chandra mohan
-
రేగళ్ల గుంపునకు తాగునీటి ట్యాంకర్
అశ్వారావుపేట: రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్యపై సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘గొంతెండుతోంది..’ శీర్షికన ప్రచురితౖ మెన కథనానికి అధికారులు స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం జీపీ పరిధి రేగళ్ల గుంపులో తాగునీటి సమస్య ‘ఊరంతటికీ చెలిమ నీరే ఆధారం’ శీర్షికన ఫొటో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ నివేదిక సమర్పించాలని దమ్మపేట ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్ను ఆదేశించారు. ఈమేరకు ఆయన అశ్వారావుపేట ఎంపీడీఓ శ్రీనివాస్తో మాట్లాడి బచ్చువారిగూడెం గ్రామపంచాయతీ నుంచి ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సూచించగా, మంగళవారం రేగళ్ల గుంపునకు ట్యాంకర్ పంపించారు. -
చంద్రమోహన్కు ఎన్నారైల ఘన నివాళులు
ప్రముఖ నటుడు,ఇటీవలె స్వర్గస్తులైన చంద్రమోహన్కి ఎన్నారైలు ఘన నివాళి అర్పించారు. వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాల మాధ్యమంగా శనివారం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, చంద్రమోహన్ కుటుంబసభ్యులు, వివిధ దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రమోహన్తో 21 సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు,చంద్రమోహన్ మేనల్లుడు, ప్రముఖ సినీ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, కళాతపస్వి కె. విశ్వనాథ్ తనయుడు కాశీనాధుని నాగేంద్ర సహా పలువురు చంద్రమోహన్తో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరితో పాటు అమెరికా నుంచి ప్రముఖ గాయని శారద ఆకునూరి, హైదరాబాదు నుంచి హాస్యబ్రహ్మ శంకర నారాయణ, ప్రముఖ రచయిత్రి కేవీ కృష్ణకుమారి,కువైట్ నుండి తెలుగు సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు సుధాకర్ కుదరవల్లి, సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య నుండి మల్లేష్, అనిల్ కడించర్ల, ఉమామహేశ్వరరావు, మలేషియా నుంచి సత్య దేవి మల్లుల తదితరులు పాల్గొని చంద్రమోహన్కు ఘన నివాళులు అర్పించారు. -
Chandra Mohan Santhapa Sabha: నటుడు చంద్రమోహన్ సంతాప సభలో భార్య, కుటుంబసభ్యులు (ఫొటోలు)
-
Chandra Mohan Last Rites: ప్రముఖ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు (ఫొటోలు)
-
పంజాగుట్టలోని శ్మశానవాటికలో జరగనున్న చంద్రమోహన్ అంత్యక్రియలు
-
ముగిసిన చంద్రమోహన్ అంత్యక్రియలు
సినీనటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్నగర్లోని ఆయన నివాసం నుంచి మొదలైన అంతిమయాత్ర పంజాగుట్ట స్మశానవాటిక వరకు కొనసాగింది. ఆయన అంతిమ సంస్కారాలు చంద్రమోహన్ తమ్ముడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ నిర్వహించారు. ఈ అంతిమయాత్రకు కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు చంద్రమోహన్కు కడసారి వీడ్కోలు పలికారు. నటులు వెంకటేశ్, రాజశేఖర్, జీవిత, నిర్మాత ఆదిశేషగిరిరావు, మాదాల రవి ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. చంద్రమోహన్ పార్థివదేహాన్ని ఫిలిం ఛాంబర్ దగ్గర ఉదయం కొద్దిసేపు ఉంచుతారని ప్రచారం జరిగింది. ఆ వార్తల్లో నిజం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పరిశ్రమలో చాలామంది ప్రముఖులు ఇప్పటికే చంద్రమోహన్ ఇంటికి వచ్చి నివాళులు అర్పించారని కుటుంబ సభ్యులు చెప్పారు. కాగా.. నవంబర్ 11న చంద్రమోహన్ హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. -
మెగాస్టార్ కంటే చంద్రమోహన్కు ఎక్కువ రెమ్యునరేషన్.. ఏ సినిమాలో అంటే?
ప్రముఖ నటుడు, సినీ ఆల్రౌండర్ చంద్రమోహన్ శుక్రవారం(నవంబర్ 11న) మరణించారు. ఆయన మరణంతో చిత్రపరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. ఎంతోమంది హీరోయిన్లకు కెరీర్ ఇచ్చిన ఈయన కెరీర్ తొలినాళ్లలో హీరోగా రాణించారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి విభిన్న రకాల పాత్రలు పోషించి వాటికి ప్రాణం పోశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్తోనే కాకుండా తర్వాతి జనరేషన్ అయిన చిరంజీవి, వెంకటేశ్, అల్లు అర్జున్, మహేశ్బాబు ఇలా అందరు స్టార్ హీరోలతోనూ నటించారు. అయితే ఓ సినిమాలో చిరంజీవి కంటే ఎక్కువ పారితోషికం అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'చిరంజీవి, నేను తొలిసారి 'ప్రాణం ఖరీదు' చిత్రంలో కలిసి నటించాం. అప్పుడు ఆయనకు ఐదు వేలు పారితోషికం ఇస్తే నాకు రూ.25 వేలు ఇచ్చారు. అప్పట్లో చిరు రఫ్గా ఉండేవారు. కానీ తనలో తపన, సిన్సియారిటీ ఉంది. చిరంజీవిని చూసి ఇండస్ట్రీలో ఒక మంచి డ్యాన్సర్ వచ్చారనుకున్నారంతా! చిరంజీవి విజయానికి ప్రధాన కారణం అల్లు అరవింద్. చిరంజీవి ఏ పాత్రలు చేయాలి? ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలి? వంటి చాలా విషయాలను ఆయన దగ్గరుండి చెప్తూ తన కెరీర్కు దిక్సూచిలా నిలబడ్డారు' అని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు. చదవండి: 900కుపైగా సినిమాల్లో నటన.. తొలి చిత్రానికే నంది అవార్డు ఇతరులకు ‘మాస్’.. శివాజీకి ‘క్లాస్’.. ఇదేం పద్దతి బాసూ..? -
ఎంజీఆర్ సోదరుడిగా మెప్పించిన చంద్రమోహన్
తమిళసినిమా: సినిమా ముద్దు బిడ్డలు చాలా తక్కువ మందే ఉంటారు. అందులో నటుడు చంద్రమోహన్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఎల్లలు దాటిన నటకులోత్తముడు ఈ చంద్రమోహనుడు. ఐదు దశాబ్దాలకు పైగా అలుపెరుగని నట దురంధరుడు. అందరికీ కావలసిన చంద్రమోహన్ నట జీవితం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చెన్నైనే. ఇక్కడే సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ నటుడిగా ఎదిగిన చంద్రమోహన్. ఆబాల గోపాలానికి ఇష్టుడిగా ముద్రపడ్డారు. అందుకే భాషా భేదం, పక్షపాతం చూడకుండా అన్ని భాషల వారి ఆదరణను పొందిన అతి కొద్దిమంది నటుల్లో ఆయన కూడా స్థానం సంపాదించుకున్నారు. చెన్నై రంగరాజపురంలోని యునైటెడ్ కాలనిలోని చంద్రమోహన్ నివాసం తెలియని చిత్ర ప్రముఖులు, సినీ ప్రియులు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన ఇంటి పక్కనే దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ నివాసం. వీరిద్దరి మధ్య సినిమాకు అతీతమైన అనుబంధం. చంద్రమోహన్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినీ ప్రేక్షకులకు సుపరిచితులే. ముఖ్యంగా తమిళంలో మక్కళ్ తిలకం ఎంజీఆర్తో కలిసి నటించిన ఘనత సాధించారు. నాన్ నమదే అనే సూపర్ హిట్ చిత్రంలో ఎంజీఆర్ కు తమ్ముడిగా చంద్రమోహన్ నటించి తమిళ ప్రేక్షకుల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచి పోయారు. ఆ చిత్రంలో ఎంజీఆర్తో కలిసి చంద్రమోహన్ నటించిన అన్బు మలర్ అనే పాట క్లాసిక్గా నిలించింది. మరో విషయం ఏమిటంటే ఇది తెలుగులో ఎన్టీఆర్, మురళీమోహన్, బాలకృష్ణ కలిసి నటించిన అన్నదమ్ముల అనుబంధం చిత్రానికి రీమేక్. ఇకపోతే చంద్రమోహన్ తమిళంలో కథానాయకుడిగా నటించిన చిత్రం నీయా. నటి శ్రీప్రియ కథానాయకిగా నటించి నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఏ తరహా పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే చంద్రమోహన్ నటుడిగా ఎప్పటికీ చిరంజీవే అంటే అతిశయోక్తి కాదు. -
ఉమ్మడి జిల్లాకు.. ఆత్మీయ 'చంద్రమోహను'డు!
సాక్షి, వరంగల్: కొంతకాలంగా గుండె సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు చంద్రమోహన్ శనివారం కన్నుమూశారు. అందరికీ ఆత్మీయుడైన చంద్రమోహన్కు ఉమ్మడి వరంగల్ జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. రంగస్థల కళాకారుడు, డిప్యూటీ డీఈఓ బూర విద్యాసాగర్గౌడ్ అధ్యక్షతన 1993లో వరంగల్ నటరాజ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి చంద్రమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ నాటిక ప్రదర్శనలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు నటులు రాళ్లపల్లి, పీజేశర్మ, సాయికుమార్, నటి కిన్నెర, వందేమాతరం శ్రీనివాస్ నటించారు. చంద్రమోహన్తో కలిసి భోజనం చేస్తున్న మైక్రో ఆర్టిస్ట్ అజయ్కుమార్ (ఫైల్) ఈ మేరకు రంగస్థల కళాకారుడు బూరవిద్యాసాగర్ గౌడ్, మైక్రోఆర్టిస్ట్ మట్టెవాడ అజయ్కుమార్, ఓరుగల్లు శారదానాట్యమండలి నిర్వాహకుడు జేఎన్ శర్మ, పద్యనాటక కళాకారుడు జూలూరు నాగరాజు, ఫ్రెండ్స్ కల్చరల్ సొసైటీ నిర్వాహకుడు బిటవరం శ్రీధరస్వామి, జేబీ కల్చరల్ సొసైటీ జడల శివ తదితరులు చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడు చంద్రమోహన్ అడుగు ఎత్తుంటే సినీ ఇండస్ట్రీని ఏలే వారని మహానటుడు ఎన్టీఆర్తో పాటు పలువురు సీనియర్ నటులు ప్రశంసించారని, చంద్రమోహన్కు నాటకాలంటే ప్రాణమని వరంగల్కు చెందిన కళాకారులు గుర్తు చేసుకున్నారు. -
చిన్నారి శ్రీదేవి నా ఒళ్లో నిద్రపోయింది.. గతంలో చంద్రమోహన్ పంచుకున్న విశేషాలు
చంద్రమోహన్ మరణంతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్న చంద్రమోహన్.. నేడు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అనారోగ్యంతో శనివారం (నవంబర్ 11) తుది శ్వాస విడిచారు. తన 55 ఏళ్ల సినీ కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లను స్టార్స్ని చేశారు.వారిలో దివంగత నటి, అందాల తార శ్రీదేవి కూడా ఉన్నారు. ఆమె గురించి గతంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు చంద్రమోహన్. శ్రీదేవి మరణించిన రోజు(2018) ‘సాక్షి’తో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ రోజు చంద్రమోహన్ శ్రీదేవి గురించి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే .. (ఇది 2018లో శ్రీదేశి మరణించిన రోజు చంద్రమోహన్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ) శ్రీదేవిగారికి తెలుగులో మీరు ఫస్ట్ హీరో. ‘పదహారేళ్ల వయసులో’ మీ ఇద్దరు జంటగా చేసినప్పటి జ్ఞాపకాలు పంచుకుంటారా? చంద్రమోహన్: ఆ సినిమాకి శ్రీదేవిని హీరోయిన్గా తీసుకుందామని అనుకున్నప్పుడు కొందరు నిర్మాతలు వ్యతిరేకించారు. కానీ కమల్హాసన్తో ఇదే సినిమాలో తమిళంలో బాగా చేసిందని రాఘవేంద్రరావుగారు కన్విన్స్ చేశారు. నాక్కూడా శ్రీదేవితో చేయడానికి అభ్యంతరం అనిపించలేదు. తననే కథానాయికగా తీసుకున్నాం. బ్రహ్మాండంగా నటించింది. హీరోయిన్గా అందనంత దూరం వెళ్లిపోయింది. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్గా మీతో ఒక సినిమా చేసినట్లున్నారు? అవును. ‘యశోద కృష్ణ’ సినిమాలో చిన్ని కృష్ణుడు పాత్ర చేసింది. ఆ సినిమాలో నేనేమో నారదుడి పాత్ర చేశాను. అప్పుడు శ్రీదేవికి ఏడెనిమిదేళ్లు ఉంటాయనుకుంటా. ఆ వయసులోనే చాలా క్రమశిక్షణగా ఉండేది. చాలా ముచ్చటేసేది. బిస్కెట్లు తింటూ కూర్చునేది. నా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తను ఆ తర్వాత మూడేళ్లకు నా పక్కన హీరోయిన్ (‘పదహారేళ్ల వయసులో)గా చేస్తుందని మాత్రం ఊహించలేదు. అయితే ‘యశోద కృష్ణ’ సినిమా చేస్తున్నప్పుడు తను పెద్ద స్థాయికి వెళుతుందనుకున్నాను. (చదవండి: నటుడు చంద్రమోహన్ మృతికి కారణాలివే!) బాలనటిగా ఆమె మీ సినిమాలో చేసినప్పుడు జరిగిన సంఘటనలేమైనా గుర్తు చేసుకుంటారా? ‘యశోద కృష్ణ’ చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి వేరే తమిళ సినిమా ఒప్పుకుంది. మర్నాడు మద్రాసు వెళ్లాలి. ట్రైన్ టికెట్స్ దొరకలేదు. అప్పట్లో మేం మద్రాసులో ఉండేవాళ్లం. నా షెడ్యూల్ కంప్లీట్ అయిపోవడంతో నా కారులో శ్రీదేవిని తీసుకు రావడానికి వీలు పడుతుందా? అని ఆమె అమ్మగారు అడగడంతో సరే అన్నాను. దాదాపు 14 గంటలు జర్నీ చేశాం. ఆ ప్రయాణంలో శ్రీదేవి నా ఒళ్లో నిద్రపోయింది. జాగ్రత్తగా వాళ్ల అమ్మకు అప్పజెప్పాను. (చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!) మీతో సినిమా చేయకముందు నుంచే శ్రీదేవిగారి కుటుంబంతో మీకు పరిచయం ఉందా? మద్రాసు టీ నగర్లో మావి పక్క పక్క ఇళ్లే. మా పిల్లలతో శ్రీదేవి ఆడుకునేది. వాళ్ల అమ్మగారికి కూతుర్ని పెద్ద హీరోయిన్ని చేయాలని ఉండేది. అమ్మ కలని కూతురు నెరవేర్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. హిందీలో చాలా బాగా సక్సెస్ అయిన మన తెలుగు పిల్ల అని మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. దివి నుంచి భువికి దిగి వచ్చిన సుందరి శ్రీదేవి. తనలా ఎవరూ ఉండరు. పుట్టరు. శ్రీదేవి శ్రీదేవే. మీ పక్కన ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా ఆ తర్వాత స్టార్ అవుతారనే సెంటిమెంట్ శ్రీదేవిగారి విషయంలో కూడా నిజమైంది కదా? అప్పట్లో ఆ సెంటిమెంట్ ఉండేది. ‘పదహారేళ్ల వయసులో’ సూపర్ డూపర్ హిట్టయి శ్రీదేవికి చాలా మంచి పేరొచ్చింది. అప్పుడు తన అమ్మగారు ‘చంద్రమోహన్గారి సినిమాతో హీరోయిన్గా మా అమ్మాయి అరంగేట్రం అయింది. స్టార్ అయిపోయింది’ అనేవారు.జయప్రద, జయసుధ.. ఇలా చాలామంది హీరోయిన్లకు ఆ సెంటిమెంట్ని ఆపాదించారు. ‘నాదేం లేదు.. అంతా మీ స్వయంకృషి’ అనేవాణ్ణి. విశేషం ఏంటంటే... తన భర్త బోనీకపూర్కి నన్ను పరిచయం చేసినప్పుడు ‘నా ఫస్ట్ హీరో’ అని చెప్పింది. ఓసారి నా తెలుగు సినిమా షూటింగ్, అమితాబ్ బచ్చన్, శ్రీదేవి చేస్తున్న సినిమా షూటింగ్ పక్క పక్కనే జరిగాయి. అప్పుడు అమితాబ్కి ‘నా ఫస్ట్ హీరో. లక్కీ హీరో’ అని నన్ను పరిచయం చేసింది. ‘పదహారేళ్ల వయసులో’ తమిళ మాతృకలో కమల్హాసన్గారు చేశారు. ఎప్పుడైనా నటనపరంగా మీ ఇద్దరికీ శ్రీదేవిగారు పోలిక పెట్టారా? ఆ సినిమా విజయోత్స వేడుకలో నాకన్నా చంద్రమోహన్గారు బాగా చేశారు అని కమల్హాసన్ అన్నారు. ‘నేను తప్ప ఆ క్యారెక్టర్ని వేరే ఎవరూ బాగా చేయలేరనుకున్నా. ఆ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుంటున్నా. చంద్రమోహన్గారు గొప్పగా నటించారు’ అని కమల్గారు అన్నారు. శ్రీదేవి కూడా ఆ మాటే అంది. వాస్తవానికి ‘స్వాతిముత్యం’ సినిమాలో నేనే చేయాల్సింది. ఆ సినిమాలో క్యారెక్టర్ కూడా ‘పదహారేళ్ల వయసు’ క్యారెక్టర్లానే ఉంటుంది. అయితే ఆ సినిమాని తమిళ్లో కూడా ప్లాన్ చేశారు. అక్కడ కమల్గారికి మార్కెట్ ఉంది కాబట్టి, బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఆయనతో చేయించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నటిగా శ్రీదేవిగారిలో ఉన్న మంచి లక్షణాల గురించి? నేను భానుమతిగారు, సావిత్రిగార్లతో సినిమాలు చేశాను. వాళ్లు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ విషయంలో కూడా రాజీపడేవారు కాదు. ఆ లక్షణాలను శ్రీదేవిలో చూశాను. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన అమ్మాయిలు ఆ తర్వాత శ్రీదేవి స్థాయిలో హీరోయిన్లుగా సక్సెస్ కాలేకపోయారు. శ్రీదేవి గొప్ప నటి. ఎన్టీఆర్, ఏయన్నార్, కమల్హాసన్, రజనీకాంత్.. ఇలా ఎవరి పక్కన చేసినా తన నటన ప్రత్యేకంగా ఉండేది. ఆడియన్స్ తననే చూసేంత గొప్పగా నటించేది. అందుకే అన్ని లాంగ్వేజెస్లో రాణించగలిగింది. చివరిసారిగా మీరు ఆమెను ఎప్పుడు కలిశారు? వైజాగ్లో జరిగిన టీయస్సార్ అవార్డు ఫంక్షన్లో కలిశాం. అప్పుడు సన్నిహితులెవరో ‘నీ ఫస్ట్ హీరోయిన్ వచ్చారు’ అంటే, ‘నా ఫస్ట్ హీరో వచ్చారు’ అని శ్రీదేవి నా దగ్గరకు నవ్వుతూ వచ్చింది. ఎంత స్టార్ అయినా తనలో ఎప్పుడూ నేను భేషజం చూడలేదు. నటిగా అందనంత దూరానికి వెళ్లింది. ఇప్పుడు కూడా అందనంత దూరానికి వెళ్లింది. క్షణాల్లో మిస్సయిసోయింది. అని చద్రమోహన్ ఎమోషనల్కు గురయ్యారు. -
కంటతడి పెట్టిస్తున్న చంద్రమోహన్ చివరి మాటలు!
ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతితో చిత్రపరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఉదయం(నవంబర్ 11న) కన్నుమూశారు. చంద్రమోహన్ చివరిసారిగా కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణించినప్పుడు మీడియా ముందుకు వచ్చారు. అవే చివరిమాటలు చంద్రమోహన్ పెదనాన్న కుమారుడే విశ్వనాథ్. ఈ దిగ్గజ దర్శకనటుడు ఈ ఏడాది ఫిబ్రవరి 2న మరణించారు. అన్నయ్య మరణం చంద్రమోహన్ను ఎంతగానో కుంగదీసింది. విశ్వనాథ్ పార్థివదేహం చూసి ఈయన తల్లడిల్లిపోయారు. చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చారు. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. 'కె.విశ్వనాథ్.. స్వయానా నా పెదనాన్న కొడుకు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా నా కజిన్. మా మధ్య సినిమా అనుబంధం కంటే కుటుంబ బాంధవ్యం ఎక్కువ ఉండేది. ఇండస్ట్రీలోని అందరికంటే కూడా నేను చాలా దగ్గరివాడిని. ఎప్పటికైనా అందరూ చనిపోవాల్సిందే. కానీ ఆయన తన జీవితంలో ఎన్నో గర్వకారణమైన సినిమాలు అందించారు. (చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!.) 25 ఏళ్ల పక్కపక్కనే ఉన్నాం.. విశ్వనాథ్ అన్నయ్య, నేను మద్రాసులో ఒకే చోట స్థలం కొనుక్కుని, ఇళ్లు కట్టుకుని పాతికేళ్లు పక్కపక్కనే ఉన్నాం. మా ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో గర్వకారణమైన సినిమాలు వచ్చాయి. ఆయన నన్ను అద్భుతమైన నటుడిగా చూపించారు. 1966లో విశ్వనాథ్ దర్శకుడిగా, ఎస్పీ బాలు గాయకుడిగా, నేను నటుడిగా పరిచయమయ్యాం. మా మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. మా కుటుంబాలకు ఆయన మరణం తీరని లోటు' అని ఎమోషనల్ అయ్యారు. కళాతపస్విని తలుచుకుంటూ చంద్రమోహన్ మాట్లాడిన మాటలే ఆయన చివరి మాటలుగా మిగిలిపోయాయి. ఆ సమయంలో అన్నయ్య గురించి చంద్రమోహన్ కంటతడి పెట్టుకున్న వీడియో చివరి వీడియోగా మిగిలిపోయింది. చదవండి: గతంలో చంద్రమోహన్కు బైపాస్ సర్జరీ.. ఉదయం సొమ్మసిల్లి పడిపోవడంతో.. చంద్రమోహన్ మృతి.. చిరంజీవి సహా టాలీవుడ్ సెలబ్రిటీల నివాళులు -
నటుడు చంద్రమోహన్ మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్
-
చంద్రమోహన్ భౌతికకాయానికి తారల కన్నీటి నివాళి (ఫోటోలు)
-
చంద్రమోహన్ దశాబ్దాల సినీ జీవితం.. ఆయనకిష్టమైన పాటలు ఇవే!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే సినీ దిగ్గజం నింగికెగిసింది. దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. తన కెరీర్లో హీరోగా, విలన్గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించిన తీరు తెలుగువారికి చిరకాలం గుర్తుండిపోతాయి. తన సినీ జీవితంలో దాదాపు 932 చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రంగుల రాట్నంతో మొదలైన ఆయన సనీ ప్రస్థానం.. గోపిచంద్ చిత్రం ఆక్సిజన్తో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. అలా ఆయన నటించిన చిత్రాలపై గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన సినిమాల్లో ఆయనకు ఇష్టమైన టాప్ హిట్ సాంగ్స్ గురించి వివరాలు పంచుకున్నారు. అవేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్, చివరి దశలో సింపుల్గా..) చంద్రమోహన్కు ఇష్టమైన 30 పాటలు. ఝుమ్మంది నాదం – సిరి సిరి మువ్వ మావిచిగురు తినగానే – సీతామాలక్ష్మి మేడంటే మేడా కాదు – సుఖ దుఃఖాలు కలనైనా క్షణమైనా – రాధా కళ్యాణం మల్లెకన్న తెల్లన – ఓ సీత కథ లేత చలిగాలులు– మూడు ముళ్లు దాసోహం దాసోహం – పెళ్లి చూపులు సామజవరాగమనా – శంకరాభరణం ఈ తరుణము – ఇంటింటి రామాయణం ఇది నా జీవితాలాపన – సువర్ణ సుందరి పంట చేలో పాలకంకి – 16 ఏళ్ల వయసు నాగమల్లివో తీగమల్లివో – నాగమల్లి పక్కింటి అమ్మాయి పరువాల – పక్కింటి అమ్మాయి కంచికి పోతావ కృష్ణమ్మా – శుభోదయం ఏమంటుంది ఈ గాలి – మేము మనుషులమే బాబా... సాయిబాబా – షిర్డీసాయి బాబా మహత్యం నీ పల్లె వ్రేపల్లె గా – అమ్మాయి మనసు చిలిపి నవ్వుల నిన్ను – ఆత్మీయులు నీలి మేఘమా జాలి – అమ్మాయిల శపధం వెన్నెల రేయి చందమామా – రంగుల రాట్నం అటు గంటల మోతల – బాంధవ్యాలు ఏదో ఏదో ఎంతో చెప్పాలని – సూర్యచంద్రులు ఏది కోరినదేదీ – రారా కృష్ణయ్య ఏ గాజుల సవ్వడి – స్త్రీ గౌరవం ఏమని పిలవాలి – భువనేశ్వరి మిడిసిపడే దీపాలివి– ఆస్తులు– అంతస్తులు పాలరాతి బొమ్మకు– అమ్మాయి పెళ్లి ఐ లవ్ యు సుజాత– గోపాల్ రావ్ గారి అమ్మాయి నీ తీయని పెదవులు– కాంచనగంగ నీ చూపులు గారడీ– అమాయకురాలు (ఇది చదవండి: నటుడు చంద్రమోహన్ మృతికి కారణాలివే!) వ్యక్తిగత జీవితం.. చంద్రమోహన్ భార్య జలంధర మంచి రచయిత్రి అని అందరికీ తెలిసిందే. వీరికి ఇద్దరమ్మాయిలు సంతాన కాగా.. వారికి పెళ్లిళ్లయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్ట్. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మాసిస్ట్ కాగా అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే కావడంతో వీరంతా చెన్నైలో ఉంటున్నారు. -
శోభన్బాబు ఇంట్లోకి రానిచ్చాడా? చంద్రమోహన్ పంచ్లకు లెక్కేలేదు!
చంద్రమోహన్ విలక్షణ నటుడే కాదు ఆయన మాటల్లో హాస్యం తళుక్కుమంటుంటుంది... పంచ్లు కూడా పడుతుంటాయి. కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ 'రంగుల రాట్నం’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. హీరోగా, కమెడీయన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 900లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన నేడు(నవంబర్ 11న) ఉదయం కన్నుమూశారు. ఆయనను కలుసుకున్న అదృష్ణవంతుణ్ని చంద్రమోహన్ను ఓసారి కలుసుకున్న అదృష్ణవంతుణ్ని నేను. జర్నలిజం స్కూల్లో కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు సినీ జర్నలిజం విద్యార్థుల్ని చెన్నైకి తీసుకెళ్ళాను. అప్పుడు కలిసిన చాలా మంది సినిమా ప్రముఖుల్లో చంద్రమోహన్ ఒకరు. ఆయన వద్దకు వెళ్ళే సరికి సాయంత్రం అయ్యింది. అంతకు ముందే హీరో శోభన్ బాబుగారితో మట్లాడి వచ్చాము. మమ్మల్ని చూడగానే సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. సినీ జర్నలిజం విద్యార్థులని పరిచయం చేశాను. ఇంట్లోకి రానిచ్చాడా, గేటు వద్దే పంపించేశాడా? చంద్రమోహన్ గారు నవ్వుతూ... వెరీ గుడ్... మున్ముందు మీరడిగే చాలా ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాల్సి ఉంటుందేమో అంటూనే ఒకమాట గుర్తుంచుకోండి. కవరేజీ ఎలా చేశామనే అలోచించండి. ఎందుకంటే చాలామంది మీ వాళ్ళు కవరేజీ కన్న కవర్లేజీ పైనే మక్కువ ఎక్కువ చూపిస్తుంటారు అని ఓ పంచ్ వేశారు. హీరో శోభన్ బాబుగారిని కలిసి వచ్చామని చెప్పగానే.. ఆహా అలాగా... ఇంట్లోకి రానిచ్చాడా, గేటు వద్దే పంపించేశాడా? తనకు ఇవన్నీ ఇష్టముండవు అంటూ చెణుకు విసిరారు. (చదవండి: వంద కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్.. ఒకటో తారీఖు వస్తే చాలు..) నక్క తోక తొక్కారు, లేదంటే.. లేదు సార్ గంటపైగా మాట్లాడారు అని అనగానే అయితే కచ్చితంగా మీరేదో నక్కతోక తొక్కే వచ్చి ఉంటారు. సినిమాకు సంబంధించి ఏ విషయం ఇంట్లో ఆయన మాట్లాడరు. సినిమా వాళ్ళను లోపలికి కూడా రానీయరు. అంతెందుకు... సినిమా పత్రికలు కూడా గేటు దాటే వీల్లేదని చెబుతూనే.. అందుకే చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు అంటూ మరో పంచ్ వేశారు. తనతో ఉన్న గంటసేపు చాలా కబుర్లు చెప్పారు. తమ సినీ జీవన ప్రస్థానం తెలిపారు. ఇప్పటికీ చంద్రమోహన్ అన్న కవరేజా...కవర్లేజా అన్నమాట నాకు గుర్తొస్తునే ఉంటుంది. స్వయంగా ఏఎన్నార్ ఆ మాటన్నారు చంద్రమోహన్ లక్కీ స్టార్ అవునో కాదో తెలీదు కానీ, ఆయనతో నటించిన చాలా మంది హీరోయిన్లు లక్కీస్టార్లుగా ఎదిగిపోయారు. జయసుధ, శ్రీదేవి, రాధికా తదితరుల్ని ఈ జాబితాలో చెప్పవచ్చు. చంద్రమోహన్ మరో అంగుళం పొడుగ్గా ఉంటే మమ్మల్ని తొక్కేసి హీరోగా వెళ్ళిపోయేవాడు.. ఈ మాట సాక్షాత్తు అక్కినేని నాగేశ్వరరావే అన్నారంటే ఆయనెంత విలక్షణ నటుడో తెలుస్తుంది. నవరసాలు అవలీలగా పండించే అలాంటి హీరోతో కాసేపు మాట్లాడానన్న తృప్తి అయితే ఉంది. ఎందుకో ఇవాళ...ఆ హీరో మరో లోకానికి వెళ్ళారనగానే ఆ సందర్భం గుర్తొచ్చింది. - రామదుర్గం మధుసూదన రావు చదవండి: గతంలో చంద్రమోహన్కు బైపాస్ సర్జరీ.. ఉదయం సొమ్మసిల్లి పడిపోవడంతో.. -
'ఎన్టీఆర్ సినిమాతో చంద్రమోహన్కు చేదు అనుభవం'.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ మరో సినీ దిగ్గజం, కళామతల్లి ముద్దుబిడ్డ చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విభిన్నమైన పాత్రలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. (ఇది చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!) దాదాపుగా 55 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. దశాబ్దాల పాటు కెరీర్ కొనసాగించిన చంద్రమోహన్ అప్పటి స్టార్ హీరోయిన్లందరితో సినిమాలు చేశారు. అనారోగ్యంతో కన్నుమూసిన గతంలో పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన శోభన్ బాబు, నాగేశ్వరరావు, రామారావుతో తన అనుభవాలను పంచుకున్నారు. రామారావు చిత్రం సందర్భంగా ఆయనకెదురైన ఓ చేదు అనుభవాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. గత ఇంటర్వ్యూలో చంద్రమోహన్ మాట్లాడుతూ..'నాగేశ్వరరావు, నేను దాదాపు 40 సినిమాలు చేశాం. అయితే రామారావుతో నాకు ఎక్కువగా అవకాశాలు రాలేదు. కానీ ఓసారి ఎన్టీఆర్ సినిమా వల్ల చేదు అనుభవం ఎదుర్కొన్నా. అది ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేనిది. ఆ సమయంలో ఎన్టీఆర్కు తమ్ముడిగా మొదట నన్ను ఎంపిక చేశారు. కానీ ఏమైందో తెలియదు కానీ.. చివరికీ బాలయ్యను తీసుకున్నారు. ఆ క్షణం నేను చాలా బాధపడ్డా. కానీ.. ఆ తర్వాత అదే సినిమాను తమిళంలో రీమేక్ చేసినప్పుడు ఎంజీఆర్ తమ్ముడిగా చేసే అవకాశం నాకు లభించింది. ఎన్టీఆర్ సినిమా సెట్లో జరిగిన ఘటన వల్లే నాకు ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రం వల్లే నాకు తమిళంలో మంచి గుర్తింపు వచ్చింది.'అని అన్నారు. తన కెరీర్లో దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన చంద్రమోహన్.. చివరిసారిగా గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో కనిపించారు. కాగా.. అనారోగ్య కారణాలతో ఇవాళ మరణించారు. (ఇది చదవండి: రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్, చివరి దశలో సింపుల్గా..) -
చంద్రమోహన్ మృతి పట్ల సినీ ప్రముఖుల నివాళులు
-
'శోభన్ బాబుకు డబ్బులు ఇచ్చిన చంద్రమోహన్'.. ఎందుకంటే?
టాలీవుడ్లో మరో సినీ దిగ్గజం దివికేగిసింది. దాదాపు 55 ఏళ్ల పాటు కళామతల్లి ముద్దుబిడ్డగా, తనదైన నటనతో అభిమానులను మెప్పించిన నట దిగ్గజం చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విభిన్నమైన పాత్రలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. చివరిసారిగా 2017లో వచ్చిన గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో కనిపించారు. చంద్రమోహన్ హీరోగా నటించిన పదహారేళ్ల వయసు చిత్రం ద్వారానే అందాల నటి శ్రీదేవి అరంగేట్రం చేసింది. (ఇది చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు! ) దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన చంద్రమోహన్ ఇకలేరన్న విషయాన్ని తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద సమయంలో ఆయనకు ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్స్ గురించి ఆసక్తిక విషయాలు బయటకొస్తున్నాయి. గతంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్న విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత శంకరాభరణం లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. పదహారేళ్ల వయసు, సిరి సిరి మువ్వ సినిమాల్లో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు గెలిచారు. అప్పటి హీరోలైన శోభన్ బాబు, నాగేశ్వరరావుతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. అంతే కాకుండా శోభన్ బాబు, చంద్రమోహన్ మంచి స్నేహితులు కూడా. అలా వారి మధ్య బలమైన స్నేహబంధం వల్ల ఆర్థికంగా ఇద్దరు డబ్బులు అవసరమైతే ఒకరినొకరు సాయం చేసుకోవారమని గతంలో చంద్రమోహన్ ఓ ఇంటర్వూలో వెల్లడించారు. శోభన్ తన వద్దనే డబ్బులు తీసుకునేవాడని.. ఇది చూసి తనకు ఆశ్చర్యమేసేదని ఆయన తెలిపారు. (ఇది చదవండి: Chandra Mohan Death: విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత ) గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'శోభన్బాబు, నేను మంచి స్నేహితులం. నాకంటే ఆయనే చాలా ఆస్తిపరుడు. అయినా కూడా నన్ను డబ్బులు అడిగేవారు. ఇది చూసి మొదట నేను ఆశ్చర్యపోయేవాన్ని. ఆ తర్వాత నాకు ఓ విషయం చెప్పాడు. నా దగ్గర డబ్బులు తీసుకుంటే కలిసొస్తుందని శోభన్ బాబు నమ్మేవారు. అందుకే ఏదైనా ఆస్తి కొన్నప్పుడల్లా నా దగ్గరే డబ్బులు తీసుకునేవాడు. శోభన్ బాబు మరణం మనకు తీరని లోటు' అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. కాగా.. నాగేశ్వరరావుతో కలిసి దాదాపు 40 సినిమాల్లో నటించినట్లు తెలిపారు. -
నటుడు చంద్రమోహన్ మృతికి కారణాలివే!
ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హీరోగానే కాకుండా, అన్ని రకాల పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన ఆయన నేడు అందరికీ దూరంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతికి గల కారణాలను చంద్రమోహన్ బంధువు, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తాజాగా మీడియాకు వెల్లడించారు. కిడ్నీ సమస్య శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. 'చంద్రమోహన్గారు నాకు స్వయానా మేనమామ. ఆయన నాలుగేళ్ల నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కిడ్నీ సమస్య కూడా తలెత్తింది. ఈ రోజు ఉదయం సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు చనిపోయారని నిర్దారించారు. ఆయన కూతుర్లలో ఒకరు చెన్నై నుంచి, మరొకరు అమెరికా నుంచి రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత.. సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తాము' అని తెలిపారు. ఆరోగ్యం సహకరించికపోవడంతో రిటైర్మెంట్ కాగా చంద్రమోహన్ కెరీర్లో బిజీగా ఉన్న సమయంలో తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. నిర్విరామంగా పనిచేస్తూ తన ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసుకున్నారు. తాను ఉక్కు మనిషిని, తనకేం జరుగుతుందిలే అనుకున్నారు. ఆ నిర్లక్ష్యమే ఆయన్ను ఇబ్బందుల్లో పడేసింది. 2006లో రాఖీ సినిమా పూర్తయ్యాక చంద్రమోహన్కు బైపాస్ సర్జరీ జరిగింది. దువ్వాడ జగన్నాథమ్ సినిమా సమయంలోనూ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరగా గోపీచంద్ 'ఆక్సిజన్' మూవీలో నటించిన తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు! చంద్రమోహన్, కె విశ్వనాథ్, ఎస్పీ బాలు రిలేషన్ ఏంటో తెలుసా? -
చంద్రమోహన్ మరణం బాధాకరం.. చిరంజీవి, ఎన్టీఆర్ సంతాపం..
తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నటుడు చంద్రమోహన్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. ఆయన మరణవార్తతో చిత్రపరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. చంద్రమోహన్ మరణం పట్ల సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. అత్యద్భుతమైన నటన.. 'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనసులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథానాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరన్న వార్త ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన.. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశారు. 'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం 'ప్రాణం… pic.twitter.com/vLMw4gTXOs — Chiranjeevi Konidela (@KChiruTweets) November 11, 2023 (చదవండి: చంద్రమోహన్ మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి) చాలా బాధాకరం: జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో దశాబ్దాలుగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను. — Jr NTR (@tarak9999) November 11, 2023 అజాత శత్రువు.. స్థాయి ని బట్టి కాకుండా మనిషిని మనిషిగా ప్రేమించిన వ్యక్తి చంద్రమోహన్. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి హుందాగా ఉంటూ చిత్ర పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. చంద్రమోహన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. - పోసాని కృష్ణమురళి, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ ఇంటిదగ్గరే చంద్రమోహన్ భౌతిక కాయం గొప్ప నటుడు చంద్రమోహన్. ఆయన చనిపోవడం ఇండస్ట్రీకి బాధాకరం. ఆయన మృతి పట్ల మా అసోసియేషన్ విచారం వ్యక్తం చేస్తోంది. రేపు దీపావళి పండగ కావడంతో ఫిలిం ఛాంబర్లో చంద్రమోహన్ గారిని సందర్శనార్థం ఉంచడం లేదు. ఫిలింనగర్లోని ఇంటి వద్ద చంద్రమోహన్ భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచుతాం. ఇంటి వద్దకే ఆర్టిస్టులు రావాలని కోరుతున్నాం. సోమవారం అంత్యక్రియలు జరుగుతాయి. - మాదాల రవి, మా జనరల్ సెక్రటరీ పదహారేళ్ళ వయసు నుంచి మా స్నేహం మొదలైంది. నాకు మంచి మిత్రుడు, మంచి మనిషి అయినా చంద్ర మోహన్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.- దర్శకుడు కె రాఘవేంద్ర రావు His is a face that takes us down the memory lane & puts a smile on our faces every time with his memorable Acting & characters. May your soul rest in peace Chandra Mohan sir. Om Shanti 🙏🏼 pic.twitter.com/2IvyZjPSrv — Sai Dharam Tej (@IamSaiDharamTej) November 11, 2023 చదవండి: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. చంద్రమోహన్ కన్నుమూత -
చంద్రమోహన్ నటించిన చిత్రాలమాలిక (ఫొటోలు)
-
చంద్రమోహన్, కె విశ్వనాథ్కు రిలేషన్.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
తెలుగు సినిమారంగంలో కళాతపస్విగా గుర్తింపు తెచ్చుకున్న కె.విశ్వనాథ్ చేసిన సేవలు ఎనలేనివి. ఆయన చివరి శ్వాస వరకు కళామతల్లికి సేవలందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన కన్నుమూశారు. తాజాగా మరో సినీ దిగ్గజాన్ని టాలీవుడ్ కోల్పోయింది. దాదాపు 932 సినిమాల్లో నటించిన మరో కళామతల్లి ముద్దుబిడ్డ చంద్రమోహన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దీంతో ఓకే ఏడాదిలో రెండు సినీ దిగ్గజాలను కోల్పోవడాన్ని తెలుగు సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కె. విశ్వనాథ్, చంద్రమోహన్ మధ్య రిలేషన్ ఏంటి? అసలు వీరిద్దరికీ ఉన్న బంధుత్వమేంటి? అనే వివరాలు తెలుసుకుందాం. అదే విధంగా ఎస్పీబాలుకు, వీరిద్దరికి బంధుత్వం ఎలా వచ్చిందో చూద్దాం. (ఇది చదవండి: Chandra Mohan Death: విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత) కె విశ్వనాథ్కి, సీనియర్ నటుడు చంద్రమోహన్తోనూ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. శంకరాభరణం చిత్రానికి విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కించగా.. చంద్రమోహన్ కీలపాత్ర పోషించారు. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే సూపర్ హిట్గా నిలిచి..జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఎస్పీ బాల సుబ్రమణ్యం పాటలు పాడారు. అయితే కె విశ్వనాథ్ 1966లో ఆత్మ గౌరవం అనే చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినిమాకు పరిచయం కాగా.. అదే ఏడాది రంగులరాట్నం చిత్రంతో నటుడిగా చంద్రమోహన్ టాలీవుడ్కి పరిచయం అయ్యారు. (చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!) పెదనాన్న కుమారుడే విశ్వనాథ్! ఇదిలా ఉండగా మా పెదనాన్న కుమారుడే కె.విశ్వనాథ్ అని చంద్రమోహన్ చెప్పారు. తన అన్నయ్య విశ్వనాథ్ చనిపోయినప్పుడు పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. చంద్రమోహన్ పెదనాన్న రెండో భార్య కొడుకు కె.విశ్వనాథ్ కాగా.. చంద్రమోహన్ తల్లి, కె.విశ్వనాథ్ తండ్రి మొదటి భార్య అక్కా చెల్లెల్లు కావడంతో వీరద్దరు అన్నదమ్ములు అవుతారు. వీరిద్దరి కాంబినేషన్లో సిరిసిరిమువ్వ, సీతామహాలక్ష్మి, శంకరాభరణం, సీతకథ చిత్రాలు వచ్చాయి. నాలో ఉన్న ప్రతిభను బయటికి తీసి అద్భుతమైన నటుడిగా తీర్చిదిద్దింది ఆయనేనని చంద్రమోహన్ గతంలో వెల్లడించారు. గతంలో కె. విశ్వనాథ్ గురించి చంద్రమోహన్ మాట్లాడుతూ..'సినిమా బంధం కంటే మా ఇద్దరి మధ్య కుటుంబ బాంధవ్యమే ఎక్కువ. అందరికంటే నేను ఆయనకు చాలా దగ్గరివాడిని. మద్రాసులో ఉన్నప్పుడు ఒకేచోట స్థలం కొనుకున్నాం. పక్క పక్కనే ఇళ్లు కూడా కట్టుకుని 25 ఏళ్ల ఉన్నాం. అంతటి అనుబంధం మాది' అని అన్నారు. ఎస్పీ బాలుతోనూ బంధుత్వం సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యంతోనూ వీరిద్దరి బంధుత్వం ఉంది. చంద్రమోహన్ బావమరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. అలా వీరి మధ్య కూడా అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. ఇలా అనుకోకుండా ముగ్గురికి కుటుంబాల పరంగా మంచి అనుబంధం ఉంది. చివరికీ వరుసకు ముగ్గురు అన్నదమ్ములు కావడం మరో విశేషం. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన శంకరాభరణం సినిమా ఇండస్ట్రీలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్, చివరి దశలో సింపుల్గా..
హీరోగా మెప్పించారు.. కమెడియన్గా నవ్వించారు.. తండ్రిగా ఎమోషన్స్ పండించారు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయారు నటుడు చంద్రమోహన్. ఎమోషనల్ పాత్రల్లో తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించగల సమర్థుడు. ఆయన నేడు(నవంబర్ 11న) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి యావత్ తెలుగు ప్రేక్షకులను నిజంగానే ఏడిపించారు. 35 ఎకరాల ద్రాక్ష తోట 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఈ దిగ్గజ నటుడు వెయ్యి సినిమాల మార్క్ను చేరుకుంటాడనుకునే సమయంలో రిటైర్మెంట్ ప్రకటించారు. అనారోగ్యంతో కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్నారు. అయితే 900కు పైగా చిత్రాలు చేసినప్పటికీ తనకు పెద్దగా ఆస్తి లేదని, ఒకానొక సమయంలో ఉన్న ఆస్తినే కోల్పోయానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అందులో చంద్రమోహన్ ఏమన్నారంటే.. హైదరాబాద్లోని కోంపల్లిలో గొల్లపూడి మారుతీరావు ద్రాక్షతోట కొన్నారు. ఆయనను కూడా కొనమని చెప్పారు. సరేనంటూ.. చంద్రమోహన్ 35 ఎకరాల దాకా కొన్నారు. శోభన్బాబు వద్దన్నా వినలేదు కానీ తర్వాత దాన్ని చూసుకోవడం వీలుపడలేదు. అలాంటప్పుడు ఎందుకు దాన్ని అలాగే తన దగ్గర పెట్టుకోవడమని ఒక్క ఎకరం కూడా ఉంచుకోకుండా అంతా అమ్మేశారు. అంతేకాదు, ఉన్న భూమిని అమ్ముకోవద్దని శోభన్బాబు చెప్తున్నా వినకుండా చెన్నైలో 15 ఎకరాలు అమ్మేశారు. ఇప్పుడు దాని విలువ రూ.30 కోట్లపైనే ఉంది. అటు శంషాబాద్లో ప్రధాన రహదారి పక్కన ఆరెకరాలు కొన్నారు. కానీ చివరకు దాన్ని కూడా కాపాడుకోకుండా అదీ అమ్మేశారు. సంపాదించినవాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువ! ఇలా దాదాపు వందకోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నానని సదరు ఇంటర్వ్యూలో విచారం వ్యక్తం చేశారు. సంపాదించినవాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువని బాధపడ్డారు. చంద్రమోహన్ దగ్గర ఆస్తి నిలవలేదు కానీ, ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా బాగా కలిసొస్తుందంటారు చాలామంది. అందుకని కొత్త ఏడాది ప్రారంభంలో.. జనవరి ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు.. ఎంతోమంది ఆయన ఇంటికి వెళ్లి తన భర్త చేతుల మీదుగా డబ్బు తీసుకుంటారని చంద్రమోహన్ భార్య, రచయిత్రి జలంధర వెల్లడించింది. స్టార్ నటుడిగా జేజేలు అందుకున్న ఆయన తన చివరి రోజుల్లో సాదాసీదా జీవితం గడిపారు. చదవండి: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. చంద్రమోహన్ కన్నుమూత -
చంద్రమోహన్ మృతికి కారణాలు ఇవే !
-
హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!
క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ని ఆరంభించి.. హీరోగా పదుల సంఖ్యలో సినిమాలు తీసి మెప్పించిన సీనియర్ నటుడు చంద్రమోహన్. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్..ఇలా ఏ పాత్రలో అయినే ఒదిగిపోయే దిగ్గజ నటుడాయన. 55 ఏళ్ల తన సినీ కెరీర్ లో 932 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. (చదవండి: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత) ♦ఇప్పటి తరానికి చంద్రమోహన్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే తెలుసు కానీ.. ఒకప్పుడు ఆయన స్టార్ హీరో. ఆయనతో నటించడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపించేవారు. అతన్ని నిర్మాత హీరో అనేవాళ్లు. ఎందుకంటే ఆయన నటించిన చిత్రాల్లో ఎక్కువశాతం విజయవంతం అయినవే. అందుకే నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఇష్టపడేవారు. ఒకే ఏడాదిలో మూడు నాలుగు సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. ♦ చంద్రమోహన్పై ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఆయన్ను హీరోయిన్లకు లక్కీ హ్యాండ్ అనేవాళ్లు. ఎందుకంటే ఆయనతో కలిసి నటిస్తే చాలు.. ఆ హీరోయిన్ స్టార్ అయిపోతుంది. అందుకే చాలా మంది హీరోయిన్లు చంద్రమోహన్తో నటించేందుకు ఆసక్తి చూపించేవాళ్లు. ♦ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సిరి సిరిమువ్వలు’ చిత్రంలో చంద్రమోహన్ హీరో. జయప్రద హీరోయిన్. అప్పటి వరకు జయప్రదకు గుర్తింపు లేదు. కానీ ఆ చిత్రంలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ♦దివంగత నటి శ్రీదేవి తొలి హీరో కూడా చంద్రమోహన్గారు. ‘పదహారేళ్ల వయసు’చిత్రంలో వీరిద్దరు జంటగా నటించారు. ఆ చిత్రం తర్వాత శ్రీదేవి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇదీ చదవండి: ఎన్టీఆర్తో చేదు అనుభవం.. కానీ మంచే జరిగింది ♦ జయసుధకు కూడా చంద్రమోహన్ సినిమాతోనే స్టార్డమ్ వచ్చింది. 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు జయసుధకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి భళే కాపురం, స్వర్గం, శ్రీమతి ఒక బహుమతి తదితర చిత్రాల్లో నటించారు. ♦ లేడి మెగాస్టార్ విజయశాంతి సైతం...చంద్రమోహన్తో నటించిన తర్వాతే స్టార్గా ఎదిగింది. 1983లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో చంద్రమోహన్ విజయశాంతి కలిసి నటించారు. ఆ తర్వాత విజయశాంతికి వరుసగా అవకాశాలు లభించాయి. వీరిద్దరు కాంబోలో వచ్చిన ‘ప్రతి ఘటన’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇలా చాలామంది హీరోయిన్లను స్టార్స్ చేస్తూ..‘లక్కీ హ్యాండ్’గా పేరు సంపాదించుకున్నాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Chandra Mohan Photos: ప్రముఖ నటుడు చంద్రమోహన్ (ఫొటోలు)
-
టాలీవుడ్ సినీ దిగ్గజం చంద్రమోహన్ చివరి సినిమా ఇదే!
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. మరో సినీ దిగ్గజం నింగికెగిసింది. తన వైవిధ్యమైన నటనతో సినీ అభిమానులను అలరించిన సీనియర్ నటుడు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ సినీనటులు, అభిమానులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. 1966లొ రంగుల రాట్నంతో ఇండస్ట్రీకి పరిచయమైన చంద్రమోహన్.. దశాబ్దాల పాటు తన కెరీర్లో వందల చిత్రాల్లో నటించారు. హీరోగా, నటుడిగా, విభిన్నమైన పాత్రల్లో దాదాపు 900లకు పైగా సినిమాల్లో మెప్పించారు. అలనాటి స్టార్ హీరోయిన్స్, శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి వారితో సినిమాలు చేశారు. తన 55 ఏళ్ల సినీ కెరీర్లో చివరిసారిగా గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో చంద్రమోహన్ కనిపించారు. చంద్రమోహన్ తెలుగుతో పాటు తమిళంలో చాలా చిత్రాల్లో నటించారు. -
Chandra Mohan Death: విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. తరచూ డయాలసిస్ చేయించుకుంటున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్ 11న) తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లో సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ నేపథ్యం.. చంద్రశేఖర్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్కి దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు. (చదవండి: చంద్రమోహన్ మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి) సినిమా నేపథ్యం.. చంద్రమోహన్ 1966లో రంగుల రాట్నం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1987లో చందమామ రావే చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. పదహారేళ్ల వయసు సినిమాకుగానూ ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సీతామహాలక్ష్మి, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, చందమామ రావే, రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్లో దాదాపు 932 సినిమాలలో నటించారు. ఆ సినిమాలు తన కెరీర్లోనే స్పెషల్ సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినన్న చంద్రమోహన్ ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ప్రభుత్వోద్యోగానికి వెళ్లాలా? వద్దా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించారు. అంతిమంగా సినిమావైపే అడుగులు వేశారు. తన కెరీర్లో సిరిసిరిమువ్వ, శుభోదయం, సీతామహాలక్ష్మి, పదహారేళ్ల వయసు చిత్రాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్తూ ఉండేవారు. ఇదీ చదవండి: చంద్రమోహన్ మృతికి కారణాలివే! లక్కీ హీరోగా క్రెడిట్ ఒకప్పుడు హీరోయిన్లకు ఈయన లక్కీ హీరో. చంద్రమోహన్తో నటిస్తే సినిమా హిట్ అవ్వాల్సిందే. అలా కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి, జయసుధ, జయప్రద.. ఈయనతో కలిసి నటించి హిట్స్ అందుకున్నారు. చంద్రమోహన్- సుధ కాంబినేషన్ అయితే సూపర్హిట్ అయింది. ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించారు. ఈయన నటించిన చివరి చిత్రం ఆక్సిజన్. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Mahabubabad: రేఖా నాయక్ అల్డుడి ఆకస్మిక బదిలీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బదిలీ అయ్యారు. ఆయనను తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్ గుండేటిని నియమిస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆకస్మికంగా జరిగిన ఎస్పీ బదిలీపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించగా.. ఊహించని విధంగా బదిలీ కావడానికి ‘రేఖా నాయక్ ఎఫెక్ట్’ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ Ajmeera Rekha Nayak ఎస్పీకి స్వయాన బిడ్డను ఇచ్చిన అత్తగారు. ఈసారి ఆమెకు టికెట్ రాకపోగా, ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రేఖా నాయక్పై కోపంతో ఆమె అల్లుడిని ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ మారతానని ప్రకటించిన గంటల్లోనే ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం. -
కొత్త ఎస్పీ చంద్రమోహన్కి సవాలే..
మహబూబ్నగర్: జిల్లాలో ఎస్పీగా పని చేయడం కత్తిమీద సాములాంటింది. గుడుంబా, నల్ల బెల్లం, గంజాయి అక్ర మంగా రవాణా చేస్తున్నారు. దీనిని అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తే అర క్షణంలోనే నాయకుల నుంచి ఫోన్లు దీంతో ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు ఉంటుంది. అదేవిధంగా పీడీఎస్ బియ్యం, పేకాట క్లబ్లు కూడా పలువురు రాజకీయ నాయకుల అనుచరుల కనుసన్నల్లో సాగుతాయని ప్రచారం. వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వీటితో పాటు మహబూబాబాద్ పట్టణంలో భూముల ఆక్రమణ, భూముల పంచాయితీ తలనొప్పిగా ఉంటుంది. వీటిని ఎదుర్కోవడం నూతన ఎస్పీ చంద్రమోహన్ ముందున్న సవాళ్లు. -
చిన్న ఆర్టిస్టులను బతికించండి: కోటా శ్రీనివాసరావు
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తాజాగా హైదరాబాద్లో ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకను ఘనంగా నిర్వహించారు. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు, చంద్రమోహన్, ప్రభ, శివకృష్ణ, రోజా రమని, కవిత, తనికెళ్ల భరణి, బాబు మోహన్, కైకాల నాగేశ్వరరావు, బుర్రా సాయి మాధవ్, కొమ్మినేని వెంకటేశ్వరరావు, గుబ్బా సురేశ్ కుమార్ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డా. గారపాటి లోకేశ్వరి,నందమూరి మోహనకృష్ణ,నందమూరి చైతన్యకృష్ణ, గారపాటి శ్రీనివాస్,నందమూరి యశ్వంత్, రిటైర్డ్ ఐ జి మాగంటి కాంతారావు, అంబికా కృష్ణ,తుమ్మల ప్రసన్నకుమార్,అనంతపురం జగన్,‘మా’ ఈ సీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. సన్మానం అనంతరం కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘ఇవాళ్ల రేపు సినిమా అనేది లేదు.. అంతా సర్కస్. విషాదకర పాటకు కూడా డాన్స్లు వేస్తున్నారు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు కానీ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా? వాళ్లు ఏనాడూ తమ పారితోషికం గురించి బాహాటంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు హీరోలు రోజుకి 2కోట్లు, 6కోట్లు తీసుకుంటున్నాం అని పబ్లిక్ గా చెపుతున్నారు. ఇది మంచి పద్థతి కాదు. అప్పట్లో ఎన్టీఆర్ శ్రీదేవితో డాన్స్ చేస్తుంటే ఆయన వయసు గురించి ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు జనాలు తెరపై ఆ పాత్రలు మాత్రమే కనిపించాయి’’ అని అన్నారు. అలాగే ‘మా’ అసోసియేషన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ‘ఎంతమంది ఆర్టిస్ట్ రెండు పూట్ల కడుపునిండా అన్నం తింటున్నారో ఓసారి దృష్టిసారించండి అని మా అధ్యక్షుడు మంచు విష్ణుని కోరారు. పూర్తిగా తెలుగు ఆర్టిస్ట్లు, సాంకేతిక నిపుణులతో ‘పది కోట్లతో సినిమా తీస్తే.. డబ్బు ఇవ్వద్దు.. రాయితీలు ఇవ్వద్దు. ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ షూటింగ్ జరిగినా లొకేషన్ ఉచితంగా ఇస్తుంది అని ప్రకటించమని ప్రభుత్వానికి ఓ లెటర్ రాయండి’అని అన్నారు. ప్రస్తుతం చిన్న ఆర్టిస్టులు బతకలేకపోతున్నారు. ఏదో ప్రకటనలో నటిద్దాం అనుకుంటే.. బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ నుంచి బంగారం ప్రకటనల వరకు అన్నీ స్టార్ హీరోలే చేస్తున్నారు. ఇక చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడ ఉంది? దయచేసి ‘మా’ సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆర్టిస్ట్లను బతికించండి’అని కోటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.ఈవెంట్ ఆర్గనైజర్ మరియు మా ఈ సీ మెంబర్ విష్ణుబొప్పన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేశారు. -
వంద కోట్ల ఆస్తి పోగొట్టుకున్నాను: చంద్రమోహన్
సీనియర్ నటుడు చంద్రమోహన్ వెయ్యికి పైగా సినిమాల్లో నటించాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన నాలుగైదేళ్లుగా వెండితెరపై కనిపించడమే మానేశాడు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఇంటి దగ్గరే ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. చంద్రమోహన్ భార్య జలంధర ప్రముఖ రచయిత్రి. తాజాగా వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జలంధర మాట్లాడుతూ.. చంద్రమోహన్ చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా కలిసొస్తుందంటారు. జనవరి ఒకటో తారీఖుకు ఎంతోమంది వస్తుంటారు. అలా ఆయన చేత్తో నాకు డబ్బివ్వడం వల్ల నాకూ మంచి రచయిత్రిగా పేరొచ్చింది అని ఆమె చెప్పడంతో చంద్రమోహన్ ఎమోషనలై కళ్లు తుడుచుకున్నాడు. చంద్రమోహన్ తను సంపాదించి పోగొట్టుకున్న ఆస్తి గురించి చెప్తూ.. 'గొల్లపూడి మారుతీరావు కోంపల్లి దగ్గర ద్రాక్షతోట కొన్నారు. నన్నూ కొనమని చెప్పారు. నేనూ 35 ఎకరాల దాకా కొన్నాను. కానీ దాన్ని మేనేజ్ చేయలేక అన్నీ అమ్మేశాను. శోభన్ బాబు చెప్తున్నా వినకుండా మద్రాసులో 15 ఎకరాలు అమ్మాను, ఈరోజు దాని విలువ రూ.30 కోట్లు. శంషాబాద్ దగ్గర మెయిన్ రోడ్కు 6 ఎకరాలు కొన్నాను. అదీ అమ్మేశాను. ఇప్పుడక్కడ మంచి రిసార్టులు పెట్టారు. అలా దాదాపు రూ.100 కోట్లు దాకా పోగొట్టుకున్నాను. సంపాదించినవాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువ. జయసుధది కూడా అదే పరిస్థితి' అని చెప్పుకొచ్చాడు చదవండి: కాబోయే భర్తతో హన్సిక డ్యాన్స్, వీడియో వైరల్ -
కృష్ణలో ఏదో ఆకర్షణ శక్తి ఉండేది, అందుకే ఆయనతో..: చంద్రమోహన్
దివంగత నటులు, సూపర్ స్టార్ కృష్ణలో ఏదో ఆకర్షణ శక్తి ఉండేదంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీనియర్ నటులు చంద్రమోహన్. రీసెంట్గా ఓ చానల్తో ముచ్చటించిన ఆయన సూపర్ కృష్ణ గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను కృష్ణ ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. ఎవరికి వారు అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేవాళ్లం. మద్రాసులో నేను, రామ్మోహన్ ఒకే రూంలో ఉండేవాళ్లం. కృష్ణ సపరేట్గా ఉండేవాళ్లు. అప్పుడప్పుడు మా రూంకు ఆయన వస్తూ ఉండేవారు’ అని చెప్పారు. ‘‘కృష్ణ మొదటి నుంచి చాలా చురుగ్గా ఉండేవారు. ఆయన చాలా స్పీడ్. అనుకున్నది వెంటనే చేసేవారు. సినిమా చాన్స్ల కోసం ప్రయత్నిస్తూనే ఆయన నిర్మాతలతో టచ్లో ఉండేవారు. మా రూంకి వచ్చినప్పుడల్లా ‘ఫలానా సినిమాలో నన్ను తీసుకున్నారు. ఈ సినిమాకు నేను బుక్ అయ్యాను’ అని కృష్ణ చెబుతుంటే మేం ఆశ్చర్యపోయేవాళ్లం. ఒకసారి కృష్ణతో సినిమా చేసినవారు మళ్లీ ఆయనతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపేవారు. అంత ఆకర్షణ శక్తి కృష్ణలో ఉండేది’’ అంటూ చెప్పుకొచ్చారు. అప్పట్లో శోభన్ బాబు, రామకృష్ణ వంటి ఇతర హీరోలు ఉన్నప్పటికీ, కృష్ణతోనే తనకు ఎక్కువ అనుబంధం ఉండేదన్నారు. పెద్ద హీరో కావాలనీ.. ఫారిన్ కారు కొనడమే తన కల అని కృష్ణ అంటుంటే.. అంత తేలికైన విషయం కాదని తాను అంటుంటే వాడినన్నారు. కానీ చూస్తుండగానే ఆయన తాను అనుకున్నవి సాధిచారన్నారు. ఇక తాను పద్మాలయా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్లోనే దాదాపు 40 సినిమాలకు పైగా చేశానని, తానంటే కృష్ణ - విజయనిర్మలకు అంతటి అభిమానమంటూ చంద్రమోహన్ ఎమోషనయ్యారు. చదవండి: బిగ్బాస్ 6: ఆర్జీవీతో డాన్స్ వీడియోపై ఇనయా సుల్తానా ఏమందంటే.. యశోద మూవీ వివాదంపై స్పందించిన నిర్మాత -
ఆ వార్తలను నమ్మకండి : నటుడు చంద్రమోహన్
కథానాయకుడిగా ఇండస్ర్టీలోకి వచ్చి ఆ తర్వాత సహాయ నటుడిగా, హాస్య నటుడిగా ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించారు నటుడు చంద్రమోహన్. 55ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన ఆదివారం 81వ వసంతంలోకి అడుగుపెట్టారు. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..ఐదు దశాబ్దాల పాటు సినీ జీవితంలోనే ఉన్నాను. కేవలం హీరో పాత్రలు మాత్రమే చేయాలని కాకుండా, అన్ని రకాల పాత్రలను పోషించాను. ఈ క్రమంలో నిర్విరామంగా పనిచేస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. రాఖీ సినిమా షూటింగ్ అయిన వెంటనే బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. దువ్వాడ జగన్నాథమ్ సినిమా సమయంలో కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పుడు షూటింగ్ కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక నా వల్ల నిర్మాతలు ఇబ్బందిలో పడటం నాకిష్టం లేదు. అందుకే రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని పేర్కొన్నారు. అయితే ఆయన ఇక సినిమాలకు దూరం కావడంతో చంద్రమోహన్ ఆరోగ్యంపై పలు వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలను నమ్మవద్దని నటుడు చంద్రమోహన్ తెలిపారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇక 'మీ అభిమానానికి, ఆశీస్సులకు ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటా. అదే నాకు శ్రీరామ రక్ష' అని పేర్కొన్నారు. చదవండి : 'ప్రభుదేవాతో గొడవలు'..క్లారిటీ ఇచ్చిన నిర్మాత ఎంఎస్ రాజు Maha Samudram: గూని బాబ్జీగా రావు రమేశ్.. ఫస్ట్లుక్ వైరల్ -
ఇప్పుడు నాకు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు!
నాయకుడు.. ప్రతినాయకుడు... హాస్యనటుడు.. సహాయనటుడు... ఇలా నటుడిగా చంద్రమోహన్ గుర్తుండిపోయే పాత్రల్లో జీవించారు. ఐదున్నర దశాబ్దాల కెరీర్లో నాలుగు భాషల్లో, నాలుగు తరాల నటులతో సినిమాలు చేసిన ఘనత చంద్రమోహన్ది. హీరోగా 175 సినిమాలు చేశారు. కెరీర్ మొత్తంలో 932 సినిమాలు చేశారు. ఈ విలక్షణ నటుడి పుట్టినరోజు నేడు (మే 23). 80 ఏళ్లు పూర్తి చేసుకుని, 81లోకి అడుగుపెడుతున్న చంద్రమోహన్ చెప్పిన విశేషాలు. ► కెరీర్లో స్థిరపడటం, ఆర్థిక స్థిరత్వం.. కెరీర్ తొలినాళ్లల్లో వీటిపైనే నా దృష్టి. ఈ రెండూ నెరవేరాక నేను కావాలని కోరుకున్న దర్శకుల కోసం సినిమాలు చేశాను. ►వినోదం పండించడం చాలా కష్టం. కమెడియన్కి గుర్తింపు రావాలంటే డైలాగుల్లో పంచ్ ఉండాలి. ప్రేక్షకుల నాడి తెలుసుకుని నటించాలి. అలాగే మరో సవాల్ ఏంటంటే.. వ్యక్తిగతంగా ఎలాంటి మూడ్లో ఉన్నా అది కెమెరా ముందు కనిపించనివ్వకూడదు. మరో కష్టం ఏంటంటే.. చేసినట్లే చేస్తే స్టేల్ అయ్యే ప్రమాదం ఉంది. కొత్తగా ప్రయత్నించాల్సి ఉంటుంది. కష్టమైన హాస్య పాత్రలను కూడా నేను పండించడానికి కారణం నా ఫ్యామిలీ. మా నాన్న, అక్కయ్యలు, తమ్ముడు, నేను.. మాకు మేం నవ్వకుండా ఇతరులను నవ్వించే అలవాటు ఉంది. ►నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుని, ‘గంగ మంగ’, ‘లక్ష్మణ రేఖ’, ఇంకో సినిమాలో నెగటివ్ పాత్రలు చేశాను. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఆల్ రౌండర్ అనిపించుకోవాలని గ్రహించాక అన్ని రకాల పాత్రలు చేయడం మొదలుపెట్టాను. హీరోగానే అనుకుని ఉంటే సినిమాల్లో 50 ఏళ్లకు పైగా ఉండగలిగేవాడిని కాదు. ►ఓ 50 ఏళ్లు నిర్విరామంగా సినిమాలు చేసిన నేను ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. ఎవరైనా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకో అంటే, ‘ఇనుముకు చెదలు పడుతుందా?’ అనేవాణ్ణి. ఆ నిర్లక్ష్యమే నా ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసింది. ‘రాఖీ’లో ఎమోషనల్ సీన్ చేసి, బైపాస్ సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరాను. ‘దువ్వాడ జగన్నాథమ్’ అప్పుడు ఆరోగ్యం బాగాలేకపోవడంతో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. అందుకే రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నాను. అయితే టీవీలోనో, యూ ట్యూబ్లోనో నా సినిమాలు వస్తున్నాయి.æగతంలో కన్నా ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ కావడం ఆశ్చర్యంగా అనిపించినా ఆనందంగా ఉంది. ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తుంది. అయితే సినీజీవితం చాలా నేర్పించింది. పేరు, డబ్బు, బంధాలు శాశ్వతం కాదని నేర్పింది. నమ్మకద్రోహులకు దూరంగా ఉండాలని, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమని నేర్పింది. చెప్పుకోలేని చేదు నిజాల్ని ఎలా గుండెల్లో దాచుకోవాలో చెప్పింది. వృత్తి జీవితంలో ఎలాంటి లోటు లేదు. వ్యక్తిగత జీవితం కూడా అంతే. నా భార్య జలంధర మంచి రచయిత్రి అని అందరికీ తెలిసిందే. నాకు కోపం ఎక్కువ, ఆమెకు సహనం ఎక్కువ. దేవుడు ఆమెకు అంత సహనం ఇచ్చింది నా కోపాన్ని తగ్గించడానికేనేమో అనిపిస్తుంటుంది. మా ఇద్దరమ్మాయిలకు పెళ్లిళ్లయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్ట్. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మాసిస్ట్. అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. చెన్నైలో ఉంటున్నారు. చంద్రమోహన్ సినిమాల్లో ఆయనకు నచ్చిన 30 పాటలు. 1. ఝుమ్మంది నాదం – సిరి సిరి మువ్వ 2. మావిచిగురు తినగానే – సీతామాలక్ష్మి 3. మేడంటే మేడా కాదు – సుఖ దుఃఖాలు 4. కలనైనా క్షణమైనా – రాధా కళ్యాణం 5. మల్లెకన్న తెల్లన – ఓ సీత కథ 6. లేత చలిగాలులు– మూడు ముళ్లు 7. దాసోహం దాసోహం – పెళ్లి చూపులు 8. సామజవరాగమనా – శంకరాభరణం 9. ఈ తరుణము – ఇంటింటి రామాయణం 10. ఇది నా జీవితాలాపన – సువర్ణ సుందరి 11. పంట చేలో పాలకంకి – 16 ఏళ్ల వయసు 12. నాగమల్లివో తీగమల్లివో – నాగమల్లి 13. పక్కింటి అమ్మాయి పరువాల – పక్కింటి అమ్మాయి 14. కంచికి పోతావ కృష్ణమ్మా – శుభోదయం 15. ఏమంటుంది ఈ గాలి – మేము మనుషులమే 16. బాబా... సాయిబాబా – షిర్డీసాయి బాబా మహత్యం 17. నీ పల్లె వ్రేపల్లె గా – అమ్మాయి మనసు 18. చిలిపి నవ్వుల నిన్ను – ఆత్మీయులు 19. నీలి మేఘమా జాలి – అమ్మాయిల శపధం 20. వెన్నెల రేయి చందమామా – రంగుల రాట్నం 21. అటు గంటల మోతల – బాంధవ్యాలు 22. ఏదో ఏదో ఎంతో చెప్పాలని – సూర్యచంద్రులు 23. ఏది కోరినదేదీ – రారా కృష్ణయ్య 24. ఏ గాజుల సవ్వడి – స్త్రీ గౌరవం 25. ఏమని పిలవాలి – భువనేశ్వరి 26. మిడిసిపడే దీపాలివి– ఆస్తులు– అంతస్తులు 27. పాలరాతి బొమ్మకు– అమ్మాయి పెళ్లి 28. ఐ లవ్ యు సుజాత– గోపాల్ రావ్ గారి అమ్మాయి 29. నీ తీయని పెదవులు– కాంచనగంగ 30. నీ చూపులు గారడీ– అమాయకురాలు. -
శిక్షణలో స్నేహం, వివాహం..
నర్సంపేట: చిన్నప్పటి నుంచే పోలీస్ కావాలనే బలమైన కాంక్ష ఉండేది. మా కుటుంబంలో ఎవరూ పోలీసు అధికారులు లేరు. తల్లిదండ్రుల సూచనతో బీటెక్ పూర్తి చేశా. 2012 లో గ్రూప్–1కు ఎంపికై పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించా. కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేస్తూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నానని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్ అన్నారు. మంగళవారం ఆమె ‘సాక్షి’ ఇంటర్వూ్యలో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నాన్న కోరిక మేరకు.. మాది హైదరాబాద్. తల్లిదండ్రులు వరలక్ష్మి–సోమశేఖర్. మేము నలుగురం సంతానం. అక్క, అన్న, చెల్లెలు కూడా ఉన్నత చదువులు చదివారు. నాన్న సోమశేఖర్ కోరిక మేరకు నేను గ్రూప్–1కు ఎంపికయ్యా. 2012లో నాకు మొదటి పోస్టింగ్ నల్లగొండ సీసీఎస్లో ఇచ్చారు. రెండో పోస్టింగ్ సూర్యాపేట డీఎస్పీగా పనిచేసిన రోజులు మరువలేనివి. మూడో పోస్టింగ్ నర్సంపేట ఏసీపీగా వచ్చా. భర్త చంద్రమోహన్తో ఏసీపీ సునీతామోహన్ శిక్షణలో స్నేహం, వివాహం.. గ్రూప్–1కు ఎంపికైన తర్వాత శిక్షణ సమయంలో మా బ్యాచ్కు చెందిన ఆదిలాబాద్ జిల్లా వాసి చంద్రమోహన్తో స్నేహం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారి వివాహం వరకు వెళ్లింది. మా ఇద్దరి అభిప్రాయాలను తల్లిదండ్రులు అంగీకరించారు. 2013 డిసెంబర్ 27న వివాహం చేసుకున్నం. చంద్రమోహన్ ప్రస్తుతం కరీంగనర్ ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. చాలెంజ్గా తీసుకుంటా.. విద్యా, ఉద్యోగాల్లో మహిళలు కూడా రాణించడం సంతోషకరం. పోలీస్ శాఖలో మహిళలు రాణించాలంటే ప్రత్యేక ప్రణాళికలు అవసరం. ఉన్నతాధికారుల సహకారంతో ముందుకు వెళ్తా. ఒత్తిడికి గురికాకుండా పోలీస్ ఉద్యోగాన్ని చాలెంజ్గా తీసుకుంటా. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా కఠిన చర్యలు తీసుకుంటా. యువత లక్ష్యాన్ని ఎంచుకోవాలి.. ఇది వరకు ఏదైనా రంగంలో పనిచేసిన వారు ఆదర్శనీయులుగా ఉండడం సహజమే. ఏ రంగంలో లేని వారు కూడా మంచి పనులు చేస్తూ గుర్తింపు పొంది ఆదర్శవంతంగా ఉంటారు. యువత ప్రత్యేక లక్ష్యాన్ని ఎంచుకుని తల్లిదండ్రుల ఆశయలను నెరవేర్చాలి. ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలి. చెడు మార్గంలో పయనించి సమాజానికి చేటును తెచ్చే వారు తల్లిదండ్రులను కూడా ఇబ్బందిపెట్టిన వారు అవుతారు.. -
వెండితెరపై బుల్లితెర వెన్నెల
+‘వెన్నెల’ పోగ్రామ్తో బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన జయతి ఇప్పుడు వెండితెరపైనా మెరవనున్నారు. ఆమె తొలిసారి హీరోయిన్గా నటిస్తూ, నిర్మించిన ‘లచ్చి’ సిన్మాలోని తొలి పాటను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈశ్వర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సురేష్ యువన్, పాల్ పవన్ స్వరకర్తలు. ‘‘పలు టీవీ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేసిన అనుభవంతో ఫస్ట్ టైమ్ సినిమా నిర్మించా. లచ్చి పాత్ర చుట్టూనే కథంతా తిరుగుతుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. నవంబర్ మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు జయతి. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు వి.ఎన్.ఆదిత్య, నటుడు కృష్ణుడు పాల్గొన్నారు. తేజశ్విని, చంద్రమెహన్, రఘుబాబు, తాగుబోతు రమేష్, ధనరాజ్ నటించిన ఈ సినిమాకి మాటలు: మరుదూరి రాజా. -
ఎస్కేయూ క్రికెట్ జట్టు మేనేజర్గా చంద్రమోహన్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ నెల 3 నుంచి జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ క్రికెట్ పోటీల్లో పాల్గొనే ఎస్కే యూనివర్శిటీ జట్టుకు మేనేజర్గా నగరంలోని ఎస్ఎస్బీఎన్ పీడీ చంద్రమోహన్ ఎంపికయ్యారు. ఎస్కేయూ జట్టు ఈ నెల 3 నుంచి 11 వరకు తమిళనాడు రాష్ట్రంలో జరిగే క్రికెట్ టోర్నీలో పాల్గొననుంది. తనను మేనేజర్గా నియమించినందుకు ఎస్కేయూ వీసీ, రిజిస్ట్రార్, స్పోర్ట్స్ కార్యదర్శి జెస్సీ, తన కళాశాల యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
బక్రీద్ వ్యర్థాల కోసం కవర్ల పంపిణీ
బక్రీద్ పండుగ సందర్భంగా తయారయ్యే వ్యర్థాలను ప్లాస్టిక్ కవర్లలో మాత్రమే పడేయాలని చాంద్రాయణగుట్ట ఎస్సై చంద్రమోహన్ అన్నారు. స్టేషన్ పరిధిలోని అల్ జుబేల్ కాలనీలో స్థానిక నాయకులతో కలిసి సోమవారం ఆయన ప్లాస్టిక్ కవర్లను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ నిర్వహించే వ్యర్థాలను రోడ్లపై పడేస్తే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాము అందజేసే కవర్లలో వ్యర్థాలను పడేసి చెత్త కుండీలలో, లేకుండే జీహెచ్ఎంసీ వాహనాలలో పడేయాలని ఆయన సూచించారు. తమ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన వచ్చిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. -
వరంగల్ డిఇఓ సస్పెండ్
-
తెలంగాణ విద్యాశాఖలో కలకలం
వరంగల్: ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడ్డాడంటూ వరంగల్ డీఈవో చంద్రమోహన్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా చంద్రమోహన్ వరంగల్ జిల్లా విడిచి వెళ్లకూడదంటూ ఆదేశించింది. జిల్లాకు చెందిన ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన కడియం శ్రీహరికి విషయం తెలిసే ఉంటుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఉపాధ్యాయుల బదిలీల్లో ఇవన్నీ సర్వ సాధారణం అనే వాదనలూ అధికారుల నుంచి వినిపిస్తున్నాయి. -
రైతు నేస్తం
మన దేశంలో హైబ్రీడ్ వరి సాగు చేస్తే పుప్పొడిని దులపడానికి కూలీలను పెట్టాల్సిందే... ఇది ఖర్చుతో కూడుకున్నది.. పట్టే సమయమూ ఎక్కువే.. అదే చైనాలో హైబ్రీడ్ వరిలో ఆడ, మగ మొక్కల పరపరాగ సంపర్కం కోసం హెలికాప్టర్లను వాడుతుంటారు. చిత్రంలో చూపినట్లు చిన్నపాటి హెలికాప్టర్ వాడి 2 నిమిషాల్లో ఎకరం పూతను దులుపుతారు. కేవలం 200-300 ఖర్చుతో మగ మొక్కల పూతను, ఆడ మొక్కల పూతపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా దులపవచ్చు. అంతేకాదు పంటపై క్రిమిసంహారక మందులను హెలికాప్టర్ ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో చల్లుతారని చైనాలో పర్యటించి వచ్చిన వరి శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్ చెబుతున్నారు. - సాక్షి, జగిత్యాల -
చంద్రమోహన్కు గుండెపోటు
-
చంద్రమోహన్కు గుండెపోటు
ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్కు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కోలుకుంటే గురువారం రాత్రికే ఆయనను డిశ్చార్జి చేసి ఇంటికి పంపే అవకాశం ఉంది. ఆయనను వైద్యబృందం నిశితంగా పరిశీలిస్తోంది. ఆయన శరీరం చికిత్సకు సహకరించిన తీరును బట్టే ఏమైనా చెప్పగలమని వైద్యులు అంటున్నారు. డాక్టర్ మనోజ్ అగర్వాల్ బృందం చంద్రమోహన్ను పరీక్షిస్తోంది. సమయానికి ఆయనను తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్చడంతో వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స చేస్తున్నామన్నారు. ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నా, నిలకడగా ఉందని చెబుతున్నారు. పూర్తిస్థాయి సమాచారం అందించేదుకు మాత్రం వైద్యులు నిరాకరిస్తున్నారు. -
నల్లమలలో నాటు బాంబులు!
దేవరకొండ: నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లి గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు దాచి ఉంచిన 59 నాటు బాంబులను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం... మోద్గులబొంద సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు బండరాళ్ల సందులో ప్లాస్టిక్ బకెట్లలో దాచి ఉంచిన ఈ బాంబుల సమాచారం తమకు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిందన్నారు. దీంతో ఐడీ పార్టీ, స్పెషల్ పార్టీలతో వెళ్లి బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పొటాషియం, గంధకం, డిటోనేటర్లతో తయారు చేసిన ఈ బాంబులు ప్రమాదకరమైనవని, వీటిని ఎక్కువగా ఫ్యాక్షన్ సంస్కృతి ఉన్న ప్రాంతాల్లో ఉపయోగిస్తారని, వీటిని పోలీస్ పరిభాషలో డర్టీ బాంబులుగా అభివర్ణిస్తారని తెలిపారు. వీటిని గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి తరలించి ఉండొచ్చన్నారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ వెంకటయ్య, చందంపేట ఎస్ఐ నాగభూషణ్రావు, ఈ రెండు బృందాల పోలీసులు వెంకట్రెడ్డి, విజయ్శేఖర్, రాంప్రసాద్లను డీఎస్పీ అభినందించారు. -
ఇద్దరూ.. ఇద్దరే..
విద్యారణ్యపురి : వివాదాలు.. వినూత్న కార్యక్రమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచిన జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్కుమార్ ఎట్టకేలకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో మహబూబ్నగర్ డీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రమోహన్ను నియమిస్తూ ప్రభుత్వం ఎట్టకేలకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా వస్తున్న డీఈఓపైనా వివాదాస్పద ముద్ర ఇదివరకే ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నారుు. హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ గత ఏడాది మే 22న విజయ్కుమార్ జిల్లాకు డీఈఓగా వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల తనిఖీలతో ఆయన ఉపాధ్యాయులను హడలెత్తించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం రాకుంటే సంబంధిత ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఒకేసారి ఒకటి, రెండు మండలాల్లోని పలు పాఠశాలలను తనిఖీ చేసి.. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠినంగా వ్యవహరించారు. పలువురు ఉపాధ్యాయులను నిర్ధాక్షిణ్యంగా సస్పెండ్ చేయడమే కాకుండా.. ఇంక్రిమెంట్లలో కోత పెట్టారు. దీంతో పలు ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. కొన్ని సంఘాలు ఏకంగా ఆందోళన బాట పట్టగా.. మరి కొన్ని సంఘాలు విజయ్కుమార్కు బాసటగా నిలిచారు. ఈ క్రమంలో డీఈఓ కార్యాలయ బ్యూటిఫికేషన్పై పెద్ద దుమారం చెలరేగింది. ఆయన పర్యవేక్షణలో ఈ పనులు జరిగారుు. డీఈఓ కార్యాలయంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయించారు. అరుుతే బ్యూటిఫికేషన్ కోసం సమీకరించిన నిధుల్లో అవకతవకలక పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తారుు. ఈ నేపథ్యంలో డీఈఓ విజయ్కుమార్పై చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయుల సంఘాలు ఆందోళనకు దిగారుు. అవకతవతకలకు సంబంధించిన వ్యవహారం ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్లింది. ఇలా వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్న విజయ్కుమార్పై వినూత్న కార్యక్రమాలు చేపట్టి పలువురి మన్ననలనూ పొందారు. జిల్లాలోని ఆత్మకూరు, గీసుకొండ, ధర్మసాగర్ మండలాలకు చెందిన విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్లో శిక్షణ ఇప్పించారు. క్యాంపులు నిర్వహించి ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా విద్యార్థుల్లో సైన్స్పై సక్తి పెంపొందేలా కృషి చేశారు. ఉపాధ్యాయులు మెరుగైన బోధన చేసేలా వారికి శిక్షణ తరగతులు నిర్వహించారు. జఫర్గఢ్ మండలంలో కొందరు విద్యార్థులకు వంద గంటల్లో ఇంగ్లిష్ నేర్పించడం వంటి వాటిని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని సొషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లతో కాకతీయ సోషల్ స్టడీస్ ఫోరం ఏర్పాటు చేసి... దాని ద్వారా బాలవక్త, క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈనెల 14న జిల్లాస్థాయి ఫైనల్ పోటీలు నిర్వహించి విజేతలైన ఇద్దరి విద్యార్థులకు ఓరుగల్లు సేవా ట్రస్టు నుంచి రూ. లక్ష ఇప్పిం చారు. ఓరుగల్లుసేవా ట్రస్టుకు కోశాధికారిగా ఉన్న ఆయన ఇటీవల రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ను విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యూరు. అదేవిధంగా.. దాతలపై ఆధారపడి నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సృజనోత్సవాలకు ఓరుగల్లు సేవాట్రస్టు ద్వారా కలెక్టర్ కిషన్తో రూ.1.50 లక్షలు ఇప్పించారు. బదిలీ అరుున సోమవా రం కూడా ప్రాక్టిసింగ్ పీఎస్లో తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తేలడంతో హెచ్ఎంను సస్పెం డ్ చేయడంతోపాటు ఐదుగురు టీచర్లకు ఇంక్రిమెంట్ కట్ చేశారు. కాగా, బదిలీ అరుున డీఈఓ విజయ్కుమార్కు ప్రస్తుతం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. -
ఒక్క చిత్రంతో...గిన్నిస్ రికార్డ్ మిస్సయ్యా!
ఉన్నత చదువులు చదివి... గొప్ప ఉద్యోగం చేయాలనుకున్న వ్యక్తి సినీదర్శకుడు అవడమేంటి? తొలి సినిమానే సరైన సమయానికి విడుదల కాలేదు. అలాంటి వ్యక్తి... 73 సినిమాల దర్శకునిగా ఎదగడమేంటి? ‘వీడు గనుక దర్శకుడైతే... సీరియస్ సినిమాలు తీసి చంపేస్తాడ్రా’ అని అందరితో అనిపించుకున్న వ్యక్తి ముప్ఫై ఏళ్ల పాటు జనాలను ఏకధాటిగా నవ్వించడమేంటి? ఇన్నాళ్ల ఆ నవ్వుల ప్రయాణం వెనుక చెరగని ఆ కన్నీటి మరక ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుందా! అయితే చదవడం మొదలుపెట్టండి. దర్శకుడు రేలంగి నరసింహారావు కామెడీ వెనుక ఎంత కథ ఉందో, ఎంత కష్టం ఉందో, ఎంత కన్నీరుందో... తెరపై మీదో ప్రత్యేక సంతకం కదా! మీరిలా సెలైంటయ్యారే? 1996 నుంచి వరుసగా నాలుగేళ్లు కన్నడ సినిమాలు చేశా. తెలుగు సినిమా పూర్తి స్థాయిలో హైదరాబాద్కు షిఫ్టయ్యింది అ టైమ్లోనే. కన్నడంలో కమిట్మెంట్లు పూర్తి చేసుకొని 1999లో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. అప్పటికే జరగకూడని డామేజీ జరిగిపోయింది. నా గ్యాప్ ఇక్కడ భర్తీ అయిపోయింది. ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి బిజీ అయ్యారు. ఒక్కసారి వెనుక పడ్డాక, ముందుకెళ్లడం చాలా కష్టం. ట్రెండ్ కూడా మారింది. పైగా ‘రేలంగి నరసింహారావు కన్నడంలో స్థిరపడిపోయాడు’ అనే వార్తలు అప్పటికే పేపర్లలో వచ్చాయట. నిజానికి నేను అక్కడ సెటిల్ అవ్వలేదు. మా అత్తగారి ఊరు బెంగళూరు. అందుకే కొన్ని రోజులు అక్కడే ఉండి సినిమాలు చేశా. దానికి ప్రతిఫలమే ఈ విరామం. ఇక్కడకు రాగానే రాజేంద్రప్రసాద్తో ‘అమ్మో బొమ్మ’ తీశా. ఆడలేదు. ఆ తర్వాత ‘ప్రేమించుకున్నాం పెళ్లికి రండి’ తీశా. అదీ ఆడలేదు. తర్వాత దుకాణం తెరిచి ఉంచినా మన దగ్గరకు ఎవరూ రాలేదు. ఏం చేస్తాం. వరుసగా సినిమాలు చేసిన మీకు ఈ విరామం ఇబ్బందిగా లేదా? నా అదృష్టం ఏంటంటే.. ఇంకా నా పేరు మరుగున పడలేదు. ‘ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం, పోలీసుభార్య, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, బ్రహ్మచారి మొగుడు’ లాంటి చిత్రాలు టీవీల్లో వస్తుంటే జనం విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క సినిమా హిట్టయినా మళ్లీ పూర్వ వైభవం వస్తుందని నా నమ్మకం. త్వరలో మా గురువు గారైన దాసరి గారి బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నా. స్క్రిప్ట్ రెడీ. త్వరలోనే సెట్స్కి వెళతాం. అసలు దర్శకునిగా మీ తొలి అడుగు ఎలా పడింది? మా నాన్నగారు రేలంగి శ్రీరంగనాయకులు మా ఊళ్లో పేరున్న వైద్యులు. నన్ను కూడా డాక్టర్గా చూడాలనేది నాన్న కోరిక. అందుకే బీఎస్సీలో చేర్పించారు. మార్కులు సరిగ్గా రాలేదు. నిరుత్సాహానికి లోనై, ‘డాక్టర్ చదువుకి నేను పనికిరాను’ అని నాన్నకు నిర్మొహమాటంగా చెప్పేశాను. నా పరిస్థితిని గమనించిన నాన్న.. ‘ఇష్టమైన రంగంలోనే ప్రోత్సహించడం కరెక్ట్’ అనుకొని మద్రాస్ తీసుకెళ్లారు. రవిరాజా పినిశెట్టి తండ్రి పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు మా నాన్నకు మంచి మిత్రుడు. నన్ను ఆయన వద్దకు తీసుకెళ్లారు. అక్కడే గురువుగారు దాసరిగారిని తొలిసారి చూశా. రామ్మూర్తిగారి రికమెండేషన్తో ‘మహ్మద్బీన్ తుగ్లక్’ సినిమాకు దర్శకుడు బీవీ ప్రసాద్ దగ్గర అసిస్టెంట్గా చేరాను. ఆ చిత్రానికి దాసరిగారే రైటర్. అప్పట్నుంచీ ఆయనతో టచ్లో ఉండేవాణ్ణి. తర్వాత నేను కేఎస్ఆర్ దాస్గారి దగ్గర ‘ఊరికి ఉపకారి’ చిత్రానికి అసిస్టెంట్గా చేరాను. అప్పుడే గురువుగారి ‘తాతామనవడు’ మొదలైంది. ‘వచ్చేస్తాను సార్’ అన్నాను. ‘సినిమా మధ్యలో వదిలిపెట్టి రావద్దు. మంచి పద్ధతి కాదు. కష్టమైనా నష్టమైనా ఒప్పుకున్న సినిమాను పూర్తి చేసి రావడం ధర్మం’ అని కచ్చితంగా చెప్పేశారు గురువుగారు. గురువుగారి రెండో సినిమా నుంచీ నేను ఆయన బృందంలో చేరిపోయాను. అలా 1973 నుంచి 1979 వరకూ దాసరిగారితో నా ప్రయాణం సాగింది. ‘సర్కస్రాముడు’ నిర్మాత కోవై చెళియన్ గురువుగారితో ఓ సినిమా చేయాలనుకున్నారు. గురువుగారికేమో విపరీతమైన కమిట్మెంట్లు. దాంతో ‘మా నరసింహారావు చేస్తాడు లెండీ. నేను పర్యవేక్షిస్తాను’ అని దర్శకునిగా నాకు ప్రమోషన్ ఇప్పించారు గురువుగారు. అలా ‘చందమామ’తో దర్శకుణ్ణి అయ్యాను. మరి మీ తొలి సినిమా ‘చందమామ’కు ఇబ్బందులొచ్చాయట.. నిర్మాత చెళియన్గారికి, పంపిణీదారులకీ మధ్య మనస్పర్థలొచ్చాయి. వాళ్లే తన దగ్గరకొస్తారని ఆయనా, ఆయనే వస్తారని పంపిణీదారులు భీష్మించుకొని కూర్చోవడంతో సినిమా విడుదల ఆగింది. అప్పుడు గురువుగారు కలుగజేసుకొని నిర్మాతకు, పంపిణీదారులకూ మధ్య రాజీ కుదిర్చారు. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత సినిమా విడుదలైంది. అప్పటికే నా దర్శకత్వంలో ‘నేనూ మా ఆవిడ, ఏమండోయ్ శ్రీమతిగారు’ చిత్రాలు విడుదలై నాకు కామెడీ ఇమేజ్ వచ్చేసింది. దాంతో ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. నిజానికి అది చాలా మంచి కథ. సీరియస్ సబ్జెక్ట్. మురళీమోహన్, మోహన్బాబు, సరిత, ఫటాఫట్ జయలక్ష్మి ఇలా హేమాహేమీలు నటించారు. సరైన సమయంలో అది విడుదలైతే, నా ప్రయాణం వేరేలా ఉండేది. బహుశా నా నుంచి సీరియస్ సినిమాలే వచ్చేవేమో! అసలు కామెడీ బాట ఎలా పట్టారు? ‘చందమామ’ తర్వాత అనుకోకుండా కామెడీ కథ చేయాల్సొచ్చింది. రాంబాబుగారని.. ఎన్టీఆర్గారి బావమరిదికి బావమరిది. తను నిర్మాత. గురువుగారు దర్శకత్వ పర్యవేక్షణ. సినిమా పేరు ‘నేను - మా ఆవిడ’(1980). ఓ బ్రహ్మచారి కథ అది. పెద్ద హిట్. వందరోజులాడింది. ఆ సినిమా పుణ్యమా అని నాకు కామెడీ ఇమేజ్ పడిపోయింది. కామెడీకే అంకితమైపోయానని ఎప్పుడైనా బాధపడ్డారా? ఆ ఫీలింగ్ నాకెప్పుడూ లేదు. ఇప్పటికీ నాకు నేను అదృష్టవంతునిగా ఫీలవుతా. సాధారణంగా సినీరంగంలో పోటీ ఎక్కువ. కానీ.. నాకు జంధ్యాల మాత్రమే పోటీ. జంధ్యాల తెలుగుకే పరిమితం అయ్యారు. నేను ఇతర భాషల్లోనూ చేశా. కన్నడంలో ఏడు సినిమాలు చేశాను. తమిళంలో నగేశ్ గారబ్బాయి ఆనంద్బాబుతో ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’ రీమేక్ చేశాను. హిందీలో కూడా అదే సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ వచ్చింది. రిషి కపూర్ హీరో. కానీ జస్ట్ మిస్. లేకపోతే హిందీలో కూడా నాది ఓ సినిమా ఉండేది. వంద సినిమాలకు దగ్గర పడుతున్నట్లున్నారు... లేదండీ... 73 సినిమాలు చేశాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంద సినిమాలు చేయడం కష్టమే. కన్నడంలోకి వెళ్లకపోతే మాత్రం కచ్చితంగా వందకు దగ్గర పడేవాణ్ణి. ఏంటండీ... ఒక్క 1989లోనే నావి 11 సినిమాలు విడుదలయ్యాయంటే నమ్ముతారా!. ఏడాదికి 11 సినిమాలతో ఓ మలయాళ దర్శకుడు అప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉన్నాడు. కృష్ణంరాజుగారి ‘యమధర్మరాజు’ సినిమా నిర్మాణం పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉంది. అయితే... ఆ సినిమా ఆ మరుసటేడు 1990లో విడుదలైంది. అలా ఒక్క చిత్రంతో గిన్నిస్ రికార్డ్ మిస్సయ్యా. లేకపోతే, దాసరిగారితోపాటు వారి శిష్యుల్లో కూడా ఒకరు గిన్నిస్ రికార్డ్లో ఉండేవారన్నమాట? గురువుగారితో పోలిక వద్దండీ. ఆయన మహానుభావుడు. నా తొలి సినిమా ‘నేనూ మా ఆవిడ’ ఇంకొన్ని రోజుల్లో ప్రారంభోత్సవం అవుతుందనగా... ఎన్టీఆర్గారు అన్నమాట నాకింకా గుర్తు. ‘అందరు గురువుల్లాంటి గురువు కాదండీ మీ గురువు. అందరూ విద్య నేర్పి వదిలేస్తారు. కానీ మీ గురువు మీ అభ్యున్నతికి కూడా బాటలు వేస్తారు. అరుదుగా ఉంటారు అలాంటి గురువులు. నేను నీ తొలి సినిమా ప్రారంభోత్సవానికి వస్తాను. మొదటి కొబ్బరికాయ నేనే కొడతాను’ అని దీవించారు. అన్నట్లుగానే వచ్చి దీవించారు. రామారావుగారు అన్నారని కాదు కానీ... మా గురువుగారు నిజంగా అంతటి గొప్పవారే. కొంతమంది గురువులు శిష్యులు పైకొస్తున్నా తట్టుకోలేరు. కానీ మా గురువుగారికి అలాంటి అసూయ ఇసుమంత కూడా ఉండదు. ఎప్పడూ మమ్మల్ని ప్రేమించారు. ఆయనకు తీరిక లేకపోతే... మా పేర్లు సూచించిన సినిమాలు చాలా ఉన్నాయి. గురుధర్మాన్ని గొప్పగా అవలంబించేవారాయన. ఆ గొప్పతనాన్ని దగ్గరగా చూశాం కాబట్టే మా అందరికీ ఆయన దైవం అయ్యారు. పరిశ్రమ పచ్చగా ఉండాలనే దృక్పథంతో సాధ్యమైనంతవరకూ ఎక్కువ సినిమాలు చేసేవారు. ఆయన దారినే అనుసరిస్తూ శిష్యులమైన మేము కూడా గణనీయంగా సినిమాలు చేశాం. నేను 73 సినిమాలు చేస్తే... కోడి రామకృష్ణ తీసినవాటి సంఖ్య ఇప్పటికే 130 దాటిపోయింది. రవిరాజా పినిశెట్టి యాభైకి పైనే తీశాడు. ఇదంతా మా గురువుగారి ప్రేరణే. అన్నట్లు... కోడి రామకృష్ణ, మీరూ చిన్ననాటి దోస్తులటకదా? అవును.. కోడిరామకృష్ణ నా క్లాస్మేట్, రూమ్మేట్, బెంచ్మేట్ కూడా. పాలకొల్లులో మాది లంకంత ఇల్లు. మా తాతయ్యకు ఏడుగురు కొడుకులు. ఇంకో తాతయ్యకు అయిదుగురు కొడుకులు. అందరికీ ఒకటే వరండా. అక్కడ చదువు సాగడం చాలా కష్టం. అందుకని బయట రూమ్ తీసుకున్నా. కోడి రామకృష్ణ, నేను, మా ఇంకో మిత్రుడు సుబ్రహ్మణ్యం ఆ రూమ్లో ఉండేవాళ్లం. మొదట్నుంచీ రామకృష్ణకి సినిమాలపైనే దృష్టి. ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని కలలు కనేవాడు. నాకేమో ఉన్నత చదువులు చదవాలని ఉండేది. నాటకాల రిహార్సల్స్ అంటూ ఎవరెవరినో గదికి తెస్తుండేవాడు. దాంతో నాకు, నా మిత్రుడు సుబ్రమణ్యంకి చిర్రెత్తుకొస్తుండేది. ఒక్కోసారి నేను, సుబ్రమణ్యం కలిసి రామకృష్ణను తెగ తిట్టేవాళ్లం. ‘అస్తమానం సినిమాలేంటి? నాటకాలేంటి? ఎప్పుడూ రూమ్ నిండా ఈ జనాలేంటి? అసలు నువ్వు మా రూమ్లో వద్దు. బయటకుపో’ అని సామాన్లు విసిరి కొట్టేవాళ్లం. కానీ... రామకృష్ణకు విపరీతమైన సహనం. అస్సలు కోపం రాదు. చిన్నప్పట్నుంచీ అంతే. ఎంత తిట్టినా.. ‘రేపట్నుంచి ఉండదులే. బయట చూసుకుంటాం. ఈ ఒక్కరోజే’ అని ఎలాగోలా మభ్య పెట్టేవాడు. అవన్నీ మరిచిపోలేని రోజులు. ఇంతకీ మీ అమ్మగారి గురించి చెప్పనే లేదు? మా అమ్మ గృహిణి. పేరు శివరావమ్మ. అమ్మంటే నాకు చాలా ఇష్టం. కానీ ఓ చిన్న విషయం వల్ల మేం పదేళ్ల పాటు దూరమయ్యాం. చిన్న పిల్లలు కొట్టుకోవడం, తిట్టుకోవడం సహజం కదా! అలాగే, ఓ సారి మా తమ్ముణ్ణి కొట్టాను. అమ్మ తిట్టింది. ‘ఎందుకురా... పెద్దాడివై ఉండి... చిన్నాణ్ని పట్టుకొని అలా కొట్టడం. తప్పు కదా’ అని మందలించింది. ఆ చిన్న కారణం వల్ల పదేళ్ల పాటు అమ్మతో నాకు మాటల్లేవ్. బహుశా ఊళ్లో ఉంటే మాట్లాడేవాణ్ణేమో. నేను 1970లోనే మద్రాస్ వెళ్లిపోయా. దాంతో ఇక అమ్మతో మాట్లాడలేకపోయాను. ‘అమ్మ’ అనే పిలుపుకు కూడా ఆమెను దూరం చేశాను. 1968లో జరిగింది ఈ గొడవ. అమ్మ 1978లో చనిపోయింది. అంత కోపం ఎందుకొచ్చింది? అజ్ఞానం. తర్వాత తెలిసింది అది అజ్ఞానం అని. దాని వల్ల ఎంత పోగొట్టుకున్నానో తర్వాత తెలిసింది. 1978లో అమ్మ చనిపోయిందని మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఆదుర్దాగా బయలు దేరాను. తెల్లారి పొద్దున్నే ఊళ్లోకి దిగాను. ఇంటి ముందు పందిరేసుంది. బయట బల్లలు పెట్టి ఉన్నాయి. కానీ అమ్మ భౌతిక కాయం మాత్రం అక్కడ లేదు. గుండె బరువెక్కింది. ‘అమ్మ ఏది?’ అని అక్కడున్నవాళ్లను కంగారుగా అడిగాను. ‘లేదయ్యా... రాత్రి అమ్మకు మళ్లీ ఊపిరొచ్చింది’ అని చెప్పారు. దాంతో పరుగు లాంటి నడకతో హాల్లోకి వెళ్లాను. అమ్మ పడుకొని ఉంది. మంచం చుట్టూ బంధువులు గుమిగూడి ఉన్నారు. కానీ... అమ్మ నా వైపే చూస్తోంది. నేను దగ్గరకు వెళ్లాను. అప్పటికే అమ్మకు మాట పడిపోయింది. నన్ను పట్టుకొని ‘ఆ... ఆ...’ అని ఏదో అంటోంది. నాకేం అర్థం కాక పక్కవాళ్ల వంక చూశాను. ‘ఏమీ లేదయ్యా... ఒక్కసారి ‘అమ్మా’ అని పిలవమంటోంది’ అన్నారంతా. ‘అమ్మా...’ అని పిలిచాను. అంతే... ఆమె కళ్లల్లో ఎప్పుడూ చూడనంత ఆనందం... బొటబొటా... కన్నీరు కార్చేసింది. నన్ను గట్టిగా కౌగిలించేసుకుంది. ‘ఇంకేం బాధ లేదు బాబూ... ఈ ఆనందంలో బతికేస్తుంది’ అన్నారంతా. కాసేపయ్యాక నేను లోపలకెళ్లి స్నానం చేసి వచ్చాను. ఇంతలో ఘొల్లున ఏడుపులు వినిపించాయి. ఏంటి? అంటే ‘అమ్మ చనిపోయింది’. నిజానికి అమ్మ ఆ ముందురోజు రాత్రే చనిపోయిందట. బయట పడుకోబెట్టేశారు. దండలు కూడా వేసేశారట. కానీ.. కేవలం నాతో ‘అమ్మా’ అని పిలిపించుకోవడం కోసమే ఆమె మళ్లీ బతికింది. వైద్యశాస్త్రం ఇది అసంభవం అనొచ్చు. కానీ... కర్మ సిద్ధాంతాన్ని నమ్మే దేశంలో పుట్టిన వ్యక్తిగా దాన్ని నేను నమ్ముతాను. (కళ్లల్లో నీళ్ళు సుడులు తిరుగుతుండగా..) అమ్మ విషయంలో నా తప్పు తెలుసుకున్నాను. కానీ... తప్పు తెలుసుకునేలోపే అమ్మే నాకు కరువైపోయింది. ఆ భగవంతుడు నాకు వేసిన పెద్ద శిక్ష అమ్మను దూరం చేయడం. బాధపడకండి సార్... అమ్మ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. అది సరే.. రేలంగి వెంకట్రామయ్యగారు మీకేమైనా బంధువా? మా నాన్నకు కజిన్ రేలంగి గారు. నాకు పెదనాన్న అవుతారు. అయితే... నాకు ఆయనతో పరిచయం లేదు. ఆయన్ను తొలిసారి నేను చూసింది ‘రాధమ్మపెళ్లి’ షూటింగ్లో. గురువుగారే దర్శకుడు. అందులో రేలంగి గారిది మంచి వేషం. టి.నగర్లోని ఆయన ఇంటి దగ్గరే షూటింగ్. నేను ఆయన బంధువునైనా ఏనాడూ ఆయన ఇంటికి కూడా వెళ్లలేదు. బంధుత్వం కలుపుకొని ఎదగాలనుకునే తత్వం కాదు నాది. అయితే... షూటింగ్ గ్యాప్లో ఓ సారి ఆయనే ‘ఏవయ్యా... ఇలా రా’ అని పిలిచారు. వెళ్లాను. ‘నీ పేరు రేలంగి నరసింహారావా? ఏ ఊరు నీది’ అనడిగారు. ‘పాలకొల్లండీ’ అని చెప్పాను. ‘ఎవరబ్బాయివేంటి?’ అనడిగారు. ‘రేలంగి రంగనాయకులుగారి అబ్బాయిని’ అని చెప్పాను. ‘ఓ హో... రంగడి కొడుకువా? వెరీగుడ్ వెరీగుడ్’ అనీ... ‘ఏమీ లేదయ్యా... మీ గురువు... నిన్ను తిడుతున్నాడో నన్ను తిడుతున్నాడో అర్థం కావడం లేదు. అయినా... నన్ను తిట్టేంత ధైర్యం అతనికి ఎక్కడుంది కానీ... నువ్వు ఓ పనిచేయ్. ‘నరసింహారావు’ అని పిలిపించుకో. రేలంగిని నేను ఉన్నానుగా’ అన్నారు ఆయన శైలిలో. నాకేమో ఓ వైపు నవ్వు, మరో వైపు... టెన్షన్. ‘అలా కాదండీ... గురువుగారి దగ్గరకెళ్లి అలా చెప్పలేనండీ’ అన్నాను. ‘అయితే ఓ పని చేసేయ్. ఈ సినిమా వరకు మానేయ్’ అన్నారు. ‘మా గురువుగారు మధ్యలో మానొద్దన్నారండీ’ అన్నాను. ‘ఏం గురువుగారయ్యా... అస్తమానం గురువుగారు.. గురువుగారు అనీ... పోనీ ఓ పనిచెయ్. పక్కనున్నవాళ్లతోనైనా ‘నరసింహారావు’ అని పిలిపించుకో. అప్పుడు మీ గురువు కూడా ‘నరసింహారావు’ అనే పిలుస్తాడు ఏమంటావ్’ అన్నారు. ‘సరే సార్’ అన్నాను. ఓ రెండ్రోజుల తర్వాత నిదానంగా గురువుగారికే ఈ విషయం చెప్పాను. ఆయన తాపీగా... ‘అలా అన్నారా!’ అన్నారు. అప్పట్నుంచీ షూటింగ్ అయ్యేంతవరకూ నన్ను ‘ఇదిగో ఇలా రా!’ అని పిలిచేవారు కానీ... ‘రేలంగీ...’ అనేవారు కాదు. రేలంగి గారితో నా తొలి అనుభవం అది. మీ కుటుంబం గురించి చెప్పండి? నా భార్య పేరు సాయిలక్ష్మి. పెద్దబ్బాయి హిప్నో థెరీపీ కోర్స్ చేశాడు. పాస్ట్లైఫ్ థెరపీ కూడా చేస్తాడు. ప్రస్తుతం చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. చిన్నవాడు అమెరికాలోని లాస్ఏంజిల్స్లో ఉద్యోగం. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసేశాం. మనవళ్లు, మనవరాళ్ళు కోసం ఎదురుచూస్తున్నా. - బుర్రా నరసింహ ఆ విషయంలో చంద్రమోహనే నా గురువు! దర్శకునిగా నాకు గురువు దాసరిగారైతే.. కామెడీ విషయంలో మాత్రం చంద్రమోహన్గారు గురువు. ఆయనతో 24 సినిమాలు చేశాను. అన్నీ హిట్లే. బయట కూడా అద్భుతంగా నవ్విస్తారాయన. ఆయన్నుంచే నాకు హ్యూమర్ అలవడింది. గురువుగారి దగ్గర నాతోపాటు పనిచేసిన వారందరూ ఈ రోజు నన్ను చూసి ఆశ్చర్యపడుతుంటారు. ‘వీడు దర్శకుడైతే... సీరియస్ సినిమాలు తీసి జనాల్ని చంపేస్తాడ్రా’ అనేవాళ్లు అప్పుడంతా. అంత సీరియస్గా ఉండేవాణ్ణి. అలాంటి నేను కామెడీ డెరైక్టర్ని అయ్యానంటే... అదంతా దైవ నిర్ణయం. ఒక్క రాజేంద్రప్రసాద్గారితోనే 32 సినిమాలు చేశాను. నాకు నచ్చిన నా చిత్రాలు 1. సంసారం 2. చిన్నోడు పెద్దోడు 3. పోలీసు భార్య 4. ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం 5 ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ 6. బ్రహ్మచారి మొగుడు 7. దాగుడు మూతల దాంపత్యం 8. పెళ్లానికి ప్రేమలేఖ-ప్రియురాలికి శుభలేఖ 9. మానసవీణ 10. మామా అల్లుడు -
‘ఇందిరమ్మ’ అనుబంధాలపై ఆరా !
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్లైన్: ‘ఇందిరమ్మ గృహాల అక్రమ పునాదులకు అనుబంధాలు తయారు చేసిందెవరంటూ’ జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులు ప్రొద్దుటూరు తహశీల్దారు చంద్రమోహన్ను ఆరా తీశారు. ‘ఇందిరమ్మ’ లో అక్రమాలకు అనుబంధాలు రెడీ’ అన్న శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ఈ మేరకు స్థానిక తహశీల్దార్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ విషయమై స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దారు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పాత తేదీలు వేసి రికార్డుల్లో నెంబర్లు వేసి అక్రమాలకు పాల్పడిన విషయంపై విచారణ చేస్తున్నారు. ఏ స్థాయి అధికారులు ఈ పని చేశారన్న విషయంపై ఆరా తీస్తున్నారు. అక్రమార్కులు ఆడిందే ఆట.. గతంలో కలెక్టర్ ఆదేశాలతో తొలగించిన పునాదులకు తిరిగి అక్రమంగా అనుబంధాలు ఇవ్వడంతో అక్రమార్కులు ఎలాంటి బిల్లులు లేకుండానే గృహాలను పూర్తి చేస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. కాలనీలో వందలాది పునాదులు వెలిసినా, వాటి నిర్మాణాలు పూర్తి చేస్తున్నా రెవెన్యూ అధికారులు స్పందించక పోవడంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ అక్రమాలపై 12 మంది అధికారులు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఇందులో రూ.కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. అనుబంధాలు తయారు చేసిన రెవెన్యూ అధికారి, ఆయనకు సహకరించిన కింది స్థాయి అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే అక్రమాలకు అడ్డుకట్ట పడదని స్థానికులు అంటున్నారు. -
ప్రశాంతంగా ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్ష
మహబూబ్నగర్ విద్యావిభాగం, న్యూస్లైన్: జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షకు 8,168 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 755 మంది గైర్హాజరు అయ్యారు. 7,413 మంది హాజరయ్యారు. ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షకు 521 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 476 మంది విద్యార్థులు హాజరయ్యారు. 45 మంది గైర్హాజరు అయ్యారు. మొత్తం 8689 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 7,889 మంది విద్యార్థులు హాజరయ్యారు. 800మంది గైర్హాజరు అయ్యారు. మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్, డైట్ కళాశాల తది తర పరీక్ష కేంద్రాలను డీఈఓ చంద్రమోహన్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
‘టెట్’..అంతా రెడీ
మహబూబ్నగర్ విద్యావిభాగం, న్యూస్లైన్: ఉపాధ్యాయ అర్హతపరీక్ష(ఏపిటెట్) పరీక్ష నేడు(ఆదివారం) జరుగనుంది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిఈఓ చంద్రమోహన్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 30,039 మంది అభ్యర్థులు ఏపిటెట్ పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 9.30గంటల నుంచి 12.00గంటల వరకు జరిగే పేపర్-1 పరీక్షకు 22 కేంద్రాలలో 5,170మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి 5.00గంటల వరకు జరిగే పేపర్-2 పరీక్షకు 104 కేంద్రాలలో 24,869 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు 21మంది రూట్ ఆఫీసర్లు, 104మంది చీఫ్ సూపరింటెండ్లు, 126మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 1040మంది ఇన్విజిలేటర్లను పరీక్షల విధుల్లో నియమించారు. శనివారం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో డిఈఓ టెట్కు సంబంధించిన మెటీరియల్ను రూట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు పంపిణీ చేశారు. సిబ్బంది అధికారులు, సమయ పాలన పాటించాలని అన్నారు. జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలలలో పనిచేస్తున్న నాన్టీచింగ్ సిబ్బంది ఉదయం 7గంటలకు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో హాజరై టెట్ ఇన్విజిలేషన్ నియామక ఉత్తర్వులు తీసుకొని సంబంధిత సెంటర్కు హాజరు కావాలని కోరారు. పరీక్షకు హాజరయ్యే వారు తమ వెంట ప్యాడ్, బ్లాక్ బాల్పాయింట్ పెన్ను తప్పనిసరిగా తీసుకొని రావాలని సూచించారు. పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమన్నారు. -
పీడీ.. వద్దులెండి
సాక్షి ప్రతినిధి, కడప: హలో అటవీ అధికారే కదా..! నేను చంద్రమోహన్(పేరు మార్చాం)ను మాట్లాడుతున్నా. రాష్ట్ర స్థాయి మాజీ డెరైక్టర్ను. అదే.. మీరు రెడ్డినారాయణ, గుట్ట బాబులను అరెస్టు చేశారు కదా...అంతటితో సరిపెట్టండి... పీడీ యాక్టు అమలు చేయాలని ఉన్నట్లు తెలుస్తాంది. ఇంకేమి పెట్టొద్దులేండి.. నేను ముఖ్యనేత తమ్ముడు కు మీగురించి మంచిగా చెబుతాలే! సరేనా.. మీ కింది అధికారి వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడుతాడు.. ఇంకేమి అడ్డంకులు పెట్టొద్దు.. సరే ఉంటాను... ‘సిఫార్సులకు కాదేదీ అనర్హం’ అన్నట్లుగా జిల్లాలో అధికార పార్టీ నేతల శైలి కన్పిస్తోంది. ఆదాయం వస్తుందంటే ఎలాంటి సిఫార్సులైనా, ఎవరికైనా చెస్తుండడం పరిపాటి మారింది. తాజాగా ఎర్రచందనం ఘరానా స్మగ్లర్లుగా పేరుగాంచిన రెడ్డినారాయణ, గుట్టబాబుల వ్యవహారాన్ని అధికార పార్టీ నేతలు రక్తి కట్టిస్తున్నారు. అరెస్టు వరకూ సరే.. పీడీ యాక్టు అమలు చేయవద్దని పెద్ద ఎత్తున సిఫార్సులు వస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ముఖ్యనేత సోదరుడితో స్వయంగా చెప్పిస్తామని ఒక విధంగా బెదిరింపు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ మద్దతుదారుడైనప్పటికీ.... రెడ్డినారాయణ సంబేపల్లె మండల వాసి. స్థానికంగా టీడీపీ మద్దతుదారుడు. ఎవరూ లేకపోతే పోటీకి తానున్నానని ఓ సందర్భంలో ముందుకు వచ్చిన వ్యక్తి. ఎర్రచందనం అక్రమ రవాణాతో రెడ్డినారాయణ ఎదిగారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో చిత్తూరు జిల్లా టాస్క్పోర్స్ పోలీసులు రెడ్డినారాయణతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. గతంలో రెడ్డినారాయణపై పీడీ యాక్టు అమలు చేస్తే సుప్రీంకోర్టుకెళ్లి కొట్టివేయించుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో ఉన్న నేర చరిత్ర కారణంగా ప్రస్తుతం పీడీ యాక్టు అమలు చేయాలనే తలంపులో అటవీ యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. ఈవిషయం ఫారెస్టు యంత్రాంగంలోని కొందరు సిబ్బంది ద్వారా బహిర్గతమైనట్లు సమాచారం. దీంతో అధికారపార్టీ నేతలు రంగ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ మద్దతుదారుడైనా తమకు అదాయం దక్కితే చాలు అన్నట్లుగా అధికార పార్టీ నేతలు ఉన్నట్లు ఈవిషయం రుజువు చేస్తోందని పలువురు పేర్కొంటున్నారు. మంచి పోస్టింగ్ ఇప్పిస్తా! సహకరించు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ మాజీ డెరైక్టర్ ఒకరు రెడ్డినారాయణకు వత్తాసు పలుకుతున్నారు. సబ్డివిజన్ పరిధిలోని ఓ అధికారితో మంత్రాంగం నడిపారు. తనకు ముఖ్యనేతతోనూ, ఫారెస్టు యంత్రాంగంలో ఉన్నతస్థాయి అధికారులతోనూ ఉన్న పరిచయాలు మీకు తెలిసిందే. మీకు మంచి పోస్టింగ్ ఇప్పిస్తాను, ఈవ్యవహారంలో సహకరించాల్సిందిగా కోరినట్లు సమాచారం. అందుకు ప్రతిఫలం కూడా ఉంటుందని చెప్పడంతో ఆ అధికారి ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు ఎక్కడ ‘కీ’ తిప్పాలో అక్కడ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆశాఖలో గుప్పుమంటోంది. పీడీ యాక్టు అమలు ఆలోచనలో ఉన్నాం...డీఎఫ్ఓ నాగరాజు ఎర్రచందనం స్మగ్లర్లు రెడ్డినారాయణ, గుట్టబాబుల నేర చరిత్ర కారణంగా వారిపై పీడీ యాక్టు అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. గతంలో ఓమారు అమలు చేశాం. కోర్టు ఉత్తర్వుల కారణంగా విడుదల అయ్యారు. ఎలాంటి పైరవీలు నా వరకూ రాలేదు.