Abhay
-
సభ్యత్వ నమోదును సీరియస్గా తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదును సీరియస్గా తీసుకోకపోతే తిప్పలు తప్పవని బీజేపీ అధిష్టానం నాయకులకు హెచ్చరికలు జారీచేసింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యనేతలు మొదలు కిందిస్థాయి కార్యకర్తల దాకా అందరూ.. పూర్తిస్థాయిలో నిమగ్నం కావాల్సిందేనని జాతీయ నాయకత్వం స్పష్టంచేసింది. సభ్యత్వ నమోదులో నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించింది. పార్లమెంట్ ఎన్నికల్లో.. రాష్ట్రంలో పోటీచేసిన బీజేపీ అభ్యర్థులకు 77 లక్షల ఓట్లు పోలైనందున, వాటిలో 60 నుంచి 65 లక్షల దాకానైనా ఓటర్లను పార్టీ సభ్యులుగా చేర్చుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించని నాయకులను పార్టీ పదవుల్లో నుంచి తొలగిస్తామని తెలంగాణ సభ్యత్వ ఇన్చార్జి అభయ్ పాటిల్ స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సభ్యత్వ నమోదు సాగుతున్న తీరును పర్యవేక్షించారు. శని, ఆదివారాల్లోనూ ఆయన రాష్ట్రంలోని వివిధచోట్ల పర్యటించి సభ్యత్వ నమోదును పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా పాల్గొంటున్నారనే అంశంపై సమాచారాన్ని సేకరించి, నివేదికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో పారీ్టనేతలు అప్రమత్తం అయ్యారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలంతా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. -
తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా అభయ్ పాటిల్
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా కర్ణాటక నేత అభయ్ పాటిల్ను నియమించింది ఆ పార్టీ అధిష్టానం. ఇంతకు మందు.. లోక్సభ ఎన్నికల టైంలోనూ తెలంగాణ బీజేపీ ఇంఛార్జిగా ఆయన వ్యవహరించారు. ఈయన పూర్తి పేరు అభయ్కుమార్ పాటిల్ దక్షిణ బెల్గాం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కార్యకర్తగా బీజేపీలో తన ప్రస్థానం ప్రారంభించిన అభయ్కు సోషల్ మీడియా ద్వారా యూత్తో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకవైపు సామాజిక కార్యక్రమాలతో పాటు మరోవైపు.. నియోజకవర్గానికి ఐటీ పార్క్ ఏర్పాటు లాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో ఆయన ప్రజల దృష్టిని ఆకర్షించగలిగారు. బెలగావి అభివృద్ధి కోసం విజన్ 2040 పేరిట ఆయన ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం కూడా లభించింది. -
నాలోనూ ఆ భయం ఉంది – ‘దిల్’ రాజు
‘‘రాక్షస కావ్యం’ ట్రైలర్ బాగుంది. శ్రీమాన్ మేకింగ్, టేకింగ్ బాగున్నాయి. కొత్తవాళ్లతో ప్రోడ్యూసర్ దాము మంచి ప్రయత్నం చేశాడు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్ కీర్తి దర్శకత్వంలో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ను ‘దిల్’ రాజు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘కరోనా తర్వాత ఓటీటీలో నెగిటివ్ కంటెంట్ బాగా పెరిగింది.. అదే సక్సెస్ అవుతోంది. నేను పాజిటివ్ కథతో ఓ మంచి సినిమా తీసినా చూడరేమో? అనే భయం కలుగుతోంది. ఎప్పుడూ హీరోలే గెలవాలా? విలన్లు గెలవొద్దా అనే పాయింట్తో ‘రాక్షస క్యావం’ చేశారు. నేటి ట్రెండ్కి, ప్రేక్షకులకు కావాల్సిన సినిమా ఇది’’ అన్నారు. -
అక్టోబర్ 6న ‘రాక్షస కావ్యం’
అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 6న “రాక్షస కావ్యం” సినిమాను గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే “రాక్షస కావ్యం” సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గత వారం విడుదల చేసిన విలన్స్ ఆంథెమ్ సాంగ్ ఇన్ స్టంట్ హిట్ అయ్యింది. మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి తెరకెక్కించిన ఒక కొత్త తరహా సినిమాగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. థియేటర్స్ లో ఈ సినిమాను చూడాలనే క్రేజ్ సినీప్రియుల్లో ఏర్పడుతోంది. -
సినిమా అనేది ఎంటర్టైన్ చేస్తూనే ఎడ్యుకేట్ చేయాలి
‘చాలామంది యువత రాజకీయాలు అంటూ సరైన నాయకుడిని ఎంచుకోకుండా గుడ్డిగా తిరిగి జీవితాలు పాడుచేసుకుంటున్నారు అనే బాధ నాకు ఎప్పుడూ ఉండేది. అలాంటి అంశాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి వినోదాన్ని జోడించి ఒక మంచి సినిమా చేశారు. ‘రామన్న యూత్’ సినిమా గురించి చెప్పగానే నాకు చాలా ఆనందమేసింది.ఇలాంటి సినిమాలని మనమందరం సపోర్ట్ చేయాలి’అని లోక్ సత్తా పార్టీ ఫౌండర్ డాజ జయప్రకాశ్ నారాయణ అన్నారు. అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్ ను జయప్రకాష్ నారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా అనేది ఎంటర్టైన్ చేస్తూనే ఎడ్యుకేట్ చేయాలన్నారు. రామన్న యూత్ మూవీ టీజర్ చాలా బాగుందని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాక్షించారు. ‘విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ ఎంటర్ టైనర్ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో యువత రాజకీయ నాయకుల కోసం ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు. ఆ యువతను కొందరు నేతలు ఎలా తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అనేది “రామన్న యూత్” సినిమాలో వినోదాత్మకంగా, ఆలోచింపజేసేలా తెరకెక్కించాం’ హీరో,దర్శకుడు అభయ్ నవీన్ అన్నారు. -
జాతీయ లక్ష్యానికి చేయూతనివ్వాలి..
సాక్షి, అమరావతి : ఇంధన పొదుపు, సామర్థ్యంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఏపీ.. జాతీయ లక్ష్యానికి మరింత చేయూతనివ్వాల్సిందిగా బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే కోరారు. మార్చి 1న న్యూఢిల్లీలోని ఇండియన్ హాబిటాట్ సెంటర్లో జరగనున్న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) 21వ వ్యవస్థాపక దినోత్సవాలకు రాష్ట్రాన్ని ఆహ్వానించారు. ఈ మేరకు స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ(ఎస్డీఏ)గా ఉన్న ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్(ఏపీఎస్ఈసీఎం)కు సమాచారం అందించడం కోసం బాక్రే ఆదివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. 2030 నాటికి ఏపీలో 6.68 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన(ఎంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేయాలనే లక్ష్యాన్ని చేరుకునే కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డిని బాక్రే కోరారు. -
హాసిని గాయత్రి క్రియేషన్స్ బ్యానర్లో ‘యాక్షన్ డ్రామా- థ్రిల్లర్’
అభయ్, అస్మిత నర్వాల్, గిరిష్మ నేత్రిక హీరోహీరోయిన్లుగా హాసిని గాయత్రి క్రియేషన్స్ బ్యానర్పై పాత్ లోథ్ శంకర్ గౌడ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆర్ సుమధుర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్లో జరిగాయి. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ క్లాప్ కొట్టగా, ప్రొడ్యూసర్ పాత్ లోథ్ శంకర్ గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు ఆర్ సుమధుర్ కృష్ణ మాట్లాడుతూ... యాక్షన్ డ్రామా, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇలాంటి కాన్సెప్ట్తో తెలుగులో ఇంతవరకు ఏ చిత్రం రాలేదు. జనవరి 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది’ అని తెలిపారు. ‘డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోందని నమ్ముతున్నాను’అని హీరో అభయ్ అన్నారు. ఈ సినిమాలో నేను నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర చేయబోతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు’అని అస్మిత నర్వాల్ అన్నారు. ‘ఒక మంచి సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది’అని హీరోయిన్ గిరిష్మ అన్నారు. -
నిధుల వేటలో ధృవ స్పేస్
హైదరాబాద్: స్పేస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ ధృవ స్పేస్ ఒకట్రెండేళ్లలో రూ.204 కోట్ల వరకు నిధులను సమీకరించాలని భావిస్తోంది. 100 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను సమకూర్చుకునేందుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీటీవో అభయ్ ఏగూర్ వెల్లడించారు. ఇందుకోసం హైదరాబాద్లో ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అన్వేషిస్తున్నామని, ఔత్సాహికులతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ‘ధృవ స్పేస్ ఇప్పటికే ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాజెక్టులకు ఎటువంటి నిధులు అవసరం లేదు. అయితే కంపెనీకి చెందిన ఇతర విభాగాలకు ఇది అవసరం కావచ్చు. పెద్ద శాటిలైట్ ప్లాట్ఫామ్స్ అభివృద్ధి వైపునకు కంపెనీ వెళుతోంది. ఇప్పటికే ప్రయోగించిన వాటి కంటే కొంచెం పెద్ద ఉపగ్రహాలను వచ్చే ఏడాది మధ్యలో లే దా చివరిలో కక్ష్యలో ప్రవేశపెట్టగలమని ఆశాభావంతో ఉన్నాం. ఇందుకు తగ్గ అభివృద్ధి పనులు సవ్యంగా జరుగుతున్నాయి. ధృవ స్పేస్ రూపొందించిన నానో ఉపగ్రహాలు తైబోల్ట్–1, తైబోల్ట్–2 శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ–సీ54 ఉపగ్రహ ప్రయోగనౌక ద్వారా ఇస్రో నవంబర్ 26న విజయవంతంగా ప్రయోగించింది. వీటి విజయం తర్వాత సంస్థ ప్రస్తుతం పీ30 ప్లాట్ఫామ్లో కమ్యూనికేషన్స్, సైంటిఫిక్ అప్లికేషన్స్ను విస్తృతంగా అందజేసే 30 కిలోల బరువున్న ఉపగ్రహంపై పని చేస్తోంది’ అని అభయ్ పేర్కొన్నారు. శాటిలైట్ నుంచి సిగ్నల్స్ అందుకోవడం మొదలైందని, ప్రస్తుతం కంపెనీ బృందం ఈ మిషన్ను కొనసాగించడంలో, ఉపగ్రహాలను నిర్వహించడంలో బిజీగా ఉందన్నారు. దశాబ్దకాలం పూర్తి చేసుకున్న ధృవ స్పేస్ ఇప్పటి వరకు రూ.65 కోట్ల నిధులను అందుకుంది. -
23న విశాఖలో ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సు
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్యం పెట్టుబడుల సదస్సు (ఇన్వెస్ట్మెంట్ బజార్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సమన్వయంతో 23న విశాఖలో నిర్వహించనున్నట్టు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే ప్రకటించారు. రాష్ట్ర ఇంధన శాఖ, ఏపీఎస్ఈసీఎం అధికారులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య సాంకేతికతను అందుబాటులోకి తేవటం, దానిని వినియోగించుకోవడం కోసం పరిశ్రమలకు ఆర్థిక సహకారం అందించడమే లక్ష్యంగా ఆసక్తి గల పరిశ్రమలను, బ్యాంకులను, ఆర్థిక సంస్థలను ఒకే వేదిక పైకి తెచ్చేందుకు సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఇన్వెస్ట్మెంట్ బజార్ వేదికగా పెట్టుబడులకు అవకాశమున్న ప్రాజెక్టులను గుర్తిస్తామని, సదస్సులో ఎంపికైన పరిశ్రమలకు ప్రాజెక్టులు అమలు చేసేందుకు ఆర్థిక సహకారం అందే ఏర్పాటు చేస్తామని అభయ్ బాక్రే చెప్పారు. గతేడాది మార్చిలో ఇదే విశాఖలో దేశంలో తొలిసారిగా ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సును నిర్వహించిన ఘనత ఏపీకి దక్కుతుందని, విద్యుత్ రంగంలో ప్రత్యేకించి ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ఏపీ పనితీరును గుర్తించి మరోసారి విశాఖలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పరిశ్రమల నుంచి ఏపీఎస్ఈసీఎంకు ప్రతిపాదనలు వస్తే వాటికి అవసరమైన సాంకేతిక ప్రక్రియ నిర్వహించి, ఆర్థిక సంస్థలకు పంపుతామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. సమావేశంలో ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి, ఇంధన శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ చర్యలు భేష్
సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే ప్రశంసించారు. రాష్ట్ర ఇంధన శాఖ, ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) అధికారులతో బాక్రే ఆదివారం వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. తొలుత ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పునరుత్పాదక ఇంధన రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు అభయ్ బాక్రేకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 18.8 గిగావాట్లు ఉండగా, అందులో 40 శాతం (7.5 గిగా వాట్లు) పునరుత్పాదక ఇంధన ఉత్పత్తే అని తెలిపారు. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి ఇతర రాష్ట్రాలకు కూడా పునరుత్పాదక ఇంధనాన్ని ఎగుమతి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం అభయ్ బాక్రే మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్య రంగాలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీని ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. ఏపీ, కేరళ తరహాలో అన్ని రాష్ట్రాలు ఇంధన సామర్థ్య విభాగాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన సామర్థ్యం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఏపీఎస్ఈసీఎం అధికారులకు బాక్రే సూచించారు. ఈ సమావేశంలో ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి, ఇంధన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇంధన రంగంలో భారీ పెట్టుబడులకు ఆస్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సామర్థ్య రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ.. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే తెలిపారు. అలాగే పెట్టుబడులకు ఏపీలో సానుకూల వాతావరణం కూడా ఉందన్నారు. జాతీయ స్థాయిలో 2031 నాటికి రూ.10.02 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశముందని వెల్లడించారు. ఏపీ ఇంధన సంరక్షణ మిషన్ అధికారులతో బాక్రే ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన రంగంలో పెట్టుబడుల వల్ల పారిశ్రామిక, రవాణా, భవన నిర్మాణం, తదితర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. దీనివల్ల ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన మెరుగవుతుందన్నారు. ఇంధన రంగంపై ప్రభుత్వం చేసే వ్యయం తగ్గుతుందని.. దీంతో పర్యావరణం కూడా మెరుగవుతుందని బాక్రే వివరించారు. ఇంధన సామర్థ్య రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ఆయన అభినందించారు. రోడ్ మ్యాప్ను రూపొందించాలి.. రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు ద్వారా అన్ని రంగాల్లో 15,787 మిలియన్ యూనిట్ల విద్యుత్ను పొదుపు చేసేందుకు అవకాశం ఉందని అజయ్ బాక్రే తెలిపారు. 2030 నాటికల్లా 6.68 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్విలెంట్ (ఎంటీవోఈ) ఇంధనాన్ని పొదుపు చేయాలనే లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ను రూపొందించాలని ఏపీ ఇంధన సంరక్షణ మిషన్కు సూచించారు. జాతీయ స్థాయిలో 2030 నాటికి 150 ఎంటీవోఈ ఇంధనాన్ని పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పారిశ్రామిక రంగాల్లో ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల్లో రాష్ట్రం కనబరుస్తున్న ఉత్తమ పనితీరుని చూసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ)ని సహాయక ఏజెన్సీగా నియమించినట్లు తెలిపారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
సాగర్ కాల్వలో ముగ్గురి గల్లంతు.. బాలుడిని కాపాడే కంగారులో ఈత రాకున్నా..
సాక్షి, ఖమ్మం: నగరంలోని సాగర్ ప్రధాన కాల్వ లో దానవాయిగూడెం వద్ద ఆదివారం ఈతకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఖమ్మం, కోదాడ, సూర్యాపేట ప్రాంతాల్లోని అభయ్ ఆయుర్వేదిక్ ఆస్పత్రి శాఖల్లో పనిచేసే కేరళకు చెందిన ఏడుగురు వారాంతంలో భాగంగా ఖమ్మంలో కలుసుకున్నారు. సరదాగా సాగర్ కాల్వలో ఈతకు వెళ్లగా ముగ్గురు గల్లంతయ్యారు. కోదాడ నుంచి వచ్చిన ప్రదీప్, షాజీ, సూర్యాపేట నుంచి వచ్చిన అభయ్ సంతోష్, ఖమ్మంలో ఉన్న పరకాల సోను, వివేక్, షిబ్బు తోపాటు, ఖమ్మం మేనేజర్ సోను కుమారుడైన 11 సంవత్సరాల బాలుడు షారోన్ కలిసి అదివారం సరదాగా ఈతకు వెళ్లారు. ప్రదీప్, షాజీ, షిబ్బులు ఈతకోసం కాల్వలో దిగారు. మిగిలినవారు ఒడ్డున కూర్చున్నారు. బాలుడు షారోన్ ప్రమాదవశాత్తు కాల్వలో జారి పడ్డాడు. చదవండి: ('అమ్మ, నాన్నను కలపండి సారూ..’: శాన్విత) ఇది గమనించిన తండ్రి పరకాల సోను దూకగా..ఈత రాకున్నా కాపాడే కంగారులో వివేక్, అభయ్ సంతోష్లు కూడా కాల్వలోకి దూకారు. పిల్లాడిని ప్రదీప్ కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. తండ్రి సోనును ఈతరాని ఇద్దరు వ్యక్తులు గట్టిగా పట్టుకోవడంతో ముగ్గురూ నీటిలో గల్లంతయ్యారు. ఖానాపురం హవేలి ఎస్ఐ మౌలానా ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. -
గన్ను కాదు.. పెన్ను పట్టండి
మల్కన్గిరి: కుటుంబ సభ్యులకు శాంతియుత జీవనాన్ని అందించేందుకు మావోయిస్టులు జనజీవన శ్రవంతిలోకి రావాలని రాష్ట్ర డీజీపీ అభయ్ కోరారు. చిన్నారులకు బంగారు భవిష్యత్ కోసం గన్ను పట్టిన చేతులతో పెన్ను అందించాలని పిలుపునిచ్చారు. కొరాపుట్ జిల్లాలోని మత్తిలి సమితి తులసిపహడ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఎన్కౌంటార్లో భాగస్వామ్యమైన ఆంధ్రప్రదేశ్, ఛత్తిస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు పోలీసు అధికారులతో రహస్య సమావేశం నిర్వహించారు. మావోయిస్టులను ఎలా అణచి వేయాలనే కార్యచరణపై చర్చించారు. మల్కన్గిరి జిల్లా సరిహద్దులో ముడు రాష్ట్రాల పోలీసు బృందాలతో సంయుక్తంగా కూంబింగ్ జరపాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేదని స్పష్టంచేశారు. మల్కన్గిరి జిల్లా ప్రస్తుతం అధివృద్ధి పథంలో నడుస్తోందని, స్థానిక కటాఫ్ ఏరియాలో అమాయక గిరిజనులను తప్పదోవ పట్టించవద్దని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని, కుటుంబాలకు ప్రశాంతమైన జీవనాన్ని అందించేందుకు జనంలోకి రావాలని సూచించారు. అలాగే ఎన్కౌంటర్లో పాలుపంచుకున్న పోలీసు దళాలను డీజీపీ అభినందించారు. అనంతరం ఎన్కౌంటర్లో స్వా«దీనం చేసుకొన్న మృతదేహలు, ఇతర సామగ్రీని విలేకర్ల ముందు ప్రదర్శించారు. ముగ్గురివీ.. మూడు రాష్ట్రాలు ఎన్కౌంటర్లో పోలీసులు స్వా«దీనం చేసుకున్న ఆయుధాల్లో ఎస్ఎల్ఆర్ రైఫిల్(1), ఏకే–47(1), ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్లు(3), కిట్ బ్యాగ్లు, బుల్లెట్లు, వాకీటాకీలు, మావోయిస్టు సాహిత్యం, విద్యుత్ వైర్లు, రేడియో, కత్తులు, జిలిటెన్ స్టిక్లు, ఇతర సామగ్రీ ఉన్నాయి. మృతిచెందిన మావోయిస్టులలో... మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి సుదకొండ గ్రామానికి చెందిన అనీల్ అలియాస్ కిషోర్ అలియాస్ దాసరి అలియాస్ ముకసోడి. ఆంధ్ర–ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీలో ఏసీఎంగా ఉన్నాడు. ఆయనపై రూ.5 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన సోనీపై రూ.4 లక్షలు రివార్డు ఉంది. ఆమె మావోయిస్టు అగ్రనేత అరుణక్క రక్షణ బృందంలో ఏసీఎంగా పని చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా పెదబాయిల్ గ్రామానికి చెందిన చిన్నారావు పార్టీ సభ్యుడు ఉన్నారు. అరుణక్క రక్షణ బృందంలోనే పని చేస్తున్నాడు. ఇతనిపై రూ.లక్ష రివార్డు ఉంది. పర్యటనలో ఐజీ ఆపరేషన్స్ అమితాబ్ ఠాకూర్, ఇంటిలిజెన్స్ డీఐజీ అనువృద్ధసింగ్, దక్షణాంచల్ డీఐజీ రాకేష్ పండిట్, మల్కన్గిరి ఎస్పీ ప్రహ్లాద్స్వొయి మిన్నా, ఇతర పోలీసుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రాత్రివేళల్లో డ్రాపింగ్కు అభయ్ వాహనాలు
చిత్తూరు అర్బన్ : మహిళల భద్రత కోసం చిత్తూరు పోలీసులు వినూత్న నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో చోటుచేసుకున్న దిశ హత్యాచారం దేశ వ్యాప్తంగా చర్చలకు, నిరసనలను దారితీసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలో అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు.. మహిళల భద్రత కోసం గురువారం నుంచే పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ వివరాలను ఎస్పీ సెంథిల్కుమార్ వివరించారు. ఆయన మాటల్లోనే.. అభయ్ వాహనాలు.. జిల్లా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నిలయం కావడంతో జాతీయ రహదారులపై నిత్యం వాహనాల రాకపోకలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారిలో మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. ఇక ఉన్నత విద్యను అభ్యసించే యువతులు కూడా ఉన్నారు. మహిళలు ఒంటరిగా వెళ్లాల్సినప్పుడు నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నా, రాత్రివేళ, రవాణా సౌకర్యం లేకున్నా, వాహనాలకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా వెంటనే డయల్–100కు ఫోన్ చేయాలి. సహాయార్థులను గమ్యస్థానానికి చేర్చడానికి అభయ్ వాహనాలను ఏర్పాటు చేశాం. ఫోన్ చేసిన కొద్దిసేపట్లోనే పోలీసు వాహనాలు వచ్చి వారి వెళ్లాల్సిన చోటుకు చేరుస్తారు. ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. మహిళా మిత్ర ఏర్పాటు.. మహిళలు, బాలికల సంరక్షణ కోసం మహిళామిత్ర పేరిట కొత్త కార్యక్రమాన్ని రూపొందించాం. రెండు మూడు రోజుల్లో దీన్ని ప్రారంభిస్తున్నాం. చిత్తూరు కేంద్రంగా పనిచేస్తున్న ఉమెన్–జువైనల్ వింగ్ను జిల్లా మొత్తం విస్తరిస్తాం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళామిత్ర ఉంటారు. సర్కిల్ పరిధిలో కనీసం ఎనిమిది మంది పోలీసులతో ప్రత్యేక బృందాలను నియమిస్తున్నాం. ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ బృందాలు మహిళలకు అండగా నిలవడంతో పాటు కళాశాలలు, విద్యాసంస్థలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సంచరిస్తూ మహిళల భద్రతను పర్యవేక్షిస్తాయి. వీడియోల ప్రదర్శన.. పిల్లలకు మంచి ఏదో, చెడు ఏదో తెలియాల్సిన సమయం ఇది. ఎదుటి వ్యక్తి పైన చెయ్యి వేస్తే ఏ ఉద్దేశంతో వేస్తున్నాడో పిల్లలు పసిగట్టాలి. ఇందుకోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో గుడ్, బ్యాడ్ టచ్ పేరిట వీడియోలు రూపొందించాం. వీటిని పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శించనున్నాం. ఇబ్బందికర పరిస్థితుల్లో ఏం చేయాలి..? చాకచక్యంగా తప్పించుకోవడం ఎలా..? పోలీసులకు ఎలా సమాచారం ఇవ్వాలి..? అనే దానిపై జిల్లా వ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
