BC hostel
-
బీసీ వసతిగృహంలో విద్యార్థి మృతి
విజయనగరం అర్బన్/సాక్షి, అమరావతి: జిల్లా కేంద్రం విజయనగరంలోని కాటవీధిలోగల బీసీ హాస్టల్లో ఓ విద్యార్థి ఆదివారం మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేట రాజాం గ్రామానికి చెందిన కొణతాల శ్యామలరావు (12) ఏడో తరగతి చదువుతున్నాడు. శ్యామలరావు ఆదివారం ఉదయం అల్పాహారం తిన్న తరువాత మంచినీళ్లు తాగి దుస్తులు ఉతుక్కునేందుకు వెళ్తూ కళ్లు తిరిగి స్పృహతప్పి పడిపోయినట్టు వార్టెన్ జానకిరావు తెలిపారు. అతడిని వెంటనే నగరంలోని సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే విద్యార్థి మృతిచెందాడని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు తెలిపారు. సమీపంలో ఉన్న ఆస్పత్రిని కాదని దూరంగా ఉన్న పెద్దాస్పత్రికి తీసుకువెళ్లడం వల్లే తమ మేనల్లుడి ప్రాణాలు పోయాయని శ్యామలరావు మేనమామ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ శ్యామలరావు మృతికి కారణం ఏమిటనేది తెలియదని బీసీ సంక్షేమశాఖ ఇన్చార్జి ఈడీ పెంటోజీరావు చెప్పారు. హాస్టల్లో ఇటీవల నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో శ్యామలరావుకు ఎటువంటి అనారోగ్యం లేదని తేలిందన్నారు. ప్రస్తుతం హాస్టల్లో విద్యార్థులెవరికీ అనారోగ్య సమస్యలు లేవని ఆయన తెలిపారు. నివేదిక ఇవ్వండి: మంత్రి సవిత ఆదేశం విజయనగరంలోని బీసీ హాస్టల్ విద్యార్థి కొణతాల శ్యామలరావు మృతికి కారణాలపై తక్షణమే తనకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత అధికారులను ఆదేశించారు. విద్యార్థి మృతిపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ విద్యార్థి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వాస్తవాలను విచారించి నివేదించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
తిరుపతి : బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ విద్యార్థులకు అస్వస్థత (ఫొటోలు)
-
ప్రాణం తీసిన కొట్లాట...బీసీ హాస్టల్ లో దారుణం
-
మంచాల బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్
-
పాలమాకుల బీసీ హాస్టల్లో 45 మందికి కరోనా
సాక్షి, రంగారెడ్డి : పాలమాకుల జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. హాస్టల్లో మొత్తం 45 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా పాజిటివ్ విద్యార్థులను ప్రస్తుతం ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సదరు హాస్టల్లో మొత్తం 1000మంది విద్యార్ధులు ఉన్నారు. కరోనా భయంతో పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. నిర్మల్ జిల్లాలోని ముథోల్ గిరిజన బాలికల గురుకులంలోనూ కరోనా కేసులు బయటపడ్డాయి. 121 మంది విద్యార్థినిలకు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా పదిహేను మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న ఇదే పాఠశాలలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఇరవై నాలుగు కేసులు నమోదు కావటంతో విద్యార్థినుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి : మాస్కులతో మంచీ చెడులు తెలుసుకోండి! -
ట్రంకు పెట్టెల గోల్మాల్
సాక్షి, అనంతపురం: బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలకు ట్రంకు పెట్టెల సరఫరాలో గోల్మాల్ జరిగింది. పెట్టెల సరఫరా పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. వంద, రెండొందలు కాదు.. ఏకంగా రూ.89,50లక్షలు ఏజెన్సీ ఖాతాలోకి జమ చేశారు. ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తున్నా హాస్టళ్లకు పూర్తిస్థాయిలో ట్రంకు పెట్టెలు చేరకపోవడం చూస్తే.. అధికారుల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. వాస్తవానికి పెట్టెలను హాస్టళ్లకు సరఫరా చేసిన తర్వాత నిబంధనల ప్రకారం నాణ్య తను పరిశీలించి ధ్రువీకరించుకున్న తర్వాతే బిల్లు మంజూరు చేయాల్సి ఉంది. అయితే బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండానే, ఒక్కటంటే ఒక్క పెట్టె సరఫరా చేయక ముందే బిల్లు చెల్లించడం గమనార్హం. ఫిబ్రవరిలో బిల్లు పెట్టిన అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 2న బిల్లు మంజూరు చేసిన అధికారులు ట్రెజరీకి పంపించారు. అయినా సదరు ఏజెన్సీ పెట్టెలు సరఫరా చేయలేదు. అనివార్య కారణాల వల్ల బిల్లు ట్రెజరీలో పెండింగ్ పడినా మే 2న ఏజెన్సీ ఖాతాలో జమ అయ్యింది. నాలుగు రోజులు గడిస్తే సరిగ్గా నాలుగు నెలలు అవుతుంది. ఇప్పటిదాకా 9,230 ట్రంకు పెట్టెలు సరఫరా చేసినట్లు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. వీరి లెక్క ప్రకారమైనా ఇంకా 2,784 ట్రంకు పెట్టెలు సరఫరా చేయాల్సి ఉంది. 8వేల పెట్టెలు మాత్రమే సరఫరా చేశారనేది బీసీ సంక్షేమశాఖ అధికారుల లెక్క. అంటే.. ఇంకా 3,784 సరఫరా చేయాల్సి ఉంది. ఎవరి లెక్కలు వాస్తవమో వారికే తెలియాలి. టెండరు దక్కించుకున్న తర్వాత నెలలోపు సరఫరా చేయాల్సి ఉన్నా.. ఏడు నెలలవుతున్నా పూర్తిస్థాయిలో పెట్టెలు సరఫరా చేయకపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అర్థంకాని పరిస్థితి. బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు ఈ వ్యవహరంలో కీలకంగా వ్యవహరించినట్లు చర్చ జరుగుతోంది. అన్నింటా ఇదే పరిస్థితి హాస్టళ్లకు ప్లేట్లు, గ్లాసులు, వంటపాత్రలు సరఫరా చేయడంలోనూ అధికారులు ఇదేరకంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. వస్తువులు సరఫరా చేయకముందే పునీత్ ఏజెన్సీకి రూ.73 లక్షల బిల్లు మంజూరుకు ఆమోదం తెలిపారు. ప్లేట్లు, గ్లాసులకు సంబంధించి రూ.13,81,610, వాటర్ డ్రమ్ములకు రూ.2,88,000, చార్జింగ్ లైట్లకు రూ.5,25000 చెల్లించారు. అలాగే వంటపాత్రల సరఫరాకు దాదాపు రూ.51 లక్షలు ముట్టజెప్పారు. ఈ బిల్లులను ఏకంగా జనవరి 10వ తేదీనే పెట్టారు. ట్రెజరీలో జాప్యం జరగడంతో వెనక్కు వచ్చాయి. తిరిగి 20 రోజుల కిందట ఈ మొత్తం బిల్లులు ట్రెజరీకి పంపించేశారు. ఏ క్షణమైనా ఏజెన్సీ ఖాతాలో జమ కావచ్చు. కానీ ఇప్పటిదాకా ఒక్క గ్లాసు కూడా సరఫరా చేయని పరిస్థితి. ఇంకా నెల పట్టొచ్చు హాస్టళ్లకు పూర్తిస్థాయిలో ట్రంకు పెట్టెలు సరఫరా చేసేందుకు ఇంకా నెల పట్టొచ్చు. ఇప్పటిదాకా 9,230 ట్రంకు పెట్టెలు సరఫరా చేశాం. ఇంకా 2,784 ఇవ్వాల్సి ఉంది. సచివాలయ పరీక్షల నిర్వహణకు వివిధ మెటీరియల్ అవసరమని జిల్లా అధికారులు చెప్పడంతో పెట్టెల తయారీని పక్కనపెట్టాం. – శతృసింగ్, పునీత్ ఏజెన్సీ నేను రాకముందే ఇచ్చేశారు ట్రంకు పెట్టెలకు సంబంధించిన బిల్లు నేను చార్జ్ తీసుకోకముందే ఇచ్చేశారు. పెట్టెలు సరఫరా చేయాలని ఏజెన్సీపై ఒత్తిడి తెస్తున్నాం. ఇప్పటిదాకా 8వేలు ఇచ్చారు. హాస్టళ్లకు ప్లేట్లు, గ్లాసులు, వంటపాత్రల సరఫరాకు సంబంధించిన బిల్లు ట్రెజరీకి పంపాం. ఇన్ ఆపరేషన్ అకౌంటులో ఉండేలా బ్యాంకు అధికారులతో మాట్లాడాం. వస్తువులు సరఫరా చేసిన తర్వాతే ఆ మొత్తం డ్రా చేసుకునేలా చూస్తాం. – యుగంధర్, బీసీ సంక్షేమ శాఖ డీడీ -
మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య
