Amritha Aiyer
-
‘ బచ్చల మల్లి’ మూవీ రివ్యూ
టైటిల్: బచ్చల మల్లినటీనటులు: అల్లరి నరేష్, అమృతా అయ్యర్, అంకిత్ కోయ, హరితేజ, రావు రమేష్, కోట జయరాం, ధన్రాజ్, హర్ష చెముడు, అచ్యుత్ కుమార్ తదితరులునిర్మాతలు: రాజేశ్ దండా, బాలాజీ గుట్టదర్శకత్వం: సుబ్బు మంగాదేవిసంగీతం: విశాల్ చంద్రశేఖర్సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎం నాథన్విడుదల తేది: డిసెంబర్ 20, 2024కథేంటంటే.. ఈ సినిమా కథ 1985-2005 మధ్య కాలంలో సాగుతుంది. తుని మండలం సురవరానికి మల్లి అలియాస్ బచ్చల మల్లి (అల్లరి నరేశ్) చాలా తెలివైన వాడు. పదో తరగతి పరీక్షల్లో టాపర్గా నిలిచి తండ్రి(బలగం జయరామ్) గర్వపడేలా చేస్తాడు. మల్లికి తండ్రి అంటే ప్రాణం. కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మల్లి మనసును గాయపరుస్తుంది. అప్పటి నుంచి తండ్రిపై అసహ్యం పెంచుకుంటాడు. అప్పటి వరకు మంచి బాలుడిగా ఉన్న మల్లి.. చెడ్డవాడిగా మారుతాడు. చదువు మానేసి ట్రాక్టర్ నడుపుతూ మద్యానికి బానిసవుతాడు. నిత్యం తాగుతూ ఊర్లో వారితో గొడవ పడుతూ మూర్ఖుడిగా తయారవుతాడు. అదే సమయంలో మల్లీ లైఫ్లోకి కావేరి(అమృతా అయ్యర్) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత మల్లి లైఫ్లో వచ్చిన మార్పులు ఏంటి? మల్లి తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటి? మంచి వ్యక్తిగా ఉన్న మల్లి మూర్ఖుడిలా మారడానికి గల కారణం ఏంటి? కావేరితో ప్రేమాయణం ఎలా సాగింది? గోనె సంచుల వ్యాపారి గణపతి రాజు(అచ్యుత్ కుమార్), మల్లికి మధ్య వైరం ఎందుకు వచ్చింది? మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయాల వల్ల మల్లి కోల్పోయిందేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలేజ్ బ్యాగ్రౌండ్, హీరో పాత్రకి నెగెటివ్ షేడ్స్ , రా అండ్ రస్టిక్ వాతావరణం.. ఈ నేపథ్యంతో కూడిన కథలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. బచ్చల మల్లి కూడా అలాంటి చిత్రమే. దర్శకుడు ఎంచుకుంది ట్రెండింగ్ సబ్జెక్ట్ అయినా తెరపై ఆకట్టుకునేలా కథనాన్ని నడిపించడంలో మాత్రం విఫలం అయ్యాడు. పాత్రలను తిర్చిదిద్దిన విధానంపై పెట్టిన శ్రద్ధ.. కథనంపై పెట్టలేదు. హీరోకి విలనిజం లక్షణాలు ఉన్నా.. ప్రేక్షకులు ఆ పాత్రలో కనెక్ట్ కావాలి. అప్పుడే కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ బచ్చల మల్లి విషయంలో అది మిస్ అయింది. హీరో పాత్రతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేదు. అసలు హీరోకి ఎందుకు కోపం వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అనేది అర్థం కాదు. యాక్షన్ సీన్స్ కూడా బలవంతంగా ఇరికించినట్లే ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ కూడా అంతే. అప్పటి వరకు మూర్ఖంగా ఉన్న హీరో.. తల్లి ఒక మాట చెప్పగానే మారిపోవడం, హీరోయిన్ తండ్రితో చివరిలో ఓ ఎమోషనల్ డైలాగ్ చెప్పించడం..ఇవన్నీ సినిమాటిక్గానే అనిపిస్తాయి తప్ప.. ఎక్కడ కూడా ఎమోషనల్గా టచ్ చేయవు. ఇక హీరో జీవితంలో జరిగే సంఘటనలు కూడా చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది తప్ప ఎక్కడా కొత్తదనం కనిపించదు. కథ ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో పాత్ర పరిచయం, అతను మూర్ఖుడిగా మారడానికి గల కారణాలు కన్విన్సింగ్గా అనిపిస్తాయి. హీరో మూర్ఖుడిగా మారిన తర్వాత కథనం రొటీన్గా సాగుతుంది. ఓ కొత్త పాత్ర ఎంట్రీతో వచ్చే ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ కొత్త పాత్ర నేపథ్యం తెలిసిన తర్వాత సెకండాఫ్ కూడా రొటీన్ సీన్లతో నీరసంగా సాగుతుంది. క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. మూర్ఖత్వంతో సరిదిద్దుకోని తప్పులు చేయ్యొద్దని దర్శకుడు ఇచ్చిన సందేశం బాగుంది. ఎవరెలా చేశారంటే.. బచ్చల మల్లి పాత్రలో నరేశ్ ఒదిగిపోయాడు. యాక్షన్తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు . డైలాగు డెలివరీ బాగుంది. హనుమాన్ ఫేం అమృతా అయ్యర్, కావేరి పాత్రకు న్యాయం చేసింది. తెరపై అందంగా కనిపించింది. హీరో తండ్రిగా బలగం జయరాం తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అచ్యుత్ కుమార్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. అయితే ప్రధాన కథకి ఆ పాత్రతో సంబంధమే ఉండదు. హరితేజ, ప్రవీణ్, రావు రమేశ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించాడు. సాంకేతికంగా సినిమా బాగుంది. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు పర్వా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
'బచ్చలమల్లి' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హీరోయిన్ల వైల్డ్ ఫైర్ గ్లామర్ (ఫొటోలు)
-
అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ మూవీ HD స్టిల్స్
-
పెళ్లెప్పుడో చెప్పిన 'హనుమాన్' హీరోయిన్
'హనుమాన్' సినిమాతో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా లాంటి వాళ్లకు బాగానే పేరొచ్చింది గానీ హీరోయిన్ అమృత అయ్యర్కి అంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈమెకు ఎందుకో సరైన బ్రేక్ దొరకట్లేదు. ఇప్పుడు 'బచ్చలమల్లి' మూవీపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఈ సినిమా.. ఈ శుక్రవారం (డిసెంబర్ 20)న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)'బచ్చలమల్లి' ప్రమోషన్స్లో భాగంగా అమృత అయ్యర్కి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఎందుకంటే ఈ ఏడాది తక్కువలో తక్కువ 40 మందికి పైగా సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. రకుల్, నాగచైతన్య, కీర్తి సురేశ్.. ఇలా టాప్ హీరోహీరోయిన్లు చాలామంది పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. ఇప్పుడు అమృత కూడా వివాహ చేసుకునేందుకు సిద్ధమే. ఆ విషయాన్నే ఇప్పుడు చెప్పింది.'2025లో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోను. ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తినే చేసుకుంటా. ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ అయితే పెళ్లి తర్వాత సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇండస్ట్రీ కాకుండా వేరే ఫీల్డ్ అయితే మాట్లాడుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉంటాయి' అని అమృత అయ్యర్ చెప్పింది.(ఇదీ చదవండి: మళ్లీ గాయపడిన స్టార్ హీరో ప్రభాస్) -