అవార్డులు వస్తాయంటున్నారు : ‘మార్షల్’ సక్సెస్మీట్లో శ్రీకాంత్
కొత్త హీరో అభయ్ హీరోగా, మేఘా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతూ పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్రలో నటించిన సినిమా ‘మార్షల్’.. ఏవీఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జయరాజ్ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సినిమా సక్సెస్ అవడంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సంధర్భంగా దర్శకుడు జయరాజ్ సింగ్ మాట్లాడుతూ.. విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మార్షల్’ సినిమాను ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మార్షల్ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని శ్రీకాంత్ అన్న ఇంత మంచి క్యారెక్టర్ చేయడం వల్లే సినిమా హిట్ అయ్యిందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కొత్త హీరో అభయ్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని జయరాజ్ సింగ్ అన్నారు. తన సినిమాని ఆదరించినందకు హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. హీరోయిన్ మేఘా చౌదరి మాట్లాడుతూ.. సినిమా విడుదలైన తర్వాత ప్రతీ ఒక్కరి నుంచి వస్తున్న అభినందనలు వింటుంటే చాలా సంతోషంగా ఉందని, సినిమాని ప్రతీ ఒక్కరూ చూసి బాగా చేశానని అంటున్నారని, ఇంకా చూడనివాళ్లు ఉంటే తప్పకుండా వెళ్లి సినిమా చూడాలన్నారు. హీరో అభయ్ మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ అవ్వడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీడియా సోదరులకు థ్యాంక్స్ చెప్పిన అభయ్.. ఫస్ట్ రోజు చాలా డల్ గా ఓపెనింగ్స్ స్టార్ట్ అయ్యాయని, కానీ రెండోరోజు నుంచి మౌత్ టాక్ తో ప్రేక్షకులు సినిమాని బాగా ఆదరిస్తున్నారని అన్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ ఇచ్చిన క్రిటిక్స్ అందరికీ పేరపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మౌత్ టాక్ తో పాటు ప్రేక్షకులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. ఈ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అందుకు కారణం శ్రీకాంత్ అని.. హీరోగా ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నానని అన్నారు. నిర్మాతగా కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ అవడంతో చాలా సంతోషంగా ఉన్నానని, ప్రతీ ఒక్కరూ సినిమా చూసి ఫోన్ చేసి చెబుతున్నారని, డైరెక్టర్ గురించి అడుగుతున్నారని, ఈ మధ్య కాలంలో నా సినిమాల్లో ఇది ఒక మంచి సినిమాగా నిలిచిపోయిందని అన్నారు. క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా మంచి అప్లాజ్ వచ్చిందని అన్నారు. సినిమాకు అవార్డులు కూడా వస్తాయని అంటున్నారని, అందులో డైరెక్టర్ కష్టం చాలా ఉందని అన్నారు. జయరాజ్ కచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతారని అన్నారు. మహాత్మ, ఖడ్గం సినిమాల తర్వాత అంత వైవిద్యమైన క్యారెక్టర్ ఇదేనని కొత్త హీరో అయినా కూడా అభయ్ చాలా బాగా చేశాడని, ప్రొడ్యూసర్ గా కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడని అన్నారు. ఒక్కసారి సినిమా చూడండి. నచ్చితే నలుగురికి చెప్పండని కోరారు. -
నా సినిమాల్లో మార్షల్ బెస్ట్
‘‘మార్షల్’ సినిమాతో అభయ్ నటుడిగా, నిర్మాతగా తెలుగు తెరకు పరిచయం అవడం ఆనందంగా ఉంది. ఈ మధ్య కాలంలో నేను చేసిన సినిమాల్లో ఈ సినిమా బెస్ట్ అని చెప్పొచ్చు. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా’’ అని శ్రీకాంత్ అన్నారు. అభయ్, మేఘా చౌదరి జంటగా శ్రీకాంత్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘మార్షల్’. జై రాజాసింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్లో నిర్మించారు. ఈ సినిమా రేపు విడుదలవుతోంది.హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అభయ్ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమిది. సాంగ్స్, ఫైట్స్, మదర్ సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి. స్వామిగారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నేను బాగా నటించడానికి శ్రీకాంత్గారు సపోర్ట్ చేశారు. ఆయనకి, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి’’ అన్నారు. ‘‘మొదటి సినిమాతోనే అభయ్ కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాడు. భవిష్యత్తులో అతను నటుడిగా మరో మెట్టు ఎక్కాలి’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ‘‘కథ విన్న వెంటనే ఈ సినిమా చేయడానికి అభయ్ ఒప్పుకున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసిన శ్రీకాంత్గారికి థ్యాంక్స్. కొత్త పాయింట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.. ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు జై రాజాసింగ్. -
‘మార్షల్’ పెద్ద హిట్ అవుతుంది : శ్రీకాంత్
మార్షల్ సినిమా తనకు బాగా నచ్చిందని ప్రముఖ హీరో శ్రీకాంత్ అన్నారు. ఈ మూవీ పెద్ద హిట అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన మార్షల్ చిత్రంలో హీరో శ్రీకాంత్ ముఖ్యమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. హీరో అభయ్ తన సోంత బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 13 న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీకాంత్తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ... అభయ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవ్వడం ఆనందంగా ఉందన్నారు. తను మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నట్టు చెప్పారు. హీరోగానే కాకుండా ఈ సినిమాతో నిర్మాతగా ఒక అడుగు ముందుకు వెయ్యడం సంతోషంగా ఉందన్నారు. మార్షల్ సినిమా చూసానని.. తను ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో ఈ మూవీ బెస్ట్ అని తెలిపారు. అభయ్ మాట్లాడుతూ...‘మా మార్షల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. అన్నీ జాగ్రత్తలు తీసుకొని మేము ఈ సినిమా తీశాము. స్వామి గారు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సినిమా గ్రాండ్గా వచ్చింది. నేను బాగా నటించడానికి చేయడానికి శ్రీకాంత్ సపోర్ట్ చేశారు. సెట్లో ఆయన చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి. సాంగ్స్, ఫైట్స్, మదర్ సెంటిమెంట్ ఇలా అన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. శ్రీకాంత్కు నాకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా ఎప్పుడు వచ్చినా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఈ సినిమా అలాగే అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్న’ట్టు తెలిపారు. డైరెక్టర్ జయరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘మా హీరో, నిర్మాత అభయ్ నేను ఈ కథ చెప్పినప్పుడు విన్న వెంటనే చెయ్యడానికి ఒప్పుకున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసిన శ్రీకాంత్ గారికి థాంక్స్. కొత్త పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము. సెప్టెంబర్ 13న విడుదల అవుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంద’ని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘అభయ్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం సంతోషం. మొదటి సినిమాతోనే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. భవిష్యత్తులో అతను నటుడిగా మరో మెట్టు ఎక్కాలని కోరుకుంటున్నాన’ని తెలిపారు. వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ.. ‘నాకు ఈ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన హీరో అభయ్కు థాంక్స్. నేను ఈ సినిమాలో రాసిన పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాన’ని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బర్సుర్ మాట్లాడుతూ...‘కేజీఎఫ్ సినిమా తరువాత నేను ఒప్పుకున్న సినిమా మార్షల్. కథ నచ్చి వెంటనే ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించాను. దర్శకుడు ఒక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నిర్మాత, హీరో అభయ్ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడు. సినిమా బాగా వచ్చింద’ని అన్నారు. హీరోయిన్ మేఘా చౌదరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నా పాత్ర మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అభయ్ తో కలిసి నటించడం బెస్ట్ మెమోరీస్ను ఇచ్చింది. సెప్టెంబర్13న వస్తున్న మా సినిమాను చూసి ఆదరించండి. హీరో శ్రీకాంత్ సెట్స్ లో బాగా సపోర్ట్ చేశారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు’ అని తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో రష్మి సమాంగ్, సుమన్, వినోద్కుమార్, శరణ్య, పృథ్వీరాజ్, రవిప్రకాష్, ప్రియదర్శిని రామ్, ప్రగతి, కల్పవల్లి, సుదర్శన్ తదిరులు నటిస్తున్నారు. వరికుప్పల యాదగిరి సంగీతం అందించగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రుర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్, మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల, ఫైట్స్ : నాభ, సుబ్బు, ఎడిటర్ : చోట కె ప్రసాద్, పాటలు : యాదగిరి వరికుప్పల, కళా దర్శకుడు : రఘు కులకర్ణి, డాన్స్ మాస్టర్ : గణేష్, ప్రోడక్షన్ కంట్రోలర్ : చిన్నరావు ధవళ, నిర్మాత : అభయ్ అడకా. -
‘మార్షల్’కు ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్
అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం సైంటిఫిక్ థ్రిల్లర్ ‘మార్షల్’.. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 13 న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సినిమా విశేషాలను తెలియజేశారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రుర్ ‘మార్షల్’ సినిమా చూసి కంటెంట్ నచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈ సినిమాకు రీ రికార్డింగ్, 2 పాటలను సమకూర్చారని తెలిపారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్లకు పైగా రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాత, హీరో అభయ్ తెలిపారు. ఈ సినిమాలో శ్రీకాంత్ పోషించిన పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తండిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
అట్టహాసంగా ‘మార్షల్’ ఆడియో ఆవిష్కరణ
అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 19న విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో, టీజర్ అవిష్కరణ ఇటీవలే గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు హాజరై... ఆడియోను ఆవిష్కరించారు. ఆడియో సీడీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ‘హీరో అభయ్ కథానాయకుడిగా.. నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించి... తన జన్మస్థలమైన గుంటూరులోనే ఆడియో ఆవిష్కరణ వేడుక జరుపుకోవడం ఎంతో సంతోషకరం. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’నని అన్నారు. నిర్మాత, హీరో అభయ్ అడకా మాట్లాడుతూ ‘నేను పుట్టి పెరిగిన గుంటూరులో నా తొలిచిత్రం ఆడియో ఫంక్షన్ను ఇంత మంది పెద్దల సమక్షంలో చేయడం ఆనందంగా వుంది. ఇదో వైవిద్యభరితమైన చిత్రం. మార్షల్తో ఓ మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాం. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంద’ని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సినిమా అన్ని వర్గాల వారికి నచ్చేలా ఉంటుంది. నిర్మాత మరియు హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, నూతనంగా ఉంటుందని వివరించారు. సినీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక మరచిపోలేని పాత్రకు ప్రాణం పోశార’ని చెప్పారు. ‘కె జి ఎఫ్’ మ్యూజిక్ ఫేమ్ రవి బసురి తెలుగు సినిమా మార్షల్ సినిమా కంటెంట్ ప్రత్యేకంగా నచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈ సినిమాలో రీ రికార్డింగ్ తో పాటు 2 పాటలను సమకూర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరి, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, ముస్తఫా మరియు మద్దాల గిరి, బోనబోయిన శ్రీనివాసయాదవ్, నిమ్మకాయల రాజా నారాయణ, హీరోయిన్ మేఘా చౌదరి పాల్గొన్నారు. -
నాడు సామాన్యులు.. నేడు అసామాన్యులు
సాక్షి, హైదరాబాద్ : ‘రెండేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న 2017 ఐపీఎస్ బ్యాచ్కు ఎంపికైన వారంతా సామాన్యులే. వారి పట్టుదలే వారిని ఈ రోజు అసామాన్యులుగా సమాజానికి పరిచయం చేస్తోంది’ అని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభయ్ అన్నారు. 24వ తేదీన ఐపీఎస్ 2017 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం బ్యాచ్ క్యాడెట్లను మీడియాకు పరిచయం చేశారు. ఈ బ్యాచ్లో ఎంపికైన వారంతా సామాన్య కుటుంబాలవారేనని, మారుమూల పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చిన వారేనని వెల్లడించారు. వీరంతా ఇప్పుడు సమాజసేవకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. మొత్తం 92 మందిలో 80 మంది పురుషులు, 12 మంది మహిళలు. అందులో ఆరుగురు రాయల్ భూటాన్ పోలీసు, ఐదుగురు నేపాల్ పోలీస్ విభాగానికి చెందిన విదేశీయులున్నారు. ట్రైనీలంతా చాలా కష్టపడి శిక్షణ పూర్తి చేశారని వివరించారు. వీరందరికీ కఠోర శిక్షణ ఇచ్చామని, 40 కి.మీ.ల దూరం మేర 10 కేజీల భారాన్ని మోస్తూ ఎండలో ఆగకుండా పరుగులు పెట్టించామన్నారు. దేశంలోని అత్యున్నత దర్యాప్తు, నిఘా సంస్థలతోనూ వీరికి దశలవారీగా శిక్షణ ఇచ్చామని వివరించారు. ఢిల్లీకి చెందిన గౌస్ ఆలం, యూపీకి చెందిన రిచా తోమర్, బెంగాల్కు చెందిన పలాష్ చంద్ర, నేపాల్కు చెందిన క్రిష్ణ కడ్కా, అను లామాలు ఈ బ్యాచ్లో వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచారని తెలిపారు. తెలంగాణకు ముగ్గురు, ఏపీకి ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేటాయించారు. 24వ తేదీన దీక్షంత్ పరేడ్ పేరిట జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు.. తెలంగాణకు చెందిన గరికపాటి బిందు మాధవ్, వాసన విద్యాసాగర్ నాయుడు, ఉత్తర్ప్రదేశ్కు చెందిన తుహిన్ సిన్హా ఏపీ కేడర్కు ఎంపికయ్యారు. ఢిల్లీకి చెందిన గౌస్ ఆలం, కర్ణాటకకు చెందిన డాక్టర్ వినీత్, డాక్టర్ శబరీశ్లను తెలంగాణ కేడర్కు కేటాయించారు. తెలంగాణకు చెందిన బీబీజీటీఎస్ మూర్తిని యూపీకి కేటాయించారు. ఏపీకి చెందిన కేవీ అశోక్ను యూపీ, బోగాటి జగదీశ్వర్రెడ్డిని త్రిపుర, మల్లాది కార్తీక్ని మణిపూర్ కేడర్కు కేటాయించారు. ఇంజనీర్లు, డాక్టర్లదే పైచేయి.. ఈసారి బ్యాచ్లో విద్యార్హతల పరంగా ఇంజనీర్లు, డాక్టర్లదే పైచేయిగా నిలిచింది. మొత్తం 92 మంది ఐపీఎస్ అధికారుల విద్యా నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే.. ఆర్ట్స్–7, సైన్స్–5, కామర్స్–02, ఇంజనీరింగ్–57, మెడిసిన్–11, ఎంబీఏ–7, ఇతరులు–3 మంది ఉన్నారు. -
నమ్మకంగా ఉన్నాం
శ్రీకాంత్ విభిన్న పాత్రలో నటించిన చిత్రం ‘మార్షల్’. ఈ చిత్రంతో అభయ్ హీరోగా పరిచయమవుతున్నారు. జై రాజసింగ్ దర్శకత్వం వహించారు. మేఘాచౌదరి, రష్మి సమాంగ్ కథానాయికలు. ఏవీఎల్ ప్రొడక్షన్పై అభయ్ అడక నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. సమాజానికి మంచి సందేశం కూడా ఉంటుంది. ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసిన టీజర్కు మంచి స్పందన వస్తోంది. టీజర్ 20 లక్షల వ్యూస్ సాధించి, అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే 20 లక్షల వ్యూస్ రావడంతో ఈ చిత్రంపై ముందు నుంచి మాకు ఉన్న నమ్మకం మరింత పెరిగింది. ఇటీవల హిట్స్గా నిలిచిన చిత్రాల జాబితాలో మా ‘మార్షల్‘ కూడా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల, కెమెరా: స్వామి ఆర్. యమ్. -
‘మా నమ్మకాన్ని మరింత పెంచింది’
పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ కీలక పాత్రలో అభయ్ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘మార్షల్’. ఏవీఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరొయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్ ఈనెల 5న తలసాని గారి చేతులమీదగా విడుదలైంది. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన గంటల్లో హాఫ్ మిలియన్ వ్యూస్ రాబట్టి ఈ టీజర్ అదే దూకుడుతో 2 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఇప్పటికే 20 లక్షల వ్యూస్ రావడం.. ఈ చిత్రంపై ముందు నుంచి మాకు గల నమ్మకాన్ని మరింత పెంచింది. ఇటీవల కాలంలో ట్రెండ్ సిట్టింగ్ హిట్స్ గా నిలిచిన చిత్రాల జాబితాలో మా ‘మార్షల్’ కూడా కచ్చితంగా స్థానం పొందుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. -
చిన్న సినిమాలను ఆదరించాలి
‘‘కొత్తవాళ్లు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. ఇండస్ట్రీ కూడా ప్రాంతాల విభేదం లేకుండా ప్రతిఒక్కరినీ ఆదరించాలి. సినిమా ఇండస్ట్రీ అనేది లక్షలాదివాళ్లకి ఉపాధి కల్పిస్తు్తంది. చిన్న సినిమాలకు ప్రమోషన్ ఎంతో అవసరం. అందరం చిన్న చిత్రాలను ఆదరించాలి’’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శ్రీకాంత్, మేఘాచౌదరి, అభయ్ ముఖ్య పాత్రల్లో జైరాజాసింఘ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మార్షల్’. ఏవీఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్పై అభయ్ అదాక నిర్మించిన ఈ సినిమా టీజర్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఇండస్ట్రీకి ఎంతమంది కొత్తవారు వస్తే అంత కొత్త కథలు వస్తాయి. అభయ్కి, జైరాజాసింఘ్కి ఈ సినిమా మొదటి చిత్రంలా లేదు. ఎంతో అనుభవం ఉన్నవారిలా తీశారు. ‘జెర్సీ’ సినిమా కూడా చాలా బావుంది. ‘మార్షల్’ చిత్రం మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు. అభయ్ మాట్లాడుతూ– ‘‘ఒక నటుడిగా, నిర్మాతగా నా ప్రయత్నం వెనుక ముందునుంచి నా వెన్నంటే ఉన్న తలసానిగారికి కృతజ్ఞతలు. శ్రీకాంత్ అన్న కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన లేకుంటే ఈ సినిమా లేదు. జయ్రాజ్ తన సొంత సినిమాలాగా చేశారు’’ అన్నారు. ‘‘మెడికల్ యాక్షన్ మూవీ ఇది. ఒక మనిషి ఇంత ఈజీగా బతుకుతున్నాడంటే దానికి కారణం ఒక సైంటిస్ట్. అందులోంచి వచ్చిన కథే ‘మార్షల్’ అన్నారు జైరాజాసింఘ్. ‘‘నేను కథ విన్నాక రెండురోజులు టైం అడిగి ఓకే చెప్పాను. పైగా కొత్త దర్శకుడుకి అవకాశం ఇవ్వాలనుకున్నా. ఈ సినిమా చూశాక తప్పకుండా అందరూ మెచ్చుకుంటారు’’ అని శ్రీకాంత్ అన్నారు. మేఘాచౌదరి మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల, నేపథ్య సంగీతం: కె.జి.ఎఫ్.రవిబాసుర్, కెమెరా: స్వామీ ఆర్.ఎం. -
సమాజానికి సందేశం
అభయ్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మార్షల్’. జై రాజసింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషించారు. మేఘా చౌదరి కథానాయిక. ఏవీఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై అభయ్ అడకా నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. జై రాజసింగ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘మార్షల్’. అభయ్ అడకా పాత్ర హుందాగా, కొత్తగా ఉంటుంది. శ్రీకాంత్ మంచి పాత్ర చేశారు. ఆర్.యం. స్వామి సినిమాటోగ్రఫీ, యాదగిరి వరికుప్పల సంగీతం, నాభ, సుబ్బుల ఫైట్స్ ఎసెట్స్గా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘వైవిధ్యభరితమైన చిత్రం ‘మార్షల్’. మంచి సందేశం కూడా ఉంటుంది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అని అభయ్ అడకా అన్నారు. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మార్షల్’
పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషిస్తుండగా అభయ్ హీరోగా పరిచయమవుతొన్న చిత్రం ‘మార్షల్’. ఏ వి ఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరొయిన్గా నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు జై రాజ సింగ్ మాట్లాడుతూ 2019 లో విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను మంగళవారం విడుదల చేశారు. హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, కొత్తగా ఉంటుందన్నారు. సినీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక మరచిపోలేని పాత్రకు ప్రాణం పోశారని తెలిపారు. ఆర్.యం.స్వామి సినిమాటోగ్రఫీ, యాదగిరి వరికుప్పల సంగీతం ఎసెట్స్ గా నిలుస్థాయన్నారు. నిర్మాత అభయ్ అడకా మాట్లాడుతూ మంచి మెసేజ్ ఉన్న వైవిద్యభరితమైన చిత్రం మార్షల్ అన్నారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకువస్తామన్నారు. -
