చెన్నై: భారత వన్డే జట్టులో మళ్లీ చోటు దక్కుతుందని ఊహించానని తమిళనాడు బ్యాట్స్మన్ మురళీ విజయ్ అన్నాడు. టెస్టుల్లో తాను రాణించిన తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన రహానే సారథ్యంలోని భారత జట్టులో విజయ్కు స్ధానం లభించింది. ఈ సిరీస్కు బీసీసీఐ సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువకులకు అవకావం కల్పించిన సంగతి తెలిసిందే.
'వన్డే జట్టులోకి మళ్లీ రావడం సంతోషంగా ఉంది. 2013 చాంపియన్స్ ట్రోఫీ సహా నాలుగు సిరీస్లకు మూడో ఓపెనర్గా నన్ను జట్టులోకి తీసుకున్నా ఆడే అవకాశం రాలేదు. అయినా ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఇతరులతో ఎప్పుడూ పోటీగా భావించను. నా ఆటతీరును మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత టెస్టుల్లో రాణించా. దీంతో వన్డే జట్టులోకి మళ్లీ వస్తాననే నమ్మకం కలిగింది' అని మురళీ విజయ్ అన్నాడు.
'వన్డే టీమ్లోకి వస్తానని ఊహించాను'
Published Tue, Jun 30 2015 3:40 PM | Last Updated on Wed, May 29 2019 2:49 PM
Advertisement