చిన్నారిని చిదిమేశారు.. కర్కశంగా గొంతుకోసి చంపేశారు.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తల్లికి గుండెకోతను మిగిల్చారు.. చల్లపల్లి బీసీ వసతి గృహంలో ఓ చిన్నారిని గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన దివిసీమలో సంచలనం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు మూడో తరగతి చదువుతున్న ఆదిత్య అనే విద్యార్థి గొంతు కోసి బాత్ రూమ్లో పడేశారు. రక్తపు మడుగులో పడిఉన్న ఆదిత్యను చూసి తల్లి తల్లడిల్లిపోయారు. అయితే బాలుడి తండ్రి వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తల్లి ఆరోపిస్తుండగా.. హాస్టల్లోని తోటి విద్యార్థులే హత్య చేసి ఉంటారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి, అవనిగడ్డ : బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన బీసీ బాలుర వసతిగృహంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. పోలీసులు అందించిన వివరాలు.. బాలుడు దాసరి ఆదిత్య(8) మూడో తరగతి చదువుకుంటూ హాస్టల్లో ఉంటున్నాడు. ఉదయానే డాబా పైకి వెళ్లిన తోటి విద్యార్థులు ఆదిత్య విగతజీవిగా పడి ఉండడంతో భయాందోళన చెంది, వెంటనే కాపలాదారుడు నాగబాబుకు చెప్పటంతో అధికారులకు సమాచారం అందించారు. పంచాయతీ పరిధిలోని చల్లపల్లి నారాయణరావు నగర్లో నివాసం ఉంటున్న దాసరి రవీంద్ర, ఆదిలక్ష్మి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు అశోక్, రెండో కుమారుడు ఆదిత్య(8) స్థానిక బీసీ వసతిగృహంలో ఉంటున్నారు. రవీంద్ర శుభకార్యాలకు మండపాలు డెకరేషన్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హాస్టల్లోకి వెళ్లింది సోమవారమే.. ఆదివారం ఇంటికి వచ్చిన ఆదిత్యకు తల్లి కొత్తబట్టలు కొనిచ్చి సోమవారం ఉదయం హాస్టల్కు తీసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి పైఅంతస్తులో ఉన్న మరుగుదొడ్డిలో హత్యకు గురయ్యాడు. నిద్రలేపి చంపేశారా? ఆదిత్య హత్య ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. తొలుత ఆదిత్య అన్నయ్య అశోక్ని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి నిద్రలేపి మూత్ర విసర్జనకు వెళ్లమని చెప్పాడు. నిద్రలో ఉన్న అశోక్ రావడం లేదని చెప్పి ప్రార్థన చేసి నిద్రపోయాడు. అనంతరం అదే వ్యక్తి ఆదిత్యను నిద్రలేపి వసతిగృహంపై అంతస్తులో ఉన్న బాత్రూంల వద్దకు తీసుకెళ్లి మెడకోసి హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. మెట్ల కింద రక్తపు మరకలు.. బీసీ వసతి గృహంలోని పై అంతస్తు బాత్రూంలో దాసరి ఆదిత్య హత్యకు గురి కాగా గ్రౌండ్ఫ్లోర్ మెట్లు కింద రక్తపు మరకలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారం లేకుండా నిందితుడు జాగ్రత్త పడ్డాడు. వసతిగృహంలో గ్రౌండ్ ఫ్లోర్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ, అర్ధరాత్రి పై అంతస్తులోని మరుగుదొడ్లుకు ఆదిత్య ఎందుకు వెళ్లాడనే ప్రశ్న తలెత్తుతోంది. తండ్రి సంబంధాలపై అనుమానాలు.. మృతుడి తండ్రి రవీంద్రకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమె భర్త ఈ హత్యకు పాల్పడి ఉంటాడని మృతుడి తల్లి ఆదిలక్ష్మి ఆరోపించింది. ఈ విషయమై గతంలో రెండు కుటుంబాల మధ్య పలుమార్లు వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పెద్దలు రాజీ కుదర్చడం జరిగింది. ఏఎస్పీ సత్తిబాబు విచారణ తొలుత డీఎస్పీ ఎం.రమేష్రెడ్డి, సీఐ ఎం.వెంకటనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఏఎస్పీ మోకా సత్తిబాబు çహత్య తీరును పరిశీలించారు. వసతిగృహంలో ఉన్న విద్యార్థులు, వాచ్మెన్, ఇన్చార్జి వార్డెన్ని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. డాగ్స్క్యాడ్, క్లూస్టీంలు రంగంలో దిగి ఆధారాలు సేకరించాయి. బీసీ సంక్షేమశాఖ డీడీ ఐ.రమాభార్గవి బీసీ వసతిగృహానికి వివరాలు తెలుసుకున్నారు. ఆర్డీ ఓ పరిశీలన.. బాలుడి దారుణ హత్య విషయం తెలుసుకున్న మచిలీపట్నం ఆర్డీఓ జె.ఉదయభాస్కర్, తహసీల్దార్ కె.స్వర్ణమేరి హాస్టల్ వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. సిబ్బందిని ఆరా తీశారు. శవ పంచనామా అనంతరం పోలీసులు బాలుడి తండ్రి రవీంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ తరలించారు. నిందుతుడిని అరెస్ట్ చేయాలని ఆందోళన బాలుడిని కిరాతంగా హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసే వరకు మృతదేహానికి పోస్టుమార్టం చేయనివ్వమని మృతుడి బంధువులు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్, వాచ్మన్ని సస్పెండ్ చేయాలని, మృతుడి కుటుంబానికి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులతో ఏఎస్పీ సత్తిబాబు మాట్లాడుతూ వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని, మృతుడి కుటుంబానికి అన్ని విధాలా సాయపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఆదిత్య మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడ్డడా! దాసరి ఆదిత్య హత్య కేసులో పోలీసుల విచారణ భిన్న కోణాల్లో సాగుతోంది. హాస్టల్లో ఉంటున్న ఒక విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడ్డడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పదునైన ఆయుధంతో మెడకోసి హత్య చేసినట్టు పోస్టుమార్టంలో తేలడంతో ధర్మాకోల్ కట్టర్(చిన్న పోల్టు చాకు)తో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ పదోతరగతి విద్యార్థ్ధి కొన్నిరోజులు కలసి పడుకున్నారు. ఆ విద్యార్థి వికృత చేష్టలకు భయపడి అతని దగ్గర పడుకోవడం మానేసినట్టు తెలిసింది. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ఈ విద్యార్ధి తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. వార్డెన్, వాచ్మన్ సస్పెన్షన్జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అవనిగడ్డ: చల్లపల్లి బీసీ వసతి గృహంలో మూడో తరగతి విద్యార్థి దాసలి ఆదిత్య(8) హత్యకు గురైన నేపథ్యంలో ఇన్చార్జి వసతి గృహ అధికారి పీవీ నాగరాజు, వాచ్మన్ నాగబాబుని సస్పెండ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దుర్ఘటనపై విచారణ జరుగుతుందని, ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. -
కత్తి దూసిన ‘కిరాతకం’
అవనిగడ్డ/చల్లపల్లి: మూడో తరగతి చదువుతున్న బాలుడిని అత్యంత పాశవికంగా మెడకోసి హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చల్లపల్లి నారాయణరావు నగర్లో నివాసం ఉంటున్న దాసరి రవీంద్ర కుమారుడు దాసరి ఆదిత్య (8) బీసీ వసతి గృహంలో మూడో తరగతి చదువుతున్నాడు. ఇతని సోదరుడు ఇదే వసతి గృహంలో ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి మూత్ర విసర్జనకు బయటకు వెళ్లిన ఆదిత్య వసతి గృహం పై అంతస్తులో ఉన్న మరుగుదొడ్డిలో దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లవారుజామున ఐదు గంటలకు బక్కెట్ కోసం పైకి వెళ్లిన విద్యార్థి వాకలయ్య రక్తపు మడుగులో పడిఉన్న ఆదిత్యను చూసి వెంటనే కిందకు వచ్చి వాచ్మెన్ నాగరాజుతో చెప్పాడు. పైకి వెళ్ళిన వాచ్మెన్ ఆదిత్య పడిపోయి ఉంటాడని భావించి వైద్యశాలకు తీసుకెళ్ళేందుకు పైకిలేపగా, మెడ సగభాగం తెగి ఉండటం, అప్పటికే విగత జీవిగా ఉండటంతో ఆదిత్య మృత దేహాన్ని గోడకు కూర్చోబెట్టి ఇన్చార్జి వార్డెన్కు సమాచారం ఇచ్చాడు. ఏఎస్పీ ఎం.సత్తిబాబు, డీఎస్పీ ఎం.రమేష్రెడ్డి హత్యాస్థలిని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ని రప్పించగా బాత్రూం నుంచి వెనకున్న ప్రహరీ గోడ వరకు వెళ్లి వెనక్కి వచ్చింది. హతుని తండ్రికి, పిన్నికి మధ్య ఉన్న అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. కాగా, ఆదిత్యను వసతి గృహ విద్యార్థే హతమార్చినట్లు సమాచారం. మృతుని కుటుంబ సభ్యుల ఆందోళన బాలుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తీసుకెళ్లనీయబోమని మృతుని బంధువులు వసతి గృహం గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఏఎస్పీ సత్తిబాబు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
హాస్టల్లో అమానుషం ; బాత్రూంలో మృతదేహం
సాక్షి, కృష్టా : జిల్లాలోని చల్లపల్లి బీసీ హాస్టల్లో దారుణం జరిగింది. మూడో తరగతి విద్యార్థి ఆదిత్య అనుమానాస్పదంగా మృతి చెందారు. బాత్రూంలో రక్తపు మడుగులో ఆదిత్య మృతదేహం పడిఉంది. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చర్లపల్లి నారాయణనగర్కు చెందిన ఆదిత్య అన్న కూడా ఇదే హాస్టల్లో ఉంటున్నాడు. రోజు అన్న పక్కనే పడుకునే ఆదిత్య సోమవారం రాత్రి అతని గదికి రాలేదు. దీంతో పక్క గదిలో ఉండోచ్చన ఆదిత్య అన్న భావించారు. మంగళవారం ఉదయం చూసే సరికి ఆదిత్య బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హాస్టల్కు చేరుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. గొంతు కింద కోసి ఉండడంతో ఆదిత్యను ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హాస్టల్ వార్డెన్తో పాటు తోటి విద్యార్థులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. -
పీలేరు బీసీ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు
-
అబిడ్స్ బీసీ హాస్టల్: నాన్ బోర్డర్స్ ధర్నా
-
బీసీ హాస్టల్లో జూనియర్లపై సీనియర్ల దాడి