బార్డర్ దాటేసిన 'బచ్చల మల్లి' ట్రైలర్
అల్లరి నరేశ్ కొత్త సినిమా 'బచ్చల మల్లి' నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్తోనే ప్రేక్షకులను మెప్పించిన నరేశ్ ఇప్పుడు ట్రైలర్తో మరింత ఆసక్తి పెంచాడు. 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు మంగదేవి ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కించారు. ఇందులో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేశ్,రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా బచ్చల మల్లి సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానుంది. -
డైరెక్టర్ ఏమీ చెప్పొద్దన్నారు
‘‘నటిగా నాకు అన్ని రకాలపాత్రలు చేయాలని ఉంది. అవకాశం వస్తే యాక్షన్ ఫిల్మ్ కూడా చేయాలని ఉంది. అయితే ‘΄పొన్నియిన్ సెల్వన్’ సినిమా చూశాక ప్రిన్సెస్ రోల్ చేసే అవకాశం వస్తే బాగుంటుందనిపించింది’’ అని అన్నారు హీరోయిన్ అమృతా అయ్యర్. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించారు. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో అమృతా అయ్యర్ మాట్లాడుతూ– ‘‘ఓ మనిషికి కోపం వస్తే, ఆ కో΄ాన్ని అతను కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఏం జరుగుతుంది? అతని జీవితం ఎలా ప్రభావితమవుతుంది? అన్నదే ‘బచ్చల మల్లి’ కథ. మంచి ఎమోషనల్ డ్రామా. ‘హను–మాన్’ సినిమా చిత్రీకరణ సమయంలోనే ‘బచ్చల మల్లి’ సినిమా కథ విని, ఓకే చేశాను. 1980 బ్యాక్డ్రాప్లో సాగే సినిమా ఇది. ఇందులో సిటీ కల్చర్ని ఇష్టపడే టౌన్ అమ్మాయి క్యారెక్టర్ చేశాను. సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ అమ్మాయి. నరేష్గారు ఎలాంటి ఎమోషన్ అయినా పండించగలరు. ఈ సినిమాలో స్క్రీన్పై ఆయన క్యారెక్టర్ అగ్రెసివ్గా కనిపిస్తుంది. కానీ ఆఫ్ స్క్రీన్లో ఆయన సాఫ్ట్. సుబ్బుగారు మంచి విజన్ ఉన్న దర్శకుడు. ఎమోషనల్ సీన్స్ను బాగా తీశారు. రాజేష్గారితో గతంలోనే ఓ సినిమా చేయాల్సింది. కానీ కుదర్లేదు. ‘బచ్చల మల్లి’తో కుదిరింది. ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాలు చేస్తున్నాను. ‘హను–మాన్’ సీక్వెల్లో నా రోల్ గురించి దర్శకుడు ఏమీ చెప్పొపద్దని చెప్పారు. నాపాత్ర ఉంటుందా? లేదా అనే విషయమూ చెప్పొపద్దన్నారు’’ అని తెలిపారు. -
అలాంటి పాత్రలు చేయాలని ఉంది: అమృత అయ్యర్
డ్రీమ్ గర్ల్, క్వీన్, ప్రిన్సెస్ లాంటి పాత్రలు వస్తే చేయాలని ఉంది అంటోంది ‘హను-మాన్’ ఫైం అమృత అయ్యర్. అల్లరి నరేశ్, అమృత జంటగా నటించిన తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అమృత అయ్యర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ హనుమాన్ షూట్ చేస్తున్నపుడు బచ్చల మల్లి కథ విన్నాను. స్క్రిప్ట్, క్యారెక్టర్ చాలా నచ్చింది. ఇందులో క్యారెక్టర్ కి కథలో చాలా ఇంపార్టెన్స్ ఉంది.→ 80లలో జరిగిఏ కథ ఇది. నాది సిటీ కల్చర్ ఉన్న టౌన్ అమ్మాయి పాత్ర. తను చాలా సెన్సిటివ్, వెరీ ఎమోషనల్ క్యారెక్టర్. ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి. ఇందులో నాకు, నరేష్ గారి మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ వున్నాయి. ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది.→ నరేష్ గారు అద్భుతమైన యాక్టర్. ఎలాంటి ఎమోషనైనా పండించగలరు. అన్ స్క్రీన్ అగ్రీసివ్ క్యారెక్టర్ వుంటుంది. కానీ అఫ్ స్క్రీన్ ఆయన చాలా సాఫ్ట్ పర్శన్. చాలా ఫ్రెండ్లీ. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్.→ మీనింగ్ ఫుల్ క్యారెక్టర్స్ చేయాలనేదే నా ఆలోచన. బచ్చలమల్లి లో కూడా చాలా మంచి పాత్ర. చాలా మంచి ఎమోషన్స్, కంటెంట్ వున్న సినిమా ఇది. తప్పకుండా మంచి హిట్ అవుతుంది. → సుబ్బు గారు చాలా క్లియర్ విజన్ వున్న డైరెక్టర్. చాలా ఫోకస్ గా ఉంటారు. ఎమోషన్స్ ని చాలా అద్భుతంగా తీశారు. బచ్చల మల్లి ఎమోషనల్ డ్రామా. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.→ ఓ కన్నడ, తమిళ్ సినిమా చేస్తున్నాను. తెలుగులో స్క్రిప్ట్స్ వింటున్నాను. -
అల్లరి నరేశ్ 'బచ్చల మల్లి' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
అప్పడప్పుడు ఆ అలవాటు కూడా ఉందంటూ.. 'బచ్చల మల్లి' టీజర్
అల్లరి నరేశ్ కొత్త సినిమా 'బచ్చల మల్లి' నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానుంది. 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు మంగదేవి ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేశ్,రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా బచ్చల మల్లి సినిమాను నిర్మిస్తున్నారు.‘బచ్చల మల్లి’ సినిమాలో అల్లరి నరేశ్ లుక్ చాలా రగ్గడ్గా ఉంది. ఈ మూవీ టీజర్ గమనిస్తే ఆయన పాత్ర చాలా మాస్గా ఉన్నట్లు తెలుస్తోంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే డైలాగ్స్ మెప్పించేలా ఉన్నాయి. 'మందుతో పాటు అప్పడప్పుడు నాకు అమ్మాయిల అలవాటు కూడా ఉంది' అంటూ అల్లరి నరేశ్ చెప్పే డైలాగ్స్ యూత్ను ఆకట్టుకునేలా టీజర్లో ఉన్నాయి. డిసెబర్ 20న ఈ మూవీ విడుదల కానుంది. -
అయ్యారే..అమృత అయ్యర్ అదిరే లుక్ (ఫోటోలు)
-
విష్ణుప్రియ మాస్ డ్యాన్స్.. చాన్నాళ్ల తర్వాత అలా కనిపించిన పూనమ్!
