![శ్రీలంక చీఫ్ కోచ్గా అటపట్టు](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/2/81411589579_625x300.jpg.webp?itok=CTEIJTTB)
కొలంబో: మాజీ ఆటగాడు మర్వన్ అటపట్టు శ్రీలంక క్రికెట్ జట్టు చీఫ్ కోచ్గా ఎంపికయ్యాడు. రెండేళ్ల కాలానికి అతడిని నియమించినట్లు లంక బోర్డు ప్రకటించింది. 2011లో శ్రీలంక టీమ్ బ్యాటింగ్ కోచ్గా అడుగు పెట్టిన అటపట్టును రెండేళ్ల తర్వాత అసిస్టెంట్ కోచ్గా ప్రమోట్ చేశారు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో అతను జట్టుకు తాత్కాలిక కోచ్గా కూడా వ్యవహరించాడు.