నిజామాబాద్ : తమ బట్టలు ఉతకాలంటూ సెకండియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులపై దాడి చేసిన సంఘటన నిజామాబాద్ బీసీ హాస్టల్లో చోటుచేసుకుంది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక నిజామాబాద్ 3వ టౌన్ పోలీస్స్టేషన్లో జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సీనియర్ల వేధింపులు ఎక్కువై ఐదుగురు విద్యార్థులు కూడా హాస్టల్ వదిలి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. బీసీ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లనే సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. -
బీసీ హాస్టల్లో సిబ్బంది మందు..విందు
విద్యారణ్యపురి : హన్మకొండ బాలసముద్రంలోని బీసీ హాస్టల్లో ఆదివారం ముగ్గురు సిబ్బంది విందు పార్టీ చేసుకున్నారు. మందుతాగుతూ, మాంసాహారాన్ని ఆరగించారు. ఆ సమయంలోనే ఎస్ఎఫ్ఐ బాధ్యులు అక్కడికి వెళ్లారు. ప్రభుత్వ బీసీ హాస్టల్లో విద్యార్థులు ఉన్నారని, మీరు హాస్టల్లో మందు తాగడం సరికాదని సిబ్బందితో వారు అన్నారు. మా ఇష్టం అంటూ సిబ్బంది ఎస్ఎఫ్ఐ నాయకులతో వాగ్వాదం చేశారు. ఆ సమయంలో హాస్టల్ వార్డెన్ విధుల్లో లేరు. హాస్టల్ వాచ్మన్ తిరుపతితో సహా మరో ఇద్దరు చంద్రయ్య, కొమురయ్య మందు తాగుతుండగా ఇదేమిటని ప్రశ్నిస్తే మా ఇష్టం అంటూ దురుసుగా మాట్లాడారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాషబోయిన సంతోష్ ఆరోపించారు. బీసీ హాస్టల్లో విద్యార్థులను గాలికి వదిలేసి సిబ్బంది పట్టపగలే విందు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సంబంధిత హాస్టల్ వార్డెన్, ఆముగ్గురిని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ హాస్టల్ ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులతో ధర్నా చేశారు. హాస్టల్ వార్డెన్కు, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన హాస్టల్లో ఇలా సిబ్బంది మద్యం మత్తులో తూగారని ఆరోపించారు. వర్కర్లు తిరుపతిని, చంద్రయ్య, కొమురయ్య తాగుతున్న మందు బాటిల్ను కూడా ఎస్ఎఫ్ఐ నేతలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎస్ఎఫ్ఐ బాధ్యులు తెలిపా రు. ధర్నా కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అర్బన్ జిల్లా బాధ్యులు ఎం.రాజేష్, టి.రఘు పాల్గొన్నారు. -
సమస్యల వలయంలో బీసీ హాస్టల్
గుండాయపాలెం (ఒంగోలురూరల్): మండలంలోని ఏకైక బాలుర వసతి గృహం సమస్యల వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతుంది. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విద్యార్థుల వసతి గృహం అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయింది. గత ఏడాది నీరు–చెట్టు కార్యక్రమంలో భాగంగా చెరువులో మట్టి హాస్టల్ ముందు ఉన్న ఆట స్థలంలో మూడు వంతుల భాగం వరకు మెరక చేశారు. పనులు చివరి దశలో ఉండగా అప్పటి బీసీ కార్పొరేషన్ డీడీ మయూరి సర్పంచ్ వెంకటేశ్వరమ్మకు హాస్టల్ అభివృద్ధి పనులు చేపట్టవద్దనీ, హాస్టల్లో ప్రవేశించవద్దనీ లేఖ రాశారు. దీంతో పనులు హాస్టల్ పనులు ఆగిపోయాయి. అనంతరం హాస్టల్ను సందర్శించిన బీసీ కార్పొరేషన్ డీడీ లక్ష్మిసుధ హాస్టల్ పరిస్థితులపై ఆరా తీశారు. దీనిపై స్పందించిన సర్పంచ్ హాస్టల్ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న పరిస్థితులు డీడీకి వివరించారు. దీనిపై స్పందించిన డీడీ లక్ష్మిసుధ స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి హాస్టల్కు నిధులు మంజూరుచేయిస్తామని అప్పట్లో వారికి హామీ ఇచ్చారు. కానీ నేటికి హాస్టల్లో నిర్మాణ పనులు కార్యరూపం దాల్చలేదు. పాములకు ఆవాసాలు హాస్టల్లో చిల్లచెట్లు పెరిగి పోవడంతో పాములకు, పురుగులకు ఆవాసంగా మారింది. సాయంత్రం 5 గంటలు దాటితే విద్యార్థులు బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పాఠశాల ఆవరణలో మేక పోతును వధించడం, మద్యం సేవించి కోళ్లను విచ్చలవిడిగా కోయడంపై విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. దీనిపై గ్రామస్తులు లిఖిత పూర్వకంగా అధికారులకు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
బీసీ హాస్టల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పెద్దపల్లిరూరల్: రంగంపల్లిలోని వెనకబడిన తరగతుల వసతి గృహాన్ని కలెక్టర్ అలగు వర్షిణి మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. వసతిగృహ ఆవరణంతా కలియతిరిగిన కలెక్టర్ సౌకర్యాల కల్పనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంట గదిలోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులకు వండిపెడుతున్న అన్నం, కూరలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని విద్యార్థులను ఆరా తీశారు. మరుగుదొడ్లను పరిశీలించడంతోపాటు నీటి సరఫరా, కరెంటు, గదులలో ఫ్యాన్ సౌకర్యాల ఏర్పాట్లను చూసిన కలెక్టర్ వసతుల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ హాస్టల్ విద్యార్థులకు చలి నుంచి రక్షణగా ఉండేందుకు గాయత్రీ విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ అందించిన రగ్గులనుమ కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. -
మళ్లీ పాత కథే..?
► బీసీ హాస్టళ్లలో బయోమెట్రిక్ ఫెరుుల్ ►మళ్లీ వినిపించనున్న ఎస్సార్, ప్రెజెంట్ సార్ పదాలు ► యంత్రాలు పని చేయడం లేదా.. ఉద్దేశపూర్వకంగానా..? సిమ్లు రాలేదు.. 9హాస్టల్స్లో బయెమెట్రిక్ విధానాన్ని ఆన్లైన్కు అనుసంధానం చేసేందుకు ట్యాబ్లు ఇచ్చారు. కానీ ఆ ట్యాబ్ల్లో వేసేందుకు సిమ్ కార్డులు రాలేదు. అలాగే వీటి కోసం మూడు నెట్వర్క్ల సిమ్ కార్డులు ఇచ్చారు. ఇందులో ఎరుుర్ టెల్ సిగ్నల్స్ ఉన్న ప్రాంతాలే ఎక్కువగా ఉన్నారుు. కానీ వచ్చిన సిమ్లు మాత్రం ఐడియా, బీఎస్ఎన్ఎల్ కావడంతో ట్యాబ్ల్లో వేయలేదు. జిల్లాలోని 4 డివిజన్లలో ఒక్కో హాస్టల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించాల్సి ఉండగా అలా జరగలేదు. విజయనగరం కంటోన్మెంట్ : సంక్షమే హాస్టళ్లలో బయోమెట్రిక్ను అమలు చేసి తద్వారా అక్రమాలకు చెక్ పెట్టాలన్న ఉన్నతాధికారుల ఆశయం నెరవేర లేదు. ఈ విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులు హాస్టళ్లకు ఆదేశాలిచ్చినప్పటికి ఆచరణకు మాత్రం అరుుష్టత వహిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నారుు. 2 నెలల క్రితం జిల్లాకు 97 బయోమెట్రిక్ డివైస్లు రాగా వాటిలో 38 మెషీన్లు పనిచేయడం లేదు. మిగతా మెషీన్లకు సిమ్కార్డులు ఇవ్వలేదు. జిల్లాలో 88 బీసీ హాస్టల్స్ ఉండగా వీటిలో 28 కాలేజ్ విద్యార్థులవి. మిగిలిన 60 స్కూల్ విద్యార్థులవి. ఈ హాస్టళ్లలో హాజరును తప్పుగా చూపిస్తున్నారనే అనుమానాలు కలగడంతో పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు తలచారు. దీనిలో భాగంగా కార్వే సంస్థ ద్వారా జిల్లాకు బయోమెట్రిక్ పరికరాల్ని పంపిణీ చేశారు. సెప్టెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా అమలు కావాల్సి ఉండగా ఎందుకో అమల్లోకి రాలేదు. రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా.. జిల్లాలోని 60 బీసీ బాలుర హాస్టల్స్కు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడంతో పాటు జిల్లాలోని 2 రెసిడెన్షియల్ స్కూళ్లకూ ఒకేసారి ఈ బయోమెట్రిక్ డివైస్లు అమర్చాలని నిర్ణరుుంచారు. చీపురుపల్లి, కోరపు కొత్తవలసల్లో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలకు ఈ పరికరాలు పంపిణీ చేశారు. కానీ అక్కడ కూడా నేటికి ఈ విధానం అమలు చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ మెషీన్లు, పరికరాలు వచ్చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నారుు. అన్ని కార్యాలయాలు, సంస్థల్లోనూ బయోమెట్రిక్ విధానం సక్రమంగా పనిచేస్తుంటే ఇక్కడే ఎందుకు పని చేయడం లేదన్న విమర్శలూ ఉన్నారుు. జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తాం. కార్వే సంస్థ ప్రతినిధులు ఇదిగో అదిగో అంటున్నారు. త్వరలోనే వారితో సమావేశం ఏర్పాటు చేసి డెమో నిర్వహిస్తాం. అనంతరం వాటిని ఆయా వసతి గృహాలకు తరలించి సక్రమంగా పనిచేసేటట్లు చర్యలు తీసుకుంటాం.- సీహెచ్. హరిప్రసాద్, డీబీసీడబ్లూ ్యఓ, విజయనగరం. -
విద్యార్థి గల్లంతైనా పట్టించుకోరా?
