nims
-
పంజాగుట్ట నిమ్స్ దగ్గర ఉద్రిక్తత.. సిబ్బంది నిరసన
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్టలోని నిమ్స్ ఎమర్జెన్సీ విభాగం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిమ్స్ వర్కర్ను పంజాగుట్ట పోలీసులు కొట్టడాన్ని నిరసిస్తూ సిబ్బంది ఆందోళనకు దిగారు. నిన్న(గురువారం) ఓ పేషెంట్ ఎంఆర్ఐ స్కానింగ్ కోసం నిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. స్కానింగ్ పూర్తయిన తర్వాత చూడగా.. బంగారు గొలుసు కనిపించకపోవడంతో ఆ రోగి విధుల్లో ఉన్న వర్కర్పై అనుమానం వ్యక్తం చేస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.చివరకు ఆ బంగారు గొలుసు రోగి వద్దే లభించింది. విచారణలో భాగంగా నిమ్స్ వర్కర్ను పంజాగుట్ట పోలీసులు కొట్టారంటూ ఇతర సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పూర్తిగా నిర్థారణకు రాకుండానే చోరీ పేరుతో వర్కర్ను కొట్టారంటూ పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. అత్యవసర విభాగం వద్ద సిబ్బంది ఆందోళన చేపట్టారు.ఇదీ చదవండి: దీని వెనుక ఏదో మతలబు ఉంది -
కొత్త జన్యులోపం ‘సర్పినోపతి’
సాక్షి, హైదరాబాద్: కడుపులో ఉన్నప్పుడే పిల్లల్లో ఉండే జన్యుపరమైన లోపాన్ని(జెనెటిక్ డిజార్డర్) నిమ్స్ వైద్య బృందం కనుగొన్నది. నిమ్స్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్డీ) ఆధ్వర్యంలో ఐదేళ్లుగా జరిగిన పరిశోధన ద్వారా ఈ లోపం వెలుగులోకి వచ్చింది. నిమ్స్ మెడికల్ జెనెటిక్ విభాగ అధిపతి డాక్టర్ షాగున్ అగర్వాల్ ఈ ఘనత సాధించారు. అంతర్జాతీయ జెనెటిక్ విభాగం కూడా ఈ కొత్త జన్యులోపాన్ని నిర్ధారించినట్లు నిమ్స్ పరిశోధకులు వెల్లడించారు. వైద్యశాస్త్రంలో దాదాపు 6,000 నుంచి 7,000 జన్యుపరమైన లోపాలు ఉండగా, కొత్తగా ఇది కూడా చేరింది. తెలంగాణలో తొలి కేసు హైదరాబాద్కు చెందిన దంపతులు 2017లో ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డ పుట్టుకతోనే చనిపోయింది. ఆ తర్వాత 2018లో మళ్లీ ఆ దంపతులకు చెందిన మరో బిడ్డ కడుపులో ఉండగానే పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో జన్యుపర మైన సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. ఆ బిడ్డ పుడితే బతకదని తేల్చారు. ఆ బిడ్డకు ఐదు నెలలు ఉన్నప్పుడే అబార్షన్ చేసి తీశారు.పోసు మార్టం ద్వారా అసాధారణమైన లక్షణాలను పరిశోధకులు గుర్తించారు. ఏదో కొత్త వ్యాధిగా అనుమానించారు. దీంతో అప్పటినుంచి పరిశో ధన ప్రారంభమైంది. చర్మం నుంచి డీఎన్ఏ తీసుకొని పరీక్షలు చేశారు. అప్పుడు కొత్త జన్యు లోపం సర్పినోపతి–11గా నిర్ధార ణకు వచ్చా రు. మరోవైపు ఆ దంపతులు 2020లో మూడో సారి కూడా బిడ్డను కనేందుకు సిద్ధమయ్యారు. బిడ్డ కడుపులో ఉండగానే స్కానింగ్, జెనెటిక్ పరీక్షల్లో అరుదైన లక్షణాలు కనిపించాయి.ఐదు నెలలు ఉండగానే కడుపులో ఉన్న బిడ్డలో ఊపిరితిత్తులు, గుండె సహా ఇతర అవయ వాల్లో నీరు చేరింది. ఈ బిడ్డ కూడా బతకదని గుర్తించి అబార్షన్ చేశారు. ఆ బిడ్డకు కూడా అదే జన్యు లోపం ఉందని నిర్ధారించారు. మరోవైపు ఆ దంపతులకు కూడా ఆ జన్యులోపం ఉంద ని... ఇద్దరిలో సగం సగం ఉందని గుర్తించారు. వారిద్దరి నుంచి పిల్లలకు వ్యాపించిందని నిమ్స్ వైద్యులు కనుగొన్నారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన కడుపులోని ఇద్దరు బిడ్డలను అబార్షన్ చేసి పిండాలపై జెనెటిక్ విభాగంలో పరిశోధన చేశారు. ఈ జన్యులోపానికి సంబంధించిన ప్రధాన లక్షణం గుండె, ఊపిరితిత్తులు సహా ప్రతి అవయవంలో నీరు చేరిపోతుందని, దీనిని కనుగొన్న డాక్టర్ షగున్ అగర్వాల్ ’సాక్షి’కి చెప్పారు. సీడీఎఫ్డీ శాస్త్రవేత్తలు డాక్టర్ రష్నా భండారి, డాక్టర్ అశ్విన్ దలాల్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధనలో పాల్గొన్నది. పరిశోధనలో నిమ్స్ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిందంటూ మంత్రి దామోదర రాజనర్సింహ పరిశోధనలో పాల్గొన్న వైద్య బృందానికి అభినందనలు చెప్పారు.చికిత్సకు ఊతం: నిమ్స్ డైరెక్టర్ బీరప్పఇలాంటి జన్యులోపంతో ఇబ్బంది పడుతున్న వారికి చికిత్స అందించేందుకు ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడు తుందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలి పారు. రెండు పిండాలపై(ఫీటస్) డాక్టర్లు పరిశోధనలు చేయగా, శరీరంలో ఉండే ‘సెర్పినా11’ అనే జన్యువులో మ్యుటేషన్లు జరుగుతున్నాయని, ఈ మ్యుటేషన్ల వల్ల శరీరంలోని ఇతర టిష్యూస్ కూడా దెబ్బ తింటున్నాయని గుర్తించారని చెప్పారు. ఇలాంటి ఒక అరుదైన జన్యులోపాన్ని గుర్తించడం ప్రపంచంలోనే తొలిసారి అని క్లినికల్ జెనెటిక్స్ జర్నల్ ప్రకటించిందని బీరప్ప తెలిపారు. -
నిమ్స్లో హార్ట్ వాల్వ్ బ్యాంకు!
లక్డీకాపూల్: గుండెకు మరింత భరో సా కల్పించే దిశగా నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) అడుగులు వేస్తోంది. గుండె సమస్యలతో బాధపడుతున్న పేద రోగుల్లో అవసరమైన వారికి ఉచితంగా గుండె కవాటా(హార్ట్ వాల్వ్)లను అందించేందుకు నిమ్స్ సమాయత్తమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో గుండె సిరలు దెబ్బతిన్న వారికి కృత్రిమంగా తయారు చేసిన వాటిని అమరుస్తున్నారు. ఖర్చుతో కూడుకున్న ఈ వాల్వ్ల మార్పిడి ఆపరేషన్ నిరుపేదలకు పెనుభారంగా తయారైంది. దీంతో పేదలకు ఉచితంగా అందించేందుకు ఆస్పత్రిలో ప్రత్యేకంగా హార్ట్ వాల్వ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో స్థల పరిశీలన జరుగుతోంది. త్వరలోనే హార్ట్ వాల్వ్ బ్యాంక్ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రారంభించాలని భావిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ల నుంచి సేకరణ..బ్రెయిన్ డెడ్కు గురైన వాళ్ల నుంచి అవ యవాలను నిమ్స్ సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మృతుని కుటుంబసభ్యుల అంగీకారంతో కిడ్నీ లు, కాలేయం, కళ్లు, గుండె తదితర కీలక అవయవాలను సేకరిస్తోంది. అదే విధంగా బ్రెయిన్ డెత్కు గురైన వాళ్ల నుంచి గుండె కవాటాలను కూడా సేకరించి.. వాటిని భద్రపర్చేందుకు ప్రత్యేక విభాగాన్ని(హార్ట్ బ్యాంక్) ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ బ్యాంకులో భద్రపరిచిన కవాటాలను పూర్తిగా ఉచితంగా అందించడంతో నిమ్స్కు వచ్చే రోగులు చాలా తక్కువ ఖర్చుతోనే శస్త్ర చికిత్సలు చేయించుకోవచ్చని నిమ్స్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ తెలిపారు. -
ఆయుష్.. నొప్పులు మాయం
లక్డీకాపూల్: జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులతో నగర ప్రజలు వివిధ రకాల నొప్పులతో సతమతమవుతున్నారు. అవే పెద్ద సమస్యలుగా భావించి చాలా మంది కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. తొలనొప్పి, కండరాల, మోకాళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి, మిటమిన్స్ లోపం, అధిక బరువు వంటి సాధారణ సమస్యలను కూడా చాలా మంది పెద్ద జబ్బులుగా భావిస్తున్నారు. దీంతో రిఫరల్ అస్పత్రి అయిన నిమ్స్ సైతం రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతోనే సహజ సిద్ధమైన వైద్య చికిత్సలతో నొప్పులకు ఉపశమనం కలి్పంచాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయూష్ శాఖ నిమ్స్లో ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలోపతి వైద్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తూనే.. దేశీయ వైద్యానికి సైతం పెద్దపీట వేస్తున్నారు. సంప్రదాయ వైద్యమైన ఆయుష్ సేవలకు ప్రాచుర్యం కలి్పంచేందుకు దృష్టిని కేంద్రీరించింది. లోపించిన శారీరకశ్రమ..మనిషి కూర్చునే భంగిమని బట్టి కూడా ఈ నొప్పులు చోటుచేకుంటాయి. వాస్తవానికి ఇటీవల కాలంలో శారీరశ్రమ లోపించింది. చెప్పాలంటే.. శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. విటమిన్ల లోపం వల్ల కొంత మంది ఇబ్బంది పడుతుంటే పోషకాహార లోపం వల్ల మరికొంత మంది అనార్యోగం పాలవుతున్నారు. ఆస్పత్రికి వచి్చన రోగులకు ప్రకృతి వైద్యం పట్ల అవాగాన కల్పిస్తూ.. భవిష్యత్తులో వారు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురికాకుండా చూసేందుకే ఈ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ కృషి చేస్తుంది. – డా.నాగలక్షి్మ, ప్రకృతి వైద్యనిపుణురాలు అలోపతికి సమాంతరంగా...అలోపతి వైద్యానికి సమాంతరంగా ఆయుష్ సేవలు కూడా ప్రజలకు చేరువ కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, సీజనల్, ప్రసూతి సమస్యలు, కీళ్ల నొప్పులు తదితర అన్ని రకాల సమస్యలకూ ప్రకృతి వైద్య చికిత్స అందుబాటులో ఉండడమే కాకుండా వ్యాధి మూలాలపై పనిచేసి, పునరావృతం కాకుండా చేయడమే సహజ వైద్య చికిత్సల లక్ష్యమని నిపుణులు పేర్కొంటున్నారు. నరగంలో పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి స్థాయిలు, ఆందోళన మొదలైన పర్యావరణ మార్పులకు దారితీసింది. అటువంటి సమస్యలను ఎదుర్కోవటానికి ఏకైక మార్గం ప్రకృతి వైద్య చికిత్సలు. సాధారణ నొప్పులతో పాటు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి తక్కువ ఖర్చుకే సహజమైన పద్ధతిలో మెరుగైన సేవలు అందిస్తున్నారు. అలోపతి వైద్య పద్దతిలో లొంగని వ్యాధులకు సైతం ఆయుష్ ఉపశమనం కలి్పస్తుంది. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఈ సహజ వైద్య చికిత్సల పట్ల ఆసక్తి చూపుతున్నారు.నామమాత్రపు రుసుము..పంచకర్మ చికిత్సల్లో భాగంగా స్నేహకర్మ, నదిస్వేదం, పిండిస్వేదం, కతివస్తి, జనువస్తి, నాశ్యకర్మ, శిరోధార, డెటాక్స్ థెరపీ, బరువు నియంత్రణ, మానసిక ఒత్తిడి నిర్మూలన, బాడీ మసాజ్, మైగ్రేన్ వంటి సేవలతో పాటు ప్రకృతి వైద్య సేవల్లో భాగంగా జనరల్ మసాజ్, స్టీమ్బాత్, డైట్ కౌన్సిలింగ్, కోల్డ్ బ్లాంకెట్ ప్యాక్, తల, కండరాలు, నడుం, భుజాలు, మోకాళ్ల నొప్పులకు చికిత్సలు అందిస్తుంది. ఆక్యుపంక్చర్, యోగ వంటి సేవలను కూడా అందుబాటులో ఉంచింది. రోగులు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి చికిత్సను అందిస్తుంది. ఎంపిక చేసుకున్న చికిత్స, సేవలు, సిట్టింగ్ ఆధారంగా నామమాత్రపు రుసుమును వసూలు చేస్తున్నారు. చికిత్స పొందాలంటే ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. వాస్తవానికి సహజ వైద్య చికిత్సలను ప్రణాళికబద్ధంగా అనుసరించాల్సిందే. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఒక స్లాట్గా, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదున్నర గంటల వరకూ మరో స్లాట్గా నిర్ణయించారు. -
నిమ్స్ అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకర్ ఆత్మహత్య
-
NIMS: నిమ్స్ వైద్యురాలి ఆత్మహత్య!
హైదరాబాద్, సాక్షి: మత్తుమందు అధిక మోతాదులో తీసుకుని నిమ్స్ వైద్యురాలు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. డాక్టర్ ప్రాచీ కర్(46) నిమ్స్లో అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో ఆమె అపస్మాకర స్థితిలో కనిపించారు. పక్కనే అనస్థీషియా మత్తు వాయిల్ పడి ఉండడం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే నిమ్స్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.అనస్థీషియా అధిక మోతాదులో తీసుకోవడం వల్లే ఆమె చనిపోయారని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ప్రాచీ కర్ చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు అయ్యింది. ప్రాచీ కర్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి, పలువురిని ప్రశ్నిస్తున్నారు. -
తెలంగాణను హెల్త్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతాం
లక్డీకాపూల్ (హైదరాబాద్): తెలంగాణను హెల్త్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పేద ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ, సంస్థకు మంచి గుర్తింపు తేవడానికి నిమ్స్ వైద్యులు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. శుక్రవారం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో రూ.12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డీఎస్ఏ ల్యాబ్, యూఎస్ ఎయిడ్ సంస్థ సహకారంతో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ స్కిల్ ల్యాబ్లతో పాటు రూ.2 కోట్ల విలువైన సీటీఐసీయూను ప్రారంభించారు. స్కిల్ ల్యాబ్లో సీపీఆర్ విధానాన్ని ఆయన స్వయంగా చేసి మెళకువలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లెర్నింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజనర్సింహ మాట్లాడుతూ.. నిమ్స్కు జాతీయస్థాయిలో బ్రాండ్ ఇమేజ్ ఉందని.. దాని కొనసాగింపునకు తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఉస్మానియా, గాం«దీ, కాకతీయ, ఆసుపత్రులతో పాటు నిమ్స్ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్య, వైద్య రంగాలు మరింత అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యాచరణను రూపొందిస్తోందని వివరించారు. నిమ్స్లో దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ సిల్క్ లాబ్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అనంతరం కొత్తగా నియుక్తులైన 39 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 300 మంది స్టాఫ్ నర్సులకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, కార్డియాలజీ విభాగం అధిపతి సాయి సతీశ్, యూఎస్ ఎయిడ్ డాక్టర్ వరప్రసాద్, హైదరాబాద్లోని అమెరికా కౌన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, నిమ్స్, ప్రభుత్వ అనుసంధానకర్త డాక్టర్ మార్త రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నిమ్స్ను సందర్శించిన నిజాం మనవడు
సాక్షి, సిటీబ్యూరో: నిజాం మనవడు నవాబ్ నజీఫ్ అలీ ఖాన్ శుక్రవారం నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. పిల్లల గుండె శస్త్ర చికిత్సల శిబిరాన్ని విజయవంతం చేసినందుకు నిమ్స్ డైరెక్టర్ బీరప్పను అభినందించారు. యూకే నుంచి వచ్చిన కార్డియోథెరపిక్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. పేద రోగులు, సమాజానికి ప్రయో జనం చేకూరేలా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగం ఇంచార్జ్, ఆర్ఎంఓ డాక్టర్ సల్మాన్ పాల్గొన్నారు. -
పుట్టిన 24 గంటలకే బైపాస్ సర్జరీ
లక్డీకాపూల్: గుండెలో రంధ్రంతో పుట్టిన ఒక రోజు వయసుగల ఆడశిశువుకు మంగళవారం నిమ్స్లో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. యూకేకు చెందిన ఆల్డర్ హే ఆస్పత్రి కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ ధన్నపునేని ఆధ్వర్యంలోని వైద్య బృందం నిమ్స్ కార్డియోథిరాసిక్ సర్జన్ డాక్టర్ ఎ. అమరేశ్రావు, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్తో కలసి ఈ సర్జరీ చేపట్టింది. నిజామాబాద్ జిల్లా చిట్టాపూర్కు చెందిన ప్రశాంత్ గ్రూప్–2 ప్రిపరేషన్ కోసం తన భార్య సమీర శ్రావణితో కలసి హైదరాబాద్ వచ్చి ఇబ్రహీంపట్నంలో ఉంటున్నాడు. ఆయన భార్య సోమవారం ఉదయం ఆడశిశువు (సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా)కు జన్మనివ్వగా శిశువుకు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు తరలించారు. అప్పటికే గుండె సంబంధ జబ్బులతో బాధపడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులకు చార్లెస్ హార్ట్ హీరోస్ పేరిట నిమ్స్లో యూకే వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని (ఈ నెల 24 మొదలు 30 వరకు) నిర్వహిస్తుండటంతో వారి ఆధ్వర్యంలో శిశువుకు బైపాస్ సర్జరీ చేశారు. కాగా, హైదరాబాద్లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ (ఏపీ–తెలంగాణ) మంగళవారం నిమ్స్ను సందర్శించి డాక్టర్ రమణ, ఆయన బృందాన్ని కలిసి అభినందించారు. అలాగే గుండె సర్జరీ అనంతరం కోలుకుంటున్న ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు చెందిన చిన్నారి నిత్యను గారెత్ పరామర్శించారు. నవజాత శిశువులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. -
నిమ్స్లో చిన్నారుల గుండె ఆపరేషన్లు విజయవంతం
హైదరాబాద్: నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ(నిమ్స్) చార్లీస్ హార్ట్ హీరోస్ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో తొలి రోజు నలుగురు చిన్నారులకు ఉచితంగా గుండె సంబందిత శస్త్ర చికిత్సలు చేశారు. సోమవారం లండన్కు చెందిన గుండె వైద్యనిపుణులు డాక్టర్ రమణ ధన్నపునేని ఆధ్వర్యంలో నిమ్స్ కార్డియా థొరాసిక్ సర్జరీ విభాగం వైద్యులు నీలోఫర్ వైద్యులతో కలిసి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు చెందిన లింగాల అవని(04), చత్తీస్ఘడ్కు చెందిన నిత్య(03), భువనగిరికి చెందిన యోగేష్(07), సిరిసిల్లకు చెందిన లక్ష్మీ ప్రసన్న(07)లకు ఆపరేషన్లు చేశారు. అనంతరం వారిని వార్డుకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. నిరుపేద చిన్నారుల ప్రాధాన్యత క్రమంలో శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు నిమ్స్ కార్డియా థోరాసిక్ సర్జరీ విభాగం హెచ్ఓడి డాక్టర్ ఎం. అమరేష్రావు అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం మరో ముగ్గురికి గుండె ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. -
‘నిమ్స్ ది గ్రేట్’ : మంత్రి హరీష్రావు ప్రశంసలు..!
హైదరాబాద్: అవయవ మార్పిడి ఆపరేషన్లలో నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ(నిమ్స్) తన ప్రత్యేకతను మరోసారి చాటి చెప్పింది. గతంలో ఎన్నో విజయాలను పదిలపర్చుకున్న నిమ్స్ తాజాగా మారో అరుదైన రికార్డు సృష్టించి వైద్య రంగాలలోనే సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా చేసి అరుదైన రికార్డును వైద్యులు సొంతం చేసుకున్నారు. ఇందులో 61 లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగా, 39 దాతల ద్వారా సేకరించినవి.. గ్రహీతల్లో 11, 12 ఏళ్ల వయసువారు కూడా ఉండడం చెప్పుకోదగ్గ అంశం. శుక్రవారం వందో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్య బృందంలో యూరాలజీ వైద్యనిపుణులు ప్రొఫెసర్ రామ్రెడ్డి, విద్యాసాగర్, రామచంద్రయ్య, తదితరులు ఉన్నారు. వీరంతా యూరాలజీ హెచ్ఓడీ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స మార్పిడిలు చేస్తున్నారు. గత నెలలో రూ.32 కోట్లతో సమకూర్చుకున్న అడ్వాన్స్డ్ పరిజ్ఞానం ఉన్న రోబోటిక్స్ సాయంతో యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లో అత్యంత సంక్లిష్టమైన నెల రోజుల వ్యవధిలోనే 30 అపరేషన్లను చేశారు. గాల్బ్లాడర్, హెర్నియా, ఆచలాసియా కార్డియా సర్జరీలను చిన్న రంధ్రంతో సులువుగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తున్నారు. సాధారణ పద్దతుల్లో చేసే సర్జరీలతో పోల్చితే రోబోటిక్ సర్జరీలు కూడా చాలా కచ్చితంగా జరుగుతున్నాయి. ఆపరేషన్ జరిగిన మూడు రోజుల్లోనే రోగి డిశ్చార్జి కావడం విశేషం. హరీష్రావు మంత్రి ప్రశంసలు.. అత్యధిక మార్పిడి ఆపరేషన్లు చేసి నిమ్స్ వైద్యులు చెప్పుకోదగ్గ రికార్డును నెలకొల్పారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు ప్రశంసించారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల్లో రికార్డు బ్రేక్ చేసి యూరాలజీ వైద్యులను మంత్రి ఎక్స్(ట్విట్టర్)లో అభినందించారు. ఈ అసాధారణ అవయవ మార్పిడి ద్వారా ప్రాణాలను కాపాడాలనే తమ అచంచలమైన నిబద్ధతను హైలైట్ చేస్తోందన్నారు. ఎంత పెద్ద శస్త్రచికిత్స అయినా.. ఎంత పెద్ద శస్త్రచికిత్సనైనా సులువుగా చేయవచ్చు. రోబోటిక్ సర్జరీలను ప్రారంభించిన అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో విజయవంతంగా ఆపరేషన్లు చేయడం నిమ్స్ వైద్యుల ప్రతిభకు తార్కాణం. ఇప్పడు ఆస్పత్రిలో నొప్పి తక్కువతో.. ఇన్ఫెక్షన్లకు తావులేకుండా చేస్తున్నాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, సంచాలకులు, నిమ్స్ -
మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్
లక్డీకాపూల్: మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు కేవలం నినాదాల పార్లు .. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని పేర్కొన్నారు. గురువారం –నిమ్స్లో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ హామీలు, వెకిలి చేష్టలతో ఆ రెండు పార్లు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. అమిత్ షా, ఖర్గేలు పర్యాటకుల్లా వచ్చి.. అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారన్నారు. గుజరాత్లో బీజేపీ గుడ్డి పాలనను దారిలో పెట్టడం చేతగాని అమిత్ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మూడు నెలలకే కాంగ్రెస్ తీరేమిటో తేలిపోయిందని, ముందుగా ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడ కొచ్చి మాట్లాడాలని సూచించారు. వివిధ పార్టీల డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని..బీఆర్ఎస్కు మూడోసారి అధికారం ఇవ్వాలని ఎపుడో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. నిమ్స్లో ఆయుష్ ఏర్పాటు రాష్ట్రంలోనే తొలిసారి నిమ్స్లో ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎస్ శాంతి కుమారికి హరీశ్రావు అభినందనలు తెలిపారు. ఈ తరహా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారన్నారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, ప్రకృతి వైద్యం.. అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటల్లో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే నెల రెండో వారంలో మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. దీంతో కొత్తగా 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. త్వరలో మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించబోతుందని హరీశ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, నిమ్స్ సంచాలకులు నగరి బీరప్ప, ఆయుష్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
‘తెలంగాణలో ఎప్పుడో సెల్ఫ్ డిక్లరేషన్ జరిగింది’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలు కేవలం నినాదాల పార్టీలు. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. గురువారం నిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ‘‘ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆసుపత్రిలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. దీని ఏర్పాటు కోసం ప్రత్యేక శ్రద్ద చూపిన సీఎస్ శాంతి కుమారి గారికి అభినందనలు. ఈ తరహా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారి. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ మరియు ప్రకృతివైద్యం యొక్క అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయి. నిపుణులైన ఆయుష్ వైద్యుల ఆధ్వర్యంలో ఆయుర్వేద, ప్రకృతివైద్య ప్రక్రియలు, చికిత్సలను నిర్వహించడానికి అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. నిమ్స్ వెల్ నెస్ సెంటర్ ద్వారా విశ్రాంత సివిల్ సర్వెంట్లు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ప్రస్తుతం వివిధ హోదాల్లో విధులను నిర్వర్తిస్తున్న వారు వైద్యం పొందుతున్నారు ప్రభుత్వం అలోపతి వైద్యంతో పాటు, ఆయుష్ వైద్యం ను ఎంతో ప్రోత్సహిస్తున్నది. ఇటీవల రూ. 10 కోట్లతో నేచర్ క్యూర్ ఆసుపత్రిని అభివృద్ధి చేసుకున్నాం. రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయి. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటలో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయి అని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు వైద్య రంగం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అరోగ్య రంగం దిన దినాభివృద్ది చెందుతోంది. వచ్చే నెల రెండో వారంలో మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. కౌన్సిలింగ్ ప్రక్రియ తుది దశకు చేరింది. ఒకే రోజు ఒకే వేదిక నుండి సీఎం గారి చేతుల మీదుగా మనం ఈ కార్యక్రమం చేసుకోబోతున్నాం. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 5 నుంచి 26కు చేరుతుంది. కొత్తగా 900 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 2014లో 850 ఎంబిబిఎస్ సీట్ల నుంచి నుండి ఇప్పుడు 3915 సీట్లు పెరుగుదల ఉంది. అంటే 6 రెట్లు అధికంగా సీట్లు అందుబాటులోకి వచ్చాయి. హెల్త్ హబ్ గా తెలంగాణ మారుతున్నది. వైద్యంతో పాటు, వైద్య విద్య కు తెలంగాణ చిరునామా అవుతోంది. మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ ఎం సి హెచ్ లు, బస్తీ దవాఖానలు ఇలా పట్టణం నుండి పల్లె దాకా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేశాం. రాబోయే రోజుల్లో మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించబోతున్నది. కాంగ్రెస్,బీజేపీలు కేవలం నినాదాల పార్టీలు .. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ. నకిలీ హామీలు వెకిలి చేష్టలతో ఆ రెండు పార్టీలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయి. అమిత్ షా ,ఖర్గేలు పర్యాటాకుల్లా వచ్చి పోయారు ..అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారు. అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంటు కష్టాల గురించి ప్రతి రోజూ పేపర్ లో వార్తలే. గుజరాత్ లో బీజేపీ గుడ్డి పాలన ను దారిలో పెట్టడం చేతగాని అమిత్ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారు. కర్ణాటక లో మూడు నెలలకే కాంగ్రెస్ తీరేమిటో తేలిపోయింది. కర్ణాటక లో బీజేపీకి ప్రత్యమ్నాయంగా వేరే పార్టీ లేక కాంగ్రెస్ ను ఓటర్లు నమ్మారు. ముందు ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడ కొచ్చి మాట్లాడాలి. తెలంగాణలో కేసీఆర్ ను విమర్శించాలంటే తమ తమ రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా ఎక్కువ అభివృద్ధి సంక్షేమం చేసి ఉండాలి. తమ రాష్ట్రాల్లో ఏది చేసినా చెల్లుతుందని ఇక్కడకొచ్చి ఏది మాట్లాడినా జనాలు నమ్ముతారు అనుకుంటే పొరపాటు. తెలంగాణ ప్రజలు మీ మాయ మాటలకు లొంగే పరిస్థితి లేదు. మీ డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ..ప్రజలు బీఆర్ఎస్ కు మూడోసారి అధికారం ఇవ్వాలని ఎపుడో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారు. అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. -
నిమ్స్కు రూ.1,800 కోట్ల రుణం మంజూరు
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిజాం వైద్య విజ్ఞా న సంస్థ (నిమ్స్) విస్తరణ పనులకు రూ. 1,800 కోట్లు రుణాన్ని మహారాష్ట్ర బ్యాంక్ మంజూరు చేసింది. నిమ్స్ ఆస్పత్రి విస్తరణలో భాగంగా నిర్మించతలపెట్టిన 2 వేల పడకల దశాబ్ది బ్లాక్కు సీఎం కేసీఆర్ జూన్ 14న భూమి పూజ చేశారు. నిమ్స్కు కేటాయించిన 33 ఎకరాల్లో విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా మూడు భవనాలను నిర్మించనున్నారు. ఇందుకు ఆర్అండ్బీ అధికారులు టెండర్ల ప్రక్రియను చేపట్టారు. ఈనెల 31న టెండర్లను ఖరారు చేయనున్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర బ్యాంక్ రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ రుణ మొత్తాన్ని నిమ్స్ నిరీ్ణత కాల వ్యవధిలో బ్యాంక్కు చెల్లించాల్సి ఉంది. పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందు కు చేస్తున్న కృషిలో భాగంగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు నిమ్స్ ప్రత్యేకంగా ఓ రిటైర్డ్ ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. -
చావుకబురు చల్లగా.. చేతులెత్తేసిన వైద్యులు..
హనమకొండ: రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబం అది. రోజువారీగా కూలీకి వెళ్తేనే వారికి పూట గడిచే ఆ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఇందులో రెండో కుమారుడు కుటుంబ కలహాలతో ఇటీవల పురుగుల మందుతాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సకు రూ. 8 లక్షల వరకు ఖర్చు అయింది. దీంతో దిక్కుతోచని పరిస్థితి.. పైగా చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితి..ఈ క్రమంలో తండ్రి ఎవరిని అప్పు అడిగిన లభించలేదు. దీంతో తన కుమారుడి ఆరోగ్యం కంటే ఏదీఎక్కువ కాదని భావించి గ్రామంలో తమకున్న తాతల నాటి ఆస్తి 30 గుంటల భూమిని అమ్మకానికి పెట్టాడు. వచ్చిన డబ్బుతో సరాసరి ఆస్పత్రికి వెళ్లి చెల్లించాడు. అయితే డబ్బు తీసుకున్న అనంతరం ఆస్పత్రి యాజమాన్యం చావు కబురు చల్లగా చెప్పారు. క్షతగాత్రుడికి వైద్యం చేయలేమని చేతులేత్తేశారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో చేసేది లేమీ లేక మరో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భూమిజాగా అమ్మినా బతుకలేకపోతివి కదా కొడుకా అంటూ తల్లిండ్రులు మృతదేహంపై రోదించిన తీరు ప్రతీ ఒక్కరిని కదలించింది. బచ్చన్నపేట మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన చెవుల నర్సయ్య, జయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. రెండో కుమారుడు చెవుల సురేష్(27) హైదరాబాద్లో పెయింటింగ్ పని చేస్తున్నాడు. రెండు నెలల క్రితం హైదరాబాద్ మల్కాజిగిరి కౌపూర్ గ్రామానికి చెందిన ప్రియాంకను వివాహం చేసుకుని అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో గత నెల 28న కుటుంబ కలహాల నేపథ్యంలో గడ్డి మందు తాగగా వాంతులు విరేచనాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సురేష్ను హైదరాబాద్ ఈసీఎల్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ రూ.8 లక్షల వరకు ఖర్చు అయింది. దీంతో తండ్రి నర్సయ్య గ్రామంలో తమకున్న 30 గుంటల భూమిని విక్రయించి ఆస్పత్రి బిల్లు చెల్లించాడు. అయితే బిల్లు చెల్లించిన అనంతరం అక్కడి వైద్యులు చేతులు ఎత్తివేశారు. దీంతో వెంటనే సురేష్ను పంజాగుట్టలోని నిమ్స్లో చేర్పించారు. అక్కడ చికిత్స ఆదివారం పొందుతూ మృతి చెందాడు. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కేసీఆర్ తవ్వగా.. హరీశ్ ఎత్తగా..
సాక్షి, సిటీబ్యూరో/లక్డీకాపూల్: ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) ప్రాంగణంలో ‘దశాబ్ది’ బ్లాక్ నిర్మాణ పనులకు బుధవారం ఉదయం 11.44 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సీఎం గడ్డపారతో తవ్వగా మంత్రి హరీశ్రావు పారతో మట్టిని ఎత్తారు. కేసీఆర్ చేతుల మీదుగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పునాదిరాళ్లను వేశారు. అనంతరం మంత్రి హరీశ్రావు అధ్యక్షతన జరిగిన వైద్యారోగ్య దినోత్సవ సభలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, సోమేష్కుమార్, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి రిజ్వీ, ముఖ్య సంచాలకుడు జి.శ్రీనివాసరావు, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్వేతా మహంతి, డీఎంఈ రమేష్రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, హైదరాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, డాక్టర్ మార్త రమేష్ తదితరులు పాల్గొన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల కోసం రూపొందించిన తొమ్మిది రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం నగరానికి చెందిన గర్భిణులు పార్వతమ్మ (ఉదయ్ నగర్ కాలనీ), ఫర్వీన్ (బాలానగర్), శిరీష (ఎన్బీటీనగర్), తేజస్వీ (ప్రతాప్నగర్), సుజాత (శ్రీరాంనగర్), రేణుక (అంబేడ్కర్నగర్)లకు కిట్లను ఆయన అందజేశారు. అధునాతన చికిత్సలకు కేరాఫ్ అడ్రస్గా నిమ్స్: డైరెక్టర్ బీరప్ప తెలంగాణ ఉద్యమానికి నిమ్స్కు మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, చావు నోట్లో తలపెట్టిన సమయంలో నిమ్స్ తన వంతు సేవలు అందించింది. తెలంగాణ ఏర్పాటు సమయంలో నిమ్స్లో 900 పడకలు ఉండేవి. ఆ తర్వాత 1,500 పడకలకు చేరాయి. చికిత్సలు 108 శాతం పెరిగాయి. బోధన సిబ్బంది సంఖ్య 111 నుంచి 306కు పెరిగింది. పీజీ సీట్లు 82 నుంచి 169కు చేరాయి. కొత్తగా ఆరు విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యశ్రీలో అత్యధిక చికిత్సలు అందిస్తున్న సంస్థ నిమ్సే. అవయవ మార్పిడి చికిత్సలు జరుగుతున్నాయి. గుండె, కిడ్నీ, బోన్మ్యా రో, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సలు జరుగుతున్నాయి. జీవితకాలం ఉచితంగా మందులు అందజేస్తున్నాం. తుంటి, కీళ్లు చికిత్సలు, గూని వంటి ఆపరేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దక్షణాదిలో అత్యధికం. డయాలసిస్ సేవలు 30 వేల నుంచి 1.20 లక్షలకు చేరుకున్నాయి. ఆస్పత్రిలో నెలకు 1.50 లక్షల రోగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. డైరెక్టర్గా నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోను. మేం కిట్లు పంచుతుంటే.. వాళ్లు తిట్లు పంచుతున్నారు: మంత్రి హరీశ్రావు హైదరాబాద్ నగరం ప్రస్తుతం వ్యాక్సిన్, ఫార్మా హబ్గా ఉంది. రాబోయే రోజుల్లో హెల్త్ హబ్గా మారబోతోంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు వైద్య విద్య కోసం చైనా, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లేవారు. ప్రస్తుతం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వచ్చింది. గతంలో 2,853 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్యను 8,340కి పెంచాం. ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను కూడా 50 వేలకు పెంచాం. వచ్చే ఏడాది మరో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించబోతున్నాం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ సహా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఫార్మా, నర్సింగ్ వంటి అనుబంధ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులకు, రక్తహీనతతో బాధపడే గర్భిణులకు మేం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు ఇస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం తిట్లు పంచుతున్నాయి. -
దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిలలో ఒకటిగా నిమ్స్
-
నిమ్స్లో బ్యాటరీ కార్లు
లక్డీకాపూల్ : నిమ్స్లో చికిత్సకు వచ్చే రోగుల సౌకర్యార్థం బ్యాటరీ కార్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యాజమాన్యం రంగం సిద్ధం చేసింది. ఆస్పత్రి మెయిన్ గేట్ వద్ద కార్లను ఏర్పాటు చేయనున్నారు. నిమ్స్ లోపలికి ప్రైవేట్ వాహనాల ప్రవేశాన్ని నియంత్రించే క్రమంలో బ్యాటరీ కార్లను ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ఆటోలు, క్యాబ్లను నియంత్రించేందుకు యాజమాన్యం ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఆస్పత్రి ప్రాంగణంలో జటిలంగా తయారైన ట్రాఫిక్ సమస్యను సైతం చక్కదిద్దే క్రమంలో వినూత్న చర్యలకు ప్రణాళికలను సిద్ధం చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా జూన్ మొదటి వారంలో అందుబాటులో రానున్న బ్యాటరీ కార్లు రోగుల అవసరాలను తీర్చే విధంగా దోహదపడతాయి. ఈ కార్ల సేవలు నగరంలో ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రి రంగంలో తొలిసారిగా నిమ్స్ ప్రవేశపెట్టనుంది. ఆంధ్రా బ్యాంకు అయిదు బ్యాటరీ కార్లను సమకూర్చనుంది. కొంత మంది దాతలు ఈ కార్లను సమకూర్చేందుకు ముందుకు వస్తున్నారని, ఇప్పటికి కొన్ని సేవలకు సిద్ధంగా ఉన్నాయని నిమ్స్ ఇన్చార్జిర్జి డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, నిమ్స్ ఏపీఆర్ సత్యాగౌడ్ తెలిపారు. ఎర్రమంజిల్ కాలనీలో రవీంద్రనాథ్ ఠాకూర్ స్కూల్ కొనసాగిన ప్రాంతంలో నిర్మించతలపెట్టిన 2 వేల పడకల బహుళ అంతస్తుల సముదాయానికి వచ్చే నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేస్తారని చెప్పారు. -
నిమ్స్ లో వైఎస్ భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు
-
నాలుగు నెలలు 50 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు
లక్డీకాపూల్ : అరుదైన రికార్డులకు చిరునామాగా నిలిచే నిజాం వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్) మరో సరికొత్త రికార్డును నమోదు చేసింది. గత నాలుగు నెలల్లో 50 మూత్రపిండ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి నిమ్స్ తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ ద్వారా రూ.15 లక్షలు ఖర్చయ్యే సర్జరీని పైసా ఖర్చు లేకుండా చేయడం విశేషం. కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం సాధ్యం కాని ఈ అవయవ మార్పిడి ఆపరేషన్లతో 50 మంది జీవితాల్లో వెలుగులు నింపినట్లయింది. 2014 నుంచి ఇప్పటివరకు 862 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు నిమ్స్ ఆసుపత్రి చరిత్రలో 862 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి.గత ఏడాది 93 ఆపరేషన్లు జరగ్గా, ఈ ఏడాది కేవలం నాలుగు నెలల్లోనే 50 మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. జీవన్దాన్ కార్యక్రమం ద్వారా చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ను అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నారు. నిమ్స్ యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో వైద్య బృందం విశేషమైన సేవలు అందిస్తూ నిమ్స్ ఖ్యాతిని మరింత పెంచడంతో సఫలీకృతులవుతున్నారు. కాగా, 4 నెలల్లో 50 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసి, పునర్జన్మను ప్రసాదించిన నిమ్స్ వైద్యులను మంత్రి హరీశ్ రావు అభినందించారు. -
చీమలపాడు దుర్ఘటనలో మరొకరు మృతి
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఈ నెల 12న బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనం సందర్భంగా బాణాసంచా కాల్చే క్రమంలో సిలిండర్ పేలిన ఘటనలో మృతులసంఖ్య నాలుగుకు చేరింది. ఘటన జరిగిన రోజే ముగ్గురు మృతి చెందగా, రెండుకాళ్లు కోల్పోయి తీవ్రంగా గాయపడిన చిందివారి సందీప్(36) హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అతడికి భార్య మమత అలియాస్ మొమీన్, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సిందేయి తాలూకా మింగరి గ్రామానికి చెందిన చిందివారి సందీప్ బతుకుదెరువు కోసం పదిహేనేళ్ల క్రితం తెలంగాణకు వచ్చాడు. తల్లిదండ్రులు, సోదరి పోషణ బాధ్యతలు సందీప్ చూసు కుంటున్నాడు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సందీప్ సుతారీ పనులు చేసే క్రమంలో ఒడిశా ప్రాంతానికి చెంది మొమీన్ పరిచయం కావటంతో ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కృష్ణ ఉన్నాడు. ఏడాది క్రితం పొట్ట చేతపట్టుకొని కారేపల్లి మండలం చీమలపాడుకు సందీప్, మొమీన్ వచ్చారు. భార్య గ్రామంలో వ్యవసాయకూలీ పనులకు వెళ్తుండగా, సందీ ప్ సుతారీ పనులు చేసేవాడు. ఈ నెల 12న మొమీన్ మిర్చి తోటలో పనికి వెళ్లగా, గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశానికి సందీప్ హాజరయ్యాడు. ఆరోజు గుడిసె కాలి పోతుండటంతో అందరితోపాటు మంటలు ఆర్పే క్రమంలో సిలిండర్ శకలాలు దూసుకురావడంతో సందీప్ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. తొలుత ఖమ్మం ప్రభు త్వ ఆస్పత్రికి, తర్వాత నిమ్స్కు తరలించగా శుక్రవారం మృతి చెందాడు. ఊరుగాని ఊరిలో భర్తను కోల్పోయిన మొమీన్ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
కాటేస్తున్న కల్తీ కల్లు.. వణికిపోతున్న ఉమ్మడి పాలమూరు జిల్లా
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కల్తీ కల్లు ఉమ్మడి పాలమూరు జిల్లాను వణికిస్తోంది. ఇప్పటికే మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరుకి చెందిన హరిజన ఆశన్న (58) మృతిచెందగా.. బుధవారం మరో మహిళ, మరో యువకుడు మరణించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. చికిత్స చేసినా ఫలితం లేక.. మహబూబ్నగర్ పట్టణంలోని అంబేడ్కర్నగర్కు చెందిన విష్ణుప్రకాశ్ (29) ఈ నెల ఏడో తేదీన వింతగా ప్రవర్తిస్తూ జిల్లా ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం వెంటనే అతడిని వైద్యులు ఇంటికి పంపించారు. అయితే తెల్లారి కూడా అదేవిధంగా ప్రవర్తించడంతో బంధువులు మళ్లీ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అప్పట్నుంచీ ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మృతి చెందాడు. విష్ణుప్రకాశ్ భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలో పోస్టల్ శాఖ ఏబీపీఎంగా ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి చిన్నతనంలోనే చనిపోగా.. తపాలా శాఖలోనే పనిచేసే తండ్రి కూడా కొన్నాళ్ల క్రితమే మరణించాడు. తండ్రి స్థానంలో విష్ణుప్రకాశ్ ఉద్యోగంలో చేరాడు. అయితే అతనికి పెళ్లి కాకపోవడం, ఒంటరితనంతో మందు కల్లుకు బానిస అయినట్లు తెలుస్తోంది. అయితే ఫిట్స్ (మూర్ఛ) రావడంతో విష్ణుప్రకాశ్ను ఆస్పత్రిలో చేర్పిం చగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని మేనత్త భువనేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలావుండగా జిల్లా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న మహబూబ్నగర్ రూరల్ మండలం దొడ్డలోనిపల్లికి చెందిన రేణుక (55) కూడా బుధవారం రాత్రి మృతి చెందింది. మరోవైపు జడ్చర్ల మండలం మల్లెబోనిపల్లికి చెందిన రేణుక పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్కు తరలించారు. కాగా జనరల్ ఆస్పత్రిలోని సాధారణ వార్డుల్లో మరో పది మంది వరకు కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మృతి చెందిన వారిలో మెటబాలిక్ ఎన్సెఫలోపతి లక్షణాలు ఉన్నాయని.. పోస్టుమార్టం అనంతరం నమూనాలను హైదరాబాద్ ల్యాబ్కు పంపనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ తెలిపారు. ఆస్పత్రిలో చేరాలంటే చెప్పినట్లు వినాలి..! కల్తీ కల్లు అలవాటుతో మహబూబ్నగర్ మండలంలోని దొడ్డలోనిపల్లి, తిమ్మసానిపల్లి, కోయనగర్, అంబేడ్కర్ నగర్ కాలనీలతో పాటు జడ్చర్ల, నవాబ్పేట మండలాలకు చెందిన పలువురు అస్వస్థతకు గురై చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వ చ్చారు. తలవెనక్కి వాలడం, నాలుక బయటకు రావడం, నత్తి, శరీరంలో చలనం లేకపోవడం వంటి లక్షణాలు వారిలో ఉ న్నాయి. ఇది గమనించిన వైద్యులు బాధితులతో వచ్చి న సహా యకులకు ముందస్తు సూచనలు చేసినట్లు సమాచారం. ‘ఎవరడిగినా కల్తీ కల్లు కాదు.. ఎండదెబ్బ తాకింది.. కడుపునొప్పి, ఫిట్స్తో వచ్చి నట్లు చెప్పాలి.. అలా అయితేనే చికిత్స అందజేస్తాం.. లేకుంటే వేరే హాస్పిటల్కు వెళ్లొచ్చు..’అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆశన్న, విష్ణుప్రకాశ్ బంధువులు కూడా డాక్టర్ల సూచన మేరకే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ బాధితులు! కల్తీ కల్లుకు అలవాటు పడిన పలువురు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది 40 నుంచి 50 మంది వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో చేరితే బయటకు తెలుస్తుందని.. పరువు పోతుందనే కారణంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. -
హైదరాబాద్ నిమ్స్ కు బలగం మొగిలయ్య తరలింపు..
