని ఉద్దేశించి మోదీ మీరు మానవాళికి గొప్ప సేవ చేశారని, అలాగే భారతదేశాన్ని గర్వించేలా చేశారని అన్నారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్ వేదికగా...మేము ప్రంపంచాన్ని కుటుంబంగా పరిగణిస్తాం. సంక్షోభంలో ఉన్న ఏ సభ్యునికైనా.. త్వరగా సహాయం చేయడం మా కర్తవ్యంగా భావిస్తాం. భారతదేశం గత కొన్నేళ్లుగా స్వయం సమృద్ధి కలిగిన దేశంగా తన గుర్తింపును బలోపేతం చేసిందని, ఇది నిస్వార్థంగా ఇతర దేశాలకు సహాయం చేస్తోంది. ప్రపంచంలో ఏ సంక్షోభం వచ్చినా.. మొదట స్పందించేందకు భారత్ ఎప్పుడూ సదా సిద్దంగానే ఉంటుంది. అలాగే ప్రపంచంలోనే అత్యుత్తమ రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్గా మన గుర్తింపును పటిష్టం చేసుకోవాలి. అలాగే విపత్తు ప్రతిస్పందన సహాయక చర్యల్లో మన బలగాల కృషి అభినందనీయమని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా అంతకు ముందురోజే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్లో...టర్కీలో ఆపరేషన్ దోస్త్ కింద మోహరించిన భారత సైన్యం, వైద్య బృందం భారత్లోకి తిరిగి వచ్చింది. సుమారు 151 ఎన్డీఆర్ఎప్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్లతో కూడిన మూడు బృందాలు భూకంప ప్రభావిత టర్కీయేకు సహాయం అందించాయి. అని పేర్కొన్నారు. (చదవండి: పెళ్లికి ముందు రోజే వధువు కాలికి ఆపరేషన్.. ఆస్పత్రి వార్డులో తాళికట్టిన వరుడు) -
బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో చాకిరేవు గ్రామ ప్రస్తావన..
ఆదిలాబాద్: చాకిరేవు.. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ని మారుమూల గ్రామం. ఈ గ్రామం అటవీ ప్రాంతంలో ఉండగా రోడ్డు, కరెంట్, తాగునీటి సౌకర్యం కూడా లేదు. కనీస సౌకర్యాలు కల్పించాలని గతంలో ఈ గ్రామ ఆదివాసీ గిరిజనులు గ్రామం నుంచి నిర్మల్ జిల్లా కేంద్రానికి 70కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించి కలెక్టర్కు సమస్యలు తెలిపారు. కనీస వసతులు కల్పించేవరకూ కలెకర్ కార్యాలయం నుంచి కదలబోమని భీష్మించారు. అక్కడే కూర్చొని దీక్ష చేపట్టారు. దీంతో కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు మారుమూల చాకిరేవుకు గ్రామానికి పరుగులు తీసి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే తాగేందుకు బోర్లు వేయడంతో గ్రామస్తులు దీక్ష విరమించి గ్రామానికి వెళ్లారు. పట్టు వీడకుండా కనీస వసతుల కోసం 70కిలో మీటర్లు నడిచి తాగునీరు తెచ్చుకుని రాష్ట్రంలో హాట్టాఫిక్గా పెంబి మండల, చాకిరేవు గ్రామం నిలిచింది. దీంతో పాటు హీరో బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్స్టాపబుల్ (ఆహ) ప్రోగ్రాం నిర్వాహకులు గ్రామస్తులను డిసెంబర్ 26న ఆహ్వానించారు. కార్యక్రమానికి సినీనటుడు పవన్కళ్యాణ్ మఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తోడసం శంభు గ్రామానికి చెందిన గ్రామ పటేట్ లింభారావ్ పటేల్, జెత్రావు, జైతు ఈ ప్రోగ్రాంకు వెళ్లి గ్రామంలోని గిరిజనుల దీనస్థితిని వివరించారు. దీంతో గ్రామస్తులకు ఆహ ప్రోగ్రాం నుంచి రూ.లక్ష చెక్కును బాలకృష్ణ, పవన్కళ్యాణ్ అందజేశారు. త్వరలో గ్రామానికి వెలుగునిచ్చేందుకు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయిస్తామని ప్రోగ్రాం తరఫున హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి రూ.లక్ష చెక్కు, చీకటిలో మగ్గుతున్న చాకిరేవు గ్రామానికి వెలుగునిచ్చేందుకు సోలార్ సిస్టం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్న అన్స్టాపబుల్ (ఆహ) ప్రోగ్రాం నిర్వాహకులు, హీరో బాలకృష్ణకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. -