► అధికారుల తీరుకు నిరసనగా జమాదులపాలెం గ్రామస్తుల ఆందోళన ►ఎట్టకేలకు గాలింపు చర్యలు... మృతదేహం లభ్యం ►బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వినతి అనకాపల్లి రూరల్ : కశింకోట మండలం జమాదులపాలెం గ్రామానికి చెందిన ఒమ్మి శ్రీను అనే విద్యార్థి శారదానదిలో గల్లంతైన విషయం తెలిసినా అధికారులు వెంటనే స్పందించలేదని ఆగ్రహిస్తూ ఆ గ్రామస్తులు సోమవారం తుమ్మపాల ఏలేరు కాలువ వద్ద అనకాపల్లి - చోడవరం రహదారిపై బైటాయించారు. కశింకోట ఎంపీటీసీ కరక సోమునాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో ఆయన మాట్లాడుతూ గాంధీనగరం బీసీ వసతిగృహంలో 9వ తరగతి చదువుతున్న ఒమ్మి శ్రీను (14)ఆదివారం సెలవు కావడంతో స్నానం చేసేందుకు ఏలే రు కాలువలో దిగి గల్లంతయ్యాడన్నారు. ఈ సంఘటన జరిగి 24 గంటలు దాటినా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. హాస్టల్ వార్డెన్కు సమాచారం తెలిసినా కనీసం బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదని ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినా సమయానికి ఎవరూ రాలేదన్నారు. వస తి గృహంలో సరైన పర్యవేక్షణ లేకే వి ద్యార్థి మరణించాడని, బాధిత విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో తహశీల్దార్ కృష్ణమూర్తి, ఎస్ఐ రామారావు, క్రైం ఎస్ఐ వెంకటేశ్వరరావు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఆందోళనలో మాజీ ఎంపీటీసీ కరక రాజు, కరక బాబూరావు, సంపతిపురం సర్పంచ్ నంబారు శ్రీను, రమణ, పల్లా శ్రీను, పంచదార్ల సూరిబాబు, మొల్లి వెంకటరమణ పాల్గొన్నారు. మృతదేహం లభ్యం: ఆందోళన నేపథ్యం లో అధికారుల్లో చలనం వచ్చింది. జాలర్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. ఆర్డీవో పద్మావతితోపా టు పోలీసులు వచ్చి పరిశీలించారు. గ్రామ స్తులతో మాట్లాడి మృతదేమాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. ఒకే ఒక్క కుమారుడు విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి తల్లి అప్పలనర్స కుప్పకూలిపోరుుంది. ఆరు నెలల క్రితం భర్త, ఇప్పుడు కొడుకు మృతి చెందడంతో ఆమె ఒంటరైంది. జమాదులపాలెం గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. అధికారులు ఆమెకు ఎంతోకొంత న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. -
23న బాలికల గురుకుల డిగ్రీ కాలేజీలో కౌన్సెలింగ్
నయీంనగర్ : మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో 2016–17 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని జిల్లా సమన్వయ అధికారి ఎస్.రూపాదేవి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల వైస్ ప్రిన్సిపాల్ జి.శంకర్నాథ్ తెలిపారు. ఆన్లైన్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న విద్యార్థినులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. -
బీసీహాస్టల్ మూసివేత: విద్యార్థుల రాస్తారోకో
యాడికి: అనంతపురం జిల్లా యాడికిలో బీసీ హాస్టల్ మూసివేతను నిరసిస్తూ సీపీఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. టీడీపీ ప్రభుత్వం ఇటీవల 100లోపు విద్యార్థులున్న బీసీ హాస్టళ్లను మూసివేయాలని జారీ చేసింది. యాడికి బీసీ హాస్టల్లో 71 మంది మాత్రమే ఉండటంతో అధికారులు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి నిరసనగా విద్యార్థులు రాస్తారోకోకు దిగడంతో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
బీసీ హాస్టల్పై ఏసీబీ దాడులు
కుబీర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్పై మంగళవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏసీబీ డీఎస్పీ పాపాలల్ ఆధ్వర్యంలోఈ దాడులు జరిగాయి. హాస్టల్ నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని ముందస్తు సమాచారం రావడంతో ఈ దాడులను నిర్వహిస్తున్నామని డీఎస్పీ అన్నారు. హాస్టల్ హాజరుపట్టికలో 71 మంది విద్యార్థులు ఉన్నట్లు చూపగా..దాడుల సమయంలో కేవలం 11 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని వారు గుర్తించారు. -
విద్యార్థి అనుమానాస్పద మృతి
బీసీ హాస్టల్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి-సిరిపురం బీపీ వసతిగృహంలో బుధవారం వెలుగుచూసింది. హాస్టల్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న హరికృష్ణ(14) మంగళవారం రాత్రి స్నేహితులతో కలిసి పాఠశాల తరగతి గదిలో పడుకున్నాడు. బుధవారం నిద్రలేచిన తొటి విద్యార్థులు హరికృష్ణను లేపడానికి ప్రయత్నించగా.. ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉన్నాడు. దీంతో విద్యార్థులు హాస్టల్ వార్డెన్తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వసతిగృహం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు ప్రహరిగోడ లేకపోవడంతో.. విష సర్పాలు సంచరిస్తుంటాయని స్థానికులు అంటున్నారు. -
బీసీ హాస్టల్లో ఏసీబీ సోదాలు
అనంతపురం జిల్లా తలుపుల మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంపై ఏసీబీ దాడి చేసింది. మంగళవారం ఉదయం హాస్టల్కు చేరుకున్న అధికారులు రికార్డులను పరిశీలించారు. ఈ వసతి గృహం సంక్షేమాధికారి చెన్నయ్యపై అవినీతి ఆరోపణలు రావటంతో సోదాలు జరుపుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ భాస్కర్రెడ్డి తెలిపారు. -
వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం
అనంతపురం(హిందూపురం): తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక ఓ విద్యార్థి ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. చిలమత్తూరు మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో రమేశ్(12) ఉంటున్నాడు. అయితే, తోటి విద్యార్థులు వేధిస్తున్నారని మనస్తాపానికి గురై ఎలుకల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. దీంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థిని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
చోరీ చేసిందంటూ చిన్నారిని చితకబాదిన ట్యూటర్
కొడుమూరు (కర్నూలు) : నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థినిని ట్యూషన్ టీచర్ చితకబాదగా ఆ చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన కర్నూలు జిల్లా కొడమూరు బాలికల బీసీ హాస్టల్లో గురువారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తల్లిదండ్రులు పనుల కోసం వలస వెళుతూ భార్గవి అనే బాలికను స్థానిక బీసీ హాస్టల్లో చేర్పించారు. కాగా గురువారం ఉదయం హాస్టల్లో 20 రూపాయలు దొంగిలించిందనే నెపంతో ట్యూషన్ టీచర్ భాగ్య ఆ చిన్నారిని వాతలు తేలేటట్లు చితకబాదింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హాస్టల్ ఎదుట ధర్నాకు దిగారు. చిన్నారిని చితకబాదిన ట్యూటర్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఆ చిన్నారి తల్లిదండ్రులు వలస వెళ్లిన ప్రాంతం నుంచి తిరిగి రావాల్సి ఉంది. -
మత్తులోకి దింపి..
