Bansuwada
-
కామారెడ్డి జిల్లా: భార్య ఘాతుకం.. పాడుబడ్డ ఇంటిలో షాకింగ్ దృశ్యం
సాక్షి, కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో దారుణం జరిగింది. రాములు అనే వ్యక్తిని గొడ్డలితో భార్య మంజుల, మృతుడి తండ్రి నారాయణ నరికి చంపారు. రాములును హత్య చేసి ఇంటి ప్రక్కనే ఉన్న మరో పాడుబడ్డ ఇంటి లోపల నీటి ట్యాంకులో పడేశారు. ఆపై దుర్వాసన వస్తుందని ఆ ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారు.తన భర్త రాములు కనబడటం లేదని ఈ నెల 16న భార్య మంజుల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దుర్వాసన వస్తుందని కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘాతుకం బయటపడింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాములు మృతదేహాన్ని బాన్సువాడ పోలీసులు వెలికితీశారు. తండ్రి నారాయణ, భార్య మంజులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
బాన్సువాడ దవాఖాన సరికొత్త రికార్డు.. ఒకే నెలలో 504 ప్రసవాలు
కామారెడ్డి: బాన్సువాడ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిలో అగస్టులో 504 ప్రసవాలు జరిగాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఆస్పత్రిలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి ప్రారంభించి రెండేళ్లవుతోందన్నారు. గత నెలలో రికార్డు స్థాయిలో 504 ప్రసవాలు జరిగాయన్నారు. వైద్యులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వైద్యులు సుధ, సిబ్బంది ఉన్నారు. -
సేవాజ్యోతి
అనారోగ్యాలను దూరం చేసే చల్లని చిరునవ్వు .. విధి నిర్వహణలో అంకితభావం .. రోగులపాలిట ఆమె అపర నైటింగేల్ ... సమాజ క్షేమం కోరేవారికి తర తమ భేదాలుండవు అని తన చేతల్లో చూపుతోంది కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో హెడ్నర్స్గా పనిచేస్తున్న ఆరోగ్యజ్యోతి. పాతికేళ్లుగా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఎంతోమంది మన్ననలు అందుకున్నారు ఆరోగ్యజ్యోతి. ఆమె సేవలను గుర్తించి ది నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ది న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నాటక వారు ‘నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్–2023’ అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు. మంగళవారం బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుని సేవాజ్యోతిగా గుర్తింపు పొందింది అరోగ్యజ్యోతి. బోధన్ పట్టణానికి చెందిన ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో హెడ్నర్స్గా విధులు నిర్వహిస్తోంది. 1998లో స్టాఫ్ నర్స్ ఉద్యోగంలో చేరి నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రెండేళ్లు పనిచేసిన ఆమె 2000 సంవత్సరంలో బోధన్ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయి అక్కడే ఇరవై ఏళ్లుగా విధులు నిర్వర్తించింది. 2019 లో హెడ్ నర్స్గా పదోన్నతి పొందిన ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయి, అక్కడే విధుల్లో కొనసాగుతోంది. కరోనా కాలంలో వైద్యులతో కలిసి రోగులకు ఎన్నో సేవలందించిన ఈ నైటింగేల్ పాతికేళ్ల కాలంలో ఎక్కడ ఉద్యోగం చేసినా విధి నిర్వహణకు అంకితమై పనిచేస్తూ వచ్చింది. దీంతో ఆమె అందరికీ తలలో నాలుకలా మారింది. ఆపరేషన్ థియేటర్తోపాటు ప్రసూతి వార్డుల్లోనే ఆమె ఎక్కువగా విధులు నిర్వర్తించింది. అధికారుల నుంచి ఎన్నో మన్ననలు, సామాజిక సేవలకు గాను అవార్డులనూ పొంది సేవాగుణంలో ముందువరసలో నిలిచింది. కూతురి మరణంతో.. ఆరోగ్య జ్యోతి కూతురు అనుకోని పరిస్థితుల్లో విద్యుత్షాక్కు గురై మరణించింది. కూతురి మరణంతో ఆవేదనకు గురైన ఆరోగ్యలక్ష్మి తన సేవలను మరింత విస్తృతం చేయాలని సంకల్పించింది. ఆరోగ్యజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి సేవాకార్యక్రమాలు చేపట్టింది. వైద్యరంగంలో తనకున్న పరిచయాలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేసే కార్యక్రమాలు చేపడుతుంటుంది. బీపీ, షుగర్, గుండె సంబంధ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపట్టి రోగులకు అండగా నిలుస్తోంది. అలాగే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేపట్టి, గర్భిణీలు, బాలింతలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం శిబిరాలు ఏర్పాటు చేసి ఆదుకుంటుంది. – ఎస్.వేణుగోపాల్ చారి, సాక్షి, కామారెడ్డి మాకెంతో గర్వకారణం సేవతో అందరి మన్ననలు పొందే ఆరోగ్యజ్యోతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్–2023 అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మేమంతా గర్వించదగ్గ విషయం. ఈ అవార్డు స్ఫూర్తి మిగతా అందరిలో కలగాలని కోరుకుంటున్నాను. – డాక్టర్ శ్రీనివాసప్రసాద్, సూపరింటెండెంట్, బాన్సువాడ ఏరియా ఆస్పత్రి అందరి సహకారంతో... సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. ఉద్యోగ నిర్వహణలో తోటి ఉద్యోగులు, వైద్యుల సహకారం,ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మానాన్నలు ఎంతోమందికి సాయం అందించేవారు. వాళ్లను చూసి నాకూ అలవాటైంది. నా ప్రయత్నాల్లో మా వారు అండగా నిలిచారు. అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను. – ఆరోగ్యజ్యోతి, హెడ్నర్స్, బాన్సువాడ -
స్పీకర్ పోచారం కంటతడి
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఓ కార్యక్రమంలో కంటతడి పెట్టారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘అపురూపమైనదమ్మ ఆడజన్మ..’ పాటను ప్లే చేయగా, తన తల్లి దివంగత పరిగె పాపమ్మను గుర్తు చేసుకుని ఒక్కసారిగా పోచారం ఉద్వేగానికి గురయ్యారు. 102 ఏళ్ల వయసులో తన తల్లి మరణించారని, ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ప్రజాసేవకు అంకితమయ్యానని తెలిపారు. తన విజయాల్లో భార్య పుష్పమ్మ పాత్ర కూడా ఎంతో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. – బాన్సువాడ చదవండి: అదుపులోనే భైంసా -
రాష్ట్రంలో ధోకేబాజి, బట్టేబాజి పాలన: బండి సంజయ్
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో లాఠీలు, జైళ్ల కోసం నిధులు కేటాయించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసులుపెట్టి లాఠీలు ఝళిపిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని, తూటాలకు భయపడబోమని, ఎంతమందిని అరెస్టుచేసి జైళ్లకు పంపినా భయపడే ప్రసక్తే లేదన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గురువారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో బండి సంజయ్ మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం బీజేపీ కార్యకర్తలు ప్రాణాలివ్వడానికీ వెనుకాడరని, ఇందుకు కామారెడ్డి జిల్లాలో రేవూరి సురేందర్ నిదర్శనమన్నారు. నక్సలైట్లు సురేందర్ను పొట్టన పెట్టుకున్నా బీజేపీ కార్యకర్తలు ఏనాడూ భయపడలేదన్నారు. రాష్ట్రంలో రాక్షస, అవినీతి పాలన నడుస్తోందన్నారు. తెలంగాణను దోచుకుంటున్న దొంగలను కూడా అరెస్టుచేసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. రాష్ట్రంలో ధోకేబాజి, బట్టేబాజి పాలన నడుస్తోందని సంజయ్ దుయ్యబట్టారు. గిరిజనులు సాగు చేసుకొంటున్న పోడు భూముల సమస్యను వారంలో పరిష్కరిస్తానన్న ముఖ్యమంత్రి.. గుర్రంపోడు తండాలో గిరిజనుల భూములను టీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని సంజయ్ ధ్వజమెత్తారు. బాన్సువాడ ఛత్రునాయక్ తండాలో రైతుల పంటలను అటవీ అధికారులతో దున్నించారని, గిరిజనులకు ఈ ప్రభుత్వం చేస్తున్న మేలు ఏపాటిదో ఇది రుజువు చేస్తుందన్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని ఉద్దేశించి.. టీడీపీ, టీఆర్ఎస్ హయాంలలో ఆయన మంత్రి పదవి పోవడానికి కారణాలేంటో రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలుసని సంజయ్ అన్నారు. పోచారం కుమారులు బాన్సువాడలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలకడం సరికాదన్నారు. తాము నిజామాబాద్ నుంచి సభకు వస్తుంటే పోలీసులు రక్షణ కల్పించలేదని, అదే పోచారం కుమారుల వెంట కాన్వాయ్లు నడుపుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ బాన్సువాడకు పట్టిన గబ్బిలాలను పారదోలే అవకాశం వచ్చిందన్నారు. సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీలో చేరగా, వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, అరుణతార, యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కన్నతండ్రే.. కాలయముడు
సాక్షి, బాన్సువాడ: కన్న తండ్రే ఆ పిల్లల పాలిట కాలయముడయ్యాడు. మద్యానికి బానిసై, విచక్షణ మరచి ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి దారుణంగా చంపాడు. ముగ్గురు పిల్లలు తుదిశ్వాస విడిచాక తీరిగ్గా ఇంటికి వెళ్లాడు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నగరానికి సమీపంలోని దాస్నగర్కు చెందిన ఫయాజ్ 2009లో బాన్సువాడ పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో నివసించే నీలోఫర్ను వివాహం చేసుకున్నాడు. ఫయాజ్కు తల్లిదండ్రులు లేకపోవడంతో ఇల్లరికం వచ్చి బాన్సువాడలో స్థిరపడ్డాడు. వీరికి వరుసగా ముగ్గురు కూతుళ్లు పుట్టారు. నాలుగో కాన్పులో ఒక బాబు, పాప జన్మించారు. చిన్న కూతురును రూ.50 వేలు తీసుకుని బంధువులకు దత్తత ఇచ్చాడు. సెంట్రింగ్ పనిచేసే ఫయాజ్ తాగుడు, జూదానికి బానిస కావడంతోఅతడిని ఇటీవల ఎవరూ పనిలోకి తీసుకోవడం లేదు. దీంతో భార్య నీలోఫర్ బట్టలు కుడుతూ, మహిళా సంఘం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఫయాజ్ డబ్బుల కోసం భార్యను రోజూ వేధిస్తుండేవాడు. గురువారం రాత్రి బాగాతాగి వచ్చి డబ్బుల కోసం భార్యను తీవ్రంగా కొట్టాడు. అదే సమయంలో పెట్రోలింగ్కు వచ్చిన పోలీసులకు తన భర్త గురించి నీలోఫర్ ఫిర్యాదు చేసింది. దీనిని మనసులో పెట్టుకున్న ఫయాజ్.. శుక్రవారం ఉదయం సైతం ఆమెను తీవ్రంగా కొట్టాడు. అనంతరం అతను ముగ్గురు కూతుళ్లు, కుమారుడిని తీసుకుని బయటకు వెళ్లాడు. సమీపంలోని దర్గాలో కందూరు చేస్తున్నారని, అక్కడికెళ్లి అన్నం తిందామని చెప్పి వారిని తాడ్కోల్ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అయితే నాలుగేళ్ల కుమారుడు రైస్ మధ్యలోనే ఇంటికి వెళ్లాడు. దీంతో ముగ్గురు కూతుళ్లను చెరువు వద్దకు తీసుకెళ్లిన ఫయాజ్.. ఒక్కొక్కరిని బలవంతంగా నీటిలో ముంచాడు. ఆఫియా బేగం(10), మహీన్ బేగం (8), జోయా (6)లను నీటిలో బలవంతంగా ముంచి, వారిపై కూర్చున్నాడు. ఊపిరి ఆడక వారు చనిపోవడంతో ఇంటికి వెళ్లాడు. తడి బట్టలతో వచ్చిన భర్తను చూసిన నీలోఫర్.. కూతుళ్లు ఎక్కడని అడిగింది. వారు దర్గా వద్ద అన్నం తింటున్నారని చెప్పి, అక్కడినుంచి కల్లు దుకాణానికి వెళ్లి కల్లు తాగాడు. భర్తపై అనుమానం వచ్చిన నీలోఫర్ చెరువు వద్దకు వెళ్లింది. అక్కడ కూతుళ్ల చెప్పులను చూసి స్థానికులకు విషయం చెప్పింది. స్థానికులు చెరువులో గాలించగా పిల్లల మృతదేహాలు దొరికాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కల్లు దుకాణంలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాన్సువాడ డీఎస్పీ దామోదర్రెడ్డి, సీఐ మహేశ్గౌడ్లు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. బంధువుల ఆందోళన.. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలంటూ మృతుల తల్లి నీలోఫర్, బంధువులు, డ్రైవర్స్ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ముట్టడించి నిరసన తెలిపారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తన కళ్లముందే భర్తను ఉరితీయాలని నీలోఫర్ డిమాండ్ చేసింది. డీఎస్పీ వారికి నచ్చజెప్పి పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూతుళ్ల ఉసురుతీసి చెరువులో పడేశాడు!
-
ముగ్గురు చిన్నారులను చెరువులో ముంచి..
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని బాన్సువాడ మండలం తాడ్కోల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫయాజ్ అనే కసాయి తండ్రి ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి దారుణంగా హత్య చేశాడు. గురువారం సాయంత్రం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు.. అఫియా (10), మహీన్ (9), జియా( 7) రాజారాం దుబ్బ చెరువులో విగతజీవులై కనిపించారు. ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృత దేహాలు శుక్రవారం బయటపడ్డాయి. కుటుంబ కలహాలతోనే తండ్రి ఫయాజ్ ఈ దారుణానికి పాల్పడినట్టు గ్రామస్తులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు. -
పెళ్లి చేయడం లేదన్న మనస్తాపంతో..
సాక్షి, బాన్సువాడ : తల్లిదండ్రులు తన పెళ్లి చేయడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. పొతంగల్కు చెందిన నరేశ్(22) కొన్నేళ్లుగా బోర్లంలోని తన మేనమామ మద్ది బాలయ్య వద్ద ఉంటున్నాడు. నరేష్ కొంతకాలంగా తనకు పెళ్లి చేయాలని తన తల్లి విఠవ్వ, అన్న కిషన్పై ఒత్తిడి తెచ్చాడు. కొన్ని రోజులు ఓపిక పట్టమని వారు సర్ది చెబుతూ వచ్చారు. దీంతో మనస్తాపం చెందిన నరేశ్ నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నరేశ్ను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించిన వైద్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. నాలుగు రోజుల పాటు అక్కడ చికిత్స అందించిన వైద్యులు యువకుడి పరిస్థితి విషమించిందని మూత్ర పిండాలు, కాలేయం దిబ్బతిందని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలైన తల్లిదండ్రులు బుధవారం నరేశ్ను ఇంటికి తీసుకువచ్చారు. ఆరోగ్యం విషమించి గురువారం ఇంటి వద్ద నరేశ్ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
సంక్షేమంలో నంబర్ వన్
బాన్సువాడ: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రూ.100 కోట్లతో జరిగిన పలు అభివృద్ధి పనులను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డితో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అణగారిన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలన పట్ల ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యారని, అందుకే అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తక్కువ సంఖ్యకే పరిమితమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ను నిషేధించినట్లే ఫ్లెక్సీ కల్చర్ను కూడా నిర్మూలిద్దామని మంత్రి పిలుపునిచ్చారు. పాపను పలకరించి.. రూ.2 వేలు ఇచ్చి.. కేటీఆర్ బాన్సువాడలోని మినీ ట్యాంక్బండ్ను ప్రారంభించి చార్జింగ్ ఆటోలో పోచమ్మగల్లి మీదుగా వెళ్తుండగా, అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడిన మహిళలను చూసి ఆగారు. ఒక మహిళ పాపను ఎత్తుకొని ఉండగా, ఆ పాపను పలకరించి బాగున్నావా అంటూ మాట్లాడారు. బాగా చదవాలని వెన్ను తట్టి రూ.2 వేల నగదును అందజేశారు. స్పీకర్గా ఆదేశిస్తున్నా.. బాన్సువాడలోని వీక్లీ మార్కెట్లో మున్సిపల్ భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని స్పీకర్గా ఆదేశిస్తున్నానని పోచారం మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి అన్నారు. స్పందించిన కేటీఆర్.. స్పీకర్ కోరినన్ని నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. -
నేడు బాన్సువాడకు మంత్రి కేటీఆర్ రాక
సాక్షి, కామారెడ్డి: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం జిల్లాకు రానున్నారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో అన్ని బల్దియాలపై గులాబీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో కేటీఆర్ ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా బాన్సువాడ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారని తెలిసింది. అభివృద్ధి ఇలా.. బాన్సువాడ పట్టణం మున్సిపాలిటీగా ఏర్పాటైన తరువాత దాదాపు రూ. వంద కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రధానంగా రోడ్ల వెడల్పు, డ్రెయినేజీల నిర్మాణం, స్టేడియం నిర్మాణం, మినీ ట్యాంక్బండ్ పనులతో పాటు మరికొన్ని పనులు చేపట్టారు. రూ. 37 కోట్లతో బాన్సువాడ పట్టణంలోని శ్మశాన వాటిక నుంచి బస్సు డిపో వరకు సుమారు 3 కిలోమీటర్ల రోడ్డును నాలుగు వరుసల సీసీ రోడ్డుగా మార్చారు. ఫుట్పాత్తోపాటు డ్రెయినేజీలు నిర్మించారు. రహదారి మధ్యలో డివైడర్లు, హైమాస్ట్ లైట్లను బిగించారు. రూ. 2.40 కోట్లతో పట్టణంలోని కమ్యూనిటీ హాల్ వద్ద మినీ స్టేడియం నిర్మించారు. మినీ స్టేడియం చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. రూ. 7.80 కోట్లతో కల్కి చెరువును మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దారు. రూ. 25 కోట్లతో పట్టణంలోని వివిధ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఆయా కాలనీల్లో పనులు వేగంగా సాగుతున్నాయి. పట్టణంలో చెత్తాచెదారాన్ని తరలించేందుకు ఆటోలు, ట్రాక్టర్లను మంజూరు చేశారు. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలను తెప్పించారు. మరికొన్ని అభివృద్ధి పనులూ చేపట్టారు. ఆయా పనులకు మంత్రి కేటీఆర్ శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కేటీఆర్ పర్యటన వివరాలు.. మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం 10 గంట లకు హెలికాప్టర్ ద్వారా బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. ఆయన వెంట మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఉంటారు. మంత్రులు పట్టణంలో పర్యటిస్తారు. ప్రధాన రహదారితో పాటు డ్రెయినేజీలు, సీసీ రోడ్ల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. మినీ ట్యాంక్ బండ్, మినీ స్టేడియంలను ప్రారంభిస్తారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్, ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు మంత్రి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఏర్పాట్లు పూర్తి మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేయించారు. -
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
-
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, నిజామాబాద్ : మల్లారం గండి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్సుకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. నిజామాబాద్ నుంచి బాన్సువాడ వెళ్తుండగా మార్గ మధ్యలో బస్సు అదుపు తప్పడంతో ఒక్కసారిగా రోడ్డు పక్కకు దిగిపోయింది. దీంతో భయబ్రాంతులకు గురైన ప్రయాణీకులు వెంటనే కిటికీల నుంచి కిందకు దిగారు. కాగా అడవిలోకి దూసుకుపోయి ఉంటే మరింత ప్రమాదం తలెత్తే అవకాశం ఉండేదని డ్రైవర్పై తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వారంలో జిల్లాకు రానున్న సీఎం కేసీఆర్
సాక్షి, బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. తన సొంతూరు పోచారంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను బుధవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పేదవారి ఆత్మగౌరవం కాపాడటానికి ప్రభత్వం ఖర్చుకు వెనుకాడకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 6వేల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించామని, 15 వేల ఇళ్లు నిర్మించడమే లక్ష్యమని స్పీకర్ అన్నారు. బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ శివారులో 500 ఇళ్లు పూర్తిచేసి మరో 500 ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభించామన్నారు. పూర్తయిన ఇండ్లను త్వరలోనే సీఎం కేసీఆర్తో కలిసి ప్రారంభించి అర్హులైన వారికి పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే అలీసాగర్ రివర్స్ పంపింగ్.. వారం రోజుల్లో సీఎం కేసీఆర్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శ్రీరాం సాగర్లోకి రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నీళ్లు వచ్చాయన్నారు. అలాగే అలీసాగర్ నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా నిజాంసాగర్ 28 డిస్ట్రిబ్యూటరీ కెనాల్కు తీసుకురావడానికి సుమారు రూ.150కోట్లతో సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తారన్నారు. నాన్ కమాండ్ ఏరియాలో ఉన్న చందూర్, జాకోరాల్లో ఎత్తిపోతల పథకాలకు భూమిపూజ చేయడంతో పాటు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను సీఎం కేసీఆర్ పంపిణీ చేస్తారాన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, సర్పంచ్ రాధ సాయిరెడ్డి, ఎంపీపీ నీరజారెడ్డి, జెడ్పీటీసీ పద్మా, ఎఎంసీ చైర్మన్ నందిని, పోచారం సురేందర్రెడ్డి, అంజిరెడ్డి, వెంకట్రాంరెడ్డి, మహ్మద్ ఎజాస్, మోహన్నాయక్, భాస్కర్, శ్రీనివాస్రెడ్డి, దేవేందర్రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలిపిన అధికారులు పోచారం గ్రామంలోని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి నివాసానికి బుధవారం కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మర్యాద పూర్వకంగా వచ్చారు. దసరా పండుగ సందర్బంగా జమ్మిఆకులు(బంగారం) పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ సుదర్శన్ ఉన్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, నిజాంసాగర్: నాగమడుగు ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రానుండడంతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. సీఎం ఈనెల 11, 12, 13, 14 తేదీలలో జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. మంగళవారం కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేత, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్లు నిజాంసాగర్ మండలంలో పర్యటించారు. నిజాంసాగర్ మండలంలోని ఒడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామాల శివారులో ఉన్న మంజీర నదిపైన రూ. 476.2 కోట్లతో నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మించాలని సంకల్పించిన విషయం తెలిసిందే.. ఈ పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్సువాడ పట్టణం నుంచి బస్సు ద్వారా వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఈ మార్గాన్ని కలెక్టర్, ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్ పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్లపొదల తొలగింపు, హరితహారం మొక్కలు నాటడం, వాటి చుట్టూ ట్రీగార్డుల ఏర్పాటు పనులపై అధికారులకు సూచనలిచ్చారు. వారి వెంట బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్, డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో పర్బన్న, ఈజీఎస్ ఏపీవో సుదర్శన్, కోమలంచ సర్పంచ్ అనురాధ, ఎంపీటీసీ బండారు లక్ష్మి తదితరులు ఉన్నారు. -
పాత హామీలతో మభ్యపెడ్తున్నారు: బాలరాజు
సాక్షి, బాన్సువాడరూరల్:గత ఎన్నికల్లో ఇచ్చిన పాత హామీలనే మళ్లీ మళ్లీ ఇస్తూ టీఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని , అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసుల బాలరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన మండలంలోని కొయ్యగుట్ట, బోర్లం, దేశాయిపేట్, సోమేశ్వర్, మొగులాన్పల్లి, తిర్మలాపూర్ తదితర గ్రామాలు, తండాల్లో పర్యటించి మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీసీ కోటాలో తనకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చిందని తనను ఆదరించి గెలిపించాలన్నారు. ఈఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తనను గెలిపిస్తే నాయకునిగా కాకుండా సేవకునిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేలుస్తూ, బాజాభజంత్రీల నడుమ స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో టీడీపీ నియోజన వర్గ ఇంచార్జి కొడాలి రాము, నాయకులు ప్రతాప్సింగ్ రాథోడ్, అలీబిన్ అబ్దుల్లా, శంకర్గౌడ్, నర్సన్న చారీ, ఖాలేఖ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాలి బీర్కూర్: పరిపాలన చేతకాక కాడి కింద పడేసిన టీఆర్ఎస్ పార్టీని ఓడించి ఇంటికి పంపించాలని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావ్ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రజాకూటమి బాన్సువాడ అభ్యర్ధి కాసుల బాలరాజ్కు మద్దతుగా బీర్కూర్ మండల కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన రోడ్షో కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజాకూటమి అభ్యర్ధి కాసుల బాలరాజ్, కాంగ్రెస్ నాయకులు, మల్యాద్రిరెడ్డి మండల నాయకులు అబ్దుల్ హైమద్, పోగు నారాయణ, ఆరీఫ్, ఓంకార్, ఈరాస్ సాయిలు, దొంతురాం కాశీరాం పాల్గొన్నారు. కోటగిరి : కోటగిరి మండల కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాల్రాజ్ తనయుడు కాసుల రోహిత్ ఎన్నికల ప్రచారం చేశారు. -
వైఎస్సార్ తర్వాత కేసీఆరే : పోచారం శ్రీనివాస్రెడ్డి
సాక్షి, బాన్సువాడ టౌన్(బాన్సువాడ): సంక్షేమ పథకా లు అమలు చేయడంలో దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖర్రెడ్డి తర్వాత ఆపద్ధర్మ సీఎం కేసీఆరే అని బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు తజ్ముల్ బాన్సువాడలో పోచారంను కలిసి ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో వైఎస్ తర్వాత కేసీఆర్ ముందుంటారని అన్నారు. రైతులకు మేలు చేసిన వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతున్నట్లు ఆయన అన్నారు. టీఆర్ఎస్కు వైఎస్సార్ సీపీ మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, వర్ని మండలంలో ఏ సమస్యలున్నా తజ్ముల్కు చెప్పాలని, తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారిస్తానని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్నారు. కార్యక్రమంలో పోచారం రవీందర్రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి, టీఆర్ఎస్ నాయకులు భాస్కర్రెడ్డి, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, బద్యనాయక్ తదితరులు ఉన్నారు. అలాగే బాన్సువాడ నియోజకవర్గం నుంచి పిరమిడ్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న కొండని అంజయ్య శ్రీనివాస్రెడ్డికి, టీఆర్ఎస్ పార్టీకి తన మద్దతు తెలిపారు. అలాగే మండలంలోని రాంపూర్ ముదిరాజ్ సంఘం సభ్యులు టీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. -
ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి: కాసుల బాల్రాజ్
సాక్షి, కోటగిరి: ప్రజలందరు కలిసి ఏకమై ఈఒక్కసారి అవకాశం ఇవ్వాలని బాన్సువాడ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాసులబాల్రాజ్ ఓటర్లను కోరారు. తనను గెలిపిస్తే మీలో ఒకడిగా ఉంటు సేవకుడిగా పనిచేస్తానన్నారు. మండలంలోని యాద్గార్పూర్, కొల్లూరు, దోమలెడ్గి, సోంపూర్, టాక్లీ, హంగర్గ గ్రామాల్లో సోమవారం కాసులబాల్రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మహిళలు కాసులబాల్రాజ్కు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతు కాంగ్రెస్పార్టీని గెలిపిస్తే అధికారంలోకి రాగానే రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షలు రుణమాఫీ, ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితం, డ్వాక్రా మహిళలకు రూ. లక్షా గ్రాంటుతో పాటు వడ్డీలేని రుణాలు రూ. 10 లక్షలు ఇస్తామని, బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 20 శాతం కేటాయింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ నాయకులు మల్యాద్రిరెడ్డి, కొడాలిరాము, రామకృష్ణారావ్, వేములపల్లిసత్యం, డాక్టర్సునీల్కుమార్, తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ ప్రచారం వర్ని : మండలంలోని కోటయ్య క్యాంపు, గంగారెడ్డినగర్, లక్ష్మీపూర్ క్యాంపు సోమవారం బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాల్రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆంశాలను ప్రజలకు వివరిస్తు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్బంగా వడ్డేపల్లిలో టీఆర్ఎస్ నాయకుడు బీమా శంకర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కార్యక్రమంలో నియోజక వర్గ నాయకుడు మల్యాద్రిరెడ్డి, మండల పార్టీ కన్వీనర్ పండరి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనిపూర్ రాజీరెడ్డి, సెగ్మెంట్ ఉపాద్యాక్షుడు బానోత్ రమేష్, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి భారీ, మాజీ జెడ్పీటీసీ రంజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా: కాసుల బాల్రాజ్
సాక్షి, నస్రుల్లాబాద్ : బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యునిగా ఈ సారి ఆశీర్వదించండి అని బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టి అభ్యర్థి కాసుల బాల్రాజ్ అన్నారు. ఆదివారం మండలంలోని సంగం,అంకోల్,బొమ్మన్దేవ్పల్లి హాజీపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలకు రూ. 50వేల వరకు రుణ మాఫి,సంవత్సరానికి 6గ్యాస్ సిలిండర్లను ,డ్వాక్రా గ్రూపుకు రూ.లక్ష గ్రాంట్ ఉచితం ఇస్తామన్నారు.ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు మాల్యాద్రి రెడ్డి,రాజిరెడ్డి,దొంతురాం కాశీరాం,రాజేశ్వర్ రెడ్డి,సత్య నారాయణ ఉన్నారు. ఏడాదికి 6 సిలిండర్లు ఉచితం బాన్సువాడరూరల్: కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏడాదికి 6 వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుందని యూత్కాంగ్రెస్ మండల అధ్యక్షులు మధుసూదన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడ్కోల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ , ఒకే విడతలో 2లక్షల రుణమాఫీ చేస్తుందని, ప్రతి డ్వాక్రా గ్రూప్కు రూ.లక్ష నగదు ఉచితంగా అందిస్తుందన్నారు. దేశాయిపేట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రత్నాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
వచ్చే మృగశిర నాటికి కాళేశ్వరం నీళ్లు.. పోచారం శ్రీనివాస్రెడ్డి
సాక్షి, బాన్సువాడరూరల్: వచ్చే మిర్గం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నిజాంసాగర్ ఆయకట్టుకింద రెండు పంటలకు సాగునీరు అందిస్తామని బాన్సువాడ అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మండలంలోని కొయ్యగుట్ట కాలనీ, కొయ్యగుట్ట తండా, కేవ్లానాయక్ తండా, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. అర్హులైన నిరుపేదలందరికి డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. తండాల్లో జగదాంబ సేవాలాల్ మందిరాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు అందిస్తామన్నారు. గిరిజన మహిళలతో కలిసి కాసేపు నృత్యం చేశారు. బద్యానాయక్, అంజిరెడ్డి, నార్లసురేష్, మోహన్నాయక్, గోపాల్రెడ్డి, శ్రీధర్, బన్సీనాయక్, అంబర్సింగ్, ప్రేమ్సింగ్ పాల్గొన్నారు. -
119 నియోజకవర్గాలు.. 1821 అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 119 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 1,821 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ నెల 23తో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో అభ్యర్థుల తుది జాబితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి 42 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. అతి తక్కువగా బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఆరుగురు అభ్యర్థులే పోటీలో నిలిచారు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో అత్యధికంగా అభ్యర్థులు రేస్లో నిలవగా.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాల్లో అతి తక్కువగా అభ్యర్థులు పోటీపడుతున్నారు. మల్కాజ్గిరి తర్వాత ఉప్పల్, ఎల్బీనగర్లో 35 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. నగరం బయట అత్యధికంగా మిర్యాలగూడలో 29 మంది, సూర్యపేటలో 25 మంది ఈ ఎన్నికల బరిలో తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. బాన్సువాడ తర్వాత అతి తక్కువగా జుక్కల్, బోత్ నియోజకవర్గాల్లో ఏడుగురు.. ఎల్లారెడ్డి, నిర్మల్ల్లో 8 మంది పోటీపడుతున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి 119 మంది బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ నుంచి 99, బీజేపీ 118, సీపీఐ 3, టీడీపీ 13, ఎంఐఎం 8, సీపీఐ(ఎం) 26, బీఎస్పీ 107, ఎన్నికల కమిషన్చే గుర్తింపు పొందిన ఆయా పార్టీల నుంచి 515, స్వతంత్ర్య అభ్యర్థులుగా 1306 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతుండగా..ఫలితాలు 11న వెలువడనున్న విషయం తెలిసిందే. -
రైతుబంధుకు యూఎన్వో గుర్తింపు
సాక్షి,బాన్సువాడ: రైతుల అభివృద్ధి కోసం ప్రపంచంలో అమలు చేస్తున్న 20 వినూత్న పథకాలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్య సమితి గుర్తించడం గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఇది తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి దక్కిన గొప్ప గౌరవమన్నారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే గొప్ప ఆశయంతో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడి తలెత్తుకొని తిరగాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన కరెంట్ను 24 గంటలు ఉచితంగా, నాణ్యతతో సరఫరా చేస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చేశామని చెప్పారు. పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్థిక వెన్నుదన్ను ఇస్తున్నామన్నారు. రైతులకు సలహాలు ఇవ్వడానికి ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తీర్ణ అధికారిని నియమించామని అన్నారు. మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల కోసం భారీగా గోదాములు నిర్మించామన్నారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమాతో ధీమా కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలతో ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు భరోసా వచ్చిందని పోచారం అన్నారు. తమ వెనక ప్రభుత్వం ఉంది అనే బలం వచ్చిందని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర రైతులకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయన్నారు. -
మిర్చీ తీసుకో.. ఓటు వేసుకో..!