సుడిగాలి వస్తోంది
వెంకటేష్ గౌడ్, ప్రాచీ అధికారి, అభయ్, కులకర్ణి మమత ముఖ్య తారలుగా రమేష్ అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘సుడిగాలి’. శివపార్వతి క్రియేషన్స్పై చెట్టుపల్లి వెంకటేష్, బిరాదర్ మల్లేష్ నిర్మించారు. రాప్ రాక్ షకీల్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఎమ్మెల్సీ రాములు నాయక్, నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. ‘‘పాటలు, ట్రైలర్ బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్తో వస్తున్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. అదే తరహాలో ‘సుడిగాలి’ సినిమా సూపర్ హిట్ కావాలి’’ అన్నారు రాములు నాయక్. ‘‘యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమిది. మా చిత్రంలో సుమన్గారు మంచి పాత్ర చేశారు. సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నాం’’ అన్నారు నిర్మాతలు. ‘‘హీరో హీరోయిన్లు కొత్తవారైనా బాగా నటించారు’’ అన్నారు రమేష్ అంకం. ‘‘సుడిగాలి’తో నాకు మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు వెంకటేశ్. ఈ చిత్రానికి కెమెరా: విద్యాసాగర్, సమర్పణ: చెట్టుపల్లి లక్ష్మి. -
జిగేల్ జిగేల్
అభయ్, గీత్ షా జంటగా నాగరాజు తలారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జిగేల్ జిగేల్’. శ్రీ నవ నారాయణ సినీ క్రియేషన్స్ పతాకంపై అంజనప్ప, నాగరాజ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సింగర్ నేహా మౌష్మి కెమెరా స్విచ్చాన్ చేయగా, పారిశ్రామికవేత్త పట్నం యాదగిరి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు టిన్. రాజు గౌరవ దర్శకత్వం వహించారు. నాగరాజు తలారి మాట్లాడతూ– ‘‘యాక్షన్, సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. వినోదం కూడా జోడించాం. మూడు షెడ్యూల్స్లో షూటింగ్ కంప్లీట్ చేయనున్నాం. మూడు ఫైట్లు, ఐదు పాటలు ఉంటాయి’’ అన్నారు. ‘‘నా మొదటి చిత్రం ‘సుడిగాలి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘జిగేల్ జిగేల్’ రెండవ సినిమా’’ అన్నారు అభయ్. ‘‘ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమా నిర్మిస్తున్నాం. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు. హీరోయిన్ గీత్షా, చిత్ర సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి బైపల్లి. -
అల్లరి అభయ్
పాలు తాగడానికి కొంత మంది పిల్లలు మారం చేస్తుంటారు. అప్పుడు అమ్మలు కపట కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి కోపాన్ని నటిస్తూ తనయుడు అభయ్తో పాలు తాగించారు ఎన్టీఆర్ భార్య ప్రణతి. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని ఎన్టీఆర్ పంచుకుంటూ – ‘‘రోజూ పాలు తాగే విషయంలో వాళ్ల అమ్మ (ప్రణతి) స్ట్రిక్ట్ చూపుల నుంచి అభయ్ తప్పించుకోలేడు’’ అంటూ కోపంగా చూస్తున్న ప్రణతి, పాలు తాగుతున్న అభయ్ ఫొటోను షేర్ చేశారు ఎన్టీఆర్. -
జంపన్న మావోయిస్టు పార్టీ ద్రోహి
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న అలియాస్ జినుగు నర్సింహారెడ్డి పోలీసులకు లొంగిపోయిన సందర్భంగా చేసిన ఆరోపణలపై ఆ పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా స్పందించింది. జంపన్నను మావోయిస్టు పార్టీ ద్రోహిగా అభివర్ణించింది. పీపుల్స్ వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ)లో ఉద్యమ ప్రస్థానం ప్రారంభించిన జంపన్న మూడు దశాబ్దాలపాటు పార్టీలో పనిచేశారని, అలాంటి వ్యక్తి పార్టీపై చేసిన ఆరోపణలు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వ్యవహారంలా కనిపిస్తోందని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం మీడియాకు లేఖ విడుదల చేశారు. పార్టీలో ఉంటూ క్యాడర్ మనోస్థైర్యం కోల్పోయేలా జంపన్న వ్యవహరించారని దుయ్యబట్టారు. పార్టీ సిద్ధాంతాల కోసం వేలాది మంది ప్రాణాలను అర్పించారని, అలాంటి పార్టీపై సైద్ధాంతిక విభేదాలతో బయటకు వచ్చానని చెప్పడం అభ్యంతరకరమన్నారు. ఒడిశా కమిటీ క్యాడర్తో జంపన్న వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని, పద్ధతి మార్చుకోవాలని చాలాసార్లు సూచించినా వినకుండా క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా జంపన్న ప్రవర్తించాడని ఆరోపించారు. అంతే కాకుండా కేంద్ర కమిటీ అప్పగించిన ఏ పని కూడా సరైన రీతిలో చేయకుండా విఫలమయ్యాడని, కొన్నేళ్ల నుంచి జంపన్న పనితీరుపై కేంద్ర కమిటీ అసంతృప్తిగా ఉందని అభయ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఏడాది క్రితమే కేంద్ర కమిటీ జంపన్నపై రెండేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసిందన్నారు. పార్టీ కమిటీలో చర్చించకుండా బహిరంగంగా మాట్లాడటం కూడా జంపన్న సస్పెన్షన్కు మరో కారణమన్నారు. శత్రువు ఎదుట మోకరిల్లాడు... పార్టీలో చేసిన అనేక తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించకుండా జంపన్న విలువలు కాలరాసి శత్రువు ఎదుట మోకరిల్లాడంటూ కేంద్ర కమిటీ మండిపడింది. వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థ అలవాట్లకు తలొగ్గి జంపన్న లొంగిపోయినట్లు అభయ్ విమర్శించారు. ప్రస్తుతం దేశ పరిస్థితులకు తగ్గట్లుగానే మావోయిస్టు పార్టీలో మార్పు జరిగిందని, ఈ అంశంపై చర్చించేందుకు పార్టీలోని కేంద్ర కమిటీ సభ్యులకు స్వేచ్ఛ కూడా ఉందని అభయ్ తెలిపారు. అయితే కేంద్ర కమిటీ సమావేశాలకు రాకుండానే పార్టీలో మార్పులపై చర్చించే అవకాశం లేదంటూ జంపన్న పోలీసుల ఎదుట ఆరోపించడం సమంజసం కాదన్నారు. దేశ పరిస్థితులకు తగ్గట్లుగా మావోయిస్టు పార్టీలో మార్పు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు పార్టీ క్యాడర్ మొత్తం కృషి చేస్తున్న సందర్భంలో పార్టీ నుంచి బయటకు వెళ్లి విమర్శించడం ఎలాంటి సిద్ధాంతమో జంపన్న ఆలోచించుకోవాలని అభయ్ వ్యాఖ్యానించారు. -
జంపన్న ద్రోహం చేశాడు
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ సభ్యుడు జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న ద్రోహం చేశాడని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిథి అభయ్ లేఖ ద్వారా తెలిపాడు. లేఖ సారాంశం..జంపన్నను ఏడాది క్రితం సస్పెండ్ చేశామని చెప్పారు. సస్పెండ్ తర్వాతే మావోయిస్టు పార్టీతో విభేదిస్తున్నట్లు తమతో చెప్పాడని వెల్లడించారు. లొంగుబాటు గురించి తమతో చర్చించలేదన్నారు. జంపన్న శత్రువు ముందు మోకరిల్లాడని, మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల పట్టు కోల్పోయాడని విమర్శించారు. మావోయిస్టు పార్టీ పై ఆయన వ్యాఖ్యలు అర్ధరహితమని, ఎర్రజెండా నీడలో మావోయిస్టు పార్టీ బలంగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సొంత లాభం , రాజకీయ స్వార్ధం కోసమే జంపన్న పార్టీని వీడాడని లేఖ ద్వారా విమర్శించారు. -
సరికొత్తగా...
విలన్గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా మారి మొత్తంగా వంద సినిమాలు పూర్తి చేశారు శ్రీకాంత్. తాజాగా వచ్చిన ‘యుద్ధం శరణం’ సినిమాలో మళ్లీ విలన్ పాత్రలో కనిపించి, అందర్నీ ఆశ్చర్యపరిచిన ఆయన మరో సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అభయ్ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ జై రాజాసింగ్ దర్శకత్వంలో ఏవీఎల్ ప్రొడక్షన్స్ సంస్థ కొత్త చిత్రం రూపొందించనుంది. మెడికల్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ మూవీలో శ్రీకాంత్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘కథ వినగానే నచ్చి, వెంటనే ఒప్పుకున్నా. ఇలాంటి మంచి కథలో కీ రోల్ చేస్తుండటం సంతోషంగా ఉంది. జై రాజాసింగ్ కొత్త దర్శకుడైనా భిన్నమైన కథను ప్రతిభావంతంగా రాసుకున్నారు’’ అన్నారు. ‘‘ఎప్పుడూ మంచి పాత్రలు, వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయాలని శ్రీకాంత్గారు ఆరాటపడుతుంటారు. ఆయనలో గొప్ప నటుడున్నారు. కథ రాసుకుంటున్నప్పుడే ఈ పాత్ర ఆయనే చేయాలని అనుకున్నా. ఇప్పటివరకూ చూడని కొత్త తరహాలో ఆయన పాత్ర ఉంటుంది’’ అన్నారు జై రాజా సింగ్. -
జూనియర్ ఎన్టీఆర్కు కరెక్టు మొగుడు అతనే!
బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టడంలో, కలెక్షన్లతో అదరగొట్టడంలో అతనికి అతనే సాటి. అలాంటి టాలీవుడ్ యంగ్ టైగర్కి ఇప్పుడు కరెక్ట్ మొగుడు వచ్చాడట. జూనియర్ ఎన్టీఆర్కు సన్నిహితుడైన మంచు మనోజ్ ఈ ముక్క చెప్పాడు. వరుస విజయాలతో ఊపుమీదున్న తారక్కు కరెక్ట్ మొగుడు దొరికాడని మనోజ్ తెగ ఇదవుతున్నాడు. ఇంతకీ ఆ మొగుడు ఎవరంటే.. బుజ్జీ ఎన్టీఆరే. ఇంతకు విషయమేమిటంటే.. తాజాగా మంచు మనోజ్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లాడట. అక్కడికి వెళ్లగానే ఎన్టీఆర్ బుజ్జీ తనయుడు అభయ్ చల్లటి నీళ్ల గ్లాసుతో స్వాగతం పలుకడమే కాదు.. స్వయంగా తానే గ్లాస్ పట్టుకొని తాగించాడు కూడా. అంతే బుజ్జీ అభయ్ ప్రేమకు పొంగిపోయిన మనోజ్.. ఈ బుడ్డోడే తారక్కు కరెక్ట్ మొగడంటూ ఫొటో పెట్టి మరీ ట్వీట్ చేశాడు. ఈ సరదా ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. -
కమల్ ఫ్లాప్ సినిమా రీ రిలీజ్
2001లో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన డిఫరెంట్ మూవీ అభయ్. కమల్ డ్యూయల్ రోల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సైకోగా కమల్ నటన, గ్రాఫిక్స్, టేకింగ్లకు మంచి స్పందన వచ్చింది. కానీ కమర్షియల్గా మాత్రం ఈ సినిమా నిరాశపరిచింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ టాక్తో నిరాశపరిచింది. రవీనా టండన్, మనీషా కొయిరాల లాంటి టాప్ స్టార్స్ నటించిన ఈ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు ముందుగా అలవందన్ అనే టైటిల్ను నిర్ణయించారు. తెలుగులో అభయ్ అనే పేరుతో సినిమాను రిలీజ్ చేశారు. కానీ రీ రిలీజ్లో మాత్రం అలవందన్ టైటిల్నే ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటి సాంకేతికతకు తగ్గట్టుగా డిజిటలైజ్ చేసి సినిమాను రిలీజ్ చేయనున్నారు. కలైపులి ఎస్ థాను ఈ రీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 500 థియేటర్లలో రిలీజ్ చేయాలని భావిస్తున్న ఈ సినిమా డిజిటలైజేషన్ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ద్వితియార్థంలో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. -
కళ్లు మూసేసి..!