ఘరానా దోపిడీ కొత్తగా పెళ్లయిందని అద్దెకు దిగి.. యజమాని ఇంట్లో దోపిడీ నగదుతోపాటు 7 తులాల బంగారం, టీవీ, డీవీడీ ప్లేయర్ అపహరణ శివనగర్లో ఘటన ఖిలావరంగల్ : కొత్తగా పెళ్లరుుందని అద్దెకు దిగిన ఓ జంట ఆ ఇంటి యజమానులకు పాయసం పెట్టి.. మత్తులోకి దించి దోపిడీకి పాల్పడిన సంఘటన వరంగల్ శివనగర్లో గురువారం ఆర్ధరాత్రి జరిగింది. వృద్ధదంపతుల బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ శివనగర్లోని బీసీ హాస్టల్ సమీపంలో దాసరి కొమురయ్య, కళావతి దంపతులు 5 గదుల రేకుల ఇంటిని నిర్మించుకుని ముందు గదిలో చిన్నపాటి కిరాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి కుమారులు శ్రీనివాస్, రవీందర్, ఒక కూతురు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు కావడంతో వేరుగా ఉంటున్నారు. ఐదు గదుల్లో రెండు గదులు వారు ఉపయోగించుకుంటుండగా.. మరో గదిలో మూడేళ్లుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. మరో రెండు గదులు ఖాళీగానే ఉంటున్నాయి. ఇంటి బయట ‘రూమ్లు కిరారుుకి ఇవ్వబడును’ అనే బోర్డును తగిలించారు. ఈ క్రమంలోనే 20 రోజుల క్రితం తమకు కొత్తగా పెళ్లరుుందని, ఇల్లు అద్దెకు కావాలని ఓ జంట వృద్ధ దంపతులను అడిగారు. గతంలో ఇచ్చిన వారికంటే రూ.200 అదనంగా ఇస్తామని అద్దె మాట్లాడుకున్నారు. అంతలో మరో జంట రావడంతో ఒక్క జంటకైతేనే ఇల్లు కిరారుుకి ఇస్తామని యజమాని చెప్పగా మరుసటి రోజు ఒక్క జంటకే ఆద్దె కావాలంటూ వచ్చింది. ‘మాది ఆంధ్రా ప్రాంతం.. వరంగల్ నగరంలో మేస్త్రీ పని చేయడానికి వచ్చామని చెప్పి నమ్మించారు. అద్దె కిరాయి ముందుగానే ఒక నెల వెయ్యి రూపాయలు అడ్వాన్స్గా చెల్లించారు. ఆ తర్వాత ఇంట్లో దిగాక యజమానులతో సఖ్యతతో ఉంటూ దగ్గరయ్యూరు. సుమారు 20 రోజులయ్యూక గురువారం రాత్రి 9 గంటలకు ఆ కిలాడీ జంట మా పెళ్లి రోజు పాయసం చేశామని చెబుతూ సేమ్యాలో మత్తు మందు కలిపి వృద్ధ దంపతులతోపాటు పక్క గదిలో ఉండే మరో కుటుంబానికి ఇచ్చారు. ఆద్దెకు ఉంటున్న కుటుంబం సేమ్యాను తినకుండ పక్కన పెట్టగా, వృద్ధ దంపతులు మాత్రం ఆరగించారు. ఆ తర్వాత వారు మత్తులోకి జారిపోయూరు. అర్ధరాత్రి కాగానే ఆ కిలాడి జంట వృద్ధ దంపతుల ఇంట్లోకి ప్రవేశించి ఒంటిపైన ఉన్న బంగారం, బీరువాలో ఉన్న నగదుతోటు 7 తులాల బంగారం, కలర్ టీవీ, డీవిడీ ప్లేయర్ అపహరించారు. శుక్రవారం ఉదయం పక్కింటి వృద్ధురాలు రాజమ్మ కిరాణ షాపులో పాల ప్యాకెట్ కావాలంటూ తలుపు తట్టింది. లోపల ఆ వృద్ధులు మాట్లాడలేకుండా ఒంటిపై బట్టలు లేని దృశ్యాన్ని చూసి వెంటనే అద్దెకు ఉంటున్న మంద రాజు, లావణ్యను లేపి విషయం చెప్పింది. వారు వృద్ధ దంపతుల కుమారులు, కూతురుకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే చేరుకున్నారు. మిల్స్కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసి బాధితులను 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ సురేంద్రనాథ్, మిల్స్కాలనీ సీఐ సత్యనారాయణ, ఎస్సై ఎ.రవీందర్ సంఘటన స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఆ ఇంటి గదులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరిశీలించారు. కేసు దర్యాప్తుచేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
నేనూ పేదింటి బిడ్డనే...
నిత్యం నియోజకవర్గ ప్రజల అర్జీలస్వీకరణ.. అధికారులతో సమీక్షలు.. పార్టీ నాయకుల, కార్యకర్తలతో భేటీలు.. బిజీబిజీగా గడిపే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. ఆదివారం సాయంత్రం మాత్రం అన్నీ కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. అధికారులతో తర్వాత మాట్లాడతానంటూ ఫోన్లు బందు పెట్టుకున్నారు. తనను ఆదివారం కలవద్దంటూ పార్టీ కార్యకర్తలకు కరాఖండిగా చెప్పేశారు. సాయంత్రం 5 గంటలకు సాధారణ వ్యక్తిలా వాహనం దిగి ‘సాక్షి’ మైక్ పట్టుకుని సంగారెడ్డిలో మహిళా డిగ్రీ కళాశాల పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమశాఖ ఎస్సీ, బీసీ హాస్టల్ వైపు అడుగులు వేశారు. ‘నేనూ పేదింటి బిడ్డనే...ప్రభుత్వ పాఠశాలలోనే సదువుకున్నా... బలహీనవర్గానికి చెందిన నాకు పేదల బతుకులు తెలుసు’.. హాస్టల్ పిల్లల కష్టాలు, కడగండ్లు తెలుసుకునేందుకే ‘సాక్షి’ తరఫున విలేకరిగా వచ్చా... చెప్పండి మీ సమస్యలేమిటో.. అంటూ విద్యార్థులతో మాట్లాడారు. హాస్టళ్లలోనే నిద్రిస్తా... రూపు రేఖలు మారుస్తా చాలా హాస్టళ్లలో సమస్యలు ఉన్నమాట వాస్తవం. హాస్టల్లోని సమస్యలు తెలుసుకునేందుకు త్వరలో అన్ని హాస్టళ్లలో రాత్రి బస చేస్తా. సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి హరీష్రావు దృష్టికి హాస్టల్ సమస్యలను తీసుకెళ్లి వాటి రూపురేఖలు మారుస్తా. తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రతి హాస్టల్లో ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేయిస్తా. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటా. విద్యార్థులు కోరిన విధంగా కాస్మొటిక్ చార్జీల పెంపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా. పదో తరగతి విద్యార్థుల కోసం హాస్టల్లలో ప్రత్యేకంగా స్టడీ రూం, లైబ్రరీలు ఏర్పాటుకు చర్యలు చేపడతా. నూతన హాస్టల్ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తాం. -చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే సంగారెడ్డి చింతా ప్రభాకర్: అమ్మా.. నీ పేరేంటీ, ఎంతకాలం నుంచి హాస్టల్లో ఉంటున్నావు, ఏమైనా సమస్యలున్నాయా? మౌనిక: సార్ నేను మూడేళ్లుగా ఇదే హాస్టల్లో ఉంటున్నా. ఒకే ప్రాంగణంలో మూడు హాస్టల్లు ఉండటంతో ఇబ్బంది పడుతున్నాం. నీటి సమస్య, మరుగుదొడ్ల సమస్య ఉంది. చింతా ప్రభాకర్: మీ హాస్టల్కు మంజీరా వస్తోంది కదా...అయినా నీటి సమస్య ఉందా? శ్రవంతి (9వతరగతి): తాగునీటికి నీటి ఇబ్బంది లేదు సార్..కానీ ఇతర అవసరాలకు నీళ్లు సరిపోవటంలేదు. మూడు హాస్టల్ళ్లలోని 240 మంది విద్యార్థులకు ఒకే బోరు ఉంది. నీటికి ఇబ్బంది పడుతున్నాం. ఒక బోర్ వేస్తే మా సమస్య తీరుతుంది. చింతా ప్రభాకర్: హాస్టల్లో భోజనం ఎలా ఉంది. మెనూ ప్రకారం వేళకు టిఫన్, భోజనాలు పెడుతున్నారా? భవానీ: మెనూ ప్రకారం భోజనం, టిఫిన్ పెడుతున్నారు సార్.. అయితే నాణ్యత ఉండటం లేదు. బియ్యం దొడ్డుగా ఉండటంతో తినటానికి ఇబ్బంది పడుతున్నాం. సన్న బియ్యం అన్నం పెట్టేలా చూడండి. చింతా ప్రభాకర్: ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, కరెంటు బాగానే వస్తోందా? సమర్పణ: ఎస్సీ -ఏ, ఎస్సీ- బీ హాస్టళ్లతోపాటు బీసీ బాలికల హాస్టల్ ఈ మూడు ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నాము. హాస్టల్లను వేరు చేసి ఇతర భవనాల్లోకి మారిస్తే అందరు విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. కరెంటు సమస్య ఉంది. కరెంటు పోతే కొవ్వొత్తులు వెలిగించుకుంటాం. (పక్కనే ఉన్న బీసీ హాస్టల్ వార్డెన్ కవితతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ‘ఏమ్మా బాలికల హాస్టల్లో కరెంటు పోతే కొవ్వొత్తుల వెలుగులపై ఆధారపడితే ఎలా..