భారతదేశంలో పుట్టి, ఈనాడు ప్రపంచం నలుమూలలా విస్తరించిన ధార్మిక మార్గం బౌద్ధం. ప్రపంచ ప్రజల్ని ప్రభావితం చేస్తున్న అగ్రగామి కూడా బౌద్ధమే. ఇందుకు ప్రధాన కారణం ప్రజల వద్దకే ప్రబోధాల్ని తీసుకుపోయే విధానానికి బుద్ధుడు నాంది పలకడమే. ఆ నాంది పలికిన రోజే ఆషాఢ పున్నమి రోజు. అది నేడు.
ఆషాఢ పున్నమి విశేషం ఏమంటే...
జ్ఞానం తెలుసుకోవడం కోసం ఇల్లు విడిచిన సిద్ధార్థుడు ఆరేళ్లు ఎన్నోచోట్ల, ఎందరో గురువుల దగ్గరకు వెళ్లాడు. ఎక్కడా సరైన దారి కనిపించలేదు. ప్రపంచ ప్రజల దుఃఖాన్ని మాపే మార్గం అగుపించలేదు. చివరికి బుద్ధగయలో ధ్యానసాధన చేశాడు. ఒక వైశాఖ పున్నమి రోజున ఆయనకు ఆ మార్గం అవగతం అయింది. అదే బుద్ధ పూర్ణిమ. బుద్ధునికి కలిగిన సంబోధిలో రెండు ప్రధాన విషయాలున్నాయి.
ఒకటి: ఈ ప్రపంచంలో స్థిరమైనది, శాశ్వతమైనది ఏదీ లేదు. ప్రతిదీ, ప్రతిక్షణం మారిపోతూనే ఉంటుంది. మార్పే ఈ ప్రపంచ భౌతిక నియమం.
రెండు: మనిషి దుఃఖానికి ముదిరిపోయిన కోరికలు (తృష్ణ) ప్రధాన కారణం. జీవితం మీద, జీవనం మీద మనిషికి సరైన దృక్పథం లేకపోవడం. ఉన్నదాన్ని ఉన్నట్లుగా కాకుండా తనకు ఇష్టమైనట్లో, అయిష్టమైనట్లో చూడ్డం. ఈ మోహ, ద్వేషాలే దుఃఖానికి కారణం. ఈ దుఃఖం పోవాలంటే సరైన దృక్పథం కావాలి. ఆ సరైన దృక్పథం (సమ్యక్ దృష్టి) కలగాలంటే మనం అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. జ్ఞానం, శీలం, ధ్యానం (నియంత్రణ) ఈ మూడింటి సాకారమే అష్టాంగ మార్గం.
ఈ రెండు విషయాల్నీ ఆమూలాగ్రం బోధిస్తే చాలా కష్టంగా అర్థం అవుతుంది. తాను కనుగొన్న ఈ నూతన మార్గాన్ని ఎలా సులభతరం చేయాలా అని మధన పడుతూ అలాగే ఏడువారాలు గడిపాడు. ఈ గంభీర విషయాన్ని సులువుగా ప్రజల భాషలోనే, ప్రజల మధ్య తిరుగుతూ చెప్పాలని నిర్ణయం తీసుకుని.. తన పాత మిత్రగురువులైన ఆలార కాలముడు, ఉద్ధవ రామపుత్రునికి చెప్పాలని చూస్తాడు. కానీ వారిద్దరూ అప్పటికే మరణించడంతో... తన ఐదుగురు మిత్రులు సారనాథ్ (రుషిపట్టణం) జింకల వనంలో ఉన్నారని తెలిసి వారి దగ్గరకు వెళ్లాడు. తాను కనుగొన్న నూతన మార్గాన్ని వారికి ఐదురోజులు బోధించాడు. వారి అనుమానాలన్నీ తీర్చాడు. ఆ ప్రబోధాల సారం మొదటి రోజున కొండన్నకు, రెండోరోజున బద్ధియునికి, మూడోరోజున కాశ్యపునికి, నాలుగోరోజున అశ్వజిత్తుకి, ఐదోనాడు మహానామకు అవగతం అయ్యాయి.
వారు ఐదుగురూ ఆయన అనుయాయులుగా మారారు. ఒక సంఘంగా ఏర్పడ్డారు. అదే తొలి బౌద్ధ సంఘం. ఇది బౌద్ధసంఘం పుట్టిన రోజు. కాలినడక తిరుగుతూ (చారిక) ధర్మాన్ని ప్రచారం చెయ్యాలని బయలుదేరాడు. అలా ధర్మచక్రం కదలింది. దానికి గుర్తుగా ఈ రోజున ధర్మచక్ర ప్రవర్తన దినంగా ప్రపంచ బౌద్ధులు జరుపుకుంటారు.
బౌద్ధభిక్షువులు దీన్నే మహా గురువైన బుద్ధుని తొలి ప్రబోధదినంగా భావించి గురుపూర్ణిమగా జరుపుకుంటారు. నిజం... ఇది ధర్మం నడక ప్రారంభించిన రోజు. జ్ఞానవెలుగులు పరచిన రోజు. – డా. బొర్రా గోవర్ధన్
ధర్మం నడిచిన రోజు
Published Sun, Jul 9 2017 12:29 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
శ్రీ సత్యసాయి జిల్లా నసనకోటలో టీడీపీ నేతల దుర్మార్గం
బక్రీద్ : భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు (ఫొటోలు)
సాక్షి కార్టూన్ 17-06-2024
ఆలియా డ్రీమ్ : సరికొత్తగా మరో ఘనత తన ఖాతాలో
లేటుగా వస్తే.. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక
బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం
Hyderabad: ఎంగేజ్ విత్ సిటీ...
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన, ఆశా శోభన
నా భర్త ఫెయిల్యూర్ హీరో కాదు: వితికా షెరు
యాపిల్ కంప్యూటర్ దశాబ్దాల చరిత్ర - విస్తుపోయే ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
తప్పక చదవండి
- హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
- కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
- కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
- జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
- సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
- ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం
Advertisement