చిరంజీవి మంచి మనసు.. కష్టాల్లో ఉన్న కెమెరామెన్కి సాయం
మెగాస్టార్ చిరంజీవి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం అందించడంలో ముందుండే చిరంజీవి తాజాగా మరో సినీ కళాకరుడికి చేయూతనందించారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎంజిఆర్, రజినీకాంత్, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున .. ఇలా ఎంతోమంది హీరోలతో దేవరాజ్ పనిచేశారు. తెలుగు, తమిళ, బెంగాళీ, మలయాళ భాషల్లో దాదాపు 300 సినిమాలకి సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి దేవరాజ్, ఆయన కొడుకును పిలిపించి రూ. 5లక్షల చెక్ అందించి సహాయం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు చిరు ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేయడంతో అవికాస్తా వైరల్గా మారాయి. కాగా చిరంజీవి నటించిన నాగు, పులిబెబ్బులి, రాణి కాసుల రంగమ్మ వంటి సినిమాలకు దేవరాజ్ కెమెరామెన్గా పనిచేశారు. మానవసేవే మాధవ సేవ అని మనసావాచా నమ్మే @KChiruTweets గారు మరో సారి తన ఉదారత చాటుకున్నారు♥️ సినిమాటోగ్రాఫర్ పి.దేవరాజ్ గారి ఆర్ధిక పరిస్థితి తెలుసుకుని క్షణం ఆలస్యం చేయకుండా 5లక్షల రూపాయలిచ్చి ఆయనకు సహాయం చేసారు #MegaStarWithGoldenHeart #Chiranjeevi #MegaStarChiranjeevi pic.twitter.com/75lrdzYVBJ — Mega Family Fans (@MegaFamily_Fans) February 2, 2023 -
సీఎం జగన్ గొప్ప మనసు.. సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడు..
సాక్షి, వినుకొండ(పల్నాడు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. వినుకొండ పర్యటనలో బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం చేశారు. మస్తానమ్మ.. రెండు సంవత్సరాల క్రితం ఇల్లు కాలిపోయిందని, ఉండటానికి గూడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినుకొండకు చెందిన మస్తానమ్మ సీఎం జగన్ను కలిసి తన సమస్యను విన్నవించుకుంది. వెంటనే సాయం చేయాలని జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు. తేజ.. బాపట్ల జిల్లాకు చెందిన నారాయణస్వామి కుమారుడు తేజ థలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. తన కుమారుడికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని సీఎంకి తేజ తండ్రి విన్నవించుకున్నారు. తక్షణ సహాయానికి సీఎం హమీ ఇచ్చారు. చదవండి: ముసలాయనపై పేలిన సీఎం జగన్ పంచ్లు ముఖ్యమంత్రి ఆదేశాలతో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, స్ధానిక శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి మస్తానమ్మకు వినుకొండ పట్టణ పరిధిలో అనువైన చోట ఇంటి స్ధలము, ఇల్లు కట్టుకోవడానికి నగదు మరియు తక్షణ సహాయంగా రూ. 50,000 అందించారు. అలాగే తేజకు తక్షణ సహాయంగా రూ. 1 లక్ష అందించారు. చికిత్సకు అవసరమైన మిగిలిన సాయాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్తో చర్చించి సీఎంఆర్ఎఫ్ నిధులు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు. చదవండి: సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్ -
చిన్నారి ఆరోగ్య పరిస్థితి విని చలించిపోయిన సీఎం జగన్
-
ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం సాయం
-
కష్టాల్లో ఉన్న వాళ్లు కనబడితే ఆయన వాళ్ల దగ్గరికే వెళ్తారు. సాయం అందిస్తారు..