ఇన్వర్టర్ సదుపాయం లేదా’ అంటూ ప్రశ్నించారు. ‘‘ ఇన్వర్టర్ సదుపాయం మాకు లేదు సార్ ...ఇక్కడే కాదు ఏ హాస్టల్కు అలాంటి సదుపాయం కల్పించలేదని ఆమె సమాధానమిచ్చారు. దీంతో హాస్టళ్లలో ఇన్వర్టర్ ఏర్పాటు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానంటూ చింతా ప్రభాకర్ హామీ ఇచ్చారు) చింతా ప్రభాకర్: ఏమ్మా చిన్నారి..నీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అంటూ మూడవ తరగతి విద్యార్థి మౌనికను అప్యాయంగా ప్రశ్నించారు. బి.మౌనిక: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను చూసి భయం..భయంగా...సిగ్గుపడుతూ ఉహూ.. పెద్ద సమస్యలు ఏమీ లేవు. అయితే బోరు పాడైంది అంటూ సమాధానం ఇచ్చింది. (నీ కష్టం తీరుస్తాలే చిన్నారి అంటూ మౌనిక బుగ్గలను చిదుముతూ అప్యాయంగా చెప్పారు ఎమ్మెల్యే చింతా)ఎస్సీ హాస్టల్ నుంచి బీసీ హాస్టల్ వైపు అడుగులు వేస్తూ చింతా ప్రభాకర్ పక్కనే ఉన్న విద్యార్థుల మరుగుదొడ్లను పరిశీలించారు. ఆ తర్వాత బీసీ హాస్టల్ వైపు కదిలి అక్కడ బయట ఉన్న విద్యార్థులను పలకరించారు. చింతా ప్రభాకర్: ఏమ్మా..ఇక్కడ అంతా సౌకర్యంగానే ఉందా? అన్నీ వసతులు బాగున్నాయా? మమత: అంతా బాగుంది సార్. సమయానికి భోజనం పెడుతున్నారు. కానీ, మాకు నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఆ సమస్యను పరిష్కరించండి. చింతా ప్రభాకర్: మీకు ఆరోగ్య సమస్యలు వస్తే ఏం చేస్తున్నారు..?హాస్టల్కు డాక్టర్ వచ్చి పరీక్షిస్తున్నారా? సునీత: ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ వ చ్చి పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. ఎప్పుడైనా ఆరోగ్య సమస్య వస్తే ఆస్పత్రికి వెళ్తున్నాము. చింతా ప్రభాకర్: మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే ధైర్యంగా చెప్పండి? సరస్వతి: సార్..ఈ హాస్టల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. సరైన సంఖ్యలో మరుగుదొడ్లు, బాత్రూంలు లేవు. మాకు మంచి సదుపాయాలు కల్పించి సమస్యలు పరిష్కరించండి. సంధ్య: సరైన ఫర్నీచర్ లేదు. స్టడీచైర్స్ లేవు. బెడ్స్ కావాలి. చలితో ఇబ్బంది పడుతున్నాం. మందంగా ఉన్న దుప్పట్లు సరఫరా అయ్యేలా చూడండి సార్. స్టడీ మెటీరియల్..స్పోకెన్ ఇంగ్లీషు కోచింగ్ కావాలే అనంతరం హాస్టల్లోని పదవ తరగతి విద్యార్థులతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలు ఇలా తెలుసుకున్నారు. చింతా ప్రభాకర్: ఏమ్మా.. మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా. పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సుమలత: సార్ పదవ తరగతి పరీక్షలకు ప్రిపేర్ కావాలని ఉన్నా...మాకు ఇంకా అవసరమైన స్టడీ మెటీరియల్ ఇవ్వలేదు. స్టడీ మెటీరియల్ అందక ఇబ్బందులు పడుతున్నాము. శ్రవంతి: పరీక్షలు దగ్గర పడుతున్నా ఏడు సబ్టెక్టులకు సంబంధించి ఇంకా స్టడీ మెటిరియల్ ఇవ్వలేదు. స్టడీ మెటిరీయల్ ఇప్పించేలా చర్యలు తీసుకోండి. (స్టడీ మెటీరియల్ అందకపోవటానికి గల సమస్యను వార్డెన్లతో ఎమ్మెల్యే ఆరా తీశారు. సమస్య పరిష్కారానికి అప్పటికప్పుడు ఆదేశించారు) చింతా ప్రభాకర్ : పదవ తరగతి విద్యార్థులకు ఇంకా సమస్యల ఉన్నాయా? సిద్దమ్మ: సార్.. మాకు స్టడీ మెటీరియల్తోపాటు హాస్టల్లో స్పోకెన్ ఇంగ్లీషులో శిక్షణ ఇప్పిస్తే బాగుంటుంది. అలాగే మాకు అందజేస్తున్న కాస్మోటిక్ చార్జీలు సరిపోవటంలేదు. కాస్మొటిక్ చార్జీలను రూ.75 నుంచి రూ.150 వరకు పెంచేలా చూడండి. ఆర్.సోనీ: సార్... మా హాస్టల్లో ప్రత్యేకంగా స్టడీ రూం. లైబ్రరీ ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. -
ఈ ‘వసతి’ మాకొద్దు బాబోయ్
స్పెషల్ డ్రైవ్లకు స్పందన కరువు విద్యార్థుల్లేక మూతపడుతున్న హాస్టళ్లు ‘‘నందిగామలో ఒకే సముదాయంలో నాలుగు ప్రభుత్వ వసతి గృహాలున్నాయి. రెండు ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ హాస్టల్లో విద్యార్థులు చదువుతున్నారు. రెండేళ్ల క్రితం ఈ హాస్టళ్లలో 580మంది విద్యార్థులుండేవారు. అయితే ఈ ఏడాది ఒక్కసారిగా సగానికి సగం పడిపోయి కేవలం 241మందికి చేరింది. దాదాపు ఇదే పరిస్థితి జిల్లా అంతటా నెలకొంది.’’ విజయవాడ : ప్రభుత్వ వసతి గృహాల్లో రానురాను కనీస సౌకర్యాలు దూరమవుతుండడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది. ఇవి వెలవెల పోతుండడంతో మేల్కొన్న అధికారులు విద్యార్థులు హాస్టళ్లలో చేరాలని నెలరోజులుగా మొత్తుకుంటున్నా చీమంత కూడా స్పందన కానరావడంలేదు. నిబంధనల ప్రకారం వందమంది ఉండాల్సిన హాస్టల్లో సగం మంది కూడా ఉండటం లేదు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఎస్సీ హాస్టళ్లు 149 వున్నాయి. వీటిలో బాలురకు 87, బాలికలకు 62 ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఈ హాస్టళ్లలో దాదాపు 15,800 మంది విద్యార్థులు వసతి పొందాలి. గత ఏడాది 11,232 మంది, సంవత్సరం 10,713 మందికి ఈ సంఖ్య పడిపోయింది. బీసీ-ఎస్టీ హాస్టళ్లలోనూ అదే పరిస్థితి... కాగా బీసీ హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. జిల్లాలో 63 హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 46 బాలుర హాస్టళ్లుకాగా, 17 బాలికలవి ఉన్నాయి. దాదాపు 6,300 మంది విద్యార్థులు ఉండాల్సిన ఈ హాస్టళ్లలో 4,560మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. షెడ్యూల్డ్ తెగల హాస్టళ్లలోనూ విద్యార్థులు చేరడం లేదు. 20 హాస్టళ్లలో దాదాపు రెండు వేల మంది విద్యార్థులకు వసతి సౌకర్యం ఉండగా కేవలం 1100మంది మాత్రమే ఉన్నారు. జూన్ 1వ తేదీనుంచి హాస్టల్ వార్డెన్లు, గ్రామాల్లో పర్యటించి అడ్మిషన ్లకోసం స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి హాస్టళ్లలో సీట్ల భర్తీ కోసం చేసిన ప్రయత్నాలు వృథాఅయ్యాయి. ప్రతీ గ్రామం లో ప్రజాప్రతినిధులు, వార్డెన్లు కలిసి ప్రచారం చేసినా ఫలితం శూన్యమైంది. కారణాలివేనా?.. గ్రామీణ ప్రాంతాల హస్టళ్లలో సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్చటానికి ఇష్టపడడం లేదని తెలిసింది. హాస్టల్ వార్డెన్లు, సిబ్బంది సరిగా లేకపోవ డం, మెను కూడా సరిగా లేకపోవడంతో క్రమేపి ప్రభుత్వ హాస్టళ్ల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లోనూ పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యాసంస్థలు ఏర్పాటు కావడంతో విద్యార్థులను హాస్టళ్లకు పంపటం లేదు. పేదలు తమ బిడ్డలను ఇంగ్లిష్ మీడియం చదివించేందుకు సిద్ధమవుతున్నారు. మూసివేత దిశగా హాస్టళ్లు... ఇదిలా ఉండగా వరుసగా మూడేళ్లపాటు విద్యార్థుల సంఖ్య తగ్గితే వసతి గృహాలను మూసి వేస్తారు. గత ప్రభుత్వం 75మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న వసతి గృహాల ను మూసివేయాలనే ప్రతిపాదనలు తయారు చేసింది. ఇప్పటికే తక్కువగా ఉన్న హాస్టళ్ల వివరాలను ఆన్లైన్లో ఉంచారు. ఈ విద్యాసంవత్సరంలోనూ విద్యార్థుల సంఖ్య పెరగకపోతే దాదాపు సగానికి సగం హాస్టళ్లు మూసివేయక తప్పదని అధికారులు భావిస్తున్నారు. -