సాక్షి, బాన్సువాడ: ఏడు పదుల వయస్సులోనూ మంత్రి పోచారం ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రెండు నెలల క్రితమే కంటి ఆపరేషన్, మోకాలికి శస్త్రచికిత్స చేయికున్నారు. అయినా ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం బాన్సువాడ మండలంలో పర్యటించిన ఆయన పులికుచ్చ తండాలోని ఓ హోటల్లో మిర్చీలు వేసి ఆకట్టుకున్నారు. అలాగే లంబాడీ మహిళల కోరికపై వారితో కలిసి నృత్యాలు చేశారు. ఎన్నికలొచ్చే.. మర్యాద తెచ్చే..! సాక్షి, నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎన్నికలోచ్చాయి.. ఓటర్లకు ఎనలేని మర్యాదను తెచ్చిపెట్టాయి. అధికారంలో ఉన్నప్పుడు రెండుసార్లు చేతులెత్తి నమస్తే పెట్టినా పట్టించుకోని కొందరు నాయకులైతే ఎన్నికల పుణ్యామాని ఇప్పుడు ఓటర్లపై ఎనలేని మర్యాదను కనబరుస్తున్నారు. ఓటర్లు కంటబడగానే చేతులెత్తి వినమ్రతగా దండాలు పెట్టడంతోపాటు అన్నా.. తమ్మీ.. అక్క.. అంటూ ఆప్యాయతతో పలకరిస్తున్నారు. గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్లిన నాయకులు ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటూ వారితో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పలుపార్టీల నాయకులు ఉదయాన్నే రోడ్లపైకి చేరి వచ్చి, పోయే ఓటర్లను ప్రేమతో పలకరిస్తున్నారు. ఏ మాత్రం అవకాశమొచ్చినా వారి వారి పార్టీల గురించి గొప్పలు చెబుతూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా మరణించినట్లు తెలిస్తే చాలు వారి కుటుంబ సభ్యుల కంటే ముందుగానే వారి ఇళ్లకు చేరుకొని అంత్యక్రియలు పూర్తయ్యేవరకు అక్కడే గడుపుతున్నారు. వివిధ పార్టీల నాయకుల ప్రవర్తనను గమనించే కొందరు ఓటర్లు.. ఎన్నికలు ఎప్పుడూ ఇలాగే వస్తే బాగుండునని భావిస్తున్నారు. -
వేగంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం
బీర్కూర్(బాన్సువాడ) : కామారెడ్డి జిల్లాలో వేగంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర దేవాదాయ, గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. జిల్లా 3 వేల ఇళ్లు నిర్మాణంలో ఉండడం ప్రశంసనీయమన్నారు. మండలంలోని బైరాపూర్లో నిర్మించిన విఠల్ రుక్మిణి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు, గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదివారం ఆయన హాజరయ్యారు. ఆయనతోపాటు మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్మన్ దఫేదర్రాజు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్సింధేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయాలను దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు, పూజారులకు వేతనాలు చెల్లిస్తోందన్నారు. అలాగే గ్రామంలో నిర్మించిన 40 డబుల్బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. ఏ ప్రభుత్వాలు చేయని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కామారెడ్డి జిల్లాలో 5138 ఇండ్లకు టెండర్ పూర్త యి, సుమారు 3 వేల ఇండ్లు నిర్మాణంలో ఉండడం ప్రశంసనీయమన్నారు. ముఖ్యమంత్రి ఆప్యాయంగా లక్ష్మీపుత్రుడు అని పిల్చుకునే వ్యక్తి మీ బాన్సువాడ ముద్దుబిడ్డ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. తెలంగాణలో తాగు, సాగునీటికి కొరత లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నిజాంసాగర్కు పూర్వవైభవం వస్తుందన్నారు. మంత్రి పోచారం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక భావా లు కలి గిన వ్యక్తి అన్నారు. పండరిపురం తర్వాత అంతటి అద్భుత ఆలయాన్ని బైరాపూర్లో నిర్మించిన ఆల య కమిటీకి మంత్రి అభినందనలు తెలిపారు. -
నీటి సమస్య పరిష్కరించాలని రాస్తారోకో
వర్ని(బాన్సువాడ) : రుద్రూర్ మండలంలోని అంగడిబజార్ ఎస్సీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆదివారం రాస్తారోకో చేశారు. గతనెల రోజులుగా కుళాయిలు సరిగా రాక తీవ్ర అవస్థ పడుతున్నామని వారు వాపోయారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ వారు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సమస్య పరిష్కరించే వరకు కదలబోమని మొండికేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని వారిని సముదాయించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో సమస్యను సోమవారం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు చెప్పడంతో స్థానికులు రాస్తారోకో విరమించారు. -
ఏప్రిల్ 1నుంచి.. కొత్త రేషన్ కార్డులు
బాన్సువాడ టౌన్(బాన్సువాడ) : కొత్త రేషన్కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి పౌరసరఫరాల శాఖ తీపికబురు అందించింది. ఏప్రిల్ ఒకటో తేదీనుంచి రేషన్కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏడాదిగా ఎదురుచూపులు.. గతేడాది మే నుంచి కొత్త రేషన్కార్డుల జారీ నిలిపేశారు. ఈ–పాస్ విధానం అమల్లోకి వచ్చేంత వరకు కొత్త కార్డులు ఇవ్వడం, కార్డులో మార్పులు, చేర్పులు చేయకుండా చర్యలు తీసుకున్నారు. అప్పటికే జిల్లాలో 1,700 లకుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ –పాస్ (ఎలక్ట్రానిక్ పోర్టల్ ఆక్సెస్ సర్వీసెస్) విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. ఈ విధానం అమల్లోకి రావడంతో రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్టపడింది. దీంతో డీలర్ల వద్ద మిగులు బియ్యం లెక్కలు బయటపడుతున్నాయి. ఈ పాస్ విజయవంతం కావడంతో కొత్త కార్డులు ఇవ్వాలని సివిల్ సప్లై అధికారులు నిర్ణయించారు. మీ సేవ కేంద్రాల్లో ఈ –పీడీఎస్ వెబ్సైట్ తిరిగి ప్రారంభించాలని డైరెక్టర్కు సూచించారు. ఈ వెబ్సైట్ వినియోగంలో రాగానే కొత్త దరఖాస్తులు స్వీకరిస్తారు. పాత పద్ధతిలోనే దరఖాస్తులు.. దరఖాస్తుల స్వీకరణ పాత పద్ధతిలోనే కొనసాగుతుంది. రేషన్ కార్డు కోరుకునే వారు ఆధార్ కార్డు తీసుకుని మీ సేవ కేంద్రాలకు వెళ్లాలి. ఈ పీడీఎస్ వెబ్సైట్లో వివరాలను నమోదు చేయాలి. మీ సేవ కేంద్రాల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు తహసీల్దార్ లాగిన్కు వెళ్తాయి. వాటిని తహసీల్దార్ పరిశీలించి విచారణ నిమిత్తం రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ రెవెన్యూ కార్యదర్శికి అప్పగిస్తారు. దరఖాస్తుదారుడి వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. ఈ దరఖాస్తులు తిరిగి తహసీల్దార్ లాగిన్కు వెళ్తాయి. తహసీల్దార్ ఆప్రూవ్ చేసిన దరఖాస్తులు సివిల్ సప్లై అధికారుల లాగిన్కు చేరుతాయి. డీఎస్వో ఆమోదంతో కొత్త కార్డులను మంజూరు చేస్తారు. అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు ఇంకా రాలేదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. నేడు వీడియో కాన్ఫరెన్స్.. కొత్త రేషన్కార్డులకు సంబంధించి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలని సివిల్ సప్లై అధికారులు నిర్ణయించారు. అయితే కొత్త కార్డులకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాల గురించి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించనున్నారు. కార్డుల జారీ విషయంలో అక్రమాలకు ఏ విధంగా అడ్డుకట్ట వేయాలనే దానిపైన వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తారని భావిస్తున్నారు. రెండేళ్లుగా తిరుగుతున్నా మా బాబుకు రేషన్ బియ్యం వస్తున్నాయి. నాకు మాత్రం రావడం లేదు. రేషన్ దుకాణంలో అడిగితే కార్డులో నీ పేరు లేదు, అందుకే బియ్యం రావడం లేదు అంటున్నారు. కార్డులో పేరు చేర్చాలని రెండేళ్లుగా తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. కార్డులో పేరు చేర్చాలి. – మోచి విజయ, బాన్సువాడ ఉత్తర్వులు వచ్చాయి... కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయాలని ఉన్నతాధికారులనుంచి ఉత్తర్వులు వచ్చాయి. అర్హులైనవారు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బుధవారం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కార్డుల జారీపై మార్గదర్శకాలను తెలియజేయనున్నారు. – రమేశ్, డీఎస్వో, కామారెడ్డి -
అభివృద్ధి పాటు‘బడి’