-
సర్కార్ సర్జరీ సూపర్.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్యం
సాక్షి హైదరాబాద్ : భాగ్యనగరంలోని ప్రభుత్వాస్పత్రులు ఆధునిక చికిత్సలకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా’కు అనే స్థాయి నుంచి ‘పోదాం పద సర్కారు దవాఖానాకు’ అనే దశకు చేరుకున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా క్లిష్టమైన ఆపరేషన్లను సైతం చేస్తూ రోగులకు పునర్జన్మనిస్తున్నాయి. నిష్ణాతులైన వైద్య బృందాలతో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో కొంతకాలంగా అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయి. ఉస్మానియా, గాందీల్లో పూర్తి ఉచితంగా నిమ్స్లో ఆరోగ్యశ్రీ ద్వారా తక్కువ మొత్తంలో ఆపరే షన్లు చేస్తున్నారు. కుటుంబసభ్యుల అవయవదానం, జీవన్దాన్ ద్వారా రోగులకు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. వాటిల్లో కొన్నింటిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. 8 నెలల చిన్నారికి అరుదైన వైద్యం జగిత్యాల జిల్లాకు చెందిన నారాయణ, ప్రేమలత దంపతులది మేనరిక వివాహం. వారి 8 నెలల పాప నిస్ సిండ్రోమ్ అనే అరుదైన కాలేయ సంబంధిత వ్యాధితో నిలోఫర్కు వెళ్లగా అక్కడి వైద్యులు ఉస్మానియాకు వెళ్లమన్నారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి పాపకు పునర్జన్మను ప్రసాదించారు. ఇలాంటి వ్యాధి ప్రపంచంలోనే నాలుగోది కాగా, భారత్లో మొదటిదని వైద్యులు తెలిపారు. లక్షలు ఖరీదుచేసే ఆపరేషన్ను రూపాయి కూడా తీసుకోకుండా 28 మంది వైద్యులు దాదాపు 18 గంటలపాటు సర్జరీ పూర్తి చేసి తమ పాపకు మళ్లీ జీవం పోశారని ఆ చిన్నారి తల్లి పేర్కొంది. 2 నెలల్లో 70 కిలోలు తగ్గింపు గుడిమల్కాపూర్కు చెందిన శివరాజ్సింగ్ కుమారుడు మునీందర్సింగ్ ఐదేళ్ల ప్రాయం నుంచి అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నాడు. 23 ఏళ్లకు దాదాపు 220 కిలోలతో నడవలేని స్థితికి చేరాడు. కుటుంబసభ్యులు అతడిని ఉస్మానియాలో చేర్పించారు. చిన్నతనం నుంచే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తోపాటు శ్వాస సమస్యలు ఉన్నాయి. ఉస్మానియా వైద్యులు బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించారు. 2 నెలల్లోనే దాదాపు 70 కిలోల బరువు తగ్గాడు. ‘నన్ను చూసి చాలా మంది హేళన చేసేవారు. ఉచితంగా సర్జరీ చేసిన ఉస్మానియా వైద్యులకు కృతజ్ఞతలు’అని మునీందర్సింగ్ సంతోషంగా చెప్పాడు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రిలో.. బోరబండకు చెందిన మల్లెల వాణి కాలేయంలో కుడివైపు పెద్ద కణితితో బాధపడుతోంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే దాదాపు రూ.15 లక్షలు ఖర్చవుతాయనడంతో ఆమె ఉస్మానియాకు వెళ్లింది. సాధారణంగా ఎడమ వైపు కణితి ఏర్పడే అవకాశం ఉండగా వాణికి కుడివైపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. లాపరోస్కోపీ ద్వారా శస్త్రచికిత్సను పూర్తి చేయడంతో రోగి వారంలోనే కోలుకుంది. ఓ ప్రభుత్వాస్పత్రిలో ఇలాంటి సర్జరీ చేయడం దేశంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. రోజువారీ పని చేసుకుంటూ జీవిస్తున్న తనకు ఆపరేషన్ ఉచితంగా చేయడం పూర్వజన్మ సుకృతమని వాణి పేర్కొంది. ఆరోగ్యశ్రీతో గుండె మార్పిడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నర్సింహులు కుమారుడు వరుణ్తేజ్ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు ఆ స్కూల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వరుణ్తేజ్ గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్కు వస్తే ఆపరేషన్ చేస్తామనడంతో కుటుంబసభ్యులు వరుణ్ను తీసుకెళ్లారు. ఒక్కరోజుకే అక్కడ రూ.10 వేలు ఖర్చవడంతో బంధువుల సలహా మేరకు వారు నిమ్స్ను ఆశ్రయించారు. కార్డియో థొరాసిక్ విభాగం వైద్యులు వరుణ్తేజ్కు ఆరోగ్యశ్రీ కింద గత నెల 28న గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆరోగ్యం కుదుటపడటంతో రెండు రోజుల తర్వాత డిశ్చార్జి చేశామని నిమ్స్ సీటీ సర్జన్ విభాగం అధిపతి డాక్టర్ అమరే‹శ్ మాలెంపాటి తెలిపారు. ఒకే నెలలో 15 కిడ్నీల మార్పిడి దేశంలోనే తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 15 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను చేసి నిమ్స్ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా యురాలజీ, నెఫ్రాలజీ, అనస్తీషియా విభాగాలను మంత్రి హరీశ్రావు ఇటీవలే అభినందించారు. 2014 నుంచి ఇప్పటివరకు కిడ్నీ మార్పిళ్లు 839 (నిమ్స్), 700 (ఉస్మానియా) కాలేయ మార్పిళ్లు 25 (నిమ్స్), 26 (ఉస్మానియా) జరిగాయి. నిమ్స్లో గుండె (10), ఊపిరితిత్తుల మార్పిడి (01) శస్త్రచికిత్సలు జరిగాయి. దక్షిణాదిలోకెల్లా రికార్డు.. స్కోలియోసిస్ (గూని)తో ఇబ్బంది పడేవారికి చేసే వెన్నుపూస సర్జరీ చాలా క్లిష్టమైనది. సుమారు 12–14 గంటలు పడుతుంది. ఏమాత్రం పొరపాటు జరిగినా ఆ రోగి రెండు కాళ్లు చచ్చుబడే ప్రమాదముంటుంది. నిమ్స్లో మూడేళ్లుగా 200 మందికి ఈ సర్జరీలు చేశారు. గత ఏడాదిలో ఏకంగా 80 సర్జరీలు నిర్వహించి దక్షిణాదిలో రికార్డు సొంతం చేసుకుందని ఆర్థోపెడిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ నాగేష్ తెలిపారు. నిజాం కాలంలో బొక్కల దవాఖానా (ఆర్థోపెడిక్)గా ప్రారంభమైన నిమ్స్ నేడు వేర్వేరు సర్జరీలకు వేదికైందన్నారు. ఏడాదికి హిప్, నీ రీ ప్లేస్మెంట్లు 350, వెన్నెముక 80, ట్రామా 3వేలు, ఆంకాలజీ 60 చొప్పున సర్జరీలు నిర్వహిస్తూ తనదైన ప్రత్యేకతను సంతరించుకుంటోందని నాగేశ్ తెలిపారు. 18 గంటలపాటు శ్రమించి.. కర్నూలు జిల్లా అవుకుకు చెందిన ఎక్కలూరు సత్యమయ్య (61) పోస్టల్ శాఖలో రికరింగ్ డిపాజిట్ ఏజెంట్. ఏడాది క్రితం కాళ్లు, చేతులు వాచిపోవడంతో కుటుంబసభ్యులు కర్నూలులోని ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు నిమ్స్కు తీసుకెళ్లాలని సూచించారు. సత్యమయ్యకు హెపటైటీస్ బి, లివర్ సిర్రోసిస్, కాలేయ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించి కాలేయ మార్పిడి చేయాలన్నారు. వెస్ట్ మారేడుపల్లికి చెందిన అభిజిత్ (20) అనే యువకుడు బ్రెయిన్డెడ్ అవడంతో అవయవదానానికి అతడి కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో నిమ్స్, ఉస్మానియా వైద్యులు సంయుక్తంగా 18 గంటలు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం సత్యమయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రొఫెసర్ బీరప్ప తెలిపారు. గాందీలో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ గాందీలో రూ.35 కోట్లతో స్టేట్ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ నిర్మాణపనులు కొనసాగుతున్నాయి. 4 ఆత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, స్టెప్డౌన్, పోస్ట్ ఆపరేటివ్ వార్డు లు ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. ఒకేచోట గుండె, మూత్రపిండాలు, తుంటి, కీళ్ల మార్పిడి, ఊపిరితిత్తులు, కాలేయం శస్త్రచికిత్సలు, కాక్లియర్ వంటి కృత్రిమ అవయవాల ఏర్పాటుతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. రెండోదశలో రొబోటిక్ ఆపరేషన్ థియేటర్, ఇతర అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తాం. –ప్రొ.రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ప్రీతి కేసులో ట్విస్ట్.. కళ్లకు టేప్ ఎందుకు వేశారు: ప్రీతి సోదరుడు
సాక్షి, హైదరాబాద్: మెడికల్ విద్యార్థిని ప్రీతీ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ సైఫ్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. తాజాగా ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్లో ఎలాంటి విషపదార్థాలు డిటెక్ట్ కాలేదని రిపోర్ట్లో వెల్లడైంది. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని టాక్సికాలజీ రిపోర్ట్ స్పష్టం చేసింది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోనూ ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని రిపోర్ట్లో తేలింది. దీంతో, కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇక, ఆసుపత్రిలో ప్రీతి ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలిసిందే. ఇక, టాక్సికాలజీ రిపోర్టుపై ప్రీతి కుటుంబ సభ్యులు స్పందిస్తున్నారు. ప్రీతిది హత్యే అని వారు చెబుతున్నారు. ఇక, ప్రీతి సోదరుడు పృధ్వీ తాజాగా వీడియోలో మాట్లాడుతూ.. ‘ప్రీతికి నిమ్స్లో బ్లడ్ డయాలసిస్ చేసి, ప్లాజ్మా కూడా చేశారు. దీని వల్లే రిపోర్టులో విష పదార్ధాలు ఏమీ లేదని వచ్చింది. శరీరం మొత్తం క్లీన్ చేసి రిపోర్టు తీస్తే ఏం ఉంటుంది. గవర్నర్ రాక ముందే డయాలసిస్ చేశారు. మాకు తెలియని విషయాలు కూడా పోలీసులు మాకు చెప్పారు. ప్రీతి కళ్లకు టేప్ ఎందుకు వేశారు. ఆ నాలుగు గంటల పాటు ఏమైందో మాకు ఎందుకు చెప్పడం లేదు. మాకు ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి’ అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం హైదరాబాద్కు రానున్నారు. ఇప్పటికే డీజీపీ వరంగల్ సీపీ రంగనాథ్కు ఫోన్ కూడా చేశారు. -
100 రోజులకు చేరిన నిమ్స్ ఉద్యోగుల నిరసన
లక్డీకాపూల్ : తమకు న్యాయం చేయాలని కోరుతూ నిమ్స్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం వంద రోజులు పూర్తి చేసుకుంది. తమను జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) కిందకు తీసుకురావాలని డిమాండ్ వంద రోజులుగా హధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా చేస్తున్నారు. పెన్షన్ సదుపాయాన్ని ఈపీఎఫ్ నుంచి నిమ్స్కు మార్చాలని డిమాండ్ డిమాండ్ చేశారు. గతంలో నిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది 32 మంది, డాక్టర్లు 12 మందికి కల్పించిన విధంగానే తమకు కూడా నిమ్స్ పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పెన్షన్ బాధితుల ప్రతినిధులు, శాంతి కుమారి, మధు కుమార్ తదితరులు మాట్లాడారు. -
ప్రీతి విషయంలో అసలేం జరిగింది.. గదిలో దొరికిన ఇంజెక్షన్స్ ఇవే..
వైద్యవృత్తితో పది మందికి సేవా చేయాలనే కోరికతో, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మెడికల్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి(26) మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం ప్రీతి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ విషాదకర ఘటనపై అందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రీతి ఇలా చేయడానికి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలేం జరిగింది? జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాకు చెందిన ధరావత్ నరేందర్ వరంగల్లోని ఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య శారద, ముగ్గురు కుమార్తెలు పూజ, ఉష, ప్రీతి, కుమారుడు వంశీ ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే వారు హైదరాబాద్లోని ఉప్పల్కు వలస వచ్చారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రీతి.. 2022 నవంబర్ 18న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో అనస్తీషియా పీజీ కోర్సులో చేరింది. థియట్రికల్ క్లాస్లో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్ విద్యార్థులతో కలిసి ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వర్తించాలి. ఈ క్రమంలోనే సీనియర్ విద్యార్థి సైఫ్ ఆమెపై వేధింపులకు దిగాడు. దీనిపై ప్రీతి తండ్రి నరేందర్ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఈ విషయాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్దాసు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అనస్తీషియా విభాగాధిపతి నాగార్జునరెడ్డి సమక్షంలో గత మంగళవారం (21వ తేదీన) ప్రీతికి, సైఫ్కు కౌన్సెలింగ్ నిర్వహించారు. డ్యూటీలో ఉండగానే అపస్మారక స్థితికి.. మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ప్రీతి.. రాత్రి 12 గంటల వరకు రెండు శస్త్రచికిత్సల్లో పాల్గొంది. బుధవారం తెల్లవారుజామున తలనొప్పి, ఛాతీలో నొప్పిగా ఉందంటూ జోఫర్, ట్రెమడాల్ ఇంజెక్షన్ కావాలని స్టాఫ్ నర్సును అడిగింది. అయితే, ఉదయం ఏడు గంటల సమయంలో వైద్యుల గదిలో ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటాన్ని తోటి వైద్యులు గమనించారు. గుండెపోటుకు గురైందని గుర్తించి, సీపీఆర్తో గుండె పనిచేసేలా చేసి.. చికిత్స ప్రారంభించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉండటంతో.. ఉన్నతాధికారులు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రీతిని హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే తొలుత ట్రెమడాల్ ఇంజక్షన్ ఓవర్డోస్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు భావించారు. అయితే ప్రీతి అపస్మారక స్థితిలో కనిపించిన గదిలో సక్సినైల్కోలైన్, మెడజోలం, పెంటనీల్ ఇంజక్షన్ వాయిల్స్ దొరికాయి. దీంతోపాటు ప్రీతి గూగుల్లో సక్సినైల్కోలిన్ ఇంజెక్షన్ గురించి సెర్చ్ చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఏ మందు తీసుకుందన్నది తేల్చేందుకు ఆమె బ్లడ్ శాంపిల్స్ను ట్యాక్సికాలజీ పరీక్షలకు పంపారు. ఐదు రోజుల పాటు వెంటిలేటర్పైనే.. వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించే సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్ చేస్తూ, గుండె తిరిగి కొట్టుకునేలా చేశారు. నిమ్స్కు చేరుకున్న తర్వాత ఆమెకు పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న పరిస్థితుల్లో ఐదుగురు ప్రత్యేక వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షించింది. హానికర ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల శరీరంలో చాలా అవయవాలు దెబ్బతిన్నాయని (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్), మెదడుపైనా ప్రభావం పడిందని గుర్తించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు ఐదు రోజులపాటు అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రీతి బాధ చెప్పుకొన్న ఆడియో కలకలం ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు రోజు ప్రీతి తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ..సైఫ్ తనను వేధిస్తున్న విషయాన్ని వివరించింది. తనలాంటి చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడని.. సీనియర్లు అంతా ఒకటేనని వాపోయింది. సైఫ్పై ఫిర్యాదు చేస్తే తనకు నేర్పించకుండా దూరం పెడతారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం బయటపడిన ఆడియో కలకలం రేపింది. నిమ్స్ వైద్యుడి వ్యాఖ్యలపై నిరసన నిమ్స్ ఐసీయూ వద్దలో ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగడంపై వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. ఐసీయూలోకి వచ్చి మృతదేహాన్ని చూసి, సంతకం చేయాలని వైద్యులు కోరగా.. ప్రీతి మృతికి కారణమేంటో చెప్పేదాకా, తగిన న్యాయం జరిగేదాకా రాబోమని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఓ వైద్యుడు కల్పించుకుంటూ ‘అయితే.. డెడ్ బాడీని ఇలాగే ప్యాక్ చేసి పంపించేయాలా?’ అని వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. దీనిపై ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర నిరసన తెలిపారు. రిమాండ్లో ఉన్న నిందితుడు ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రీతి ఘటనపై ఏర్పాటు చేసిన వైద్యుల బృందం ఇప్పటికే విచారణ నివేదికను డీఎంఈకి పంపింది. -
చర్చలు సఫలం.. గాంధీ ఆస్పత్రికి ప్రీతి మృతదేహం తరలింపు
వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం కన్నుమూసింది. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థినికి హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ప్రీతి మృతికి గల కారణాలను వెల్లడించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతో నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే ప్రీతి మరణానికి గల కారణాలు వివరించాలని.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రీతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మంత్రులు వారితో చర్చలు జరిపారు. చివరికి బాధిత కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో అయితే ఎట్టకేలకు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు అంగీకరించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రీతి డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తి చేయనున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రీతి తల్లిదండ్రులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసును విచారణ చేపడతామని తెలిపింది. -
నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. డాక్టర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం
వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం కన్నుమూసింది. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థినికి హైదరాబాద్ నిమ్స్లో చికిత్స అందించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో రాత్రి 9.10 గంటలకు ఆమె తుదిశ్వస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ప్రీతికి చికిత్స అందించిన నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రీతి మృతికి గల కారణాలను వెల్లడించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఆమె మృతి చెందిన విషయాన్ని చెప్పేందుకు తల్లిదండ్రులను ఐసీయూలోకి రావాలని వైద్యులు సూచించారు. కానీ ప్రీతి ఎలా చనిపోయిందన్న విషయాన్ని చెప్పాలని అభ్యర్థించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని తేల్లి చెప్పారు ఆమె తల్లిదండ్రులు. హెచ్వోడిపై కేసు నమోదు చేయాలని ప్రీతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తనని లోపలికి అనుమతించడం లేదని ప్రీతి సోదరుడు వాపోయారు. ఐసీయూ వద్ద ప్రీతి తల్లిదండ్రుల ఆందోళన కొనసాగుతోంది. అయితే కాసేపట్లో ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించనున్నారు. ప్రీతి మరణవార్త విన్న తెలియడంతో ఆమె గ్రామంలో ఆందోళనకు దిగారు గ్రామస్థులు. ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. నిందితులు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వపరంగా వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్ట చేశారు. -
మెడికో ప్రీతి కన్నుమూత.. మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని
సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన మెడికల్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి (26) కన్నుమూసింది. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం రాత్రి 9.10 గంటలకు ప్రాణాలు విడిచినట్టు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దీనితో ఆమె తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, స్నేహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రీతి మృతికి కారణమేంటో చెప్పాలని, నిందితుడు సైఫ్, కాకతీయ మెడికల్ కాలేజీ అనస్తీíÙయా విభాగం హెడ్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు చేపట్టేదాకా మృతదేహాన్ని తరలించబోమంటూ నిమ్స్ వద్ద ఆందోళనకు దిగారు. దీనితో ఆదివారం అర్ధరాత్రి తర్వాతా నిమ్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసలేం జరిగింది? జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిరి్నతండాకు చెందిన ధరావత్ నరేందర్ వరంగల్లోని ఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య శారద, ముగ్గురు కుమార్తెలు పూజ, ఉష, ప్రీతి, కుమారుడు వంశీ ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే వారు హైదరాబాద్లోని ఉప్పల్కు వలస వచ్చారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రీతి.. 2022 నవంబర్ 18న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో అనస్తీషియా పీజీ కోర్సులో చేరింది. థియట్రికల్ క్లాస్లో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్ విద్యార్థులతో కలిసి ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వర్తించాలి. ఈ క్రమంలోనే సీనియర్ విద్యార్థి సైఫ్ ఆమెపై వేధింపులకు దిగాడు. దీనిపై ప్రీతి తండ్రి నరేందర్ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఈ విషయాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్దాసు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అనస్తీíÙయా విభాగాధిపతి నాగార్జునరెడ్డి సమక్షంలో గత మంగళవారం (21వ తేదీన) ప్రీతికి, సైఫ్కు కౌన్సెలింగ్ నిర్వహించారు. డ్యూటీలో ఉండగానే అపస్మారక స్థితికి.. మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ప్రీతి.. రాత్రి 12 గంటల వరకు రెండు శస్త్రచికిత్సల్లో పాల్గొంది. బుధవారం తెల్లవారుజామున తలనొప్పి, ఛాతీలో నొప్పిగా ఉందంటూ జోఫర్, ట్రెమడాల్ ఇంజెక్షన్ కావాలని స్టాఫ్ నర్సును అడిగింది. అయితే ఉదయం ఏడు గంటల సమయంలో వైద్యుల గదిలో ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటాన్ని తోటి వైద్యులు గమనించారు. గుండెపోటుకు గురైందని గుర్తించి, సీపీఆర్తో గుండె పనిచేసేలా చేసి.. చికిత్స ప్రారంభించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉండటంతో.. ఉన్నతాధికారులు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రీతిని హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే తొలుత ట్రెమడాల్ ఇంజక్షన్ ఓవర్డోస్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు భావించారు. అయితే ప్రీతి అపస్మారక స్థితిలో కనిపించిన గదిలో సక్సినైల్కోలైన్, మెడజోలం, పెంటనీల్ ఇంజక్షన్ వాయిల్స్ దొరికాయి. దీంతోపాటు ప్రీతి గూగుల్లో సక్సినైల్కోలిన్ ఇంజెక్షన్ గురించి సెర్చ్ చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఏ మందు తీసుకుందన్నది తేల్చేందుకు ఆమె బ్లడ్ శాంపిల్స్ను ట్యాక్సికాలజీ పరీక్షలకు పంపారు. ఐదు రోజుల పాటు వెంటిలేటర్పైనే.. వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించే సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్ చేస్తూ, గుండె తిరిగి కొట్టుకునేలా చేశారు. నిమ్స్కు చేరుకున్న తర్వాత ఆమెకు పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న పరిస్థితుల్లో ఐదుగురు ప్రత్యేక వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షించింది. హానికర ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల శరీరంలో చాలా అవయవాలు దెబ్బతిన్నాయని (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్), మెదడుపైనా ప్రభావం పడిందని గుర్తించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు ఐదు రోజులపాటు అన్ని విధాలా ప్రయతి్నంచారు. కానీ ఫలితం లేకపోయింది. రిమాండ్లో ఉన్న నిందితుడు ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రీతి ఘటనపై ఏర్పాటు చేసిన వైద్యుల బృందం ఇప్పటికే విచారణ నివేదికను డీఎంఈకి పంపింది. ప్రీతి బాధ చెప్పుకొన్న ఆడియో కలకలం ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు రోజు ప్రీతి తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ..సైఫ్ తనను వేధిస్తున్న విషయాన్ని వివరించింది. తనలాంటి చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడని.. సీనియర్లు అంతా ఒకటేనని వాపోయింది. సైఫ్పై ఫిర్యాదు చేస్తే తనకు నేర్పించకుండా దూరం పెడతారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం బయటపడిన ఆడియో కలకలం రేపింది. అవయవాలన్నీ దెబ్బతినడంతోనే.. ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించిందని, అయినా ఫలితం లేకపోయిందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ప్రీతి డ్యూటీలో ఉండగా తన వద్ద ఉన్న సక్సినైల్కోలైన్ ఇంజక్షన్ తీసుకోవడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయిందని, ఆస్పత్రికి తీసుకొచి్చన తర్వాత వెంటిలేటర్పై, ఎక్మో యంత్రంపై అత్యవసర వైద్యసేవలు అందించామని తెలిపారు. మొత్తంగా ఆమె నాలుగు సార్లు గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్)కు గురైందని, అందులో నిమ్స్కు రాకముందే రెండుసార్లు వచ్చిందని వివరించారు. ప్రీతి తీసుకున్న మత్తు ఇంజక్షన్ కారణంగా గుండె రక్తం పంప్ చేసే సామర్థ్యం (ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ హార్ట్) 28శాతానికి పడిపోయిందని.. గ్లోబల్ హిపోకైనేషియా, పాంక్రియాటైటిస్, అసైటిస్, ఊపిరితిత్తుల సమస్య ఏర్పడినట్టు నిర్ధారణ అయినట్టు తెలిపారు. ప్రీతి అప్పటికే థైరాయిడ్, కీళ్లవాతానికి సంబంధించి మందులు వాడుతున్నట్టు గుర్తించామని వివరించారు. నిమ్స్ వైద్యుడి వ్యాఖ్యలపై నిరసన నిమ్స్ ఐసీయూ వద్దలో ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగడంపై వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. ఐసీయూలోకి వచ్చి మృతదేహాన్ని చూసి, సంతకం చేయాలని వైద్యులు కోరగా.. ప్రీతి మృతికి కారణమేంటో చెప్పేదాకా, తగిన న్యాయం జరిగేదాకా రాబోమని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఓ వైద్యుడు కలి్పంచుకుంటూ ‘అయితే.. డెడ్ బాడీని ఇలాగే ప్యాక్ చేసి పంపించేయాలా?’ అని వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. దీనిపై ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర నిరసన తెలిపారు. నిమ్స్ వద్ద ఆందోళన.. ఉద్రిక్తత ప్రీతి మృతి చెందినట్టుగా ప్రకటించిన నిమ్స్ వైద్యులు మృతదేహాన్ని నేరుగా వరంగల్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వచ్చి మృతదేహాన్ని చూసి సంతకం పెట్టాలని తల్లిదండ్రులను కోరారు. కానీ ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు దీనికి నిరాకరించారు. ప్రీతి మృతికి అసలు కారణమేంటో తేల్చాలని, ఏ ఇంజెక్షన్ తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆర్ఐసీయూ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. అప్పటిదాకా మృతదేహాన్ని తరలించనివ్వబోమన్నారు. ప్రీతిని వేధించిన సైఫ్, మరో ఏడుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. కేఎంసీ అనస్తీషియా విభాగం హెడ్ను సస్పెండ్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారికి వైద్య విద్యార్థులు, గిరిజన సంఘాల నేతలు, కార్యకర్తలు, ఏబీవీపీ, ఇతర విద్యార్థి సంఘాలు, బీజేపీ నేతలు మద్దతుగా నిలవడంతో ఆదివారం రాత్రి నిమ్స్ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రీతి కుటుంబానికి రూ.5 కోట్లు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని గిరిజన సంఘాల నేతలు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కోరారు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయతి్నంచినా ఎవరూ ఆందోళన విరమించలేదు. దీనితో భారీగా బలగాలను మోహరించారు. మృతదేహాన్ని బయటికి తెచ్చి.. మళ్లీ లోపలికి.. నిమ్స్లో ఓ వైపు ఆందోళన జరుగుతుండగానే.. మరోవైపు వైద్యులు, పోలీసులు ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయతి్నంచారు. దీంతో ఆందోళనకారులు అక్కడికి వచ్చిన అంబులెన్స్ ముందు బైఠాయించి, దానిని వెనక్కి పంపారు. దీనితో అధికారులు మరో అంబులెన్స్ను తీసుకురాగా.. మృతదేహాన్ని ఆర్ఐసీయూ నుంచి బయటికి తీసుకురాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆర్ఐసీయూ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నిమ్స్లో రోగులకు వైద్య సేవలు అందించడంలో అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆందోళన విరమించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప విజ్ఞప్తి చేశారు. ఎమర్జెన్సీ సేవల కోసం వచ్చే రోగులకు ఇబ్బందికలుగుతోందని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రికి మృతదేహం సోమవారం తెల్లవారుజామున మూడు గంటల తర్వాత ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. -
ప్రీతి కేసు.. ఠాగూర్ సినిమాలెక్కుంది!
సాక్షి, హైదరాబాద్: పీజీ డాక్టర్ ప్రీతికి అందుతున్న చికిత్స విషయంలో నిమ్స్ వైద్యులు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఇది ఠాగూర్ సినిమా లెక్కుందని ఆమె బాబాయ్ రాజ్కుమార్ ఆగ్రహం వెల్లగక్కారు. ఇక.. నిన్నటిదాకా ఆమె బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పారని, ఇవాళేమో హఠాత్తుగా బ్రెయిన్డెడ్ అయ్యిందని చెప్తున్నారని ఆమె తండ్రి నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో కాసేపట్లో ప్రీతి ఆరోగ్య స్థితిపై కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో నిమ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. డాక్టర్లు మాకేమో ఒకటి చెప్తున్నారు. ఆస్పత్రి చుట్టూ పోలీసులను పెడుతున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి మా అమ్మాయిని బతికించాలనే ఉద్దేశం ఉంటే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేది. కానీ, అలా చేయలేదు. ఇప్పుడు జరుగుతున్నదంతా ఠాగూర్ సినిమా లెక్కే ఉంది అని ప్రీతి బాబాయ్ రాజ్కుమార్ ఆగ్రహం వెల్లగక్కారు. మరోవైపు ప్రీతికి నిమ్స్లో సరైన చికిత్స అందడం లేదని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ప్రీతి కుటుంబ సభ్యులకు పరామర్శ సందర్భంగా మీడియా ముందు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మెరుగైన చికిత్స పేరిట వరంగల్ ఎంజీఎం నుంచి ప్రీతిని హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. గత ఐదు రోజులుగా చికిత్స అందిస్తూ.. ఎప్పటికప్పుడు పరిస్థితి విషమంగానే ఉందటూ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వచ్చారు. అయితే తమకు మాత్రం ప్రీతి బ్రతుకుతుందనే భరోసా ఇస్తూ.. ఇప్పుడు హఠాత్తుగా బ్రెయిన్ డెడ్, బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పడంపై ఆమె కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గాంధీకి ప్రీతి! ఇదిలా ఉంటే నిమ్స్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. మరోవైపు.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఈ తరుణంలో.. ఏ క్షణమైనా ప్రీతిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తారనే ప్రచారం నడుస్తోంది. ఏది అనేది కాసేపట్లో నిమ్స్ వైద్యులు విడుదల చేసే బులిటెన్.. కీలక ప్రకటనపైనే ఆధారపడి ఉంది. -
ప్రీతి బ్రెయిన్డెడ్!.. నిమ్స్ వద్ద భారీగా పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం నిమ్స్ వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ర్యాంగింగ్ పెనుభూతంతో వణికిపోయిన ఆమె.. ఆత్మహత్యాయత్నం చేయడం, గత ఐదురోజులుగా నగరంలోని నిమ్స్లో ఆమె చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం ప్రీతి తండ్రి నరేందర్ ఆమె ఆరోగ్య స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి బ్రెయిడ్ డెడ్ అయ్యిందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు కొంత ఆశ ఉండేది. కానీ, ఆమె బ్రతికే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. ఆశలు వదిలేసుకున్నాం ఆయన మీడియా సాక్షిగా తెలిపారు. ‘‘ప్రీతిని సైఫే హత్య చేశాడు. సైఫ్ను కఠినంగా శిక్షించాలి. ఈ ఇష్యూను హెచ్వోడీ సరిగా హ్యాండిల్ చేయలేదు. ప్రీతి జోలికి రాకుండా సైఫ్ను నియంత్రించలేకపోయారు. సరికదా.. ఘటన తర్వాత కూడా మాకు టైంకి సమాచారం అందించలేదు. ప్రీతి మొబైల్లో వాళ్లకు కావాల్సినట్లుగా సాక్ష్యాలు క్రియేట్ చేసుకున్నారు. ఇది ముమ్మాటికీ హత్యే. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల’’ని డిమాండ్ చేశారాయన. కాసేపట్లో ప్రీతి హెల్త్ బులిటెన్పై నిమ్స్ వైద్యులు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిమ్స్ డైరెక్టర్, పోలీసులకు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు. అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి సైతం ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమే! అని ప్రకటించారు. ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని ప్రకటించారాయన. ఇక ప్రీతి ఘటన బాధాకరమన్న మంత్రి.. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. -
మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ పూర్తిగా బంద్ కాలేదు : ఈటల
-
ప్రీతి ఘటనపై న్యాయ విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: నిమ్స్లో పీజీ డాక్టర్ ప్రీతికి సరైన వైద్యం అందడం లేదని ఆరోపించారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అంతేకాదు ప్రీతి ఘటనపై న్యాయ విచారణ జరపాలని తెలంగాణ సర్కార్ను డిమాండ్ చేశారాయన. ఆదివారం నిమ్స్కు వెళ్లిన ఆయన.. ప్రీతి తల్లిదండ్రుల్ని పరామర్శించి, ఆమె ఆరోగ్యస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఈటల కామెంట్స్.. మెడికల్ యూజీ.. పీజీ కాలేజీల్లో ర్యాగింగ్ జరుగుతూనే ఉంది. రాష్ట్రంలో సరిపడా వైద్యులు లేరు.. భారమంతా పీజీ విద్యార్థులపైనే పడుతోంది. ప్రీతి ఘటనను ఈ ప్రభుత్వం సీరియస్గా భావించాలి. గిరిజన విద్యార్థిని అయిన ప్రీతిపై.. సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్ వేధించాడు. ఆ కారణంగా ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. హెచ్వోడీ, ప్రిన్సిపాల్, పేరెంట్స్ సహా అందరికీ సైఫ్ వేధింపుల గురించి ప్రీతి చెప్పింది. అంటే.. వైద్య కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ వేధింపులు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది. పైఅధికారులు ప్రీతి హారస్మెంట్ గురించి చెప్పినపుడు స్పందించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. మరోవైపు పోలీసులు కూడా పట్టించుకోలేదు. ప్రీతి ఇష్యూ పై సమగ్ర విచారణ జరపాలి. ఆమెకు ఇంకా మెరుగైన వైద్యం అందించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి అని ఎమ్మెల్యే ఈటల.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
డాక్టర్ ప్రీతి హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతి ఆరోగ్యం అత్యంగా విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ద్వారా వైద్యులు మరోసారి స్పష్టం చేశారు. కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాంగింగ్ వేధింపులు భరించలేక మెడికో ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్తో ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికీ ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వెంటిలేటర్ చికిత్స అందుతోందని బులిటెన్ ద్వారా వైద్యులు వెల్లడించారు. మల్టి డిసిప్లినరీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో ప్రీతికి చికిత్స అందుతోందని నిమ్స్ అధికారులు వెల్లడించారు. అంతకు ముందు ప్రీతి బీపీ కూడా మెయింటేన్ అవ్వటం లేదని, కిడ్నీ పనితీరు సరిగ్గా లేదని కిందటి హెల్త్ బులెటిన్లో వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. జరిగింది ఇదే.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి.. కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో పీజీ (అనస్థీషియా) ఫస్టియర్ చదువుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. ఆ వేధింపులతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో విధులు నిర్వహిస్తుండగా ప్రీతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రీతి తీసుకున్న ఇంజెక్షన్లు ఆమె అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని, వెంటిలేటర్పై వైద్య చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి అనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రీతిని వేధించిన సైఫ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కానీ సీనియర్ విద్యార్థులు సైఫ్ను అరెస్టు చేయొద్దని ధర్నాకు దిగారు. -
వేధింపులు నిజమే..మనస్తాపంతోనే ఆత్మహత్యాయత్నం!
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్ వేధింపులే కారణమని తేలింది. ఘటనపై ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. మెడికల్ కాలేజీ, ఎంజీఎం హెచ్ఓడీ వర్గాలు చెప్తున్న అంశాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు సెల్ఫోన్, వాట్సాప్ గ్రూపులలో చాటింగ్ల ఆధారంగా విచారణ జరిపారు. ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ కేసులో నిందితుడైన సైఫ్ను అరెస్టు చేసినట్టు ప్రకటించారు. వాట్సాప్ గ్రూపులో వేధింపులతో.. 2022 నవంబర్లో పీజీ వైద్య విద్యార్థినిగా చేరిన ప్రీతిపై డిసెంబర్ నుంచే సైఫ్ వేధింపులకు పాల్పడినట్టు వాట్సాప్ గ్రూపుల పరిశీలనలో తేలింది. డిసెంబర్ 6న సైఫ్, ప్రీతి మధ్య చాటింగ్ వార్ నడిచింది. తర్వాత కూడా రెండు, మూడుసార్లు చిన్న గొడవలు జరిగినా సద్దుమణిగాయి. అయితే అనస్తీషియా విభాగానికి సంబంధించి 31 మందితో ఏర్పాటు చేసిన ఓ వాట్సాప్ గ్రూపులో ఈనెల 18న చేసిన పోస్టుతో గొడవ ముదిరింది. ఓ హౌస్ సర్జన్ విద్యార్థితో కేస్ షీట్ రాయించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ప్రీతికి సరైన బ్రెయిన్ లేదు.. బుర్ర తక్కువ మనిషి’అంటూ సైఫ్ కామెంట్ పెట్టాడు. దీనిని అవమానంగా భావించిన ప్రీతి.. ‘యు మైండ్ యువర్ ఓన్ బిజినెస్’అంటూ వ్యక్తిగతంగా సైఫ్కు మెసేజ్ పెట్టింది. ఏదైనా ఉంటే తమ హెచ్ఓడీకి ఫిర్యాదు చేయాలని, గ్రూపులో తనపై మెసేజ్లు పెట్టవద్దని సూచించింది. అంతటితో ఆ వివాదం సమసిపోకపోవడంతో.. ఈ నెల 20న విషయాన్ని తన తండ్రి నరేందర్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన ఏసీపీకి, మట్టెవాడ ఎస్సైలకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచన మేరకు 21న ఉదయం మొదట సైఫ్తో, తర్వాత ప్రీతితో మెడికల్ కాలేజీ హెచ్ఓడీలు మాట్లాడారు. కానీ ప్రీతి అవమానభారంతోనే ఉండిపోయింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శైలేష్ అనే సహ విద్యార్థితో ప్రీతి మాట్లాడుతూ.. ‘‘సైఫ్ వేధింపుల విషయంలో నాకు ఎవరూ సపోర్టు చేయడం లేదేం’’అని అడిగింది. ఆ తర్వాత 7.30 గంటల సమయంలో ఆత్మహత్యాయత్నం చేసింది. నిందితుడి అరెస్టు.. రిమాండ్ ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనకు సంబంధించి నిందితుడు ఎంఏ సైఫ్ను మట్టెవాడ పీఎస్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. సైఫ్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని ఆధారాల కోసం పరిశీలించారు. పలు అంశాలపై ప్రశ్నించారు. తర్వాత వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. అయితే బాధితురాలికి వరంగల్ ఎంజీఎంలో చేసిన చికిత్స రిపోర్టులు, ఆమె ఆరోగ్య స్థితిపై తాజా వైద్య నివేదికలు సమర్పించలేదంటూ.. నిందితుడిని రిమాండ్కు పంపేందుకు జడ్జి చాముండేశ్వరీ దేవి తొలుత తిరస్కరించారు. తర్వాత పోలీసులు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ జారీ చేసిన పత్రికా ప్రకటనను జడ్జికి సమర్పించారు. బాధితురాలి తల్లిదండ్రుల అంగీకారంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్కు తరలించినట్టు వివరించారు. అయితే ఈ సమయంలో జడ్జికి తన వాదన వినిపిస్తానని నిందితుడు సైఫ్ కోరాడు. జడ్జి పోలీసులు, న్యాయవాదులు అందరినీ కోర్టు హాల్నుంచి బయటికి పంపి నిందితుడు చెప్పిన వివరాలను విని, నోట్ చేసుకున్నారు. తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు సైఫ్ను ఖమ్మం జైలు తరలించేందుకు ప్రయత్నించినా.. అప్పటికే రాత్రికావడంతో తాత్కాలికంగా పరకాల జైలుకు తీసుకెళ్లారు. శనివారం ఉదయం ఖమ్మం జైలుకు తరలించనున్నారు. డీఎంఈకి సీల్డుకవర్లో నివేదిక? ఎంజీఎం ఆస్పత్రి, కేఎంసీలో జరిగిన ఘటనలపై గురు, శుక్రవారాల్లో విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ.. తమ నివేదికను వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ)కు సీల్డ్ కవర్లో సమర్పించినట్టు తెలిసింది. ఇక ఈ ఘటనపై ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజన్కుమార్ శుక్రవారం ఆరా తీసినట్టు తెలిసింది. ప్రీతి ప్రశ్నించేతత్వాన్ని తట్టుకోలేక వేధింపులు: సీపీ రంగనాథ్ మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్లో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్, హెచ్ఓడీలతో మాట్లాడి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టామని తెలిపారు. ప్రీతి తెలివైన అమ్మాయి అని, ఇటీవలే వైద్య విభాగానికి సంబంధించి యూపీఎస్సీ ఇంటర్వూ్యకు కూడా హాజరైందని వివరించారు. ఆమెకు ప్రశ్నించే తత్వం ఉందని.. దీనిని తట్టుకోలేకనే సీనియర్ అయిన సైఫ్ ఆమెను టార్గెట్ చేసి వేధించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తనకు తోటి విద్యార్థులు సపోర్ట్ చేయడం లేదని మనస్తాపానికి గురైన ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తేలిందని వివరించారు. నిందితుడు సైఫ్కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, సోషల్ మీడియాలో దీనిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం: నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని.. ఆమెకు ఎక్మో, సీఆర్ఆర్టీ చికిత్స అందిస్తున్నామని నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. ఆమె బ్రెయిన్ ఎంత చురుగ్గా ఉందో తెలుసుకునేందుకు బ్రెయిన్ మ్యాపింగ్ కూడా చేస్తున్నామని వివరించారు. మంత్రి హరీశ్రావు ప్రీతి ఆరోగ్యంపై నిరంతరం ఆరా తీస్తున్నారని చెప్పారు. ఇక మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం ప్రీతి తల్లిదండ్రులు శారద, ధరావత్ నరేందర్లతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి ఉష ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
పూల మాలతో నిమ్స్కు గవర్నర్ తమిళిసై.. రాజ్భవన్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: వరంగల్కు చెందిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రీతి ఆరోగ్యం విషమంగా మారింది. దీంతో, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, గవర్నర్ తమిళిసై నిమ్స్ పర్యటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. నిమ్స్కు గవర్నర్ తమిళిసై వచ్చినప్పుడు వాహనంలో పూలమాల ఉందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై గవర్నర్ కార్యాలయం స్పందించి వివరణ ఇచ్చింది. గవర్నర్ తమిళిసై ఇతర ప్రాంతాల నుంచి రాజ్భవన్కు వచ్చిన ప్రతీసారి ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రీతి త్వరగా కోలుకోవాలని ఆలయంలో ప్రార్థించారు. ఆలయం నుంచి గవర్నర్ తమిళిసై నేరుగా నిమ్స్కు వచ్చారు. గవర్నర్ నిమ్స్ పర్యటనలో ఎలాంటి దురుద్దేశం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. -
NIMS Hospital: ఆపరేషన్ సక్సెస్..పేషెంట్ క్రిటికల్.. నో మోర్
సాక్షి, హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆపరేషన్ చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నిమ్స్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రసూల్పురాకు చెందిన నవాజ్(41)ను బుధవారం మధ్యాహ్నం ఆపరేషన్ కోసం తీసుకెళ్లారు. సాయంత్రం ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పారు. అయితే రోగిని మాత్రం చూపించలేదు. ఆ తరువాత పేషెంట్ క్రిటికల్ అని హడావిడి చేశారు. గురువారం తెల్లవారుజామున ఐసీయూకు తరలించారు. 4.30 గంటలకు నో మోర్ అని చెబుతూనే ఉదయం 7.30 గంటల వరకు వైద్యం చేశారు. వైద్యులు చెపుతున్న పొంతలేని సమాదానాలతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు నిలదీయడంతో ఉదయం 8.31 గంటల ప్రాంతంలో మృతి చెందాడని వెల్లడించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగి చనిపోయాడంటూ బాధితుల ఆందోళన వ్యక్తం చేశారు. గుండెపోటు రావడంతో రోగి చనిపోయాడని నిమ్స్ కార్దియోథోరాసిక్ విభాగం వైద్యులు పేర్కొంటున్నారు. చదవండి: కరో కరో జల్సా.. కరోనా ముప్పుంది తెల్సా..? కొత్త వేడుకల వేళ జాగ్రత్త సుమా..! -
ఏం ఇంట్లో చూసినా మందు గోళీలే! పారేస్తే పాతరేసినట్టే! మరేం చేయాలి?
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్కు ముందేమో గాని, తర్వాత ప్రతీ ఇల్లూ చిన్నపాటి క్లినిక్లా మారింది. వాడినా, వాడకున్నా రకరకాల మాత్రలు ఇంట్లో పేరుకుంటున్నాయి. అయితే వాడని వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడం సరైన పనికాదంటున్నారు వైద్యులు. దానికి బదులుగా వాటిని పడేసేందుకు తొలిసారిగా డ్రాప్ బాక్స్లు నగరంలో అందుబాటులోకి వచ్చాయి. జలుబో, జ్వరమో మరొకటో.. చిన్నా చితకా వ్యాధులకు కూడా డాక్టర్ల నుంచి చాంతాడంత మందుల చిట్టీలు తప్పడం లేదు. ఎందుకైనా మంచిదని మనం వాటిని కొనకా తప్పడం లేదు. అయితే సాధారణంగా ఒకటి రెండు రోజులకే స్వస్థత చేకూరిన పరిస్థితిలో మందులు ఆపేసేవారే ఎక్కువ. అలాంటి వాటిలో యాంటీ బయాటిక్స్ ఎక్కువగా ఉండడం సాధారణమే. వీటిని సరైన పద్ధతిలో నిర్మూలించాలి లేదా గడువు ముగియకపోతే అవసరార్థులకు అందించాలే తప్ప ఎలా పడితే అలా పడేయవద్దని సూచిస్తున్నారు వైద్యులు. పారేస్తే.. పాతరేసినట్టే.. బెల్జియం లాంటి దేశాల్లో ముఖ్యంగా యాంటీబయాటిక్స్ విషయంలో కఠినమైన డ్రగ్ పాలసీ ఉంది. అక్కడ వీటిని హానికారక వ్యర్థాల కోవలో లెక్కిస్తారు. అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్ అధిక వినియోగం వల్ల ఆరోగ్యపరమైన నష్టాలొస్తాయి. ఉపయోగించనవి, అదనంగా ఉన్నవి నిర్లక్ష్యంగా పారవేయడంతో అవి నీటిలోకి చేరి కెనాల్స్ ద్వారా పంట పొలాల వరకూ చేరుతున్నాయి. దీంతో ఇది అంతిమంగా యాంటీమైక్రోబయాల్ నిరోధకత/యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్)కు దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు. డ్రాప్ బాక్స్ల ఏర్పాటు.. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో నిమ్స్కు చెందిన క్లినికల్ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్ (సీపీటీ) విభాగం ఆస్పత్రి ఆవరణలో రెండు డ్రాప్ బాక్స్లను అమర్చింది. అవుట్ పేషెంట్స్ బ్లాక్లో, స్పెషాలిటీ బ్లాక్లో మరొకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు. వీటిని చోరుల నుంచి కాపాడే క్రమంలో బాక్స్లకు తాళాలు వేశారు. ఆస్పత్రి సిబ్బంది మొదలుకుని, రోగులు, సంబంధీకులు ఎవరైనా సరే ఇంట్లో అనవసరంగా కొనుగోలు చేసిన, ఉపయోగించని లేదా గడువు ముగిసిన యాంటీబయాటిక్స్ ఉన్నట్లయితే ఈ డ్రాప్ బాక్స్లో వేయవచ్చని తద్వారా ఈ బాక్స్లకు వచ్చే స్పందనను అనుసరించి భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. భస్మం.. క్షేమం.. ‘తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే మొదటిది. వీటి ద్వారా హానికారక రసాయనాలు కాలుష్యానికి కారణం కాకుండా నిరోధించవచ్చు’ అని చెప్పారు నిమ్స్ డీన్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్.బీరప్ప. ‘డ్రాప్ బాక్స్ల ద్వారా పోగుపడిన మందులను సేకరించి వాటిని 1200 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో భస్మం చేయిస్తాం’ అని నిమ్స్ లెర్నింగ్ సెంటర్ ప్రొఫెసర్ సీపీటీ విభాగాధిపతి పి.ఉషారాణి చెప్పారు. -
నిమ్స్కు మునుగోడు గ్రహణం
సాకక్షి, హైదరాబాద్: నిజాం వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్)కు మునుగోడు ఉప ఎన్నికల గ్రహణం పట్టింది. ఫలితంగా ఆస్పత్రిలో పాలనాపరంగా ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలడం లేదు. నిమ్స్కు కొత్త డైరెక్టర్ను నియమించనున్న నేపథ్యంలో ప్రభుత్వం సెర్చ్ కమిటీ వేసింది. ఈ కమిటీలో వైద్యశాఖ మంత్రి టి.హరీష్రావు, ఆ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, డీఎంఈ డాక్టర్ కె.రమేష్రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ సెర్చ్ కమిటీ సమావేశం అయ్యేందుకు ప్రస్తుతం మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నిక అడ్డంకిగా మారింది. అంతేగాకుండా తన అనారోగ్య కారణంగా డైరెక్టర్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు మనోహర్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటీవల నెలరోజుల పాటు సెలవుపై వెళ్లిన ఆయన గుండె సంబంధిత సమస్యకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేయించుకున్న చికిత్స వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి విధులకు హాజరైనప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఒక్క ఫైల్ కదలడం లేదు. ఒకటో రెండో ఫైల్స్ మినహా మిగిలిన ఫైళ్లన్నీ డైరెక్టర్ టేబుల్పైనే పేరుకుపోతున్నాయి. ఇదిలా ఉండగా 2015లో డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మనోహర్ ఇప్పటి వరకూ కొనసాగింపు నిమ్స్ నియమనిబంధనలకు పూర్తి విరుద్ధమని ఓ అధికారి స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం కొత్త డైరెక్టర్ను నియమించాలన్న నిర్ణయానికి వచి్చంది. ఆ మేరకే ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ వేసింది. ఆరుగురు వైద్యుల ప్రయత్నాలు నిమ్స్ సంచాలకుడి పదవిని దక్కించుకునేందుకు ఆరుగురు వైద్యులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో నిమ్స్ రేడియాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ ఎస్.రామ్మూర్తి, నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ, నిమ్స్ డీన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ నగరి బీరప్పతో పాటు డీఎంఈ డాక్టర్ కె.రమేష్రెడ్డితో మరో ఇద్దరు వైద్యులు ఉన్నట్లు సమాచారం. వీరిలో నిమ్స్ డైరెక్టర్ పదవికి అర్హులైన వారిని సెర్చ్ కమిటీ నిర్ణయించాల్సి ఉంది. కానీ మునుగోడు ఉప ఎన్నిక కారణంగా ఇంతవరకు సమావేశం జరగని పరిస్థితి. అయితే నిమ్స్ డీన్గా వ్యవహరించిన రామ్మూర్తి పూర్తి అదనపు బాధ్యతలతో ఇన్చార్జి డైరెక్టర్గా ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ మెప్పు పొందారు. నిమ్మ సత్యనారాయణకు కూడా ఆస్పత్రి పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉంది. అవయవ మారి్పడి ఆపరేషన్లో గుర్తింపు సంపాదించుకున్న డాక్టర్ బీరప్ప ఇటీవలే నిమ్స్ డీన్ బాధ్యతలను చేపట్టారు. డీఎంఈ రమేష్రెడ్డిపై ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త డైరెక్టర్ ఎవరు వస్తారనే అంశంపై వైద్య, ఉద్యోగవర్గాల్లో తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి. -
నిమ్స్ పగ్గాలు ఎవరికో..!
సాక్షి, హైదరాబాద్/లక్డీకాపూల్: నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్)కు కొత్త డైరెక్టర్ ను నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే వార్తలు రావడంతో ఈ విషయమై పలు ఊహాగానాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త డైరెక్టర్ నియామకం కోసం ప్రభుత్వం సెర్చ్ కమిటీ వేయనున్నట్టు సమాచారం. ఈ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత నిమ్స్కు కొత్త డైరెక్టర్ నియమితులవుతారు. ప్రస్తుత డైరెక్టర్ మనోహర్ అనారోగ్యం దృష్ట్యా కొనసాగలేనని చెప్పడంతో కొత్త డైరెక్టర్ నియామకం అనివార్యంగా మారింది. ప్రతిష్టాత్మక సంస్థ..ప్రతిష్టాత్మక పదవి! ప్రతిష్టాత్మక నిమ్స్కు తొలిసారిగా 1985లో నాటి ప్రభుత్వం డైరెక్టర్ను నియమించింది. అప్పటి నుంచి ఆ పదవి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. తొలి డైరెక్టర్గా కాకర్ల సుబ్బారావు (1985–1990) నియమితులు కాగా, ఆ తర్వాత 1997–2004 మధ్య కూడా రెండుసార్లు ఆయనే డైరెక్టర్గా పనిచేశారు. ఆయన కాకుండా డా.ప్రసాదరావు (2004–2010) కూడా ఐదేళ్లకు పైబడి డైరెక్టర్గా ఉన్నారు. మిగిలిన డైరెక్టర్లు, ఇన్చార్జి డైరెక్టర్లు ఏడాది నుంచి 3 ఏళ్ల కాలవ్యవధి వరకు మాత్రమే పదవిలో కొనసాగారు. ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్న మనోహర్ 2015 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటిదాకా చూస్తే ఆయన లాగా ఏకబిగిన ఎక్కువ కాలం (ఏడేళ్లు) డైరెక్టర్ పదవిలో కొనసాగిన వారు మరొకరు లేకపోవడం గమనార్హం. సమస్యాత్మకం కూడా.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు నిమ్స్లో వైద్య సేవలకు తరలివస్తుంటారు. నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉండే నిమ్స్ డైరెక్టర్ పదవి ఎంత ప్రతిష్టాత్మకమో అంతే సమస్యాత్మకం కూడా. సంపన్నుల నుంచి నిరుపేదల వరకు అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బృహత్తర బాధ్యతలు ఒకపక్క, ఎప్పటికప్పుడు అనుభవంలోకి వచ్చే పాలనాపరమైన ఇబ్బందులు మరోపక్క.. వీటన్నింటినీ సమన్వయం చేస్తూ ఒకరకంగా కత్తి మీద సామే చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ పదవిలో నియమించే వ్యక్తిని ఆచితూచి ఎంపిక చేస్తుంది. అయినప్పటికీ పెద్ద, ప్రతిష్టాత్మక సంస్థ కావడంతో డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తించేందుకు ప్రముఖ వైద్యులు ఆసక్తి చూపిస్తుంటారు. పోటా పోటీ ప్రస్తుతం నిమ్స్ డైరెక్టర్ పోస్టు కోసం పలువురు రేసులో ఉన్నట్టు వినిపిస్తోంది. నిమ్స్ డీన్ డాక్టర్ రామమూర్తి, మెడికల్ సూపరింటెండెంట్ ఎన్.సత్యనారాయణ, కార్డియాక్ సర్జన్ డా.ఆర్వీ కుమార్, డాక్టర్ బీరప్ప (సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ), న్యూరో సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ ఎం.విజయసారథి, నెఫ్రాలజీ హెడ్ గంగాధర్లు ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వైద్యవిద్య డైరెక్టర్(డీఎంఈ) రమేష్రెడ్డి పేరు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కొంతకా లంగా నిమ్స్ అందిస్తున్న వైద్య సేవల విషయంలో పలు విమర్శలు వినిపిస్తు న్నాయి. దిగువస్థాయి సిబ్బందిలో నిర్ల క్ష్యం బాగా పెరిగిందని అంటున్నారు. రోగులకు పడకలు సహా వసతుల కొర త ఉందని, ఆరోగ్యశ్రీ సేవల్లో లోపాలు సమస్యగా మారుతున్నాయని తెలుస్తోంది. కొన్ని వార్డుల్లో సిబ్బంది అవినీతిపై రోగుల ఆరోపణలూ వినవస్తున్నాయి. కొత్తగా వచ్చే డైరెక్టర్ వీటిపై దృష్టిసారించి పనిచేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నిమ్స్ డైరెక్టర్కు అపోలోలో చికిత్స.. ప్రభుత్వ ఆసుపత్రులపై చిన్నచూపు?
నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) డైరెక్టర్ మనోహర్ రెండు రోజుల క్రితం గుండెపోటుతో హైదర్గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరడం వివాదాస్పదంగా మారింది. ప్రతిష్టాత్మక ఆసుపత్రికి డైరెక్టర్గా ఉన్న మనోహర్... తమ దవాఖానాను కాదని ప్రైవేటులో చికిత్స పొందుతుండడం చర్చనీయాంశంగా మారింది. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రి ప్రతిష్టను మసకబార్చే చర్యగా నిమ్స్ ఉద్యోగులతో పాటు వైద్యరంగంలోని వారు కూడా దీన్ని తప్పుబడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎవరు ఏ ఆసుపత్రిలోనైనా.. మరెక్కడైనా చికిత్స పొందవచ్చు. అయితే సాక్షాత్తూ ఒక ఆసుపత్రికి డైరెక్టర్గా వ్యవహరిస్తున్న వ్యక్తే ఆ ఆసుపత్రిని కాదని మరో చోట వైద్యసేవలు పొందడం సామాన్య ప్రజలకు అది ఎలాంటి సందేశం ఇస్తుంది? అంటూ పలువురు నిమ్స్ డైరెక్టర్ చికిత్స ఉదంతాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఉదంతాలు ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ నిమ్స్కు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందడం చర్చకు దారి తీసింది. అయితే ఈ దఫా ఏకంగా డైరెక్టరే నిమ్స్ను కాదని నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించడం మరింత వివాదంగా మారింది. వ్యక్తిగత, కుటుంబ వైద్యుడు అపోలోలో పనిచేస్తుండడం వల్లనే అక్కడ చికిత్సకు వెళ్లినట్టుగా డైరెక్టర్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే గతంలో ఇలాంటి సందర్భాల్లో సదరు వ్యక్తిగత వైద్యులే నిమ్స్కు వచ్చి ట్రీట్మెంట్స్ ఇచ్చిన దాఖాలాలున్నాయని మరికొందరు అంటున్నారు. నిజానికి నిమ్స్ కార్డియాలజీ విభాగానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ఉంది. ఎక్కడెక్కడి నుంచో రోగులు నిమ్స్కు వచ్చి చికిత్స తీసుకుని కోలుకుని వెళుతుంటారు. చదవండి: హైదరాబాద్లో రాగల 24 గంటల్లో భారీ వర్షం ఈ పరిస్థితుల్లో సాక్షాత్తూ నిమ్స్ డైరెక్టర్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం ఆసుపత్రి పేరు ప్రతిష్టలకు నష్టం కలుగజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారిన ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో బుధవారం రోజంతా చర్చోపచర్చలు నడిచాయి. ఎక్కువ మంది డైరెక్టర్ చేరికను తప్పుపట్టగా కొందరు సమర్థిస్తూ కూడా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల పిల్లలు చదవకపోవడం లాంటి పోలికల దగ్గర్నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు సైతం ప్రైవేటు ఆసుపత్రుల్నే ఆశ్రయిస్తుండడం దాకా ఈ చర్చల్లో భాగమయ్యాయి. ఏదేమైనా ఈ తరహా ఉదంతాలు పునరావృతం కాకుంటే మేలని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై, ఉన్నతాధికారులపై ఉందని, వారు వ్యక్తిగత చికిత్సల కోసం ప్రభుత్వాసుపత్రులను ఎంచుకోవడం ద్వారా ప్రజలకు స్ఫూర్తిని అందించాలని అందరూ కోరుకుంటున్నారు. -
హైదరాబాద్ ఆస్పత్రుల్లో తీవ్రమైన రక్తం కొరత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బ్లడ్బ్యాంకుల్లో రక్తం కొరత తీవ్రంగా ఉంది. నగరంలోని అన్ని ప్రధానాస్పత్రులతో పాటు బ్లడ్ బ్యాంకులలోనూ ప్రస్తుతం సరిపడా రక్త నిల్వలు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. పలు కారణాలతో దాతలు రక్తం దానం చేయడానికి ముందుకు రావడం లేదు. ► అన్ని స్థాయిల విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండడం, ఎండలు పెరగడం, వైరస్ భయాల వంటి కారణాలతో ఇప్పుడు రక్తదానం చేసే వారు కరువయ్యారు. ► ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకులకు చేరుకున్న క్షతగాత్రులకు, సర్జరీ బాధితులకు, తలసేమియా రోగులకు ప్రాణసంకటం ఏర్పడింది. ► బంధువుల్లో ఎవరైనా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తే కానీ...ఆయా బాధితులకు అవసరమైన గ్రూప్ రక్తం దొరకని దుస్థితి నెలకొంది. నిలోఫర్లో సర్జరీలు వాయిదా నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రి బ్లడ్బ్యాంక్లో రక్తం లేని కారణంగా శుక్రవారం అత్యవసర విభాగంలో నిర్వహించాల్సిన సర్జరీలు వాయిదా పడ్డాయి. సకాలంలో రోగులకు అవసరమైన రక్తం దొరక్క అటు రోగి బంధువులు, ఇటు వైద్యాధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు గాంధీ ఆసుపత్రికి పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. బి పాజిటివ్ 4 ప్యాక్డ్ సెల్స్, ఏడు ప్లాటింగ్ ప్యాక్చర్స్ (క్రయోన్స్) పాకెట్లను ఒక్కొక్కటి రూ.650 వెచ్చించి గాంధీ ఆసుపత్రి నుంచి తీసుకువచ్చారు. రక్తాన్ని తెచ్చేంత వరకు రోగి, వైద్యులు ఆపరేషన్ థియేటర్లో వేచి చూశారు. నిత్యం నిలోఫర్ ఆసుపత్రిలో ఏదో ఒక రకమైన బ్లడ్ గ్రూపు కొరత ఉంటోంది. రోగులు బ్లడ్ బ్యాంక్కు వెళ్లడం, అక్కడ రక్తం దొరక్క ఇబ్బందులు పడటం సర్వసాధారణమైపోతోంది. దాతలు ముందుకు రావడం లేదు కోవిడ్ కారణంగా గత రెండేళ్ల నుంచి రక్తదాన శిబిరాలు నిర్వహించలేక పోయాం. ఇటీవల నిర్వహిస్తున్నా..ఒకరిద్దరికి మించి ముందుకు రావడం లేదు. ఎండలకు భయపడి దాతలు కూడా ముందుకు రావడం లేదు. పరీక్షల సమయం కావడంతో కాలేజీ విద్యార్థులు కూడా రక్తదానానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ‘ఒ’ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ దొరకడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి కూడా కనీస సేవలు అందించ లేకపోతున్నాం. – లక్ష్మీరెడ్డి, అధ్యక్షురాలు, బ్లడ్బ్యాంక్స్ అసోసియేషన్ బ్లడ్ బ్యాంక్లన్నీ తిరిగాను మాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం. పరీక్షించిన వైద్యులు ఐదు యూనిట్ల రక్తం ఎక్కించాలని చెప్పారు. వైద్యులు రాసిచ్చిన చీటి పట్టుకుని నగరంలోని ప్రముఖ బ్లడ్ బ్యాంకులన్నీ తిరిగాం. అయినా దొరకలేదు. చివరకు మా బంధువుల్లో అదే గ్రూప్కు చెందిన వ్యక్తిని తీసుకొచ్చి రక్తం తీసుకోవాల్సి వచ్చింది. – సీహెచ్.లక్ష్మి, బడంగ్పేట్ -
ఏడున్నరేళ్లు..742 ఆపరేషన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం నిమ్స్లో రికార్డు స్థాయిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. తెలంగాణ రాకముందు 25 ఏళ్లలో కేవలం 649 మాత్రమే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరగ్గా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడున్నరేళ్లలో ఏకంగా 742 ఆపరేషన్లు జరగడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలను, తగినంత వైద్య సిబ్బందిని అందుబాటులోకి తేవడంతో శస్త్రచికిత్సలు పెరిగాయ ని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఒక్కో శస్త్రచికిత్సకు రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాదిలో జరిగిన వంద కిడ్నీ మార్పిడి చికిత్సలో 97 ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించగా, అందు లో 90 ఆరోగ్యశ్రీ ద్వారానే నిర్వహించడం గమనార్హం. జీవితాంతం ఉచితంగా మందులు... ప్రభుత్వం అవయవదానాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7,800 మంది అవయవాల మార్పిడి కోసం జీవన్దాన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురుచూస్తున్నారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడంతోపాటు అనంతరం అవసరమయ్యే మందులను జీవితకాలానికి ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. ఇలా ఉచితం గా మందులు అందించే రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని వైద్య వర్గాలు వెల్లడించాయి. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలకు అవసరమైన మౌలిక సదుపాయాలను, యంత్రాలను గాంధీ, నిమ్స్, ఉస్మానియా ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచింది. కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలు: హరీశ్రావు ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధగా వ్యవహరిస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కలలుగన్న ఆరోగ్య తెలంగాణగా మన రాష్ట్రం మారుతోందన్నారు. కిడ్నీ మార్పిడి చికిత్సలు చేయడంలో రికార్డు సాధించామని, ఇదే స్ఫూర్తితో మరిన్ని శస్త్రచికిత్సలు నిర్వహించి రోగులకు ప్రాణదానం చేయాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ రంగంలోని ఆస్పత్రులు కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడేలా వైద్య సేవలుండాలన్నారు. అందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెస్తుందన్నారు. ప్రభుత్వ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. -
నిమ్స్లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలను కలిగిన నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లోనే మొట్టమొదటి సారిగా నిమ్స్ సిటీ సర్జన్ డాక్టర్ ఎం.అమరేష్ రావు వైద్య బృందం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. ఏపీలోని కర్నూలుకి చెందిన డి.శేఖర్ కుమార్తె కళ్యాణి (17)కి కొంతకాలంగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. బాత్రూమ్కు కూడా ఆక్సిజన్ లేకపోతే వెళ్లలేని పరిస్థితి. ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా క్షీణదశకు చేరుకోవడంతో సెప్టెంబర్11న నిమ్స్లో చేరింది. ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని వైద్యులు నిర్థారించారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆపరేషన్కు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చింది. కళ్యాణికి ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ చేసేందుకు నిమ్స్ వైద్యులు సమాయత్తమై ఊపిరితిత్తుల దాత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ తాడ్బన్కు చెందిన సుశీల(47) గత నెల 27న బోయినపల్లిలో రోడ్ క్రాస్ చేస్తుండగా బైక్ వచ్చి ఢీ కొట్టింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. జీవన్దాన్ కార్యక్రమంలో ఆమె అవయవాలను దానం చేసేందుకు బంధువులు ముందుకు వచ్చారు. ఈ విషయం తెలిసి జీవన్దాన్ కో–ఆర్డినేటర్ సుశీల అవయవాలను సేకరించారు. ఆమె ఊపిరితిత్తులను నిమ్స్ ఆస్పత్రికి గ్రీన్ చానల్ ద్వారా తరలించారు. హైదరాబాద్ పోలీసుల సహకారంతో ఊపిరితిత్తులను మాదాపూర్ నుంచి పంజగుట్ట నిమ్స్ ఆస్పత్రికి 11 నిమిషాల్లోనే అంబులెన్స్లో చేర్చారు. బుధవారం ఉదయం 7.51 నిమిషాలకు అంబులెన్స్ నిమ్స్ మిలీనియం బ్లాక్కు చేరుకుంది. అక్కడ కళ్యాణికి ఊపిరితిత్తుల మార్పిడి చేయడానికి నిమ్స్ వైద్యులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఊపిరితిత్తుల మార్పిడిని మొదలుపెట్టి 8 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం కళ్యాణి అబ్జర్వేషన్లో ఉన్నట్లు డాక్టర్ అమరేష్రావు తెలిపారు. -
3డీ మ్యాపింగ్.. ‘గుండె’ నార్మల్
లక్డీకాపూల్(హైదరాబాద్): గుండె కవాటం మూసుకుపోయి బాధపడుతున్న 56 ఏళ్ల మహిళకు నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ (నిమ్స్) వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ప్రమాదకర స్థాయిలో కొట్టుకుంటున్న గుండెలో సమస్యను 3డీ మ్యాపింగ్, బెలూన్ వాల్వ్ సాంకేతికత సాయంతో పరిష్కరించారు. ఖరీదైన ఈ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ కింద నిర్వహించడం గమనార్హం. నిమిషానికి 250 సార్లు గుండె కొట్టుకుని.. కామారెడ్డి జిల్లాలోని రెడ్డిపేటకు చెందిన బాలమణి పొలం పనులు చేసుకుంటూ జీవిస్తోంది. మూడు నెలల క్రితం ఆమె ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. గుండె దడదడలాడడం, కడుపు ఉబ్బరం, ఆయాసం మొదలయ్యాయి. నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినా ఏమీ తేలలేదు. చివరికి నిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఆమెకు పరీక్షలు చేసిన నిమ్స్ వైద్యులు.. ఆమె గుండె నిమిషానికి 250 సార్లు కొట్టుకుంటోందని, గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం పంప్ చేసే కవాటం మూసుకుపోయిందని గుర్తించారు. ఈ నెల 17న 3డీ మ్యాపింగ్, బెలూన్ వాల్వ్ విధానంలో శస్త్రచికిత్స చేశారు. తొడ భాగంలోని రక్త నాళం నుంచి ప్రత్యేక పరికరాల ద్వారా బెలూన్ను గుండె వద్దకు పంపి.. మూసుకుపోయిన కవాటాన్ని తెరిచారు. కార్డియాలజీ ప్రొఫెసర్ సాయి సతీశ్ ఆధ్వర్యంలో వైద్యులు హేమంత్ హరీశ్, అర్చన, మణికృష్ణ తదితరుల బృందం ఈ క్లిష్టమైన చికిత్సను పూర్తి చేసింది. -
ఆందోళన బాటలో తెలంగాణ జూనియర్ డాక్టర్లు
-
జీతాలు పెంచకపోతే సమ్మె: జూనియర్ డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే 15 శాతం జీతాలు పెంచాలంటూ జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. 10 శాతం ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలని జూడాల డిమాండ్ చేశారు. 2 వారాల్లో సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే.. నిమ్స్లో వైద్యం అందించేలా జీఓ అమలు చేయాలని జూడాలు డిమాండ్ చేశారు. అంతేకాక కరోనాతో మృతి చెందిన వారికి పరిహారం ఇవ్వాలని కోరారు. చదవండి: వైద్యుల రక్షణకు ఎస్పీఎఫ్! -
నిమ్స్లో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, పంజగుట్ట: అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి నిమ్స్ ఆవరణలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నిమ్స్ ఆసుపత్రి మిలీనియం బ్లాక్ వెనకభాగంలో పార్కింగ్ వద్ద ఉన్న చెట్టుకు సోమవారం ఉదయం ఓ వ్యక్తి లుంగీతో ఉరివేసుకొని వేలాడుతుండటం స్థానికులు గుర్తించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పంజగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. ఆధారాలకోసం చూస్తే ఎలాంటి గుర్తింపు కార్డులు కనిపించలేదు. అతని వయస్సు సుమారు (45) ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చదవండి: పెళ్లి కావడం లేదని.. మాట్లాడితే మర్డరే ! సాక్షి, సిటీబ్యూరో: సిటీతో పాటు శివార్లలో వరుసగా దారుణాలు వెలుగు చూస్తున్నాయి. పూటకోచోట విచ్చుకత్తుల వేట చోటు చేసుకుంటుండటంతో అంతా ఉలిక్కిపడుతున్నారు. గడిచిన ఎనిమిది రోజుల్లో ఎనిమిది హత్యలు జరగడంతోపాటు కొన్ని వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల పాటు ఒకే రోజు రెండేసి చొప్పున బయటపడ్డాయి. తాజాగా ఆదివారం రాజేంద్రనగర్లో రెండు దారుణ హత్యలు బయటపడ్డాయి. కొన్ని కేసుల్లో నిందితులు చిక్కగా... మరికొన్నింటిలో గుర్తించాల్సి ఉంది. చదవండి: విద్యార్థినిపై మాజీ ఎమ్మెల్యే లైంగిక దాడి! తిన్న వాటికి డబ్బు అడిగినందుకు.. షాకబ్ అలీ కేపీహెచ్బీ ప్రాంతంలో తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తుంటాడు. ఈ నెల 4న ఇద్దరు వ్యక్తులు ద్రాక్షలు తిని, పైనాపిల్ కొన్నారు. కొన్న దానికే డబ్బు ఇచ్చి వెళ్ళిపోతుండగా... తిన్న వాటికీ డబ్బు అడిగాడు. దీంతో ఇద్దరూ కలిసి అతడిపై దాడి చేయడంతో చనిపోయాడు. అదే రోజు కూకట్పల్లిలోని చెరువులో పూల వ్యాపారి కృష్ణ మృతదేహం లభించింది. ఎక్కడో చంపేసిన దుండగులు గోనె సంచిలో కట్టి తీసుకువచ్చి చెరువులో పడేశారు. మద్యం మానమన్నందుకు... కేపీహెచ్బీ పోలీసుస్టేషన్ పరిధిలో స్రవంతితో వెంకటేశ్వర్లు ఏడాదిగా సహజీవనం చేస్తున్నాడు. ఈమెను ఐదున హత్య చేసిన వెంకటేశ్వర్లు డబ్బాలో పార్సిల్ చేసి మృతదేహం మాయం చేయాలని భావించాడు. అది సాధ్యం కాకపోవడంతో తన సొంత ఇంటిలోనే మృతదేహాన్ని వదిలి పారిపోయాడు. మద్యం తాగవద్దని పదేపదే చెప్పడంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ నెల 5న ఈ దారుణం జరిగింది. తాగేందుకు డబ్బు ఇవ్వలేదని... ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే సంతోష్ మద్యానికి బానిస అయ్యాడు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కారణంగా ఈ నెల 9న తన తల్లి సంగీతను దారుణంగా చంపేశాడు. ఒకే రోజు మరో రెండు... ఆదివారం నగర శివార్లలో రెండు హత్యలు వెలుగు చూశాయి. డబ్బు కోసం బెదిరిస్తుండటం, ఒకరి సోదరికి వేధిస్తుండటంతో ఇద్దరు పాత నేరగాళ్ళు తమ స్నేహితుడు రియాజ్ను హత్య చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘాతుకంలో మృతదేహాన్ని సూట్కేసులో తెచ్చి రాజేంద్రనగర్ డెయిరీ ఫామ్ వద్ద పడేశారు. ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. రాత్రి 11.45 గంటలకు మరో ఘోరం చోటు చేసుకుంది. అప్పుగా తీసుకున్న రూ.11 లక్షలు, వడ్డీ కోసం ఒత్తిడి చేస్తూ, హోటల్ తన పేరుతో రాసి ఇవ్వమని డిమాండ్ చేస్తుండటంతో ఎంఐఎం నేత ఖలీల్ను హతమార్చారు. ఇతడి వద్ద అప్పుతీసుకున్న హోటల్ యజమాని, అతడి వద్ద పని చేసే ఇద్దరితో కలిసి హత్య చేశారు. జూబ్లీహిల్స్, మియాపూర్ పోలీసుస్టేషన్ల పరిధి నుంచి అదృశ్యమైన ఇద్దరు ఈ నెల 7న శవాలుగా తేలారు. జూబ్లీహిల్స్లో పని చేసే వెంకటమ్మ గత నెల 30న బయటకు వెళ్ళింది. ఈమె మృతదేహం ఘట్కేసర్లో కాలిన స్థితిలో కనిపించింది. జనప్రియ కాలనీ నుంచి ఏటీఎంకి అంటూ వెళ్ళిన రామకృష్ణ మృతదేహం ఖైత్లాపూర్ డంపింగ్ యార్డ్లో దొరికింది. దుండగులు ఒక చెవి, కుడి చేతి రెండు వేళ్ళు కోసేశారు. చట్టం కఠినంగా మారాలి.. అందరిలో మార్పు రావాలి వర్తమాన పరిస్థితులతో పాటు సినిమా ప్రభావంతో ఇటీవల కాలంలో యువతలో యాంటీ సోషల్ పర్సనాలిటీ పెరుగుతోంది. ఈ కారణంగానే చిన్న కారణాలకు చంపేసే వరకు వెళ్తున్నారు. మరోపక్క మద్యానికి బానిసైన వాళ్ళు ఆ మత్తు కోసమూ ఘాతుకాలు చేస్తున్నారు. మత్తు, ఆస్తి కోసమూ అనుమానంతోనో తమ వాళ్ళనే అంతం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా జరిగే ఘర్షణల్లో ఎదుటి వారు చనిపోతుండటంతో అవి సాంకేతిక హత్యలుగా మారుతున్నాయి. చట్టం మరింత కఠినంగా మారడంతో పాటు ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తేనే ఈ పరిస్థితులు మారేది. – డాక్టర్ రాజశేఖర్, మానసిక నిపుణులు -
వారియర్స్కు వ్యాక్సిన్... అక్కర్లేదు
కరోనా వ్యాక్సిన్ దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు దాదాపు వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. అందుకు రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అయితే వ్యాక్సిన్ల సామర్థ్యంపై, అది ఎవరికి వేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ అందరికీ అవసరం లేదని ఇప్పటికే భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసలు వ్యాక్సిన్ ఎవరు వేసుకోవాలి.. ఎవరు వేసుకోకూడదు.. దాని పనితీరు తదితర అంశాలపై నిమ్స్ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగం అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్ మధుమోహన్రావు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వ్యాక్సిన్ల రక్షణ ఎన్నాళ్లు? అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ తమ వ్యాక్సిన్ పనితీరు 3 నెలలేనని ‘న్యూ ఇంగ్లండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్’అనే జర్నల్లో ప్రకటించింది. 190 మందిపై పరీక్షిస్తే మూడు నెలలే యాంటీబాడీలు ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత యాంటీబాడీలు పడిపోయాయి. ఇతర కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ల పనితీరు ఎంతకాలం అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. కాబట్టి వ్యాక్సిన్పైనే పూర్తిగా ఆధారపడలేం. ఒకవేళ ఎక్కువ కాలం రక్షణ కావాలంటే ఎక్కువ డోసులు తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల దుష్ఫలితాలు వస్తాయన్న అనుమానాలూ ఉన్నాయి. వ్యాక్సిన్ల సామర్థ్యంపైనే అందరికీ అనుమానాలు ఉన్నాయి. కంపెనీలు చెబుతున్నట్లుగా 90 శాతం పనిచేస్తున్నాయన్న దానిపై స్పష్టత లేదు. ర్యాండమ్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరగట్లేదు. కంపెనీలు వ్యాక్సిన్ల భద్రతపై దృష్టి పెడుతున్నాయే కానీ, సామర్థ్యంపై దృష్టి పెట్టట్లేదు. అందరికీ ఒకేలా పనిచేయవు.. వ్యాక్సిన్ అందరికీ ఒకేలా పని చేయదు. మన శరీరంలోకి ప్రవేశించే వైరస్ ఒకటే కానీ, మన శరీరం స్పందించే తీరు వేర్వేరుగా ఉంటుంది. మన డీఎన్ఏలో ఉండే వ్యత్యాసాలే ఇందుకు కారణం. ప్రతి మనిషిలో ఒక్కో రకమైన జన్యుపదార్థం ఉంటుంది. వైరస్ మన జన్యు పదార్థంతో ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి వ్యాక్సిన్ సామర్థ్యం ఉంటుంది. శరీరంలో కొన్ని జన్యువులు రోగ నిరోధక శక్తిని నిర్ధారిస్తాయి. వాటిలో ముఖ్యంగా హెచ్ఎల్ఏ (హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్) జన్యువులు వైరస్తో అతుక్కునే విధానమే వ్యత్యాసాలకు కారణం. ఇదే టీకా సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది. భారతీయుల హెచ్ఎల్ఏ సమాచారం ఉంటే.. వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని ముందే అంచనా వేయొచ్చు. హెచ్ఎల్ఏ జీన్స్ను దేశంలో ర్యాండమ్గా సేకరించి సీక్వెన్సింగ్ చేయడం వల్ల మన వాళ్లలో ఏది ఎక్కువ రిస్క్, ఏది తక్కువ రిస్క్ కలిగిన జీన్స్ అనేది అంచనా వేయవచ్చు. దాన్ని బట్టి ఎవరికి వ్యాక్సిన్ అవసరమో లేదో తేల్చొచ్చు. వ్యాక్సిన్ అందరికీ అవసరం లేదా? వ్యాక్సిన్లు అందరికీ అవసరం ఉండదు. ఒక్కొక్కరి రోగనిరోధక శక్తి ఒక్కోరకంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికే వ్యాక్సిన్లు అవసరం. స్టెరాయిడ్స్ వాడుతున్న వారు, ఇతర మందులు వాడుతున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వయసు పైబడిన వారు, పోషకాహార లోపం ఉన్న వారిలో రిస్క్ ఎక్కువ. కొన్ని సందర్భాల్లో పెద్ద వయసు వారికంటే తక్కువ వయసు వారు కరోనాతో మరణించారు. దీనికి హెచ్ఎల్ఏ జీన్స్ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అయినా ఐసీఎంఆర్ కూడా అందరికీ వ్యాక్సిన్ అవసరం లేదని తేల్చి చెప్పింది. వారికి వ్యాక్సిన్ అవసరమే లేదు.. కరోనా వచ్చిన వారికి వ్యాక్సిన్ అవసరం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ల శరీరం అప్పటికే వైరస్పై పోరాటం చేసింది. వారిలో యాంటీబాడీలు లేకపోయినా మెమరీ టీ–సెల్స్ ఉంటాయి. అవి ఉండటం వల్ల రీ ఇన్ఫెక్షన్ వచ్చే చాన్స్ చాలా తక్కువ. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికే రీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు తమలో యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదని భయపడతున్నారు. కానీ టీ సెల్స్ ఉన్న సంగతి గుర్తించాలి. అవి చాలా పవర్ఫుల్. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. టీ–సెల్స్ రెస్పాన్స్ను టెస్ట్ చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు భయపడుతున్నారు. రికవరీ అయిన వారికి ప్రత్యేక పరిస్థితుల్లో వ్యాక్సిన్ వేయాల్సి వస్తే యాంటిబాడీ చెకప్ అవసరం. ఒకవేళ ఎక్కువ యాంటీబాడీస్ ఉంటే వ్యాక్సిన్ వద్దే వద్దు. పెద్ద జబ్బులతో బాధపడుతూ, స్టెరాయిడ్స్ వాడేవాళ్లు ఒకసారి వైరస్ బారినపడినా, వైద్యుల సలహా మేరకు వ్యాక్సిన్ తీసుకుంటే కొంత ఉపశమనం ఉండొచ్చు. పైగా వైరస్ వచ్చి తగ్గిన వారు కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. యాంటీబాడీ డిపెండెంట్ సెల్యులార్ సైటోటాక్సిసిటీ (ఏడీసీసీ) వచ్చే ప్రమాదం ఉంది. ఏడీసీసీల వల్ల మన కణాలు మన శరీరంపైనే దాడి చేస్తాయి. ఫలితంగా ఎక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అయి కణాలు విచ్ఛిన్నం అవుతాయి. అలాగే కరోనా సోకి నయం అయిన వారిపై వ్యాక్సిన్ ప్రభావంపై పరిశోధనలు కూడా చాలా తక్కువగా జరిగాయి. కాగా, 17 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ అవసరమే లేదు. వాళ్లలో వైరస్ ప్రవేశించే మార్గాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వారిలో వైరస్ లోడ్ తక్కువగా ఉంటుంది. వాళ్లల్లో ఇతరత్రా అనారోగ్య సమస్యలున్న వారు, స్టెరాయిడ్స్ వాడే వారికి మాత్రం వ్యాక్సిన్ అవసరం ఉండొచ్చు. ఎవరికి ఇవ్వాలో గందరగోళం.. అనారోగ్య సమస్యలున్నవారు.. 55 ఏళ్లకు పైబడినవారు.. రోగనిరోధక శక్తి తక్కువున్న వారు.. ఫ్రంట్లైన్ కార్మికులు, వైద్యులు, ఇతర సిబ్బంది.. ఇప్పటివరకు కరోనా బారినపడని వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలి. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఎవరు? లక్షణాలు లేకుండానే కరోనా బారినపడిన వారున్నారు. వారికి అవసరంలేదనుకుంటున్నాం. కానీ వారెవరో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారిలో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదో.. మిలియన్ డాలర్ ప్రశ్న. అది తెలుసుకోవాలంటే రోగనిరోధక శక్తి సామర్థ్యం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే హెచ్ఎల్ఏ సీక్వెన్సింగ్ డేటా కావాలి. అది లేదు కాబట్టి ఇప్పుడంతా గందరగోళంగా ఉంది. ఐజీజీ పరీక్షల యాంటీబాడీలను నమ్మొచ్చా? చాలామంది ఐజీజీ యాంటీబాడీ పరీక్షలు చేయించుకుని తాము సురక్షితం అనుకుంటున్నారు. అది నిజం కాదు. న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ స్థాయి పరీక్ష చేసుకుంటారో వారికే నిర్దిష్టమైన సమాచారం వస్తుంది. ఐజీజీ యాంటీబాడీలు ఏ వైరస్తోనైనా రావొచ్చు లేదా రాకపోవచ్చు. ఆ యాంటీబాడీలు కోవిడ్ సంబంధిత యాంటీబాడీలుగా గుర్తించలేం. ఏది నిజమైన వ్యాక్సిన్? టీకాల్లో లైవ్ అటెన్యుయేటెడ్, ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు చాలా సమర్థమైనవి. లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ను కోడ్ డీ ఆప్టిమైజేషన్ టెక్నాలజీతో లైవ్ వైరస్ ద్వారా తయారు చేస్తారు. ఇది దీర్ఘకాలం పనిచేస్తుంది. ఇది చాలాకాలం రోగనిరోధక శక్తిని ఇస్తుంది. మిగతా పద్ధతిలో తయారు చేసే వ్యాక్సిన్ల పనికాలం తక్కువ ఉంటుంది. కొన్ని కంపెనీలు డీఎన్ఏ, ఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. అవి మన డీఎన్ఏలోకి చొచ్చుకుపోతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమే గాక, జెనెటిక్ మార్పులు వస్తాయి. వైరల్ వెక్టార్ ఆధారిత వ్యాక్సిన్లు దీర్ఘకాలికంగా మన శరీరంలోని డీఎన్ఏతో అనుసంధానం అయితే కొన్ని దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వైరస్ కన్నా కూడా డ్రగ్స్పై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. -
నిమ్స్లో కోవాగ్జిన్ ఫేజ్–2 ట్రయల్స్ షురూ
సాక్షి, లక్టీకాపూల్: నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో కొనసాగుతున్న కోవాగ్జిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్లో భాగంగా ఫేజ్–2 టీకా ప్రయోగం మొదలైంది. కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశంలోనే ఫార్మా దిగ్గజమైన భారత్ బయోటెక్ ఫార్మాసూటికల్ సంస్థ తయారు చేస్తున్న కోవాగ్జిన్ టీకా ప్రయోగానికి దేశంలోని 12 ఆస్పత్రులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందులో నిమ్స్ ఆస్పత్రి కూడా ఒకటి కావడం విదితమే. ఆయా ఆస్పత్రిలన్నీ క్లినికల్ ట్రయల్స్ ఫేజ్–1ను విజయవంతం చేశాయి. టీకా తీసుకున్న వలంటీర్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ క్రమంలో ఫేజ్–2 ట్రయల్స్లో దేశవ్యాప్తంగా 380 మందికి టీకా ప్రయోగం చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఫేజ్–2 టీకాలు వేయడం ఆరంభించారు. నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె.మనోహర్ పర్యవేక్షణలో నోడల్ అధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి.ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో 12 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చారు. వీళ్లందరిని నాలుగు గంటల అబ్జర్వేషన్ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. అదే విధంగా బుధవారం మరో 15 మందికి టీకా ప్రయోగం చేసేందుకు వైద్య బృందం సిద్ధమైంది. ఈ ప్రక్రియ మూడు రోజుల పాటు ఈ కొనసాగించేందుకు సన్నాహాలు చేపట్టినట్టు సమాచారం. కాగా ఈ టీకా ప్రయోగం ప్రక్రియలో భాగంగా ఆదివారం దాదాపుగా 80 మంది వాలంటీర్లకు స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహించారు. -
కోవిడ్–19 మొదటి అంకం ముగిసింది
లక్డీకాపూల్ : నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో కొనసాగుతున్న కొవాక్జిన్ క్లినికల్ ట్రయిల్స్లో మొదటి అంకం విజయవంతంగా ముగిసింది. ఈ ప్రక్రియలో 50 మంది వలంటీర్లపై ఈ వ్యాక్సిన్ టీకాలను ప్రయోగించారు. ప్రస్తుతం నిమ్స్ వైద్యులు పరిశీలనలో నిమగ్నమయ్యారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆదేశాల మేరకు దాదాపుగా 60 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 50 మందికి సంబంధించి రక్త నమూనాలను సేకరించి సమగ్రంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబ్ సైతం పరీక్షలు నిర్వహించి ఆయా వలంటీర్ల ఫిట్నెస్ను నిర్ధారించింది. ఈ మేరకు కోవిడ్–19ను నియంత్రించే క్రమంలో హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజమైన భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్(బీబీఐఎల్) సంస్థ తయారు చేస్తున్న కోవాక్జిన్ ఫేజ్–1 హ్యూమన్ క్లినికల్ ట్రయిల్స్కు శ్రీకారం చుట్టారు. తొలుత ఇద్దరు ఆరోగ్యకమైన వలంటీర్లకు మొదటి మోతాదు టీకా ప్రయోగం చేశారు. అప్పటి నుంచి ఈ ప్రక్రియను కొనసాగిస్తూ ఈ నెల మొదటి వారంలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత 14 రోజులకు అదే కోడ్కు సంబంధించిన బూస్టర్ డోస్ను కూడా ఇచ్చారు. ఈ ప్రక్రియను కూడా ఇటీవలే పూర్తి చేసినట్టు నిమ్స్ వైద్యులు పేర్కొంటున్నారు. నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె. మనోహర్ పర్యవేక్షణలో క్లినికల్ ఫార్మకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు, సీనియర్ వైద్యులతో పాటు జనరల్ మెడిసిన్, ఆనస్తీషియా, రెస్పిరేటరీ మెడిసిన వైద్యులు సమన్వయంతో ఈ ట్రయిల్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా వలంటీర్లంతా తమ తమ ఇళ్లల్లోనే వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. ఇందులో భాగంగా 28 రోజుల తర్వాత రెండవ మోతాదు టీకా ప్రయోగానికి నిమ్స్ క్లినికల్ ట్రయిల్ నోడల్ అధికారి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎవాల్యూషన్ ప్రక్రియ కొనసాగుతుందని, ఈ వ్యాక్సిన్ వల్లలో శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. వలంటీర్ల ఆరోగ్యాన్ని పరిక్షించేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలోనే రెండవ మోతాదు టీకా ప్రయోగానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. -
ఫలించిన పోరాటం
లక్డీకాపూల్ : నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వేతనాలు పెరిగాయి. దీంతో దాదాపు రెండు వేల మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఒక్కో కాంట్రాక్ట్ ఉద్యోగికి రూ. 4 నుంచి 6వేల వరకు జీతం పెరిగింది. దీని వల్ల యాజమాన్యానికి రూ. కోటికి పైగా ఆదనపు భారం పడుతోంది. పెంచిన వేతనాలను ఏప్రిల్ నెల నుంచి అమలు పరుస్తున్నట్లు నిమ్స్ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత జులై నెలకు సంబంధించి జీతాలను చెల్లించనున్నారు. వేతన పెంపును వెంటనే అమలు చేయాలని గత నెల5 నుంచి అన్ని విభాగాల కాంట్రాక్ట్ ఉద్యోగులు సంఘటిత పోరాటం చేపట్టారు. వేతనాలు పెంచేంత వరకు వెనక్కి తగ్గేది లేదని యాజమాన్యానికి ముందుగానే ఆల్టిమేటం ఇచ్చారు. సమ్మె నోటీసు ఇచ్చిన 9వ రోజు నుంచి ఆందోళనకు దిగారు. ఇందుకు నిమ్స్ టెక్నికల్, నాన్ టెక్నికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్, నిమ్స్ కాంట్రాక్ట్ నర్సుల యూనియన్, తెలంగాణ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్, నిమ్స్ కాంట్రాక్ట్ టెక్నీషియన్ ఎంప్లాయీస్ యూనియన్లతో ఏర్పడిన జేఏసీ జూన్ 28న నిమ్స్ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. వేతనాలు పెంచేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలిపినన్పటికీ ఏడాదిగా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్–19 విజృంభిస్తున్న తరుణంలో గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు రూ.28వేలు చొప్పున వేతనం చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. మనోహర్ పెంచిన వేతనాలను చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేశారు. పెరిగిన వేతనాలు ఇలా.. నిమ్స్లో పని చేస్తున్న 400 మంది కాంట్రాక్ట్ నర్సులకు ఇక నుంచి రూ.25వేలు చొప్పున వేతనాలు అందుకోనున్నారు. ఇప్పటి వరకు వారికి రూ. 17వేలు చెల్లిస్తున్నారు. 300 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కూడా రూ.25 వేలు చొప్పున చెల్లించనున్నారు. ఇప్పటి వరకు వీరు రూ. 18వేలు చొప్పున వేతనాలు పొందుతున్నారు. 150 మంది ఒజేటీ( ఆన్ జాబ్టైనీస్) బేసిడ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలకు రూ. 25వేలు చొప్పున చెల్లిస్తారు. సెమిస్కిల్డ్ ఔట్సోర్స్ ఉద్యోగులు 350 మందికి రూ. 24,600 చొప్పున వేతనం అందుకోనున్నారు. వాస్తవానికి వీరికి రోజువారీ వేతనం రూ. 840.62 చెల్లిస్తున్నారు. తాజా ఉత్తర్వులతో ఈ మొత్తం రూ. 1102.79లకు పెరిగింది. అన్స్కిల్డ్ కార్మికుల వేతనాలను రూ. 12 వేల నుంచి రూ. 14,717 పెంచారు. అవుట్సోర్స్ కాంట్రాక్ట్ విధానంలో పని చేసే వీరికి జీవో నెం.14, 108లు ప్రకారం రోజువారీ వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ ప్రకారం జీవో నెం.14 కింద కార్మికులకు రోజుకు రూ. 551.71 నుంచి రూ. 681.55కి, జీవో నెం.108 కింద రూ. 558.46ల నుంచి రూ. 681.55కి పెరిగింది. వీళ్లకు 26 రోజుల చొప్పున వేతనాల చెల్లించనున్నారు. వేతనాలు పెరగడంతో నిమ్స్ కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. -
నిమ్స్ ట్రయల్స్ .. తొలి అడుగు సక్సెస్
లక్డీకాపూల్ (హైదరాబాద్): కరోనా వ్యాక్సిన్ క్లినిక ల్ ట్రయల్స్ దిశగా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) తొలి అడుగు విజయవం తమైంది. కరోనా వైరస్ నిరోధానికి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన కొవాక్జిన్ను సోమవారం నిమ్స్లో ఇద్దరు వలంటీర్లకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో మంగళవారం డిశ్చార్జి చేసినట్టు నిమ్స్ వైద్యులు తెలిపారు. 14 రోజుల పాటు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని నిమ్స్లోని కొవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీ ప్రభాకర్రెడ్డి చెప్పారు. రోజూ ఫోన్, వీడియో కాల్స్ ద్వారా వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తామని, తర్వాత మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తామన్నారు. టీకాలోని అచేతన (అన్యాక్టివేటెడ్) వైరస్ వల్ల శరీరంలో యాంటీబాడీస్ ఏ మేరకు వృద్ధి చెందాయి, సమస్యలున్నాయా అనేది పరిశీలిస్తామన్నారు. అంతా సవ్యంగా ఉంటే వారికే రెండో డోస్ టీకా ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం టీకా తీసుకున్న వారిలో అలర్జీ, ఇతర ఆరోగ్య సమస్యలు లేవన్నారు. కొవాక్జిన్ టీకా మానవ ప్రయోగంలో తొలి ప్రయత్నం విజయవంతమైందని నిమ్స్ క్లినికల్, ఫార్మకాలజీ విభాగం వైద్యులు హర్షం వ్యక్తంచేశారు. నేడు మరో ఇద్దరికి! క్లినికల్ ట్రయల్స్లో భాగంగా నిమ్స్ వైద్యులు 13 మంది వలంటీర్ల రక్త నమూనాలను ఢిల్లీలోని ఐసీఎంఆర్ ఆమోదించిన ల్యాబ్కు పం పించారు. వీరిలో 8 మందికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ అయినట్టు తెలిసింది. ఈ సర్టిఫికెట్ల ఆధారంగానే బుధవారం మరో ఇద్దరికి టీకా డోస్ ఇవ్వనున్నారు. దీంతో టీకా తీసుకున్న వారి సంఖ్య నాలుగుకి చేరనుంది. వాస్తవానికి మంగళవారం కూడా ట్రయల్స్ నిర్వహించా ల్సి ఉన్నా.. వలంటీర్లు ఎవరూ రాని కారణం గా టీకా ఇవ్వలేదని నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ చెప్పారు. ఈ ట్రయల్స్లో భాగంగా ఆరోగ్యవంతమైన 60 మందిపై మొదటి, రెండో దశ ప్రయోగాలను నిర్వహించనున్నారు. మూడో దశలో వంద మందిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఐదు డోస్ల మేరకు టీకా ఇస్తారు. టీకా ప్రయోగాన్ని 2 – 3 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. పరీక్షలు విజయవంతమైతే ఈ ఏడాది చివరికి లేదా కొత్త సంవత్సరం ఆరంభంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. -
డాక్టర్ సుల్తానాను నిమ్స్కు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : ఫీవర్ ఆస్పత్రి డీఎంవో డాక్టర్ సుల్తానాను చికిత్స నిమిత్తం నిమ్స్కు తరలించారు. నిమ్స్లో ఆమెకు ఉచితంగా వైద్యం అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం ఆదేశాలు ఇచ్చారు. కాగా కరోనా లక్షణాలతో డాక్టర్ సుల్తానా నిన్న (శనివారం) చాదర్ఘాట్లోని తుంబే ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పేరుతో తుంబే ఆస్పత్రి యాజమాన్యం 24 గంటలకు రూ.లక్షా 15 వేలు బిల్లు వేసింది. దీంతో బిల్లు ఎక్కువ వేశారని ప్రశ్నించినందుకు డాక్టర్ సుల్తానాను తుంబే యాజమాన్యం నిర్బంధించింది. కరోనా క్లిష్ట సమయంలో ఫ్రంట్లైన్ వారియర్గా సేవలందించిన తన పట్ల తుంబే ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సుల్తానా సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. (చదవండి : దారుణం: బిల్లులపై ప్రశ్నించిన డాక్టర్ నిర్బంధం) -
కరోనా: 7నుంచి నిమ్స్లో క్లినికల్ ట్రయల్స్
సాక్షి, హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ ట్రయల్స్కు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూలై 7వ తేదీ నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఫేస్ 1, ఫేస్ 2 కింద ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయన్నారు. క్లినికల్ ట్రయల్స్కు చాలా మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునేవారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తామని చెప్పారు. మొదటి ఫేస్ 28 రోజులు ఉంటుందని, వ్యాక్సిన్ ఇచ్చాక రెండు రోజులు ఆస్పత్రిలో అడ్మిట్ చేస్తామని మనోహర్ పేర్కొన్నారు. (చదవండి : ఆగస్టు 15 నాటికి కరోనా టీకా!) ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతు చూసే వ్యాక్సిన్ను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) భావిస్తోంది. వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్, పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో(ఎన్ఐవీ) కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నిర్మూలనకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ క్లినికల్ ట్రయల్స్ను దేశంలో 12 ప్రాంతాల్లో నిర్వహించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. ఈ జాబితాలో విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్లోని నిమ్స్ ఉన్నాయి. -
నిమ్స్లో చికిత్స అందించాలి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 బారిన పడ్డ వైద్యులు, సిబ్బందికి నిమ్స్లో మెరుగైన చికిత్స అందించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. కరోనాపై యుద్ధం చేస్తున్న వారిలో వైద్యులు, వైద్య సిబ్బంది ముందు వరుసలో ఉన్నారని, వీరికి వైరస్ సోకితే కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను పలుమార్లు కలవగా ఆయన సానుకూలంగా స్పందించి నిమ్స్లో చికిత్సకు అంగీకరించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ దీనదయాళ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి వెల్లడించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలను కూడా పరిశీలించి పరిష్కరించాలని కోరారు. -
‘కరోనా’పై చేతులెత్తేసినట్లుంది..