‘వసతి’లేని గృహాలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ :నల్లగొండ పట్టణంలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ముద్దన్నం, నీళ్లచారు అందుతున్నాయి. బీసీ హాస్టల్ విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్లు, పెట్టెలు అందలేదు. పట్టణంలోని బీసీ, ఎస్సీ హాస్టల్స్లో టాయిటెట్లకు తలుపులు లేవు. 1500మంది విద్యార్థులున్నా ఎస్సీ బాలుర హాస్టల్లో టాయిలెట్ల సమస్య ఉంది. తిప్పర్తిలోని బీసీ బాలుర వసతి గృహంలోని విద్యార్థులకు నేటి వరకూ నోట్బుక్స్, డ్రస్సులు, బెడ్షీట్లు ఇవ్వలేదు. అలాగే ఎస్టీ బాలికల, ఎస్టీ బాలుర వసతి గృహాల విద్యార్థులకు డ్రస్సులు ఇంతవరకు రాలేదు. బీసీ బాలుర వసతిగృహం అద్దె భవనంలో కొనసాగుతుంది. కనగల్లోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు దుస్తులు సరఫరా కాక, చిరిగిన బట్టలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇన్చార్జి వార్డెన్ స్థానికంగా ఉండకపోవడంతో సమస్యలు తప్పడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి, వలిగొండ, పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లోని వసతి గృహాల్లో విద్యార్థుల కొరత తీవ్రంగా ఉంది. డివిజన్లో1400సీట్లు ఉండగా 600 మందికి మించి విద్యార్థులు లేరు. భువనగిరిలో ఎస్సీ బాలుర, ఎస్సీ కళాశాల వసతి గృహంలో మంచినీటి సౌకర్యం, వసతి సరిగా లేవు. బీబీనగర్, పోచంపల్లిలో బాలికల వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పోచంపల్లి హాస్టల్ భవనం చుట్టూ ప్రహరీ లేక విద్యార్థులు రాత్రివేళల్లో భయాందోళనకు గురవుతున్నారు. బీబీనగర్ బాలుర హాస్టల్లోని మరుగుదొడ్లలో ట్యాప్లు పనిచేయకపోవడంతో విద్యార్థులు బయట స్నానాలు చేస్తున్నారు. మిర్యాలగూడ పట్టణ పరిధిలోని షాబునగర్ ఎస్సీ బాలుర హాస్టల్ (ఆనంద నిలయం)లో మరుగుదొడ్లకు డోర్లు సరిగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలు వస్తే ఎస్సీ(బీ) బాలికల హాస్టల్ గదుల్లోకి జల్లులు కొడుతున్నాయి. ఎస్టీ బాలికల హాస్టల్లో ఉదయం టిఫిన్ వేళలో వర్షంలోనే విద్యార్థులు క్యూలో నిల్చున్నారు. ఎస్సీ బాలికల వసతి గృహంలో బాత్రూములకు తలుపులేవు. ఈదులగూడలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో గదుల తలుపులకు చెక్కబల్లను అడ్డం పెట్టుకుంటున్నారు. దామరచర్ల మం డలంలోని ఎస్సీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. బాత్రూములు లేక విద్యార్థులు ఆరు బయటే స్నానాలు చేస్తున్నారు. చౌటుప్పల్లోని ఎస్సీ బాలుర వసతిగృహంలో 60మంది విద్యార్థులకు 12మంది మాత్రమే ఉన్నారు. మెనూ అమలు కావడంలేదు. నేలపట్ల గ్రామంలోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తుండడంతో అందుబాటులో లేరు. నల్లగొండ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. చండూరులోని ఎస్సీ హాస్టల్ అద్దెభవనంలో కొనసాగుతోంది. మర్రిగూడలోని ఎస్సీ హాస్టల్ మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారు. కోదాడ నియోజకవర్గంలోని 16 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అసౌకర్యాల మధ్య కునారిల్లుతున్నాయి. 16మంది వార్డెన్లూ కోదాడ, సూర్యాపేట పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. మోతెలోని బీసీ బాలుర వసతి గృహంలో 68 మంది విద్యార్థులకు గాను 12మంది మాత్రమే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. గణపవరం, కాపుగల్లు హాస్టళ్లు విద్యార్థులు లేక సరిగా నడవడం లేదు. మునగాల ఎస్సీ బాలికల కోసం రూ.50 లక్షలతో నిర్మించిన పక్కా భవనానికి విద్యుత్ సౌకర్యం లేక నిరుపయోగంగా పడి ఉంది. నడిగూడెం మండలంలో బాలుర వసతిగృహం అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని 22ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో 13 అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. సొంత భవనాలు ఉన్నచోట అవి శిథిలావస్థకు చేరాయి. తుంగతుర్తిలోని సంక్షేమ వసతి గృహాలకు మంచినీటి వసతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వసతి గృహాల్లో 10చోట్ల ఇన్ఛార్జి వార్డెన్లే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వాచ్మన్లు, వంటమనుషులు లేక హాస్టల్స్కు భద్రత కరువైంది. పెద్దఅడిశర్లపల్లి మండలం గుడిపల్లి సాంఘిక సంక్షేమ వసతిగృహంలో గత ఏడాది 90 మంది విద్యార్థులున్నా, వసతిగృహం తెరుచుకోకపోవడంతో విద్యార్థులు తిరిగి ఇంటికే పరిమితమయ్యారు. డిండి మండలంలోని ఎస్సీ హాస్టల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దేవరకొండ పట్టణంలోని ఏ1, ఏ2 హాస్టళ్లు అద్దె భవనాల్లో నడుస్తుండడం, అవి కూడా పాతభవానాలు కావడంతో వర్షాలు కురిస్తే విద్యార్థులు ఉండే పరిస్థితి లేదు. కొండమల్లేపల్లిలోని ఏ3 హాస్టల్ కూడా అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్లో కూడా అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చింతపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో పెట్టెలు, ప్లేట్లు ఇప్పటి వరకు పంపిణీ చేయలేదు. సూర్యాపేట నియోజకవర్గంలో పట్టణంలో 19, మండలాల పరిధిలో 17 హాస్టళ్లు ఉన్నాయి. పట్టణం లో 19 హాస్టళ్లకు గాను 17 హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. పట్టణంలోని ఎస్సీ బాలుర-బీ హాస్టల్లో భవనంపై కప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. ఏ సమయంలో అవి కూలిపోతాయోనని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. జేజేనగర్ బాలికల కళాశాల హాస్టల్, హనుమాన్నగర్ ఎస్టీ బాలికల హాస్టల్లో స్నానపు గదులు, మరుగుదొడ్లకు తలుపులు బిగించకుండా వదిలేశారు. గిరి జన బాలికల హాస్టల్లో విద్యుత్వైర్లు తేలి ప్రమాదకరంగా మారాయి. నకిరేకల్ నియోజకవర్గంలో మొత్తం 15 ప్రభు త్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో ఐదింటికి మాత్రమే పక్కా భవనాలు నిర్మించారు. మిగతా 10 వసతిగృహాలు అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. నాణ్యమైన బియ్యం సరఫరా కాకపోవడంతో భోజనం ము ద్దలు ముద్దలుగా ఉండడంతో విద్యార్థులు తినలేని పరిస్థితి ఉంది. కట్టంగూర్లోని ఎస్సీ హాస్టల్ అద్దె భవనం వర్షం వస్తే కురుస్తుంది. మరుగుదొడ్లు కూడా సరిపోవడం లేదు. చిట్యాలలోని ఎస్సీ హాస్టల్ ఇరుకు గదులలో కొనసాగుతుంది. నార్కట్పల్లి మండలంలో రెండు ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు సరిపోను స్నానాల గదులు, మరుగుదొడ్లు లేవు. రామన్నపేట మండలంలోని ఎస్సీ హాస్టల్లో వర్షం వస్తే జలమయమవుతుంది. కేతేపల్లిలోని ఎస్సీ హాస్టల్ పక్కా భవనం ఉన్నా మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గవ్యాప్తంగా 25 ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. గుర్రంపోడు మండలకేంద్రంలోని బీసీ హాస్టల్, పెద్దవూర మం డల కేంద్రంలోని ఎస్టీ స్పెషల్ హాస్టల్, ఎస్సీ హాస్టల్, త్రిపురారంలోని బీసీ బాలుర, ఎస్సీ బాలు ర, నిడమనూరు మండలంలో ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాలు అద్దె