'పుష్ప 2' మెలోడీ పాటకి విష్ణుప్రియ హాట్ డ్యాన్స్తడి అందాలతో తెలుగు యాంకర్ ఇందు'ప్రేమలు' హీరోకి క్యూట్ బర్త్ డే విషెస్ చెప్పిన హీరోయిన్నెమలి ఫించాలతో హాట్నెస్ పెంచేసిన నార్త్ బ్యూటీవింటేజ్ స్టైల్లో మరింత అందంగా అమృత అయ్యర్బిగ్ బాస్ 7 రతిక అందాల విందు.. మీరు చూశారా? View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) View this post on Instagram A post shared by Virti vaghani (@virtivaghani_) View this post on Instagram A post shared by Salony Luthra (@salonyluthra) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Rathika Ravinder (@rathikaravinder) View this post on Instagram A post shared by Sonnalli A Sajnani (@sonnalliseygall) View this post on Instagram A post shared by Indhu oruganti (@anchor.indu) View this post on Instagram A post shared by Shivaleeka Oberoi Pathak (@shivaleekaoberoi) View this post on Instagram A post shared by Rathika Ravinder (@rathikaravinder) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Sayani G (@sayanigupta) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Aɴᴜsʜᴀ Hegde (@anushahegde__official) View this post on Instagram A post shared by RAFTAAЯ (@raftaarmusic) View this post on Instagram A post shared by Ragini Dwivedi (@rraginidwivedi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Pavithralakshmi (@pavithralakshmioffl) -
కలర్ఫుల్ డ్రెస్లో మెగా కోడలు.. హోలీ వేడుకల్లో బాలీవుడ్ భామ చిల్!
కలర్ఫుల్ డ్రెస్లో కనిపించిన మెగా కోడలు.. హోలీ సంబురాల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.. బ్లాక్ డ్రెస్లో ఫ్యామిలీ స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్... గ్రీన్ శారీలో తళుక్కుమన్న అమృత అయ్యర్.. వైట్ డ్రెస్లో నోరా ఫతేహీ అలాంటి లుక్స్.. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
ఈ సినిమా తరువాత నా లైఫ్ మారిపోయింది
-
తొలిసారి అలాంటి అనుభూతి దక్కింది : అమృత అయ్యర్
‘‘హను–మాన్’ సినిమా ప్రేక్షకులకు నచ్చాలనే లక్ష్యంతోనే యూనిట్ అంతా పని చేశాం. ఆడియన్స్తో కలిసి ఈ సినిమా చూశాను. వారి స్పందన చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. నా కెరీర్లో తొలిసారి అలాంటి అనుభూతి దక్కింది’’ అని హీరోయిన్ అమృతా అయ్యర్ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను–మాన్’. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. (చదవండి: ‘హను-మాన్’ మూవీ రివ్యూ) ఈ సందర్భంగా అమృతా అయ్యర్ మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్ వర్మగారు ‘హను–మాన్’ని అద్భుతంగా తీశారు. ఈ మూవీలో మీనాక్షి పాత్రని చక్కగా చేశావని ప్రేక్షకులు చెబుతుంటే హ్యాపీగా ఉంది. ఈ మూవీ జర్నీలో సహనంగా ఉండటం నేర్చుకున్నాను.. నటీనటులకు సహనం చాలా ముఖ్యం. ‘హను–మాన్ 2’ ఉంటుందని నాకూ తెలియదు. స్క్రీన్పై చూసి, సర్ప్రైజ్ అయ్యాను. ప్రస్తుతం తెలుగులో ‘అల్లరి’ నరేశ్కి జోడీగా ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
Amritha Aiyer: హనుమాన్ బ్యూటీ అమృత అందాలు..చూశారంటే మైమరచి పోవాల్సిందే! (ఫోటోలు)
-
Hanuman Movie: చీరకట్టుతో కనికట్టు చేస్తున్న అమృత అయ్యర్ (ఫోటోలు)
-
హనుమాన్ దేవుడు చిరంజీవి గారితో వచ్చారు..!
-
‘హను–మాన్’ ప్రీ రిలీజ్ వేడుక ముఖ్యఅతిథిగా చిరంజీవి (ఫొటోలు)
-
అంజనాద్రి కోసం సాహసాలు
అంజనాద్రి కోసం అహార్నిశలు కష్టపడ్డారు తేజ సజ్జా. అంజనాద్రి రక్షణకు ఈ యువ హీరో ఎలాంటి సాహసాలు చేశాడు అనేది ‘హను–మాన్’ సినిమాలో చూడాలి. తేజ సజ్జా, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 12న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ‘అంజనాద్రి’ అనే ఊహాత్మక ప్రదేశం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హను–మాన్’. హనుమంతుని శక్తులను పొంది అంజనాద్రి కోసం కథానాయకుడు ఎలా పోరాడాడనేది చిత్రకథాంశం. ‘‘హను–మాన్’ టీజర్పై ప్రేక్షకులు చూపించిన ప్రేమ మా బాధ్యతను బాగా పెంచింది. గ్రాఫిక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటం వల్ల ఈ సినిమా రిలీజ్ను వాయిదా వేస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్ను ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్గా హను–మాన్ చిత్రం రిలీజ్ కానుంది. వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్, కెమెరా: శివేంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి. -
కాఫీ విత్ కాదల్: కామెడీకి కొదవే ఉండదు
దర్శకుడు సుందర్ సి రూపొందించే చిత్రాల్లో కమర్షియల్ అంశాలతో పాటు కామెడీకి కొదవే ఉండదు. ఇదే తరహాలో ఫుల్ కామెడీ బ్యాక్డ్రాప్తో కాఫీ విత్ కాదల్ చిత్రం వస్తోంది. జీవా, జయ్, శ్రీకాంత్, మాళవిక శర్మ, అమృత అయ్యర్, రైసా నెల్సన్, ఐశ్వర్య దత్త హరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కుష్భు అవ్నీ సినీ మ్యాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, పెన్ మీడియా సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, ఈ కృష్ణస్వామి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని జూలైలో విడుదలకు ముస్తాబవుతోంది. వేర్వేరు వృత్తుల్లో పని చేస్తున్న ముగ్గురు సహోదరులు ఆయా వృత్తుల్లో పని చేస్తున్న ముగ్గురు సహోదరులు ఎదుర్కొనే సమస్యల సమాహారమే ఈ చిత్రమని చెప్పారు. ఇందులో 8 పాటలు ఉన్నాయన్నారు. కుటుంబసమేతంగా హాయిగా చూసి ఆనందించే వినోదభరిత కథా చిత్రంగా ఇది ఉంటుందని సుందర్ వెల్లడించారు. చదవండి: ‘ఆ కంగారులో చూసుకోలేదు క్షమించండి’ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత -
పవర్ఫుల్ విలన్ పాత్రలో ఆ హీరో.. అదరగొడుతున్న పోస్టర్
యంగ్ హీరో తేజ సజ్జ, హీరోయిన్ అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తి కలిగించాయి. తాజాగా విడుదలైన మరో పోస్టర్ మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ మైఖెల్ పాత్రలో హీరో వినయ్ రాయ్ నటిస్తున్నాడు. తాజాగా ఆయన పోస్టర్ను రానా దగ్గుబాటి ఆవిష్కరించాడు. పోస్టర్ చూస్తుంటే ఇందులో వినయ్ రాయ్ అత్యంత బాడాస్ ఈవిల్ మ్యాన్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ లాంగ్ సూట్లో చుట్టూ డ్రోన్స్తో ఉన్న వినయ్ రాయ్ పోస్టర్ థ్రిల్లింగ్గా ఉంది. వినయ్ రాయ్ ఇంతకుముందు నీవల్లే నీవల్లే, వాన సినిమాలో హీరోగా అలరించాడు. కాగా ఈ మూవీలో ఓ కీరోల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనున్న విషయం తెలిసిందే. చదవండి: చిరంజీవి బయోపిక్ గురించి నేను అలా అనలేదు: సీనియర్ నటుడు -
అమృత అయ్యర్ బర్త్డే స్పెషల్ ఫొటోలు
-
తొలి సినిమా డైరెక్టర్తో రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
Senior Heroine Malavika Re Entry With Director Sundar C Movie: ప్రముఖ డైరెక్టర్, దివగంత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన 'చాలా బాగుంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మాళవిక. శ్రీకాంత్, నవీన్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో అలరించిన మాళవిక కొన్నాళ్లకు సినిమాలకు దూరమైంది. 1999లో సుందర్. సి డైరెక్షన్లో అజిత్ హీరోగా 'ఉన్నై తేడి' మూవీతో కోలీవుడ్కు పరిచయమైంది మాళవిక. తర్వాత 2007లో సురేష్ మేనన్ అనే వ్యక్తిని వివాహమాడి వైవాహిక జీవితానికే పరిమితమైంది. ఇప్పుడు తాజాగా ఆమె మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. చదవండి: 'పేరెంట్స్ కోప్పడ్డారు..ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా' కోలీవుడ్కు ఏ డైరెక్టర్తో పరిచయమైందో ఆయన దర్శకత్వంలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది మాళవిక. ఈ సినిమాలో ఆమె 'మంగమ్మ' అనే పాత్రలో అలరించనుంది. ఇందులో మాళవికకు జోడిగా దర్శకుడు మనోబాలా కనిపించనున్నారు. హీరోలుగా జై, జీవా, శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్, రైజా విల్సన్, ఐశ్వర్య దత్తా హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్లో పాల్గొన్న మాళవిక ఫొటోలను సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. pic.twitter.com/VoZNpvLkRx — Manobala (@manobalam) April 2, 2022 చదవండి: ఆమె బయోపిక్లో నటించాలనుంది: మాళవిక మోహనన్ -
Amritha Aiyer: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర లక్ష రూపాయలకు పైమాటే!