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వానికి పట్టు సడలినట్లుందని.. ఎక్కడో ఏదో లోపం ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎవరి ప్రాణాలు వారే రక్షించుకోవాలి తప్ప, తామేం చేయలేనట్లు చేతులెత్తేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయంది. 72 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారని, 400 మంది సిబ్బంది క్వారంటైన్లో ఉన్నారని, డాక్టర్లు, సిబ్బంది రక్షణ కోసం కిట్లున్నాయని చెప్పడానికి, వాటిని వారికి అందచేయడానికి ఎంతో తేడా ఉందని తెలిపింది. డాక్టర్లపై భౌతిక దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోందని, ప్రతి వార్డుకు, ప్రతీ డాక్టర్కు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు తెలిపింది. ఆసుపత్రుల్లో ఎంత మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.. ఎందరికి పరీక్షలు చేశారు.. ఏఏ మౌలిక సదుపాయాలున్నాయి.. డాక్టర్లు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత భద్రత పరికరా (పీపీఈ) లున్నాయా.. వంటి వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించాలని గాంధీ, నిమ్స్, కింగ్స్ కోఠి, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యులకు తగినన్ని పీపీఈ కిట్లు, మాస్క్లు ఇతర రక్షణ పరికరాలు ఇవ్వడం లేదంటూ న్యాయవాది సమీర్ అహ్మద్ హైకోర్టుకు లేఖ రాయగా, దీన్ని కోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఆసుపత్రుల్లో పరిస్థితులు, రక్షణ పరికరాల సరఫరాపై నివేదికలివ్వాలని ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లను కోరినా ఇప్పటివరకు స్పందించకపోవడంపై ధర్మాసనం ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేసింది. గాంధీలో పరిస్థితి ఆందోళనకరం.. గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులపై ఆందోళన చెందుతున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు 7 లక్షల రక్షణ కిట్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారని, అందుబాటులో ఉండటానికి, వాటిని డాక్టర్లకు, సిబ్బందికి ఇవ్వడానికి ఎంతో తేడా ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. డాక్టర్లు, సిబ్బందికి వాటిని పూర్తిస్థాయిలో అందజేయకపోవడం వల్లే వారు కూడా కరోనా బారిన పడుతున్నారంది. ఆసుపత్రుల్లో కరోనా రావడం లేదని, సిబ్బంది ఉంటున్న హాస్టళ్లలోనే వస్తోందని శ్రీనివాసరావు చెబుతుండటాన్ని ఎలా చూడాలని ప్రశ్నించింది. తమపై భౌతిక దాడుల గురించి జూనియర్ డాక్టర్లు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా, వారి రక్షణ కోసం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ఈ విషయంలో తాము గతంలో ఇచ్చిన ఆదేశంపై ఎందుకు స్పందించలేదంది. తమ ఆదేశాలను ఇలా ఉల్లంఘిస్తూ పోతే అందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. కోర్టు హాళ్ల వద్ద ఎలా రక్షణ కల్పించారో, డాక్టర్లకు, ఆయా వార్డుల వద్ద అలానే రక్షణ కల్పించాలని తేల్చి చెప్పింది. జిల్లాకో కరోనా ఆసుపత్రి ఏమైంది..? ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా చర్యలు తీసుకుంటోందని వివరించారు. రాబోయే 10 రోజుల్లో 50 వేల పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, తెలంగాణలో పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయని ధర్మాసనం తెలిపింది. ఒక్క రోజులోనే 200కి పైగా కేసు నమోదయ్యాయంటే కరోనా తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చునంది. జిల్లాకో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు ఎంత వరకు కార్యరూపం దాల్చాయని ప్రశ్నించింది. ఇప్పటికే ఆసుపత్రులను గుర్తించామని, ఇందుకు సంబంధించిన వ్యాజ్యంపై గురువారం విచారణ జరగనుందని ఏజీ వివరించారు. కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తున్నారో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇన్ప్లుయెంజాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చినప్పుడు, కరోనాను ఎందుకు తీసుకురాకూడదని ప్రశ్నించింది. మే 16న ఇచ్చిన కరోనా బులిటెన్ అంతకుముందు రోజు ఇచ్చినట్లే ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. చైనాలో రక్షణ శాఖ వైద్యుల సాయంతో అతి తక్కువ సమయంలో ఆసుపత్రి నిర్మించారని, ఇక్కడ కూడా రక్షణ శాఖ వైద్యుల సాయం ఎందుకు తీసుకోవడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. తాము లేవనెత్తిన అన్ని అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇవ్వాలని అంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
నిమ్స్లో భయం భయం: వైద్య సిబ్బందికి కరోనా
సాక్షి, హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రి కరోనా భయంతో వణికిపోతోంది. ఆస్పత్రి కార్డియాలజీ విభాగానికి చెందిన నలుగురు రెసిడెంట్ వైద్యులు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లకు తాజాగా కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో వారిని ఆస్పత్రి మిలీనియం బ్లాక్లోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఓ రోగికి స్టెంట్ వేసే క్రమం లో వీరికి వైరస్ సోకినట్లు తెలిసింది. కార్డియాలజీ విభాగంలో 10 మంది రోగులు ఉండగా, వీరిలో ఇద్దరిని మినహా మిగిలిన వారందరినీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వైద్యులకు కరోనా సోకడంతో వారితో కలసి హాస్టల్ మెస్లో భోజనం చేసిన వారు.. గదిలో కలసి ఉన్న వారు.. కలసి చదువుకున్న వైద్యుల్లో ఆందోళన నెలకొంది. అంతేకాదు వీరితో చికిత్సలు చేయించుకున్న రోగులు సైతం భయంతో వణికిపోతున్నారు. గతంలో ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ స్టాఫ్ నర్సు సహా మరో ల్యాబ్ టెక్నీషియన్కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆస్పత్రులపై కరోనా దాడి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులను కరోనా వైరస్ ముప్పుతిప్పలు పెడుతోంది. వివిధ రుగ్మతలతో బాధపడుతూ అత్యవసర చికిత్సల కోసం ఆస్పత్రికి వస్తున్న రోగుల్లో ఎవరికి వైరస్ ఉందో.. ఎవరికి లేదో.. గుర్తించడం కష్టంగా మారింది. ఓపీ, ఐపీ రోగులను ముట్టుకోకుండానే వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. కానీ ఆపరేషన్ థియేటర్లో రోగిని ముట్టుకోకుండా సర్జరీ చేయలేని పరిస్థితి. సర్జరీల్లో పాల్గొంటున్న వైద్య సిబ్బందికి రోగుల నుంచి వైరస్ సోకుతోంది. ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా పని చేస్తున్న ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సహా పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి చెందిన ఒక ప్రొఫెసర్ సహా 23 మంది పీజీలు ఇప్పటికే వైరస్ బారిన పడ్డారు. -
నిమ్స్లో నిర్లక్ష్యం!
లక్డీకాపూల్: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యసేవలను అందించే నిమ్స్ ఆస్పత్రి మాత్రం నిబంధనలను పాటించడం లేదన్న విమర్శ వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రిలో విధులు నిర్వహించే వైద్యులు, హెల్త్ కేర్ సిబ్బందికి భద్రత కల్పించే విషయంలో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమర్జెన్సీ విభాగంలో పని చేసే ముగ్గురు వైద్యులను, నలుగురు నర్సులను హోం క్వారంటైన్కు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఓ నర్సుకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లుగా సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో యాజమాన్యం ఔట్ పేషెంట్లకు కరోనా స్క్రీనింగ్ టెస్ట్లను నిర్వహిస్తుంది. ఈ తరుణంలో వైద్యులకు, సిబ్బందికి తగిన విధంగా భధ్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా ఉండగా లాక్డౌన్ కారణంగా విధులకు హాజరయ్యే విషయంలో సిబ్బంది అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో సిబ్బంది రాకపోకలకు గానూ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకు మేఘ ఇంజనీర్స్ సంస్థ ఆర్థిక సహకారాన్ని అందించింది. దాంతో నగర వ్యాప్తంగా ఉన్న నిమ్స్ సిబ్బంది సౌకర్యార్థం ఏడు రూట్లు విభజించి అందుకు అనుగుణంగా బస్సు సదుపాయాన్ని కల్పించింది. దీంతో పాటుగా టీఎస్ ఆర్టీసీ కూడా మరో రెండు బస్సులను సమకూర్చింది. అయినప్పటికీ మూడు షిఫ్ట్లు విధులను నిర్వహించే నిమ్స్ సిబ్బంది సంఖ్యకు తగిన విధంగా బస్సులను సమకూర్చకపోవడంతో సిబ్బంది సామాజిక దూరాన్ని పాటించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక బస్సులను కూడా సర్వీసు బస్సులుగా నిర్వహించడం ఎంత వరకు సమంజసమని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటికీ ఎమర్జెన్సీ సర్వీసు అయిన వైద్య సేవలకు అంతరాయం ఏర్పడకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో విధులకు వస్తున్నామని, అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. వాస్తవానికి సోషల్ డిస్టెన్స్ పాటించడంతో పాటుగా వర్కర్లకు మాస్క్లు, గ్లౌస్లు, హెల్త్కేర్ సిబ్బందికి పీపీఇ కిట్లను అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. -
అత్యాధునిక వైద్యం.. నిమ్స్ సొంతం
లక్డీకాపూల్ : నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో సామాన్యుడికి సైతం అత్యాధునిక వైద్యం అందుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్న నిమ్స్ ఎప్పటికప్పడు కొత్త పద్ధతులను అవలంబిస్తోంది. నిరుపేదలకు సైతం కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యజామాన్యం దృష్టి పెట్టింది.ఈ క్రమంలో భాగంగా ట్రాన్స్ప్లాంటేషన్ సూట్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 28 విభాగాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్న ప్రతిష్టాత్మకంగా ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్ర చికిత్సలను నిర్వహిస్తుంది. ఇప్పటికే లివర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్ర చికిత్సలను ఆరోగ్య శ్రీ రోగులకు సైతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎనిమిది ట్రాన్స్ప్లాంటేషన్ సూట్లను ఏర్పాటు చేశారు. ఆరోగ్య శ్రీ రోగులకు సైతం ఈ సూట్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సూట్స్ను మిలీనియం బ్లాక్లో నిర్మించారు. బోన్ మ్యారో చికిత్సలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. యూరాలజీ విభాగం పర్యవేక్షణలో కొనసాగే స్టెమ్ సెల్స్ విభాగాన్ని రూ. 20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. దీనిని మిలీనియం బ్లాక్లోని ఐదవ అంతస్తులో ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు స్టెమ్ సెల్స్ యూనిట్.. దశాబ్దకాలంలో ప్రతిపాదన దశలో ఉన్న ఈ యూనిట్ ఎట్టకేలకు కార్యరూపంలో వచ్చింది. ఈ విషయంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. మనోహర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొత్తం మీద నిమ్స్లో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మెరుగైన వైద్య సేవలు పేదల ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకురావాలన్న కృతనిశ్చయంతో యాజమాన్యం ఉంది. ఇప్పటికే సాధారణ అవుట్ పేషెంట్ విభాగంతో పాటు ఈవినింగ్ ఓపీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రూ. 500 స్పెషల్ ఓపీలో వైద్య సేవలను అందుకుంటున్నారు. ఒక విభాగానికి ఓపీ కార్డు తీసుకుని దాంతో పాటు మరో విభాగంలో వైద్య సలహాలు పొందాలంటే మరో రూ. 200లు చెల్లించాల్సి ఉంటుంది. అందుకు ఆ కార్డు కాల పరిమితిని 14 రోజుల పాటు ఉంటుంది. ఈ విధంగా వైద్య సేవలను సరళతరం చేస్తున్నారు. హెల్త్ చెకప్ ప్యాకేజీలు.. హెల్త్ చెకప్ ప్యాకేజీలు తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. నిమ్స్ ఓల్డ్ బిల్డింగ్లోని గతంలో క్యాథ్ల్యాబ్ విభాగాన్ని నిర్వహించిన ప్రాంతంలో ఈ పరీక్షలనున ఇర్వహిస్తున్నారు. ఓపీ కౌంటర్లతో ప్రమేయం లేకుండానే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే ఈ విభాగంలో వెల్నెస్ సెంటర్ నిర్వహిస్తున్నారు. దానికి అదనంగా ఆయుష్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రకృతి వైద్య విభాగానికి చెందిన ఈ ఆయూష్ కేంద్రంలో రోగులకు ఆహారపు అలవాట్లు పట్ల అవగాహన కల్పించడమే కాకుండా యోగ ద్వారా దీర్ఘ కాలిక వ్యాధులకు సైతం స్వస్ధత చేకూరే విధంగా వైద్య సేవలను అందిస్తున్నారు. ఆ విధంగా వెల్నెస్ సెంటర్ పేరుతో కొనసాగుతున్న విభాగంలో ఆయూష్, హెల్త్ చెకప్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆధునాత పద్ధతుల్లో ఫుడ్ కోర్డ్ను ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఈ విషయంలో డైరెక్టర్ మనోహర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. -
మాస్టర్ @2800
లక్డీకాపూల్:నిమ్స్లో కార్పొరేట్ తరహాలోవైద్యపరీక్షల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పేదలకు మెరుగైన వైద్య సేవల్ని అందుబాటులోకితీసుకురావాలన్న ఉద్దేశంతో సరళతరమైన రీతిలో 12 రకాల హెల్త్ చెకప్ ప్యాకేజీలను రూపొందించారు. వీటి వివరాలను నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె.మనోహర్బుధవారం నిమ్స్లో ఏర్పాటుచేసినవిలేకరుల సమావేశంలో వెల్లడించారు.హెల్త్ చెకప్ బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సైతం అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యసేవలనుఅందించేందుకు ప్రత్యేక దృష్టినికేంద్రీకరించినట్టు తెలిపారు. అందులో భాగంగానేరూ.2800కే మాస్టర్ హెల్త్ చెకప్ చేయనున్నామన్నారు. తెలియని వ్యాధుల నిర్ధారణకు.. తెలియని కొన్ని రకాల వ్యాధులను నిర్ధారించుకునేందుకు వైద్య పరీక్షలు ఎంతో అవసరం. ఈ క్రమంలో అతి తక్కువ ధరలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు 12 రకాల హెల్త్ చెకప్ ప్యాకేజీలను రూపొందించారు. ముఖ్యంగా మహిళల హెల్త్ ప్రొఫైల్, సీజనల్ జ్వరాలు వంటి అంశాలలో గతంలో రూపొందించిన మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీకి రోగుల నుంచి పెద్దగా స్పందన కానరాలేదు. ఆయా ప్యాకేజీలలో కొన్ని అవసరం లేని పరీక్షలు ఉన్నందున ఆయా ప్యాకేజీలకు ఆదరణ కరువైందని డైరెక్టర్ చెప్పారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించామని వివరించారు. ఆయా ప్యాకేజీలలో హెల్త్ చెకప్ను నేరుగా గతంలోని క్యాత్ ల్యాబ్లోకి వెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన ప్యాకేజీల వివరాలు ఇలా ఉన్నాయి. మాస్టర్ హెల్త్ చెకప్: రూ.2,800 నిమ్స్ మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీలో హీమోగ్రామ్ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో హెచ్బీ, పీసీవీ, ఎంసీవీఎంహెచ్సీ, ఎంసీహెచ్సీ, టీఎస్సీ, డీసీ, పీఎల్టీ, రీటిక్, ఎస్ఆర్, పీఎస్ టెస్టులు చేస్తారు. అంతే కాకుండా సియూఈ, సిరమ్ యూరియా, సిరమ్ క్రియాటినైన్, ఎఫ్బీఎస్, పీఎల్బీఎస్, హెచ్బీఏ1సి పరీక్షలు కూడా ఉంటాయి. డయాబెటిక్ హెల్త్ చెకప్: రూ.2100 డయాబెటిక్ హెల్త్ చెకప్ ప్యాకేజీలో హీమోగ్రామ్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటాయి. ఉమెన్ వెల్నెస్ చెకప్:రూ.4700 ఉమెన్ వెల్నెస్ చెకప్ ప్యాకేజీలో హీమోగ్రామ్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు, టీఎస్హెచ్, ఈసీజీ, సీఎక్స్ఆర్–పీఏ రివ్యూ, యుఎస్జీ – అబ్డామన్, మామోగ్రఫీ వంటి పరీక్షలతో పాటు కన్సల్టేషన్ ఉంటాయి. ఫీవర్ ప్రొఫైల్: రూ.4500 ఫీవర్ ప్రొఫైల్ ప్యాకేజీలో హీమోగ్రామ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, మలేరియా స్ట్రీప్, విడాల్ లిట్రేస్, డెంగ్యూ సెరాలాజీ, వెల్ప్లెక్స్/స్క్రబ్ టైప్స్ రాపిడ్ ఐసిటీ, లెప్టొస్పిరా యాంటీబాడీస్ పరీక్షలు ఉంటాయి. ఎనీమియా టెస్ట్:రూ.2000 ఎనీమియా టెస్ట్ ప్యాకేజీలో హీమోగ్రామ్, ఐరన్ స్టడీస్, విటమిన్ బి12, ఎస్డిహెచ్, బైల్యురోబిన్ (టోటల్+కన్సల్టేషన్) పరీక్షలు ఉంటాయి. రెస్పిరేటరీ హెల్త్ చెకప్:రూ.1500 రెస్పిరేటరీ హెల్త్ చెకప్ ప్యాకేజీలో హీమోగ్రామ్ పరీక్షతో పాటుగా అబ్సల్యూట్ కౌంట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, ఇమ్యునాల్జాబులిన్ పరీక్షలు ఉంటాయి. బోన్ అండ్ జాయింట్ హెల్త్ చెకప్: రూ.2400 బొన్ అండ్ జాయింట్ హెల్త్ చెకప్ ప్యాకేజీలో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్–డి, యూరిక్ యాసిడ్, టీఎస్హెచ్, ఈఎస్ఆర్ పరీక్షలతో పాటు కన్సల్టేషన్ సేవలు పొందవచ్చు. కార్డియాక్ హెల్త్ చెకప్: రూ.3800 కార్డియాక్ హెల్త్ చెకప్ ప్యాకేజీలో హీమోగ్రామ్, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, 2డి ఈకో, సీఎక్స్ఆర్–పీఏ రివ్యూ, టీఎంటీ పరీక్షలతో పాటు కన్సల్టేషన్ సేవలు పొందవచ్చు. కిడ్నీ హెల్త్ చెకప్: రూ.1900 కిడ్నీ హెల్త్ చెకప్ ప్యాకేజీలో సెరమ్ యూరియా, సియూఈ, సెరమ్ క్రియేటినైన్, సెరమ్ కాల్షియం, సెరమ్ యూరిక్ యాసిడ్, యూరిన్ మైక్రో అల్బుమిన్, సెరమ్ ఆల్బుమిన్(టోటల్) పరీక్షలతో పాటుగా కన్సల్టేషన్ సేవలు పొందవచ్చు. కేన్సర్ స్క్రీనింగ్: రూ.2000 (పురుషులు) కేన్సర్ స్క్రీనింగ్ పురుషుల ప్యాకేజీలో పీఎస్ఏ, యుఎస్జీ– అబ్డామిన్, సీఎక్స్ఆర్–పీఏ రివ్యూ, సెరమ్ క్రియేటినైన్, సీబీపీ, హీమోగ్రామ్, లివర్ ఫంక్షన్ టెస్ట్లు ఉంటాయి. కేన్సర్ స్క్రీనింగ్: రూ.3500 (మహిళలు) కేన్సర్ స్క్రీనింగ్ మహిళలు ప్యాకేజీల మామోగ్రఫీ, పీఎస్ఏ, హిమోగ్రఫీ, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటాయి. టోటల్ థైరాయిడ్ ప్రొఫైల్: రూ.2500 టోటల్ థైరాయిడ్ ప్రొఫైల్ ప్యాకేజీలో టి3, టి4, టిఎస్హెచ్, యాంటీ థైరాయిడ్, యాంటీ బ్యాడీ, హెచ్ఆర్యుఎస్ నెక్ పరీక్షలు చేస్తారు. లివర్ ప్రొఫైల్: రూ.2200 లివర్ ప్రొఫైల్ ప్యాకేజీలో లివర్ ఫంక్షన్ టెస్ట్తో పాటుగా సెరమ్ జీజీటీపీ, హెచ్ఐవీ ఈఎల్ఎఫ్ఏ, హెచ్బీఎస్ఏజీ ఈఎల్ఎఫ్ఏ, హెచ్సీవీ ఈఎల్ఐఎస్ఏ, యుఎస్జి అబ్డామిన్ పరీక్షలు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్: రూ.7000 (పురుషులు) ఈ ప్యాకేజీలో హీమోగ్రామ్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. అదే ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ మహిళలు ప్యాకేజీలో రూ.8000 చెల్లించాలి. వివరాలకు 040–23489023 ఫోన్ నెంబర్లో సంప్రదించాలి. -
జీతాలు పెంచితేనే..విధుల్లో చేరుతాం
లక్డీకాపూల్: నిమ్స్లో ఒప్పంద నర్సులు చేపట్టిన ఆందోళన ఆదివారం మూడో రోజుకు చేరింది. వివిధ విభాగాల హెచ్ఓడీలతో కూడిన కోర్ కమిటీ చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. వేతనాలు పెంచేంత వరకు రాజీపడే ప్రసక్తే లేదని నర్సులు తేల్చిచెబుతున్నారు. విద్యార్థులకు చెల్లిస్తున్న విధంగా స్టైపెండ్ రూపంలో నామమాత్రంగా వేతనాలు అందజేస్తూ.. యాజమాన్యం తమ శ్రమను దోచుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలను పెంచి, ఎరియర్స్ను కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా జరిపిన కోర్ట్ కమిటీ చర్చలు ఫలించలేదు. ఆందోళన కొనసాగకుండా విధులకు హాజరయ్యేలా కోర్ కమిటీ ఎంత ప్రయత్నించినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. ఒప్పంద నర్సులకు మద్దతుగా నిమ్స్ ఉద్యోగ సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి. న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నగర శాఖ అధ్యక్షుడు ఈశ్వరరావు డిమాండ్ చేశారు. నిమ్స్ నర్సెస్ యూనియన్ ప్రధాన కార్యదర్శులు విజయకుమారి, పారా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శిరందాస్ శ్రీనివాసులు, తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులు రాజ్ కుమార్లు సైతం ఒప్పంద నర్సులకు సంఘీభావం ప్రకటించారు. పరిస్థితి అధ్వానం.. విద్యార్థులకు చెల్లించే స్టైపెండ్ లెక్కన వేతనాలు చెల్లిస్తున్నారు. ఏళ్ల తరబడి చేస్తున్న తమ సర్వీసు ఎందుకూ పనికి రాని విధంగా తయారైంది. సూపర్ మార్కెట్లో పనిచేసే వాళ్ల కన్నా మా పరిస్థితి అధ్వానంగా మారింది. ఆస్పత్రిలో కీలకమైన సేవలు అందజేస్తున్న మమ్మల్ని యాజమాన్యం శ్రమదోపిడీ చేస్తోంది. ఇప్పటికైనా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే. ఈ విషయంలో సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. – అరుణ కుమారి, ఒప్పంద నర్సు మంత్రి ఆదేశాలూ బేఖాతరు.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలను కూడా యాజమాన్యం లెక్కడ చేయడం లేదు. నిమ్స్ బడ్జెట్ నుంచి వేతనాలను ఇవ్వాలని మంత్రి ఈటల చెప్పారు. కానీ యాజమాన్యం మాత్రం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తేనే ఇస్తామంటూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. తమతో పాటు చేరిన ఒప్పంద నర్సులకు కొంత మందికి రూ.35 వేల చొప్పున చెల్లిస్తున్నారు. మా విషయానికి వచ్చేసరికి ఉత్తర్వులు అంటూ దాటవేస్తోంది. – దేవేందర్, ఒప్పంద మేల్ నర్సు నాటి హామీలేమయ్యాయి.. వేతనాలు పెంపుదల విషయమై 2005లో ఆందోళన చేపట్టినప్పడు ప్రస్తుత మంత్రి, నాడు ఎమ్మెల్యే హోదాలో మా డిమాండ్లను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నిమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో చర్చించి పే స్లిప్తో కూడిన వేతనాలు పెంచేందుకు, మెటర్నటీ లీవ్లు మంజూరు చేసేందుకు తీర్మానించారు. ఐదు సంవత్సరాలు సర్వీసు ఉన్న వాళ్లకి రూ. 25 వేలు చొప్పున, ఐదేళ్లు పైబడి సర్వీసు ఉన్న వాళ్లకి రూ.30 వేలు చొప్పున చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. కనీసం పీఎఫ్, మెడికల్ అలవెన్స్ కూడా లేని దీన స్థితిలో విధులు నిర్వర్తిస్తున్నాం. – మంజుల, ఒప్పంద నర్సు -
ఒక రోగి ఎన్ని ఓపీ కార్డులు తేవాలి..?
సాక్షి, సిటీబ్యూరో: నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో రోగులు దోపిడీకి గురవుతున్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్య సేవలను అందిస్తున్న దృక్ఫథంతో తెలంగాణ ప్రభుత్వం నిమ్స్ ఆసుపత్రిని ప్రత్యేక తరహాలో నిర్వహిస్తోంది. అయితే స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన ఈ ఆసుపత్రిలో పాలకులు చిత్తం వచ్చినట్టు నియమ నిబంధనలు విధించడంతో రోగుల పాలిట శాపంగా మారింది. అభివృద్ధి పేరిట, ప్రభుత్వం వద్ద తాము ఆదాయం వనరులను చూపించే క్రమంలో ఆసుపత్రి యాజమాన్యం తమకు తోచిన విధంగా రూల్స్ను ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శ లేకపోలేదు. పెరుగుతున్న రోగులకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన యాజ మాన్యం వారికి భారంగా తయారైందనే వ్యాఖ్యలు సర్వత్రా వినవస్తున్నాయి. ఓపీ కార్డులు తీసుకోవాల్సిందే.. ఆస్పత్రి ఒక్కటే అయినప్పటికీ రెండు మూడు ఓపీ కార్డులు తీసుకోవాల్సిన పరిస్థితి. ఏ డిపార్టుమెంట్కు ఆ డిపార్టుమెంట్ ఓపీ కౌంటర్లో ఓపీ కార్డు తీసుకోవాల్సిందేనని నిమ్స్ ఉద్యోగులు హుకుం జారీ చేస్తున్నారు. బుధవారం ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగయ్య అనే రోగి శస్త్ర చికిత్స నిమిత్తం నిమ్స్ను వచ్చాడు. సర్జకల్ ఆంకాలజీ విభాగంలో ఓపీ కార్డు తీసుకొని వైద్యుడిని సంప్రదించారు. ఆయనను పరీక్షించిన ఆ విభాగం వైద్యులు. కేసు క్రిటికల్గా ఉంది. ఒకసారి కార్డియాలజీ విభాగంలో చూపించుకోవాల్సిందిగా సూచించారు. దాంతో అక్కడి వైద్యుడిని కలవడానికి వెళ్లగా ఓపీ కార్డు తీసుకురమ్మని సిబ్బంది ఆదేశించారు. అదేంటి ఓపీ కార్డు తీసుకున్నాం కదా అని.. సర్జికల్ ఆంకాలజీ విభాగానికి సంబంధించి తీసుకున్న ఓపీ కార్డును సంగయ్య సహాయకురాలు చూపించారు. ఇది.. కార్డియాలజీ ఓపీలో కార్డు తీసుకురావాలని చెప్పారు. ఒక రోజుకు ఒకే రోగి రెండు, మూడు ఓపీ కార్డులను తీసుకోవడమంటే ఎంత వరకు సమంజమని రోగి సహాయకులు ప్రశ్నిస్తున్నారు. నిమ్స్ యాజమాన్య వైఖరిపై ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్చెరువుకు చెందిన రోగి సహయకుడు సంజయ్ అభిప్రాయపడుతున్నారు. గతంలో అయితే.. గతంలో అయితే ఒకసారి ఓపీ కార్డు తీసుకుంటే ఆ కార్డు మీద దాదాపుగా 15 రోజులు వైద్యులను సంప్రందించడానికి అవకాశం ఉండేది. అప్పట్లో ఓపీ కార్డు కూడా కేవలం రూ. 50లకే జారీ చేసేవాళ్లు. దాంతోనే ఆసు పత్రిలోని 28 సూపరు స్పెషాలిటీ విభా గాలల్లోనూ ఆయా వైద్యులను కలుసుకునే వెలుసుబాటు రోగులకు ఉండేది. అలాంటిది.. యాజమాన్యం తాజాగా తీసుకున్న నిర్ణ యాల వల్ల ఓపీ కార్డు కూడా మొబైల్కి వచ్చే ఓటీపీ చందంగా తయారైందని పలువురు రోగులు, వారి సహాయకులు వాపోతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా ఈ విధమైన వైఖరి లేదనీ, ఇక్కడ అంతకు మించి దోపిడీ జరుగుతుందన్నారు. ఏ విభాగానికి ఆ ఓపీ కార్డు ప్రత్యేకం.. ఓపీ కార్డు విషయమై సంబంధిత ఆర్ఎంఓని సంప్రదించగా ఆసుపత్రి వైద్యసేవలన్నీ కంప్యూటీకరణ చేయడం జరిగిందని చెప్పారు. దాని వల్ల ఏ డిపార్టుమెంట్కు ఆ డిపార్టుమెంట్కు సంబంధించి విధిగా ఓపీ కార్డు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఆయా విభాగాలలో ప్రత్యేకంగా ఓపీ కార్డులను జారీ చేస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని ఆసుపత్రి పరిపాలనా అధికారి కూడా ధ్రువీకరించడం గమనార్హం. -
గంటా చక్రపాణికి పితృవియోగం
సాక్షి, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న చక్రపాణి తండ్రి మొగలయ్య కన్నుమూశారు. 8 రోజుల నుంచి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మొగలయ్య శుక్రవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. మొగలయ్య భౌతికకాయాన్ని వారి స్వస్థలం కరీంనగర్ జిల్లాకు తరలిస్తున్నారు. -
నిమ్స్లో జగదీశ్ రెడ్డికి కేటీఆర్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్ : నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని బుధవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. హై ఫీవర్తో నిమ్స్లో చికిత్స పొందుతున్న మంత్రిని పరామర్శించిన కేటీఆర్... ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్తో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో పాటు పలువురు పార్టీ నేతలు జగదీశ్ రెడ్డిపి పరమర్శించారు. -
చీదరింపులు.. చీత్కారాలు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ప్రస్తుతం తన ’ప్రభ’ను కోల్పోతుంది. రోగుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారు. చీదరింపులు.. చీత్కారాలు షరా మామూలయ్యాయి. రోగుల బంధువులను టెస్టులు, జిరాక్స్ కాపీల కోసం ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఇలా ఆస్పత్రి మొత్తం తిప్పుతున్నారు. ఫలితంగా నగదు చెల్లింపు రోగులు ఆస్పత్రికి దూరం అవుతున్నారు. ఒకప్పుడు కాసులతో గలలాడే ఆస్పత్రి ఖజనా ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం ముందు మోకారిల్లాల్సిన పరిస్థితి నెలకొంది. 2014కి ముందు పేయింగ్ రోగులు 55 శాతం ఉంటే, ఆరోగ్యశ్రీ రోగులు 45 శాతం మంది ఉండేవారు. ప్రస్తుతం 80 శాతం మంది ఆరోగ్యశ్రీ రోగులు ఉంటే, 20 శాతం మంది మాత్రమే పేయింగ్ రోగులు వస్తున్నారు. మంచి హస్తవాసి ఉన్న అనేక మంది సీనియర్ వైద్యులు పదవీ విరమణ చేయడం, అంతో ఇంతో నైపుణ్యం ఉన్న వైద్యులు కూడా ఆస్పత్రిలోని అంతర్గత కుమ్ములాటలను తట్టుకోలేక బయటికి వెళ్లిపోయారు. అప్పటి వరకు హస్తవాసి, నైపుణ్యం ఉన్న వైద్యులను వెతుక్కుంటు వచ్చిన రోగులు కూడా వారినే వెతుక్కుంటూ వెళ్లిపోయారు. దీంతో ఆస్పత్రికి నగదు చెల్లింపు రోగుల సంఖ్య తగ్గింది. సిబ్బంది వేతనాల చెల్లింపు, ఆస్పత్రి నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదు. అడిగితే చెప్పే వారేరీ.. ఆస్పత్రిలో ఎమర్జెన్సీ బ్లాక్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, మిలీనియం బ్లాక్, మెట్టురంగారెడ్డి భవనం, కేన్సర్ బ్లాక్, ఓపీడీ బ్లాక్లు ఉన్నాయి. ఒక్కో విభాగం ఒక్కో బ్లాక్లో ఉన్నాయి. డయాగ్నోస్టిక్ లేబోరేటరీ, రక్తనిధి కేంద్రం, ఆరోగ్యశ్రీ కౌంటర్, మెడికల్ షాపులు వేర్వేరుగా ఉన్నాయి. ఓపీ కార్డు తీసుకుని, వైద్యుడికి చూపించుకుంటారు. వ్యాధి నిర్ధారణ కోసం వైద్యుల రక్త, మూత్ర పరీక్షలతో పాటు కొంత మందికి సీటీ, ఎంఆర్ఐ, ఈసీజీ, 2డిఎకో, ఆల్ట్రాసౌండ్ వంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచిస్తుంటారు. అయితే ఏ స్పెషాలిటీ ఏ బిల్డింగ్లో ఉంది? ఏ డాక్టర్ ఏ నెంబర్ గదిలో ఉంటారు? ఏ నెంబర్ గదిలో ఏ పరీక్ష చేస్తారు? వంటి వివరాలు చెప్పివారు లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. తెలియక ఎవరైనా సిబ్బందిని అడిగితే..చీదరింపులు..చీత్కారాలు తప్పడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలో నిమ్స్కు వచ్చే రోగులకు కూడా మంచి వైద్య సేవలతో పాటు ఇతర సమాచారాన్ని అందజేసేందుకు ప్రజాసంబంధాల పేరుతో ఇప్పటికే తొమ్మిది మందిని నియమించారు. కానీ పీఆర్ఓల పేరుతో ఆస్పత్రిలో చేరిన వారిలో ఎవరు? ఏ వార్డులో పనిచేస్తున్నారు? వంటి కనీస సమాచారం కూడా అధికారుల వద్దలేకపోవడం గమనార్హం. -
నిమ్స్లో ‘గేమ్స్’
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో వైద్యుల పోస్టులు భారీగా ఖాళీ ఏర్పడ్డాయి. నెలకు సగటున ఇద్దరు వైద్యులు పదవీ విరమణ చేస్తుండగా అంతర్గత కుమ్ములాటలకు తోడు కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే ఇక్కడ వేతనాలు చాలా తక్కువగా ఉండటంతో మరికొంత మంది ఆస్పత్రిని వీడుతున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఆస్పత్రి యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేస్తున్నప్పటికీ..ఇక్కడ పని చేసేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు. వచ్చిన వారు కూడా రెండు మూడేళ్ల తర్వాత ఆస్పత్రిని వీడుతున్నారు. ఉన్నతాధికారులు కూడా వీరిని ఆపే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రస్తుతం 311 పోస్టులకు గాను 133 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్, అడిíషనల్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భారీగా ఖాళీగా ఉండటంతో సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్యపైనే కాదు..రోగుల చికిత్సలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. సీనియర్ వైద్యులు లేకపోవడంతో ఆ భార మంతా రెసిడెంట్లపై పడుతుంది. చికిత్సల్లో వారికి సరైన అనుభవం లేకపోవడంతో వారు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. పదవీ విరమణ చేసిన కొంత మంది సీనియర్ వైద్యులు ఆ తర్వాత కూడా ఇక్కడ పని చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ వారిని తీసుకునేందుకు యాజమాన్యం విముఖత ప్రదర్శిస్తోందని తెలుస్తోంది. ఇమడలేక వీడుతూ.. జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జీఎస్ఎన్రాజు, ప్రముఖ అనెస్తీయన్ డాక్టర్ గోపినాథ్ సహా మరో వైద్యురాలు ఇటీవల పదవీ విరమణ చేశారు. కొంత మంది వైద్యుల మధ్య నెలకొన్ని అంతర్గత విభేధాల వల్ల న్యూరోసర్జరీ విభాగంలో సీనియర్ సర్జన్ డాక్టర్ మానసపాణిగ్రహి, సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ ప్రవీణ్ కూడా ఆస్పత్రిని వీడారు. పరిపాలనా పరమైన వేధింపులే ఇందుకు కారణమని డాక్టర్ ప్రవీణ్ అప్పట్లో తన రాజీనామా లేఖలో పేర్కొనడం గమనార్హం. ఆర్థోపెడిక్ విభాగం పూర్వ అధిపతి డాక్టర్ వీబీఎన్ ప్రసాద్ రాజీనామా తర్వాత మోకాలి చికిత్సలు 10 నుంచి 15 శాతానికి పడిపోయాయి. రుమటాలజీ విభాగం, హెమటాలజీ విభాగం, ఎండోక్రైనాలజీ విభాగాల్లో చికిత్సలు గగనమయ్యాయి. యూరాలజీ, నెఫ్రాలజీ విభాల్లోనే ఇదే పరిస్థితి. ఇదిలా ఉంటే అనస్తీషియా విభాగంలోని ఓ సీనియర్ ప్రొఫెసర్ ఇటీవల వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోయారు. అనస్తీషియన్ల కొరత వల్ల పలు ఆపరేషన్ థియేటర్లు కూడా మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో తెలుసుకోవచ్చు. కాలేయ మార్పిడి, గుండె మార్పిడి చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. వైద్యు లను ప్రోత్సహించి చికిత్సల సంఖ్యను పెంచాల్సిన ఉన్నతాధికారులే వీటికి అడ్డుపడుతున్నట్లు విమర్శలు లేకపోలేదు. రెసిడెంట్లపైనే భారం.. పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ ట్రైనింగ్ సెంటర్లలో నిమ్స్ దేశంలోనే ప్రతిష్టాత్మాకమైంది. 1986లో పడకల సామర్థ్యం 500 ఉండగా, ప్రస్తుతం 1500 చేరింది . ఉద్యోగుల పదవీ విరమణలతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ వివిధ విభాగాల్లో 423 మంది రెసిడెంట్ డాక్టర్లు చదువుతున్నారు. చదువుకునే సమయంలో ఏ విద్యార్థి అయినా ఒత్తిడికి గురవుతుండటం సహజమే. అయితే రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులను నియమించక పోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఆస్పత్రికి రోజురోజుకూ రోగుల తాకిడి పెరగడం, వారి నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడం వల్ల రెసిడెంట్లపై పని భారం పడుతోంది. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు పని చేయాల్సి వస్తుంది. రెసిడెంట్లకు కనీస విశ్రాంతి, పండుగలు, ఇతర శుభకార్యాల సమయంలో కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం లేకపోవడం, పని ప్రదేశంలో అహ్లదకరమైన వాతావరణం లేకపోవడం కూడా మానసిక ఒత్తిడికి గురువుతున్నారు. గత రెండేళ్ల క్రితం నిమ్స్లో వెలుగు చూసిన ఓ రెసిడెంట్ డాక్టర్ ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్ రాజారెడ్డి కమిటీ కూడా ఇదే అంశాన్ని గుర్తించి, 18 సూచనలు కూడా చేసింది. కానీ వాటిలో ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవని రె సిడెంట్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. -
ఎంతమందిని అడ్డుకుంటారు!
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెల్త్ బులిటెన్ విడుదల చేయాలంటూ సీపీఐ కార్యకర్తలు నిమ్స్ గేటు వద్ద ధర్నా చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సాంబశివరావును పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేర్చి రెండురోజులవుతున్న ఇప్పటివరకు సాంబశివరావు హెల్త్ బులిటిన్ విడుదల చేయలేదని సీపీఐ నేతలు మండిపడ్డారు. వెంటనే హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. నిరసన తెలిపే హక్కును పోలీసులు పూర్తిగా కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇది కోరి కోట్లాడీ సాధించుకున్న తెలంగాణ అన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ... నిరసన తెలిపితే పోలీసులు ఉద్యమాన్ని అడ్డుకుంటాం అంటే మరింత ఉదృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ నిరసన చేసినా అక్కడ అడ్డుకుంటామని పోలీసులు అనుకుంటే ఎంతమందిని అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. -
అన్నదాతలకే అన్నం పెట్టే సద్దిమూట
ఇంజనీరింగ్ రంగంలో అగ్రగామి సంస్థ మేఘా ఇంజనీరింగ్ సామాజిక సేవలోనూ ముందుంటోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక గ్రామాలను దత్తత తీసుకొని మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. మరోవైపు క్యాన్సర్ బాధిత చిన్నారులను అక్కున చేర్చుకుని, వారికి మధ్యాహ్న భోజనంతోపాటు ఇతర సామగ్రిని అందిస్తోంది. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో అత్యాధునిక వసతులతో క్యాన్సర్ బాధితుల కోసం అంకాలజీ భవనాన్ని నిర్మించి ఇచ్చింది. అంతేకాకుండా అన్నదాతలకే అన్నం పెట్టే సద్దిమూట కార్యక్రమాన్ని కూడా ఎంఇఐఎల్ నిర్వహిస్తున్నది. అలాగే ఎంఇఐఎల్ తన సేవా కార్యక్రమాలను గ్రామాలకు విస్తరించింది. ఎలాంటి రాజకీయ ఎజెండా లేకుండా.. కేవలం గ్రామాలకు సేవ అందించాలనే లక్ష్యంతో మేఘా ఇంజనీరింగ్ గ్రామాలను దత్తత తీసుకొని వాటి వికాసానికి తనవంతు తోడ్పడుతోంది. ఏపీ, తెలంగాణలోని అనేక గ్రామాలను దత్తత తీసుకొని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతోపాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా జములపల్లిలో రెండు ఓవర్ హెడ్ ట్యాంకులను ఆధునీకరించి, ప్రతి ఇంటికి తాగునీరు, అలాగే సోలార్ ప్లాంట్ తోపాటు రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లాలోని డోకిపర్రు, ఖాజా గ్రామాలను దత్తత తీసుకున్న ఎంఇఐఎల్ ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్నది. డోకిపర్రులో కళ్యాణ మండపం, దేవాలయం నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు అందించింది. అలాగే రాయలసీమ ప్రాంతంలో నాగులాపురం,గంజిగుంటపల్లి గ్రామాలను దత్తత తీసుకుంది. ద ఇక తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలోని పస్పుల, మురహరిదొడ్డి గ్రామాలను దత్తత తీసుకుని,రహదారులను నిర్మించడంతో పాటు సౌర విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఆసుపత్రుల్లోని రోగులకు, వారి వెంట వచ్చే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఎంఇఐఎల్ భోజనామృతం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. తొలివిడతలో నీలోఫర్తోపాటు ఉస్మానియాలో రోగులకు, వారి వెంట వచ్చే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నది. ఇలా సంత్సరంలో దాదాపు 10 లక్షల మంది ఆకలి తీరుస్తున్నది. అలాగే ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిచేస్తోంది. దీంతోపాటు ప్రాణం ఫౌండేషన్కు చెందిన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యంతో పాటు, సద్దిమూట కార్యక్రమం ద్వారా సిద్దిపేట, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ యార్డ్ లలో రైతులు, హమాలీల ఆకలి తీరుస్తున్నది. నిమ్స్లో అత్యాధునిక అంకాలజీ భవనం నిమ్స్లో అత్యాధునిక సదుపాయాలతో అంకాలజీ ఆసుపత్రి భవనాన్ని మేఘా సుమారు రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించింది. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలను ఎంఇఐఎల్ కల్పించింది. ఇందులో ప్రత్యేక వార్డులతో పాటు.. ఐసీయూ, బెడ్లు, ఆక్సిజన్ సదుపాయాలు, సెంట్రలైజ్డ్ ఏసీ సదుపాయం, బెడ్ లిఫ్ట్ సౌకర్యం గత ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చింది. -
ప్లాస్టిక్ కవర్లో చుట్టి...ముళ్లపొదల్లో పసికందు
సాక్షి, హైదరాబాద్ : తల్లి పొత్తిళ్లలో కేరింతలు కొట్టాల్సిన ఓ చిన్నారి ముళ్ల పొదలపాలైంది. కన్న మమకారం మరిచిన తల్లి అప్పుడే పుట్టిన ముక్కపచ్చలారని తన కూతుర్ని ముళ్లపొదల్లో విసిరేసింది. ఈ హృదయ విదారక ఘటన బుధవారం నిమ్స్ ఆవరణలో బయట పడింది. నిమ్స్ మిలినియం బ్లాక్ వెనుక ప్రహరివద్ద చిన్నపాటి ఏడుపు శబ్ధం వినిపిస్తుంది. దీంతో అవుట్ పోస్ట్ పోలీసులు ఏడుపు వినిపిస్తున్న ప్రాంతానికి వెళ్లి చూడగా, ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉన్న చంటిపాప కనిపించింది. వెంటనే ఆ చిన్నారిని నిమ్స్ అత్యవర చికిత్సా విభాగానికి తరలించారు. చికిత్స అనంతరం బిడ్డ సంరక్షణకు శిశువిహార్కు తరలించనున్నట్లు పంజగుట్ట పోలీసులు చెప్పారు. అయితే ఆ బిడ్డను ఎవరు వదిలి వెళ్లారన్న దానిపై సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆడపిల్ల కావడంతోనే ఆ బిడ్డను వదిలి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు స్పందిస్తూ నవజాత శిశువులను రోడ్లపై వదిలేయడం నెలలో ఇది మూడో ఘటన అని అన్నారు. పిల్లలకు బతికే హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఓ పథకం రూపొందించాలని, లేదా ఊయల పథకాన్నిసమర్థవంతంగా నిర్వహించేలా స్త్రీ శిశు సంక్షేమ శాఖను ఆదేశించాలని కోరారు. -
పోయిన వస్తువులు తిరిగొచ్చాయి..