-
సీఎం జగన్ సాయం జీవితాంతం మరువలేనిది
సాక్షి, తాడేపల్లి/తూర్పు గోదావరి: వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయన మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారాయన. బాధితులను చూసి కాన్వాయ్ ఆపి దిగి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నలుగురు బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం అందించారు జిల్లా కలెక్టర్ మాధవీలత. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా సీఎం వైఎస్ జగన్ స్పందించడం జీవితాంతం మరువలేమంటున్నారు. సాయి గణేష్ లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 16 ఏళ్ళ సాయి గణేష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, మెరుగైన చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని ముఖ్యమంత్రికి విన్నవించుకున్న సాయి గణేష్ తండ్రి, తక్షణ సహాయానికి హామీనిచ్చిన సీఎం సి. డయానా శాంతి నిడుదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ళ డయానా శాంతి స్పైనల్ మస్క్యులర్ వ్యాధితో బాధపడుతోంది. తనకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని సీఎంకి విన్నవించుకున్న తల్లి సూర్యకుమారి. తక్షణ సహాయానికి హమీనిచ్చిన సీఎం. సిరికొండ దుర్గా సురేష్ రాజమహేంద్రవరం దేవిచౌక్కు చెందిన సిరికొండ దుర్గా సురేష్ తన కుమార్తెకు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుందని, తనకు 8 నెలల క్రితం మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైవర్ గా చేస్తున్న ఉద్యోగం కూడా పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వి. అమ్మాజి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గూడపల్లికి చెందిన అమ్మాజి తన కుమారుడు చర్మ వ్యాధితో బాధపడుతున్నాడని, ఇప్పటికే వైద్య ఖర్చుల నిమిత్తం పెద్ద మొత్తంలో ఖర్చు చేసి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చింది. అమ్మాజి కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. -
CM Jagan: అధైర్య పడొద్దు.. నేనున్నాను
రావికమతం/కోటవురట్ల/నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): మానవత్వాన్ని చాటుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. దారి వెంబడి తనకు సమస్య విన్నవించుకోవాలన్న ఆర్తితో వచ్చిన వారిని గమనించి, వారి కష్టం తెలుసుకున్నారు. పరిష్కారానికి సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. అందరికీ మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, తక్షణ సాయంగా రూ.లక్ష చొప్పున సాయం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఇలా ఏకంగా 13 మంది సమస్యలను ఓపికగా విని, తప్పక పరిష్కరిస్తామంటూ కొండంత భరోసా కల్నించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పాము ప్రసాద్ రావికమతం మండలం జెడ్ కొత్తపట్నం గ్రామానికి చెందిన పాము ప్రసాద్ సొరియాసిస్ వ్యాధితో బాధ పడుతున్నాడు. వైద్యం చేయించుకునే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బొండపల్లి శ్రీ వెంకట దుర్గా నిఖిత కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామం రాజగోపాలపురానికి చెందిన బొండపల్లి శ్రీ వెంకట దుర్గా నిఖిత హైపర్ కొలెస్ట్రోమియా, సబ్ క్లినికల్ హైపో థైరాయిడిజమ్తో బాధ పడుతోంది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు తగినంత సొమ్ము లేదని నిఖిత తల్లి ముఖ్యమంత్రికి విన్నవించుకుంది. అమర్త్య రామ్ నాతవరం మండల కేంద్రానికి చెందిన రెండేళ్ల దేవరకొండ అమర్త్య రామ్ పుట్టినప్పటి నుంచి పి ఆర్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతడి నాలిక లోపలికి వెళ్ళిపోయి ఊపిరి సలపని వ్యాధితో బాధ పడుతున్నందున తల్లిదండ్రులు తమిళనాడులోని నాగర్కోయిల్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.7.5 లక్షలు ఖర్చు పెట్టామని తెలిపారు. తగిన ఆరి్థక స్థోమత లేకపోవడంతో చికిత్స చేయించడానికి ఇబ్బంది పడుతున్నామని సీఎంకు విన్నవించారు. గట్రెడ్డి నీరజ్ రావికమతం మండలం కొత్త కోట గ్రామానికి చెందిన గట్రెడ్డి నీరజ్ తల్లి తన కుమారుడు బోన్ మేరో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకున్నారు. తగినంత డబ్బు లేకపోవడంతో చికిత్స చేయించుకోలేకపోతున్నామని తెలిపారు. చుక్కా శివ పార్వతీ యామిని నర్సీపట్నం మండలం పెదబొడ్డేపల్లి గ్రామానికి చెందిన చుక్కా శివ పార్వతి యామిని బైలేటరల్ జీను వేరమ్ సమస్యతో బాధ పడుతోంది. ఆరి్థకంగా స్థోమత లేకపోవడంతో.. చికిత్స చేయించుకోవడం తమకు సాధ్యం కావడం లేదని తండ్రి సీఎంకు విన్నవించుకున్నారు. మల్ల రోహిత్ కశింకోట మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన మల్ల రోహిత్ మెదడు సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశామని, ఆరి్థక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నామని సీఎంకు గోడు వెళ్లబోసుకున్నారు. పెదపూడి రిషాంత్ బాబి వివేక్ కోటవురట్ల మండలం రాట్నాల పాలెం గ్రామానికి చెందిన పెదపూడి రిషాంత్ బాబి వివేక్.. సికిల్ సెల్ ఎనీమియాతో బాధ పడుతున్నాడు. చికిత్స కోసం ముఖ్యమంత్రిని వివేక్ తల్లిదండ్రులు కలిసి విజ్ఞప్తి చేశారు. చింతల ఆకాంక్ష అనకాపల్లి మండలం వూడురు (అల్లిఖానూడు పాలెం) గ్రామానికి చెందిన చింతల ఆకాంక్ష గ్లోబల్ డెవలప్మెంట్ డిలేతో ఇబ్బంది పడుతోంది. ఆమెకు వైద్య సాయం అందించాలని కుటుంబ సభ్యులు సీఎంను కోరారు. నరం రాజబాబు నాతవరం మండలం గుమ్మడిగరడ గ్రామానికి చెందిన నరం రాజబాబు అంధత్వంతో బాధ పడుతున్నాడు. పేదవారమైన తమను మీరే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని వేడుకున్నారు. అందలూరి యేసుబాబు నర్సీపట్నం మండల కేంద్రంలోని గొర్లివీధికి చెందిన అందలూరి యేసుబాబు బ్లడ్ కేన్సర్తో బాధ పడుతున్నాడు. మెరుగైన చికిత్స చేయించడానికి తమ వద్ద డబ్బులు లేవని సీఎంతో చెప్పుకున్నారు. నిడదవోలు సుబ్బలక్ష్మి నర్సీపట్నం మండలం పినరిపాలెం గ్రామానికి చెందిన నిడదవోలు సుబ్బలక్ష్మి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. మెరుగైన చికిత్సతో పాటు ఆరి్థకంగా ఆదుకోవాలని సీఎంను కోరారు. పెట్ల పరిమళ గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం గ్రామానికి చెందిన పెట్ల పరిమళ చేతులు, కాళ్ల వంకర సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. మీరే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు సీఎంను వేడుకున్నారు. గుడివాడ జస్మిత నర్సీపట్నం మండలం వేమలపూడి గ్రామానికి చెందిన గుడివాడ జస్మిత తలసేమియా వ్యాధితో బాధ పడుతోంది. తగినంత ఆర్థిక స్థోమత లేదని సీఎంకు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. -
చాగంటి గురువాణి: పిలవకపోయినా వచ్చి తలకెక్కుతుంది..
‘అవినయమపనయ విష్ణో...’ అంటారు శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ. ఆయన మొట్ట మొదట నారాయణ మూర్తిని అడిగేదేమిటి అంటే...‘‘స్వామీ! నాకు అహంకారాన్ని తొలగించు. నాకు వినయాన్ని కటాక్షించు..’’ అని. ఆ వినయం మనిషి శీలానికి అంత ప్రధానం. సర్వసాధారణంగా లోకంలో ఉండే లక్షణం .. నాకు చాలా సమృద్ధి ఉంది. నేను ఇతరులకన్నా అందంగా ఉంటాను.. మంచి పొడగరిని... నేను మంచి రంగుతో ఉంటాను.. నాకు లక్ష్మీకటాక్షం ఉంది.. నేను మంచి మాటకారిని.. మిగిలినవారి కన్నా ప్రతిభావంతుడిని.. నాకు బుద్ధి కుశలత ఎక్కువ.. ఇలా అహంకారం పొందడానికి ఒక కారణం అంటూ అక్కర లేదు. ఏదయినా కారణం కావచ్చు. అహంకారం పొందడానికి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఏదో ఒక కారణంతో అహంకారం ఏర్పడుతుంటుంది. ఇది మనిషి ఉన్నతికి ఉండదగినది కాదు. దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది, అంత తేలికగా అలవడనిది, ప్రత్యేకించి ప్రతి మనిషి ప్రయత్నపూర్వకంగా ఆహ్వానించదగినది, మనిషికి అలంకారప్రాయమైనది.. వినయం. వినయాన్ని గురించి భర్తృహరి సంస్కృతంలో చెప్పిన విషయాన్ని ఏనుగు లక్ష్మణ కవి మనకు అర్థమయ్యేటట్లుగా తెలుగులో ఇలా చెప్పారు– ‘‘తరువు లతిరసఫలభార గురుత గాంచు /నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు / డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత/ జగతి నుపకర్తలకు నిది సహజగుణము.’’ చెట్టు బోలెడన్ని పూలు పూస్తుంది. పిందెలొస్తాయి. కాయలొస్తాయి. గుత్తులు గుత్తులుగా పండ్లు వేలాడుతూ ఉంటాయి. వాటి బరువుకు అవి వంగి ఉంటాయి. అప్పుడు చెట్టంతా కూడా వంగి ఉన్నట్లు కనిపిస్తుంటుంది. నిజానికి చెట్టు ఇప్పుడు సమృద్ధితో ఉంది కాబట్టి మరింత నిటారుగా నిలబడి ఉండాలి. కానీ బాగా తలవంచినట్టు కనబడుతున్నది. అలాగే మేఘాలు పైపైన ఆకాశంలో ప్రయాణిస్తూ పోకుండా బాగా కింద భూమికి దగ్గరగా వేలాడుతూ కనిపిస్తుంటాయి. దీనివల్ల లోకానికి మహోపకారం జరుగుతూ ఉంటుంది. అవి వర్షించకపోతే మన దాహం తీరేదెట్లా? ప్రకృతికి జీవం పోయకపోతే జీవుల ఆకలి తీరేదెట్లా? అంత అమృతాన్ని నింపుకొన్నప్పటికీ మేఘాలు కిందకు వినయంతో వంగి ఉన్నట్లు కనిపిస్తుంటాయి. ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత... బుధులు అంటే సత్పురుషులు, పండితులు, విద్వాంసులు, విజ్ఞానం, వివేకం కలిగినవారు. వీరి సహజ లక్షణం వినయంతో వంగి ఉండడం. నేనే గొప్ప, నా అంతటివాడు మరొకడు లేడు అన్నవాడికి ఇతరుల కష్టం అర్థం కాదు. వినయశీలురైన బుధులు ఇతరులు చెప్పేది వినడానికి, వారి కష్టనష్టాలను అర్థం చేసుకోవడానికి, వారికి ఉపకారం చేయడానికి సర్వవేళలా సిద్ధంగా ఉంటారు. వినయం ఎక్కడ ఉందో అక్కడ కీర్తి, అభివృద్ధి, సదాలోచన, మంచి కార్యాలకు రూపకల్పన, నిర్వహణ, సేవాభావం ఉంటాయి. మనం బొట్టుపెట్టి పిలవకపోయినా, ఎటువంటి ప్రయత్నం చేయకపోయినా.. మనల్ని అత్యంత సులభంగా ఆవహించే అహంకారాన్ని తొలగించుకోవాలి. ప్రయత్న పూర్వకంగా నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు వినయాన్ని కటాక్షించు.. అని వేడుకుంటున్నాం కాబట్టి ఈశ్వరానుగ్రహం చేత అది మనకు లభించినప్పుడు మనం కూడా యశోవిరాజితులం కాగలుగుతాం. అంతకన్నా కావలసింది ఏముంది !!! - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కడప పర్యటనలో అనేక మంది బాధితులకు ఆర్థిక సాయం