భవనంలో నడుస్తున్నాయి. ఇక్కడ కనీస సదుపాయాలు లేవు. తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పెద్దవూర ఎస్టీ స్పెషల్ హాస్టల్లో కృష్ణావాటర్ వస్తేనే నీరు.. లేకుంటే స్నానాలు చేసేందుకు వాగును ఆశ్రయిస్తున్నారు. త్రిపురారం మండలంలో బీసీ, ఎస్సీ బాలు ర వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేవు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో 15 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. హు జూర్నగర్లోని కొందరు వార్డెన్లు స్థానికంగా నివా సం ఉండకుండా అప్పుడప్పుడు హాస్టళ్లకు వచ్చి వెళుతున్నారు. హుజూర్నగర్లోని ఎస్సీ, ఎస్సీ ఏ-1, బీసీ బాలుర, నేరేడుచర్లలోని ఎస్సీ హాస్టళ్ల్లు అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మెనూ అమలుకావడం లేదు. అరటిపండు, కోడిగుడ్డు సరఫరాలో కోతలు పెడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. హుజూర్నగర్లోని ఎస్టీ బాలుర హాస్టల్లో ఉద యం టిఫిన్కు బదులు భోజనం వండి వడ్డిస్తున్నారు. ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, యాదగిరిగుట్ట, ఆత్మకూర్.ఎం, గుండాల, రాజాపేట, బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో సంక్షేమ హాస్టళ్లలో సమస్యలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రి వసతి గృహంలో 10 మందికి మించి విద్యార్థులు ఉండడంలేదు. గుండాల మండలం సీతారాం పురంలో అద్దెభవనంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఇద్దరు హాస్టల్ విద్యార్థినులు అదృశ్యం
కొత్తగూడెం : ఖమ్మం జిల్లా కొత్తగూడెం బీసీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. వీరిద్దరు తప్పిపోయారా..లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్నది మిస్టరీగా మారింది. ఏడవ తరగతి చదువుతున్న అనిత, త్రివేణి సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లారు. సెలవుల అనంతరం హాస్టల్కి తిరిగి రాకపోవడంతో వార్డెన్ ...విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ఒక్కసారిగా షాక్కి గురైన తల్లిదండ్రులు తమ పిల్లలు హాస్టల్కే వచ్చారని చెప్పారు. వెంటనే కొత్తగూడెం వచ్చిన తల్లిదండ్రులు పిల్లల జాడ కోసం వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అర్ధరాత్రి అరాచకం
లావేరు, న్యూస్లైన్: బుధవారం అర్ధరాత్రి దాటి.. సమయం 3 గంటలు కావస్తోంది.. లావేరు మండలం అదపాక గ్రామం గాఢ నిద్రలో ఉంది. అంతలో ఉన్నట్లుండి అలజడి. పోలీసు బూట్ల చప్పుళ్లు.. రణగొణ ధ్వనులు. దాంతో అక్కడి ప్రశాంతత చెదిరిపోయింది. గ్రామస్తుల నిద్రమత్తు ఎగిరిపోయింది. విశాఖ జిల్లా భీమిలి నుంచి వచ్చిన సుమారు 30 మంది పోలీసులు వచ్చీరావడంతోనే బీసీ హాస్టల్ పరిసరాల్లో ఉన్న రెల్లి కులస్తుల ఇళ్లపై విరుచుకుపడ్డారు. తలుపులు దబదబ బాదారు. దాంతో ఇళ్లలో ఉన్నవారు ఉలిక్కిపడి లేచినా.. భయంతో తలుపులు తీయలేదు. అయినా పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తలుపులు విరగ్గొట్టి ఇళ్లలోకి చొరబడ్డారు. సామాన్లను విసిరికొట్టారు. బీరువాలు తెరిచి బట్టలు, ఇతర వస్తువులను చిందరవందరగా పడేశారు. వారి దౌర్జన్యాన్ని అడ్డుకోబోయిన మహిళలను నిర్దాక్షిణ్యంగా నెట్టేశారు. కొంతమందిపై చేయి చేసుకున్నారు. పిల్లలను సైతం తోసివేశారు. చాలాసేపు వీరంగం వేసి ఐదుగురు వ్యక్తులను తమతోపాటు తీసుకుపోయారు. ఇళ్లలోని నగదు, బంగారం కూడా తీసుకుపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితంనాటి చోరీ కేసు పేరుతో.. పోలీసులు అంత తీవ్రంగా విరుచుకుపడటానికి కారణం ఏడాది క్రితం భీమిలి ప్రాంతంలో జరిగిన చోరీ కేసే కారణమట. అదపాక రెల్లీలే ఈ కేసులో నిందితులని భావించిన పోలీసులు అర్ధరాత్రి వారి ఇళ్లపై దాడికి పాల్పడి, భయోత్పాతం సృష్టిం చారు. వాస్తవానికి ఈ కేసు విచారణలో భాగంగా గత జూన్లో ఒకసారి భీమిలి పోలీసులు ఇక్కడికి వచ్చి విచారణ జరిపారు. తామెటువంటి చోరీకి పాల్పడలేదని రెల్లీలు అప్పట్లోనే విన్నవించుకోవడంతో వెళ్లిపోయారు. ఆరు నెలల తర్వాత మళ్లీ బుధవారం అర్ధరాత్రి వచ్చి బీభత్సం సృష్టించి.. కుప్పిలి త్రినాథ్, పిన్నింటి కృష్ణ, సవళాపురపు లక్ష్మణ, కుప్పిలి రాంబాబు, కుప్పిలి అప్పారావు అనే వ్యక్తులను తమతో తీసుకుపోయారు. సొత్తు దోచుకుపోయారు! ఈ సంఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారని, చిన్నపిల్లలను కూడా తోసివేయడంతో ప్రసన్నకుమార్ అనే ఏడాది బాలుడికి దెబ్బలు తగిలాయని బాధిత కుటుంబాలకు చెందిన మహిళలు గ్రామానికి వెళ్లిన విలేకరుల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. చోరీతో తమకెలాంటి సంబంధం లేదని మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా తమ వారిని తీసుకుపోయారని పిన్నింటి లక్ష్మి, కుప్పిలి లక్ష్మి, కుప్పిలి మణి తదితరులు వాపోయారు. తమ ఇంట్లో ఉన్న పదివేల నగదు, రెండు బంగారు ఉంగరాలు, వెండి పట్టీలు, మొలతాడు తీసుకుపోయారని కుప్పిలి త్రినాథ్ భార్య ఆదెమ్మ ఆరోపించారు. సవళాపురపు సింహాద్రి అనే వ్యక్తి ఇంట్లో ఇటీవల పాలు అమ్మగా వచ్చిన నాలుగువేల నగదు, పిన్నింటి కృష్ణ అనే వ్యక్తి ఇంట్లో మూడువేలు నగదును కూడా పోలీసులు తీసుకుపోయారని అతని కృష్ణ భార్య లక్ష్మి తదితరులు చెప్పారు. చేయని దొంగతనాలను మాపై మోపుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆవేదన చెందారు. చోరీ చేసినట్లు ఆధారాలు ఉంటే.. పగటి పూట వచ్చి తీసుకెళ్లాలే గానీ.. ఇలా అర్ధరాత్రి వేళ వచ్చి భయోత్పాతం సృష్టించడం ద్వారా చేయని నేరాన్ని చేసినట్లు బలవంతంగా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని, అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారని వారు ఆరోపించారు. పోలీసుల నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. సంబంధం లేదని గతంలోనే చెప్పాం: సర్పంచ్ భీమిలి చోరీ కేసుతో అదపాక రెల్లి కులస్తులకు ఎటువంటి సంబంధంలేదని గతంలోనే చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని అదపాక సర్పంచ్ నడిమింటి కుమారి అన్నారు. ఈ కేసు విషయమై గత ఏడాది జూన్లో భీమిలి పోలీసులు తన వద్దకు వచ్చారని, అప్పుడే రెల్లీలను పిలిపించి విచారించగా ఆ దొంగతనం చేయలేదని వారు తన సమక్షంలోనే చెప్పారని ఆమె వివరించారు. అయినా వినిపించుకోకుండా రాత్రి వేళ ఇలా ఇళ్లలోకి చొరబడి దౌర్జన్యాలకు పాల్పడి, మనుషులను ఎత్తుకుపోవడం సమంజసం కాదని ఆమె అన్నారు. స్పందించని భీమిలి పోలీసులు ఈ సంఘటనపై వివరణ కోరేందుకు ‘న్యూస్లైన్’ ప్రయత్నించగా భీమిలి పోలీసులు స్పందించలేదు. బుధవారం సాయంత్రం భీమిలి పోలీసుస్టేషన్ ల్యాండ్లైన్కు ఫోన్ చేసి ఎస్సైతో మాట్లాడాలని కోరగా.. ఆయన లేరని అక్కడి సిబ్బంది చెప్పారు. సెల్ఫోన్ నెంబరు అయినా ఇవ్వాలని కోర గా భీమిలిలో ఎందరో ఎస్సైలు ఉన్నారు.. వారి నెంబర్లు మాకు తెలియవంటూ ఫోన్ పెట్టేశారు. లావేర్ ఎస్సై వివరణ కోరగా భీమిలి పోలీసులు వచ్చి, కొందరిని తీసుకెళ్లిన విషయం తమకు తెలియదన్నారు.