పంజగుట్ట: నిమ్స్ న్యూరో సర్జన్ ఆపరేషన్ థియేటర్లో సర్జరీకి సంబంధించిన వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. ఈ విషయం గుర్తించిన ఆసుపత్రి యాజమాన్యం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోయాయనున్న వస్తువులు శుక్రవారం తెల్లవారు జామున యథాస్థానంలో కనిపించడం విశేషం. పోలీసులు, నిమ్స్ సిబ్బంది కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిమ్స్ అత్యవసర విభాగం మూడో అంతస్తులోని న్యూరో సర్జన్ ఆపరేషన్ థియేటర్ (ఎన్ఎస్ఓడీ)లో సర్జరీకి సంబంధించిన కత్తెర్లు, రాడ్లు, మరికొన్ని వస్తువులు గత ఆదివారం రాత్రి చోరీకి గురయ్యాయి. మర్నాడు దీనిని గుర్తించిన సిబ్బంది విభాగాధిపతికి సమాచారం అందించారు. ఆయన నిమ్స్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టడంతో భయపడిన నిందితుడు శుక్రవారం తెల్లవారు జామున ఎవరూ లేని సమయంలో నల్లకలర్ బ్యాగ్లో చోరీకి గురైన వస్తువులు తెచ్చి పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటిదొంగ పనే ... బయటివ్యక్తులు అత్యవసర విభాగంలోకి వెళ్లడం అసాధ్యం. ఆస్పత్రి సిబ్బందే చోరీకి పాల్పడి ఉండవచ్చునని, పోలీసులు విచారణ ముమ్మరం చేయడంతో భయపడి తిరిగి తెచ్చి పెట్టి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. చోరీ జరిగిన సమయంలో కేసు నమోదు చేయాలని కోరిన నిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది ఇప్పుడు కేసు వద్దని తమ వస్తువులు ఇచ్చేయాలని కోరడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులెవరో తేలుస్తామని, సదరు వస్తువులు కోర్టుకు సమర్పించనున్నట్లు అధికారులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిమ్స్ ఎమర్జెన్సీలో వైద్యం గగనమే!
సోమాజిగూడ: నిమ్స్లోని అత్యవసర వైద్యసేవల విభాగానికి వచ్చే రోగులు నరకాన్ని చవిచూస్తున్నారు...దూర ప్రాంతాల నుంచి అడ్మిషన్ కోసం వచ్చే రోగులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ వీరిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దాంతో నిమ్స్ ప్రతిష్ట మసక బారుతోంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అత్యవసర విభానికి వచ్చిన రోగులకు సకాలంలో అడ్మిషన్లు దొరకడంలేదు. బెడ్స్ ఖాళీ లేవంటూ చెప్పడంతో చికిత్స కోసం వచ్చిన వారు తాము వచ్చిన వాహనంలోనే గంటల తరబడి వైద్యుల పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. వారం రోజుల క్రితం విషం తాగి చావు బతుకుల మధ్య ఉన్న ఓ వ్యక్తిని మహేశ్వరం నుంచి తీసుకురాగా.. వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో గంట పాటు అతను అలాగే వాహనంలో పడి ఉన్నాడు. అపస్మారకస్థితిలో ఉన్న ఓ మహిళను మంగళవారం అత్యవసర విభాగంలో చికిత్స కోసం తీసుకు రాగా.. అక్కడ ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అక్కడి సిబ్బందితో సదరు పేషెంట్ బంధువులు వాగ్వాదానికి దాగారు. ఇలా నిత్యం నిమ్స్ ఎమర్జెన్సీ వార్డు వద్ద వైద్యసేవల విషయంలో రోగుల బంధువులు వైద్యులు, అక్కడి సిబ్బందితో ఘర్షణకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర విభాగంలో అడ్మిషన్ దొరకపోతే కొన్ని సందర్భాల్లో పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంది. స్ట్రెచర్స్ లేవంటూ... నిమ్స్ అత్యవసర విభాగానికి చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. రోజుకు సుమారు 100 మంది ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు, విషం తాగిన వారు, ఇతర వ్యాధుల బారిన పడిన వారు... ఇలా ఎందరో రోగులు నిమ్స్లో చికిత్స కోసం వస్తుంటారు. దాంతో అత్యవసం విభాగం రోగులతో కిక్కిరిసిపోతోంది. అలా చికిత్సకు వచ్చిన వారిలో 50 మంది రోగులకు మాత్రమే అడ్మిషన్ దొరుకుతోంది. మరికొందరికి స్ట్రెచర్ సైతం దొరక పోవడంతో మిగతా రోగులు వెనుదిరగాల్సి వస్తోంది. సిబ్బంది అవసరం... అత్యవసర వైద్యసేవల విభాగంలో అవరానికి అ నుగుణంగా దిగువ స్థాయి సిబ్బంది లేక పోవడం తో వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా వెంటిలేటర్ల సంఖ్య కూడా తక్కువే. ఉన్నవాటిలో ఐదు మూలన పడ్డాయి. రోగుల సం ఖ్య కు అనుగుణంగా సిబ్బందిని పెంచడంతో పా టు మరో 10 వెంటిలేటర్లను అదనంగా సమకూర్చాల్సిన అవసరం ఉంది. నిమ్స్ యాజమాన్యం ఎమర్జెన్సీ వార్డులో రోగుల చికిత్సకు అవసరమైన అన్ని పరికరాలను అందుబాటులో ఉంచాలి. -
భట్టి దీక్ష భగ్నం, నిమ్స్కు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు సోమవారం ఉదయం భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా నిమ్స్కు తరలించారు. భట్టి విక్రమార్క బీపీ, షుగర్ లెవల్స్, ఎర్ర రక్తకణాలు పడిపోవడంతో తక్షణమే వైద్యం అందించాలని ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు ...ఆయనను అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించగా, వైద్యం చేయించుకునేందుకు భట్టి నిరాకరిస్తున్నారు. -
ట్రాలీల్లేక తిప్పలు!
సోమాజిగూడ: చేవెళ్లకు చెందిన కిషన్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్సనందించిన అనంతరం కుటుంబసభ్యులు బుధవారం నిమ్స్కు తీసుకొచ్చారు. అయితే ట్రాలీలు లేని కారణంగా అతడు దాదాపు గంటన్నర అంబులెన్స్లోనే ఉండాల్సి వచ్చింది. అక్కడి వైద్యులకు ఎంత మొరపెట్టుకున్నా ‘ట్రాలీలు ఖాళీ అయ్యే వరకు ఉండండి. లేని పక్షంలో వెళ్లిపోండంటూ’ చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక మిన్నకుండిపోయారు. ఇటాంటి సంఘటనలు నిమ్స్ అత్యవసర విభాగం వద్ద నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడనే కాదు నిమ్స్లో నిత్యం ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంది. నిన్నటి వరకు నీటి కొరతతో సర్జరీలు నిలిపివేసిన విషయం విదితమే. ఇక ఇప్పుడు ట్రాలీలు సరిపడా లేక రోగికి నిమ్స్ అత్యవసర సర్వీసు విభాగంలో అడ్మిషన్ దొరకడం లేదు. గతరెండు రోజులుగా నిమ్స్ అత్యవసర విభాగానికి రోగుల తాకిడి పెరిగింది. దూరప్రాంతాల నుంచి ఇక్కడికి చికిత్సకు వచ్చిన రోగులు గంటల తరబడి వారు వచ్చిన వాహనంలోనే ఉండాల్సి వస్తోంది. సకాలంలో రోగికి వైద్యం అందకపోవడంతో బంధువులు వైద్యులతో ఘర్షణకు దిగుతున్నారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన నిమ్స్ ఆసుపత్రిలో నిత్యం ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతోంది. దీనికి కారణం ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడమేనని తెలుస్తోంది. 30 ట్రాలీలు ఫుల్... ఎవరైనా ఆత్మహత్మలకు పాల్పడినా, ప్రమాదానికి గురైనా మరేదైనా సంఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందించి నిమ్స్కు తీసుకొస్తారు. అలా వచ్చిన వారంతా అత్యవసర విభాగంలో అడ్మిషన్ పొందుతారు. అడ్మిషన్ పొందిన రోగి సుమారు 10 రోజులు ట్రాలీపైనే ఉంటున్నాడు. ముందుగా అడ్మిషన్ పొందిన రోగి డిశ్చార్జ్ కాకపోవడంతో ఈ సమస్య తెలెత్తుతోంది. అత్యవసర విభాగానికి వచ్చిన రోగిని ట్రాలీలపై లోపలకు తీసుకెళ్తారు. సంబంధిత రోగిని ట్రాలీపైనే ఉంచి వైద్యం అందిస్తారు. అప్పటికే అక్కడ బెడ్పై చికిత్స పొందుతున్న రోగి డిశ్చార్జ్ అయితేనే ట్రాలీ నుంచి బెడ్డుకు మార్చుతారు. ఇతర ఆసుపత్రుల నుంచి వచ్చిన రోగులు ఎక్కువ రోజులు చికిత్స పొందడం, ఉన్న బెడ్స్, ట్రాలీలు ఖాళీ కాకపోవడంతో కొత్తగా వస్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర విభాగానికి రోజుకు సుమారు 30 మంది రోగులు వస్తుంటారు. అయితే మంగళవారం అత్యవసర సర్వీసు విభాగానికి వివిధ కారణాలతో సుమారు 50 మంది రోగులు వచ్చారు. దాంతో అక్కడనున్న ట్రాలీలు సరిపోకపోవడంతో మరో 20 ట్రాలీలను ఓపీ నుంచి తీసుకొచ్చారు. -
నిమ్స్లో నీటి చుక్క కరువాయె!
సాక్షి, సిటీబ్యూరో/సోమాజిగూడ: ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లోని రోగులకు నీటి కష్టాలు తప్పడం లేదు. దాహమేస్తే తాగేందుకే కాదు...సర్జరీ తర్వాత చేతులు కడుక్కునేందుకు నీరులేక పోవడంతో సోమవారం పలు విభాగాల్లో చికిత్సలు వాయిదా వేయాల్సి వచ్చింది. ఎండాకాలంలో నీటి అవసరాలపై అధికారులు ముందే ఓ అంచనాకు రాలేక పోవడం, సంపుల్లోకి చేరుతున్న నీటిని, వాటి నిల్వలను పరిశీలించక పోవడం, సరఫరా అయిన నీటిని కూడా సద్వినియోగం చేసుకోక పోవడమే ప్రస్తుత దుస్థితికి కారణం. నీటికోసం ఆస్పత్రి నెలకు రూ. 50 లక్షల చొప్పున ఏడాదికి రూ.ఆరు కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. కానీ రోగుల నిష్పత్తికి తగినంత నీటిని అందించలేక పోతోంది. ఫలితంగా రోగులే బయటి నుంచి బాటిళ్లను కొనుగో లు చేయాల్సి వస్తుంది. ఇలా ఒక ఐదు లీటర్లకు రూ. వంద వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆశతో వచ్చి..నిరాశతో వెనుతిరిగిన రోగులు నిజానికి శని, ఆదివారాల్లో రోగుల రద్దీ తక్కువగా ఉంటుంది. ప్రతి సోమవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది. జలమండలి నుంచి వచ్చే నీటి సరఫరా, ట్యాంకుల్లో నిల్వల పరిశీలన, వార్డులకు సరఫరా కోసం ఆస్పత్రిలో ఆరుగురు సిబ్బందిని నియమించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, నీటిసంపులోని నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించక పోవడం వల్ల ఆదివారం సాయంత్రం నుంచి కుళాయిల్లో నీటిసరఫరా నిలిచిపోయింది. ఈ విషయం తెలియక అప్పటికే సర్జరీలకు ప్లాన్ చేసుకున్న వైద్యులు, చికిత్సల కోసం ఉదయం ఐదు గంటలకే ఆపరేషన్ థియేటర్ల ముందుకు చేరుకున్నారు. తీరా చికిత్స తర్వాత వైద్య సిబ్బంది చేతులకు శుభ్రం చేసుకునేందుకు నీరు లేదని తెలిసి చికిత్సలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలా సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూ రో సర్జరీ, కార్డియాలజీ, తదితర విభాగాల్లో చిన్నాపెద్ద అన్ని కలిపి 60 సర్జరీల వరకు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం సగం మంది వైద్యులు వేసవి సెలవుల్లో ఉన్నారు. నీరులేక ఉన్నవాళ్లు కూడా సర్జరీలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఉగ్గబట్టుకోవాల్సిందే ఉస్మానియా, గాంధీ వంటి ఇతర ఆస్పత్రులతో పోలిస్తే నిమ్స్ కొంత భిన్నమైంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ మాత్రమే కాదు దీనికి చైర్మన్గా స్వయంగా సీఎం కొనసాగుతుంటారు. కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే..ఇక్కడ వైద్య ఖర్చులు తక్కువగా ఉండటం, మెరుగైన వైద్యసేవలు అందుతుండటం, అనేక మంది నిపుణులు అందుబాటులో ఉండటంతో రోగులు ఎక్కువగా ఇక్కడికే వస్తుంటారు. 1500 పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రి అవుట్పేషంట్ విభాగానికి రోజుకు సగటున రెండు వేల మందికిపైగా వస్తుంటారు. పదిహేను వందలకుపైగా రోగులు ఇన్పేషంట్లు చికిత్సలు పొందతుంటారు. ఒక్కో రోగికి ఒక సహాయ కుడు ఉంటారు. మూత్రశాలలు, మరుగుదొడ్లకు కూడా నీటి సరఫరా లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతు న్నాయి. జనరల్ వార్డుల్లోనే కాదు పేయింగ్ రూమ్ల్లోనూ ఇదే దుస్థితి. మూత్రశాలలు కంపుకొడుతుండటంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఉగ్గబట్టుకోవాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా రోగులు, వైద్యులు రోజంతా నీరు లేక ఇబ్బంది పడటంతో అధికారులు మేల్కొని సాయంత్రానికి సమస్యను పరిష్కరించారు. మంగళవారం నుంచి సమస్య రాకుండా చూస్తామని పేర్కొన్నారు. -
ప్రభుత్వాసుపత్రుల్లో సాయంత్రం ఓపీ సేవలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో సాయంత్రం ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. అవసరమైతే నిమ్స్ తరహాలో సాయంత్రం వచ్చే రోగుల నుంచి నామమాత్రంగా ఫీజు వసూలు చేసే అంశాన్నీ పరిశీలిస్తోంది. ఫలితంగా రోగులకు వైద్య సేవలు విస్తరించడంతో పాటు, వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసుపై దృష్టిపెట్టకుండా నివారించొచ్చని భావిస్తోంది. అంతేకాదు సాయంత్రం ఓపీ సేవలు విస్తరిస్తే అనేకమంది రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని సర్కారు భావిస్తోంది. ఏరియా, జిల్లా, బోధన ఆసుపత్రులన్నింటిలోనూ ఓపీ సేవలను సాయంత్రం విస్తరించే అంశంపై ఇటీవల వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రెండు షిఫ్ట్ల విధానం.. ఉన్న వనరులతోనే ప్రభుత్వ ఆసుపత్రు లను అత్యంత మెరుగ్గా నడపాలని సర్కారు యోచిస్తోంది. ప్రస్తుతం నిమ్స్లో మధ్యాహ్నం వరకు ఓపీ ఉంటుంది. సాయంత్రం మళ్లీ ఓపీ నిర్వహిస్తారు. ఉదయం ఓపీ ఉచితం. సాయంత్రం మాత్రం కన్సల్టెంటు ఫీజు కింద ప్రతి రోగి నుంచి రూ.500 వసూలు చేస్తారు. అందులో సగం అంటే రూ.250 డాక్టర్కు ఇస్తారు. అయితే మిగిలిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ మధ్యాహ్నమే ముగుస్తుంది. అందుకే సాయంత్రం ఓపీ సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. వాస్తవానికి ఉద్యోగుల కోసం సాయంత్రం ఓపీ తెరవాలని గతంలోనే నిర్ణయించారు. కానీ అది అమలు కావట్లేదని అధికారులు అంటున్నారు. ఇప్పుడు ఇతరులకూ సాయంత్రం వైద్య సేవలు అందించేలా, నామమాత్రపు ఫీజు వసూలు చేసేలా చేయాలని భావిస్తున్నారు. అయితే సాయంత్రం ఓపీ పద్ధతిని కొందరు వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే సాయంత్రం ప్రైవేటు ప్రాక్టీసు ఉన్న వైద్యులకు షిఫ్ట్ విధానం ఇబ్బందిగా మారనుంది. -
కార్లు నీడలో.. ‘అన్నపూర్ణ’ఎండలో!
సోమాజిగూడ :పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నపూర్ణ పథకం నిమ్స్ అధికారుల అనాలోచిత నిర్ణయంతో విమర్శలకు గురవుతోంది. వివరాలు.. రెండేళ్ల క్రితం నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో అన్నపూర్ణ పథకం క్యాంటిన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజుకు 720 మంది పేదలు భోజనం చేస్తుంటారు. మూడు నెలల క్రితం క్యాంటిన్ను పార్కింగ్ ఉన్న మరో ప్రాంతానికి తరలించారు. గతంలో చెట్ల నీడలో పేదల ఆకలి తీర్చే అన్నపూర్ణ క్యాంటిన్ ప్రస్తుతం మండుటెండల్లోకి మారడంతో అక్కడే కడుపు నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నిమ్స్లోని అధికారులు తమ వాహనాలను చెట్ల నీడలో పెట్టేందుకు.. ఇక్కడి ప్రైవేట్ క్యాంటిన్నిర్వాహకులతో మిలాఖత్ కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. -
ఫార్మా సిటీ.. వెరీ పిటీ
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగాన్ని విస్తరించేందుకు హైదరాబాద్ సమీపంలోని 18,304 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే తొలి సమీకృత ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం 2015లో ప్రకటించింది. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) పరిధిలో ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ‘హైదరాబాద్ ఫార్మా సిటీ లిమిటెడ్’పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కూడా ఏర్పాటు చేశారు. ప్రతిపాదిత ఫార్మా సిటీలో బాహ్య, అంతర్గత మౌలిక సౌకర్యాలు పూర్తి చేసి.. 2019 నాటికి ఔత్సాహిక ఫార్మా సంస్థలకు భూ కేటాయింపులు, అనుమతులు ఇచ్చేలా టీఎస్ఐఐసీ షెడ్యూలు రూపొందించింది. తొలి విడతలో 9,212 ఎకరాలకు గాను 6,719 ఎకరాలను సేకరించగా, మిగతా భూమిని సేకరించడంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టింది. తొలి విడత భూ సేకరణకు హడ్కో ద్వారా టీఎస్ఐఐసీ రూ.725 కోట్లు రుణం తీసుకోవడంతో పాటు, ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధుల కోసం ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)కు ప్రతిపాదనలు సమర్పించింది. మరోవైపు ఫార్మాసిటీ ప్రాజెక్టుకు నిమ్జ్ (జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి) హోదా ఇచ్చేందుకు కేంద్ర పరిశ్రమల శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహక, విధాన విభాగం (డిప్) 2017 ఏప్రిల్లో సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. నయా పైసా విదల్చని ‘డిప్’ హైదరాబాద్ ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా దక్కడంతో బాహ్య, అంతర్గత మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.6 వేల కోట్లు ఇవ్వాలంటూ కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహక, విధాన విభాగం ‘డిప్’కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు నాటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ వినతిపత్రం కూడా ఇచ్చారు. తొలి విడతలో రూ.1,500 కోట్లు విడుదల చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినా, రెండేళ్లుగా ఫార్మా సిటీకి కేంద్రం నుంచి నయాపైసా విదల్చలేదు. ఫార్మా సిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,395 కోట్లు కాగా, నిమ్జ్ హోదా ద్వారా కనీసం రూ.6 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులు సమకూర్చుకుని మౌలిక సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీంతో 2019 మే నాటికి ఔత్సాహికులకు ఫార్మాసిటీలో భూ కేటాయింపులు చేస్తామనే ప్రకటన ఇప్పట్లో ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. వడివడిగా టీఎస్ఐఐసీ అడుగులు... ఫార్మాసిటీ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్ఐఐసీ మొదట్లో వడివడిగా అడుగులు వేసింది. ఫార్మాసిటీని ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ సుమారు రూ.400 కోట్లతో రహదారుల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టింది. మరోవైపు పర్యావరణ అనుమతులు సాధించడంతో పాటు, సింగపూర్కు చెందిన సుర్బాన జురోంగ్ కన్సల్టెంట్స్ ద్వారా సమీకృత మాస్టర్ ప్లాన్ను రూపొందించింది. మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించిన ప్రణాళిక తుది దశలో ఉంది. సమీకృత కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు (సీఈటీపీ), జీరో లిక్విడ్ డిశ్చార్జి (జడ్ఎల్డీ) ప్లాంట్లను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ను 2017లో విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించి, 8 కంపెనీలను వడపోతలో ఎంపిక చేశారు. జహీరాబాద్ నిమ్జ్పైనా ప్రభావం... దేశ వ్యాప్తంగా మొత్తం 22 భారీ పారిశ్రామిక వాడలకు నిమ్జ్ హోదా దక్కగా, ఇందులో రాష్ట్రంలో రెండు ఉన్నాయి. ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా సూత్రప్రాయంగా దక్కగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్కు తుది ఆమోదం లభించింది. అయితే జహీరాబాద్ నిమ్జ్లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.3 వేల కోట్లివ్వాలని టీఎస్ఐఐసీ ప్రతిపాదించినా కేంద్రం నుంచి నిధులు విడుదల కావడం లేదు. దీంతో ఫార్మాసిటీ తరహాలో జహీరాబాద్ నిమ్జ్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. కేంద్రం నుంచి స్పందన కరువు... ఫార్మా సిటీకి నిమ్జ్ హోదా నేపథ్యంలో మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులివ్వాల్సిందిగా టీఎస్ఐఐసీ కేంద్రాన్ని కోరింది. జీరో లిక్విడ్ డిశ్చార్జి గ్రాంటు కోసం కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్ విభాగానికి ప్రతిపాదనలు సమర్పించింది. సీఈటీపీ నిధుల కోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. గ్రీన్క్లైమేట్ ఎన్విరాన్మెంట్ ఫండ్ ఇవ్వాలని కేంద్ర పర్యావరణశాఖకూ లేఖ రాసింది. అయితే ప్రతిపాదనలు పంపించి ఏళ్లు గడుస్తున్నా కేంద్రం నుంచి నిధుల విడుదల విషయంలో కనీస స్పందన కానరావడం లేదు. కేంద్రం నుంచి గ్రాంటు విషయంలో స్పష్టత లేకపోవడంతో సీఈటీపీ, జడ్ఎల్డీ ప్లాంట్లను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఎంపిక చేసిన 8 కంపెనీల వడపోత ప్రక్రియను టీఎస్ఐఐసీ నిలిపివేసింది. ఫార్మాసిటీ ప్రత్యేకతలు.. పెట్టుబడుల అంచనా: రూ.64 వేల కోట్లు ఫార్మా ఎగుమతులు (ఏటా): రూ.58 వేల కోట్లు ప్రత్యక్ష ఉపాధి: 1.70 లక్షల మందికి పరోక్ష ఉపాధి: 3.90 లక్షల మందికి కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు, మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్, క్వాలిటీ సర్టిఫికేషన్ ల్యాబ్, లాజిస్టిక్ హబ్, నైపుణ్య శిక్షణ కేంద్రం, ఎన్విరాన్ మేనేజ్మెంట్ సెల్, సమీకృత నివాస గృహాల సముదాయం, ఫార్మా ఉత్పత్తి యూనిట్లు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వీటితో పాటు ఫార్మా సిటీ ప్రాంగణంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్ఈఆర్) ఏర్పాటుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపారు. -
కీళ్ల నొప్పులు.. టోకెన్ తిప్పలు..!
కీళ్లనొప్పులతో బాధపడుతున్న రోగులకు నిమ్స్లో నిలువుకాళ్ల జపం తప్పట్లేదు. ఓపీ టోకెన్ కోసం అర్ధరాత్రి 2 గంటలకే ఆస్పత్రికి చేరుకుని క్యూలైన్లో నిలబడాల్సి వస్తోంది. నొప్పుల బాధను దిగమింగుకుని గంటల తరబడి క్యూలైన్లో నిలబడ్డా.. తీరా ఓపీ వేళకు నిరాశే మిగులుతోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు నిమ్స్ ఆస్పత్రికి కీళ్ల నొప్పులతో బాధపడే రోగులు రోజుకు దాదాపు 150 మందికిపైగా వస్తుంటారు. అయితే 60 మంది రోగులకు మించి వైద్య సేవలు అందించలేని పరిస్థితి అక్కడ నెలకొంది. కీళ్లనొప్పుల బాధితుల కోసం 1994లో ప్రత్యేకంగా రుమటాలజీ ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రొఫెసర్ జి.నరసింహులు ఆస్ట్రేలియాకు వెళ్లి ప్రత్యేక శిక్షణ పొంది వచ్చారు. అప్పటివరకు ప్రైవేటులో ఎక్కడా రుమటాలజీ వైద్యుల్లేకపోవడంతో ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. దీంతో 2001లో రుమటాలజీ విభాగం కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అయితే రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో మరింత మంది స్పెషలిస్టులను తయారు చేసేందుకు 2005లో డీఎం రుమటాలజీ కోర్సు ఏర్పాటు చేయగా, 2007లో దీనికి గుర్తింపు లభించింది. అనేక పరిశోధనలు, మెరుగైన వైద్యసేవలు, అత్యుత్తమ వైద్యవిద్య బోధనతో దేశంలోనే ఓ వెలుగు వెలిచిన రుమటాలజీ విభాగం ప్రస్తుతం కనీస వైద్యసేవలు అందించలేకపోతోంది. ఒక్కొక్కరూ వీడిపోవడంతో ప్రొఫెసర్ నరసింహులు కూడా పదవీ విరమణ చేసిన తర్వాత రోగుల నిష్పత్తికి తగ్గట్లు ఆ విభాగాన్ని అభివృద్ధి చేయకపోవడం, అంతర్గత కుమ్ములాటలు, నిమ్స్తో పోలిస్తే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వేతనాలు రెట్టింపు స్థాయిలో ఉండటంతో వైద్యులు ఒక్కొక్కరుగా ఆస్పత్రిని వీడారు. ఇప్పటివరకు ఇక్కడ 45 మంది వరకు రుమటాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్సు పూర్తిచేయగా, వీరి సేవలను వినియోగించుకోవడంలో పాలక మండలి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఉస్మానియా, గాంధీ సహా జిల్లా కేంద్రాల్లోనూ రుమటాలజీ వైద్యుల్లేకపోవడం, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈ చికిత్సలు ఖరీదు కావడం, కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే నిమ్స్లో మరింత మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. 2011 వరకు ఐదుగురు ఫ్యాకల్టీ వైద్యులు ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరికి పడిపోయింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ వేళలు కొనసాగుతుండటం, రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో రోజుకు సగటున 60 మందికి మించి చూడలేకపోతున్నారు. ఎలాగైనా ఇక్కడ వైద్యం చేయించుకోవాలనే ఆశతో అర్ధరాత్రి రెండు గంటలకే ఓపీ కౌంటర్కు చేరుకుంటున్నారు. తీరా ఉదయం టోకెన్లు దొరక్క తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్లే.. కీళ్లవాతం బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యుల్లేరు. ఢిల్లీలోని ఎయిమ్స్ సహా కింగ్జార్జ్, కోల్కతా, చండీగఢ్, వేల్లూర్, ముంబై, నిమ్స్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ల నుంచి ఏటా 45 మంది మాత్రమే సూపర్ స్పెషాలిటీ వైద్యులు బయటికి వస్తున్నారు. రుమటాలజీలో సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసిన వైద్యులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో భారీ డిమాండ్ ఉంది. వేతనం కూడా నిమ్స్లో కన్నా రెట్టింపు ఉంది. పాలకులు ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం, రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడం వల్ల నిమ్స్ సహా ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కొందరిపైనే భారం పడుతోంది. –ప్రొఫెసర్ జి.నరసింహులు, విశ్రాంత వైద్యుడు, నిమ్స్ -
లక్ష్మణ్ అరెస్ట్.. నిమ్స్కు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి నిమ్స్కు తరలించారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా లక్ష్మణ్ దీక్ష చేపట్టారని తెలిపారు. శాంతియుత వాతావరణంలో దీక్ష చేస్తున్న లక్ష్మణ్ని అరెస్ట్ చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద నిరసన చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ ముట్టడితో సహా రేపటి అన్ని కార్యక్రమాలు యధాతథంగా కొనసాగుతాయని మురళీధర్ రావు స్పష్టం చేశారు. -
లోగుట్టు ఏమైనట్టు?
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏదైనా ఊహించని ఘటన జరిగినప్పుడు హడావుడిగాకమిటీలు వేయడం.. తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు విచారణల పేరుతో సాగదీయడం వైద్య ఆరోగ్యశాఖలో పరిపాటిగా మారింది.ఒక వేళ ఫలానా ఘటనకు ఫలనా వైద్యుడు, అధికారి బాధ్యుడని కమిటీ రిపోర్టులో స్పష్టం చేసినా పట్టించుకున్నది లేదు.. చర్యలు తీసుకున్నదీ లేదు. రోగుల జీవితాలతో ఆడుకుంటున్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వమే ఆయా ఘటనలపై కమిటీలు సమర్పించిన నివేదికలను బుట్టదాఖలు చేస్తుండటంపై అనేక అనుమానాలు, సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడుపులో కత్తెర మరిచినా.. ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యుల నిర్వాకం ఇది. ఇటీవల ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళకు సర్జరీ చేశారు. తర్వాత తరచూ ఆమెకు కడుపునొప్పి వస్తుండటంతో మళ్లీ ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యలు సర్జరీ సమయంలో కడుపులో కత్తెర మరిచినట్లు గుర్తించి.. వెంటనే ఆమెకు మరోసారి సర్జరీ చేసి కడుపులోని కత్తెర తొలగించారు. దాంతో రోగికి ప్రాణాపాయం తప్పింది. ఈ అంశం పెద్ద సంచలనంగా మారడంతో ఆస్పత్రి పాలకవర్గం ముగ్గురు నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. కడుపులో కత్తెర మరిచిన ఘటనకు ఓ నర్సును బాధ్యురాలిని చేసి.. సర్జరీ చేసిన వైద్యులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ఆస్పత్రిలో ఇటీవల ఓ యువ వైద్యుడు మృతి చెందడం కలకలం సృష్టించింది. న్యూరాలజీ విభాగాధిపతి వేధింపులే ఇందుకు కారణమని, సంబంధిత వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని రెసిడెంట్ డాక్టర్లంతా ఆందోళనకు దిగారు. నిజనిర్థారణ కోసం నిమ్స్ డైరెక్టర్ ఓ అత్యున్నత స్థాయి కమిటీ వేశారు. సంబంధిత కమిటీ యువ వైద్యుడి మృతికి దారితీసిన అంశాలపై సమగ్ర రిపోర్టు అందజేసింది. రెసిడెంట్ వైద్యుల సంరక్షణ కోసం సంస్థాగతంగా చేపట్టాల్సిన పలు చర్యలను సూచించింది. కేసు నుంచి బాధ్యులను తప్పించడమే కాకుండా కమిటీ సిఫార్సుల్లో ఇప్పటి వరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. పిల్లలు తారుమారైనా..తల్లులు చనిపోయినా.. పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళకు సర్జరీ వికటించింది. దీంతో ఆమెను ఉస్మానియాకు తరలించడంతో ఆమెకు అక్కడి వైద్యులు ప్రాణం పోశారు. ఇక సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో తరచూ పిల్లలు మారుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇందుకు కారణమైన వైద్య సిబ్బందిపై ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకున్నది లేదు. నిలోఫర్ ఆస్పత్రిలో రెండున్నరేళ్ల క్రితం ఆరుగురు బాలింతలు మృతి చెందారు. ఈ అంశంపై అప్పట్లో అసెంబ్లీ వేదికగా పెద్ద దుమారమే రేగింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కమిటీ రిపోర్టు ఇచ్చినా.. ఇప్పటి వరకు సంబంధిత వైద్యులపై చర్యలు లేవు. పారాసిటమాల్కు బదులు ‘ట్రెమడాల్’ ఇటీవల నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో పెంటావాలెంట్ వ్యాక్సిన్ వేయించుకున్న శిశువులకు పారసిటమాల్కు బదులు ట్రెమడాల్ మాత్రలు ఇచ్చి ఇద్దరు శిశువుల మృతికి, మరో 37 మంది శిశువుల అస్వస్థతకు కారణమయ్యారు. అప్పట్లో ఈ అంశాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా సీరియస్గా తీసుకున్నారు. ప్రాధమిక నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ సహా ఏఎన్ఎంలు, ఫార్మసిస్ట్లను సస్పెండ్ చేశారు. వీరంతా కాంట్రాక్ట్ ఉద్యోగులే. తర్వాత పూర్తిస్థాయి దర్యాప్తుకు కమిటీ వేయగా నివేదిక అందజేసింది. వాక్సినేషన్పై సిబ్బందికి శిక్షణ ఇప్పించడంలోనూ, వాక్సినేషన్ తీరును పర్యవేక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏ ఒక్క రెగ్యులర్ అధికారిపై కానీ వైద్యుడిపై గానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. 16 మంది కంటిచూపు దెబ్బతిన్నా.. సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో చికిత్స వికటించి 16 మంది కంటిచూపు పోయింది. ఆర్ఎల్ కంపెనీ సరఫరా చేసిన సెలైన్ వాటర్తో కళ్లను శుభ్రం చేయడం వల్లే కంటిచూపు దెబ్బతిన్నట్లు స్పష్టమైంది. సెలైన్వాటర్తో కళ్లను శుభ్రం చేసి, రోగుల చూపును కోల్పోవడానికి కారణమైన వైద్యులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. వైద్యులపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందనే కారణంతో ఉద్దేశపూర్వకంగానే వైద్యుల తప్పిదాలను కప్పిపు చ్చుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఉస్మానియా ఆస్పత్రిలో ఒకరికి బదులు.. మరొకరు విధులు నిర్వహిస్తుండటం, చాలామంది ఉద్యోగులు ఆస్పత్రికి రాకుండానే వచ్చినట్లు సంతకాలు చేసి నెలసరి వేతనాలు పొందుతుండటంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. కమిటీ రిపోర్టు కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. -
ఎముకల వైద్యంలో నిమ్స్కు గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: బొక్కల దవాఖానాగా గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక నిమ్స్(నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) ఆస్ప త్రి అందుకు తగ్గట్లుగానే ఎముకల చికిత్సల విభాగంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఢిల్లీలోని ఎయిమ్స్కు ఏమాత్రం తీసిపోకుండా చికిత్సలు చేయడమే కాదు.. టాప్–5 ఆస్పత్రుల జాబితాలో చోటు సంపాదించింది. ఈ చికిత్సల్లో ఎయిమ్స్ మొద టిస్థానంలో ఉండగా, తమిళనాడులోని వేలూరు సీఎంసీ రెండోస్థానంలో, చండీగఢ్లోని పీజీఐ మూడోస్థానంలో నిలిచాయి. ఆ తర్వాతిస్థానంలో నిమ్స్ ఉన్నది. అత్యంత క్లిష్టమైన స్పైన్ స్కోలియోటిక్ (వెన్నెముక వంకరగా ఉండటం) చికిత్సల్లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఆర్థోపెడిక్ విభాగంలో గతేడాది 3 వేలకుపైగా సర్జరీలు నిర్వహించారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కేవ లం రెండుశాతం చికిత్సలు జరుగగా, 98 శాతం కేసులు ఇక్కడే జరుగుతున్నాయి. ఈ చికిత్సకు కార్పొరేట్ దవాఖానాల్లో రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుండగా నిమ్స్లో కేవలం రూ.1.5 లక్షలకే నిర్వహిస్తున్నారు. మోకాలు, కీళ్ల మార్పిడి చికిత్సలకు నిమ్స్లోని ఆర్థోవిభాగం ప్రత్యేక గుర్తింపు పొందింది. -
కడుపులో కత్తెర మరిచిపోవడం దురదృష్టకరం..
హైదరాబాద్ : మహిళ కడుపులో కత్తెర మరిచిపోయిన ఉదంతంపై నిమ్స్ డైరెక్టర్ మనోహర్ స్పందించారు. కడుపులో కత్తెర మరిచిపోయిన ఈ సంఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. హైదరాబాద్కు చెందిన మహేశ్వరి చౌదరికి గత ఏడాది నవంబర్ 2వ తేదీన సర్జరీ జరిగిందని, ఆపరేషన్ తర్వాత వైద్యులు ఆమె కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లు వేశారన్నారు. ఆ తర్వాత ఆమెకు కడుపు నొప్పి రావడంతో మళ్లీ నిమ్స్కు రాగా, మహేశ్వరికి ఎక్స్రే తీస్తే కడుపులో కత్తెరను గుర్తించామని నిమ్స్ డైరెక్టర్ తెలిపారు. (మహిళ కడుపులో కత్తెర మరిచిపోయారు..) మహేశ్వరికి వైద్యులు వీరప్ప, వేణు, వర్మ ఆపరేషన్ చేశారని, ఈ ఘటనలో ఆస్పత్రిలో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఘటనకు కారణమైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కాగా వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట మహిళ బంధువులు ఆందోళనకు దిగటమే కాకుండా, పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు కత్తెరను తొలగించేందుకు మహిళకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. -
మహిళ కడుపులో కత్తెర మరిచిపోయారు..
హైదరాబాద్ : చాలా సినిమాల్లో రోగి పొట్టలో దూది మర్చిపోవడం విన్నాం... కత్తులు మర్చిపోయి కుట్లు వేసేయ్యడం చూశాం. ఆఖరికి అదేదో సినిమాలో రోగి పొట్టలో వాచ్, సెల్ఫోన్లు మర్చిపోయిన సన్నివేశాలు.. ఆ తర్వాత బాధితుడు ఇబ్బంది పడే దృశ్యాలను చూసే ఉంటాం. అయితే తాజాగా నిమ్స్ ఆస్పత్రిలో కూడా అటువంటి సంఘటనే చోటుచేసుకుంది. నిమ్స్ వైద్యులు...ఓ మహిళా రోగికి ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరచిపోయారు. అయితే ఆ తర్వాత రోగి కడుపు నొప్పిగా ఉందని కుటుంబసభ్యులకు చెప్పడంతో..వారు వైద్యులను సంప్రదించారు. అసలు విషయం ఎక్స్రే తీసిన అనంతరం బయటపడటంతో వైద్యుల నిర్లక్ష్యంపై రోగి బంధువులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్కు చెందిన మహేశ్వరి (33) అనే మహిళ మూడు నెలల క్రితం హెర్నియా ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆ తర్వాత ఆమెకి తరచుగా కడుపు నొప్పి రావడంతో ఓ ప్రయివేట్ ఆస్పత్రిని ఆశ్రయించింది. అక్కడ ఆమెకు ఎక్స్రే తీయడంతో కడుపులో కత్తెర ఉన్నట్లు బయటపడింది. దీంతో బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నిమ్స్కు రాగా, ఆపరేషన్ చేసిన వైద్యులు ప్రస్తుతం అందుబాటులో లేరంటూ సమాధానం ఇవ్వడంతో ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహిరంచిన వైద్యులపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం మీడియాకు ఎక్కడంతో నిమ్స్ వైద్యులు బాధితురాలికి తిరిగి ఆపరేషన్ చేసేందుకు సిద్ధం అయ్యారు. -
నిమ్స్ ఇకపై ఎయిమ్స్
సాక్షి, హైదరాబాద్: 2019–20 విద్యా సంవత్సరం నుంచే హైదరాబాద్ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించటంతో ఇందుకు అనుగుణంగా బీబీనగర్ నిమ్స్ భవనాన్ని ఎయిమ్స్కు రాష్ట్ర అధికారులు అప్పగించారు. దీనికి ఇటీవల రూ.1028 కోట్ల నిధులకు కూడా కేంద్రం కేటాయించింది. 45 నెలల్లో ఎయిమ్స్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని సూచించింది.ఈ నేపథ్యంలో శుక్రవారం ఇందుకు సంబంధించిన భూ, భవన నిర్మాణం సహా అన్ని రకాల పత్రాలను ఎయిమ్స్కు అధికారులు అందజేశారు. ఇప్పటి వరకు నిమ్స్ ఆధ్వర్యంలో ఉన్న రూ.200 కోట్లకుపైగా విలువ చేసే రెండు బహుళ అంతస్తుల భవనాలు, 151 ఎకరాల భూమి సహా రూ.60 లక్షల విలువ చేసే లేబొరేటరీ, వైద్య పరికరాలు ఎయిమ్స్ అధీనంలోకి వెళ్లాయి. దీంతో నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆర్థికంగా నష్ట పోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు యాదాద్రిజిల్లా రెవెన్యూ అధికారులు ఇటీవల మరో 49 ఎకరాల భూమిని సేకరించి ఎయిమ్స్కు సమకూర్చారు. ఓపీ సేవలు కొనసాగుతాయి అనేక విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం 2016 మార్చిలో బీబీనగర్ నిమ్స్లో అవుట్ పేషెంట్ సేవలను ప్రారంభించింది. త్వరలోనే ఇన్ పేషెంట్ సేవలను ప్రారంభించాలని నిర్ణయిం చింది. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే కేంద్రం రాష్ట్రానికి ఎయిమ్స్ మంజూరు చేసింది. ఎయిమ్స్ సేవలు ప్రారంభమయ్యే వరకు ఓపీ సేవలు కొనసాగుతాయని బీబీనగర్ నిమ్స్ ఇన్చార్జి డాక్టర్ మహేశ్వర్రెడ్డి తెలిపారు. -
నిమ్స్ ఈఎండీలో ఎలుకల దండయాత్ర
సాక్షి, సిటీబ్యూరో: నిమ్స్లో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులు చికిత్స పొందే అత్యవసర విభాగం (ఈఎండీ)లో విచ్చలవిడిగా ఎలుకలు తిరుగుతున్నాయి. ఆక్సిజన్ పైప్లైన్లపై స్వైరవిహారం చేస్తున్నాయి. రోగులకు సంబంధించిన కీలక కేస్షీట్లు, మెడికల్ రిపోర్టులను పాడు చేస్తున్నాయి. రోగుల మధ్యే తిరుగుతున్న ఎలుకలు, బొద్దింకలు, ఇతర కీటకాలను ఎప్పటికప్పుడు నిర్మూలించాల్సిన పారిశుద్ధ్య విభాగం అసలు ఈ విషయాన్ని పట్టించుకోక పోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నల్లులు, ఎలుకలపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్స్ అత్యవసర విభాగంలో నిత్యం వంద మందికిపైగా చికిత్స పొందుతుంటారు. సాధారణ వార్డులతో పోలిస్తే అత్యవసర విభాగం(ఈఎండీ) కొంత భిన్నమైంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోగులను మినహా ఇతరులెవరినీ లోనికి అనుమతించరు. నిమ్స్లోనూ ఆంక్షలు ఉన్నప్పటికీ..రద్దీ ఎక్కువగానే ఉంటుంది. నిత్యం రోగులు, వారి బంధువులతో రద్దీగా ఉంటే అత్యవసర విభాగంలోనూ ఎలుకలు సంచరిస్తుండటం, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేసే వెంటిలేటర్లు, ఆక్సిజన్ పైపులపై తిరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అంతర్గత ఇన్ఫెక్షన్కు ఇదే కారణం ఆస్పత్రిలో పారిశుద్ధ్యం, పెస్ట్ కంట్రోల్ పనుల కోసం నెలకు రూ.రెండు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అయినా ఫలితం లేదు. ఎలుకలు, పరుపుల కింద నల్లులు, గోడలపై బల్లులు, బొద్దింకలు, ఇతర కీటకాలు సంచరిస్తూనే ఉన్నాయి. బ్యాక్టీరియా, వైరస్లు వ్యాపించి అంతర్గత ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. ఫలితంగా వారం రోజుల్లో కోలుకోవాల్సిన రోగులు పదిహేను రోజుల వరకు ఆస్పత్రిలోనే మగ్గాల్సి వస్తుంది. అంతర్గత ఇన్ఫెక్షన్ల బారి నుంచి బయటపడేందుకు ఖరీదైన యాంటీబయాటిక్స్ మందులను వాడాల్సిన దుస్థితి నెలకొంది. -
ఓటీ లైట్లు మళ్లీ ఫెయిల్
సాక్షి,సిటీబ్యూరో: నిమ్స్లో మరోసారి న్యూరో సర్జరీ చికిత్సలు నిలిచిపోయాయి. ఆపరేషన్ థియేటర్లో రెండు లైట్లు ఉండగా, ఇప్పటికే ఒక లైటు పనిచేయడం లేదు. బుధవారం రెండో లైటు కూడా వెలగకపోవడంతో సర్జరీలను నిలిపివేశారు. రూ.లక్షన్నర కూడా ఖరీదు చేయని ఈ లైట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సిన ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా బుధవారం శస్త్రచికిత్స కోసం ఆపరేషన్ థియేటర్ వద్దకు తీసుకొచ్చిన రోగులను తిరిగి వార్డులకు తరలించారు. ఇక్కడి న్యూరోసర్జరీ విభాగంలో నాలుగు ఆపరేషన్ థియేటర్ టేబుళ్లు ఉండగా, వీటిలో ఇప్పటికే రెండు (ఓటీ–3, ఓటీ–4) పనిచేయడం లేదు. తాజాగా మరో థియేటర్లో లైట్లు ఫెయిలవడంతో సర్జరీలను వాయిదా వేశారు. తలకు గాయాలై, మెదడులో రక్తం గడ్డకట్టిన బాధితులు, న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సమయానికి శస్త్ర చికిత్సలు చేయక పోవడంతో రోగులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సాంకేతిక నిపుణులను పిలిపించి సాయంత్రం ఆపరేషన్ థియేటర్లలో మరమ్మతులు చేయించారు. -
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, సిటీబ్యూరో: నల్లగొండ జిల్లా కొండారానికి చెందిన నిరుపేద రమేష్(19) శనివారం తెల్లవారు జామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రక్తమోడుతున్న క్షతగాత్రుడిని బంధువులు శనివారం ఉదయం ఎల్బీనగర్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యశ్రీ పథకంలో అడ్మిట్ చేయాల్సిందిగా కోరగా, సేవలు నిలిపివేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో వారు అడిగినంత చెల్లించి ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. మరోఘటనలో ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడిన చంపాపేటకు చెందిన వినోద్(35)ను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడా వారికి చేదు అనుభవమే ఎదురైంది. ఈ పరిస్థితి రమేష్, వినోద్లకు మాత్రమే కాదు.. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చిన ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు అనేకమందికి శనివారం ఎదురైన అనుభవం. నిమ్స్కు పెరిగిన రోగుల తాకిడి ప్రైవేటు ఆస్పత్రుల ఆరోగ్యశ్రీ బకాయిలు భారీగా పేరుకపోవడం, ప్రభుత్వం గత ఏడాది నుంచి పైసా విదల్చకపోవడంతో ప్రస్తుతం బకాయిలు రూ.1200 కోట్లకు చేరాయి. చికిత్స చేసిన 40 రోజుల్లోనే బిల్లు చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ.. ఏడాదిగా బకాయిలు చెల్లించక పోవడంతో ఆగ్రహించిన నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు నవంబర్ 20 నుంచి ఔట్ పేషంట్ సర్వీసులు, నవంబర్ 30 అర్ధరాత్రి నుంచి ఇన్పేషంట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. ఆ మేరకు తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు మినహా మిగిలిన ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్హోమ్లు శనివారం ఉదయం నుంచి ఇన్పేషంట్ సేవలను పూర్తిగా నిలిపివేశాయి. వివిధ ప్రమాదాల్లో గాయపడి రక్తమోడుతున్న క్షతగాత్రులు, గుండెపోటు బాధితులు, కాలేయ, మూత్ర పిండాల జబ్బులతో ఆస్పత్రులకు వస్తున్న ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు కనీస వైద్యం అందలేదు. మరోదారి లేక కొందరు అడిగినంత చెల్లించి చేరగా, మరికొందరు గాంధీ, ఉస్మానియా, నిమ్స్కు తరలిపోయారు. దీంతో ఆయా ఆస్పత్రులకు శనివారం ఆరోగ్యశ్రీ రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఇప్పటికే సాధారణ రోగులతో కిటకిటలాడుతున్న ఆయా ఆస్పత్రుల్లో తాజా కేసులకు కనీసం పడకలు కూడా దొరకని పరిస్థితి తలెత్తింది. 70 శాతం చికిత్సలు ప్రైవేటులోనే నగరంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాలో 240 ఆస్పత్రులు ఉండగా, వీటిలో అపోలో, యశోద, కేర్, కిమ్స్, స్టార్, సన్షైన్, కామినేని, మ్యాక్స్క్యూర్, కాంటినెంటల్ సహా 11 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ పరిధిలో ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ జాబితాలో ఉన్నాయి. నెట్వర్క్ పరిధిలోని మెజార్టీ ఆస్పత్రులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆస్పత్రులతో పోలిస్తే నగరంలోని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందే అవకాశం ఉండడంతో జిల్లాల నుంచి చికిత్స కోసం ఇక్కడికి వస్తుంటారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, సరోజినిదేవి, ఛాతి ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం, ఈఎన్టీ, సుల్తాన్బజార్, పేట్లబురుజు టీచింగ్ ఆస్పత్రులతో పాటు ఏడు ఏరియా ఆస్పత్రుల్లోనూ ఈ సేవలు అందుతున్నాయి. అయితే ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్లో 70 శాతం చికిత్సలు ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతుండగా, 30 శాతం చికిత్సలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. -
ఓపీ.. బీపీ!