Amritha Aiyer Dress By Seema Gujral: అమృతా అయ్యర్.. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అంటూ పరిచయమై.. గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ అభిమాన ధనాన్ని పెంచుకుంటోంది. ఆమె సినిమాలే కాదు ఫ్యాషన్ బ్రాండ్స్ పట్లా అంతే నిక్కచ్చిగా ఉంటుందని ఈ డిజైనర్ వేర్ చూస్తే తెలిసిపోతుంది. సీమా గుజ్రాల్.. కళ్యాణ వేదిక మీద పెళ్లి కూతురు రాజకుమారిలా కనిపిస్తోందంటే.. ఆమె సీమా గుజ్రాల్ డిజైన్ చేసిన దుస్తులను ధరించింది అని అర్థం. ఎటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయకపోయినా.. కేవలం ముగ్గురు ఉద్యోగులను నియమించుకుని 1994లో సీమా ప్రారంభించిన ఓ ఫ్యాషన్ హౌస్ ఇప్పుడొక పాపులర్ వెడ్డింగ్ వేర్ బ్రాండ్గా మారింది. దాదాపు చాలామంది సెలబ్రిటీల పెళ్లిబట్టలను ఆమే డిజైన్ చేసింది. అభిరుచికి తగ్గట్టు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకునే అవకాశమూ ఉంది. ఆ దుస్తుల ధరలు డిజైన్ను బట్టే ఉంటాయి. వేల నుంచి లక్షల్లో పలుకుతాయి. ఆన్లైన్లోనూ ఈ డిజైన్ వేర్ అందుబాటులో ఉంది. పండోరా.. టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్లో పండోరా ఒకటి. 1982లో డెన్మార్క్లో ప్రారంభించిన ఈ బ్రాండ్.. గత ఐదు దశాబ్దాలుగా అరుదైన, అందమైన డిజైన్స్లో ఆభరణాలను అందిస్తూ అమ్మాయిల మనసు దోచుకుంటూనే ఉంది. కారణం ఇందులో పనిచేసే ఆభరణాల నిపుణులే. సుమారు ఆరు ఖండాల్లోని వంద దేశాలకు చెందిన 2,600 హస్తకళా నిపుణులు ఈ ఆభరణాలను రూపొందిస్తుంటారు. ఎక్కువగా థాయ్లాండ్కు చెందిన వారే కావడంతో మన దేశ సంప్రదాయ ఆభరణాలు కాస్త తక్కువగానే కనిపిస్తాయి ఇక్కడ. అయితే సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్ అంటే తీరని మోజు. ధర కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది మరి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లోనూ లభిస్తాయి. నా టేస్ట్కు తగ్గట్టే నాకు గ్లామర్ పాత్రలు సౌకర్యంగా అనిపించవు. ఇప్పటి వరకూ నా టేస్ట్కు తగ్గట్టే నాకు సంప్రదాయమైన పాత్రలే వచ్చాయి. – అమృతా అయ్యర్. బ్రాండ్ వాల్యూ డ్రెస్ డిజైనర్: సీమా గుజ్రాల్ ధర: రూ. 1,28,000 జ్యూయెలరీ బ్రాండ్: పండోరా ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్పై ఆధారపడి ఉంటుంది. -దీపిక కొండి చదవండి: Amala Paul: అమలాపాల్ కట్టిన చీర ధరెంతో తెలుసా? -
అవును.. నా అకౌంట్ హ్యాక్ అయింది.. ఆ హీరోయిన్ ట్వీట్
Amritha Aiyer Instagram Has Been Account Hacked: ప్రముఖ సినీ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ను హ్యాక్ చేస్తుంటారు కొందరు ఆకతాయిలు. అలా హ్యాక్ చేసి తమకు నచ్చినట్లుగా అసభ్యకర పోస్టులు, వీడియోలు షేర్ చేయడమే కాకుండా ఇబ్బందికరంగా ఉండే కామెంట్స్ కూడా పెడుతుంటారు. ఇలా హ్యాక్ గురైన సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. ఈ హ్యాక్కు గురైనా తారల్లో బుట్టబొమ్మ పూజా హెగ్డె, టబు, ఇషా డియోల్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు ఉన్నారు. తాజాగా వీరి జాబితాలో మరో యంగ్ హీరోయిన్ చేరింది. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో పాపులర్ అయిన అమృత అయ్యర్ ఇన్స్టా గ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. తన అకౌంట్ మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు అమృత ట్వీట్ చేసింది. ప్రస్తుతానికైతే హ్యాక్కు గురైన అమృత ఇన్స్టా అకౌంట్ నుంచి ఎలాంటి అసభ్యకర పోస్టులు రాలేదని తెలుస్తోంది. Yes ! my Instagram has been Hacked 😞 hope it gets recovered 🙏🏻 Will come back soon . — Amritha (@Actor_Amritha) February 1, 2022 -
‘అర్జున ఫల్గుణ’ మూవీ రివ్యూ
టైటిల్ : అర్జున ఫల్గుణ నటీనటులు : శ్రీవిష్ణు, అమృతా అయ్యర్, నరేశ్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవి ప్రసాద్, ‘రంగస్థలం’మహేశ్ తదితరులు నిర్మాణ సంస్థ : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి దర్శకత్వం : తేజ మార్ని సంగీతం : ప్రియదర్శన్ సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి విడుదల తేది : డిసెంబర్ 31,2021 వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు ఎంచుకుంటూ.. .. విలక్షణ నటనతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ‘రాజ రాజ చోర’ చిత్రంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ టాలెంటెండ్ హీరో.. తాజాగా ‘అర్జున ఫల్గుణ’అంటూ మరో డిఫరెంట్ టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై పాజిటీవ్ బజ్ను క్రియేట్ చేశాయి. దీనికి తోడు మూవీ ప్రమోషన్స్ కూగా గ్రాండ్గా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘అర్జున ఫల్గుణ’ఏ మేరకు అందుకుంది? రివ్యూలో చూద్దాం. ‘అర్జున ఫల్గుణ’కథేంటంటే..? డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటున్న ఐదుగురు స్నేహితులు అర్జున్(శ్రీవిష్ణు), రాంబాబు(రాజ్ కుమార్), తాడి(‘రంగస్థలం’మహేశ్), ఆస్కార్(చైతన్య గరికిపాటి), శ్రావణి(అమృత అయ్యర్)ల చూట్టూ ‘అర్జున ఫల్గుణ’కథ సాగుతుంది. వీరంతా చిన్నప్పటి నుంచి బెస్ట్ఫ్రెండ్స్. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే వ్యక్తిత్వం వాళ్లది. వీరంతా ఊర్లోనే సోడా సెంటర్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటారు. దాని కోసం బ్యాంకు లోన్కు ట్రై చేస్తారు. రూ. 50 వేలు ఇస్తే లోన్ వస్తుందని చెప్పడంతో.. డబ్బుకోసం వీళ్లు ప్రయత్నాలు చేస్తారు. ఈక్రమంలో ఈ ఐదుగురు గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడతారు. అక్కడి నుంచి వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? సరదాగా ఊర్లో తిరిగే వీళ్లు గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ కేసు నుంచి ఈ ఐదుగురు ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ. (రాజ్కుమార్ ఎలా చేశారంటే..? ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు యాక్టింగ్ ఇరగదీశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాన మోసుకొచ్చాడు. తనదైన కామెడీ టైమింగ్తో కొన్నిచోట్ల నవ్వించాడు. ఇక శ్రీవిష్ణుకు జతగా శ్రావణి పాత్రలో అమృత అయ్యర్ మంచి నటనను కనబర్చింది. పల్లెటూరి అమ్మాయిలా తెరపై అందంగా కనబడింది. హీరో స్నేహితులుగా రంగస్థలం మహేశ్తో పాటు మిగిలిన ఇద్దరు కూడా చక్కగా నటించారు. ఇక కన్నింగ్ కరణంగా నరేశ్, రైతుగా దేవీ ప్రసాద్, హీరో తండ్రిగా శివాజీ రాజా తమ అనుభవాన్ని మరోసారి తెరపై చూపించారు. పోలీసాఫిసర్గా సుబ్బరాజ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. సినిమాలో హీరో ఎంత బాగా నటించినా కూడా.. కథ, కథనం బాగుంటేనే అది సక్సెస్ అవుతుంది. రొటీన్ కథనైనా.. దాన్ని తెరపై వైవిధ్యంగా చూపిస్తే దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. కథ తగ్గట్టు సినిమాని డ్రైవ్ చేసే బాధ్యత దర్శకుడిది. ఈ విషయంలో కొత్త దర్శకుడు తేజ మార్ని తడబడ్డాడు. తొలి సినిమా ‘జోహార్’తో మంచి మార్కులు కొట్టేసినా తేజ.. ‘అర్జున ఫల్గుణ’మూవీని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. కథ, కథనం రెండూ రోటీన్గా ఉన్నాయి. గోదావరి జిల్లాలకు చెందిన ఐదుగురి నిరుద్యోగుల నేపథ్యాన్ని కథాంశంగా మలచుకొని ‘అర్జున ఫల్గుణ’సినిమాన్ని తెరకెక్కించాడు. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా.. తెరపై మాత్రం రోటీన్గా చూపించడం సినిమాకు మైనస్. ఫస్టాఫ్లో కామెడీతో కొంతమేర నవ్వించే ప్రయత్నం చేసినా.. సెకండాఫ్ పూర్తిగా తేలిపోయింది. ప్రేక్షకుడి ఊహకందే విధంగా కథనం సాగుతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. థ్రిల్లింగ్ మూమెంట్స్, లవ్, పల్లెటూరి చమత్కారం.. ఇలా కథలో జొప్పించడానికి చాలా ఆప్షన్స్ ఉన్నప్పటికీ.. వాటిని చేచేతూలా చేజార్చుకున్నాడు. అర్జుణుడు, అభిమన్యుడు, పద్మవ్యూహం అంటూ పెద్ద పెద్ద పదాలతో కథను ప్రారంభించిన దర్శకుడు.. చివరకు గమ్యంలేని ప్రయాణంలా మార్చేశాడు. అయితే సుధీర్ వర్మ డైలాగ్స్ మాత్రం సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ప్రియదర్శన్ సంగీతం కొంతమేర ఆకట్టుకున్నా.. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అతిగా అనిపిస్తుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫి బాగుంది. పల్లెటూరి అందాలను తెరపై అద్భుతంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కథలను ఎంచుకోవడంతో దిట్ట అయినా శ్రీవిష్ణువు.. ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త బోల్తా పడ్డాడనే చెప్పాలి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
కొంటె చూపుతో కుర్రకారు మనసు కొల్లగొడుతున్న అమృతా అయ్యర్
-
అందుకే తెలుగు టైటిల్స్ పెడతా.. ఆ కథలే నా బలం: శ్రీవిష్ణు
‘తెలుగు టైటిల్స్ నాకు చాలా ఇష్టం. నా సినిమా టైటిల్స్ అన్ని తెలుగులో పెట్టేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతుంటాను. అలా మధ్య మధ్యలో సంస్కృత పదాలు కూడా పెడుతుంటాను. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి తెలుగు పదాలు తెలుస్తాయి. అర్జున ఫల్గుణ అనేది ఈ తరం పిల్లలకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకరో ఇద్దరూ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే నేను తెలుగు టైటిల్స్ని ఇష్టపడతా’అన్నారు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అర్జున ఫల్గుణ ’.అమృతా అయ్యర్ హీరోయిన్గా ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో శ్రీ విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఈ ఏడాదిలో నాకు ఇది మూడో చిత్రం. కొత్త దర్శకులనే నేను ఎంచుకుంటూ వచ్చాను. మంచి కథతో దర్శకులు వస్తే.. అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. నాకు మొదటి సారి తేజ మర్నిలో దర్శకుడు కనిపించాడు. బాగా హ్యాండిల్ చేయగలడని నాకు నమ్మకం కలిగింది. ఎమోషన్ సీన్స్ బాగా రాశాడు. ఎమోషనల్ హ్యాండిల్ చేయగలిగితే సినిమా వర్కవుట్ అవుతుంది. అందుకే సినిమాను ఓకే చేశాను. చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి నాకు షాక్ ఇచ్చాడు. 55 రోజుల్లో షూట్ చేయడం చాలా కష్టం. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ►అర్జున ఫల్గుణ అనేది భారతంలోని టాపిక్. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ,విజయ ఇలా ఓ పది పేర్లు తలుచుకుంటూ ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు. కానీ రాను రాను అది అర్జున ఫల్గుణ వరకే చెప్పారు. ఉరుములు మెరుపులు పిడుగులు వస్తే అందరూ అర్జున ఫల్గుణ అని అనుకునేమనేవారు. కానీ కొన్ని పేర్లు విన్నప్పుడు, తలుచుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అలా అర్జున ఫల్గుణ అనే పేరులో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ► గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్లో కథ చేయాలని అనుకున్నాను. ఊరి బ్యాక్ డ్రాప్లోంచి సిటీకి వచ్చిన కథలు చేశాను. కానీ మొత్తం ఊరి బ్యాక్ డ్రాప్లో చేయలేదు. ఇది చాలా ఫ్రెష్గా అనిపించింది. పూర్తి కథను సిద్దం చేయమని చెప్పాను. ► డిగ్రీలు పూర్తి చేసి ఊర్లోనే ఉన్న ఐదుగురి స్నేహితుల కథే ఈ సినిమా. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలని అనుకునే మనస్తత్వంతో మా క్యారెక్టర్స్ ఉంటాయి. యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కించాం. కానీ దాన్ని గోదావరి జిల్లాకు అడాప్ట్ చేశాం. నర్సీపట్నంలో జరిగిన ఘటనల ఆధారంగానే ఈ సినిమాను తీశాం. ► ఇది వరకు చాలా సినిమాల్లో కొంతమేర గోదావరి యాసలో మాట్లాడాను. కానీ ఇప్పుడు పూర్తిగా గోదావరి యాసలోనే ఉంటుంది. ఇది కరెక్ట్ స్లాంగ్. ఈ సినిమాలో యాస పరంగా ఎలాంటి హద్దుల్లేవు. పూర్తిగా ఎటకారంగా ఉంటుంది. ► తెలుగు హీరోలందరినీ నేను ఆరాధిస్తాను. అందరినీ ఇష్టపడతాను. పెద్ద ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలా అందరినీ నేను గొప్పగా చూస్తుంటాను. మన హీరోలను గౌరవించుకునే అవకాశం వస్తే నేను దాన్ని వాడుకుంటాను. వాళ్లంతా గొప్ప వాళ్లు కాబట్టే స్టార్లు అయ్యారు. నాకు ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇందులో ఎంతో పాజిటివ్గా ఉంటుంది. ► అర్జున ఫల్గుణలో అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి. పద్దతులు, సంప్రదాయాలు చూపిస్తాం. ఫ్రెండ్స్ మధ్య ఉండే ఎమోషన్ బాగు ఉంటుంది. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ముల్కల లంక అనే ఊర్లోకి వెళ్తారు. ► రంగస్థలం మహేష్, చైతన్య, రాజావారు రాణివారు చౌదరి, నేను, అమృతా అయ్యర్ మేం ఐదుగురం ఉంటాం. ప్రతీ పాత్రకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. పెద్ద నరేష్ , శివాజీ రాజా, సుబ్బరాజు అందరూ అద్భుతంగా నటించారు. ► రియలిస్టిక్ సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. కెరీర్లో ఒకటో రెండో రియలిస్టిక్ కథలు వస్తాయి. కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతీ కథను రియలిస్టిక్ చేసేందుకు ప్రయత్నిస్తాను. నా సినిమాలన్నీ నాచురల్గా ఉంటాయని అందరూ అంటుంటారు.రియలిస్ట్ కథలే నా బలం. ► నేను పెద్దగా ప్రయోగాలు ఏమీ చేయలేదు. నార్మల్ కథనే కాస్త కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాను. తిప్పరా మీసం సినిమాను బాగా నమ్మాం. అమ్మ సెంటిమెంట్తో ఆ సినిమా చేశాను. అంతకు ముందే బ్రోచేవారెవరురా అంటూ ఫుల్ కామెడీ సినిమాను తీశాను. తిప్పరా మీసం కూడా ఎక్కువ సరదాగా ఉంటుందని అనుకున్నారు. కానీ అది పూర్తిగా మదర్ సెంటిమెంట్తో ఉంటుంది. కానీ నా వరకు అదే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన చిత్రం. ► ప్రస్తుతం భళా తందనాన అనే సినిమా చేస్తున్నాను. లక్కీ మీడియాలో మరో చిత్రం చేస్తున్నాను. భళా తందనాన పెద్ద పాన్ ఉన్న సినిమా. మంచి యాక్షన్ డ్రామా. లక్కీ మీడియాలో చేస్తోన్నది పోలీస్ ఆఫీసర్ బయోగ్రఫీ. ఇందులో ఐదు ఏజ్ గ్రూపులుంటాయి. -
ఏ సినిమా చేసినా అది మిస్సవ్వను
‘‘ప్రతి దర్శకుడికీ తన సినిమాని పెద్ద తెర మీద చూసుకోవాలని ఉంటుంది. అయితే నా మొదటి సినిమా (‘జోహార్’) ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమాకి నేనే నిర్మాతను కావడంతో ఒత్తిడికి లోనయ్యాను. ఇప్పుడు ‘అర్జున ఘల్గుణ’కి మంచి నిర్మాతలు దొరికారు. ‘దిల్’ రాజుగారు రిలీజ్ చేస్తున్నారు’’ అని తేజ మార్ని అన్నారు. శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజ మార్ని దర్శకత్వంలో ఎన్.ఎమ్. పాషా కో ప్రొడ్యూసర్గా నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ఈ నెల 31న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా తేజ మార్ని చెప్పిన విశేషాలు. ► ‘అర్జుణ ఫల్గుణ’ని సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నాం. ఇందులో ఎన్టీఆర్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మీద డైలాగ్స్ ఉన్నాయి. పైగా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ (జనవరి 7) తర్వాత వేరే సినిమాలు కనపడవేమో! ఈ కారణాల వల్ల మా సినిమాని ముందు రిలీజ్ చేస్తున్నాం. ► గోదావరి బ్యాక్డ్రాప్లో జరిగే సినిమా ఇది. ఈస్ట్ గోదావరిలో దొరికే ఓ కూల్ డ్రింక్ని టైటిల్గా అనుకుంటే, అనుమతి దక్కలేదు. ఆ టైటిల్ కాకపోతే కథ మార్చాలి. ఆ విషయం గురించి చర్చించుకుంటున్నప్పుడు అర్జున ఫల్గుణ అంటే ధైర్యం వస్తుందట అని నేను, శ్రీవిష్ణు మాట్లాడుకున్నాం. ఇదే టైటిల్గా పెడితే బాగుంటుందని శ్రీవిష్ణు అన్నారు. సినిమాలో హీరో పేరు అర్జున్. టైటిల్ పెట్టాక కథలో చాలా మార్పులు చేశాం. ఉళ్లో ఉన్నప్పుడు అర్జునుడిగా ఉండే హీరో ఊరు దాటాక ఫల్గుణుడిగా ఎలా మారాడు? అన్నదే కథ. ► సిటీలో ఎంత సంపాదించుకున్నా మిగిలేది కొంతే.. ఒక్కోసారి మిగలకపోవచ్చు కూడా. అందుకే ఊళ్లోనే ఉండి సంపాదించుకుంటే మంచిదేమో అనుకునే ఊరి కుర్రాళ్ల కథ ఇది. నా స్నేహితులు, వాళ్ల స్నేహితుల జీవితాల్లో జరిగిన ఘటనలను ఈ కథలో పొందుపరిచాను. సినిమాలోని మెయిన్ ఐదు పాత్రలూ ఎన్టీఆర్ ఫ్యా¯Œ ్స. నేను కూడా ఎన్టీఆర్ అభిమానినే. ► శ్రీ విష్ణుని అనుకుని ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు కథ రాశాను. కథానుగుణంగా గోదావరి యాస పెట్టాం. సినిమాలో శ్రీవిష్ణుని చూస్తే ‘సిందూరం’లో రవితేజగారిని చూసిన ఫీల్ వస్తుంది. యాక్షన్ పరంగా కొత్త విష్ణును చూస్తారు. సినిమా ఫస్టాఫ్ వినోదంగా, సెకం డాఫ్ థ్రిల్లింగ్గా ఉంటాయి. క్లైమాక్స్లో ప్రేక్షకులు ఎమోషనల్ అవుతారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2, షైన్ స్క్రీన్ బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాను. ఇకనుంచి కమర్షియల్ సినిమాలే చేయాలనుకుంటున్నాను. కానీ ఎమోషన్ని మాత్రం మిస్సవ్వను. -
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా శ్రీ విష్ణు, ట్రైలర్ చూశారా?