ఆ పాఠశాలకు వెళితే చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. పరిశుభ్రమైన పరిసరాలు, క్రమశిక్షణ గల విద్యార్థులు, నిత్యం పాఠశాల ప్రార్థనలో నేటిప్రశ్న, మంచిమాటతో తరగతులు ప్రారంభమవుతాయి. ఇవే కాదు ఈ పాఠశాలలో మరెన్నో విశేషాలు ఉన్నాయి. బడిలోని బోర్డుపై ప్రతి రోజు ఒక బంగారు మాట కనబడుతుంది. పాఠశాల గోడలపై రంగు రంగుల బొమ్మలు కనిపిస్తాయి. వరండాలో నిజాయితీపెట్టె, ప్రథమచికిత్స బాక్సు, పోస్టు డబ్బాలు ఏర్పాటు చేశారు. ఇలా పాఠశాలలో అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలుస్తోంది కోటగిరి మండలంలోని కొడిచర్ల ప్రభుత్వ పాఠశాల. ఈ బడి అభివృద్ధికి హెచ్ఎం, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ మెంబర్లు, ప్రజాప్రతినిధులు, గ్రామ యువకులు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. కోటగిరి (బాన్సువాడ): మండలంలోని కొడిచర్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులకు గాను వందమంది విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రతినిత్యం విద్యార్థులు స్కూలు యూనిఫాంలోనే బడికి వస్తుంటారు. మంచి క్రమశిక్షణతో చదువుకోవడం, ఉపాధ్యాయులు తరగతి గదుల్లో లేనప్పుడు కూడా విద్యార్థులు సబ్జెక్టుల వారీగా బోధన చేయడం జరుగుతుంది. విద్యార్థులకు త్వరగా అర్థమయ్యేలా పాఠశాలలో తరగతి గదుల గోడలపై జంతువులు, తెలుగు భాషా పదాలు, ఆంగ్ల భాషా పదాలు పేయింటింగ్ వేయించారు. అలాగే వరండాలో నిజాయితీపెట్టె, ప్రథమచికిత్స బాక్సు, పోస్టు డబ్బాలు ఏర్పాటు చేశారు. ఇలా పాఠశాల అభివృద్ధి కమిటీతో పాటు యువకులు, గ్రామస్థులు పాఠశాల అభివృద్ధికి చేదోడు వాదోడుగా ఉంటారు. పాఠశాలలో విద్యార్థుల కమిటీలు పాఠశాలలో విద్యార్థులతో కేబినెట్ ఏర్పాటు చేశారు. విద్యార్థులే ప్రధానమంత్రి, విద్యాశాఖామంత్రి, ఆరోగ్యశాఖామంత్రిలా ఉంటారు. విద్యాశాఖామంత్రి విద్యార్థులు క్లాసులు, వారి చదువులను గూర్చి వాకబు చేస్తారు. ఆరోగ్యశాఖ మంత్రి విద్యార్థుల ఆరోగ్యం గురించి ప్రతినిత్యం పర్యవేక్షిస్తారు. ఎవరైనా జబ్బు పడితే వారికి మాత్రలు వేస్తారు. పర్యావరణ శాఖ మంత్రి మొక్కల పెంపకంపై శ్రద్ధ కనబరుస్తారు. నరేందర్కుమార్కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పాఠశాల అభివృద్ధికి, క్రమశిక్షణకు మారుపేరైన హెచ్ఎం నరేందర్కుమార్కు ఎన్నో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు దక్కాయి. 2010లో మద్నూర్ మండలం తడ్గూర్ జెడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన ఆయనకు మొదటి సారిగా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు వచ్చింది. అలాగే 2015 జూన్ తెలగాణ ఆవిర్భావ సందర్భంగా కూడా ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నాడు. 2017లో కోటగిరి మండలం కొడిచర్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తుండగా జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. అనంతరం లయన్స్క్లబ్ ఆఫ్ కోటగిరి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాఠశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్నారు. విద్యార్థులకు మంచి బోధనతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పాటుపడుతున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల హెచ్ఎం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కలు నాటారు. పాఠశాల ఆవరణంతా పచ్చని చెట్లతో ఆందంగా కనబడుతున్నాయి. పాఠశాలలో చెత్తను ఎక్కడపడితే అక్కడ పాడేయకుండా ప్రతి తరగతి గదికి చెత్తబుట్టలు ఏర్పాటు చేశారు. అలాగే మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతారు. ఇవే కాకుండా విద్యార్థులతో బాలసంఘాలు ఏర్పాటు చేశారు. కూడా విద్యార్థులు మధ్యాహ్న భోజనం సక్రమంగా భోజనం చేసేందుకు భోజన కమిటీ పర్యవేక్షిస్తోంది. అందరి సహకారంతో అభివృద్ధి పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులతో పాటు పాఠశాల యాజమాన్య కమిటీ, సర్పంచ్, యువకులు అందరి సహకారం ఉంది. గ్రామంలో ఒక్క డ్రాపౌట్ లేదు. ఒక్క బాలకార్మికుడు కనబడడు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రతిఒక్కరూ కృషిచేస్తారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు వస్తారు. పాఠశాలకు ఏది కావాలంటే అది సమకూరుస్తారు. –నరేందర్కుమార్, పాఠశాల హెచ్ఎం, కొడిచర్ల యూపీఎస్ హెచ్ఎం, ఉపాధ్యాయుల కృషి అభినందనీయం మా గ్రామంలోని పాఠశాల అభివృద్ధి పథంలో సాగేందుకు హెచ్ఎం, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఎంతో ఉంది. పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి విద్యాబోధన అందుతున్నాయి. ప్రతియేటా పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటాం. పాఠశాల అభివృద్ధిలో గ్రామ యువకుల పాత్ర కూడా ఉంది. మా పాఠశాల మండలానికే ఆదర్శం కావాలి. –ఇర్వంత్, సర్పంచ్, కొడిచర్ల -
ఆడ్డబిడ్డ భారమైంది
బాన్సువాడ: పోషణ భారమవుతుందని భావించి.. కన్నులు తెరిచి లోకాన్ని చూడకముందే పసిబిడ్డను వదిలేశారు.. మండుటెండలో వదిలివెళ్లిపోవడంతో బిడ్డ ఎండకు విలవిల్లాడింది. పసికూన ఆర్థనాదాలను విన్న స్థానిక మహిళా కూలీలు పరిగెత్తుకుని వచ్చారు. పాపను తీసుకుని వెళ్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్కు అందించగా, ఆమె అంగన్వాడీ సిబ్బంది, పోలీసులకు అప్పగించడంతో వారు ఆస్పత్రికి తరలించారు.. ఈ సంఘటన సోమవారం బాన్సువాడ మండలం కొయ్యగుట్ట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వారు మహిళ కొయ్యగుట్ట గురుకుల పాఠశాల ఆవరణలో ఒకరోజు పసిగుడ్డును వదిలేశారు. పక్కనే భవన నిర్మాణ పనులు సాగుతుండగా, అందులో పనిచేస్తున్న కూలీలు ఆ బిడ్డ ఆర్తనాదాలు విని అక్కడికి వచ్చారు. సుమారు గంట నుంచి ఎండలో ఉన్న ఆ పాపను చూసిన అక్కడి మహిళా కూలీల హృదయాలు చలించిపోయాయి. వెంటనే ఆ పాపను తీసుకొని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి వద్దకు వెళ్లారు. ఆమె పోలీసులకు, అంగన్వాడీ సిబ్బందికి సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంగన్వాడీ కార్యకర్త, ఆయా సహాయంతో ఆ పసిపాపను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్న పిల్లల వైద్య నిపుణుడు, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ వెంటనే స్పందించి పాపను ఎన్ఐసీయూకి తరలించి చికిత్సలు అందించారు. ఎండ వేడిమి కారణంగా పాప ప్రమాదకరస్థితిలో ఉండడంతో మెరుగైన వైద్యం అందించి పాపను కాపాడారు. ప్రస్తుతం ఆ పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆడపిల్ల కావడంతోనే.. కొయ్యగుట్ట ప్రాంతంలో నిరుపేద ప్రజలు నివసిస్తారు. ఇక్కడ దినసరి కూలీలుగా పని చేసే వారే అధికంగా ఉన్నారు. ఆ ప్రాంతానికి చెందిన వారిలోనే ఎవరో గుర్తు తెలియని మహిళకు ఆడపిల్ల పుట్టడంతో ఒకరోజు తన వద్ద ఉంచుకొని, ఆడపిల్లను పెంచి పోషించి పెళ్లి చేయడం ఇబ్బందికరమని భావించి వదిలి వెళ్లిపోయినట్లు ఆ ప్రాంత వాసులు చర్చించుకుంటున్నారు. పాపను పాఠశాల ఆవరణలో వదలడంతో ఎవరైనా చూసి, ఆ పాపను పెంచుకుంటారనే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మండుటెండలో వదిలేశారు - శోభారాణి, ప్రిన్సిపాల్ పాపను మండుటెండలో మా పాఠశాల ఆవరణలో వదిలేసి వెళ్లారు. పాప అరుపులు విని కూలీలు పాపను తీసుకొని నా వద్దకు వచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించా. పోలీసులు, అంగన్వాడీ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. పాప కోలుకుంటోంది - డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, సూపరింటెండెంట్ అరగంట ఆలస్యమైతే పాప బతికేది కాదు. పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది సకాలంలో పాపను ఆస్పత్రికి తీసుకువచ్చారు. పాపకు మెరుగైన వైద్యం అందించడంతో కోలుకుంటోంది. మండుటెండలో పాప పూర్తిగా నీరసించింది. ఒక రోజు వయస్సు ఉంటుంది. 1.8 కిలో గ్రాముల బరువు ఉంది. పాప కోలుకున్న తర్వాత స్టేట్ హోంకు తరలిస్తాం. -
ఏటీఎంలలో చోరీ: రూ.43లక్షలు ఖాళీ
బాన్సువాడ (నిజామాబాద్ జిల్లా) : వర్ని, కోటగిరి మండలాల్లోని ఏటీఎంలపై మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా మంగళవారం తెల్లవారుజామున విరుచుకుపడింది. నాలుగు ఏటీఎంలపై గురిపెట్టి ఏకంగా రూ.43,32,000లను ఎత్తుకెళ్లారు. వర్ని మండలం రుద్రూర్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఎస్బీఐకు చెందిన ఏటీఎంలో చొరబడిన దొంగలు మొదట సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లతో షట్టర్ను తొలగించి లోపలికి చొరబడ్డారు. ఏటీఎంకు ఇరువైపుల గ్యాస్కట్టర్తోనే తొలగించి, క్యాష్ ట్రేను ఎలా ఉంటే అలా ఎత్తుకెళ్ళారు.ఆ క్యాష్ ట్రేలో సుమారు రూ.31.48లక్షల నగదు ఉంది. అనంతరం పక్కనే బస్టాండ్ వద్ద ఉన్న ఇండియన్ ఏటీఎంలో చొరబడిన వీరు అందులో ఏటీఎం ధ్వంసానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అక్కడి నుంచి నేరుగా కోటగిరి మండల కేంద్రానికి వెళ్ళి, అక్కడ ఉన్న ఎస్బీహెచ్ ఏటీఎంలోకి చొరబడి, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి గ్యాస్ కట్టర్తోనే తమ పని పూర్తి చేశారు. దానిలో రూ.9.50లక్షల రూపాయలను ఎత్తుకెళ్ళారు. అనంతరం పక్కనే ఉన్న ఇండియన్ ఏటీఎంలోకి చొరబడి, అందులోని రూ. 2.34లక్షల నగదును దోచుకెళ్ళారు. ఇలా మొత్తం 43.32లక్షల సొత్తుతో ముఠా పారిపోయింది. ఏటీఎంలలో చోరీ జరిగిన విషయం ఉదయం వరకు ఎవరికీ తెలియరాలేదు. చోరీ జరిగిన విషయం తెలుసుకొన్న పోలీసులు ఖంగుతిన్నారు. ఈ చోరీలు మొత్తం తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 గంటలలోపే జరిగినట్లు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా తెలిసినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన గురించి తెలుసుకొన్న నిజామాబాద్ ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు సందర్శించి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనని, మహారాష్ట్రకు చెందిన ముఠా ఈ దొంగతనానికి పాల్పడి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయా బ్యాంకు మేనేజర్ల ఫిర్యాదు మేరకు వర్నీ, కోటగిరి ఎస్సైలు కేసులను నమోదు చేశారు. -
ఎదురుచూపులే..
పాఠ్యపుస్తకాలు అందక విద్యార్థుల ఇక్కట్లు ఇప్పటివరకు 40 శాతం లోపే సరఫరా ‘ప్రైవేటు’కు మరిన్ని కష్టాలు బాన్సువాడ: విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందుగానే విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. ఇప్పటికే మండల కార్యాలయూలకు పుస్తకాలు చేరాల్సి ఉండగా.. ఇంతవరకూ ఆ ఊసే లేదు. సిలబస్ మారిన పుస్తకాల పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. కొత్త పుస్తకాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదని వాపోతున్నారు. జూన్ ఒకటి నాటికి పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈసారి ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలనే ఉపయోగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు తెరిచే నాటికి ప్రతి పాఠశాలలో విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు అందించాలన్నదే ఉన్నతాధికారుల లక్ష్యం. అయితే పుస్తకాల పంపిణీలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. 2015-16 విద్యా సవత్సరానికి గాను జిల్లా లో సుమారు 18 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటి వరకు అన్ని పుస్తకా లు కలిపి 40 శాతం కూడా పంపిణీ కాలేదు. ఇప్పటికే పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉం డగా, ఆలస్యం జరుగుతుండడంతో అధికారులు ఆదోళన చెందుతున్నారు. రెండు, మూడేళ్ల క్రితం వరకు రవాణా చార్జీల మంజూరీరులో ఎదురైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఈ ఏడాది ముందుగానే నిధుల సమీకరణపై దృష్టి సారించారు. ‘ప్రైవేటు’కు మరిన్ని కష్టాలు.. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాగోలా పుస్తకాలు పంపిణీ చేస్తుండగా, ప్రైవేటు వి ద్యా సంస్థల యాజామాన్యాలకే ప్రతి ఏడాది ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్/తెలుగు మీడియూలలో ప్రభుత్వ పుస్తకాలనే బోధించాలనే నిబంధన ఉండడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎలాగోలా సర్దుబాటు చేసుకొనే వారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు ప్రైవేటు పబ్లిషర్స్ పుస్తకాలను విని యోగించారు. అయితే ప్రస్తుతం 1వ తరగతి నుంచే ప్రభుత్వ ముద్రిత పుస్తకాలను ఉపయోగించాలని విద్యాశాఖ ఆదేశించడంతో ప్రైవేటు యాజమాన్యాలు అయోమయానికి గురవుతున్నాయి. రాష్ట్ర పాఠ్య పుస్తకాల ము ద్రణా కేంద్రం నుంచి జిల్లాకు పాఠ్య పుస్తకా లు అందకపోవడంతో విద్యార్థులు అవస్థల పాల వుతున్నారు. పాఠ్య పుస్తకాల కొరత విద్యార్థులకు కొరకరాని కొయ్యగా మారింది. డబ్బులు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేద్దామన్నా దొరకడం లేదు. జిల్లాలో 22 పాఠ్య పుస్తకాల విక్రయ కేంద్రాలు ఉండగా, వాటిలో అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేక ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. గత ఏడాది జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం సుమా రు 5 లక్షల పుస్తకాలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, అందులో 20 శాతం పుస్తకాలు మాత్రమే సరఫరా చేశారు. దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నో వ్యవప్రయాసలు కోర్చి తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చేర్పించిన తల్లిద్రండులకు ప్రస్తుతం పాఠ్య పుస్తకాల కోసం తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వ పుస్తకాలు ఉపయోగకరమే.. 1వ తరగతి నుంచే ప్రభుత్వ ముద్రిత పుస్తకాలను ప్రవేశపెట్టడం విద్యార్థులకు ప్రయోజనకరమేనని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులను మార్చారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా పాఠశాల స్థాయిలో పాఠ్య పుస్తకాల సిలబస్లో మార్పులు చేశారు. పరిమితికి లోబడి, బట్టీ విధానానికి అనుకూలమైన రాష్ట్ర సిలబస్కు అదనంగా సీబీఎస్ఈ సిలబస్ను జోడించారు. విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వం, ప్రాక్టికల్గా ఆలోచించేలా సిలబస్ రూపకలప్పన చేయడాన్ని విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, పాఠ్య పుస్తకాల ముద్రణలో గతం మాదిరిగానే జాప్యం జరుగుతోంది. గత ఏడాది రవాణాకు సంబంధించి ఎంఈఓలకు నిధులు ఇవ్వాల్సి ఉన్నట్లు తెలిసింది. కాగా గత అనుభవాల దృష్ట్యా ఈ నెలాకరుకల్లా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
బాన్సువాడలో దొంగల బీభత్సం
బాన్సువాడ (నిజామాబాద్ జిల్లా) : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి నివాస గృహానికి కూతవేటు దూరంలో, పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఉన్న దుకాణాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎప్పుడూ పోలీసు బందోబస్తు మధ్య ఉండే మంత్రి ఇంటికి దగ్గరలోనే ఉన్న రెండు దుకాణాల షట్టర్లను పగులగొట్టి అందులో ఉన్న నగదుతోపాటు విలువైన వస్తువులను దొంగిలించారు. మంగళవారం అర్థరాత్రి బాన్సువాడ పట్టణంలోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని పాత బాలకృష్ణకు చెందిన ఫర్టిలైజర్ షాపు, పక్కనే ఉన్న క్లినిక్ షట్టర్లను దొంగలు ధ్వంసం చేశారు. ఫర్టిలైజర్ షాపులో కౌంటర్ను ధ్వంసం చేసిన దొంగలు అందులో ఉన్న రూ.45వేల నగదును, విలువైన వస్తువులను, నివాస గృహాలకు సంబంధించిన దస్తావేజులను దొంగిలించారు. అనంతరం పక్కనే ఉన్న క్లినిక్లో చొరబడ్డారు. అక్కడ ఏమీ లభించకపోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. సిసి కెమెరాల్లో దృశ్యాలు కాగా ఫర్టిలైజర్ షాపులో షట్టర్ వద్ద, లోపల ఉన్న సిసి కెమెరాల్లో దొంగలు చొరబడ్డ దృశ్యాలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. షట్టర్ను ఐరన్ రాడ్తో లేపడం, లోనికి చొరబడి, లోపల ఉన్న కౌంటర్ను ధ్వంసం చేయడం అన్ని దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రధాన రోడ్డు కావడంతో రాత్రి వేళ వాహనాల రాకపోకలు ఉంటాయని భావించిన దొంగలు షాపునకు అడ్డంగా ఒక వాహనాన్ని నిలిపి తమ పని కానిచ్చారు. మంగళవారం రాత్రి 1.30 నుంచి, 1.50 గంటల సమయంలో ఈ చోరీ జరిగినట్లు సిసి కెమెరాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ సంఘటన జరిగిన అరగంటకే వర్నీ మండల కేంద్రంలోని బట్టల షాపులో, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ షాపులో దొంగలు చొరబడి అక్కడా రూ.16వేల వరకు దోచుకెళ్ళారు. చందూర్ గ్రామ శివారులో నివసిస్తున్న శంకర్రెడ్డి, పుష్ప దంపతులపై దాడి చేసి వారి వద్ద నుంచి 3 గ్రాముల బంగారం, 20 వేల నగదును దోచుకెళ్ళారు. ఐదు చోట్ల జరిగిన ఈ దొంగతనాలు ఒకేరకంగా ఉండడంతో వీటన్నీటిని ఒకే ముఠా చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాన్సువాడ, వర్నీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వరుస దొంగతనాలతో అందోళన కాగా బాన్సువాడ ప్రాంతంలో వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నెల రోజుల క్రితం పాత బాన్సువాడలో సాయిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరుగగా, అంతకుముందు టీచర్స్ కాలనీలోనూ చోరీ జరిగింది. అలాగే ఇస్లాంపూరలో యూసుఫ్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. ఇలా వరుస దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు నామమాత్రంగా కేసులు నమోదు చేసుకుని, దొంగలను పట్టుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. చోరీకి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తే, భవిష్యత్తులో దొంగతనాలు జరగకుండా అరికట్టవచ్చని వారంటున్నారు. -
బాన్సువాడలో చోరీ
బాన్సువాడ (నిజామాబాద్ జిల్లా) : కుటుంబసభ్యులంతా ఆరుబయట పడుకుంటే దొంగలు ఇంట్లో పడి దోచుకెళ్లారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బాన్సువాడ పాత పట్టణంలో నివాసముండే ముదిరెడ్డి గోపాల్రెడ్డి కుటుంబమంతా శనివారం రాత్రి ఆరుబయట నిద్రించారు. ఇదే అదనుగా చూసుకుని దొంగలు ఇంట్లో నుంచి 8 తులాల బంగారం, 15 తులాల వెండి, రూ. 30వేల నగదును దోచుకెళ్లారు. తెల్లవారిన తర్వాత చూసుకున్న ఇంటి యజమాని దొంగతనం జరిగిందని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. -
వడదెబ్బతో కూలీ మృతి
బాన్సువాడ : ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీ వడదెబ్బకు గురై మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలోని బీర్కూర్ మండలం బొప్పాస్పల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బొప్పాస్పల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ హఫీజ్(36) అనే వ్యక్తి గత వారం రోజులుగా ఉపాధి హామీ పనికి వెళ్తున్నాడు. కాగా ఈ రోజు మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన ఎండలో పనిచేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హఫీజ్ కొద్దిసేపటికే మృతిచెందాడు. అయితే హఫీజ్ మృతికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. -
ఆ పాపం కాంగ్రెస్, టీడీపీలదే...
నిజామాబాద్ : తెలంగాణలో విద్యుత్ కొరత పాపం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలదేనని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన శనివారం బాన్సువాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ బొగ్గు లేని సీమాంద్రలో థర్మల్ విద్యుత్ ఫ్లాంట్లకు విద్యుత్ తరలించుకుపోతే ఇక్కడి నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. రానున్న మూడేళ్లలో విద్యుత్ కొరతలు లేకుండా చూస్తామని పోచారం హామీ ఇచ్చారు. రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పోచారం హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు రైతుల్ని రెచ్చగొట్టి ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. -
పంజా విసురుతున్న డెంగీ
బాన్సువాడ : డెంగీ మళ్లీ విజృంభిస్తోంది. పారిశు ధ్య లోపం, విచ్చలవిడిగా పందుల సంచా రం, దోమలపై నియంత్రణ కరువవడంతోనే డెంగీ ప్రబలుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పందులను అదుపు చేయాలని నెల రోజుల క్రితం మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పంచాయతీ అధికారులకు ఆదేశించినా వారు పెడచెవిన పెడుతున్నారు. గత ఏడాది వర్ని మండలం రుద్రూర్లో డెంగీతో సౌమ్య (19) అనే యువతి మృతి చెందగా, ఆ సంఘటన జరిగిన 15 రోజులకే బాన్సువాడలోని మిస్రీ గల్లీలో నివసించే మొ హియొద్దీన్ పటేల్ (65) అనే రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందారు. బాన్సువాడకే చెందిన మరో ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కనిపించని పారిశుధ్యం కలుషిత నీరు సేవించడంతో డయేరియా కూ డా పంజా విసురుతోంది. ఇటీవల కురిసిన వానలు, ఎప్పటికప్పుడు తొలగించని చెత్తా చెదారంతో వీధులు దుర్గంధభరితమయ్యా యి. పారిశుధ్య బాధ్యతను నిర్వహించడం లో పంచాయతీలు విఫలమవుతున్నాయి. అ రకొర నిధులు, తగినంత సిబ్బంది లేకపోవ డం, సర్పంచుల పర్యవేక్షణ లోపించడంతో పరిపాలన గాడి తప్పుతోంది. అంటురోగా లు ప్రబలుతాయన్న ముందు చూపు అధికారులకు లేపోవడంతో పట్టణాలు, గ్రామాలు దుర్గంధానికి నిలయాలుగా మారుతున్నా యి. దీంతో దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. వీటికి పందులు కూడా తోడవడంతో జనావాసాలు మురికి కూపాలను తల పిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా మురికి నీరు కాలువలా ప్రవహిస్తోంది. సమస్యల పరిష్కారమేదీ? గ్రామాలలో తాగునీరు, వీధి దీపాలు, పారి శుధ్యం వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉంది. వీధి దీపాలు, పారి శుధ్యం పనుల మాట దేవుడెరుగు కనీసం తాగునీటి సౌకర్యం కల్పించడంలో కూడా పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు వాపోతున్నారు. బాన్సువాడ, బీ ర్కూర్, కోటగిరి, వర్ని మండలాల మారుమూల గ్రామాల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. కోనాపూర్, హన్మాజీపేట, ఇబ్రాహీంపేట, బరంగెడ్గి, హంగర్గ తదితర గ్రా మాలలో పారిశుధ్యం గురించి పట్టించుకొనేవారు కరువయ్యారు. వైద్యశాఖ అధికారులెక్కడ? ర్యాపిడ్ రెస్పాన్స్ టీం లను ఏర్పాటు చేసుకుని వ్యాధులు ప్రబలిన ప్రాంతాల్లో వేగంగా చర్యలు తీసుకోవాల్సిన వైద్యశాఖ అధికారులు సైతం పట్టించుకోవ డం లేదు. గ్రామస్థాయి అధికారుల మధ్య స మన్వయం లోపిస్తోంది. 13వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ నిధులను పారిశుధ్య పనులకు వినియోగించాల్సి ఉంది. కానీ, ఎవ్వరూ ఆ వైపున దృష్టి సారించలేదు. గ్రామాలలో రోజూ ప్రజలకు సరఫరా చేసే నీటిని ఏఎన్ఎంలు పరీక్షలు చేయాల్సి ఉండగా వారూ నిర్లక్ష్యం చేస్తున్నారు. బాన్సువాడ పట్టణంలో పారిశుధ్యం మరింత అధ్వానంగా మారింది. -
‘ఆధార్’తో అన్నీ అవస్థలే !
బాన్సువాడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ కార్డునే కీలకంగా భావించి, దీని ఆధారంగానే ఈనెల 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వే చేపడుతుండడంతో ఇప్పటి వరకూ ఆధార్ కార్డును పొందని వారు మీ సేవ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఆధార్ నమోదు కేంద్రాలను ప్రభుత్వం నిర్వహించకుండా ఎంపిక చేసిన మీ సేవ కేంద్రాలకు అప్పగించడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుత రోజుల్లో అన్నింటికీ ‘ఆధార్’ ఆధారమైంది. చౌక ధరల దుకాణాల్లో నిత్యావసర సరుకుల నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత పింఛన్లు, పీఎఫ్, బీమా సౌకర్యం, విద్యార్థి జనన ధ్రువీకరణ పత్రాలకు ఇలా రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా ఏదైనా ప్రభుత్వ లావాదేవీలకు ఆధార్ కార్డు, అందులో పొందుపర్చే ఆధార్ నెంబర్ అత్యంత ప్రాముఖ్యమైంది. కుల, మత, ధనిక, పేద వర్గం భేదం లేకుండా అందరూ ఈ కార్డుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆధార్ కార్డు ప్రాధాన్యత పెరగడంతో ఈ కార్డును పొందేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో మీ సేవ ఆధార్ కేంద్రాల వద్ద జనం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో కేంద్రానికి 3,4 మండలాలు జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లోనే ప్రస్తుతం ఆధార్ కార్డు కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క కేంద్రం ద్వారా 3,4 మండలాల ప్రజలకు సేవలందిస్తున్నారు. దీంతో ఆధార్ కార్డుల కోసం ప్రజలు తిప్పలు పడాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క మండలంలో మీసేవకు ఆధార్ నమోదు కేంద్రం ఇచ్చినప్పటికీ, దీని కోసం ప్రత్యేకంగా ఐరిష్ కెమెరాలు, వేలిముద్రల సేకరణ పరికరాలు, కంప్యూటర్లు అవసరముండడంతో పలువురు మీసేవ నిర్వాహకులు వీటిని తీసుకోవడం లేదు. దీంతో పక్క మండలాలకు ప్రజలు వెళ్ళాల్సి వస్తోంది. జనాభా ప్రాతిపదికన కేంద్రాలను ఏర్పాటు చేయకుండా, ఒకటీ రెండు కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల రద్దీ బాగా పెరిగిపోతోంది. సుమారు 40వేల జనాభా గల బాన్సువాడ పట్టణంలో కేవలం ఒకే మీ సేవ కేంద్రంలో ఆధార్ కార్డు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో రెండు కంప్యూటర్ల ద్వారా ప్రతి రోజు సుమారు 60 మంది వివరాలను నమోదు చేస్తున్నారు. దీనికి తోడు నిజాంసాగర్, పిట్లం, బీర్కూర్, బిచ్కుంద తదితర మండలాలకు చెందిన ప్రజలు సైతం వస్తున్నారు. ఆధార్ నెంబర్తో అనుసంధానం చేస్తామని ప్రభుత్వం ప్రకటించినందునే ప్రస్తుతం ఆధార్ కార్డు నమోదు కేంద్రానికి డిమాండ్ పెరిగింది.