ఎన్టీఆర్కు ఈ ఏడాది అందరికంటే ముందుగా బర్త్డే విషెస్ చెప్పింది ఎవరో తెలుసా? ఎన్టీఆర్ తనయుడు అభయ్. విషెస్ చెబుతూ ఏం చేశాడో తెలుసా? ఎన్టీఆర్ కళ్లు మూసేశాడు! చిట్టి చిట్టి చేతులతో నాన్న కళ్లను మూసేయడమంటే... అభయ్కు ఇష్టమట. నిన్న (శనివారం) ఎన్టీఆర్ బర్త్డే. కుటుంబ సభ్యులతో కలసి బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నారాయన. ఫ్యామిలీ ఫొటోలను ట్వీట్ చేస్తూ – ‘‘అభయ్ చెప్పిన ఈ ఏడాది ఫస్ట్ బర్త్డే విషెస్ నాకెంతో విలువైనవి. ఎందుకో తెలీదు... అభయ్ జస్ట్ లవ్స్ క్లోజింగ్ మై ఐస్’’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. సతీమణి లక్ష్మీప్రణతి ఫోన్లో ఎన్టీఆర్కు ఏదో చూపించడానికి ప్రయత్నిస్తుంటే బుల్లి అభయ్ తండ్రి కళ్లను ఎలా మూశాడో చూశారుగా... కొడుకు అల్లరికి ఎన్టీఆర్ భలే మురిసిపోతున్నారు కదూ. గ్యారేజ్ను మించేలా... ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో ఆయన మరో సినిమా చేయనున్నారు. యువసుధ ఆర్ట్స్ పతాకంపై కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అనుభవంతో నిర్మాతగా మారుతున్నా. ‘జనతా గ్యారేజ్’ను మించేలా, భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాం’’ అన్నారు సుధాకర్. -
మూడుముడులకు నారుమడులు
పెళ్లి వేడుకల కోసం మనసు విహంగంలా విహరించినా కాళ్లు నేలపైనే ఉండాలనే విషయాన్ని గుర్తించి నిరాడంబర వివాహాలకు మొగ్గు చూపుతోంది ఈ తరం. సాదాసీదాగా పెళ్లి చేసుకొని పొదుపు చేసిన సొమ్ముతో మరో పది కుటుంబాల్లో వెలుగులు నింపాలనే నవతరం దంపతుల ఆదర్శం ఆ పెళ్లిళ్లకే కొత్త కళను చేకూరుస్తోంది! అలా రైతుల ఇంటి సంతోషాల నారు వేసిన ఓ జంట కథ ఇది. వరుడు అభయ్. వధువు ప్రీతి కుంభారే. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో వారి మధ్య ప్రేమ మొగ్గ తొడి గింది. నాగపూర్లో ఐఆర్ఎస్ ఆఫీసర్గా అభయ్కు, ముంబై ఐడీబీఐ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా ప్రీతికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రీతి స్వస్థలం మహారాష్ట్రలోని యావత్మాల్. అభయ్ స్వస్థలం అదే రాష్ట్రంలో ఉన్న అమరావతి పరిధి లోని ఓ గ్రామం. ఈ రెండూ కూడా రైతు ఆత్మహత్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రాంతాలు. ఈ వధూవరులు తమ పెళ్లి ఖర్చుల కోసం దాచుకున్న సొమ్ముతో ఆత్మహత్యలు చేసుకున్న ఆయా గ్రామాల రైతు కుటుంబాలకు సహాయపడాలనుకున్నారు. అందుకోసం నిరాడంబరంగా పెళ్లి చేసుకుంటామని కుటుంబ సభ్యులను కోరారు. ఇరువైపులా కుటుంబాలు సంతోషించటమే గాక రైతు కుటుంబాలను పెళ్లికి ఆహ్వానించే బాధ్యతను తీసుకున్నారు. మంత్రఘోష లేదు.. మంగళ వాద్యాలు లేవు సంప్రదాయాన్ని పక్కనబెట్టి అమరావతిలోని అభియంతా భవన్లో ఈ జంట ఒకటయ్యారు. అక్కడ పెళ్లి వాతావరణం మచ్చుకైనా కనిపించ లేదు. బాజా భజంత్రీలు లేవు. పెళ్లి తర్వాత పడవ కారులో ఊరేగింపులు, టపాసులు మోత, తీన్మార్ దరువుల ఊసే లేదు. వంటల ఘుమఘుమలు, నోరూరించే పిండి వంటలు లేనే లేవు. చపాతి, అన్నం, పప్పు, కూరలు వంటి సామాన్య భోజనంతో అతిథులను సంతృప్తిపరచారు. రివాజుగా వచ్చే ఆచారాలు, సంప్రదాయాలను దరిచేరనివ్వలేదు. వేదికపైనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. రైతు ఆత్మహత్యల గురించి వివరించే వివిధ రకాల గోడచిత్రాలు, బ్యానర్లను వేదికనిండా అతికించారు. పెళ్లిలో రైతు నాయకులు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా ముందువరుసలో కొలువు తీరారు. పది రైతు కుటుంబాలకు తలా 20 వేలు కొండలా పేరుకుపోయిన అప్పులు, వరుస పంట నష్టాలతో తనువు చాలించటంతో అండదండలు కోల్పోయిన 10 మంది రైతుల కుటుంబాలకు తలా రూ. 20 వేల చొప్పున ఇచ్చారు ఈ దంపతులు. వారి పిల్లలను ఇంటర్మీడియట్ వరకు పిల్లలను చదివించే బాధ్యతను కూడా తీసుకున్నారు. దీంతోపాటు అభయ్ స్వగ్రామం ఉమ్బర్దా బజార్ లోని ఐదు లైబ్రరీలకు రూ. 52 వేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను ఇచ్చారు. తమ జీతాల్లోంచి పెళ్లి కోసమని దాచుకున్న డబ్బును దీనికోసం వాడారు. చంద్రకాంత్ వాంఖేడే, అర్జున్ థోసరే లాంటి రైతు నాయకులు రైతుల ఆత్మహత్యలపై చేసిన ప్రసంగాలు అతిథులను కంటతడి పెట్టించాయి. ఎన్నో పెళ్లిళ్లకు హాజరైన తమకు ఈ పెళ్లి ప్రత్యేకమని.. ప్రీతి, అభయ్లతో పాటు తమకు ఇది జీవితాంతం గుర్తుండే అనుభవమని వారు చెప్పారు. ‘మేము కూడా నిరాడంబరంగా పెళ్లి చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు మా వంతు సహాయ పడతాం’ అని పెళ్లికి హాజరైన యువతీ యువకులు ప్రతిన పూనారు. రైతు కుటుంబాల్లో వెలుగులు పంచేందుకు పెళ్లి మండపాన్నే వేదికగా చేసుకున్న అభయ్ ప్రీతి దంపతులకు ఇది ఒక జీవిత కాలపు మధురానుభూతి. - దండేల కృష్ణ -
'లోక' కల్యాణం!
ఆదర్శం పెళ్లి ఆడంబరాలకు అయ్యే ఖర్చును... మంచి పనులకు వినియోగిస్తే ఇంతకుమించి లోకకల్యాణం ఏముంటుంది! ‘మన తాహతుకు తగ్గట్టు పెళ్లి ఘనంగా జరగాలి’ అంటుంటారు. ఈ ‘ఘనంగా జరగడం’ అనేది ఇప్పుడు తాహతును దాటిపోయింది. ‘ఎంత ఎక్కువగా ఖర్చు చేస్తే పెళ్లి అంత ఘనంగా జరిగినట్లు’ అనే అపోహ ఏర్పడింది. ఖర్చు కోసమే ఖర్చు ఎక్కువైపోయింది. పెళ్లి ఖర్చును నియంత్రిస్తే, పెళ్లిని నిరాడంబరంగా జరుపుకుంటే... లోకహితమైన పనులు చేయవచ్చని నిరూపించి ఆదర్శంగా నిలుస్తున్నారు మహారాష్ట్రకు చెందిన అభయ్, ప్రీతి దంపతులు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్టాక్స్గా నియమితుడైన అభయ్కి శిక్షణకాలంలో నిర్వహించే ఫీల్డ్విజిట్లో భాగంగా సహోద్యోగులతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకునే అవకాశం వచ్చింది. ‘‘సామాజిక-రాజకీయమార్పులకు మీరు ప్రతినిధులు కావాలి’’ అంటూ తన ఉపన్యాసంలో యువ అధికారులను ఉత్తేజపరచారు ప్రణబ్. రాష్ట్రపతి మాటలు అభయ్పై బలంగా ప్రభావం చూపాయి. సమాజం కోసం తనవంతుగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ సమయంలోనే మనదేశంలో పెళ్లి ఖర్చుల గురించిన ఒక నివేదిక అభయ్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మన దేశంలో ప్రతి ఏటా పెళ్లిళ్ల కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు జరుగుతుంది! ‘‘మనలాంటి పేదదేశంలో ఇది భారీ ఖర్చు’’ అనుకున్నాడు అభయ్. ఇదే సమయంలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలు అభయ్ని కదిలించాయి. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఆర్థిక శాఖ కేటయించిన మొత్తం రూ.36 వేల కోట్లు. దేశంలో ఏటా జరిగే పెళ్లిళ్ల బడ్జెట్లో ఇది సగం కూడా కాదు! తనను ఆశ్చర్యపరిచిన సర్వేలో... పెళ్లి ఖర్చుల కోసం ఎలా అప్పు చేస్తున్నారో, పొదుపు మొత్తాలను ఎలా ఖర్చు చేస్తున్నారో... వీటికి సంబంధించిన వివరాలను చదివాడు అభయ్. అభయ్ తండ్రి కూడా రైతే. ఆయనకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో రెండెకరాలను కూతురు పెళ్లి కోసం అమ్మాడు. నివేదిక చదువుతున్న సమయంలో గతం గుర్తుకు వచ్చింది అభయ్కి. పుణేలో యూపీఎస్సీ కోసం ప్రిపేరవుతున్న ప్పుడు బీటెక్ పూర్తయిన ప్రీతి పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రెండు నెలల క్రితం అమరావతి జిల్లా కేంద్రంలోని అభియంత భవన్లో అభయ్, ప్రీతిల వివాహం జరిగింది. ఈ పెళ్లితోనే తమ సేవాపథానికి తొలి అడుగు పడాలనుకున్నాడు అభయ్. పెళ్లికి అయ్యే ఖర్చుతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నట్లు అభయ్ చెప్పినప్పుడు తల్లిదండ్రులు సంతోషంగా ఆమోదించారు. ‘‘పెళ్లికయ్యే ఖర్చును పేదరైతుల కోసం ఖర్చు చేయాలనుకుంటున్నాం అని నా కొడుకు, కోడలు చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది’’ అంటాడు అభయ్ తండ్రి సిద్ధార్థ. అభయ్-ప్రీతి పెళ్లిలో పదిమంది పేద రైతులకు ఒక్కొక్కరికి ఇరవైవేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. దీంతో పాటు అయిదు గ్రంథాలయాలకు రూ. 52 వేల విలువ చేసే పుస్తకాలు అందించారు. ఈ డబ్బంతా తమ పొదుపు మొత్తాల్లో నుంచి వాడిందే. అభయ్, ప్రీతిల రిజిస్టర్డ్ మ్యారేజ్ నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లి సభలో మధు, రవీంద్ర ముంద్రే, ఆశిష్, రమేష్ కట్కే, అర్జున్ తోసారే... మొదలైన సామాజిక కార్యకర్తలు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఇచ్చారు. మామూలుగానైతే... పెళ్లివేడుకలో పూలదండలు, రకరకాల డెకరేషన్ లైట్లు కనిపిస్తాయి. అభయ్-ప్రీతి పెళ్లిలో మాత్రం స్ఫూర్తిదాయకమైన పోస్టర్లు, బ్యానర్లు కనిపించాయి. విశేషమేమిటంటే, తమ తొలి వివాహ వార్షికోత్సవానికి ఎలాంటి సేవాకార్యక్రమాలు నిర్వహించాలనే విషయం గురించి ఇప్పుడే ఒక ప్రణాళిక వేసుకున్నారు. అమరావతి జిల్లాకు చెందిన దీపక్ దేశ్ముఖ్ అనే రైతు కూతురు తమ కుటుంబం ఎదుర్కొంటున్న గడ్డు పేదరికాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఒక నెల తరువాత అప్పులను తీర్చడానికి దీపక్ కూడా మూడెకరాల భూమిని అమ్మి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో అభయ్ని కదిలించాయి. అందుకే... ‘‘మా పెళ్లితోనే ఇది ఆగిపోవాలనుకోవడం లేదు. మరింత మందిని ప్రేరేపించి, పెళ్లి ఖర్చును పేదరైతులకు అందించాలను కుంటున్నాం’’ అంటున్నారు నవదంపతులు అభయ్-ప్రీతిలు. వారి ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం! -
ఆకలి బాధతో పస్తులుంటూనే విజేతగా..