సాక్షి, సిటీబ్యూరో: కీళ్లనొప్పులతో బాధపడుతూ చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రి ఓపీకి వెళ్లిన బాధితులకు బీపీ తప్పడం లేదు. క్లీనికల్ ఎగ్జామ్, వైద్య పరీక్షల పేరుతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. అసలే విపరీతమైన కీళ్లనొప్పులతో బాధపడుతున్న రోగులకు ఓపీ టోకెన్లు, ఇతర పరీక్షల పేరుతో గంటల తరబడి నిలబెడుతుండడంతో నొప్పులు భరించలేక అక్కడే కుప్పకూలుతున్నారు. ఒకప్పుడు బొక్కల దవాఖానాగా గుర్తింపు పొందిన నిమ్స్ రమటాలజీ(కీళ్లనొప్పులు) విభాగానికి రోజుకు సగటున 300మంది వస్తుంటారు. ఒకప్పుడు ఎముకలకు సంబంధించిన వ్యాధులు, కీళ్ల నొప్పుల చికిత్సల్లో దేశంలోనే ఓ వెలుగు వెలిగిన ఆస్పత్రి ప్రస్తుతం తన ఉనికినే కోల్పోతోంది. అంతర్గత కుమ్ములాటలతో ఇప్పటికే సీనియర్ వైద్యులంతా ఆస్పత్రిని వీడిపోవడం, ప్రస్తుత రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల కనీస సేవలు అందించలేని దుస్థితినెలకొంది. ఆస్పత్రిని వీడుతున్న వైద్యులు... నిజానికి నిమ్స్ ఆర్థోపెడిక్ చికిత్సలకు పెట్టింది పేరు. అరుదైన చికిత్సలు, పరిశోధనలతో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. సాధారణ పౌరులే కాదు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఇలా ఎవరికి ఏ సమస్య వచ్చినా చికిత్స కోసం ఇక్కడికే వచ్చేవారు. అంతర్గత రాజకీయాలతో ఇప్పటికే అనేక మంది వైద్యులు ఆస్పత్రిని వీడారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ శేషగిరిరావు, న్యూరో సర్జన్ డాక్టర్ సుభాష్కౌల్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ అజిత్కుమార్లు ఇటీవల పదవి విరమణ చేశారు. అంతర్గత విబేధాలతో ప్రముఖ హెమటాలజిస్టు డాక్టర్ నరేందర్ ఇటీవల ఆస్పత్రిని వీడిపోయారు. గతంలో న్యూరోసర్జన్ డాక్టర్ మానసపాణిగ్రహి సహా మరో న్యూరోసర్జన్ డాక్టర్ ప్రవీణ్కుమార్, ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ వీబీఎన్ ప్రసాద్ ఇష్టం లేకపోయినా ఆస్పత్రిని వీడిపోయినవారే. హృద్రోగ చికిత్సల్లో విశేష అనుభవంతో పాటు మంచి గుర్తింపు ఉన్న డాక్టర్ శేషగిరిరావు వెళ్లిపోవడంతో అప్పటివరకు ఆయన కోసం వచ్చిన వీఐపీ నగదు చెల్లింపు(పెయింగ్)రోగులంతా ఆయన్ను వెతుక్కుంటూ వెళ్లిపోయారు. అదే విధంగా న్యూరోసర్జరీ విభాగంలో డాక్టర్ సుభాష్ కౌల్ రోగులది అదే పరిస్థితి. డాక్టర్ నరేంద్ర ఆస్పత్రిని వీడడంతో హెమటాలజీ విభాగానికి వచ్చే రోగులకు కనీస వైద్యసేవలు అందకుండా పోయాయి. మధుమేహ చికిత్సల్లో మంచి గుర్తింపు పొందిన డాక్టర్ పీవీరావు పదవీ విరమణ పొందిన తర్వాత ఆ విభాగం జీవచ్ఛవంలా మారిపోయింది. సీనియర్లు లేని లోటును పూడ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. మెరుగైన వైద్య సేవలు పొందవచ్చేనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి ఆస్పత్రికి చేరుకుంటున్న రోగులకు కనీస వైద్యసేవలు కూడా అందకపోవడంతో వారంతా విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు బాటపట్టాల్సి వస్తోంది. ఆస్పత్రికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పెయింగ్ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గడానికి ఇదే కారణం. 55శాతం నుంచి 20శాతానికి... నాలుగేళ్ల క్రితం పెయింగ్ రోగులు 55 శాతం ఉంటే, ఆరోగ్యశ్రీ బాధితులు 45శాతం మంది ఉండేవారు. ప్రస్తుతం పెయింగ్ రోగుల శాతం పడిపోయింది. 80శాతం మంది ఆరోగ్యశ్రీ రోగులు ఉంటే, 20శాతం మంది మాత్రమే పెయింగ్ రోగులు వస్తున్నారు. ఫలితంగా రోజూవారీ ఆదాయం భారీగా పడిపోయింది. దీనికి తోడు ఈఎస్ఐ, సీజీహెచ్ఎస్, ఆర్టీసీ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ల వద్ద బకాయిలు కోట్లల్లో పేరుకుపోయాయి. పేరుకుపోయిన బకాయిలపై ప్రతి 15రోజులకోసారి సమీక్ష నిర్వహించి, వాటిని రాబట్టుకోవాల్సిన యాజమాన్యం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో వేతనాల చెల్లింపు, ఇతర నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేతనాల చెల్లింపులు, ఇతర ఖర్చుల కోసం నెలకు సుమారు రూ.12 కోట్లు అవసరం కాగా, రూ.9 కోట్లకు మించి రావడం లేదు. ఈ ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ఓపీ, వైద్య పరీక్షల చార్జీలను పెంచాల్సి వచ్చిందంటే ఆస్పత్రి ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
యాదాద్రికి 6 లేన్ల రోడ్డు
సాక్షి, యాదాద్రి : హైదరాబాద్–భూపాలపట్నం జాతీయ రహదారి–163 విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధిం చిన డీపీఆర్కు జాతీయ రహదారుల శాఖ ఆమోద ముద్ర వేసింది. భారతమాల పథకంలో భాగంగా విస్తరించనున్న ఈ రహదారిని హైదరాబాద్ నుంచి యాదాద్రి (33 కిలోమీటర్లు) వరకు 6 లేన్లుగా నిర్మించనున్నారు. అదనపు భూ సేకరణ లేకుండా రెండు వైపులా ప్రస్తుత రహదారుల హద్దులు, సర్వీస్ రోడ్లను కలుపుకుని రోడ్డును విస్తరించ నున్నారు. ప్రమాదాల నివారణకు బస్టాప్ల వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, ఎస్కలేటర్లు, మినీ అండర్పాస్లు నిర్మించనున్నారు. అన్నింటికీ అనుసంధానంగా.. హైదరాబాద్–వరంగల్ రోడ్డు విస్తరణలో భాగంగా మొదటి విడతలో హైదరాబాద్–యాదాద్రి వరకు 33 కిలోమీటర్ల నాలుగు లేన్ల రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం ఈ రోడ్డు మీదుగా శని, ఆదివారాల్లో 25 వేల వరకు.. మిగతా రోజుల్లో 20 వేల వరకు వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక రాయగిరి నుంచి వరంగల్ వరకు 90 కిలోమీటర్లకు పైగా రోడ్డును 4 లేన్లుగా అభివృద్ధి చేస్తున్నారు. అయితే యాదాద్రి పుణ్యక్షేత్రం, ఉమ్మడి వరంగల్ జిల్లా మీదుగా కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, మహా రాష్ట్రలకు రవాణా సౌకర్యం పెరిగింది. గోదావరి నదిపై ఏటూరు నాగారం, కాళేశ్వరం వద్ద నిర్మించిన వంతెనలతో హైదరాబాద్కు వాహనాల రాకపోకలు పెరిగాయి. రానున్న దసరా నాటికి యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రధానాలయం నిర్మాణం పూర్తయితే భక్తుల రద్దీతో వాహనాల సంఖ్య రెండింతలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానాలయం భక్తులకు అందుబాటులోకి వస్తే రోజూ లక్ష మంది వరకు భక్తులు రావొచ్చని, ఇందులో అధిక శాతం హైదరాబాద్ నుంచే వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అలాగే బీబీనగర్ వద్ద నిమ్స్, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి. యాదాద్రి నుంచి రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీటన్నింటికీ అనుసంధానంగా ఉండేలా రోడ్డును 6 లేన్లుగా విస్తరించనున్నారు. నిమ్స్ వద్ద ఎస్కలేటర్లు ప్రస్తుత నాలుగు లేన్ల రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ప్రమాదకరంగా ఉన్న కూడళ్ల వద్ద సెఫ్టీ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. జాతీయ రహదారి పక్కన ఉన్న బీబీనగర్లోని నిమ్స్ ప్రాంగణం వద్ద ఎస్కలేటర్ నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడే ఎయిమ్స్ ఏర్పాటు చేయబోతోంది. బీబీనగర్ పట్టణంలో పుట్ ఓవర్ బ్రిడ్జి, భువనగిరిలోని సింగన్నగూడెం వద్ద రూ. 6 కోట్ల వ్యయంతో మినీ అండర్పాస్ నిర్మించనున్నారు. కాగా, యాదాద్రి రోడ్డు మార్గంలో పలు చోట్ల భూ సేకరణ జరగాల్సి ఉండటంతో సర్వీస్ రోడ్ల నిర్మాణం నిలిచిపోయింది. దీంతో భూ సేకరణ వేగం పెంచాలని జాతీయ రహదారుల సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
హైదరాబాద్ నిమ్స్లో అర్ధరాత్రి అలజడి
-
నిమ్స్కు 399 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఖాళీగా ఉన్న 399 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. శాఖాపరమైన ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేయనున్నారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం భర్తీకి అనుమతిచ్చిన పోస్టులు.. ప్రొఫెసర్లు 14, అసోసియేట్ ప్రొఫెసర్లు 15, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 28, మెడికల్ సూపరింటెండెంట్ 1, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ 1, ఆర్ఎంవో 4, సీనియర్ రెసిడెంట్స్ 41, మెడికల్ ఆఫీసర్స్/జూనియర్ రెసిడెంట్స్ 26, స్టాఫ్ నర్సు 130, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ 4, ల్యాబ్ టెక్నీషియన్స్ 30, ఫార్మాసిస్ట్ 5, ఎక్స్ రే/సీ ఆర్ టెక్నీషియన్ 6, సీటీ టెక్నీషియన్ 4, ఎంఆర్ఐ టెక్నీషియన్ 4, ఈసీజీ టెక్నీషియన్ 6, సీఎస్ఎస్డీ టెక్నీషియన్ 8, అనెస్తీషియా టెక్నీషియన్ 9, చైల్డ్ సైకాలజిస్టు 1, హెల్త్ ఎడ్యుకేటర్ 1, ఆర్థోటిస్ట్ 1, ఆడియో విజువల్ టెక్నీషియన్ 1, రిసెప్షనిస్టు/బిల్లింగ్ 12, పీఆర్వో 1, ఏపీఆర్వో 2, జూనియర్ మెడికల్ రికార్డు ఆఫీసర్ 1, స్టాటిస్టీషియన్ 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 5, సెక్రరేటర్ అసిస్టెంట్ 5, పీఎస్ 10, అకౌంటెంట్ 4, సూపర్వైజర్ 4, హెల్త్ ఇన్స్పెక్టర్ 2, మెడికల్ సోషల్ వర్కర్ 2, డైటీషియన్ 1, సివిల్ డిపార్ట్మెంట్ ఏఈ 1, ఎలక్ట్రికల్ డిపార్టుమెంట్ ఏఈ 1, వర్క్షాప్ సూపరింటెండెంట్/ఏఈ మెకానికల్ 1, కంప్యూటర్ డివిజన్ ఇంచార్జి 1, అసిస్టెంట్ సిస్టం అనలిస్టు 1, కంప్యూటర్ అసిస్టెంట్ 1, బయోమెడికల్ ఇంజనీర్ 1, బయోమెడికల్ టెక్నీషియన్ 2. -
నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ కేబుల్ పనుల నిర్వహణ నేపథ్యంలో శ్రీనగర్కాలనీ రోడ్–నిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రెడ్ రోజ్ హోటల్ మధ్య మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ ఇన్చార్జ్ కొత్వాల్ డీఎస్ చౌహాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి గురువారం నుంచి 43 రోజుల పాటు అమలులో ఉంటాయని, వాహనచోదకులు సహకరిం చాలని ఆయన కోరారు. భారీ వాహనాల తో పాటు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులకు మాత్ర మే ఈ మళ్లింపులు వర్తించనున్నాయి. ⇔ సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు వైపు నుంచి పంజగుట్ట వైపు వచ్చే వాహనాలను కూకట్పల్లి వై జంక్షన్ నుంచి నర్సాపూర్ చౌరస్తా, బాలానగర్, ఫిరోజ్గూడ, బోయిన్పల్లి జంక్షన్, తాడ్బండ్ జంక్షన్, లాలమ్రాయ్, సీటీఓ, ప్యారడైజ్ చౌరస్తా, ఎంజీ రోడ్, రాణిగంజ్ జంక్షన్, కర్బాలా మైదాన్, అప్పర్ ట్యాంక్బండ్, అంబేడ్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్, సెక్రటేరియేట్ పాత రోడ్డు, ఏజీ ఆఫీస్, రవీంద్రభారతి మీదుగా పంపిస్తారు. ⇔ పటాన్చెరు, మియాపూర్, కూకట్పల్లి వైపు నుంచి అమీర్పేట, పంజగుట్ట మీదుగా ఏపీ, రాయలసీమల్లోని గమ్య స్థానాలకు వెళ్ళే ప్రైవేట్ బస్సులను ఎస్సార్నగర్లోని గౌతమ్ డిగ్రీ కాలేజీ పాయింట్ నుంచి కూకట్పల్లి వైపు పంపిస్తారు. ⇔ పటాన్చెరు, మియాపూర్, కేపీహెచ్బీ కాలనీ, కూకట్పల్లి వైపు నుంచి ఖైరతాబాద్ వైపు వచ్చే సిటీ బస్సులు, భారీ వాహనాలను ఎస్సార్నగర్ చౌరస్తా నుంచి కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్ బి సిగ్నల్, సోనాబాయ్ టెంపుల్, అమీర్పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్స్, డీకే రోడ్ జంక్షన్, గ్రీన్ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప ఐలాండ్, సోమాజిగూడ రోడ్, రాజ్భవన్ రోడ్ మీదుగా పంపిస్తారు. ⇔ ఇదే మార్గంలో వచ్చే ఆర్టీసీ బస్సులను అమీర్పేట జంక్షన్ నుంచి మాతా టెంపుల్, డీకే రోడ్ జంక్షన్, గ్రీన్ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప ఐలాండ్, సోమాజిగూడ రోడ్, రాజ్భవన్ రోడ్ మీదుగా పంపిస్తారు. ⇔ కృష్ణనగర్ నుంచి శ్రీనగర్కాలనీ రోడ్ మీదుగా ఖైరతాబాద్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను షాలిమార్ జంక్షన్ నుంచి శ్రీనగర్కాలనీ జీహెచ్ఎంసీ పార్క్, ఎంజే ఇంజినీరింగ్ కాలేజీ, నాగార్జున సర్కిల్, జీవీకే వన్ మాల్, తాజ్ కృష్ణ జంక్షన్, కేసీపీ జంక్షన్, చీఫ్ ఇంజనీర్స్ ఆఫీస్ మీదుగా మళ్లిస్తారు. ⇔ కృష్ణనగర్ నుంచి శ్రీనగర్కాలనీ రోడ్ మీదుగా బేగంపేట/ఎస్సార్నగర్ వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్ని షాలిమార్ జంక్షన్ నుంచి కృష్ణనగర్ చౌరస్తా, యూసుఫ్గూడ చెక్పోస్ట్, యూసుఫ్గూడ బస్తీ, కృష్ణకాంత్ పార్క్, కళ్యాణ్నగర్, వెంగళ్రావు నగర్, ఎస్సార్నగర్ మీదుగా పంపిస్తారు. -
ఓపీ..బీపీ!
ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో అవుట్ పేషెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రోగుల నిష్పత్తికి తగినన్ని రిజిస్ట్రేషన్ కౌంటర్లు లేకపోవడంతో ఒక్కో రోగి సుమారు గంటన్నర పాటు క్యూలో నిరీక్షించాల్సి వస్తోంది. మధుమేహంతో బాధపడుతున్న రోగులు ఎక్కువ సేపు క్యూలో ఉండి నీరసించిపోతున్నారు. నిమ్స్కు రోజుకు సగటున 1500 మంది రోగులు వస్తుంటారు. ఇన్ పేషెంట్ వార్డుల్లో నిత్యం 1300 మంది చికిత్స పొందుతుంటారు. ప్రస్తుతం ఆస్పత్రి పాతబిల్డింగ్లో ఆరు, మిలీనియం బ్లాక్లో మూడు, సూపర్స్పెషాలిటీ బ్లాక్లో ఆరు కౌంటర్లు ఉన్నాయి. రోగికి ఓపీకార్డు జారీ చేయాలంటే ముందు ఆ రోగికి సంబంధించిన పూర్తి వివరాలను కంప్యూటర్లోపొందుపర్చాల్సి ఉంటుంది. ఒక్కో కార్డు జారీకి కనీసం పదిహేను నిమిషాల సమయం పడుతోంది.దీంతో ఎక్కువ సేపు నిరీక్షించాల్సి వస్తోంది. కౌంటర్లు పెంచితేనే సమస్య పరిష్కారమవుతుంది. సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో అవుట్ పేషంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రోగుల నిష్పత్తికి తగినన్ని రిజిస్ట్రేషన్ కౌంటర్లు లేకపోవడంతో ఒక్కోరోగి సుమారు గంటన్నర పాటు క్యూలో నిరీక్షించాల్సి వస్తుంది. నిజానికి నగదు చెల్లింపు రోగులకు, రీయింబర్స్మెంట్(ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్, ఆర్టీసీ, ఈఎస్ఐ సహా ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన రోగులు)రోగులకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అందరికీ ఒకే కౌంటర్ ద్వారా ఓపీ, ఐపీ, మెడికల్ టెస్టుకు సంబంధించిన కార్డులు, బిల్లులు జారీ చేస్తున్నారు. నగదు చెల్లింపు రోగుల్లో చాలా మందికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత ఉన్నా..కేవలం నిమ్స్ వైద్యులపై ఉన్న నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. ఇలాంటి రోగులకు ప్రత్యేక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ యాజమాన్యం ఆరోగ్యశ్రీ రోగులతో సమానంగా నగదు చెల్లింపు రోగులను పరిగణిస్తుంది. ఆస్పత్రికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న వీరిని గంటల తరబడి క్యూలైన్లో నిలబెడుతుండటం వల్ల అయిష్టంగానే నిమ్స్ను వీడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నారు. రోగులకు సత్వర సేవలు అందాలన్నా..నిమ్స్ ఖజానా గలగలలాడాలన్నా..నగదు చెల్లింపు రోగుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ యాజమాన్యం ఇవేవీ పట్టించుకోవడం లేదు. అంతేకాదు రోగుల, పడకల నిష్పత్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఉన్న సెమిస్కిల్డ్ వర్కర్లు విపరీతమైన పనిభారాన్ని మోయాల్సి వస్తోంది. కొనుగోళ్లలో లోపించిన పారదర్శకత... స్వయం ప్రతిపత్తి కలిగిన నిమ్స్ ఆస్పత్రికి ప్రభుత్వం ఏటా తన వాటాగా సుమారు రూ.200 కోట్ల వరకు మంజూరు చేస్తుంది. ఏ విభాగంలో ఎవరెవరూ పని చేస్తున్నారు. ఎన్ని పడకలు ఉన్నాయి. ఎంత మంది చికిత్స పొందుతున్నారు. ఎంత మంది డిశ్చార్జ్ అయ్యాయి. వైద్య సేవల ద్వారా ఆస్పత్రికి ఎంత ఆదాయం వచ్చింది. మందులు, సర్జికల్ కిట్స్, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన యంత్రాల కొనుగోలుకు ఎంత ఖర్చు చేశారు? వగైరా వివరాల నమోదుకు పటిష్టమైన వ్యవస్థ లేక పోవడంతో రోగుల డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి. అంతే కాదు అవినీతి ఆరోపణల వల్ల ఒక్కోసారి నిజాయితీతో పని చేస్తున్న వైద్యులు సైతం మనస్తాపానికి గురికావాల్సి వస్తోంది. ఆస్పత్రి అభివృద్ధికి అవరోధంగా మారిన ఈ ఆరోపణలకు ‘హాస్పిటల్ ఇన్పర్మేషన్ సిష్టమ్’ ద్వారా చెక్ పెట్టవచ్చని భావించారు. ఆ మేరకు సి–డాక్ సహకారంతో రూ.17 కోట్లు ఖర్చు చేసి ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. రోగుల నిష్పత్తికి తగినన్ని కౌంటర్లు, సిబ్బంది లేక పోవడంతో ఓపీ, ఐపీ రిజిస్ట్రేషన్లకే పరిమితయమ్యారు. వైద్యపరికరాలు, మందుల కొనుగోలు, స్టోర్ రూమ్లో రోజూ వారీ నిల్వలను మాత్రం ఇప్పటికీ నమోదు చేయకపోవడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
కాన్వోకేషన్!
ప్రతిష్టాత్మక నిమ్స్ వైద్య విజ్ఞాన సంస్థ 14 ఏళ్లుగా స్నాతకోత్సవానికి నోచుకోవడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రే చాన్స్లర్గా వ్యవహరించే ఈ సంస్థలో ఏటా దాదాపు 400 మందికిపైగా విద్యార్థులు వివిధ మెడికల్ కోర్సులు అభ్యసిస్తుంటారు. వీరంతా కోర్సులు పూర్తయ్యాక కాన్వొకేషన్లో పట్టాలు, డిగ్రీలు అందుకోవాలని ఆశిస్తారు. కానీ ఇక్కడ స్నాతకోత్సవం నిర్వహించడం మర్చిపోతున్నారు. మూడేళ్ల సూపర్ స్పెషాలిటీ కోర్సులు సహా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కోర్సులు ఈ సంస్థలో నిర్వహిస్తున్నారు. చాన్స్లర్ సమయం ఇవ్వకపోవడం వల్లో..లేక ఆసక్తి లేకనో ఇక్కడ కాన్వొకేషన్ను నిర్వహించడం లేదు. సాక్షి, సిటీబ్యూరో: స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చాన్సలర్గా వ్యవహరించే ఇనిస్టిట్యూట్ అది. ఎందరో వైద్య విద్యార్థులు ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తారు. అలాంటి సంస్థ గత 14 సంవత్సరాలుగా స్నాతకోత్సవాలకు నోచుకోవడం లేదు. అంతే కాదు గత ఐదేళ్ల నుంచి పూర్తిస్థాయి డీన్ కూడా లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకప్పుడు మెరుగైన వైద్య విద్య, పరిశోధనలతో ఓ వెలుగు వెలిగిన ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ప్రస్తుతం స్నాతకోత్సవాన్ని కూడా నిర్వహించలేకపోతోంది. సమస్యలు చెప్పుకుందామన్నా వినే నాథుడు లేరంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిజానికి రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఛాన్సలర్గా వ్యవహరిసుంటారు. కానీ నిమ్స్కు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాన్సలర్గా, డైరెక్టర్ వైస్ చాన్సలర్గా వ్యవహరిస్తుంటారు. ఎగ్జిక్యూటివ్ బాడీ అధ్యక్షుడిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కొనసాగుతుండగా, మరో 15 మంది సభ్యులుగా ఉంటారు. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే మరింత మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు, వైద్య ఉన్నత విద్య, పరిశోధనలు వంటి అంశాలే ప్రధాన లక్ష్యంగా ఈ ఆస్పత్రి ఏర్పడింది. 1961 నుంచి 1976 వరకు నిజామ్స్ చారిటీ ట్రస్ట్ సహకారంతో నడిచింది.ఆ తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంది. మొదట్లో ఇక్కడ కేవలం ఎముకల వైద్యం మాత్రమే అందేది. ఆ తర్వాత క్రమంగా జనరల్ ఆస్పత్రిగా మారింది. కాన్వొకేషన్పై ఏదీ శ్రద్ధ? ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)కు ధీటుగా దీన్ని రూపొందించారు. ఇది పూర్తిగా స్వయంప్రతిపత్తిగల సంస్థ. దీనికి ప్రత్యేక పాలక మండలితో పాటు ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయి. తొలినాళ్లలో అరుదైన చికిత్సలు, పరిశోధనలతో ఓ వెలుగు వెలిగింది. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ కోర్సులు సహా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం 30పైగా విభాగాలు ఉండగా, వీటిలో మూడేళ్ల సూపర్స్పెషాలిటీ (పీజీ) కోర్సుల్లో సుమారు 280 మంది చదువుతున్నారు. వందకు పైగా నర్సింగ్ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి స్నాతకోత్సవం రోజు చాన్సలర్ చేతుల మీదుగా డిగ్రీ సహా అవార్డులను పొందడం ఓ గొప్ప అనుభూతిగా భావిస్తుంటారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా, ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు డైరెక్టర్గా కొనసాగినన్ని రోజులు నిర్విరామంగా స్నాతకోత్సవాలు జరిగాయి. అప్పట్లో ఇక్కడ చదువుకుని కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు చాలా ఆనందంగా ఫీలయ్యేవారు. ఇప్పుడు మాత్రం చాన్సలర్గా ఉన్న సీఎంలు సమయం ఇవ్వక పోవడం, డైరెక్టర్ ఇతర ఉన్నతాధికారులు శ్రద్ధ చూపకపోవడం వల్లే స్నాతకోత్సవాలు జరపడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఫ్యాకల్టీ, రెసిడెంట్ల సమస్యలు వినేవారేరి? వైద్య సీట్ల పెంపు, విద్యాభోధన సహా పరీక్షల నిర్వహణ, డిగ్రీల రూపకల్పనలో డీన్ పాత్ర కీలకం. 2014 నుంచి ఇప్పటి వరకు నిమ్స్కు పూర్తిస్థాయి డీన్ లేడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ఛార్జీలే డీన్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు పరిపాలనలో కీలకమైన ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ పోస్టు కూడా గత ఐదేళ్ల నుంచి ఖాళీగానే ఉంది. దీంతో ఆ పోస్టులోనూ ఇన్చార్జీలే ఉన్నారు. ఏదైనా సమస్య వస్తే..ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో ఒక డీన్ను కూడా నియమించుకోలేని సంస్థకు ఎంసీఐ అదనపు సీట్లను ఎలా మంజూరు చేస్తుందో అర్థం కావడం లేదని ఫ్యాకల్టీ అసోసియేషన్, రెసిడెంట్స్ అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి. ఎందరో ప్రముఖుల చేత ప్రశంసలందుకున్న నిమ్స్ పూర్వ వై భవాన్ని పునరుద్దరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిమ్స్ డైరెక్టర్ వీ విషయంలో శ్రద్ధ చూపాలంటున్నారు. వెంటనే ఖాళీగా ఉన్న డీన్ సహా అన్ని పోస్టులను భర్తీ చేయడంతో పాటు స్నాతకోత్సవాన్ని నిర్వహించి, విద్యార్థులకు డిగ్రీలు అందజేయాలని కోరుతున్నారు. -
వేధింపుల వల్లే ఆత్మహత్య : మీకు బిడ్డల్లేరా?
సాక్షి, హైదరాబాద్: నిమ్స్లో యువ వైద్యుడు శివతేజరెడ్డి ఆత్మహత్య ఘటనపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ డి.రాజారెడ్డి, వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్రెడ్డి, గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బీఎస్వీ మంజుల నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ.. న్యూరోసర్జరీ సహా అన్ని విభాగాల్లోనూ విచారణ చేపట్టనుంది. సోమవారం ఆయా విభాగాల్లో పనిచేస్తున్న రెసిడెంట్లతో కమిటీ సమావేశమై.. రెసిడెంట్ వైద్యుల పట్ల ఫ్యాకల్టీ అనుసరిస్తున్న తీరు తదితర అంశాలపై చర్చించనుంది. ఇదిలా ఉంటే తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, న్యూరోసర్జరీ విభాగం ఫ్యాకల్టీ వేధింపులే తమ కుమారుడి మృతికి కారణమని శివతేజరెడ్డి తల్లి కవిత ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని శుక్రవారం ఆమె నిమ్స్ డైరెక్టర్ను కలసి విజ్ఞప్తి చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, లేదంటే న్యాయ పోరాటానికి వెనుకాడబోమని హెచ్చరించారు. శివతేజ మృతిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న రెసిడెంట్లతో కలసి శుక్రవారం ఆమె నిరసన తెలిపారు. చిన్న తప్పు దొర్లితే చాలు.. ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో ఉన్నవాళ్లపై పనిభారం పెరుగుతోంది. ఇక ఆపరేషన్ థియేటర్లలో టేబుళ్లు, కుర్చీలు, గ్లౌజులు, మాస్కులే కాదు ఓటీలోకి వెళ్లేందుకు అవసరమైన డ్రెస్లు, చెప్పులు కూడా లేవు. పని ఒత్తిడి.. కనీస వసతులు లేకపోవడం.. కుటుంబ సభ్యులకు కనీస సమయం కేటాయించలేకపోతుండటంతో వైద్యులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. చికిత్సల్లో చిన్న తప్పు దొర్లినా సీనియర్ల నుంచి వేధింపులు తప్పడం లేదు. ఈ వేధింపులతో మనస్తాపం చెందే శివతేజరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. న్యూరోసర్జరీ విభాగంలోనే కాక.. అన్ని విభాగాల్లోనూ ఇదే దుస్థితి నెలకొందని పేర్కొంది. అయితే యువ వైద్యులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఫ్యాకల్టీ వైద్యులు కృషి చేస్తున్నారని, రోగులు చనిపోయినప్పుడు సీనియర్ ఫ్యాకల్టీలు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఈ సమయం లో రెసిడెంట్లే కాదు ఆ విభాగం మొత్తం ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోందని ఫ్యాకల్టీ అసోసియేషన్ స్పష్టం చేసింది. దీనికి మనస్తాపం చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. మా వద్ద ఆధారాలు ఉన్నాయి శివతేజను మానసికంగా ఇబ్బందులకు గురిచేసినట్లు మా వద్ద ఆధారాలున్నాయి. వాటిని కమిటీకి అప్పగిస్తాం. మీడియా సహా ఇతరులెవరిపైనా మాకు నమ్మకం లేదు. అందుకే ప్రస్తుతం వాటిని బయట పెట్టడం లేదు. ఒక్క న్యూరాలజీ విభాగంలోనే కాదు దాదాపు అన్ని విభాగాల్లోనూ వేధింపులు ఎదురవుతున్నాయి. భయంతో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. – డాక్టర్ శివానందరెడ్డి, రెసిడెంట్ల సంఘం అధ్యక్షుడు వేధింపుల వల్లే ఆత్మహత్య..‘మీకు బిడ్డల్లేరా..? వైద్య విద్య కోసం వచ్చిన నా బిడ్డను సూటిపోటి మాటలతో వేధించి చంపేస్తారా? న్యూరాలజీ ఫ్యాకల్టీకిది తగునా.. చదువు కోసం వచ్చిన వారిని ఆదరించాల్సింది పోయి.. తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తారా? ఫ్యాకల్టీతో పాటు ఎంఆర్ఐ టెక్నీషియన్లు కూడా నా బిడ్డను హేళన చేశారు. నాలాగా మరొకరికి పుత్రశోకం కలగకూడదనే న్యాయం పోరాటం చేస్తున్నాను. – శివతేజరెడ్డి తల్లి కవిత -
నిమ్స్లో ఇక వైద్యుల కరువు..
కొనఊపిరితో ఉన్న రోగులు సైతం అక్కడికి చేరుకోగానే లేచికూర్చొంటారని భరోసా. ఎంతటి మొండి రోగాలైనా ఇట్టే నయం అవుతాయని ఎందరికో నమ్మకం. అనేక పరిశోధనలు, అరుదైన వైద్యసేవలతో ఓ వెలుగు వెలిగిన ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ప్రస్తుతం తన ప్రాభవాన్ని కోల్పోతోంది. అంతర్గత కుమ్ములాటల వల్ల కొంత మంది, పదవీ విరమణతో మరికొంత మంది సీనియర్ వైద్యులు ఆస్పత్రిని వీడుతుండటమే ఇందుకు కారణం. ఇక్కడి వైద్య సేవలపై సంతృప్తి కలగక...మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతోద్యోగులు, సినీ, వ్యాపార ప్రముఖులు, మధ్య తరగతి పేయింగ్ రోగులు కూడా ఆస్పత్రికి దూరం అవుతున్నారు. ఫలితంగా ఒకప్పుడు కాసులతో గలగలలాడిన ఆస్పత్రి ఖజానా ప్రస్తుతం ఖాళీగా మారింది. ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులకు కూడా నిధులు సరిపోని దుస్థితి నెలకొంది. సాక్షి, సిటీబ్యూరో: నిమ్స్ ఆస్పత్రిలో సీనియర్ వైద్యుల కొరతతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం 34 విభాగాలు ఉండగా, ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ శేషగిరిరావు, న్యూరో సర్జన్ డాక్టర్ సుభాష్కౌల్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ అజిత్కుమార్లు ఇటీవల పదవీ విరమణ చేశారు. అంతర్గత విబేధాల వల్ల ప్రముఖ హెమటాలజిస్టు డాక్టర్ నరేందర్ ఇటీవలే ఆస్పత్రిని వీడారు. గతంలో న్యూరోసర్జన్ డాక్టర్ మానసపాణిగ్రహి సహా, మరో న్యూరోసర్జన్ డాక్టర్ ప్రవీణ్కుమార్, ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ వీబీఎన్ ప్రసాద్ ఇష్టం లేకపోయినా ఆస్పత్రిని వీడిపోయినవారే. హృద్రోగ చికిత్సల్లో విశేష అనుభవంతో పాటు మంచి గుర్తింపు ఉన్న డాక్టర్ శేషగిరిరావు ఉద్యోగ విరమణతో...అప్పటి వరకు ఆయన కోసం వచ్చిన వీఐపీ నగదు చెల్లింపు (పెయింగ్)రోగులంతా ఆయన్ను వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు. అదేవిధంగా న్యూరోసర్జరీ విభాగంలో డాక్టర్ సుభాష్కౌల్ సేవలందుకుంటున్న రోగులదీ అదే పరిస్థితి. డాక్టర్ నరేంద్ర ఆస్పత్రిని వీడటంతో హెమటాలజీ విభాగానికి వచ్చే రోగులకు కనీస వైద్యసేవలు అందకుండా పోయాయి. షుగర్ వ్యాధి చికిత్సల్లో మంచి గుర్తింపు పొందిన డాక్టర్ పీవీ రావు పదవీ విరమణ పొందిన తర్వాత ఆ విభాగం జీవశ్చవంలా మారిపోయింది. నిజానికి పదవీ విరమణ పొందిన ప్రముఖ వైద్యుల్లో చాలా మంది బయటికి వెళ్లడం కంటే..ఆ తర్వాత కూడా ఇక్కడే పనిచేయడానికే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇలాంటి వైద్యుల పదవీ కాలం మరికొంతకాలం పొడిగించి వారి సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ యాజమాన్యం దీన్ని పట్టించుకోవడం లేదు. కనీసం వారిని ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదు. సీనియర్ వైద్యులంతా ఆస్పత్రిని వీడుతుండటం, జూనియర్లు ఆ స్థాయిలో రోగుల అభిమాన్ని చూరగొనలేక పోతుండటం వల్లే వీఐపీ రోగుల సంఖ్య తగ్గుతోందని సీనియర్ వైద్యుడొకరు అభిప్రాయపడ్డారు. భారీగా పడిపోయిన ఆదాయం ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 1500–2000 మంది రోగులు వస్తుంటారు. ఇన్పేషంట్లుగా మరో 1500 మంది చికిత్స పొందుతుంటారు. నాలుగేళ్ల క్రితం పేయింగ్ రోగులు 55 శాతం ఉంటే, ఆరోగ్యశ్రీ బాధితులు 45 శాతం మంది ఉండేవారు. ప్రస్తుతం పెయింగ్ రోగుల శాతం పడిపోయింది. 80 శాతం మంది ఆరోగ్యశ్రీ రోగులు ఉంటే, 20 శాతం మంది మాత్రమే పేయింగ్ రోగులు వస్తున్నారు. ఫలితంగా రోజూవారీ ఆదాయం భారీగా పడిపోయింది. దీనికి తోడు ఈఎస్ఐ, సీజీహెచ్ఎస్, ఆర్టీసీ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ల వద్ద బకాయిలు రూ.కోట్లల్లో పేరుకుపోయాయి. బకాయిలపై యాజమాన్యం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో వేతనాల చెల్లింపు, ఇతర నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేతనాల చెల్లింపులు, ఇతర ఖర్చుల కోసం నెలకు సుమారు రూ.12 కోట్లు అవసరం కాగా, రూ.9 కోట్లకు మించి రావడం లేదు. ఈ ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ఓపీ, వైద్య పరీక్షల ఛార్జీలను పెంచాల్సి వచ్చింది. ఏడాది క్రితం వరకు రూ.50 ఉన్న ఓపీ ఫీజు ప్రస్తుతం రూ.100 పెంచారు. అదే విధంగా ఈవినింగ్ క్లినిక్ ఓపీ ఛార్జీలను కూడా రూ.300 నుంచి రూ.500 పెంచడంపై సర్వత్రా విమర్శలు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. -
నిమ్స్లో రేపు ఓపీ బంద్
హైదరాబాద్: గుడ్ఫ్రైడే సందర్భంగా నిమ్స్ ఆసుపత్రిలో శుక్రవారం ఔట్ పేషెంట్ విభాగం (ఓపీ) సేవలు అందుబాటులో ఉండవని, తిరిగి శనివారం తెరుస్తామని యాజమాన్యం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
‘టెస్టు’ పాసైతేనే... వైద్యం
ఈశ్వర్ప్రసాద్ హార్ట్ చెకప్ చేయించుకునేందుకు నిమ్స్కు వెళ్లాడు.. డాక్టర్ల సలహా మేరకు ఈసీజీ తీయించుకున్నాడు. అంతా నార్మల్గా ఉండటంతో హమ్మయ్యఅనుకున్నాడు. అతడి సహోద్యోగి కూడా హార్ట్ చెకప్ చేయించుకుంటానంటేజూబ్లీహిల్స్లోని ఓ హాస్పిటల్కు తోడుగా వెళ్లాడు. బిల్లు చూసి గుండె ఆగినంతపనైంది. నిమ్స్లో రూ.50లకే ఈసీజీ తీశారు. అక్కడ మాత్రం రూ.450 బిల్లు వేశారు. కేవలం నాలుగైదు కిలోమీటర్ల తేడాతో బిల్లు మాత్రం దాదాపు 10 రెట్లుపెరగడంతో అతడిలో ఆందోళన కలిగింది. సరే పరికరాల్లో ఏదైనా తేడా ఉందా అంటే అదీ లేదు.. ఇలాంటి ఘటనలు నగరంలో కోకొల్లలు.. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న డయాగ్నోస్టిక్ సంస్థలు.. కార్పొరేట్ పేరుతో హాస్పిటళ్లు ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: ఓ సాధారణ డయాగ్నొస్టిక్స్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సీబీపీ)కి రూ.150–200 ఖర్చు అవుతుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇదే పరీక్షకు రూ.700 పైగా వసూలు చేస్తున్నారు. చెస్ట్ ఎక్సరేకు బయట రూ.350 ఖర్చు అవుతుండగా, కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. తెల్లరేషన్ కార్డులేని రోగులకు గాంధీలో ఎంఆర్ఐ బ్రెయిన్ టెస్ట్కు రూ.2,000 ఛార్జీ చేస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.8,500 నుంచి 12,000 వరకు వసూలు చేస్తున్నారు. పదేళ్లతో పోలిస్తే నగరంలో ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల సంఖ్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరిగింది. అదేస్థాయిలో ఆయా టెస్టుల కోసం ఉపయోగించే మెషినరీ ధరలు కూడా భారీగా తగ్గాయి. అయితే వైద్య పరీక్షల ఖర్చులు తగ్గక పోగా, భారీగా పెరగడాన్ని పరిశీలిస్తే రోగ నిర్ధారణ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకే టెస్టు, ఒకే కంపెనీ మెషిన్, కానీ రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఛార్జీల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తుండటం గమనార్హం. నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు అందులో పనిచేసే వైద్యులకు టార్గెట్లు విధిస్తుండటంతో వారు అవసరం లేక పోయినా రోగనిర్ధారణ పరీక్షలు రాస్తున్నారు. సాధారణ జ్వరంతో బాధపడుతున్న రోగికి సీబీపీ, సీయూఎస్, ప్లేట్లెట్స్ కౌంట్ టెస్టులతో పాటు జబ్బుతో సంబంధం లేని పరీక్షలు రాస్తున్నారు. డాక్టర్ వద్దకు వెళ్లి సమస్య చెప్పగానే ముందుగా టెస్టులు చేయాలంటున్నారు. ఆ రిపోర్ట్ చూసిన తర్వాతే మందులు రాస్తున్నారు. ‘నేను కొంతకాలంగా ఛాతిలో మంట, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నాను. పంజాగుట్టలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తే.. అక్కడి వైద్యులు ఎండోస్కోపి, కొలనోస్కోపితో పాటు సమస్యతో సంబంధం లేని సీబీపీ, సీయూపీ, ఈసీజీ, టుడిఎకో వంటి టెస్టులన్నీ రాశారు. వైద్యులు సిఫార్సు చేశారు కదా! అని ఆయా పరీక్షలన్నీ చేయించుకుని రిపోర్టులు తీసుకెళ్లి సంబంధిత వైద్యుడికి చూపిస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మసాలా ఫుడ్ తగ్గిస్తే సరిపోతుంది’ అని చెప్పి పంపారని బంజారాహిల్స్కు చెందిన రఘురామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు ఇటీవల మోకాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి. సికింద్రాబాద్లోని ఓ ఆస్పత్రికి వెళ్తే స్పైన్ ఎక్సరే, సిటీస్కాన్, ఎంఆర్ఐ వంటి టెస్టులన్నీ రాసి రూ.50 వేలకుపైగా బిల్లు వేసి చేతి ఇచ్చారు. పరీక్షలన్నీ చేయించుకుని రిపోర్టులు తీసుకుని వైద్యుడి వద్దకు వెళ్తే ఏ సమస్య లేదు’ అని చెప్పి పంపాడు’ అని నల్లగొండకు చెందిన రవీందర్రెడ్డి పేర్కొన్నాడు. ‘రోగుల ఆర్థిక పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కానీ మేం మాత్రం ఏమి చేయగలం. ఆస్పత్రిలో వేతనం తీసుకుంటున్నందుకు యాజమాన్యం చెప్పినట్లు వినాల్సి వస్తోంది. అవసరం లేకపోయినా ఆస్పత్రి అవసరాల దృష్ట్యా రోగ నిర్ధారణ పరీక్షలు రాయాల్సి వస్తోంది. లేదంటే వైద్యులకూ పనిష్మెంట్లు తప్పడం లేదు’ అని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ సీనియర్ కార్డియాలజిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత సేవలకు తిలోదకాలు.. రోగ నిర్ధారణలో కీలకమైన ఎంఆర్ఐ, సిటీస్కాన్, ఆల్ట్రాసౌండ్, ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎక్సరే, తదితర మిషన్లలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రభుత్వం వీటికి రాయితీ కూడా ఇస్తోంది. మెషిన్లపై ప్రభుత్వం నుంచి రాయితీ పొందినందుకు ఒప్పందం ప్రకారం ఆస్పత్రుల్లో 20 శాతం ఉచిత సేవలు అందించాల్సి ఉండగా, నగరంలోని ఏ ఆస్పత్రి కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు. చివరకు వైద్య సేవల పేరుతో ఆస్పత్రులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి ఖరీదైన భూములు పొందిన వైద్యులు సైతం వీటిని అమలు చేయడం లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. వీధి చివరలోని డయాగ్నోస్టిక్ సెంటర్లోనూ.. ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఒకే కంపెనీకి చెందిన ఎంఆర్ఐ, సిటీస్కాన్, ఆల్ట్రాసౌండ్, ఎక్సరే యంత్రాలు ఉన్నా... టెస్టుల పేరుతో అవి వసూలు చేస్తున్న ఛార్జీల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న ఈ రోగ నిర్ధారణ ఖర్చులను ఎప్పటికప్పుడు నియంత్రించాల్సిన ప్రభుత్వం వీటిని పట్టించుకున్న దాఖలాలు మచ్చుకైనా కన్పించడం లేదు. -
నిమ్స్లో యువ వైద్యుడు ఆత్మహత్య
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో ఓ యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నరాలు, నాడీ వ్యవస్థపై పట్టున్న వైద్యుడు శివతేజరెడ్డి ఆదివారం డాక్టర్స్ క్లబ్లోని తన గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోగులకు వైద్య పరంగా చికిత్స అందిస్తూనే.. సామాజిక స్పృహతో వారికి కావాల్సిన సహాయసహకారాలను శివతేజరెడ్డి అందించేవాడు. తన సొంత డబ్బులు ఖర్చు చేసి వారికి అనేక సదుపాయాలను సైతం కల్పించాడు. అలాంటి వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడటంపై తోటి వైద్యులతో పాటు చికిత్స పొందుతున్న రోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే శివతేజరెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. నెఫ్రాలజీ నుంచి న్యూరాలజీకి.. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన ఎఫ్సీఐ రిటైర్డ్ ఉద్యోగి పులగం అప్పిరెడ్డి, కవిత దంపతుల కుమారుడు శివతేజరెడ్డి(31) ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, కింగ్జార్జ్ ఆస్పత్రిలో ఎండీ పూర్తి చేశాడు. విజయనగరంలోని మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(మిమ్స్)లో శివతేజరెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తూనే సూపర్ స్పెషాలిటీ కోర్సు చదివాడు. తిరుపతిలో నెఫ్రాలజీ విభాగంలో సీటు సంపాదించాడు. నెఫ్రాలజీ విభాగంలో 8 నెలలు పనిచేసిన తర్వాత సంతృప్తి చెందక.. మళ్లీ పరీక్ష రాసి నిమ్స్ న్యూరాలజీ విభాగంలో సీటు పొందాడు. రోగుల పరిస్థితి చూసి చలించిపోయి.. శివతేజరెడ్డి గత ఏడాది సెప్టెంబర్లో హైదరాబాద్ వచ్చాడు. అప్పటి నుంచి వారం క్రితం వరకు బయటే ఉంటూ నిమ్స్లో విధులకు హాజరయ్యేవాడు. ఆస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి చలించిపోన అతడు.. తన వేతనం నుంచి రూ.40 వేలు చెల్లించి జిరాక్స్ మిషన్, జనరల్ వార్డులో ఉన్న రోగులకు గీజర్, ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వహించే వైద్యులకు అవసరమైన స్లిప్పర్స్ను స్పాన్సర్ చేశాడు. రోగులకు వైద్య సేవలందిస్తూనే వారికి పలు రకాల సహాయసహకారాలు అందించేవాడు. తక్కువ కాలంలోనే సామాజిక స్పృహ ఉన్న వైద్యుడిగా గుర్తింపు పొందాడు. న్యూరాలజీ విభాగంలోని 24 మంది యువ వైద్యులకు చికిత్సలపరంగా ఎలాంటి అనుమానం వచ్చినా అతనే పరిష్కరించేవాడు. విధులు ముగిసిన తర్వాత సామాజిక మాధ్యమాలకు దూరంగా ఎక్కువ సమయం లైబ్రరీలోనే గడిపేవాడు. అయితే వారం రోజుల నుంచి శివతేజరెడ్డి ముభావంగా కనిపించినట్టు తోటి వైద్యులు చెపుతున్నారు. ఎప్పటిలాగే విధులు ముగించుకుని.. ఎప్పటిలాగే శనివారం విధులు ముగించుకుని డాక్టర్స్ క్లబ్లోని రూమ్ నంబర్ 307కు శివతేజరెడ్డి వెళ్లాడు. ఆదివారం ఉదయం 7 గంటలకు అతను విధులకు హాజరు కావాల్సి ఉంది. ఎనిమిది గంటలైనా శివతేజ రాకపోవడం.. ఫోన్ చేస్తే ఎత్తకపోవడంతో తోటి వైద్యుడికి అనుమానం వచ్చి రూమ్కు వచ్చాడు. లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో ఎంతసేపు పిలిచినా తలుపు తీయలేదు. దీంతో కిటికీ అద్దాలు తొలగించి చూడగా దుప్పటితో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. దీంతో అతను ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ మృతుడు వాడిన గదిని, ఫోన్ను పరిశీలించారు. ఆదివారం ఉదయం 5.20 వరకు శివతేజరెడ్డి వాట్సాప్ చూసినట్లు ఉందని, 5.30 గంటల తర్వాతే అతను చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా నిర్థారించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శివతేజరెడ్డి మృతదేహాన్ని నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. అమెరికా వెళ్లిన తల్లిదండ్రులు శివతేజరెడ్డి సోదరి అమెరికాలో ఉంటోంది. ఆమెకు నెలలు నిండటంతో తల్లిదండ్రులు గత జనవరిలో అమెరికా వెళ్లారు. వారు అమెరికా వెళ్లే ముందు శివతేజరెడ్డిని కలసి వెళ్లినట్లు వనస్థలిపురంలో ఉంటున్న అతని పిన్ని డాక్టర్ సరస్వతి మీడియాకు చెప్పారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన కొత్తలో తమ ఇంటికి తరచు వచ్చే వాడని, ప్రేమ వ్యవహారాలు, ఇతర వ్యాపకాలు లేవన్నారు. ఎవరినైనా ప్రేమిస్తే చెప్పాల్సిందిగా కోరామని.. అయితే అలాంటిదేమీ లేదని, ఆస్పత్రిలో పని ఒత్తిడి అధికంగా ఉందని, పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని చెప్పాడని వివరించారు. శివతేజరెడ్డి తల్లిదండ్రులు అమెరికా నుంచి రావాల్సి ఉంది. శివతేజరెడ్డి మృతి వైద్య రంగానికి తీరని లోటని నిమ్స్ డైరెక్టర్ మనోహర్, మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కసిరెడ్డి కృష్ణారెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ వెంకటపతి రాజు, డాక్టర్ సింధు పేర్కొన్నారు. -
కొత్తగా 27 పీజీ వైద్య సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ కొత్తగా 27 పీజీ వైద్య సీట్లు పెరిగాయి. సీట్ల పెంపుపై ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) వైద్య విద్య సంచాలకుడికి లేఖ రాసింది. గాంధీ వైద్య కళాశాల ఛాతీ విభాగంలో 1, అనస్తీషియా విభాగంలో 2, కాకతీయ వైద్య కళాశాల చర్మ వ్యాధుల విభాగం లో 1, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగంలో 5, రేడియాలజీలో 3, ఈఎన్టీలో 1, కంటి విభాగంలో 1, ఉస్మానియా వైద్య కళాశాల స్త్రీ వ్యాధుల విభాగంలో 4, ఈఎన్టీ విభాగంలో 3, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) అనస్తీషియా విభాగంలో 6 సీట్ల చొప్పున పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో్ల పెంచిన సదుపాయాలతోనే 27 సీట్లు పెరిగాయని వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. -
ఓపీ.. బీపీ..!
పంజగుట్ట: నిమ్స్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలంటే రోగులకు నరకం కనిపిస్తోంది. రోజురోజుకు రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా సిబ్బంది కొరత, ఎప్పుడో దశాబ్దాల కాలం నాటి కంప్యూటర్లు ఉండడంతో రోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కేవలం ఓపీ కార్డు తీసుకోవాలంటే రెండు గంటలు పడుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో సీ–డాక్ విధానం వచ్చినప్పటినుంచి ఓ రోగి ఓపీ కార్డు పొందాలంటే ఆధార్ కార్డు నంబర్, పేరు, ఊరు, వయస్సు, గతంలో ఏదైనా రోగం ఉందా, ఏ వైద్యుణ్ని సంప్రదించాలి తదితర 15 అంశాలు అందులో పొందుపర్చాలి. దీంతో ఒక్క కార్డు ఇచ్చేందుకు సుమారు 10 నిమిషాలు పడుతోంది. ఇంతలోనే క్యూ లైన్ పెరిగిపోతుంది. ఒక్కోసారి రోగుల మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. సీ–డాక్ విధానం మంచిదే అయినప్పటికీ అందుకు తగిన చర్యలు తీసుకోకపోవడంవల్లే ఈ పరిస్థితి వస్తోంది. గతంలో ఉన్న కౌంటర్లే కొనసాగించడం, దశాబ్దాల కాలంనాటి కంప్యూటర్లు కావడంతో అవి నిత్యం మొరాయించడం, ప్రింటింగ్ యంత్రాలు సరిగా లేకపోవడంతో ప్రింటింగ్ కనిపించకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలువురు రోగులు, ఉద్యోగులు అంటున్నారు. సీ–డాక్ విధానం వచ్చిన తర్వాత కనీసం మూడు నుంచి నాలుగు కౌంటర్లు పెంచాల్సి ఉండగా ఒక్క కౌంటర్ను కూడా అదనంగా పెంచలేదని, దీంతో ఉన్న ఉద్యోగులపైనే అధికభారం పడి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటు జర్నలిస్టు హెల్త్ స్కీం, ఎంప్లాయీస్ హెల్త్ స్కీంలలో చూపించుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ విపరీతమైన రద్దీ ఉండడంతో నిలబడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు రోగుల అవస్థలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు రోగులు అంటున్నారు. కేషీట్ ముణ్నాళ్ల ముచ్చటే.. ప్రైవేట్ ఆసుపత్రుల మాదిరిగా నిమ్స్లో కూడా ఓపీ కార్డుకు బదులుగా కేషీట్ ఇచ్చారు. దీన్ని మంత్రి లక్ష్మారెడ్డి అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. నెలరోజులు ఈ విధానం అమలు చేసి మళ్లీ పాతపద్ధతినే అవలంబిస్తున్నారని, కేషీట్లు ఇవ్వడంలేదని రోగులు అంటున్నారు. కేవలం ఒక చీటీ ఇచ్చి అదే ఓపీ కార్డుగా పరిగణిస్తున్నారు. గతంలో ఇచ్చిన ఓపీ కార్డులు ఎంతో ఉపయోగకరంగా ఉండేవని పలువురు రోగులు వాపోతున్నారు. -
నిమ్స్లో అత్యాధునిక ఐసీయూ
హైదరాబాద్: అగర్వాల్ సమాజ్ సహాయతా ట్రస్ట్ను ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదర్శంగా తీసుకోవాలని వైద్య, ఆరోగ్య మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.60 లక్షలతో నిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డ్ వద్ద ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్, విశ్రాంతి శాల, ప్రైవేట్ గదిని మంత్రి లక్ష్మారెడ్డితో పాటు పశు సంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అగర్వాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేశారని.. ప్రస్తుతం అది పేద రోగులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించిందని, అనేక ఆసుపత్రులు స్పెషాలిటీ స్థాయికి ఎదిగాయని అన్నారు. తద్వారా ఐపీ , ఓపీ సేవలు 50 శాతం పెరిగాయని తెలిపారు. నిమ్స్లో కూడా 500 బెడ్లు అదనంగా ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. అగర్వాల్ ట్రస్ట్ను ఆదర్శంగా తీసుకోవాలి మంత్రి తలసాని మాట్లాడుతూ అగర్వాల్ సహాయక్ ట్రస్ట్ను ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరంతోపాటు జిల్లాకేంద్రాల్లో కూడా సేవలు విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ ప్రతినిధులతో కలసి ముఖ్యమంత్రిని కలుస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.శాంతి కుమారి, కమర్షియల్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కరోడిమల్ అగర్వాల్, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
మూలకణ మార్పిడితో ఇద్దరికి పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్: మూలకణ మార్పిడి చికిత్సతో ఇద్దరికి పునర్జన్మను ప్రసాదించారు నిమ్స్ వైద్యులు. ఖరీదైన ఈ చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ జాబితాలో చేర్చి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని వి.లక్ష్మీప్రసన్న(21) కొంతకాలంగా రక్తసంబంధ సమస్యతో బాధపడుతోంది. చికిత్స కోసం 8 నెలల క్రితం ఆమె నిమ్స్ హెమటాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏఎంవీఆర్ నరేందర్ను సంప్రదించింది. ఇదే సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఎంఎస్సీ విద్యార్థి రామకృష్ణ(26) కూడా నిమ్స్కు వచ్చాడు. వైద్య పరీక్షల్లో వీరిద్దరూ ఎప్లాస్టిక్ ఎనీమియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. మూలకణాల మార్పిడి చికిత్స ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. మూలకణాలను దానం చేసేందుకు బాధితుల సోదరులు ముందుకు రావడంతో వారి నుంచి కణాలు సేకరించారు. ప్రాసెస్ చేసిన తర్వాత బాధితులకు ఎక్కించారు. సాధారణంగా ఇలాంటి చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.20 లక్షలకుపైగా ఖర్చవుతుంది. నిమ్స్లో 2008 నుంచే మూలకణాల మార్పిడి చికిత్స చేస్తున్నారు. ఇప్పటి వరకు 120 చికిత్సలు చేశారు. అయితే ఆయా వైద్య ఖర్చులను రోగులే భరించాల్సి వచ్చేది. ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు చికిత్సకు నోచుకోలేక మృత్యువాతపడుతుండటంతో హెమటాలజీ, మెడికల్ ఆంకాలజీ వైద్యుల సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం ఖరీదైన ఈ సేవలను ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ పథకాల్లో చేర్చింది. దీనిలో భాగంగా రూ.10 లక్షల వరకు వైద్య ఖర్చులు చెల్లిస్తోంది. లక్ష్మీప్రసన్నకు ఈహెచ్ఎస్ స్కీమ్ కింద, రామకృష్ణకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించినట్లు డాక్టర్ నరేందర్ స్పష్టం చేశారు. నిమ్స్ ఆస్పత్రిలో ఈ తరహా చికిత్సలు ఉచితంగా చేయడం ఇదే ప్రథమమని ఆయన వెల్లడించారు. -
దానం ఇంటివద్ద ఆత్మహత్యాయత్నం.. సీత మృతి!
సాక్షి, హైదరాబాద్ : సీత అనే మహిళ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు విడిచింది. ఎనిమిది రోజుల కిందట మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఇంటివద్ద సీత ఆత్మహత్యాయత్నం చేసుకుందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. సీత మృతి నేపథ్యంలో నిమ్స్ ఆస్పత్రి వద్ద ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వారి ఆందోళనకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. దానం నాగేందర్ ఇంట్లో మూడేళ్ల క్రితం చనిపోయిన గిరిప్రసాద్ భార్యే సీత. గిరిప్రసాద్ కరెంట్ షాక్తో చనిపోయినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గిరిప్రసాద్ కుటుంబాన్ని ఆదుకుంటానని దానం నాగేందర్ హామీ ఇచ్చారని, కానీ న్యాయం కోసం మూడేళ్లుగా దానం ఇంటిచుట్టూ సీత తిరుగుతున్నా.. ఆయన పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, సీత కుటుంబసభ్యుల ఆరోపణలను దానం నాగేందర్ ఖండించారు. -
బీబీనగర్లో నిమ్సే
సాక్షి, హైదరాబాద్: మన రాష్ట్రానికి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) మంజూరు కాదని తేలడంతో బీబీనగర్లోని క్యాంపస్ను రాష్ట్ర స్థాయి ఉత్తమ సంస్థగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ వైద్య సేవల సంస్థగా పేరొందిన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) బీబీనగర్ క్యాంపస్పై కదలిక వస్తోంది. వైద్యసేవల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకంకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రంగాపూర్లోని నిమ్స్ విశ్వవిద్యాలయం క్యాంపస్ పూర్తి స్థాయి కార్యకలాపాల నిర్వహణకు కొత్తగా 873 పోస్టులు అవసరమవుతాయని ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు గత నెల 28న కొత్తగా పోస్టులను మంజూరు చేసింది. కొత్తగా మంజూరైన పోస్టులు కావడంతో ఏ విధానంలో భర్తీ చేయాలనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి అనుసరించే ప్రక్రియపై అనుమతికోసం వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం ఆమోదం రాగానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీబీనగర్ నిమ్స్ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులలో 248 బోధన సిబ్బంది కేటగిరీవి ఉన్నాయి. మరో 625 బోధనేతర (వైద్య సహాయక, పరిపాలన, సాంకేతిక) పోస్టులు ఉన్నాయి. ఎయిమ్స్ తరహాలోనే నిమ్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని వైద్య శాఖ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో పేర్కొంది. ప్రతిపాదనల ప్రకారం బోధన సిబ్బంది పోస్టులను నిమ్స్ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. నిమ్స్ ఉన్నతస్థాయి కమిటీ బోధన సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తుంది. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య సంచాలకుడు, నిమ్స్ డైరెక్టర్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారి, రాష్ట్ర ప్రభుత్వం నియమించే మరో ఉన్నతాధికారి ఈ కమిటీలో ఉంటారు. మొత్తం బోధన సిబ్బంది పోస్టులను మెరిట్ ఆధారంగా ఈ కమిటీ భర్తీ చేస్తుంది. జనవరిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో... బీబీనగర్ నిమ్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మొత్తం 873 పోస్టులు 58 కేటగిరీలో ఉన్నాయి. వీటిని మినహాయించి 50 కేటగిరీలోని 625 పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) భర్తీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. -
మెడికల్ షాప్ పేరిట మోసం..రూ.5 లక్షల టోకరా
కరీంనగర్ : హైదరబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో మెడికల్ షాప్స్ ఇప్పిస్తానని అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని కరీంనగర్ రెండవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..కరీంనగర్లోని విద్యానగర్కు చెందిన బల్మురీ అనిల్ కుమార్ ఇంజనీరింగ్ చదువు ముగించుకుని,ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. కరీంనగర్లోని కాశ్మీరుగడ్డకు చెందిన న్యాలకొండ సుమన్తో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. అతని నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేద్దామనుకున్నాడు. హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో మెడికల్ షాప్స్ పెట్టుకోవడానికి టెండర్లు పిలిచారని, అందులో టెండర్ వచ్చి షాప్ పెట్టుకుంటే అధిక లాభాలతో పాటు ఉపాధి లభిస్తుందని, అలా రప్పించడానికి తనకు చాలా మంది రాజకీయ నాయకులు, అధికారులు తెలుసునని, అందుకు రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని మాయమాటలు చెప్పి నమ్మించాడు. అనిల్ అది నిజం అనుకుని డబ్బులను ఆన్లైన్ ద్వారా అతని బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేశాడు. తర్వాత టెండర్ ఎప్పుడు వస్తుందని పలు మార్లు అడుగగా రేపు మాపు అంటూ కాలం వెళ్లదీశాడు. అనుమానంతో అనిల్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్లి తెలుసుకోగా మోసపోయానని గ్రహించాడు. ఈ విషయమై నిందితుడిని నిలదీయగా డబ్బులు ఇస్తానని చెప్పి, అప్పటి నుంచి కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఎన్ని మార్లు ప్రయత్నించిన స్పందించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని కదలికలపై నిఘా ఉంచిన టాస్క్ ఫోర్స్ అధికారులు అతనిని ఎట్టకేలకు చాకచక్యంగా అరెస్ట్ చేసి, 2వ పట్టణ పోలీసుల సహాయంతో రిమాండ్కి తరలించారు. నిందితుడు ఇలా చాలా మందిని ఈ తరహాలో నమ్మించి, రూ.50 లక్షల వరకు మోసం చేశాడని తెలిసింది. ఇతనికి సహకారం అందించిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో టాస్క్ ఫోర్స్ అధికారాలు వివరాలు సేకరిస్తున్నారు. -
భోజ్యేషు బాబు
బజార్ఘాట్లోని నిలోఫర్ కేఫ్ అందరికీ తెలిసిందే. అయితే కేఫ్ యజమాని అనుముల బాబురావు సేవా దృక్పథం కొంతమందికే తెలుసు. ఎంతో కష్టపడి హోటల్లో క్లీనర్ నుంచి ఓనర్గా ఎదిగిన బాబురావు.. తనవంతుగా సమాజానికి సేవ చేయాలని సంకల్పించాడు. ప్రతిరోజూ 800 మందికి ఉచితంగా భోజనం అందజేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. బాబురావు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా దేగ్గం మండలం లగ్గాలా గ్రామం. మహారాష్ట్రలోని పెద్దనాన్న కిరాణా దుకాణంలో పనిచేస్తూ చదువుకున్నాడు. పదో తరగతిలో పుస్తకాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో ఆయన తండ్రి పాడి ఆవును విక్రయించి రూ.125 ఇచ్చాడు. అది చూసి బాబురావు ఎంతో చలించిపోయాడు. ఆర్థిక పరిస్థితిని తలుచుకొని బాధపడుతూ ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చేశాడు. మొదట ఓ బట్టల షాప్లో పనిచేశాడు. తర్వాత కింగ్కోఠిలోని రాక్ సీ హోటల్లో క్లీనర్గా చేరాడు. అక్కడి నుంచి నిలోఫర్కు వచ్చాడు. బాబురావు పనితనాన్ని మెచ్చిన హోటల్ యజమాని టీ మాస్టర్గా, మేనేజర్గా ప్రమోట్ చేశాడు. 1993లో ఏకంగా అదే హోటల్ను అద్దెకు తీసుకున్న బాబురావు... తర్వాత దాన్ని కొనుగోలు చేశాడు. బాబురావు చక్కటి టీ మాస్టర్.. ఆయన టీకి అందరూ ఫిదా అవ్వాల్సిందే. కష్టాలు కదిలించాయి... నిలోఫర్, ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రులకు వచ్చే వారి కష్టాలు బాబురావును కదిలించాయి. వారికి తనవంతుగా సేవ చేయాలన్న ఆలోచనతో ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశాడు. 15 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ ఉచిత భోజనం నేటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉదయం 500 మందికి టిఫిన్, మధ్యాహ్నం 300 మందికి ఉచితంగా భోజనం అందజేస్తున్నాడు. ఇందుకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, వారికి జీతాలు ఇస్తున్నాడు. క్యాన్స్ర్ చికిత్స పొందుతూ ఎవరైనా మృతి చెందితే స్వగ్రామానికి తరలించేందుకు ఆర్థిక సహాయం అందజేస్తున్నాడు బాబురావు. సిబ్బందికి గుర్తింపు... కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపునిస్తారు బాబురావు. ఆయన దగ్గర ఒక్కొక్కరు 15–20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. సిబ్బంది అందరికీ వంటల తయారీలో ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నారు. టీ, బిస్కెట్స్, కేక్లు, కేఫ్లో అందించే ప్రత్యేక రుచుల తయారీ గురించి నేర్పిస్తారు. ప్రావీణ్యమున్న వారికి పదోన్నతులు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడి విధానంపై ఆసక్తితో యశోద ఫౌండేషన్ 20 మందికి శిక్షణనిచ్చే బాధ్యతను బాబురావుకు అప్పగించింది. భవిష్యత్తులో ఆస్పత్రి.. వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తూ నమ్మకంగా పనిచేసినప్పుడే విజయం వరిస్తుంది. మేం తక్కువ ధరలోనే నాణ్యమైన టీ, బిస్కెట్స్ అందిస్తాం. కేఫ్ నిలోఫర్ ఉస్మానియా బిస్కెట్లు నగరంలోని 36 షాపుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ఆదాయంతోనే పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్లో ఓ ఆస్పత్రి నిర్మించాలని అనుకుంటున్నాను. – అనుముల బాబురావు -
7.5 కిలోల కాలేయ కణితి తొలగింపు
హైదరాబాద్: నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆస్పత్రి ప్రపంచంలోనే అరుదైన శస్త్రచికిత్సకు వేదికైంది. ఓ మహిళ కాలేయంలో 7.5 కిలోల బరువు, 45 సెంటీమీటర్ల పొడవున్న భారీ కణితిని వైద్యులు విజయవంతంగా తొలగించారు. కాలేయం నుంచి ఇంతపెద్ద కణితి తొలగించడం ప్రపంచంలో మొదటిసారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేసిన ఈ శస్త్రచికిత్స వివరాలను నిమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ బీరప్ప వెల్లడించారు. వరంగల్ జిల్లా ఖానాపేట మండలం బుజరావుపేటకు చెందిన వసంత 2011 నుంచి కడుపునొప్పితో సతమతమవుతోంది. గతంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నా ఫలితం కనిపించలేదు. కణితి రోజురోజుకూ పెరుగుతుండడంతో నడవడం ఆమెకు ఇబ్బందిగా మారింది. వసంత బరువు 54 కిలోలు కాగా కడుపులో ట్యూమర్ ఏడున్నర కిలోలు ఉండడంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. సమస్య తీవ్రం కావడంతో నాలుగు రోజుల క్రితం నిమ్స్లో డాక్టర్ బీరప్పను కలిశారు. వైద్యపరీక్షలు నిర్వహించగా కాలేయానికి కణితి ఉన్నట్లు తేలింది. సోమవారం డాక్టర్ బీరప్ప బృందం నాలుగు గంటలు కష్టపడి కణితిని విజయవంతంగా తొలగించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. గతంలో 35 సెంటీమీటర్ల కణితిని వైద్యులు తొలగించారని, ప్రపంచంలోనే మొదటిసారిగా ఇప్పుడు 45 సెంటీమీటర్ల ట్యూమర్ను తొలగించామని డాక్టర్ బీరప్ప పేర్కొన్నారు. ఈ శస్త్రచికిత్సను ప్రైవేట్లో చేయించుకుంటే సుమారు రూ.4 లక్షలు ఖర్చు అయ్యేదని చెప్పారు. -
అందుబాటులో ఉన్నా.. అందనంత దూరం
- ఆరోగ్యశ్రీపై రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో హైదరాబాద్లోని ఏపీ వాసులకు కష్టాలు - పెద్దలకు మాత్రమే అందుతున్న ‘నిమ్స్’ వైద్యసేవలు సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన వెంకటప్ప కుటుంబంతో సహా ఇటీవలే హైదరాబాద్కు వలస వచ్చాడు. మోతీనగర్లోని ఓ అపార్టుమెంట్లో వాచ్మన్గా పనిచేస్తున్నాడు. వారం కిందట ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ) కార్డు పట్టుకుని నిమ్స్కు తీసుకెళ్లారు. అయితే అనంతపురానికి చెందిన ఆరోగ్య శ్రీ కార్డు ఇక్కడ చెల్లదని, ఏపీ వెళ్లి వైద్యం చేయించుకోవాలని నిమ్స్ సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో వెంకటప్పకు ప్రాణం పోయినంత పనైంది. చివరకు అపార్టుమెంట్ వాసులే స్పందించి తలాకొంత సాయం చేసి వైద్యం చేయించారు. ఇది అతనొక్కడి సమస్యే కాదు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఎక్కడో ఓ చోట నిత్యం ఏపీ ప్రజలకు ఎదురవుతున్న దుస్థితి ఇది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావడం.. ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో రాష్ట్రానికి చెందిన అనేక మంది హైదరాబాద్ వెళ్లి బతుకు వెళ్లదీస్తున్నారు. ఏపీలోని స్వగ్రామాల్లో ఆరోగ్య శ్రీ కార్డులున్న ఇలాంటివారు హఠాత్తుగా జబ్బుల బారినపడితే.. అక్కడి ఆస్పత్రులు మొహం మీదే తలుపులేస్తున్నాయి. అలాగని అక్కడి ఆస్పత్రులను తప్పుబట్టడానికి లేదు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలే ఇందుకు కారణం. తమ రాష్ట్ర వాసులకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైదరాబాద్లో వైద్యమందించొద్దని రాష్ట్ర సర్కార్ ఆదేశాలివ్వడంతోనే అక్కడి ఆస్పత్రులు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. పెద్దలకు ఓకే.. ఏపీ నుంచి హైదరాబాద్కు వలస వెళ్లిన పేదలకు ఎన్టీఆర్ వైద్య సేవ కుదరదన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వంటి పెద్దలు మాత్రం నిమ్స్లో వైద్య సేవలు పొందేందుకు అనుమతించడం ద్వారా తన ద్వంద్వ నీతిని చాటుకుంది. ఈ తీరును వైద్యారోగ్య శాఖ అధికారులు సైతం తప్పుబడుతున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం ఆరోగ్యశ్రీని యథాతథంగా అమలు చేసి ఉండాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు. -
చిగురు నొప్పంటే.. దవడ తొలగించారు!
- 16 సార్లు ఆపరేషన్ చేశారు - వైద్యుల నిర్లక్ష్యంతో జీవితం నాశనమైపోయింది - అధికారులే అమెరికాకు పంపి వైద్యం చేయించాలి - నిమ్స్ పాత భవనం ఎక్కి యువకుడు హల్చల్ హైదరాబాద్: పంటి చిగురు నొప్పి ఉందని నిమ్స్కు వస్తే దవడ తొలగించారని, 16 సార్లు ఆపరేషన్ చేసి ప్రస్తుతం తమవల్ల కాదు అమెరికాకో, చైనాకో వెళ్లి వైద్యం చేయించుకోమ్మంటున్నారని ఓ బాధితుడు నిమ్స్ పాతభవనం ఎక్కి దూకేందుకు యత్నించాడు. వైద్యుల నిర్లక్ష్యంతో తన జీవితం నాశనమైందని, దానికి బాధ్యత వహిస్తూ వైద్యులే అమెరికాకు పంపి చికిత్స చేయించాలని రెండున్నర గంటలపాటు హల్ చల్ చేశాడు. నిమ్స్ ఉన్నతాధికారులు, పోలీసులు ఎంతమంది నచ్చజెప్పినా వినకపోవడంతో చివరికి చికిత్స అందిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు. అనంతరం వివరాలను బాధితుడు మీడియాకు వెల్లడించాడు. కుత్బుల్లాపూర్కు చెందిన శీలం ప్రదీప్ (27).. 2007లో పంటి చిగురు వద్ద ఉండే నరం వాచి తీవ్ర నొప్పి ఉండడంతో నిమ్స్కు వచ్చాడు. నిమ్స్ ప్లాస్టిక్ సర్జరీ విభాగ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించగా.. వికటించడంతో మరో శస్త్రచికిత్స నిర్వహించి దవడ, కింది దంతాలను తొలగించారు. కాళ్లు, చేతుల వద్ద కండరాలు తీసి దవడ వద్ద అమర్చేందుకు 16 సార్లు ఆపరేషన్ చేశారు. మొదట ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ జరిగినా తర్వాత మూడున్నర లక్షలకు పైగా ఖర్చయింది. ప్రస్తుతం వైద్యులను సంప్రదిస్తే మ్యాక్సో ఫేషియల్ సర్జరీ చేయాలని, దానికి ఇక్కడ చికిత్స లేదని చైనాకో, అమెరికాకో వెళ్లి ఆపరేషన్ చేయించుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారని ప్రదీప్ వాపోయాడు. తనకు హిమోగ్లోబిన్ లెవల్ కూడా పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంపై తాను న్యాయస్థానానికి కూడా వెళ్లినట్లు బాధితుడు తెలిపారు. భవనం పైనుంచి దూకేందుకు యత్నం... శనివారం ఉదయం 7:30 ప్రాంతంలో నిమ్స్ పాత భవనం 4వ అంతçస్తులోని ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి వచ్చిన ప్రదీప్, వార్డు లోపలి నుంచి రేయిలింగ్ ద్వారా భవనం పైకి ఎక్కి దూకేందుకు యత్నించాడు. గమనించిన సెక్యురిటీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న నిమ్స్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ అతన్ని సముదాయించే యత్నం చేశారు. తనకు లిఖిత పూర్వక హామీ కావాలని, ఎవరైనా దగ్గరకు వస్తే కిందకు దూకుతానని హెచ్చరించాడు. చొరవచూపిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ ... సాక్షి బంజారాహిల్స్ జోన్ ఫోటోగ్రాఫర్ దయాకర్.. అతను నిలబడ్డ చోటుకు సమీపం వరకు వెళ్లి సుమారు అరగంట పాటు మాట్లాడి సమస్య పూర్తిగా తెలుసుకుని ఆత్మహత్య సరికాదని కౌన్సెలింగ్ ఇచ్చాడు. అంతలోపు నిమ్స్ యాజమాన్యం వైద్యం చేయిస్తామని ఓ లేఖ తయారు చేసి తీసుకురాగా, దయాకర్ దాన్ని తీసుకుని అతనికి ఇచ్చాడు. నెమ్మదిగా మాటల్లో పెట్టి పట్టుకోగానే పోలీసులు వెళ్లి అతన్ని కిందకు తీసుకువచ్చారు. 7:30కి భవనం ఎక్కిన ప్రదీప్ 9:55కు కిందకు వచ్చాడు. పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు. -
నిమ్స్లో బిల్డింగ్ ఎక్కి రోగి హంగామా
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ రోగి శనివారం ఉదయం నిమ్స్ ఆస్పత్రిలో హంగామా చేశాడు. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయాలని, అలాగే అమెరికాలో ట్రీట్ మెంట్ చేయించుకునేందుకు ఎనిమిది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భవనం పై నుంచి కిందకు దూకుతాని బెదిరింపులకు దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, అతడిని ఎట్టకేలకు కిందకు దించారు. వివరాల్లోకి వెళితే... కుత్బుల్లాపూర్కు చెందిన ప్రదీప్(20) అనే యువకుడు ముఖంపై మచ్చలకు చికిత్స నిమిత్తం 2007 సంవత్సరం నుంచి నిమ్స్ వైద్యశాలకు వస్తున్నాడు. అయితే ఈ చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం కింద అవకాశం లేదని, పైగా భారత దేశంలో కూడా ఈ చికిత్స లేదని, అమెరికా వెళ్లాలని వైద్యులు చెబుతూ వస్తున్నారు. అయితే ఇన్నేళ్లుగా వైద్యులు తనను పట్టించుకోవడంలేదని, ఆరోగ్యశ్రీతో అయినా లేక అమెరికా పంపి అందుకు అయ్యే వైద్య ఖర్చులకు ఎనిమిది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం నిమ్స్ భవనంపైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ క్రమంలో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ దయాకర్ ద్వారా వైద్యులు ఒక లేఖను రూపొందించి భవనంపైకి పంపి అతనిద్వారా రోగికి దాన్ని అందజేశారు. దీంతో అతన్ని ఎలాగో కిందకు తీసుకురాగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కోసం పోలీసు స్టేషన్కు తరలించారు. ఉదయం 8 గంటల నుంచి 9.55 వరకు భవనంపైనే నిలబడి హల్చల్ చేశాడు. -
నిమ్స్లో కేకేను పరామర్శించిన కేసీఆర్
హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్లో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ సీనియర్నేత కే కేశవరావు సీఎం కేసీఆర్ పరామర్శించారు. సోమవారం నిమ్స్కు వచ్చిన కేసీఆర్.. కేకే ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను, నిమ్స్ సంచాలకులు డాక్టర్ మనోహర్ను అడిగి తెలుసుకున్నారు. కేకే మూత్ర సంబంధిత సమస్య, జ్వరంతో బాధపడుతూ నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. -
జేసీ... ఏంటి నీ పేచీ!
►దాడి కేసులో పైలా నరసింహయ్య లొంగుబాటు ► మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు రిఫర్ ► నిమ్స్కు పంపకుండా సూపరింటెండెంట్పై జేసీ ప్రభాకర్ ఒత్తిడి ► తనకు ప్రాణహాని ఉందంటూ ఆర్ఎంఓ ఎదుట పైలా కన్నీరు అనంతపురం: అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఆగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి వైద్యాధికారులు కూడా తలూపడం విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. పైలా నరసింహయ్య తాడిపత్రిలో కీలక నేత. ముందు నుంచి జేసీ సోదరులకు, పైలాకు మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత నెల 15న జేసీ వర్గీయుడైన ఓ వ్యక్తిపై పైలా దాడి చేసినట్లు తాడిపత్రి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 21న పైలా లొంగిపోయారు. అప్పటికే అనారోగ్యంగా ఉండడంతో కోర్టు ఆదేశాల మేరకు తాడిపత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సౌకర్యాలు లేవని 22న అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. గుండె స్పందన సరిగా లేకపోవడంతోపాటు అపెండిసైటిస్కు సంబంధించి తీవ్ర లక్షణాలున్నాయని డాక్టర్ మహేష్ ధ్రువీకరించారు. దీంతో గురువారం ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించాలని రాసిచ్చారు. ఓ పోలీస్ ఉన్నతాధికారి ద్వారా విషయం తెలుసుకున్న ప్రభాకర్ వెంటనే సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్కు ఫోన్ చేసి నిమ్స్కు పంపొద్దని ఒత్తిడి చేశారు. దీంతో పైలాను నిమ్స్కు తరలించొద్దని సూపరింటెండెంట్ ఆదేశాలిచ్చారు. ఈ విషయం తెలియగానే పైలా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆర్ఎంఓ ఎదుట పైలా కన్నీరు ఆస్పత్రి అధికారుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన పైలా నరసింహయ్య మధ్యాహ్నం నుంచి ఆహారం తీసుకోలేదు. సాయంత్రం ఐదు గంటలకు ఆర్ఎంఓ లలిత, డిప్యూటీ ఆర్ఎంఓలు డాక్టర్ విజయమ్మ, జమాల్బాషాలు పైలాతో మాట్లాడారు. తనకు అనారోగ్యంగా ఉన్నా ఎందుకు పంపించడం లేదని ప్రశ్నిస్తూ ఆయన కన్నీరుమున్నీరయ్యారు. పక్కా ప్లాన్తోనే ఇలా చేస్తున్నారని, తనకు జేసీ ప్రభాకర్రెడ్డితో ప్రాణహాని ఉందని ఆరోపించారు. అయితే రిఫర్ చేసిన లెటర్ ఉన్నా కూడా నిమ్స్కు ఆయనను రిఫర్ చేయలేదని సూపరింటెండెంట్ జగన్నాథ్ చెప్పడం గమనార్హం. -
నిమ్స్ ఆస్పత్రి దగ్గర భారీ వరద నీరు
-
కార్మికులకు మెరుగైన వైద్యానికి నిమ్స్తో ఒప్పందం
- కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడి - తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో 13 సంచార వైద్యశాలలు సాక్షి, హైదరాబాద్: కార్మికులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు త్వరలో నిమ్స్తో అవగాహన ఒప్పందాన్ని కుదు ర్చుకోనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఆది వారం ఈఎస్ఐసీ ప్రాంతీయ కార్యాలయం ఆవరణలో ఈఎస్ఐ మొబైల్ క్లినిక్లను ఆయ న జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ ఈఎస్ ఐ డిస్పెన్సరీలు లేని ప్రాంతాల్లో సేవలందిం చేందుకు మొబైల్ క్లినిక్లు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దేశంలో తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మొబైల్ క్లినిక్లను విని యోగిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో 8 మొబైల్ క్లినిక్లను ఆదిలా బాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్ల గొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ .. మిగతా ఐదింటిని ఏపీలోని చిత్తూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ పట్నం, పశ్చిమగోదావరి, నెల్లూరు, అనం తపురం జిల్లాల్లోనూ సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి మొబైల్ క్లినిక్లో ఒక వైద్యుడు, ఫార్మాసిస్టు, అటెండర్, డ్రైవర్తో పాటు అవసరమైన సామగ్రి, మందు లు అందుబాటులో ఉంటాయన్నారు. వాహ నం రోజుకు 2 ప్రదేశాల్లో సంచరిస్తుందని, కార్మికులకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహి స్తుందన్నారు. ప్రతి ప్రాంతాన్నీ వారంలో 2 రోజులు కవర్ చేస్తామన్నారు. సనత్నగర్లోని ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 150 పడకల స్థాయికి పెంచుతామన్నారు. ఈఎస్ ఐసీ వైద్య కళాశాలలో పడకల సంఖ్యను 500 కు పెంచనున్నట్లు తెలిపారు. ఈఎస్ఐసీ లబ్ధి దారుల వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచామని, మహిళా ఉద్యోగు ల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పొడిగించడంతో మహిళ లకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందన్నారు. జాతీయ ఓబీసీ కమిష న్కు చట్టపరమైన హోదా కల్పించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఓబీసీ పార్లమెంట్ సభ్యుల సంఘం చైర్మన్గా ఓబీసీలపై ఒక స్టేటస్ రిపోర్ట్ను సమర్పిం చానని, మండల్ కమిషన్ సిఫారసుల వెల్లడి తర్వాత కూడా వారికి అవకాశాలను నిరాకరిస్తున్న విషయాన్ని వివరించానన్నారు. తన నివేదికను ప్రధాని ఆమోదించారన్నారు. -
కల నిజమాయే..!
► జిల్లాకు నిమ్స్ తరహా ఆస్పత్రి ► ప్రజలకు అందనున్న మెరుగైన వైద్యసేవలు ► కరీంనగర్ చుట్టూ స్థలాలపై దృష్టి కరీంనగర్ హెల్త్ : జిల్లా ప్రజల కల నిజంకాబోతోంది. కరీంనగర్తోపాటు పరిసర ప్రాంతాల ప్రజల కు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం జిల్లాలో నిమ్స్(నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) తరహా ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని 350 పడకల ఆస్పత్రిని 500 పడకలకు మార్చడంతోపాటు కొత్తగా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిం ది. ఇంతేకాకుండా జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించాలనే లక్ష్యంతో మరో అడుగు ముందుకేసి 750 పడకలతో నిమ్స్ తరహాలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు సీఎం సూచనలతో ఆర్థికశాఖ 2017–18 బడ్జెట్లో నిధులు కేటాయించింది. ప్రజల దరికి మెరుగైన వైద్యం జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. గతంలో ఉన్న ఆస్పత్రిని బాగుచేయడంతోపాటు రూ.10లక్షలతో ఐసీయూను ఏర్పాటు చేసింది. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న 350 పడకల ఆస్పత్రికి తోడు 150 పడకల మెటర్నిటీ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తోంది. అనంతరం కళాశాలతోపాటు 500 పడకల మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఆలోచింది. స్థల సేకరణపై దృష్టి : ఆస్పత్రి ఏర్పాటుకు స్థలం సేకరణపై అధికారులు దృష్టి సారించా రు. కలెక్టరేట్ పక్కన గల హెలిప్యాడ్ స్థలం బాగుంటుందని గతంలోనే పరిశీలించారు. అదే సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనతో వీటిపై దృష్టిపెట్టలేదు. అయితే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అధికారులు స్థలాన్వేషణలో పడ్డారు. కరీంనగర్తోపాటు చుట్టూ పరిసర గ్రామాల్లో అనువైన స్థలాలు ఉన్నాయి. కలెక్టరేట్ పక్కన హెలిప్యాడ్గ్రౌండ్తోపాటు శాతవాహన విశ్వవిద్యాలయానికి చెందిన 40 ఎకరాల స్థలం ప్రస్తుతం ఖాళీగా ఉంది. దాదాపు 500 ఎకరాలు ఉన్న డెయిరీకి చెందిన స్థలం, చింతకుంటలోని ఆయుష్ కేంద్రం ఏర్పాటుకు పరిశీలించిన స్థలాలు కూడా అనువైనవిగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో హాస్పిటల్ నిర్మాణానికి అనువైన భూమితోపాటు బైపాస్రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి. నగరంలోని గోదాంగడ్డలోగల గోదాములకు భారీ వాహనాల రాకపోకలతోపాటు కిలోమీటర్ మేర చుట్టుపక్కల ఇళ్లలోకి లక్కపురుగులు వస్తున్నాయని వాటిని ఇక్కడి నుంచి తరలించాలని ఆప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆ గోదాంలను తరలించి అక్కడ నిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. అన్ని చికిత్సలూ ఇక్కడే నిమ్స్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం ద్వారా తీవ్రమైన జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, ప్రమాదాలు జరిగి కొన ఊపిరితో ఉన్న వారిని సైతం బతికించుకునే అవకాశాలు ఉంటాయి. ప్రమాదకరమైన వ్యాధులు, ప్రమాదాలు జరిగినప్పుడు మనకు వరంగల్లోని గాంధీ హాస్పిటల్ లేదంటే హైదరాబాదే దిక్కు. ఇప్పుడు అలాంటి వాటికి కాలం చెల్లనుంది. దీర్ఘకాలిక షుగర్, కిడ్నీ, కాలేయం సంబంధిత వ్యాధులే కాకుండా గుండె ఆపరేషన్లు, ప్రమాదాలు జరిగినప్పుడు మెదడు, నరాలు, ఎముకల చికిత్సలు ఇక్కడే జరుగుతాయి. హైదరాబాద్లో అందే వైద్యసేవలు కరీంనగర్లోనే అందుబాటులోకి రానున్నాయి. -
నిమ్స్లో రెండు కొత్త ఓపీ టవర్లు
⇒ కిడ్నీ టవర్కూ రంగం సిద్ధం ⇒ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: నిమ్స్లో రెండు కొత్త ఔట్ పేషంట్(ఓపీ) టవర్లు, కిడ్నీ టవర్ నిర్మాణం చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఉద్యోగులు, జర్నలిస్టుల ఉచిత ఆరోగ్య పథకం అమలులోకి రావడం.. చాలా మంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలేక.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలు చెల్లించలేక నిమ్స్ వైపు చూస్తున్నారు. దీంతో నిమ్స్కు వస్తున్న రోగుల సంఖ్య పెరిగింది. గతంలో ప్రతి రోజూ ఓపీ 1,500 కాగా.. ఇప్పుడు 2,500కు పెరిగింది. ఆరోగ్యశ్రీ ఓపీ గతేడాది 1.11 లక్షలు, ఇన్పేషెంట్(ఐపీ) రోగులకు 13,422 చికిత్సలు చేశారు. దీంతో నిమ్స్పై ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగుల కొత్త పేయింగ్ రూమ్స్ బ్లాక్లో 90 స్పెషల్ రూములను రూ.10 కోట్లతో ఆధునీకరించారు. రాబోయే రోజుల్లో పాత వాటి స్థానంలో 700 పడకలను ఆధునీకరించాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రూ.52 కోట్లతో అపెక్స్ డయాగ్నసిస్ పరీక్షా కేంద్రాలను మిలీనియం బ్లాక్ ఏడో అంతస్తులో ఏర్పాటు చేయనున్నారు. త్వరలో అవి రోగులకు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. రూ.2.5 కోట్ల కేంద్ర నిధులతో జీరియాట్రిక్(వయోవృద్ధుల) మెడిసిన్ విభాగాన్ని త్వరలో అందుబాటులోకి తేనున్నారు. రూ.150 కోట్లతో నెఫ్రో యూరో టవర్స్ నిర్మాణం చేపట్టే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతమున్న సీట్లకు అదనంగా మరో 10 సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అలాగే వచ్చే ఏడాది నుంచి మరో 8 కొత్త కోర్సుల కోసం ప్రణాళికలు రూపొందించింది. పెరుగుతున్న పనిభారం.. నిమ్స్లో ఇప్పటివరకు ఉన్న 1,140 పడకల సంఖ్యను 1,500కు పెంచారు. అయితే దానికి తగ్గట్లుగా వైద్య సిబ్బంది, నర్సుల నియమకాలు జరపలేదన్న విమర్శలున్నాయి. పడకలు పెరిగి సిబ్బంది సంఖ్య ఆ స్థాయిలో లేకపోవడంతో ఉన్నవారిపై భారం పడుతోంది. ఈ క్రమంలో పలు నియామకాలు జరపాలని నిమ్స్ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. -
మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలో నేరుగా నియామకాలు
⇒ 519 వైద్య పోస్టుల భర్తీకి ప్రతిపాదన ⇒ రంగం సిద్ధం చేసిన వైద్య ఆరోగ్య శాఖ సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలో వైద్య సిబ్బంది పోస్టులను నేరుగా భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. వైద్య పోస్టులను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేస్తుండగా మహబూబ్నగర్ మెడికల్ కాలేజీకి మాత్రం నేరుగా భర్తీ చేయాలని నిర్ణయిం చారు. గత ఏడాది ప్రభుత్వం ఆ కాలేజీకి పాక్షిక స్వయం ప్రతిపత్తి ఇచ్చిన నేపథ్యంలో నేరుగా నియామకాలు జరుపుకొనే వీలు కలిగింది. ప్రభుత్వంపై ఆధారపడకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెంటనే ఖాళీలను భర్తీ చేసుకోవచ్చు. మొదటి సంవత్సరం ప్రారంభంలో 462 మంజూరు పోస్టులుండగా మరో నాలుగేళ్ల కోసం అదనంగా 519 పోస్టులు ప్రతిపాదించారు. అందులో 118 టీచింగ్, 401 నాన్ టీచింగ్ పోస్టులున్నాయి. వీటిని వీలైనంత త్వరలో భర్తీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. 2016–17 విద్యా సంవత్సరం నుంచి మహబూబ్నగర్ మెడికల్ కాలేజీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రిటైర్ అయ్యే వరకు అక్కడే పనిచేయాలి ప్రస్తుతం నిమ్స్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థనే. కర్ణాటకలో అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అను బంధ బోధనాసుపత్రులు స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల్లో చేరే వారు చాలా మంది నెలలు గడ వక ముందే తమ ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ లేదా డిప్యుటేషన్ల కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో మారుమూల మెడికల్ కాలేజీ లకు వైద్యు లు, ప్రొఫెసర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. మెడికల్ విద్యార్థులు, బోధనాసు పత్రుల్లోని రోగులు ఇబ్బందులు పడక తప్పట్లేదు. మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలో ఇందుకు భిన్నంగా కొత్తగా ఎవరు ఉద్యోగంలో చేరినా రిటైర్ అయ్యేంత వరకు సంబంధిత కాలేజీ లేదా బోధనాసుపత్రిలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇతర చోట్లకు బదిలీలు ఉండవు. అందుకు సిద్ధమయ్యే వారే చేరాల్సి ఉంటుంది. దీంతో బదిలీల సమస్య ఉండకుండా పూర్తి స్థాయిలో ఈ కాలేజీపైనే దృష్టి సారించే వీలుంటుంది. -
10 నెలల చిన్నారికి స్వైన్ఫ్లూ
గాంధీలో ఐదుగురు, నిమ్స్లో నలుగురికి చికిత్స డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 9 మంది మృతి రోగులను పరామర్శించిన వైద్య, ఆరోగ్య మంత్రి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ఫ్లూ మళ్లీ కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 5,700 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో 70 మందికి ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణైంది. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందగా, కేవలం ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే నలుగురు చనిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. బీబీనగర్కు చెందిన.. స్వైన్ఫ్లూతో బాధపడుతున్న పది మాసాల మగశిశువును శనివారం గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పటికే పీడియాట్రిక్ విభాగంలో నగరానికి చెందిన మరో ఐదుగురు చిన్నారులు ఇదే లక్షణాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం వైద్యులు వీరి నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపారు. అయితే రిపోర్టు రావాల్సి ఉంది. వైద్యులు అనుమానిత ఫ్లూగా భావించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉస్మానియా ఐసోలేషన్ వార్డులో పని చేసే ఓ మహిళా ఉద్యోగికి స్వైన్ప్లూ లక్షణాలు పాసిటివ్ ఉన్నట్లు తేలింది. నిమ్స్లోని బాధితులకు మంత్రి పరామర్శ... రోజు రోజుకు స్వైన్ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గాంధీ జనరల్ ఆస్పత్రి సహా నిమ్స్, ఫీవర్, ఉస్మాని యా తదితర ఆస్పత్రుల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసింది. గాంధీతో పాటు నిమ్స్లో కూడా రోగులు చికిత్స పొందుతున్నారు. టాంజానియా నుంచి స్వైన్ఫ్లూతో వచ్చి నిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితురాలు అశ్విని సహా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న తిమ్మన్న, రవీందర్రెడ్డి, భరత్లను మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. శనివారం ఆయన నిమ్స్ను సందర్శించి ఆస్పత్రిలో స్వైన్ఫ్లూ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వైన్ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తలనొప్పి, జ్వరం, ముక్కు నుంచి నీరుకారడం, కీళ్లనొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే ఫ్లూ లక్షణాలుగా అనుమానించి వైద్యులను ఆశ్రయించాలని సూచించారు. పెరిగిన మాస్క్ల అమ్మకాలు స్వైన్ఫ్లూ మరణాలు సంభవించడంతో నగరంలో మాస్క్ల అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్, పేట్ల బురుజు తదితర ఆస్పత్రుల ప్రాంగణాల్లో రోగులు, రోగి సహాయకులు మాస్క్లు తప్పనిసరిగా ధరిస్తున్నారు. ఎన్95 మాస్క్లు రూ.60 నుంచి రూ.100 వరకు ఉండగా, అదే సాధారణ మాస్క్ రూ.5కే మార్కెట్లో లభ్యం అవుతుండడంతో వాటినే ప్రజలు విరివిగా వినియోగిస్తున్నారు. -
లెస్ టెండర్లతో గోదాముల నిర్మాణంలో రూ.150కోట్ల ఆదా
మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఆహారధాన్యాల నిల్వకోసం 330 ప్రాంతాల్లో గోదా ములను మంజూరు చేశామని, ఇందులో 321 ప్రాంతాల్లో గోదాముల నిర్మాణ పనులను ప్రారంభించామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. రూ.1024.50 కోట్ల నాబార్డు రుణంతో మొత్తంగా 17.07లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో వీటిని చేపట్టామని వెల్లడించారు. గోదాములకోసం ఖర్చు చేస్తున్న ప్రతీ పైసాకు ఆన్లైన్ టెండర్లు పిలిచామని, అత్యంత పారదర్శకంగా ఈ జరిగిన టెండర్ల కారణంగా 11.5 లెస్తో మొత్తంగా రూ.150 కోట్ల మేర ఆదా అయిందని తెలిపారు. సోమవారం సభ్యులు మర్రి జనార్దన్రెడ్డి, బాజిరెడ్డి, కోమటిరెడ్డి, రేవంత్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. నిమ్స్లో అవినీతిపై చర్యలు: మంత్రి లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిమ్స్లో అవినీతి జరగలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యులు సంపత్కుమార్, వంశీచంద్రెడ్డి, రామ్మోమన్రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కోర్టు తదుపరి ఉత్తర్వులను అనుసరించి వీరిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా,అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
నిమ్స్లో ‘చిల్లర’ మాయం!
