![YSRCP Leader Botsa Satyanarayana Comments On Chandrababu Naidu - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2018/08/11/botsa-satyanarayana.jpg.webp?itok=XVsOYEOz)
సాక్షి, చీపురుపల్లి: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అంతా అవినీతేనని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కంపే తప్ప అభివృద్ధి శూన్యం మని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు నాలుగేళ్లలో జిల్లాకు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు.
మహారాజుకు పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల వారు ఎక్కడ గుర్తుంటారని అన్నారు. చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ అశుభం నెలకొంటుందని అన్నారు. టీడీపీ నాయకుల అవినీతి ఎండగట్టి ప్రజలను చైతన్య పరిచేలా బూత్ కమిటీలు పనిచేయాలని వైఎస్సార్సీపీ నాయకులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment