Advertisement
BRICS countries
-
‘బ్రిక్స్’ పార్లమెంట్ రానున్నదా?
ఈ నెల 11–12 తేదీలలో జరిగిన బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో రష్యా అ«ధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ బ్రిక్స్ పార్లమెంట్ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఆ కొత్త సంస్థ యూరోపియన్ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్కు పోటీయా అన్నట్లు ఇప్పటికే బ్రిక్స్ బ్యాంక్ ఏర్పడింది. బ్రిక్స్ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మారకాలను అంగీకరించే దేశాలతో అమెరికన్ డాలర్ బదులు తమ కరెన్సీలలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళ ధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి.ప్రస్తుతం ప్రపంచమంతటా చర్చ జరుగు తున్న సరికొత్త విషయం బ్రిక్స్ పార్లమెంట్ నిజంగా ఏర్పడవచ్చునా అన్నది! ‘బ్రిక్స్’ గురించి తెలిసిందే. ‘బ్రిక్స్’ పార్లమెంటరీ ఫోరం మాట విన్నదే. కానీ ‘బ్రిక్స్’ పార్లమెంట్ కొత్త మాట. పార్లమెంటరీ ఫోరం సమావేశాలు ఈ నెల 11–12 తేదీలలో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగినప్పుడు, మొదటి రోజున ప్రారంభోపన్యాసం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, ఉరుములేని పిడుగువలె బ్రిక్స్ పార్లమెంట్ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలికి పడింది. ఆయన ఆలో చనలోని ఉద్దేశమేమిటి? ‘బ్రిక్స్’ దేశాలు అందుకు సమ్మతిస్తాయా? ఆ కొత్త సంస్థ లక్ష్యాలేమిటి? అది యూరోపియన్ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా? అనే ప్రశ్నలు శరపరంపరగా తలెత్త్తటం మొదలైంది. ఇది ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు కలవరపాటు కలిగిస్తున్నదనేది గమనించవలసిన విషయం.ఇందుకు సంబంధించి తెలుసుకోవలసిన సమాచారాలు కొన్నున్నాయి. అంతకన్నా ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన అంత ర్జాతీయ విషయాలు చాలా ముఖ్యమైనవి కొన్నున్నాయి. ఇందులో మొదటగా సమాచారాలను చూద్దాం. ‘బ్రిక్స్’ అనే సంస్థ మొదట ‘బ్రిక్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే పేరిట 2006లో ఏర్పడింది. తర్వాత 2011లో సౌత్ ఆఫ్రికా చేరికతో ‘బ్రిక్స్’ అయింది. ఈ సంవత్సరం ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరాయి. తమను కూడా చేర్చుకోవాలంటూ మరొక పాతిక దేశాల వరకు దరఖాస్తు చేసుకున్నాయి. ‘బ్రిక్స్’ సభ్యదేశాలు 2009లో పార్లమెంటరీ ఫోరంను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ఫోరం 10వ సమావేశాలు ఈ నెలలో జరిగినపుడే పుతిన్ తన ప్రతిపాదన చేశారు. ఆ సమావేశంలో మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. నిజానికి బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అన్నది సభ్య దేశాల పార్లమెంట్ స్పీకర్ల ఫోరం. అందుకు భిన్నంగా, పుతిన్ ప్రతిపాదన కొత్తగా ఒక ఉమ్మడి పార్లమెంటును ఏర్పాటు చేసుకోవటం. ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు వచ్చే అక్టోబర్లో రష్యాలోని కజాన్ నగరంలో జరగ నున్నాయి. ఈ ప్రతిపాదన అపుడు అధికారికంగా చర్చకు వచ్చి,అందరూ ఆమోదించే పక్షంలో ఆచరణకు వస్తుంది. ఈలోగా ఈ విషయమై ప్రపంచమంతటా చర్చలు సాగుతాయి. మరొకవైపు సభ్య దేశాల మధ్య ముందస్తు సంప్రదింపులు జరగగలవని వేరే చెప్ప నక్కరలేదు. పోతే, బ్రిక్స్ లక్ష్యాలే బ్రిక్స్ పార్లమెంటు లక్ష్యాలు, విధులు కాగలవని భావించవచ్చు. బ్రిక్స్ 2006లో ఏర్పడింది. ఎందుకు? ఈ 18 సంవత్సరాలలో ఆ సంస్థ చేసిందేమిటి? అన్నవి మొదట ఉత్పన్న మయే ప్రశ్నలు. ఇది ప్రధానంగా ఆర్థిక, వాణిజ్యపరమైన సంబంధాల కోసం ఏర్పడినటువంటిది. పరస్పర సంబంధాలతో పాటు ఇతర దేశా లతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల అభివృద్ధి కూడా ఈ పరిధిలోకి వస్తుంది. బ్రిక్స్కు రాజకీయపరమైన, సైనికమైన, వ్యూహాత్మకమైన లక్ష్యాలు ఏవీ లేవని, గత 18 సంవత్సరాలుగా అదే ప్రకారం పని చేస్తున్నదనేది గమనించవలసిన విషయం. అంతే గమనించవలసిందేమంటే తన ఆర్థిక లక్ష్యాల ప్రకారం బ్రిక్స్ చాలా సాధించింది. ఉదాహరణకు తాజా లెక్కల ప్రకారం, పాశ్చాత్య దేశాల కూటమి అయిన జీ–7 జీడీపీ ప్రపంచంలో 29 శాతం మాత్రమే కాగా, బ్రిక్స్ జీడీపీ 36.8 శాతానికి చేరింది. ఆర్థిక రంగంలో జరుగుతున్నదాని సూచనలను బట్టి చూడగా ఈ వ్యత్యాసం ఇంకా పెరుగుతూ పోగలదన్నది నిపుణుల అంచనా. అది చాల దన్నట్లు మునుముందు సౌదీ అరేబియా, ఇండోనేషియా, మెక్సికో తదితర దేశాలు చేరినపుడు పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. అమె రికా శిబిరానికి బ్రిక్స్ అంటే సరిపడకపోవటానికి ముఖ్యకారణం ఇదే. లోగడ ఆసియాలో ఏషియాన్, ఆఫ్రికాలో ఎకోవాస్, ఇఎసి, లాటిన్ అమెరికాలో సదరన్ కామన్ మార్కెట్ వంటివి ఏర్పడ్డాయి. ఏషియాన్ గొప్పగా విజయవంతం కాగా తక్కినవి అంతగా కాలేదు. పైగా వాటిలో అమెరికా జోక్యాలు బాగా సాగినందున తమకు పోటీగా మారలేదు. తమను అధిగమించటం అంతకన్నా జరగలేదు. బ్రిక్స్ రికార్డు వీటన్నిటికి భిన్నంగా మారింది. ఆ సంస్థ ఆమెరికా జోక్యానికి సమ్మతించలేదు. ఇండియాతో సహా ఎవరూ ఒత్తిళ్లకు లొంగలేదు. ఇది చాలదన్నట్లు అర్థికాభివృద్ధిలో తమను మించిపోతున్నారు. ఒత్తిళ్లను కాదని ఇదే సంవత్సరం ఈజిప్టు, యూఏఈ వంటివి చేరాయి. ఇరాన్ను చేర్చుకోరాదన్న ఒత్తిడికి బ్రిక్స్ సమ్మతించలేదు. అదే పద్ధతిలో సౌదీ, టర్కీ, ఇండోనేషియా, లిబియా, మెక్సికో వంటివి ముందుకు వస్తున్నాయి. ఇదంతా చాలదన్నట్లు, ప్రపంచంపై పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేసే పరిణామాలు మరికొన్ని జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్కు పోటీయా అన్నట్లు బ్రిక్స్ బ్యాంక్ ఒకటి 2014 లోనే ఏర్పడింది. అమెరికన్ డాలర్ ప్రాబల్యాన్ని అరికట్టేందుకు బ్రిక్స్ కరెన్సీ అయితే ఇంకా రూపొందలేదు గానీ, బ్రిక్స్ దేశాలకు చెల్లింపుల కోసం బ్రిక్స్ చెయిన్ పేరిట ఒక సాధనం చలామణీలోకి వచ్చింది. అట్లాగే ఈ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మార కాలను అంగీకరించే దేశాలతో అమెరికన్ డాలర్ బదులు తమ కరెన్సీ లలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. బ్రిక్స్ బ్రిడ్జ్ పేరిట మరొక చెల్లింపుల పద్ధతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నింటి ప్రభావాలతో పాశ్చాత్య ప్రపంచపు ఆర్థిక ప్రాబల్యం, పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్యం క్రమంగా బలహీనపడుతున్నాయి. ఉదాహరణకు ప్రస్తుత సంవత్సరంలో బ్రిక్స్ సగటు అర్థికాభివృద్ధి 3.6 శాతం మేర, జీ–7 దేశాలది కేవలం 1 శాతం మేర ఉండగలవని అంచనా. ప్రపంచంలో ఇప్పటికే రెండో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారిన చైనా మరొక దశాబ్దం లోపలే అమెరికాను మించగలదన్నది అంతటా వినవస్తున్న మాట. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి. ఈ శతాబ్దం ఆసియా శతాబ్దం కాగలదనే జోస్యాలు ఆ విధంగా బలపడుతున్నాయి. చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో అమెరికా ఒత్తిళ్లను కాదని ఇప్పటికి 150 దేశాలు చేరటం, అందులో వారి శిబిరానికి చెందినవి కూడా ఉండటం ఈ ఆర్థిక ధోరణులకు దోహదం చేస్తున్నది.ఈ విధమైన ప్రభావాలను ముందుగానే అంచనా వేసి కావచ్చు అమెరికన్లు, యూరోపియన్లు మొదటినుంచే బ్రిక్స్ను, బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివును అడ్డుకునేందుకు, బ్రిక్స్లోని సభ్య దేశాలను ఒత్తిడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ వస్తున్నాయి. రకరకాల ఆంక్షలు ఏదో ఒక సాకుతో విధించటం (ఇండియాపై కూడా), వివిధ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను భంగపరచజూడటం అందులో భాగమే. భారత, రష్యాల విషయంలోనూ అదే వైఖరి చూపటానికి తాజా ఉదాహరణ ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ, పుతిన్ను కలవటంపై ఆగ్రహించటం. అమెరికా శిబిరం ప్రజాస్వామ్యమనీ, ఆసియా దేశాల స్వేచ్ఛ అనీ, అంతర్జాతీయ నియమాలకూ, ఐక్య రాజ్యసమితి ఛార్టర్కూ కట్టుబడటమనీ నీతులు చాలానే చెప్తుంది. కానీ అందుకు విరుద్ధమైన తమ చర్యల గురించి ఎన్ని రోజుల పాటైనా చెప్పవచ్చు.వీటన్నింటికి విరుగుడుగా తక్కిన ప్రపంచ దేశాలు తీసుకుంటున్న వివిధ చర్యలలో, బ్రిక్స్ పార్లమెంట్ అనే కొత్త ప్రతిపాదన ఒక ముందడుగు కాగల అవకాశం ఉంది. ప్రపంచ దేశాల మధ్య సమా నత్వ ప్రాతిపదికగా పరస్పర సహకారానికి, ఇతోధికాభివృద్ధికి అవస రమైన చర్చలు బ్రిక్స్ పార్లమెంటులో జరగాలన్నది తన ఆలోచన అయినట్లు పుతిన్ చెప్తున్నారు. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
బ్రిక్స్ దేశాలు సాధించింది శూన్యం
దక్షిణాఫ్రికా వేదికగా ‘బ్రిక్స్’ దేశాల 15వ సమావేశం ముగిసింది. అంతర్జాతీయ సమాజం ఈ సమావేశాలపై అనూహ్యంగా తన దృష్టిని కేంద్రీకరించింది. వ్యాఖ్యాతలు కొందరు ఇంకో అడుగు ముందుకేసి దీన్ని 1955 నాటి బండుంగ్ (ఇండోనేషియా) సమావేశాలతో పోల్చారు. బండుంగ్ వేదికగానే భారత్ సహా చైనా, ఇండోనేషియా, ఈజిప్ట్ యుగొస్లావియా కలసికట్టుగా అలీనోద్యమాన్ని ప్రకటించాయి. తాజా సదస్సులో బ్రెజిల్, రష్యా,ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా నవతరం నేతలు అమెరికా ఆధిపత్య ప్రపంచానికి ప్రత్యామ్నాయాన్ని సృష్టించే ప్రయత్నం చేసినంత హడావిడి జరిగింది. ప్రత్యామ్నాయం ఏమిటి? అయితే... సమావేశాలు నడుస్తున్న కొద్దీ వీటి డొల్లతనం ఇట్టే బయటపడింది. ఆతిథ్య దేశమైన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి రాకపోవడంతో, భారత ప్రధాని నరేంద్ర మోదీ విమానంలోంచి దిగేందుకు నిరాకరించి నట్లు ప్రముఖ దక్షిణాఫ్రికా వెబ్సైట్ ఓ వార్త ప్రచురించింది. ఇతర నాయకులతో పాటు వీడియో లింక్ ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉపన్యసించిన ప్రారంభ సమావేశంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కారణం చెప్పకుండా, ఇవ్వాల్సిన ఉపన్యాసం ఇవ్వలేదు. యుద్ధ నేరాల పేరుతో ఎక్కడ తనను అరెస్ట్ చేస్తారో అన్న భయంతో దక్షిణాఫ్రికాకు రాలేకపోయిన పుతిన్ యథావిధిగానే ఉక్రెయిన్ మీద తమ యుద్ధానికి బాధ్యత పాశ్చాత్య దేశాలదేనని నిందించారు. చైనా అధ్యక్షుడు తన ప్రసంగంలో పేరు చెప్పకుండా, కానీ దేని గురించో తెలి సేట్టుగా ఒక దేశం ‘తన ఆధిపత్యాన్ని ఎలాగైనా కొనసాగించాలన్న పంతంతో’ ఉందనీ, చైనా ప్రగతిని అడ్డుకుంటోందనీ వ్యాఖ్యానించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనా సియోలులా డ సిల్వా ప్రసంగం మాత్రం కొంత కల్లోలం చేసిందని చెప్పాలి. డీ–డాలరైజేషన్, బ్రిక్స్కు ప్రత్యా మ్నాయం వంటి అంశాలపై ఈయన మాట్లాడారు. కానీ ఏ ఫలితమూ రాలేదు. బ్రిక్స్ సభ్యదేశాల సంఖ్యను పెంచే విషయంతో ఈ శిఖరాగ్ర సమావేశాలు ముగిశాయి. సంక్షోభంలో ఉన్న అర్జెంటీనా, ఇథియోపియాలతోపాటు చమురు నిల్వలు పుష్టిగా ఉన్న సౌదీ అరేబియా, ఇటీవలిదాకా దీని ప్రత్యర్థి దేశం ఇరాన్ ఇప్పుడు బ్రిక్స్ బృందంలో చేరనున్నాయి. అయితే ఏ ప్రత్యామ్నాయ సంస్థలు బ్రిక్స్ నిర్మిస్తుందో మాత్రం స్పష్టం కాలేదు. ఈ అంశాలపై స్పష్టత ఇవ్వడం కోసం జరగాల్సిన విలేఖరుల సమావేశాన్ని కాస్తా, జర్న లిస్టులకు ‘విశ్రాంతి’ పేరుతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామ ఫోసా చివరి నిమిషంలో రద్దు చేశారు. అమెరికా సెక్యురిటీస్ సంస్థలో పెట్టుబడులను రాబ ట్టేందుకు ఓ బ్రిటిష్ ఆర్థికవేత్త యథాలాపంగా పెట్టిన ‘సంక్షిప్త నామం’తో నడుస్తున్న బ్రిక్స్ సదస్సు నుంచి ఇంతకంటే గొప్పగా ఏమీ ఆశించలేము. అయితే అమెరికా నేతృత్వంలోని వ్యవస్థకు ప్రతిగా ఏర్పాటైన చాలా ముఖ్యమైన సంస్థ బ్రిక్స్ అని డబ్బా కొట్టుకోవడాన్ని మాత్రం ఎలా పరిహరించవచ్చో ఆలోచించాలి. పాశ్చాత్య దేశాల భౌగో ళిక, ఆర్థిక పెత్తనానికి చెక్ పెట్టేందుకు ఒక దీటైన సంస్థ కోసం ప్రపంచం శతాబ్దానికి పైగా ఎదురు చూస్తోంది. అయితే ఇలాంటి ఓ సంస్థ ప్రాముఖ్యతను గుర్తించడంలో పాశ్చాత్య జర్నలిస్టులు విఫలమవుతూండటం విచారకరం. దూరదృష్టి కరవు ఒక విషయమైతే స్పష్టం. బ్రిక్స్కూ, అలీనోద్యమానికీ ఏమాత్రం సారూప్యత లేదు. 1950లు అంటే ఇండియా, ఈజిప్టు, చైనా... జాతీయోద్యమాలు, వలస పాలనకు వ్యతిరేక సంఘర్షణల నుంచి అప్పుడప్పుడే బయట పడు తున్న కాలం అది. ఆర్థికాభివృద్ధి విషయంలో అందరికీ సమాన అవకాశాలిచ్చే అంతర్జాతీయ వ్యవస్థ ఒకటి అవస రమని అప్పటి నాయకులు నిజాయితీగా నమ్మారు. ఈ నమ్మకంలో భాగంగానే న్యూ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఆర్డర్ వంటివి బయటకు వచ్చాయి. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... బండుంగ్ సమావేశపు ప్రతి నిధు లకు ఉన్న దార్శనికత, దూరదృష్టి దక్షిణాఫ్రికా బ్రిక్స్ సదస్సులో అస్సలు కనిపించకపోవడం. వాస్తవానికి మారి పోతున్న పరిస్థితుల్లో తామేం చేయాలన్నది ఇప్పుడి ప్పుడే వీళ్లు నేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. కొత్తగా చేరిన సభ్యులతో సహా అన్ని బ్రిక్స్ దేశాల సాధారణ ‘విజన్’ ఏంటంటే– వాణిజ్యం, టెక్నాలజీ, మిలి టరీ ఒప్పందాల్లో తమకు ప్రాధాన్యం ఎక్కువ ఉండేలా అమెరికా, యూరప్లతో బేరాలు సాగించగలగడం. ఇంతకంటే భిన్నంగా ఉండే అవ కాశం లేదు. భారత్నే ఉదాహరణగా తీసుకుందాం. వ్యూహాత్మకంగా శత్రువైనప్పటికీ చైనా నుంచి చౌక వస్తువులు కావాలి. చౌక ధరల్లో రష్యా నుంచి ముడి చమురు కావాలి. మిలిటరీ టెక్నాలజీ, ఆయు ధాల్లాంటివి అమెరికా, యూరప్ల నుంచి తెచ్చు కోవాలి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి పెట్టుబడులూ కావాలి. అందుకు తగ్గట్టుగానే భారత్ విదేశాంగ విధా నమూ ఉంటుంది. ఒంట రిగానైనా, గుంపుగానైనా ఆయా దేశాలకు కట్టుబడి ఉండేలా వ్యవహరిస్తుందన్నమాట! గ్లోబల్ సౌత్కు నేతృత్వం వహిస్తున్నామనీ, అందుకే వరి, చక్కెరల ఎగు మతులపై నిషేధం విధిస్తున్నామనీ కూడా భారత్ ప్రకటించుకోలేదు. ఈ విషయంలో చైనాకు ఎంతో కొంత మంచి పేరున్నా... రోజురోజుకూ ముదిరిపోతున్న ఆర్థిక సంక్షో భాన్ని తట్టుకోవడంలోనే ఆ దేశం తలమున కలై ఉంది. సభ్యులు, పెరిగినా, తగ్గినా బ్రిక్స్తో ప్రయోజనం శూన్య మని అర్థం చేసుకునేందుకు బహుశా వచ్చే ఏడాది రష్యాలో జరగనున్న సదస్సు వరకూ వేచి చూడా ల్సిన అవసరం లేదేమో! పంకజ్ మిశ్రా వ్యాసకర్త నవలా రచయిత, సామాజిక విశ్లేషకుడు (‘బ్లూమ్బర్గ్’ సౌజన్యంతో) -
గుడ్న్యూస్: భారీగా పెరగనున్న భారతీయుల జీతాలు!! చైనా,రష్యా దేశాల్లో అంతసీన్ లేదంట!
భారతీయ ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది మనదేశానికి ఉద్యోగుల జీతాలు భారీ ఎత్తున పెరగనున్నట్లు పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు రానున్న ఐదేళ్లలో మిగిలిన దేశాలకు చెందిన ఉద్యోగుల కంటే మనదేశానికి చెందిన ఉద్యోగుల జీతాలు ఎక్కువగా ఉంటాయని తేలింది. ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయాన్ సర్వే ప్రకారం..2022లో మనదేశానికి చెందిన ఉద్యోగుల జీతాలు ఐదేళ్ల గరిష్ఠ స్థాయి 9.9 శాతానికి చేరుకుంటాయని తేలింది. సంస్థలు సైతం 2021లో జీతాలు 9.3 శాతంతో పోలిస్తే 2022లో 9.9 శాతం జీతాల పెరుగతాయని అంచనా వేస్తున్నట్లు అయాన్ తన సర్వేలో హైలెట్ చేసింది. 40కి పైగా పరిశ్రమలకు చెందిన 1,500 కంపెనీల డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనంలో అత్యధికంగా జీతాలు పెరుగుతాయని అంచనా వేసింది. భారీగా పెరగనున్న జీతాలు ఈ-కామర్స్, వెంచర్ క్యాపిటల్, హైటెక్/ఐటి ,ఐటి ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటిఇఎస్), లైఫ్ సైన్సెస్ రంగాలు ఉన్నాయి. జీతాల విషయంలో తగ్గేదేలా బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా లలో అయాన్ సర్వే చేసింది. ప్రపంచ జనాభాలో 41 శాతం వాటా, ప్రపంచ జీడీపీలో 24 శాతం భాగస్వామ్యం, అంతర్జాతీయ వాణిజ్యంలో 16 శాతం వాటా బ్రిక్స్ దేశాలదే. అయితే ఈ బ్రిక్స్ దేశాల్లో అయాన్ చేసిన సర్వేలో బ్రెజిల్, రష్యా, చైనాల కంటే మనదేశంలో పనిచేసే ఉద్యోగుల జీతాలు ఎక్కువగా ఉండనున్నట్లు తెలిపింది. ఇక పర్సంటేజీల వారీగా చూసుకుంటే చైనాలో జీతాల పెంపుదల 6 శాతం, రష్యాలో 6.1 శాతం, బ్రెజిల్లో 5 శాతం ఉండనున్నట్లు తన తన రిపోర్ట్లో పేర్కొంది. -
BRICS: కోవిడ్తో కోలుకోలేని దెబ్బ
ముంబై: కోవిడ్ మహమ్మారి బ్రిక్స్ దేశాలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందని బ్రిక్స్ ఎకనమిక్ బులిటన్ పేర్కొంది. నిరుద్యోగం, పేదరికం, లింగ వివక్షత, వలసలు... ఇలా పలు సామాజిక అంశాలపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉందని వివరించింది. బ్రిక్స్ సెంట్రల్ బ్యాంకుల సభ్యులతో బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ (సీఆర్ఏ) రీసెర్చ్ గ్రూప్ రూపొందించిన బులెటిన్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. బ్రిక్స్ పరిశోధన, ఆర్థిక విశ్లేషణ, నిఘా సామర్థ్యాన్ని పెంపొందించడానికి సీఆర్ఏ రీసెర్చ్ గ్రూప్ ఏర్పాటయ్యింది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్యదేశాలుగా ఉన్న బ్రిక్స్కు ప్రస్తుతం భారతదేశం అధ్యక్ష స్థానంలో ఉంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. - కోవిడ్ సంక్షోభం అన్ని దేశాలను విచక్షణారహి తంగా ప్రభావితం చేసింది. బ్రిక్స్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ సభ్య దేశాలు కూడా మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాని నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. - మహమ్మారి వ్యవధి–తీవ్రతల విషయాల్లో బ్రిక్స్ దేశాల మధ్య గణనీయమైన వైవిధ్యత ఉంది. - చైనా కోవిడ్ను పటిష్ట స్థాయిలో కట్టడి చేయగా, ఇతర బ్రిక్స్ దేశాలు అనేక రకాల ఇన్ఫెక్షన్లను చవి చూశాయి. తీవ్ర సెకండ్వేవ్లను ఎదుర్కొన్నాయి. మూడవ వేవ్ భయాల ముందు నిలిచాయి. - 2020లో ఎదురైన మహమ్మారి–ప్రేరిత తీవ్ర సవాళ్ల నుండి బ్రిక్స్ కోలుకున్నట్లు విశ్వసనీయంగా కనిపిస్తోంది. అయితే, రికవరీ విషయంలో బ్రిక్స్ సభ్యుల మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయి. - కరోనా సవాళ్లు, ఆర్థిక పునరుద్ధరణ, దేశాల మధ్య రికవరీలో వైరుద్యాలు, ద్రవ్యోల్బణం ఇబ్బందులు, అంతర్జాతీయంగా ఎదురవుతున్న అవరోధాలు, ఫైనాన్షియల్ రంగంలో ఒడిదుడుకులుసహా బ్రిక్స్ దేశాలు పలు సమస్యలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నాయి. - మహమ్మారిని ఎదుర్కొనడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషించనుంది. విస్తృత వ్యాక్సినేషన్ వేగం, సమర్థత వంటి అంశాలు ఆర్థిక పునరుద్ధరణలో అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. - కోవిడ్ అనిశ్చితికి తోడు, కఠిన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, సంక్షోభం నుండి ఉత్పన్నమయ్యే నిరంతర ఆర్థిక మరియు నిర్మాణాత్మక మార్పులు బ్రిక్స్ దేశాలలో ఆందోళనను రేకెత్తిస్తున్న మరికొన్ని అంశాలు. - మహమ్మారి అనంతరం చక్కటి భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించడం, ఆయా ప్రణాళికలు విజయవంతానికి కృషి, సంక్షోభం తదనంతరం ఉద్భవించే అవకాశాలను అందిపుచ్చుకోవడంపై బ్రిక్స్ దేశాలు దృష్టి సారించాలి. - సంవత్సరాలుగా సమన్వయం– సహకారానికి బ్రిక్స్ దేశాలు బలమైన పునాదులను ఏర్పరచుకున్నాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ), కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ (సీఆర్ఏ) ఏర్పాటు ఇందులో భాగంగా చెప్పుకోవచ్చు. చదవండి: భారత్ ఎకానమీకి ఢోకాలేదు.. క్రెడిట్ సూసీ నివేదిక -
‘ఉగ్ర’ పోరుకు ఐక్య కార్యాచరణ
ప్రిటోరియా: ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, అక్రమ నగదు చలామణీని అరికట్టేందుకు బ్రిక్స్ దేశాలు ఐక్య కార్యాచరణ చేపట్టాలని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) విదేశాంగ మంత్రుల సదస్సులో ఆమె మాట్లాడారు. అంతర్జాతీయ వాణిజ్యం సవాళ్లను ఎదుర్కుంటోందన్నారు. వాటిని తిప్పికొట్టడానికి, బ్రిక్స్ దేశాల దీర్ఘకాల అభివృద్ధికి ఐక్య కార్యాచరణ అవసరమన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య మరింత సహకారం పెంపొందించుకోవడానికి సదస్సు సాయపడుతుందన్నారు. సదస్సు తర్వాత మీడియాతో సుష్మా మాట్లాడుతూ.. ఉగ్రవాద వ్యతిరేక పోరుకు బ్రిక్స్ దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. సదస్సులో దేశాలు రాజకీయ, ఆర్థిక, భద్రతా రంగాలకు సంబంధించిన పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చాయని చెప్పారు. సదస్సులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు.. వచ్చే నెలలో జొహన్నెస్బర్గ్లో జరగనున్న బ్రిక్స్ నాయకత్వ సదస్సు విజయవంతానికి సాయపడతాయన్నారు. బ్రిక్స్ వృద్ధి రేటు, అధిక పెట్టుబడి, వాణిజ్య వాటాతో ప్రపంచ జనాభాలో దాదాపు 42 శాతం ప్రజలను ఏకం చేస్తుందన్నారు.ఈ సదస్సులో సుష్మాతో పాటు చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా విదేశాంగ మంత్రులు వాంగ్ యీ, లిండివె సిసులు, మార్కస్ బెజెరా అబ్బాట్ గల్వాయో, సెర్జీ లావ్రోవ్ పాల్గొన్నారు. సుష్మా స్వరాజ్ ఐబీఎస్ఏ (భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) విదేశాంగ మంత్రుల సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో చర్చలు బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణా్రఫ్రికా వెళ్లిన సుష్మా స్వరాజ్ ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను కలసి పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు. నైపుణ్యాభివృద్ధి, సమాచార సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాల్లో ఇరు దేశాలు పరస్పరం మరింతగా సహకరించుకోవాలని ఇరువురు నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. -
త్వరలో బ్రిక్స్ దేశాలతో ‘కార్మిక’ ఒప్పందాలు
కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: బ్రిక్స్ దేశాలతో కార్మిక సంబంధాలను పటిష్టపర్చుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు పలు ఒప్పందాలకు సిద్ధమవుతోంది. వలస కార్మికులకు ఉపాధి, సామాజిక భద్రత, సంక్షేమం కోసం త్వరలో బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బ్రిక్స్ ఎంప్లాయీమెంట్ వర్కింగ్ గ్రూపు(బీఈడబ్ల్యూజీ) సమావేశాలు బుధ, గురువారాల్లో హైదరాబాద్లో జరిగాయి. ఈ సమావేశాల విశేషాలను ఆయన గురువారం సాయంత్రం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీఈడబ్ల్యూజీ తొలి సమావేశాలు భారతదేశం ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించడం విశేషమన్నారు. సమ్మిళిత అభివృద్ధి కోసం బ్రిక్స్ దేశాల్లో ఉపాధి సృష్టి, కార్మికుల సామాజిక భద్రతపై పరస్పర అవగాహన ఒప్పందం, కార్మిక శిక్షణ సంస్థల అనుసంధానం అనే మూడు అంశాలపై ఆ దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారని తెలిపారు. ఈ చర్చల ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా వచ్చే సెప్టెంబర్లో ఆగ్రాలో జరగనున్న బ్రిక్స్ దేశాల కార్మిక, ఉపాధి కల్పన మంత్రుల సమావేశంలో వాటితో ఒప్పందాలు కుదుర్చుకుంటామని మంత్రి చెప్పారు. అభివృద్ధి చెందిన జీ-20 దేశాలు పరస్పరం సహకరించుకుంటున్న విధంగా ‘బ్రిక్స్’ దేశాలు సైతం ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. దేశ యువజన జనాభా 80 కోట్ల వరకు ఉందని, నైపుణ్యాభివృద్ధి ద్వారా వీరందరికీ దేశ, విదేశాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. 10 మంది, అంతకు మించిన సంఖ్యలో కార్మికులతో నడుస్తున్న దుకాణాలు, వ్యాపార సంస్థలను ఏడాదిలో 365 రోజులూ రాత్రింబవళ్లు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ ‘షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని’ తీసుకొచ్చామన్నారు. భద్రత, ఇతర సౌకర్యాలు కల్పించి రాత్రివేళల్లో మహిళలకు ఉపాధి కల్పించవచ్చని దత్తాత్రేయ చెప్పారు. ఈ చట్టాన్ని అమలు చేయాలా? వద్దా? అనేది దుకాణాలు, వ్యాపార సంస్థల ఇష్టమన్నారు. ఈ చట్టంతో విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. -
ఇంధన సామర్థ్యంపై ‘బ్రిక్స్’ చర్చలు
- విశాఖలో 2 రోజుల సదస్సు ప్రారంభం సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ ఇంధన సామర్థ్యసదస్సు సోమవారం విశాఖలో ప్రారంభమైంది. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రెండురోజుల సదస్సులో ‘బ్రిక్స్’ భాగస్వామ్య దేశాలైన భారత్తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు పాల్గొంటున్నాయి. ఇంధన రంగంలో ఈ దేశాలు సాధించిన ప్రగతి గురించి సమీక్షిస్తున్నారు. ఏపీలోని విశాఖలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్టు గురించి ఇంధనశాఖ అడిషనల్ సెక్రటరీ బి.పి.పాండే విదేశీ ప్రతినిధులకు వివరించారు. తమ దేశాలు అవలంబిస్తున్న విద్యుత్ సామర్థ్యం పెంపు-ఆదా విధానాలపై ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రిక్స్ దేశాల ప్రతి నిధులు చర్చించారు. రాత్రి 7 గంటలకు విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ దీపాలను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భారత్ నుంచి బి.పి.పాండేతో పాటు బిఈఈ సెక్రటరీ సంజయ్సేత్, ఈఈఎస్ఎల్ ఎండీ సౌరభ్ కుమార్ పాల్గొన్నారు. -
అంతర్జాతీయ స్థాయికి వరంగల్ 'నిట్' !
బ్రిక్ దేశాలతో ఒప్పందం విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి కొత్త పీహెచ్డీ కోర్సులకు అవకాశం హన్మకొండ (వరంగల్) : వరంగల్లోని నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) మరో సువర్ణ అవకాశాన్ని దక్కించుకుంది. ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా వంటి దేశాలకు చెందిన ప్రఖ్యాత వర్సిటీలతో నిట్కు ఒప్పందం కుదిరింది. ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమాఖ్య బ్రిక్ (బ్రెజిల్, రష్యా, ఇండియ, ైచైనా, దక్షిణాఫ్రికా)ల మధ్య విద్యా సంబంధమైన అంశాల్లో నెట్వర్క్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని గతేడాది నిర్ణయించగా, బ్రిక్ దేశాల నెట్వర్క్ యూనివర్సిటీలో నిట్ వరంగల్ చోటు దక్కింది. గత నెలలో రష్యాలో జరిగిన సమావేశంలో ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. బ్రిక్ నెట్వర్క్ వర్సిటీలో చోటు దక్కడం వల్ల నెట్వర్క్లో ఉన్న వర్సిటీల మధ్య కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంశాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. అంతేకాకుండా నిట్ వరంగల్ వర్సిటీకి చెందిన విద్యార్థులు బ్రిక్ నెట్వర్క్లో ఉన్న ఇతర వర్సిటీల్లో ఒక సెమిస్టర్ చదివేందుకు అర్హులు అవుతారు. ఇదే పద్ధతిలో బ్రిక్ సభ్యదేశాలకు చెందిన విద్యార్థులు నిట్ వరంగల్లో ఒక సెమిస్టర్ చదువుకోవచ్చు. విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా నెట్వర్క్లో ఉన్న ఇతర వర్సిటీలో బోధించవచ్చు. విదేశీ ప్రొఫెసర్లు నిట్ వర్సిటీలో ప్రత్యేక బోధన చేసేందుకు అనుమతి లభిస్తుంది. బ్రిక్ దేశాల ఆర్థిక ప్రగతికి ఆయా దేశాల్లోన్ని శాస్త్ర సాంకేతిక రంగాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. సరికొత్త ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలతో బ్రిక్ దేశాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన ప్రముఖ విద్యాసంస్థలకు మనదేశానికి చెందిన విద్యార్థులు, అధ్యాపకులను పంపడం వలన కొత్త విషయాలను స్వయంగా నేర్చుకునేందుకు వీలవుతుంది. కంప్యూటర్ సైన్స్తో పాటు పర్యావరణంలో మార్పు, నీటి వనరులు, కాలుష్య నియంత్రణ, ఆర్థికరంగం వంటి అంశాల్లోనూ కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించారు. ఈ అంశాల్లో పీహెచ్డీలతో పాటు షార్ట్టర్మ్, సర్టిఫికెట్ కోర్సులను నిట్ వరంగల్ విద్యార్థులు నెట్వర్క్ పరిధిలో విశ్వవిద్యాలయాల్లో చేయవచ్చు. నెట్వర్క్ పరిధిలో ఇతర దేశాల్లో కోర్సులు, సెమిస్టర్ చదివేందుకు ఎంపికైన విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సాయం లభిస్తుంది. -
ప్రపంచంలో 7వ అత్యంత విలువైన ‘నేషన్ బ్రాండ్’గా భారత్
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచపు 7వ అత్యంత విలువైన ‘నేషన్ బ్రాండ్’గా అవతరించింది. భారత్ బ్రాండ్ విలువ ఒకేసారి అత్యధికంగా 32 శాతం వృద్ధి చెంది 2.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక 19.7 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో అమెరికా ప్రపంచపు అత్యంత విలువైన నేషన్ బ్రాండ్గా అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో చైనా, జర్మనీ, యూకే, జపాన్, ఫ్రాన్స్ ఉన్నాయి. ఈ విషయాలు బ్రాండ్ ఫైనాన్స్ వార్షిక నివేదికలో వెల్లడయ్యాయి. చైనా బ్రాండ్ విలువ 1% తగ్గి 6.3 బిలియన్ డాలర్లుగా ఉంది. నేషన్ బ్రాండ్ విలువ ప్రతి దేశంలోని అన్ని బ్రాండ్ల ఐదేళ్ల భవిష్యత్ అమ్మకాల అంచనాలపై ఆధారపడి ఉంటుంది. భారత్కు ‘ఇన్క్రిడబుల్’ ఇండియా నినాదం బాగా అనుకూలించిందని, అలాగే జర్మనీకి ఫోక్స్వ్యాగన్ సం క్షోభం ప్రతికూలంగా పరిణమించిందని బ్రాండ్ ఫైనాన్స్ పేర్కొంది. వ్యాపారానుకూల వాతావరణంతో అమెరికా అత్యంత విలువైన నేషన్ బ్రాండ్గా కొనసాగుతోందని తెలిపింది. చైనా స్టాక్ మార్కెట్ పతనం, అర్థిక వృద్ధి మందగమనం వంటి అంశాలు అమెరికాకు అనుకూలించాయని పేర్కొంది. బ్రిక్స్ దేశాల్లో కేవలం భారత్ బ్రాండ్ విలువ మాత్రమే పెరిగినట్లు వెల్లడించింది. -
ఉగ్రవాదంపై నిష్పాక్షిక పోరు
బ్రిక్స్ సదస్సులో మోదీ పిలుపు * అంతర్జాతీయ నిబంధనలను కచ్చితంగా పాటించాలి * ఐరాస భద్రతమండలిలో సంస్కరణలు ఆవశ్యకం ఉఫా(రష్యా): స్వ, పర భేదం లేకుండా ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగించాలని బ్రిక్స్ దేశాలకు భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాద గ్రూపులు, వాటికి సాయమందిస్తున్న దేశాలు, ఉగ్రవాదం లక్ష్యంగా చేసుకున్న దేశాలపై ఎలాంటి భేదభావం చూపకూడదని హితవు చెప్పారు. బ్రిక్స్, ఐరాస భద్రతామండలితో పాటు ఇతర అంతర్జాతీయ వేదికలపైనా ఇదే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. అంతర్జాతీయ నియమ నిబంధనలను అన్ని దేశాలూ పాటించాలన్నారు. సామాజిక, ఆర్థికాభివృద్ధికి శాంతి, సుస్థిరతలు మూల స్తంభాలని పేర్కొన్నారు. రష్యాలోని ఉఫాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో గురువారం మోదీ ప్రసంగించారు. చైనా అధ్యక్షుడు పింగ్, బ్రెజిల్ అధ్యక్షురాలు రౌసెఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జుమాల సమక్షంలో ఉగ్రవాదంపై భారత వైఖరిని, ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన విధానాల్ని మోదీ వివరించారు. ముంబై దాడుల సూత్రధారి లఖ్వీని విడుదల చేసిన పాకిస్తాన్పై చర్య తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకున్న నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాక్పై చర్యకు అవసరమైన సమాచారం భారత్ ఇవ్వలేదంటూ ఐరాసలో భారత ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఐరాసలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ‘ఐరాస ఎలాంటి సామాజిక, ఆర్థిక సవాళ్లనైనా ఎదుర్కొనే స్థాయికి రావాలంటే ముందుగా, అతిత్వరగా భద్రతమండలిలో సంస్కరణలు రావాలి’ అన్నారు. అంతర్జాతీయంగా కీలక ఆర్థిక వ్యవస్థలైన బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు.. ఏకాభిప్రాయం, సహకారంతో సవాళ్లు ఎదుర్కోవాలన్నారు. బ్రిక్స్ బ్యాంక్ వచ్చే సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, తర్వాత విద్యుత్ ప్రాజెక్టులకు నిధులు అందిస్తుందని పుతిన్ తెలిపారు. బ్రిక్స్ డిక్లరేషన్.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రాజకీయ వ్యూహాలు, పక్షపాత ధోరణి ఉండకూడదని బ్రిక్స్ డిక్లరేషన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఉగ్రవాదంపై పోరులో పక్షపాత వైఖరి అవలంబిస్తున్న పాక్ను ఉద్దేశించే ఈ ప్రకటన అని, ఇది భారత్ సాధించిన విజయమని పరిశీలకులు భావిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరును అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి సమన్వయం చేయాలని ఆ డిక్లరేషన్లో విజ్ఞప్తి చేశారు. ఇస్లామిక్ స్టేట్ దురాగతాలను కూడా అందులో తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లపై బ్రిక్స్ సదస్సు చర్చించింది. నేడు మోదీ, షరీఫ్ల భేటీ.. బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సుల నేపథ్యంలో.. భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్లు నేడు(శుక్రవారం) ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కశ్మీర్పై పాక్ వ్యాఖ్యలు, బంగ్లాదేశ్లో మోదీ పాక్ వ్యతిరేక కామెంట్లతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చే చర్యలపై మోదీ, షరీఫ్లు చర్చించనున్నారు. అలాగే, ఉగ్రవాదం, ఇతర సీమాంతర కార్యక్రమాలపై షరీఫ్కు మోదీ తీవ్ర నిరసన తెలిపే అవకాశం ఉంది. బ్రిక్స్, ఎస్సీఓ సభ్య దేశాధినేతలకు గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన విందులో మోదీ, షరీఫ్లు ఎదురుపడ్డారు. నవ్వుతూ షేక్హ్యాండ్ ఇచ్చుకున్న దాయాది దేశాల ప్రధానులు కాసేపు ముచ్చటించుకున్నారు. రష్యాలో ఇరాన్ అధ్యక్షుడు రౌహనీతో మోదీ భేటీ అయ్యారు. సహకారానికి పది సూత్రాలు బ్రిక్స్ దేశాల మధ్య మరింత సహకారం సమన్వయం పెంపొందాలని మోదీ పిలుపునిచ్చారు. బ్రిక్స్ సదస్సులో ‘దస్ కదమ్: భవిష్యత్తుకు పది అడగులు’ పేరుతో పది సూత్రాలను ప్రతిపాదించారు. వీటిలో వాణిజ్య ప్రదర్శన, రైల్వే పరిశోధన కేంద్రం, ప్రధాన ఆడిట్ సంస్థల మధ్య సహకారం, బ్రిక్స్ క్రీడా మండలి తదితరాలు ఉన్నాయి. కాగా, ఏకపక్ష ఆంక్షలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలుగుతోందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను పరోక్షంగా విమర్శిస్తూ బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
బ్రిక్స్.. ప్రపంచ బ్యాంక్కు ప్రత్యామ్నాయం కాదు
బ్రిక్స్ అబ్జర్వర్ రీసెర్చ్ నిపుణులు విశ్వనాధన్ విశాఖపట్నం: బ్రిక్స్ దేశాలు ఏర్పాటుచేయనున్న బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)లకు ప్రత్యామ్నాయం కాదని, ఆదృష్టితో చూడకూడదని బ్రిక్స్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిపుణుడు, మాజీ రాయబారి హెచ్.హెచ్.ఎస్ విశ్వనాధన్ తెలిపారు. బ్రిక్స్ నూతన ఆర్ధిక అంతర్జాతీయ సదస్సును గీతం వర్సిటీలో సోమవారం నిర్వహించారు. ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, భారత్, ఛైనా, సౌత్ ఆఫ్రికా దేశాల (బ్రిక్స్ దేశాలు) నుంచి ప్రతినిధులు పాల్గొని ఆయా దేశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాణిజ్య సంబంధాల మెరుగు పడటానికి బ్రిక్స్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విశ్వనాధన్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల ప్రమేయం లేకుండా బ్రిక్స్ భవిష్యత్తులో ప్రపంచ ఆర్ధిక శక్తిగా ఎదగలేదన్నారు. భారత మాజీ రాయబారి అమిత్ గుప్తా మాట్లాడుతూ వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాలపై బ్రిక్స్ ప్రపంచంలో ఇతర దేశాలకు మార్గదర్శకం వహించాలన్నారు. దక్షిణాఫ్రికా హైకమిషన్ కార్యాలయం కార్యదర్శి శ్రీధరన్ ఎస్.పిళ్లై, చైనా రాయబారి కార్యాలయం డిప్యూటీ మినిస్టర్ కౌన్సిల ర్ జెన్ నియో మాట్లాడుతూ బ్రిక్స్ కూటమి టైజం, పైరసీ, ఆరోగ్య రంగం తదిర సామాజిక అంశాలపై దృష్టి సారించాలన్నారు. గీతం అధ్యక్షుడు ఎం.వి.వి.ఎస్ మూర్తి మాట్లాడుతూ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఎగుమతులు పెరిగే అవకాశం ఉందన్నారు.