గోరఖ్పూర్: రోజులెప్పుడు ఒకలా ఉండవు. కొత్తకొత్త మార్పులు వస్తూనే ఉంటాయి. అందుకే ప్రతి వ్యక్తి కూడా కష్టమొచ్చిన రోజు కుంగిపోకుండా.. సుఖం వచ్చిన రోజు పొంగిపోకుండా ఉండాలని అంటుంటారు. దీనికంటేముందు ప్రతి వ్యక్తికి ఓర్పు కచ్చితంగా ఉండాలి. కష్టాల్లో కూడా చేసే పనిపై దృష్టిని జారీపోనివ్వకుండా చూసుకుంటే విజయం దానంతటదే తన్నుకుని వస్తుంది. సరిగ్గా ఇదే నిరూపించాడు ఉత్తరప్రదేశ్లో ఓ పేద కుటుంబంలో జన్మించిన అభయ్ అనే విద్యార్థి. రాష్ట్రంలోని గోరక్ పూర్ కు చెందిన అభయ్ అనే విద్యార్థి పస్తులు ఉంటూనే జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో విజయం సాధించాడు. ఆదివారం దేశ వ్యాప్తంగా విడుదల చేసిన ఈ ఫలితాల్లో 3,372వ ర్యాంకును సాధించాడు. దీంతో ఒక్కసారిగా తన గతమంతా మాయమై ఇప్పుడు అతడి ముఖంలో కుటుంబంలో సంతోషాలు వెల్లి విరిసాయి. పేదరికంతో నిండిన కుటుంబంలో జన్మించిన అభయ్ తండ్రి ఓ దినసరి కూలి. కుటుంబం మొత్తానికి అతడే పెద్ద దిక్కు. ప్రతి రోజు పనికి వెళ్లి వస్తేనే ఇంట్లో గడుస్తుంది. అయితే, ముందునుంచే చురుకైన విద్యార్థి అయిన అభయ్.. తన ఇంట్లో ఎన్నోసార్లు భోజనం లేకుండా ఖాళీ కడుపుతోనే ఉంటూనే చదువుపై మక్కువ పెంచుకున్నాడు. మెకానికల్ ఇంజినీరింగ్ చేయాలని కలగన్న అతడు దానికి తగినట్లుగా తన పేదరికాన్ని సైతం లెక్క చేయకుండా చదివాడు. సూపర్ 30 ఫౌండర్ ఆనంద్ ప్రోత్సాహంతో జేఈఈ అడ్వాన్స్డ్ 2016 పరీక్షల్లో విజయం సాధించాడు. అభయ్ కు మరో సోదరుడు ఇద్దరు సోదరిమణులు ఉన్నారు. -
జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ కుమారుడు!
జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ జనతా గ్యారెజ్ సెట్స్లో సందడి చేశాడు. తండ్రి నటిస్తున్న సినిమా సెట్స్లో తొలి సారిగా చిన్నారి అభయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సాధారణంగా పబ్లిసిటీకి, సినిమా సెట్స్కు దూరంగా ఉండే తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి కూడా కుమారుడికి తోడుగా రావడం మరింత స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దీంతో ఈ అరుదైన సంబరాన్ని ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. తన ఫేస్ బుక్ పేజీలో ముద్దుల కొడుకు సెట్స్లో హల్ చేసిన ఫోటోలను పోస్ట్ చేశాడు. దీంతో తమ అభిమాన హీరో వారసుడి ఫోటోలకు లైక్లు, షేర్లతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో లేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, కొరటాల ఇద్దరు మంచి విజయాలతో ఊపుమీద ఉండటంతో షూటింగ్ దశలోనే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఏర్పడింది. -
డిటో...
2009లో ఖాద్రీ... 2016లో అభయ్ కారణాలు వేరైనా ఒకే నేర విధానం రెండూ జరిగింది బుధవారమే దక్షిణ మండల పరిధిలోని శాలిబండ ప్రాంతంలో 2009లో జరిగిన ఖాద్రీ... పశ్చిమ మండల పరిధిలోని షాహినాయత్గంజ్ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకున్న అభయ్... ఈ రెండు ఉదంతాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. వీరి అపహరణలు జరగడానికి కారణాలు వేరైనా... హత్యలు జరిగిన విధానం మాత్రం ఒక్కటే. ఈ కేసుల్లోనూ ముగ్గురేసి చొప్పునే నిందితులు ఉండగా... బుధవారమే కిడ్నాప్లు, అదే రోజు హత్యలు జరిగాయి. ఈ కేసుల్లో నిందితులు తప్పించుకునే ప్రయత్నాల్లో రాష్ట్రం దాటిన వారే. ఈ రెండు కిడ్నాప్, హత్యల మధ్య సారూప్యతలు ఇలా... - సాక్షి, సిటీబ్యూరో హతుడు ⇒ సయ్యద్ ఉస్మాన్ మహ్మద్ ఖాద్రి (10) నివాసం ⇒ పాతబస్తీలోని శాలిబండలో ఉన్న ఖాజీపుర జరిగింది: 20.05.2009 (బుధవారం) నిందితులు ⇒ వ్యాపార భాగస్వామి, బాలుడి తండ్రైన సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాద్రీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనను మోసం చేస్తున్నాడని భావించిన అనీసుద్దీన్ కిడ్నాప్ ఇలా ఖాదర్ ఇంట్లో చనువు ఉన్న అనీస్... ఖాద్రీకి బైకు డ్రైవింగ్ నేర్పిస్తానని చెప్తూ వల్లో వేసుకున్నాడు. బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలుడిని డ్రైవింగ్ నేర్పుతాన ంటూ తన పల్సర్ వాహనంపై ఎక్కించుకుని కిడ్నాప్ చేశాడు. హతమైందిలా శంషాబాద్ వైపు వెళ్లే మార్గంలో జతకట్టిన మిగిలిన ఇద్దరు నిందితులూ... ఖాద్రీని మారుతీ వ్యాన్లోకి మార్చారు. మార్గం మధ్యలో పోలీసుల చెక్పోస్ట్ ఉండటంతో వారి కంట పడకూడదని భావించారు. దీనికోసం అప్పటికే గొడవ చేస్తున్న ఖాద్రీని ఆ పాయింట్ దాటే వరకు నోరు మూసి వాహనం కిటికీల్లోంచి కనపడనంత కిందకు ఉంచాలని భావించిన నిందితులు... పొరపాటున నోరు కూడా మూసేయడంతో చనిపోయాడు. మృతదేహాన్ని ఏం చేశారంటే చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత ఖాద్రీని గమనించిన నిందితులు అతడు చనిపోయినట్లు గుర్తించారు. దీంతో మృతదేహాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతో షాద్నగర్ ప్రాంతంలో పూడ్చి పెట్టారు. చంపేశాక డిమాండ్లు కిడ్నాప్ చేసిన గంటలోపే బాలుడిని చంపేసిన దుండగులు ఆపై బోగస్ వివరాలతో తీసుకున్న సిమ్కార్డులు వినియోగించి అతడి తండ్రికి ఫోన్లు చేసి,ఎస్సెమ్మెస్లు ఇచ్చి డబ్బు డిమాండ్ చేశారు. చిక్కే ముందు హై‘డ్రామా’ పదో తరగతి మాత్రమే చదివిన అనీస్ నేరం చేశాక తెలివిగా వ్యవహరించాడు. అరెస్టుకు ముందు శాలిబండ పోలీసులు అదుపులోకి తీసుకునేసరికి... తనకు అనేక రుగ్మతలు ఉన్నాయని, ఇంటరాగేషన్ చేయకూడదంటూ నకిలీ పత్రాలు చూపించి బయటపడ్డాడు. వెంటనే తన తండ్రి సహాయంతో తానే కిడ్నాప్ అయినట్లు డ్రామా ఆడించాడు.హైదరాబాద్ నుంచి పరారైన నిందితులు మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ల్లో తిరిగారు. ఎట్టకేలకు టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కారు. హతుడు ⇒ అభయ్ మోదాని (15) నివాసం ⇒ షాహినాయత్గంజ్ పరిధిలోని జ్ఞాన్బాగ్కాలనీ జరిగింది: 16.03.2016 (బుధవారం) నిందితులు ⇒ ఇందుగుగమల్లి శేషుకుమార్ అలియాస్ సాయిరామ్, పొందర రవి, నంబూరి మోహన్ కారణం ⇒ సినిమాల్లో చేరేందుకు నటనా పాటవంతో పాటు డబ్బు కూడా అవసరమని భావించిన ముగ్గురు నిందితులు కిడ్నాప్ ఇలా అభయ్ ఇంటికి సమీపంలోని ఇంట్లో పని చేసిన సాయికి బాలుడితో చనువు ఉంది. టిఫిన్ తీసుకురావడానికి వచ్చిన అభయ్ను లిఫ్ట్ ఇవ్వమని కోరి అతడి వాహనం పైనే కిడ్నాప్ చేసి రూమ్కు తీసుకువెళ్లాడు. హతమైందిలా బాలుడిని హిందీనగర్లోని తమ ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత కిడ్నాప్ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో అతడు వద్దని చెప్పడంతో గలాభా చేస్తారని భయపడ్డారు. అలా కాకుండా ఉండాలని చేతులకు, నోటికి ప్లాస్టర్ వేయడానికి ఉపక్రమించారు. ఆ ప్లాస్టర్ పొరపాటున నోటితో పాటు ముక్కుకూ పడటంతో అభయ్ చనిపోయాడు. పది నిమిషాల తర్వాత నిందితులు ఈ విషయాన్ని గుర్తించారు. మృతదేహాన్ని ఏం చేశారంటే ఫ్రిజ్కు చెందిన అట్టపెట్టే, ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్స్లో పార్శిల్ చేసి ఆటో ట్రాలీ, ప్యాసింజర్ ఆటోల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు తీసుకువెళ్లారు. రైలులో వదిలేద్దామని భావించినా... సాధ్యంకాకపోవడంతో ఆల్ఫా హోటల్ వద్ద విడిచిపెట్టేశారు. చంపేశాక డిమాండ్లు కిడ్నాప్ జరిగిన గంటలోనే అనుకోకుండా హత్య జరగడంతో పారిపోయేందుకు సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కిన దుండగులు రైలు నుంచే బేరసారాలు మొదలెట్టారు. చిక్కే ముందు హై‘డ్రామా’ పదో తరగతి మాత్రమే చదివిన ప్రధాన నిందితుడు సాయి... పరారైన నాటి నుంచి మీడియాను గమనిస్తూ పోలీసుల కదలికలు తెలుసుకున్నాడు. ఎలాగైనా దొరికిపోతానని భావించి ఆత్మహత్యాయత్నం చేశాడు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు పారిపోయిన నిందితులు పొరుగున ఉన్న ఒడిశాలోకీ ఎంటర్ అయ్యారు. టాస్క్ఫోర్స్ బృందాలకే చిక్కారు. -
వీరేషా... అతనెవరు?
ప్రశ్నిస్తున్న హరినగర్ వాసులు సోదాలు చేసిన నగర పోలీసులు సిటీబ్యూరో: షాహినాయత్గంజ్ పోలీసుస్టేషన్ పరిధి నుంచి పదో తరగతి విద్యార్థి అభయ్ను కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చిన కేసులో ముషీరాబాద్ పరిధిలోని హరినగర్ తెరపైకి వచ్చింది. ఈ ఉదంతంలో కిడ్నాపర్లు అభయ్ తండ్రి రాజ్కుమార్కు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేయడానికి ‘7842276480’ ఫోన్ నెంబర్ వాడారు. టాటా డొకోమోకు చెందిన ఈ నెంబర్ ‘బి.వీరేష్, 1-7-1022/8/9/బీ, హరినగర్, నియర్ పోచమ్మ టెంపుల్, రామ్నగర్, ముషీరాబాద్’ చిరునామాతో రిజిస్టర్ అయి ఉంది. దీంతో ‘సాక్షి’ ఆ ఇంటికి వెళ్లి వీరేష్ కోసం ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వాళ్లు సైతం అలాంటి పేరు గల వ్యక్తులు ఎవరూ ఇక్కడ లేరని, గతంలోనూ నివసించలేదని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి నగర పోలీసులు సైతం వచ్చి సోదాలు చేసి వెళ్లారని వివరించారు. దీంతో కిడ్నాపరుల తప్పుడు వివరాలతో సిమ్కార్డు తీసుకుని ఉంటారని పోలీసులు చెప్తున్నారు. సిమ్కార్డ్ ఔట్లెట్స్పై దాడులు... అభయ్ను కిడ్నాప్ చేసిన దుండగులు ఈ కుట్రను అమలు చేయడానికి బోగస్ వివరాలతో తీసుకున్న సిమ్కార్డులు వినియోగించినట్లు తేలింది. ఇలాంటి సిమ్కార్డుల్ని ఎక్కువ ధరకు విక్రయిస్తున్న దుకాణాలతో పాటు నిందితులు సిమ్స్ ఖరీదు చేసిన దుకాణాన్నీ పోలీసుల గుర్తించారు. దీంతో నగర టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి సికింద్రాబాద్లోని కొన్ని దుకాణాలపై దాడులు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరిలో దుండగులకు సిమ్కార్డులు అమ్మిన వారు ఎవరనేది ఆరా తీస్తున్నారు. -
పక్కా ప్లాన్?
♦ తండ్రి వ్యాపార, ఆర్థిక లావాదేవీలు తెలిసిన దుండగులు ♦ స్కూల్ దగ్గర కలుస్తూ బాలుడితో పరిచయం ♦ పక్కా రెక్కీ తర్వాతే ‘నమ్మక ద్రోహం’ ♦ డబ్బు కోసమే కిడ్నాప్ అనుకోని పరిస్థితుల్లో హత్య? సాక్షి, సిటీబ్యూరో: షాహినాయత్గంజ్లోని జ్ఞాన్బాగ్ కాలనీ సీతారాంపేట్లో అదృశ్యమై... సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్ వద్ద శవమై కనిపించిన టెన్త్ క్లాస్ బాలుడు అభయ్ కిడ్నాప్.. మర్డర్ మిస్టరీలో ఆసక్తికర అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాలుడి తండ్రి రాజ్కుమార్ వ్యాపార, ఆర్థిక లావాదేవీలపై కన్నేసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక ఆధారాలను సేకరించిన పోలీసులు దుండగుల కోసం వేట ముమ్మరం చేశారు. అభయ్తో పరిచయం పెంచుకుని... సీతారాంపేటలోని మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ సమీపం నుంచి అభయ్ను ద్విచక్ర వాహనంపై తీసుకు వెళ్లిన దుండగుడు కొంతకాలం ముందు నుంచే బాలుడితో పరిచయం పెంచుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడు ఎలాంటి పెనుగులాట లేకుండా ద్విచక్ర వాహనం ఎక్కడం... కొద్దిదూరం అతడే వాహనాన్ని డ్రైవ్ చేసినట్లు తెలియడంతో ఈ అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభయ్తో ఇంటి వద్ద కొత్త వ్యక్తులు పరిచయం పెంచుకోవడం సాధ్యం కాదు. అది జరిగితే కిడ్నాప్ తర్వాత వారి పైనే అనుమానాలు వస్తాయి. ఈ నేపథ్యంలోనే దుండగులు అబిడ్స్లోని స్లేట్ ద స్కూల్ వద్ద బాలుడితో పరిచయం పెంచుకుని కొన్ని రోజుల ముందు నుంచీ అక్కడికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. నమ్మకంగా పిలిచి అపహరణ కిడ్నాపర్లు కొద్ది రోజులుగా సాయంత్ర వేళ అభయ్ కదలికలను గమనించడంతో పాటు అతడితో కలిసి సరదాగా షికార్లు చేసినట్లు తెలుస్తోంది. అలా పెంచుకున్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు కిడ్నాప్కు పథక రచన చేశారు. రోజూలాగానే అభయ్ బుధవారం సైతం సీతారాంపేటలోని మహాలక్ష్మి టిఫిన్ సెంటర్కు వస్తాడని తెలుసుకున్న కిడ్నాపర్ అక్కడే కాపు కాయడమో... ఫోన్ చేసి బాలుడిని అక్కడికి రప్పించడమో చేశాడనుకుంటున్నారు. ముందే ఏర్పడిన పరిచయంతో కిడ్నాపర్ ద్విచక్ర వాహనం ఎక్కడానికి అభయ్ సంశయించ లేదు. అలా నమ్మకంగా తన వాహనం ఎక్కించుకున్న దుండగుడు అభయ్తో కలిసి కొంత దూరం వరకు ద్విచక్ర వాహనం పైనే ప్రయాణించాడు. ఆపై అసలు ‘కథ’ ప్రారంభించినట్లు తెలుస్తోంది. వాహనంతో పాటే మారిన సీన్... టిఫిన్ సెంటర్ నుంచి కొంత దూరం వరకు అభయ్ను ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లిన దుండగుడు ఆపై అసలు వ్యవహారం ప్రారంభించాడు. ముందే నిర్ణయించుకున్న ప్రాం తంలో కారు లేదా తేలికపాటి వాహనంలో వేచి ఉన్న అనుచరులను కలిశాడు. అది కచ్చితంగా నిర్మానుష్య ప్రాంతై మె ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయి. తనను కూడా ఆ వాహనంలో ఎక్కించుకోవడం... ఎక్కడికో చెప్పకుండా తీసుకు వెళ్లడానికి ఉపక్రమించిన తర్వాతే అభయ్కు తొలిసారిగా అనుమానం వచ్చి ఉంటుందనే భావన ఉంది. దీంతో సీన్ మారినట్లు గుర్తించిన బాలుడు తప్పించుకునే ప్రయత్నాలు చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుకోకుండా హత్య? అభయ్ను కిడ్నాప్ చేసిన దుండగులు ముందే నిర్ణయించుకున్న ప్రాంతానికి తీసుకువెళ్లి బంధించాలని భావించారని తెలుస్తోంది. అది సాయంత్రం కావడం... నగరంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు... తనిఖీలు వీరికి ప్రతికూలంగా మారాయి. తమ వాహనంలో ఉన్న అభయ్ మార్గమధ్యలో ఏమాత్రం గలాభా చేసినా... చుట్టు పక్కల వారితో పాటు ఇతర వాహన చోదకులు, జంక్షన్ల వద్ద ఉండే పోలీసుల దృష్టిలో పడతామని దుండగులు భావించారని తెలుస్తోంది. అలా జరగకుండా ఉండటానికే బాలుడిని వాహనం సీట్ల మధ్యలోనో మరో ప్రాంతంలోనో అదిమిపట్టి ఉంటారని, అతడు అరవకుండా ఉండేందుకు పేపర్తో నోరు మూసే ప్రయత్నంలో ముక్కు కూడా మూసేయడంతో బాలుడి ప్రాణం పోయి ఉంటుంద ని భావిస్తున్నారు. ఇలా కాకుండా కిడ్నాప్ నేపథ్యంలో గలా భా చేస్తున్నాడనే ఉద్దేశంతో హత్య చేసి ఉంటారనే వాదనా ఉంది. కార్టన్ బాక్స్ కొని... అభయ్ మృతదేహానికి నోరుతో పాటు చేతులు వెనక్కు విరిచిన స్థితిలో మణికట్ల వద్ద ప్లాస్టర్ వేసి ఉంది. దాన్ని పరిశీలించిన పోలీసులు వైద్యులు వినియోగించే సర్జికల్ ప్లాస్టర్గా గుర్తించారు. అభయ్ చనిపోయాడని గుర్తించిన దుండగులు... సికింద్రాబాద్ వైపు ప్రయాణిస్తూ మార్గ మధ్యలో ఏదైనా మెడికల్ షాపులో ప్లాస్టర్తో పాటు అక్కడే కార్టన్ బాక్స్, సన్నటి ప్లాస్టిక్ తాడు తీసుకుని ఉంటారని తెలుస్తోంది. మృతదేహంతో నగరం దాటడం సాధ్యం కాదనే ఉద్దేశంతోనే వీటి సాయంతో వాహనంలోనే నిర్జన ప్రదేశంలో అభయ్ మృతదేహాన్ని పార్శిల్ చేశారనే అనుమానాలున్నాయి. ఆ పెట్టెను వాహనంలో పెట్టుకుని వెళ్తూ... ఆల్ఫా హోటల్ వద్ద వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. మొత్తం ఐదుగురిగా భావిస్తున్న దుండగుల్లో ఇద్దరు ఉప్పల్, తార్నాక ప్రాంతాల్లో ఆగిపోగా... మిగిలిన ముగ్గురూ సికింద్రాబాద్ నుంచే రైలులో విజయవాడ చేరుకున్నట్లు సమాచారం. ఎవరీ వీరేష్ అలియాస్ ఇమ్రాన్? అభయ్ కుటుంబీకులకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేయడానికి కిడ్నాపర్లు ‘78422 76480’ నెంబర్ వాడారు. సర్వీస్ ప్రొవైడర్ టాటా డొకోమో రికార్డుల ప్రకారం ఈ ఫోన్ ‘బి.వీరేష్, హరి నగర్, నియర్ పోచమ్మ టెంపుల్, రామ్నగర్, ముషీరాబాద్’ చిరునామాతో రిజిస్టరై ఉంది. మొబైల్ యాప్ ‘ట్రూ కాలర్’లో నమోదైన వివరాల ప్రకారం ఈ నెంబర్ తల్వార్ వర్క్షాప్నకు చెందిన ఇమ్రాన్ వినియోగిస్తున్నట్లు ఉంది. ఈ నేపథ్యంలోనే వీరేష్ పేరుతో తీసుకున్న నెంబర్ను ఇమ్రాన్ వినియోగిస్తున్నాడా? ఈ నేరంతో వీరేష్, ఇమ్రాన్లకు సంబంధం ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి నగర పోలీసులు గురువారం రాత్రి ఇద్దరిని పట్టుకున్నట్లు సమాచారం. మరో ముగ్గురు నిందితులు విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక బృందం అక్కడకు చేరుకుని గాలిస్తోంది. -
ఇస్ కంభఖ్త్ సాథే కా క్యా కరే...!
యాడ్ ఫిల్మ్ మేకర్ అభయ్, కాలేజీ లెక్చరర్ అయిన సల్మా ఇద్దరూ భార్యాభర్తలు. వృత్తిపరమైన జీవితాల్లో ఇద్దరికీ అనేక సమస్యలుంటాయి. అయితే ప్రతి విషయానికి అభయ్ డీలా పడిపోతుండగా, సల్మా మాత్రం ధైర్యంగా ఎదుర్కొంటుంది. అభయ్ ఫ్రస్టేషన్ కుటుంబ జీవితం మీద ప్రభావం చూపుతుంటుంది. అయితే సల్మా తన సమస్యలను చక్కదిద్దుకుంటూనే అభయ్ సమస్యలకు పరిష్కారం చూపించడం, తరువాత ఆశావహ దృక్పథంతో ఇద్దరి జీవితాలు సంతోషంగా గడపడం కథ. అభయ్గా సౌరభ్ ఘరిపూరికర్, సల్మాగా రిచా జైన్ భార్యభార్తల మధ్య అనుబంధాన్ని, ఉండాల్సిన అవగాహన, పరిణితిని చక్కగా ప్రదర్శించారు. లామకాన్లో జరిగిన ఈ నాటక ప్రదర్శన ఆకట్టుకుంది.