Arjuna Phalguna Trailer: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ శుక్రవారం అర్జున ఫల్గుణ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో అర్జున పాత్రలో ఒదిగిపోయిన శ్రీ విష్ణు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమానిగా కనిపించాడు. ట్రైలర్లో ఇంకా ఎన్నాళ్లు ఖాళీగా ఉంటావన్న ప్రశ్నకు హీరో రియాక్ట్ అవుతూ 'డిగ్రీదాకా చదివాం.. ఆర్నెళ్లు రెస్ట్ తీసుకుంటే తప్పా?' అని చెప్పిన డైలాగ్ యూత్కు కనెక్ట్ అవుతోంది. ఇక హీరోయిన్ అమృత గ్రామ వాలంటీర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 50 శాతం అడవుల్లోనే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. -
మంచి పాత్రలు వస్తున్నాయి కానీ..!
‘‘ఇప్పటివరకూ నాకు సంప్రదాయమైన పాత్రలే వచ్చాయి. మంచి పాత్రలొస్తున్నాయి కానీ, నేనేంటో నిరూపించుకునే సవాల్తో కూడిన పాత్రలు ఇంకా రాలేదు’’ అని హీరోయిన్ అమృతా అయ్యర్ అన్నారు. శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా అమృతా అయ్యర్ మాట్లాడుతూ– ‘‘స్నేహం నేపథ్యంలో ‘అర్జున ఫల్గుణ’ ఉంటుంది. ఆపదలో ఉన్న ఓ స్నేహితురాలికి ఐదుగురు స్నేహితురాళ్లు ఎలా సాయపడ్డారన్నది ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ 50 శాతం అడవుల్లో జరిగింది. సల్వార్ వేసుకుని అడవుల్లో పరిగెత్తడం కష్టంగా అనిపించింది. కొండలపై షూటింగ్ కోసం రాను పోను మూడు గంటలు నడిచేవాళ్లం. ‘నువ్వు ఏదైనా చేయగలవు’ అంటూ తేజ మార్నిగారు స్పూర్తి నింపారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్గారి సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. ‘రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాల్లో నా పాత్రల పరంగా సంతృప్తిగా ఉన్నాను. నాకు గ్లామర్ పాత్రలు సౌకర్యంగా అనిపించవు.. ప్రస్తుతానికి చేయాలనుకోవడం లేదు కూడా. ప్రస్తుతం చేస్తున్న ‘హనుమాన్’ 70 శాతం పూర్తయింది. వెబ్ సిరీస్లు చేసే ఆలోచన లేదు’’ అన్నారు. -
నన్ను ప్రేమించాల్సిందేనంటున్న ఆషురెడ్డి.. చెట్టెక్కిన రెజీనా
నేచురల్ స్టార్ నానితో సెల్ఫీ దిగి అభిమానులతో పంచుకుంది సింగర్ మధు ప్రియ అవార్డు చేతపట్టి చెట్టు ఎక్కి నవ్వులు చిందిస్తుంది రెజీనా కూతురితో ఫోటోలను అభిమానులతో పంచుకుంది నటి, యాంకర్ హరితేజ ప్రతి రోజు ఒక అద్భుతం కోసం వెతకండి అంటున్న అమృత అయ్యర్ మనసుకి ఏది నచ్చితే అదే చేయండి అని చెబుతోంది ‘గద్దలకొండ గణేశ్’ ఫేం మృణాళిని రవి. అందమైన ఫోటోలు షేర్ చూస్తే కుర్రకారుల మతులు పొగొడుతోంది అమలాపాల్ నేను నిన్ను ప్రేమిస్తున్నా.. నువ్వు నన్ను ప్రేమించాల్సిందే అంటుంది ఆషు రెడ్డి View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Madhuppriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Madhuppriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Mirnalini Ravi (@mirnaliniravi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
ఆసక్తి పెంచుతున్న ‘అర్జున ఫల్గుణ’ థీమ్ పోస్టర్
వైవిధ్యభరిత చిత్రాలు తీస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు యండ్ హీరో శ్రీవిష్ణు. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడతాడు. ఇప్పటికే ‘గాలి సంపత్’ అనే వెరైటీ చిత్రం చేస్తున్న ఈ యువ హీరో..తాజాగా మరో ఆసక్తికర కాన్సెప్ట్తో కొత్త సినిమాను ప్రకటించారు. ఫేమ్ తేజ మర్ని దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రానికి ఆదివారం 'అర్జున ఫల్గుణ' అనే టైటిల్ని ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్లో ఐదుగురు వ్యక్తులు పరుగులు పెడుతుంటే, వారిని ఓ పోలీస్ జీప్ వెంటాడుతోంది. పైన వ్యక్తుల ముఖాలు మాత్రం కనిపించడం లేదు. కానీ వారు పరుగెత్తుతుండగా, పక్కనే ఉన్న కాలవలో వారి ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రతిబింబాలు ఎవరివో వెల్లడవుతున్నాయి. హీరో హీరోయిన్లు, వారి ముగ్గురు ఫ్రెండ్స్.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పారిపోతున్నారని ఆ పోస్టర్ తెలియజేస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇప్పటికే 75% షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో.. శ్రీ విష్ణు సరసన బ్యూటీ ఫుల్ హీరోయిన్ అమృత అయ్యర్ నటిస్తోంది. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా ఉన్నారు.