రోగులు చెల్లించిన 10 లక్షలు మాయమైనట్లు సమాచారం హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో రోగులు చెల్లిస్తున్న చిన్న నోట్లు మాయమవుతున్నాయి. ఓ ఉన్నతాధికారి తన అధికారంతో అతనివద్ద ఉన్న పెద్ద నోట్లను క్యాష్ కౌంటర్ల లో ఉంచి.. రూ.100, రూ.50 నోట్లను పెద్ద మొత్తంలో తీసుకెళ్లినట్లు ఆరోపణలు వస్తు న్నాయి. ఇలా ఇప్పటివరకూ రూ.10 లక్షల వరకు చిల్లర మాయమైనట్లు సమాచారం. నల్లధనం అరికట్టేందుకు ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో అవినీతి అధికారు లు వారి వద్ద ఉన్న దొంగ సొమ్మును ఎలా వైట్ చేసుకోవాలఅన్న ఆలోచనలో పడ్డారు. నిమ్స్లోని ఓ ఉన్నతాధికారి దీనికి ఆసుపత్రి నే వాడుకుంటూ తన సొత్తును వైట్ చేసుకుం టున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిమ్స్లో పాత రూ.500, రూ.1,000 నోట్లను చలామణి చేస్తున్నారు. ఉదయం పూట ఓపీకి రూ.50, చిన్న వైద్య పరీక్షలకు రూ.100,రూ.200 మాత్రమే అవుతుండడం, ఎక్కువమంది పేదలు ఆసుపత్రికి వస్తుం డడంతో రూ.500, రూ.వెరుు్య నోట్లకన్నా చిల్లరే ఎక్కువగా తీసుకువస్తారు. పెద్ద నోట్లు క్యాష్ కౌంటర్లో... క్యాష్ కౌంటర్లో ఉన్న చిల్లరను ఓ అధికారి తన వద్ద ఉన్న బ్లాక్మనీని ఆ స్థానంలో ఉంచి రూ.100, రూ.50 నోట్లను తీసుకెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం సుమారు రూ.10 లక్షల వరకూ ఉన్నట్టు సమాచారం. అలాగే కొంతమంది అధికారులు నిమ్స్లో పనిచే స్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు పెద్దమొత్తంలో నగదు ఇచ్చి వారి ఖాతాలో జమ చేసు కొమ్మని చెపుతున్నట్లు సమాచారం. కాంట్రా క్ట్ వర్కర్లు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయడంతో అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది గట్టిగా ప్రశ్నించగా వారు అక్కడ నుంచి పారిపోయినట్లు తెలిసింది. -
ఎంఎన్జే ఆసుపత్రికి స్వయంప్రతిపత్తి
► నిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని సర్కార్ నిర్ణయ ► మాసబ్ట్యాంక్ సమీపంలో ఐదెకరాల్లో విస్తరణకు పచ్చజెండా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న కేన్సర్ నియంత్రణకుగాను వైద్య సౌకర్యాలు, మౌలిక సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక మెహిదీ నవాజ్ జంగ్(ఎంఎన్జే) కేన్సర్ ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరచాలని, దానికి పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తి ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. నిమ్స్కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం వల్ల అది కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నిమ్స్లాగే ఎంఎన్జేను కూడా తీర్చిదిద్దాలని యోచిస్తోంది. స్వయంప్రతిపత్తి వల్ల ఆసుపత్రి డెరైక్టర్ అధికారాల మేరకు అవసరమైనప్పుడు పోస్టులను భర్తీ చేసుకోవచ్చు. వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) పెత్తనం పోతుంది. యూనివర్సిటీలాగా దీన్ని తీర్చిదిద్దుకోవడానికి వీలవుతుంది. ఆంకాలజీలో ఎండీ, ఎంఎస్ కోర్సులను ప్రత్యేకంగా నెలకొల్పుకునే వెసులుబాటు ఉంటుంది. అవసరాన్ని బట్టి సొంత కోర్సులకూ రూపకల్పన చేసుకోవచ్చు. కేన్సర్పై ప్రత్యేక పరిశోధనాకేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదెకరాల్లో విస్తరణ.. ఎంఎన్జే ఆసుపత్రి విస్తరణ కోసం మాసబ్ట్యాంక్ పరిధిలోని ఐటీఐ, నర్సింగ్ కాలేజీల కు చెందిన ఐదెకరాల స్థలాన్ని దానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ స్థలంలో ప్రత్యేకంగా పది బ్లాక్లను నిర్మిస్తారు. అం దులో ఒకటి ప్రత్యేకంగా మహిళలకు కేటాయిస్తారు. కేన్సర్ వైద్య విద్య కోసం మరో బ్లాక్ ఉంటుంది. అత్యాధునిక వైద్య విద్య తరగతి గదులనూ నిర్మిస్తారు. ఎంఎన్జేకు రాష్ట్ర బడ్జెట్లో రూ.28 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. స్వయంప్రతిపత్తి వస్తే రూ.50 కోట్ల బడ్జెట్ పెరిగే అవకాశముంది. కేంద్రం నుంచి ప్రతీ ఏడాది రూ.70 కోట్ల మేరకు గ్రాంట్లు విడుదలవుతాయి. పడకల సంఖ్య 250 నుంచి 500 పెంచుకునేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మరోవైపు 100 వైద్య, ఇతర పారామెడికల్ పోస్టులు మం జూరు చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ కేన్సర్ కేంద్రంగా, రెండు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటకలకు కీలకంగా ఉన్న ఎంఎన్జే కేన్సర్ ఆసుపత్రికి రోజూ 500 మందికిపైగా రోగులు వస్తుంటారు. ఏడాదికి లక్షమంది రోగులు ఫాలోఅప్ వైద్యానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో స్వయంప్రతిపత్తి, విస్తరణ వల్ల ఎంఎన్జే స్వరూపమే మారిపోతుందని ఆ సంస్థ డెరైక్టర్ డాక్టర్ జయలత ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. -
సంక్రాంతి నుంచి నిమ్స్లో ఇన్పేషెంట్ సేవలు
బీబీనగర్ : బీబీనగర్ నిమ్స్ యూనివర్సిటీలోని నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు త్వరితగతిన పూర్తి చేస్తే సంక్రాంతి నుంచి ఇన్పెషెంట్ సేవలను ప్రారంభిస్తామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. నిమ్స్ యూనివర్సిటీలోని ఇన్పెషెంట్ విభాగం కోసం కొనసాగుతున్న నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రోగులకు సౌకర్యవంతంగా ఉండేలా భవన నిర్మాణ పనులను తిరిగి చేపడుతుండడంతో జాప్యమవుతుందన్నారు. నిమ్స్ను మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నామని అన్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా ఎమర్జెన్సీ వార్టులోకి నేరుగా అంబులెన్స్ వచ్చేలా, భవనంలోని లిప్టులు, ర్యాంపులు ఏర్పాటు చేసేందుకు అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు. సొంత నిధులను వెచ్చించి రహదారిపై బస్స్టాప్లు ఏర్పాటు చేయిస్తానన్నారు. నిమ్స్ వద్ద రహదారిపై నుంచి పుట్ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసేలా హైవే అధికారులతో మాట్లాడుతానని పేర్కొన్నారు. నిమ్స్లోని ఇన్పెషెంట్ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని దీంతో సంక్రాంతి నుంచి ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎయిమ్స్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం ప్రజా ప్రతినిధులు కొన్ని సందర్బాల్లో చెప్రాసీ పనులు చేయక తప్పడం లేదని అన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
నిమ్స్లో ప్రసూతి విభాగం!
రూ. 100 కోట్లతో 500 పడకల ఏర్పాటు? వైద్యారోగ్యశాఖ యోచన సీఎంకు ప్రతిపాదించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్పొరేట్ స్థాయిలో ప్రసూతి ఆస్పత్రి లేకపోవడం, సాధారణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఆశ్రయిస్తుండటంపై వైద్యారోగ్యశాఖ దృష్టిపెట్టింది. ఈ సమస్యను అధిగమించేందుకు నిమ్స్లో 500 పడకలతో ప్రత్యేకంగా ప్రసూతి విభాగాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీని ఏర్పాటుకు రూ. 100 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేస్తోంది. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలనుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిమ్స్ ఇప్పటివరకు గుండె, కిడ్నీ వైఫల్యం వంటి చికిత్సలకే ఎక్కువగా పరిమితమైందని...ప్రసూతి ఆస్పత్రిని ఏర్పాటు చేస్తే ప్రజల నుంచి భారీ స్పందన ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏటా 6.5 లక్షల ప్రసవాలు జరుగుతున్నట్లు అంచనా ఉండగా అందులో దాదాపు 2 లక్షల వరకు ప్రసవాలు హైదరాబాద్లో జరుగుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఫీజు రూ. 30 వేల లోపే... నిమ్స్లో ప్రసూతి ఆస్పత్రి విభాగాన్ని ఏర్పాటు చేస్తే తక్కువ ధరకే ప్రసవాలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలకు రూ. 50 వేల నుంచి రూ. లక్షన్నర వరకు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిమ్స్లో రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకే ప్రసవాలు చేసే అవకాశం ఉందని నిమ్స్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులు కాసుల కోసం అవసరం ఉన్నా లేకున్నా గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయని...దీన్ని దృష్టిలో ఉంచుకొని సహజ ప్రసవాలను ప్రోత్సహించేలా ఏర్పాట్లు చేయాలని నిమ్స్ భావిస్తోంది. ప్రసవాలకు వచ్చే గర్భిణుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మానసిక వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలనుకుంటోంది. -
'దేశంలోనే ప్రతిష్టాత్మక ఆస్పత్రిగా నిమ్స్'
పంజగుట్ట (హైదరాబాద్) : నిమ్స్ను దేశంలోనే ప్రతిష్టాత్మక ఆసుపత్రిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు నిమ్స్ డెరైక్టర్ మనోహర్ అన్నారు. ఆదివారం ఎర్రమంజిల్ పంచాయతీరాజ్ కార్యాలయం ఎదురుగా 520 గజాల స్థలంలో కోటి 40 లక్షల వ్యయంతో నిమ్స్ పేషెంట్స్ అటెండర్స్ కోసం నూతన భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రౌండ్తో పాటు రెండు ఫ్లోర్లు జీహెచ్ఎంసీ అనుసంధానంతో నిమ్స్ ఆసుపత్రి నిర్మించగా మరో మూడు ఫ్లోర్లు క్యాన్సర్ ఆశ్రయం ట్రస్ట్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ముఖ్యంగా డయాలసిస్, రేడియేషన్ పేషెంట్ల సహాయకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిమ్స్ వర్గాలు వెల్లడించాయి. 200 మందికి పైగా బసచేసేందుకు వీలుగా నిర్మిస్తున్నట్లు, ఒక్కో ఫ్లోర్లో సుమారు 38 గదులు, స్త్రీలకు, పురుషులకు వేరువేరుగా ఒక్కో ఫ్లోర్లో 18 స్నానాల గదులు, 18 మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్లో ఈ భవనం మెయింటెనెన్స్ రోటరీ క్లబ్కు అప్పగించే దిశగా ఆలోచిస్తున్నట్లు, జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి రూ.5 భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసే యత్నం చేస్తామని తెలిపారు. దీపావళి వరకు దీనిని ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు నిమ్స్ డెరైక్టర్ వెల్లడించారు. ఎర్రమంజిల్లో నిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన 16 ఎకరాల స్థలం ఉందని అందులో నెఫ్రాలజీ, యూరాలజీ టవర్స్తో పాటు, ఆడిటోరియం, డాక్టర్స్కు, రెసిడెన్స్ వైద్యులకు, స్టాఫ్కు క్వార్టర్లు కట్టించడంతో పాటు, డెరైక్టర్ భవనం కట్టించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. నిమ్స్కు వచ్చే ప్రతీ రోగీ సంతోషంగా నవ్వుతూ ఇంటికి వెళ్లేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని వైద్యపరికరాలు అందుబాటులోకి తెచ్చి మరిన్ని వసతులు కల్పించి రోగులకు సేవలందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ ఉన్నతాధికారి కృష్ణారెడ్డి, ఆర్ఎంఓలు, సిబ్బంది పాల్గొన్నారు. -
తిప్పి.. తిప్పి చంపేస్తారు
నిమ్స్ ట్రామా సెంటర్లో అవస్థలు అందుబాటులో లేని స్కానింగ్ పరికరాలు టెస్టుల పేరుతో క్షతగాత్రులను తిప్పుతున్న వైద్యులు గగ్గోలు పెడుతున్న రోగులు సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నిమ్స్కు వస్తున్న క్షతగాత్రులకు ప్రాణాలతో ఉండగానే నరకం కనిపిస్తోంది. గాయపడిన వారితో పాటు వారి వెంట ఉండే బంధువులకు సైతం ఈ పాట్లు తప్ప డం లేదు. ప్రమాదంలో గాయపడి ఇక్కడి అత్యవసర విభాగానికి చేరుకోగానే శరీరంలో ఏయే భాగాల్లో గాయాలయ్యాయో తెలుసుకునేందుకు వైద్యులు సీటీస్కాన్, ఎంఆర్ఐ స్కాన్ తీస్తారు. పొత్తికడుపులో తగిలి న దెబ్బలను గుర్తించేందుకు అల్ట్రాసౌండ్ టెస్టుకు సిఫా ర్సు చేస్తారు. కానీ ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లో సకాలంలో ఈ సేవలు అందక క్షతగాత్రులు మృత్యవాత పడుతున్నారు. అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన ఈ ట్రామా సెంటర్లో సీటీస్కాన్, ఎంఆర్ఐ, ఆల్ట్రా సౌండ్ యంత్ర పరికరాలు అందుబాటులో లేవు. అత్యవసర సెంటర్లో ఉండాల్సిన పరికరాలు పాత భవనంలో ఉన్నాయి. దీంతో వచ్చిన క్షతగాత్రులను ఇటూ అటూ తిప్పుతున్నారు. ఆస్పత్రి అత్యవసర విభాగానికి రోజూ 70-80 కేసులు వస్తుంటాయి. వీరిలో వివిధ రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారే ఎక్కువ. గాయాల తీవ్రతను గుర్తించాకే వైద్యం చేస్తారు. అందుకోసం బాధితులకు సీటీస్కాన్, ఎంఆర్ఐ విధిగా చేస్తారు. బతికుండగానే నరకం.. నిమ్స్ ట్రామా సెంటర్లో ఉండాల్సిన సీటీ, ఎంఆర్ఐ, ఆల్ట్రా సౌండ్ మిషన్లు పాత భవనంలోని రేడియాలజీ విభాగంలో ఉన్నాయి. తీసుకొచ్చిన క్షతగాత్రులను టెస్టుల కోసం ట్రామా సెంటర్ నుంచి పాత భవనానికి పంపుతున్నారు. అసలే విరిగి వేలాడుతున్న ఎముకలు, ఆపై భరించలేనినొప్పితో బాధపడుతున్నవారు అత్యవసర విభాగం నుంచి పాత భవనంలోని రేడియాలజీ విభాగానికి పదేపదే తరలించాల్సి రావడంతో గగ్గోలు పెడుతున్నారు. వారితో పాటు వెంట వచ్చిన బంధువులు సైతం తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముఖ్యంగా హెడ్, స్పైన్ ఇంజ్యురీతో బాధపడుతున్న బాధితులు చిత్రవధ అనుభవిస్తున్నారు. పుష్కలంగా నిధులున్నా.. స్వయం ప్రతిపత్తి కలిగిన నిమ్స్కు నిధులకు కొదవ లేదు. ప్రభుత్వం ఏటా బడ్జెట్లో భారీగానే కేటాయిస్తోంది. దీనికి తోడు రోగుల నుంచి కోట్ల రూపాయాల ఆదాయం సమకూరుతోంది. ఈ నిధులు ఖర్చు చేసి ట్రామా సెంటర్లోని బాధితుల కోసం సీటీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ మిషన్లు కొనుగోలు చేయవచ్చు. ఎంఆర్ఐ మిషన్కు రూ.13 కోట్ల వరకు ఖర్చు అవుతుండగా సింగరేణి యాజమాన్యం రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆ మేరకు ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. టెండర్ కాల్ఫర్ చేసే సమయంలో డెరైక్టర్ ఇందుకు నిరాకరించడంతో దాతలనుంచి వచ్చిన విరాళాలు కూడా వెనక్కు వెళ్లిపోయాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే రూ.27 కోట్ల విలువైన యంత్రాలకు టెండర్ పిలిచామని, మరో రూ.36 కోట్లతో మరిన్ని వైద్య పరికరాలు కొనుగోలు చేస్తున్నట్లు నిమ్స్ యాజమాన్యం చెబుతుండడం కొసమెరుపు. -
సీఎం ఇంటి వద్ద భారీ బందోబస్తు
హైదరాబాద్: నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికుల చలో సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయం, నిమ్స్ వద్ద భారీగా పోలీసులను మొహరించారు. కాంట్రాక్ట్ కార్మికులు భారీ ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉండటంతో.. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
నిమ్స్, ‘ఈఎస్ఐసీ’ల మధ్య ఒప్పందం
దత్తాత్రేయ, లకా్ష్మరెడ్డి, నాయిని సమక్షంలో ఖరారు సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య బోధన, ఎమర్జెన్సీ సేవలు, లైబ్రరీ వంటి సదుపాయాల విషయంలో పరస్పరం సహకరించుకునేలా ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలే జీ, నిమ్స్ ఆస్పత్రుల మధ్య అవగాహన కుది రింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ, రాష్ట్రమంత్రులు నాయిని నర్సిం హారెడ్డి, డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి సమక్షంలో ఈఎస్ఐసీ, నిమ్స్ అధికారులు శనివారం ఒప్పందం చేసుకున్నారు. దత్తాత్రేయ మాట్లాడుతూ... సనత్నగర్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీని దేశంలోనే ఆదర్శ కళాశాలగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాను న్న మెడికల్ కాలేజీలో 35 శాతం సీట్లు కార్మికుల పిల్లలకే అందేట్లు చూస్తామన్నారు. దేశ వ్యాప్తంగా 47 కోట్ల మంది కార్మికులున్నారని వారికి మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. జర్నలిస్టులందరికీ ఈఎస్ఐ వైద్య సేవలందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మజీతియా కమిటీ సిఫారస్సు మేరకు జర్నలిస్టులకు వేజ్బోర్డు అమలయ్యేలా చూస్తామన్నారు. అందుకోసం అన్ని రాష్ట్రాల సీఎస్లతో సమావేశమై దిశా నిర్ధేశం చేస్తామన్నారు. -
‘అంబలి’ కేంద్రం... ఆయన సేవకు చిహ్నం
♦ ప్రశంసలందుకుంటున్న సిర్పూరు ఎమ్మెల్యే కోనప్ప ♦ నగరంలోని ఆరు ఆస్పత్రుల్లో అంబలి కేంద్రాలు ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: తన నియోజకవర్గ పేదల ఆకలి తీర్చే అంబలి కేంద్రాల స్థాపనతో అందరి మన్ననలు పొందుతున్న ఆ ఎమ్మెల్యే తన దాతృత్వాన్ని కొన్నేళ్లుగా నగరానికీ విస్తరించారు. వివిధ ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారి బంధువులకు ఆపన్నహస్తం అందించేందుకు సంకల్పించారు. ఈ క్రమంలో ఇటీవల అసెంబ్లీ ఆవరణలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందిన సిర్పూరు కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తాజాగా నగరంలోని ఆరు ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంబలి కేంద్రాల ఏర్పాటుకు నడుం కట్టారు.ఇందులో భాగంగా సోమవారం నిమ్స్లో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించగా, గాంధీ ఆస్పత్రిలోని కేంద్రాన్ని ఎంపీ నగేష్తో కలిపి రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. ఇక నీలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలో కూడా ఓ కేంద్రాన్ని ప్రారంభించారు. ఉస్మానియా సహా ఎంఎన్జే, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రుల వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలను మంగళవారం ప్రారంభించనున్నారు. కోనేరు కోనప్ప కుటుంబం గత పదేళ్ల నుంచి సిర్పూరులో అంబలి కేంద్రాలను నిర్వహిస్తున్నారు. గతేడాది నగరంలో నాలుగు సెంటర్లు ఏర్పాటు చేసి 37 రోజుల్లో సుమారు మూడు లక్షల మందికి సరఫరా చేశామని, ఈ ఏడాది రో జుకు ఎనిమిది వేల మంది వంతున రెండున్నర మాసాల్లో ఆరు లక్షల మంది ఆకలి తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే కోనప్ప తెలిపారు. ఇందు కోసం రూ.8 నుంచి పది లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. పేదల ఆకలి తీర్చడం తనకు సంతృప్తినిస్తోందన్నారు. ఆదర్శప్రాయుడు కోనప్ప: ఇంద్రకరణ్రెడ్డి పేదల దవాఖానాల్లో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసి, వారి ఆకలి తీరుస్తున్న సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదర్శప్రాయుడని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గత పదేళ్ల నుంచి సిర్పూర్ నియోజకవర్గంలో ఆయన అంబలి పంపిణీ చేస్తున్నారనీ తన సేవలను రాజధాని నగరానికి కూడా విస్తరింపజేయడం ప్రశంసనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: జోగు రామన్న ప్రతీ వేసవిలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అంబలి పంపిణీ కేంద్రాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోనప్ప అభినందనీయుడని రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఈ విషయంలో కోనప్పను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు అంబలి, చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. వారికి తమ సహకారం ఉంటుందన్నారు. -
స్వల్ప అస్వస్థతతో నిమ్స్లో చేరిన స్పీకర్
స్పీకర్ మధుసూదనాచారి స్వల్ప అస్వస్థతతో ఆదివారం నిమ్స్లో చేరారు. ఆయనకు స్వల్పంగా బిపీ పెరగడంతో కార్డియాలజీ వైద్యులు శేషగిరిరావు, నెఫ్రాలజీ వైద్యులు గంగాధర్ ఆధ్వర్యంలో పలు వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం స్పీకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
నిమ్స్ లో ట్విన్ టవర్లు
♦ విదేశీ రోగుల చికిత్సకు ప్రత్యేకం ♦ ప్రతిపాదనలు సిద్ధం చేసిన వైద్య ఆరోగ్య శాఖ సాక్షి, హైదరాబాద్: వైద్య సేవల రంగంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఒరవడికి శ్రీకా రం చుడుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ‘మెడికల్ టూరిజం’కు విసృ్తత ప్రాచుర్యం కల్పిం చేందుకు మరో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా విదేశాల నుంచి రోగులను ఆకర్షించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందించింది. ప్రత్యేకంగా వీరికి వైద్య చికిత్సలు అందించేందుకు నిమ్స్ ప్రాంగణంలో జంట టవర్లు నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.హైదరాబాద్కు చెందిన కార్పొరేట్ ఆస్పత్రులు కొన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్య చికిత్సలు అందిస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అంద రి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అందుకే ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుం చి వైద్యం కోసం హైదరాబాద్కు వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య పర్యాటక గమ్యస్థానంగా మారుతోందని ఇటీవల సామాజిక ఆర్థిక సర్వేలోనూ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతో అందుబాటులో ఉన్న అవకాశాలను ఆదాయ మార్గంగా మలుచుకునేందుకు మెడికల్ టూరిజంపై దృష్టి సారిస్తోం ది. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే విదేశీ రోగులకు అత్యాధునిక వైద్యం అందించేలా ఆలోచిస్తోంది. దీంతో ఆదాయం తో పాటు టూరిజంలో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది సర్కారు ఆలోచన. గల్ఫ్ దేశాల్లో వైద్యం చాలా ఖరీదుతో కూడుకున్న అంశం. దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాలతో పోలిస్తే రాష్ట్రంలో వైద్య ఖర్చులు చాలా తక్కువ. విదేశాల నుంచి ఎక్కువగా ఆప్తాల్మజీ, నెఫ్రాలజీ, కార్డియాక్ సమస్యలతో పాటు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎక్కువ మంది నగరానికి వస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా కార్పొరేట్ ఆస్పత్రులతో దీటైన వైద్యాన్ని తక్కువ ధరకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగానే నిమ్స్లో జంట టవర్లను నిర్మించే ప్రతిపాదనలు తయారు చేసింది. విదేశీ రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు వీలుగా వీటిని అత్యాధునికంగా నిర్మిస్తారు. అంతర్జాతీయ స్థాయి వసతులతో పాటు రోగుల వెంట వచ్చే సహాయకులకు ఇందులో అన్ని సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. ఎర్రమంజిల్లో ఇప్పటికే నిమ్స్కు కేటాయించిన స్థలాన్ని ‘ఇంటర్నేషనల్ టవర్స్’ నిర్మాణానికి వినియోగించనున్నారు. నిర్మాణాలకు సంబంధించి రెండు మూడు డిజైన్లను వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే తయారు చేయించింది. ఈ ప్రతిపాదనలను ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనకు పంపించింది. వీటితో పాటు నిమ్స్లో ఈ-లైబ్రరీ, మినీ ఆడిటోరియం, స్టేడియం, డాక్టర్లు నివాసముండేందుకు క్వార్టర్లు నిర్మించాలని విడివిడిగా ప్రతిపాదనలను రూపొందించింది. -
ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ కు గుండెపోటు
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్గౌడ్ అస్వస్థతకు గురైయ్యారు. మైలార్దేవ్పల్లి, దుర్గానగర్లోని తన నివాసంలో శనివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యలు హుటాహుటిన నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. -
ప్రైవేటు ఆస్పత్రులకు బకాయి పడ్డాం: కామినేని
విశాఖ: ఎన్టీఆర్ వైద్య సేవలు ఆగవని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ఆస్పత్రులకు బకాయి పడిన మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. వచ్చే నెల 15వ తేదీలోపు బకాయిలు చెల్లిస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య విధాన పరిషత్ ద్వారా ఏప్రిల్ 11 నుంచి నిమ్స్ లో ఓపీ సేవలు అందించాలని నిర్ణయించినట్టు ఏపీ మంత్రి కామినేని వివరించారు. -
రోజాకు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి పరామర్శ
హైదరాబాద్ : నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే రోజాను శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్యంగ గురించి అడిగి తెలుసుకున్నారు. సస్పెన్షన్పై సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కూడా తనను అసెంబ్లీకి అనుమతించకపోవడంతో మండుటెండలో మౌనదీక్ష చేసిన ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం నిమ్స్కు తరలించారు. రోజాకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెకు బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవటంతో ప్రస్తుతం నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. -
ఎట్టకేలకు ముహూర్తం ఖరారు
రేపు ఉదయం 9:30 నుంచి బీబీనగర్ నిమ్స్లో సేవలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు బీబీనగర్ నిమ్స్ అవుట్ పేషంట్ విభాగం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 6వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఓపీ సేవలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. మంత్రి సీహెచ్ లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా, మరో మంత్రి జగదీశ్రెడ్డి విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. తొలిదశలో భాగంగా అబ్స్ట్రక్టీవ్ గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్ వంటి సాధారణ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని కోసం నిమ్స్ వైద్యులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి రాజధానిలోని నిమ్స్లో పనిచేస్తున్న వైద్యుల సేవలనే వినియోగించుకోనున్నారు. బీబీనగర్లో ఓపీ సేవల ప్రారంభంతో భువనగిరి సహా నల్లగొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రజల కష్టాలు కొంతవరకు తీరే అవకాశం ఉంది. తొలి దశలో కొన్ని వైద్యసేవలే... నాలుగు అంతస్తుల్లో 400 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ భవనంలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, స్పైన్, హెడ్ ఇంజూరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, విభాగాలతో పాటు అధునాతన బ్లడ్ బ్యాంక్, ఎక్సరే, సీటీ, ఎంఆర్ఐ విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి ఆరుగురు నిష్ణాతులైన వైద్యులతో పాటు ప్రాథమిక అవసరాల కోసం 700 మంది ఇతర సిబ్బంది అవసరం. నియామకాలు చేపట్టకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రారంభించి అభాసుపాలు కావడం కంటే దశల వారీగా సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ఉత్తమమని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు తొలి దశలో బేసిక్ ఓపీ వైద్య సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ కె.మనోహర్ ప్రకటించారు. -
మిథ్యగా నగదు రహిత వైద్యం..!
♦ ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ♦ కేన్సర్తో వచ్చిన ఓ ఉద్యోగి భార్యను నెలన్నర తిప్పి గాలికొదిలేసిన నిమ్స్ ♦ రూ. 200 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీకి బకాయి ఉన్నందునే ఈ పరిస్థితి ♦ సమస్యను పరిష్కరించడంలో వైద్య ఆరోగ్యశాఖ వైఫల్యం సాక్షి, హైదరాబాద్: అతను ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. భార్యకు కేన్సర్ సోకడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కేన్సర్ ఆస్పత్రిలో చేర్చాడు. అక్కడ నగదు రహిత వైద్యం అమలు కాక ప్రతి 21 రోజులకు ఒకసారి వేయాల్సిన సూదిమందుకు వేలాది రూపాయలు చెల్లించాడు. 4 నెలలు ఇబ్బందులు పడి వైద్యం చేయిం చాడు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం.. సన్నిహితుల సూచన మేరకు భార్యను నిమ్స్లో చేర్చాడు. నగదు రహిత వైద్యం అందిస్తామని.. 21 రోజుల తర్వాత వస్తే సూది మందు వేస్తామని నిమ్స్ వైద్యులు చెప్పారు. 21 రోజులకు వస్తే.. ఈసారికి ప్రైవేటు ఆస్పత్రిలో సూదిమందు వేయించుకోమని సలహా ఇచ్చారు. గత్యంతరం లేక అప్పు చేసి మందు వేయించాడు. మళ్లీ 21 రోజుల తర్వాత రెండోసారి నిమ్స్కు వస్తే.. తాము నగదు రహిత వైద్యం చేయలేమని చేతులెత్తేశారు. నెలన్నరపాటు తిప్పి చివరకు గాలికొదిలేశారు. గత్యంతరం లేక భార్య ప్రాణాలు కాపాడుకునేందుకు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు. ఇలాగే ప్రభుత్వ వైద్య గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేత కూడా తన తండ్రికి నగదు రహిత వైద్యం చేయించుకోలేకపోయారు. దీంతో ఆయన ఇటీవలే కన్నుమూశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం ఎంత గొప్పగా అమలవుతుందో ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ప్రభుత్వాన్ని నమ్ముకున్న వేలాది మంది ఉద్యోగులకు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులు చుక్కలు చూపిస్తున్నాయి. ఆరోగ్య కార్డులకు విలువేది? తెలంగాణ రాష్ట్రంలో 5.5 లక్షల మంది ఉద్యోగులు, మరో లక్షన్నర మందికిపైగా పింఛన్దారులు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే దాదాపు 22 లక్షల మందికిపైగా ఉన్నారు. వారందరి కోసం ప్రభుత్వం నగదు రహిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ ఉద్యోగులందరికీ ఉచిత వైద్య సేవలు అందించాలి. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడా నగదు రహిత చికిత్సలు అందక వేలాది మంది ఉద్యోగులు సొంత డబ్బులు చెల్లిస్తున్నారు. ఇక కార్పొరేట్ ఆస్పత్రులైతే నగదు రహిత వైద్యం చేయబోమని సర్కారుకు తేల్చిచెప్పేశాయి. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను సర్కారు ప్రారంభించినా.. ఆయా ఆస్పత్రులు దీన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదు. రూ. 200 కోట్ల బకాయిలు.. ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి రూ. 200 కోట్ల మేర బకాయిలు పడింది. దీంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకున్న పేదలు, ప్రభుత్వ ఉద్యోగుల తరఫున బిల్లులు పెట్టిన ఆస్పత్రులకు చెల్లింపులు జరగలేదు. బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులకు వైద్య సేవలను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు దాదాపు నిలిపివేశాయి. ఉచిత ఓపీ సేవలనూ ఆస్పత్రులు అమలు చేయడంలేదు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఉద్యోగుల కోసమే ప్రత్యేక ఓపీ సేవలు అందించాలని నిర్ణయించి నా.. పూర్తిస్థాయిలో ఉచిత ఓపీ సేవలు అందడంలేదని ఉద్యోగులు చెబుతున్నారు. -
నిరుపేదను.. గుండెమార్పిడి చేయండి: జ్యోతి
పంజగుట్ట (హైదరాబాద్): గుండె జబ్బుతో బాధపడుతున్న తనను ఆదుకోవాలని ఓ నిరుపేద యువతి నిమ్స్ జీవన్దాన్లో దరఖాస్తు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల శ్రీరామ్పూర్కు చెందిన ఆర్ జ్యోతి (23) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఇటీవల నిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించుకోగా గుండె మార్పిడి చేయాల్సిన అవసరముందని వైద్యులు సూచించారు. దీంతో నిమ్స్ జీవన్దాన్ పథకంలో గుండె దాత కోసం ఆమె దరఖాస్తు పెట్టుకుంది. తన తల్లిదండ్రులు ఇద్దరూ అనారోగ్యంతో మృతి చెందారని, తనకు సాయం చేయాల్సిందిగా నిమ్స్ జివన్దాన్ ప్రతినిధి అనూరాధను వేడుకుంది. జ్యోతిని అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని అనురాధ తెలిపారు. -
మృత్యు ముఖంలో జీవకళ
-
మృత్యు ముఖంలో జీవకళ
* నిమ్స్లో బాధితుడి చిరకాల కోరిక తీర్చిన కేటీఆర్ * చెదిరిన ‘సంతోష’ం కథనానికి స్పందన సాక్షి, హైదరాబాద్: ‘ఏం సంతోష్.. ఆరోగ్యం ఎలా ఉంది? విషయం తెలిసిన వెంటనే నిన్ను కలిసేందుకు సత్తుపల్లి వద్దామనుకున్నా. తీరిక లేక రాలేకపోయా. ఆరోగ్యం గురించి ఆందోళన చెందకు. నీ కోసం వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కూడా వెంట తీసుకొచ్చా. నీకు మేమంతా అండగా ఉంటాం. త్వరగా కోలుకోవాలి. వీలైతే డిశ్చార్జ్కు ముందే మరోసారి వచ్చి కలుస్తా’... అంటూ నిమ్స్లో కొంత కాలంగా మృత్యువుతో పోరాడుతున్న ఖమ్మంజిల్లా బాలుడు సంతోష్ (14)కు మనోధైర్యాన్నిచ్చారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్. పేగులకు ఇన్ఫెక్షన్ సోకి మృత్యువుతో పోరాడుతున్న సంతోష్ ఆరోగ్య పరిస్థితిపై గత నెల 18న ‘సాక్షి’ ఖమ్మం ఎడిషన్లో చెదిరిన ‘సంతోష’ం శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ చిన్నారికి కేటీఆర్ను చూడాలన్నది చిరకాల కోరిక. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్వయంగా వచ్చి సంతోష్ను పలుకరించారు. బాధితునికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా నిమ్స్ డెరైక్టర్ మనోహర్ను ఆదేశించారు. కేటీఆర్ వెంట వైద్యఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. పేగులకు ఇన్ఫెక్షన్... ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ నల్లంటి కృష్ణార్జునరావు, జ్యోతి దంపతుల రెండో కుమారుడు సంతోష్ సదాశివునిపేట జిల్లాపరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆటపాటల్లోనే కాదు చదువులోనూ ఎంతో చురుకు. బాసర త్రిబుల్ఐటీలో చదవాలనేది అతని ఆశయం. అయితే ఇటీవల ఉన్నట్టుండి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో స్థానిక ఆసుపత్రిలో సంప్రదించారు. పేగులకు ఇన్ఫెక్షన్ సోకిందని గుర్తించారు. ఖమ్మంలోని ఆషా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసి ఇన్ఫెక్షన్ సోకిన పేగులను తొలగించారు. ఇందుకు రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోగా వైద్య ఖర్చులు భారంగా మారాయి. అంత స్తోమత లేక డిసెంబర్ 24న డిశ్చార్జ్ అయ్యి నిమ్స్లో చేరారు. కాగా, కేటీఆర్ను చూడగానే సంతోష్ ముఖం వెలిగిపోయింది. తనలో ఆత్మస్థైరం పెరిగిందని, త్వరలోనే కోలుకొంటానని సంతోష్ చెప్పాడు. సంపూర్ణ ఆరోగ్యంతో బాసర త్రిపుల్ ఐటీలో సీటు సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. -
అందుబాటులోకి నిమ్స్ టోల్ ఫ్రీ నంబర్
ప్రారంభించిన మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్, తలసాని సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో రోగులకు బెడ్ల సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రోగి అత్యవసర పరిస్థితిలో.. రాష్ట్రంలోని ఏ మూల నుంచైనా 040-23305463 నెంబర్కు ఫోన్ చేసి రోగి ఏ పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారో చెబితే ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు అందుబాటులో ఉన్నాయా లేదా అన్న సమాచారాన్ని అందించనున్నారు. బెడ్లు అందుబాటులో ఉంటే రోగిని ఆసుపత్రికి తీసుకువచ్చే లోపు బెడ్ను సిద్ధం చేసి రోగికి అందించాల్సిన వైద్య పరికరాలను సైతం సిద్ధం చేసి ఉంచనున్నారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ను శుక్రవారం మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిమ్స్ డెరైక్టర్ మనోహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎమర్జెన్సీ వార్డులో కేవలం 40 బెడ్లు మాత్రమే ఉండేవని ప్రస్తుతం 96కు పెంచామని చెప్పారు. ఎమర్జెన్సీ వార్డుకు వచ్చిన రోగిని 24 గంటల్లో వార్డులోకి మార్చి నిత్యం ఎమర్జెన్సీలో బెడ్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి రాజేశ్వర్ తివారి పాల్గొన్నారు. -
20 మంది వైద్యులు... ఏడున్నర గంటలు...
* కరీంనగర్ జిల్లా మహిళకు విజయవంతంగా గుండెమార్పిడి * పదేళ్ల తర్వాత నిమ్స్లో ఈ తరహా ఆపరేషన్ సాక్షి, హైదరాబాద్: నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) వైద్యులు మరో రికార్డు సాధించారు. ఇటీవల కాలేయ, పాక్షిక పుర్రె మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన వీరు... తాజాగా తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు గురువారం గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసి, పునర్జన్మ ప్రసాదించారు. జీవన్దాన్, సీఎంఆర్ఎఫ్ సహాయంతో పదేళ్ల తర్వాత నిమ్స్లో గుండె మార్పిడి చేయడం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. కరీంనగర్జిల్లా హుస్నాబాద్కు చెందిన ఓంలత(30) ఏడాది కాలంగా తీవ్ర ఆయాసంతో బాధపడుతున్నారు. స్థానిక వైద్యులను సంప్రదించగా... గుండె పనితీరు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. మందులు, సర్జరీలతో నయం కాదని స్పష్టం చేశారు. దీంతో ఆమె మూడు వారాల క్రితం నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఆర్వీ కుమార్ను సంప్రదించారు. ఈ సమస్యకు గుండె మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే పరిష్కారమని సూచించారు. శస్త్రచికిత్సకు రూ.11 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. వైద్య ఖర్చులు భరించే స్తోమత బాధితురాలికి లేకపోవడంతో... సీఎంఆర్ఎఫ్, జీవన్దాన్లో ఆమె పేరు నమోదు చేశారు. ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. బ్రెయిన్డెడ్ యువకుడి గుండె దానం... కాగా, వరంగల్ జిల్లా హుజురాబాద్ సమీపంలో గత శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పి.వినయ్కుమార్(20) తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం అతడిని మంగళవారం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో... బుధవారం వైద్యులు బ్రెయిన్డెడ్గా నిర్థారించారు. కుమారుని అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. జీవన్దాన్ ఇన్చార్జి స్వర్ణలత సమాచారంతో నిమ్స్ వైద్యులు గుండె సేకరించారు. బాధితురాలికి దాత గుండె సరిపోతుందని నిర్థారించుకున్నారు. 20 మంది వైద్యులు... ఏడున్నర గంటలు... రాత్రి పదకొండు గంటలకు యశోద ఆస్పత్రిలో దాత నుంచి గుండె సేకరించారు. ట్రాఫిక్ పోలీసుల సహకారంతో గ్రీన్చానల్ ద్వారా ఏడు నిమి షాల్లోనే నిమ్స్కు చేర్చారు. అప్పటికే ఆపరేషన్ థియేటర్లో బాధితురాలి ఛాతిని ఓపెన్ చేసి శస్త్రచికిత్సకు సిద్ధం చేశారు. కార్డియో థొరాసిక్ అధిపతి ఆర్వీ కుమార్ నేతృత్వంలోని 20 మందితో కూడిన వైద్య బృందం... బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏడున్నర గంటలు శ్రమించి బాధితురాలికి విజయవంతంగా గుండె అమర్చింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచారు. మరో 48 గంటల తర్వాత ఆమె స్పృహలోకి వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. -
నిమ్స్ లో ఫిజియోథెరపీ విద్యార్థి ఆత్మహత్య
-
నిమ్స్ లో ఫిజియోథెరపీ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) లో సోమవారం ఉదయం ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిమ్స్ లో ఫిజియోథెరిపీ ఇంటర్న్ షిప్ చేస్తున్న విజయ్ కుమార్(24) అనే విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిమ్స్ పాత బిల్డింగ్ లోని 6 ఫ్లోర్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం మెదక్ జిల్లా పటాన్ చెరువు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అధికారులు విజయ్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు, సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నిమ్స్ మాజీ డైరెక్టర్ నివాసంపై ఏసీబీ దాడులు
-
నిమ్స్లో క్యాష్లెస్ ఓపీ సేవలు షురూ
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం...అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు - వైద్య మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దార్లకు నిమ్స్లో కార్పొరేట్ ఆస్పత్రుల కన్నా మరింత మెరుగైన వైద్యసేవలు అందించి, వాటి గుత్తాధిపత్యానికి గుణపాఠం చెబుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల కోసం ప్రభుత్వం రాజధానిలోని ‘నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్’ (నిమ్స్)లో ఏర్పాటు చేసిన ‘క్యాష్లెస్ అవుట్ పేషంట్’ సేవల విభాగాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఏర్పాటు చేసిన ఈహెచ్ఎస్ రిజిస్ట్రేషన్ కౌంటర్తో పాటు కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ విభాగాలు, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, నెఫ్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, రుమటాలజీ, డెర్మటాలజీ, వాస్క్యూలర్ సర్జరీ ఓపీలను రోగులకు అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కింద ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దార్లకు ఓపీ, ఐపీ సేవలన్నీ ఉచితంగా అందించేందుకు ఇప్పటికే 200కు పైగా ఆస్పత్రులు ముందుకు వచ్చాయి. మిగతా 12 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను కూడా ఈ పథకం కిందకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈహెచ్ఎస్ లబ్ధిదారులకు సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 4-6 గంటల వరకు... ఉస్మానియా, గాంధీ సహా అన్ని జిల్లా, బోధనాసుపత్రుల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈహెచ్ఎస్ అమలుపై ప్రతి నెలా సమీక్ష నిర్వహించి లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసి, రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తాం’ అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ... ఈహెచ్ఎస్ పథకంలో భాగంగా ఉచిత వైద్యసేవలు అందిస్తున్న ఆస్పత్రుల వివరాలతో కూడిన బుక్లెట్ను త్వరలో విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్చందా, ఆరోగ్యశ్రీ సీఈఓ చంద్రశేఖర్, డీఎంఈ రమణి, నిమ్స్ డెరైక్టర్ కె.మనోహర్, టీఎన్జీఓ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్ పాల్గొన్నారు. -
నిమ్స్లో డెంగీతో మహిళ మృతి
రంగారెడ్డి’(దోమ) : డెంగీతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన నిమ్స్లో శుక్రవారం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బొంగు పద్మ(30) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. చికిత్సకోసం మహబూబ్నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. డెంగీ లక్షణాలు గుర్తించిన అక్కడి వైద్యులు హైదరాబాద్ నిమ్స్కు తరలించాల్సిందిగా సూచించారు. నిమ్స్లో చికిత్సపొందుతూ పద్మ శుక్రవారం మృతిచెందింది. -
నిమ్స్ శేషగిరిరావుకు క్లీన్ చిట్
హైదరాబాద్: నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ డి.శేషగిరిరావుకు రాష్ట్ర ప్రభుత్వం క్లీన్చిట్ ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య పరికరాల డీలర్ నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపిస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రెండేళ్ల క్రితం శేషగిరిరావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అవినీతి కేసులో అరెస్టు కావడంతో 2013 జనవరిలో ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత అదే ఏడాది సస్పెన్షన్ ఎత్తివేసింది. ఏసీబీ తనపై తప్పుడు కేసు పెట్టిందంటూ శేషగిరిరావు ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో, సర్కారు విజిలెన్స్ కమిషనర్ విచారణకు సిఫారసు చేసింది. మరోవైపు శేషగిరిరావును ప్రాసిక్యూట్ చేయాలని ఏసీబీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని శేషగిరిరావు అభ్యర్థన మేరకు విజిలెన్స్ కమిషనర్కు నివేదించింది. సమగ్ర దర్యాప్తు జరిపిన విజిలెన్స్ కమిషనర్ శేషగిరిరావుపై వచ్చిన ఆరోపణలు నిరూపితం కాలేదని తేల్చారు. లంచం తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. అతనిపై వచ్చిన ఆరోపణలు రుజువు కానందున ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో శేషగిరిరావును నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
గుంటూరు నిమ్స్ కాలేజ్ మెస్లో యువకుడు మృతి