'కేసీఆర్ నేతృత్వంలో బియ్యం మాఫియా' | revanth fires on cm kcr | Sakshi

'కేసీఆర్ నేతృత్వంలో బియ్యం మాఫియా'

Published Tue, Oct 13 2015 3:04 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

revanth fires on cm kcr

ముఖ్యమంత్రి కేసీఆర్పై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యానికి బదులుగా దొడ్డు బియ్యాన్ని పెడుతూ 'బియ్యం మాఫియా'కు పాల్పడుతోందని విమర్శించారు. గతంలో తాను మైనింగ్, లిక్కర్, ఇసుక మాఫియాను చూశాను గానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం వినూత్నంగా బియ్యం మాఫియాకు పాల్పడుతోందని విమర్శించారు.

ఈ విషయాన్ని ఎక్కడైనా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాననీ. లేని పక్షంలో ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు. గతంలో తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రంకోసం తీవ్రవాదంలోకి మారితే ఇప్పుడు మాత్రం కేవలం తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాల మూలంగా తీవ్రవాదం వైపు వెళ్తున్నారని రేవంత్ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement