cheater
-
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'చీటర్'.. ఆసక్తిగా పెంచుతోన్న ట్రైలర్!
రేఖ నిరోషా, చంద్రకాంత్ దత్త, నరేందర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం "చీటర్". ఈ సినిమాను బర్ల నారాయణ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. యస్ఆర్ఆర్ ప్రొడక్షన్ పతాకoపై పరుపాటి శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో వినాయకచవితి సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: 'నా అనుమతి లేకుండా తాకాడు'..లైంగిక వేధింపులపై హీరోయిన్!) ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. "మేము అనుకున్నట్లుగానే సినిమా వచ్చింది. మా డైరెక్టర్ అనుకున్న దానికంటే బాగా కష్టపడ్డారు. మంచి అవుట్ పుట్ వచ్చింది. ప్రేక్షకులకు కథ తప్పకుండా నచ్చుతుంది. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ అదరిస్తారు అని నమ్మకం ఉంది'. అని అన్నారు. డైరెక్టర్ నారాయణ మాట్లాడుతూ.. 'సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా మా సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు పక్కా నచ్చుతుంది. మా సినిమాని థియేటర్లో చూసి ఆదరించండి.' అని అన్నారు. ఈ చిత్రంలో రాధిక, అనిత,మల్లేశం, నిషాన్, గౌటి రాజు కీలకపాత్రలు పోషిస్తున్నారు. -
రాయలసీమకు హైకోర్టు అక్కర్లేదట.. సీమకు చంద్రబాబు ద్రోహం
“అమరావతిలో లక్షల కోట్లు ఖర్చుపెట్టేసి టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచేయాలి. కానీ వెనుక బడిన రాయలసీమకు కనీసం హైకోర్టు కూడా అవసరం లేదట. ఉత్తరాంధ్రకు ముందే గుండు సున్నా కొట్టేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమపైనా విషం చిమ్మేశారు. మొత్తానికి తనకు అమరావతి తప్ప రాష్ట్రంలో ఇంకే ప్రాంతమూ నగరమూ ముఖ్యమే కాదని చంద్రబాబు నాయుడు చాటి చెప్పారు. రాయలసీమ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న న్యాయరాజధాని వద్దే వద్దని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారు.” రాయలసీమలో పర్యటిస్తోన్న చంద్రబాబు నాయుడు ఒక పక్క తన అవినీతిని ఐటీ నోటీసులు బట్టబయలు చేయడంతో ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనన్న భయంతో ఉన్నారు. మరో పక్క రాయలసీమ వాసులు న్యాయ రాజధాని ప్రస్తావన తీసుకురాగానే చంద్రబాబుకు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం గుర్తుకొచ్చింది. అంతే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమకు హైకోర్టు ఎందుకు? అని ఎదురు ప్రశ్రించారు. కావాలంటే హై కోర్టు బెంచ్ ఇస్తే అదే ఎక్కువ అని కూడా తీర్పు చెప్పారు. రాయలసీమ ప్రజల ఓట్లతో రాజకీయ బిక్ష పెడితే రాజకీయాల్లో ఎదిగి కుదరకపోతే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. తనను అంతటి వాణ్ని చేసిన రాయలసీమ ప్రజల రుణాన్ని ఎలా తీర్చుకోవాలా? అని ఆయన ఆలోచించాలి. అలాంటిది రాయలసీమకు ఎలా ద్రోహం తలపెడదామా అన్న ఆలోచనే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. 2019లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార.. అభివృద్ది వికేంద్రీకరణల్లో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించిస సంగతి తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే ఉత్తరాంధ్రలోని విశాఖను కార్యనిర్వాహక రాజధానిగానూ కర్నూలును న్యాయ రాజధానిగానూ చేయాలని ఆయన నిర్ణయించారు. అయితే కర్నూలులో హై కోర్టు పెడితే ఏం వస్తుంది? నాలుగు జిరాక్స్ సెంటర్లు వస్తాయంతే అని చంద్రబాబు విషం చిమ్మారు. తాజాగా చంద్రబాబు రాయలసీమ పర్యటనలో సీమ న్యాయవాదులు కర్నూలులో హైకోర్టు ప్రస్తావన తీసుకురాగనే చంద్రబాబుకు మండుకొచ్చేసింది. రాయలసీమకు హైకోర్టు అవసరమే లేదని తెగేసి చెప్పారు. కావాలంటే ఓ బెంచ్ ఇస్తే సరిపోతుందన్నారు. హైకోర్టు పెడితేనే నాలుగు జిరాక్స్ షాపులు తప్ప ఏవీ రావన్న చంద్రబాబు నాయుడు హైకోర్టు బెంచ్ పెడితే కర్నూలుకు ఏం వస్తుందో చెప్పాలంటున్నారు రాయలసీమ హక్కుల వేదిక నేతలు. బాగా అభివృద్ది చెంది.. రాజధానికి అన్ని విధాలా అనువైన నగరంగా అందరూ ఒప్పుకునే విశాఖపై విషం చిమ్ముతూనే ఉన్నారు చంద్రబాబు. అక్కడ కార్యనిర్వాహక రాజధాని అవసరం లేదని ఉత్తరాంధ్ర ప్రజలే అంటున్నారంటూ బుకాయిస్తున్నారు చంద్రబాబు. ఇటు రాయలసీమకు హైకోర్టు అవసరం లేదంటూ ఈ ప్రాంతంపైనా విషం చిమ్ముతున్నారు. తాను తన బంధువులు.. తన ఎల్లో మీడియా అధినేతలు.. టీడీపీ సీనియర్లు వారి బంధువులు భూములు కొని అట్టేపెట్టుకున్న అమరావతిలో మాత్రం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అయినా సరే లక్షన్నర కోట్లకు పైగా ఖర్చే చేసేయాలని చంద్రబాబు పట్టుబడుతున్నారు. చదవండి: ‘చంద్రబాబు నిజంగానే భయపడ్డారు’ ఏ అమరావతి జపం చేస్తున్నారో అదే అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణం ముసుగులోనే వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు అడ్డంగా భోంచేసిన వైనాన్ని ఐటీ శాఖ అధికారులు సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే తాను జైలుకు వెళ్లక తప్పదని చంద్రబాబు నాయుడికి అర్ధమైపోయింది. తాను చేసిన తప్పేంటో తనకి తెలుసు. ఆ తప్పుకు శిక్ష ఏం పడుతుందో కూడా బాబుకు తెలుసు. అందుకే తనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని ఆయన కంగారు పడుతున్నారు. ఈ ఉక్రోషంలోనే రాయలసీమకు హైకోర్టు బెంచ్ చాలునని విషం కక్కుతున్నారని రాయలసీమకు చెందిన న్యాయవాదులు అంటున్నారు. -సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు, సాక్షి -
మోసగాడి యాక్షన్
చంద్రకాంత్ దత్త, నరేందర్, రేఖ నీరోషా ప్రధాన పాత్రల్లో బర్ల నారాయణ దర్శకత్వం వహించిన చిత్రం ‘చీటర్’. యస్ఆర్ఆర్ ప్రొడక్షన్స పై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ని దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘చీటర్’ ఫస్ట్ లుక్ బాగుంది.. సినిమా హిట్ కావాలి’’అన్నారు. ‘‘యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన సినిమా ఇది. విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు బర్ల నారాయణ. ‘‘మా సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. -
రూ.2.5 కోట్ల బడ్జెట్తో ‘చీటర్’
చంద్రకాంత్ దూత్త, రేఖ నిరోషా హీరో హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘చీటర్’. ఎస్ ఆర్ ఆర్ ప్రొడక్షన్స్ పతకం పై పరుపతి శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ బర్ల దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం గురించి దర్శకుడు నారాయణ బర్ల మాట్లాడుతూ.. ‘మంచి యాక్షన్ సనివేషాలతో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమా చాలా రిచ్ గా వచ్చింది. అద్భుతమైన కథ కథనం తో సినిమా షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తాం’అన్నారు. ‘రూ.2.5 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. గోవా, ఆరాకు, హైదరాబాద్ లో షూటింగ్ చేశాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించాం’అని నిర్మాత పరుపతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాధికా, అనిత, బాబు రావు, గౌతి రాజు, మల్లేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ సంగీతం అందిస్తున్నారు. -
గన్ షాట్: చంద్రబాబు నెంబర్ 1 మోసగాడు..
-
కారు కావాలా బాబు? మా దగ్గర ధర కొంచెం తక్కువే..
వేలూరు: కార్ల విక్రయాల పేరుతో లక్షలు స్వాహా చేస్తున్న నకిలీ ఎస్ఐ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వివరాల మేరకు.. తిరువళ్లరు జిల్లా సుంగాచత్రంకు చెందిన రోహిణి(32)కి గత ఏడాది రాణిపేట జిల్లా ఆర్కాడుకు చెందిన వ్యాపారి దినేష్ కుమార్ పరిచయం అయ్యాడు. ఆ సమయంలో రోహిణి తాను చెన్నైలో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెండ్లో ఉన్నట్లు తెలిపింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న పలు వాహనాలను విక్రయిస్తున్నానని, ఎవరైనా కొనుగోలు చేయాలను కుంటే తనను సంప్రదించాలని నమ్మించింది. అది నమ్మిన దినేష్ కుమార్ రోహిణికి రూ.2 లక్షలు, ఈమె భర్త చంద్రుకు రూ.12 లక్షలు ఇచ్చి రెండు కార్లు కావాలని కోరాడు. కొద్ది రోజులకు తన స్నేహితులకు మరో రెండు కార్లు కావాలని రోహిణి అకౌంట్లోకి రూ.10 లక్షలు జమ చేశాడు. అయితే నెలలు గడుస్తున్నా రోహిణి నుంచి కార్లు అందకపోవడంతో దినేష్కుమార్ వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు రోహణి నకిలీ ఎస్ఐగా నటిస్తూ పలువురి వద్ద లక్షలు మోసం చేసినట్లు గుర్తించారు. మంగళవారం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్
సాక్షి, హైదరాబాద్: సైబర్ చీటర్ వంశీకృష్ణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణలో వంశీకృష్ణపై పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా.. సోమవారం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, ఉద్యోగాల పేరిట వంశీకృష్ణ దాదాపు రూ. 5కోట్ల వరకు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో 500 మంది యువతులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఆన్లైన్లో వితంతువులు, విడాకులు పొందిన మహిళలనే వంశీకృష్ణ టార్గెట్ చేసి మోసాలకు పాల్పడేవాడు. అయితే, వంశీకృష్ణ.. స్కీంల పేరుతో అటు ప్రజా ప్రతినిధులను సైతం మోసం చేశాడనే ఆరోపణలున్నాయి. -
ప్రేమ పేరిట అమ్మాయిలకు ఎర.. నమ్మిన స్నేహితులను కూడా
సాక్షి, పెద్దపల్లి, ఖమ్మం : పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రీమోనీ సైట్లలో పరిచయమయ్యే మహిళలే కాకుండా స్నేహితులను మాయమాటలతో బురిడీ కొట్టించి రూ.కోటికి పైగా కొల్లగొట్టిన మోసగాడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు... ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురానికి చెందిన రాహుల్ ప్రస్తుతం హైదరాబాద్ కూకట్పల్లిలో నివాసముంటున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో రెండో పెళ్లి కోసం వెబ్సైట్లో వివరాలు నమోదు చేసింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాహుల్ రూ.15.5లక్షల నగదు, ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా మరికొంత డబ్బు తీసుకుంటూ, ఇచ్చేస్తున్న ఆయన అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.లక్షల్లో డబ్బు వసూలు చేశాడు. ఆ తర్వాత బంగారు ఆభరణాలు తీసుకుని ఫైనాన్స్ సంస్థలో కుదవపెట్టగా తనను మోసం చేసినట్లు తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్ ప్రత్యేక బృందాలతో గాలించి రాహుల్ను అరెస్టు చేశారని ఏసీపీ తెలిపారు. అయితే, రాహుల్పై 2010లో ఖమ్మంలో, 2012లో హైదరాబాద్ ఎల్బీ.నగర్లో, 2013లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో చీటింగ్ కేసులు నమోదయ్యాయని ఏసీపీ సారంగపాణి వివరించారు. చదవండి: వ్యభిచార గృహంపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి ఇటీవల స్నేహితులను కూడా ఐటీ సమస్యలు ఉన్నాయని నమ్మించి రూ.లక్షల్లో అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదని తెలిపారు. మంగళగిరికి చెందిన జాస్తి వెంకటేశ్వర్లు నుంచి రూ.50లక్షలు, విజయవాడకు చెందిన బంగారి భాగ్యలక్ష్మి నుంచి రూ.1.80లక్షలు, షేక్ఖలీల్ నుంచి రూ.4.86లక్షలు, నాయుడు వెంకటేశ్ నుంచి రూ.1.20లక్షలు, హైదరాబాద్కు చెందిన ప్రసన్నలక్ష్మి నుంచి రూ.25లక్షలు, ప్రకాశంకు చెందిన కరీముల్లా నుంచి రూ.1.45లక్షలు, బాచు అప్పన్న నుంచి రూ. 2.5లక్షలు, ముప్పిరాజు మణికంఠ నుంచి రూ. 2లక్షలు తీసుకుని మోసగించాడని తేలిందని చెప్పారు. -
మ్యాట్రిమోనీ యాప్లో కేరళ బుల్లితెర నటుడి ఫొటో పెట్టి..
చిత్తూరు అర్బన్: అతడు చదువుకుంది ఆర్థికశాస్త్రంలో పోస్ట్రుగాడ్యుయేషన్. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద అటెండర్ పోస్టు వచ్చింది. చేస్తున్నపని నచ్చలేదు. మానేశాడు. దుర్వ్యసనాల నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించడానికి మార్గాలు అన్వేషించాడు. ఉన్నతాధికారిగా పనిచేస్తున్నట్లు పేర్కొంటూ, నటుడి ఫొటో తనదిగా చెప్పి వివాహ సంబంధాల వెబ్సైట్లలో ఉంచాడు. వీటి ఆసరాగా వందమందికిపైగా యువతులను మోసంచేసి దాదాపు రూ.25 లక్షలు కొల్లగొట్టాడు. ఈ మోసాలకు పాల్పడ్డ చిత్తూరుకు చెందిన కరణం రెడ్డిప్రసాద్ (42)ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. డీఎస్పీ సుధాకర్రెడ్డి, సీఐ యుగంధర్ ఈ వివరాలను మీడియాకు వివరించారు. అరక్కోణంలో స్థిరపడి మోసాలు చిత్తూరులోని యాదమరి కాశిరాళ్లకు చెందిన కరణం షణ్ముగం పిళ్లై పశుసంవర్ధకశాఖలో పనిచేస్తూ చనిపోవడంతో ఆయన కుమారుడు రెడ్డిప్రసాద్కు కారుణ్య నియామకం కింద 2002లో అదే శాఖలో అటెండర్గా ఉద్యోగం వచ్చింది. చిత్తూరులోని పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తుండగా 2012లో టైపిస్టుగా ఉద్యోగోన్నతి వచ్చింది. సాంకేతిక విద్యార్హతలు చూపకపోవడంతో 2016లో అటెండర్గా రివర్షన్ ఇచ్చారు. దీంతో ఉద్యోగం మానేసిన రెడ్డిప్రసాద్ వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. భార్య, కుమార్తె అతడి నుంచి వేరుగా ఉంటున్నారు. మ్యాట్రిమోనీ (వివాహాలను కుదిర్చే ఆన్లైన్ సంస్థలు) యాప్లో కేరళ బుల్లితెర నటుడి ఫొటో పెట్టి చిత్తూరులోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నట్లు, నెలకు రూ.2 లక్షల జీతం వస్తున్నట్లు పే–స్లిప్లు కూడా అప్లోడ్ చేశాడు. 2015లో తమిళనాడులోని అరక్కోణంలో స్థిరపడిన రెడ్డిప్రసాద్ పలు రాష్ట్రాలకు చెందిన మహిళల్ని ఆన్లైన్లో పరిచయం చేసుకుంటూ తనకు స్వచ్ఛంద సేవాసంస్థ ఉందని, వచ్చే జీతంలో సగానికిపైగా దానధర్మాల కోసం ఖర్చుచేస్తున్నానని ఫోన్లో చెప్పేవాడు. పేదలకు సాయం చేసే తన సంస్థకు సాయం చేయాలంటూ పలువురు యువతుల నుంచి డబ్బు వసూలు చేశాడు. కొందరు అనుమానం వచ్చి పశుసంవర్ధకశాఖ డీడీ ప్రభాకర్కి ఫోన్ చేశారు. తన పేరును మరొకరు దుర్వినియోగం చేస్తున్నారని గ్రహించి ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రెడ్డిప్రసాదే ఇదంతా చేస్తున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వందమందికిపైగా యువతుల నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు చెప్పాడు. 2019లో ఢిల్లీ ఎయిర్పోర్టులో డాలర్లు తెస్తుంటే కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని చెప్పి చిత్తూరుకు చెందిన యువతి వద్ద రూ.2.45 లక్షలు కాజేసింది తానేనని అంగీకరించాడు. నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు రూ.50 వేల నగదు సీజ్ చేశారు. యువతులు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు మోసపోవడంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకురాలేదు. ఇతడి ద్వారా మోసపోయినవాళ్లు చిత్తూరు పోలీసులను సంప్రదించాలని డీఎస్పీ కోరారు. కేసును ఛేదించడంలో ప్రతిభచూపిన ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
ప్రియురాలిని కాదని మరోక అమ్మాయితో పెళ్లికి రెడీ అయిన యువకుడు
-
వరుడి నిర్వాకం!...పీటల మీద ఆగిన పెళ్లి
అనంతపురం(ఉరవకొండ): పెళ్లి పేరుతో నమ్మించి అవసరాలు తీర్చుకున్న అనంతరం గుట్టుచప్పుడు కాకుండా పెద్దలు కుదిర్చిన అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన వంచకుడిపై ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు తెలిపిన మేరకు.. ఉరవకొండకు చెందిన ఓ యువతిని స్థానిక రెడీమేడ్ దుస్తుల దుకాణం నిర్వాహకుడు షర్పీద్దున్ ప్రేమించాడు. దాదాపు 14 ఏళ్లుగా వీరి మధ్య ప్రేమాయణం కొనసాగింది. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి తన అవసరాలు తీర్చుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే గుత్తికి చెందిన యువతితో షర్పీద్దున్కు ఈ నెల 9న వివాహాన్ని కుటుంబ పెద్దలు నిశ్చయించారు. విషయం తెలుసుకున్న బాధితురాలు తాను మోసపోయినట్లు గుర్తించి ఈ నెల 8న ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వెంటనే గుత్తిలోని వధువు తరఫు పెద్దలకు సమాచారం అందించారు. దీంతో బుధవారం గుత్తిలోని కల్యాణ మంటపంలో నిఖా తంతు ఒక్కసారిగా ఆగిపోయింది. పోలీసులు షర్పీద్దున్పై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. కాగా, వరుడు షర్పీద్దున్ తీరును ఏవగించుకుని వధువు తరఫు కుటుంబసభ్యులు, బంధువులు పెళ్లిని రద్దు చేసుకున్నట్లు సమాచారం. -
వీడు మాయలోడు.. కలెక్టర్ పీఏ నంటూ
కర్నూలు: ఎదుటి వ్యక్తుల అవసరాలే ఈ మోసగాడికి పెట్టుబడి. మాయ మాటలతో బురిడీ కొట్టిస్తాడు. ఇల్లు, ఇళ్ల స్థలాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సంక్షేమ పథకాలు ఇలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరార్థులను చేర దీసి రూ.లక్షల్లో గుంజేశాడు. ఇలా పలువురిని మోసగించి పోలీసులకు చిక్కి జైలుకెళ్లొచ్చాడు. అయినా తీరు మార్చుకోక కలెక్టర్ పీఏనంటూ కొంతమంది కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు మళ్లీ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. అతని నేర చరిత్రను కర్నూలు డీఎస్పీ కెవి.మహేష్, మూడవ పట్టణ సీఐ తబ్రేజ్తో కలిసి ఆదివారం తన కార్యాలయంలో వివరించారు. చదవండి: భార్య కువైట్లో.. ఎంత పనిచేశావ్ బంగార్రాజు.. బండి ఆత్మకూరు మండలం చిన్నదేవళాపురం గ్రామానికి చెందిన తాటికొండ పెద్దమౌలాలి చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. అనతి కాలంలోనే డబ్బు సంపాదించాలన్న ఆశతో వక్రమార్గం పట్టాడు. ప్రభుత్వం నుంచి బిల్లులు పాసైన కాంట్రాక్టర్ల ఫోన్ నంబర్లు సేకరించి వారికి ఫోన్ చేసి తాను కలెక్టర్ పీఏనంటూ పరిచయం చేసుకునేవాడు. పెండింగ్లో ఉన్న బిల్లులు పాస్ చేయమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయని, అవి క్లియర్ చేయడానికి ఐదు శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. ఇదే తరహాలోనే ఈ నెల 12వ తేదీన తుగ్గలి ప్రాంతానికి చెందిన ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ నవీన్కుమార్రెడ్డికి ఫోన్ చేసి తాను కలెక్టర్ పీఏనని పరిచయం చేసుకున్నాడు. పెండింగ్ బిల్లులను పాస్ చేయడానికి రూ.లక్ష తన అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశాడు. కాంట్రాక్టర్ స్పందించకపోవడంతో పదేపదే ఫోన్ చేసి బెదిరించడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. కలెక్టర్ కార్యాలయం సిబ్బందితో పాటు మరికొంతమంది కాంట్రాక్టర్లు కూడా 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా శనివారం రాత్రి కర్నూలు శివారులో నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ మహేష్ వెల్లడించారు. నిందితుడి నేరాల చిట్ట.. ►నంద్యాల ప్రాంతానికి చెందిన పేదలకు ఇళ్లు ఇప్పిస్తానని రూ. 22 లక్షలు వసూలు చేశాడు. మున్సిపాలిటీకి సంబంధించి నకిలీ రసీదులు ఫోర్జరీ సంతకా లతో పట్టాలిచ్చి మోసం చేశాడు. ఈ మేరకు నంద్యాల తాలూకా పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపారు. ►గడివేముల ప్రాంతానికి చెందిన కొంతమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని చెప్పి సుమారు రూ. 6 లక్షలు వసూలు చేసి మోసం చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేసి కటకటాలకు పంపారు. ►ఆత్మకూరు ప్రాంతంలో కొంతమంది రైతుల వద్ద డబ్బులు వసూలు చేసుకుని తహసీల్దార్, ఆర్డీఓ, సబ్–రిజి్రస్టార్ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు తయారుచేసిచ్చాడన్న ఫిర్యాదు మేరకు 2018లో బండిఆత్మకూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ►తుగ్గలి మండలం రాతన గ్రామానికి చెందిన ఉమా మహేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
మోసం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు
రాయపర్తి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తీరా గర్భం దాల్చి బాబుకు జన్మనిచ్చాక కాదు పొమ్మంటున్నాడని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఓ యువతి. ఏఎస్సై సదయ్య కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన ఉబ్బని రాజకుమారి(25) తల్లిదండ్రులు అనారోగ్యం కారణంగా మృతిచెందారు. ఈ క్రమంలో ఒక్కతే ఇంటివద్ద ఉంటుంది. మండలంలోని మైలారానికి చెందిన గబ్బెట శ్రీకాంత్కు రాజకుమారికి పరిచయం ఏర్పడింది. మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో గర్భం దాల్చింది. నవంబర్ 29న వర్ధన్నపేట సీహెచ్సీలో బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడు బాబుకు నాకు సంబంధం లేదు అంటూ వదిలేస్తున్నాడు. అతనిపై చర్య తీసుకుని నాకు న్యాయం చేయాలని పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
10మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్న శామ్యూల్ విలియమ్స్
-
ప్రేమ పేరిట మహిళలకు వల
నెల్లూరు(క్రైమ్): ప్రేమ పేరిట మహిళలకు వలవేసి వారిని మోసం చేసి బెదిరింపులకు పాల్పడడం.. రూ.లక్షలు వసూలు చేసి విలాసవంతంగా జీవిస్తున్న ఓ నిత్య ప్రేమికుడిని నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని బాలాజీనగర్ పోలీసు స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. ఇందుకూరుపేట మండలం రావూరు గారమానికి చెందిన తాటిచెట్ల వాసు ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఏసీలు బిగించేందుకు, సర్వీస్ చేసేందుకు పలువురికి ఇళ్లకు వెళుతుండేవాడు. ఈ క్రమంలో అక్కడున్న మహిళలు, యువతులను పరిచయం చేసుకునేవాడు. వారి వివరాలను సేకరించి తరచూ వారికి ఫోన్లు చేయడం, వాట్సాప్, ఫేస్బుక్ల్లో చాటింగ్ చేసి వారిని ప్రేమిస్తున్నాని మాయమాటలు చెప్పి లోబర్చుకునేవాడు. వారి స్నేహితురాల వివరాలను తెలుసుకుని ఇదే తరహాలో వంచించేవాడు. ఆ తర్వాత వారిని బెదిరించి రూ.లక్షలు వసూలు చేసి విలాసవంతంగా జీవించసాగాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. వాసు నగరంలోని చిన్నబజారుకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో శారీరకంగా దగ్గరయ్యాడు. సదరు మహిళ ద్వారా ఆమె స్నేహితురాలైన వరంగల్ జిల్లా కె.సముద్రంకు చెందిన ఓ మహిళకు వలవేశాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి ఆమెను తీసుకుని నెల్లూరుకు వచ్చాడు. ఇందుకూరుపేటలోని గంగమ్మగుడిలో వివాహం చేసుకుని కాపురం పెట్టాడు. అనంతరం ఆమెను పీడించి డబ్బులు తీసుకుని తీవ్రంగా హింసించడంతో బాధిత మహిళ తన స్వగ్రామానికి వెళ్లింది. వాసుపై కె.సముద్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.12 లక్షలు కాజేశాడు అనంతరం ఇందుకూరుపేటకు చెందిన ఓ యువతికి ఫేస్బుక్, వాట్సప్ ద్వారా ప్రేమిస్తున్నాని సందేశాలు పంపి ఆమెను లోబర్చుకుని మోసం చేశాడు. కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటూ నగరానికి చెందిన ఓ వైద్య విద్యార్థినికి వలవిసిరాడు. ఆమెకు మాటలు చెప్పి రూ.12 లక్షలు నగదు కాజేశాడు. ఈ మేరకు బాధితురాలు బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి తన సిబ్బందితో కలిసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితుడు ఇదే తరహాలో పలువురిని మోసగించినట్లు విచారణలో వెల్లడై ంది. అదేక్రమంలో 2013లో వాసు సైదాపురం పోలీసు స్టేషన్ పరిధిలో స్నేహితులతో కలిసి డెకాయిటీకి పాల్పడ్డాడని తేలింది. అతడిని అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. జాగ్రత్త.. విద్యార్థినులు, యువతులు, మహిళలు సోషల్ మీడియాను వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ మురళీకృష్ణ సూచించారు. వ్యక్తిగత వివరాలు తెలుసుకుని దుండగులు నేరాలకు పాల్పడుతున్నారన్నారు. తీయని మాటలు చెబుతూ ప్రేమిస్తున్నాని నమ్మబలికే ఈ తరహా వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. నిత్య ప్రేమికుడిని అతి చాకచక్యంగా అరెస్ట్ చేసిన బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి, ఎస్సై రమేష్, నాలుగో నగర హెడ్కానిస్టేబుల్ ప్రసాద్ను డీఎస్పీ అభినందించారు. -
మాట్రి‘మోసగాడికి’ అరదండాలు!
సాక్షి, సిటీబ్యూరో: గోవాలో పుట్టి పెరిగాడు... చదువు అబ్బకపోయినా మంచి మాటకారి.. తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు... వీటి నుంచి గట్టెక్కేందుకు ‘మాట్రిమోనియల్ ఫ్రాడ్స్’ మొదలెట్టాడు... తానో ప్రొఫెసర్గా చెప్పుకుంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఎర వేసి పెళ్లా ప్రస్తావన తెచ్చాడు... తల్లికి అనారోగ్యమంటూ అందినకాడికి దండుకున్నాడు... ఈ పంథాలో అనేక మంది యువతులను మోసం చేసిన ఘరానా మోసగాడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. బుధవారం అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్తో కలిసి వివరాలు వెల్లడించారు. గోవా ‘ప్రభావం’తో చదువుకు దూరం... నెల్లూరుకు చెందిన నల్లపాటి వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా బిల్డర్. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్ల క్రితం గోవాలో స్థిరపడ్డాడు. అతడికి అక్కడే జీవన్కుమార్ పుట్టాడు. చిన్నప్పటికీ నుంచి అక్కడే పెరిగిన జీవన్పై ‘స్థానిక పరిస్థితుల’ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో చదువు అబ్బక పదో తరగతితోనే పుల్స్టాప్ పెట్టాడు. చాలా కాలంగా ఫేస్బుక్లో వివిధ పేర్లతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం అతడికి అలవాటు. తల్లి చిన్నతనంలోనే చనిపోగా... గత ఏడాది తండ్రి సైతం మరణించడంతో జీవన్ ఒంటరయ్యాడు. తనకు ఉన్న ‘క్వాలిఫికేషన్స్’తో ఉద్యోగాల కోసం ప్రయత్నించినా దొరక్కపోవడంతో ప్రకాశం జిల్లాలో ఉన్న నానమ్మ దగ్గరకు వచ్చేశాడు. ఆమె తన పింఛన్తోనే మనువడిని పోషిస్తోంది. ఫొటో, పేరు మార్చేసి ప్రొఫైల్... కొన్నేళ్లుగా తనకు ఉన్న ‘ఫేస్బుక్ అనుభవాన్ని’ మాట్రిమోనియల్ సైట్స్లో వాడాలని కుట్ర పన్నాడు. మారు పేరు, ఫొటోలతో పాటు లేని అర్హతలను అందులో పొందుపరిచి మోసాలకు తెరలేపాడు. ఇన్స్ట్రాగామ్ నుంచి గుజరాత్కు చెందిన మోడల్ పృథ్వీష్ శెట్టి ఫొటోను డౌన్లోడ్ చేసుకుని దీనిని వినియోగించి తన పేరు రిషి కుమార్గా పేర్కొంటూ జూన్లో జీవన్సాథీ.కామ్ వెబ్సైట్లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. అందులో తాను పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పొందానని, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైస్సెస్ (ఐఐఎస్సీ) ప్రొఫెసర్గా పని చేస్తున్నట్లు పొందుపరిచాడు. దీని ఆధారంగా అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన యువతులకు రిక్వెస్ట్లు పంపాడు. ఫొటో, ప్రొఫైల్స్ చూసిన అనేక మంది అతడిని సంప్రదించారు. దీంతో జీవన్కుమార్ తన పథకాన్ని అమలులో పెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘కనిపించకుండా’... సదరు యువతుల వద్ద పెళ్లి ప్రతిపాదన చేసే జీవన్ ఫోన్ నెంబర్లు తీసుకునే వాడు. బోగస్ వివరాలతో తీసుకున్న సిమ్కార్డులు వినియోగించి వారితో మాట్లాడటం, చాటింగ్ చేయడం చేసేవాడు. నకిలీ ఫొటోతో ప్రొఫైల్ క్రియేట్ చేసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యువతులను కలవకుండా జాగ్రత్తలు పడ్డాడు. కొందరు వీడియో చాటింగ్ చేద్దామన్నా... వద్దంటూ వారించేవాడు. పూర్తిగా తనను నమ్మారని భావించిన తర్వాత తన తల్లికి క్యాన్సర్ అంటూ కథ చెప్పేవాడు. వైద్య ఖర్చుల పేరు చెప్పి వారి నుంచి నగదును తన బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయించేవాడు. మరికొందరి నుంచి క్రెడిట్/డెబిట్కార్డుల వివరాలు, ఓటీపీలు తీసుకుని ఆన్లైన్లో షాపింగ్లు చేసేవాడు. ఇలా ఐదు నెలలుగా ఐదుగురిని మోసం చేశాడు. ఇతడిపై అక్కడి సైబర్ క్రైమ్ ఠాణాల్లోనూ కేసులు నమోదైనా ఇప్పటి వరకు ఎవరూ గుర్తించి పట్టుకోలేదు. విలాసవంతమైన జీవితం... నగరంలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతి నుంచి రూ.2.4 లక్షలతో సహా బెంగళూరు, ఢిల్లీ, ఒడిస్సాలకు చెందిన నలుగురి నుంచి రూ.20 లక్షలు స్వాహా చేశాడు. ఈ సొమ్ముతో జీవన్ అత్యంత విలాసవంతమైన జీవితం గడిపేవాడు. గోవాలో ఎంజాయ్ చేయడంతో పాటు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేసే ఆరు ఐ–ఫోన్లు, రూ.33 వేలతో యాపిల్ వాచ్, రూ.2.4 లక్షలతో బైక్, రూ.13 వేలతో యాపిల్ ఇయర్ ఫోన్లు తదితరాలు ఖరీదు చేశాడు. ఓ యువతి నుంచి డబ్బు తీసుకుని తర్వాత ఆమెతో సంప్రదింపులకు వాడిన సెల్ఫోన్ నెంబర్ మార్చేసేవాడు. ఇలా మోసపోయిన సికింద్రాబాద్ యువతి గత నెల మొదటి వారంలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతిరంగా దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్, ఎస్సై మధుసూదన్రావు, కానిస్టేబుళ్లు సతీష్ కుమార్, మురళీ నిందితుడు ప్రకాశం జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి అరెస్టు చేసి తీసుకువచ్చి రిమాండ్కు తరలించారు. ఇతడి నుంచి రూ.6 లక్షల విలువైన సొత్తు రికవరీ చేసిన అధికారులు బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.4.8 లక్షలు ఫ్రీజ్ చేశారు. -
ట్రూకాలర్లో డీజీపీ అని పెట్టుకొని..
సాక్షి, హైదరాబాద్ : ట్రూకాలర్ ఈ స్మార్ట్ యాప్ గురించి తెలియని వారుండరు. మనకు తెలియని నంబర్ల నుంచి ఫోన్ వస్తే వారి పేరును తెలుసుకునేందుకు సహాయ పడుతుంది. ఈ యాప్ వాడే వ్యక్తులు తమ పేరును రిజిస్టర్ చేసుకుంటారు. అందరూ వాళ్ల అసులు పేరు లేకపోతే ముద్దుపేరు పెట్టుకుంటారు. కానీ తెలివిమీరిన ఓ వ్యక్తి పెట్టుకున్న పేరు, అతడు చేసిన మోసాలు కటకటాలపాలు చేసేలా చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి పారిశ్రామికవాడ, ఫేజ్–5లో బిట్ల వెంకటేశ్వరరావు అనే పారిశ్రామికవేత్తకు ఉజ్వల ఇండస్ట్రీస్ పేరిట పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమను 2017 డిసెంబరులో సికింద్రాబాద్కు చెందిన ఆర్ఈ కేబుల్స్ ప్రతినిధి హితేష్ జైన్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. కాగా కంపెనీ వ్యవహరాలన్నీ హితేష్ జైన్ తమ్ముడు జతిన్ జైన్ చూసుకునేవాడు. ఈ క్రమంలో గత మార్చి నుంచి ఇప్పటి వరకు కంపెనీకి సంబంధించి అద్దె, కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పరిశ్రమ యజమాని వెంకటేశ్వరరావు జతిన్జైన్ను నిలదీశాడు. దీనిపై వివాదం ఏర్పడగా వెంకటేశ్వరరావు చర్లపల్లి అసోసియేషన్ ప్రతినిధులను ఆశ్రయించాడు. అసోసియేషన్ ప్రతినిధులు జతిన్ జైన్కు ఫోన్ చేశారు. వారికి కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. నేనెవరో మీకు తెలుస్తుంది...ఒక్కసారి ట్రూ కాలర్ చెక్ చేసుకోండి అంటూ బెదిరింపు లకు పాల్పడుతూ ఫోన్ కట్ చేశాడు. తరువాత ట్రూకాలర్లో చూడగా డీజీపీ–టీఎస్ అని రావడంతో అసోసియేషన్ ప్రతినిధులు బాధితునితో కలిసి మంగళవారం డీజీపీని కలిశారు. వెంటనే స్పందించిన డీజీపీ, సీపీతో మాట్లాడారు. రంగంలోకి దిగిన కుషాయిగూడ పోలీసులు జతిన్జైన్ను అదుపులోకి తీసుకున్నారు. -
చంద్రబాబు మోసగాడని మోదీ తెలుసుకోలేకపోయారు!
సాక్షి, నెల్లూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసగాడని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుసుకోలేకపోయారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి రూ. 16800 కోట్లు ప్రధానమంత్రి కేటాయించగానే.. చంద్రబాబు కొనియాడారని, కానీ, అవినీతి, అక్రమాల కారణంగా కేంద్రం నుంచి ఆ నిధులను చంద్రబాబు తెచ్చుకోలేకపోయారని విమర్శించారు. నెల్లూరులో మంగళవారం కన్నా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత దోపిడీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబుని రాబోయే ఎన్నికల్లో తరిమితరిమి కొట్టాల్సిన అవసరం ఉందని కన్నా పేర్కొన్నారు. కేంద్రం ఇప్పటివరకు రూ. లక్ష 55 వేల కోట్ల నిధులను ఏపీకి ఇచ్చిందని తెలిపారు. కేంద్రం మంజూరుచేసిన పక్కా ఇళ్ల నిర్మాణంలోనూ భారీ అక్రమాలు జరిగాయని తెలిపారు. చివరికీ మరుగుదొడ్ల నిర్మాణంలోనూ టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయని, అవినీతి, అరాచకాలు, అక్రమాలు తప్ప పాలన లేదని అన్నారు. టీడీపీ అవినీతికి కట్టుబడితే.. బీజేపీ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. -
చిక్కినా చిక్కులే!
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణతో పాటు మహారాష్ట్రలో ఒకే పంథాలో వరుస మోసాలకు పాల్పడుతున్న ‘గ్రేట్ చీటర్’ అఫ్తాబ్ అహ్మద్ షేక్ చిక్కడం ఒక ఎత్తయితే... అతడిని విచారించడం మరో ఎత్తు. ఇంటరాగేషన్ చేయడానికి ప్రయత్నించే పోలీసులకు చుక్కలు చూపిస్తుంటాడు. మరోపక్క ఈ ఘరానా నేరగాడు అనేక సందర్భాల్లో ‘ప్లీడెడ్ గిల్టీ’ విధానం అనుసరించినట్లు పోలీసులు తెలిపారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ మాదిరిగా తయారయ్యే అఫ్తాబ్ ఎదుటి వారిని బురిడీ కొట్టించడానికి ముందు వారి మానసిక స్థితి, ఆర్థిక పరిస్థితి, అవసరాలను అధ్యయనం చేసిన తర్వాతే టార్గెట్ను ఎంపిక చేసుకుంటాడు. మాటలతో గారడీ చేసి తన ‘పని’ పూర్తి చేసుకుంటాడు. ఈ పంథాలో రెచ్చిపోయే అఫ్తాబ్ను పట్టుకోవడం సైతం పోలీసులకు సవాలే. పాతబస్తీలోని రెయిన్బజార్ ప్రాంతంలో ఇతడి నివాసం ఉన్నప్పటికీ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో? ఎవరిని మోసం చేస్తాడో? తెలియని పరిస్థితి. కొన్ని రోజుల పాటు అతడి ఇంటి వద్ద కాపుకాస్తే తప్ప పట్టుకోలేరు. రమ్మంటే రక్తం వస్తుంది... ఇంత కష్టపడిన పోలీసులు అఫ్తాబ్ను పట్టుకున్నప్పటికీ అతడిని పూర్తిస్థాయిలో విచారించడం, కాజేసిన డబ్బు/సొత్తు రికవరీ చేయడం అంత తేలికకాదు. శరీర అవయవాలతో పాటు రక్తం కూడా అతడి ‘చెప్పు చేతల్లోనే’ ఉండటం దీనికి ప్రధాన కారణం. పోలీసులు ఇంటరాగేషన్ ప్రారంభించిన వెంటనే తాను చేసిన నేరాల చిట్టా విప్పుతాడు. రికవరీ కోసం సిద్ధమవుతున్నారనే సరికి అఫ్తాబ్కు ‘అనారోగ్యం’ వచ్చేస్తుంది. తొలుత కళ్లు తేలేయడంతో పాటు ఏదో ఒక చేతికి పక్షవాతం వచ్చినట్లు వంచేస్తాడు. ఆపై నోరు, చెవి నుంచి రక్తం కారేలా చేస్తాడు. దీనిని చూసిన పోలీసులు ఏదో జరుగుతోందనే భయంతో సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్తారు. అతడికి ఏం జరిగిందనేది గుర్తించడానికి వైద్యులు అనేక పరీక్షలు చేయాల్సి ఉంటుందంటారు. అంత ఖర్చు పెట్టడం సాధ్యం కాని నేపథ్యంలో పోలీసులు ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం అతడు కోలుకున్నాక జైలుకు తరలించేస్తారు. గత ఏడాది ఓ ప్రత్యేక విభాగానికి చిక్కినప్పుడు అఫ్తాబ్ ఇదే పంథా అనుసరించి రికవరీలు ఇవ్వకుండా తప్పించుకున్నాడు. తాజాగా సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కినప్పుడూ ఇదే ‘మంత్రం’ ప్రయోగించాడు. దీంతో అధికారులు ఇతగాడిని పాతబస్తీలో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అసలు విషయం గుర్తించి చెప్పడంతో తమదైన శైలిలో విచారించిన టాస్క్ఫోర్స్ మొత్తం 18 తులాల బంగారం రికవరీ చేయగలిగింది. లాయర్ ఖర్చులు, ఎన్బీడబ్ల్యూలు నో... సాధారణంగా ఏదైనా కేసులో అరెస్టయిన నిందితులు ప్రాథమికంగా ఓ లాయర్ను ఏర్పాటు చేసుకుంటారు. ఆయన ద్వారా బెయిల్ తీసుకుని కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఇలా హాజరుకాకుంటే ఆ నిందితుడిపై న్యాయస్థానం నాన్–బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేస్తుంది. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో నేరాలు చేసి అక్కడి పోలీసులకు చిక్కే అఫ్తాబ్ కోర్టు వాయిదాలకు హాజరు కావడం, లాయర్ను ఫీజులు చెల్లించడం ఇబ్బందికరంగా భావిస్తాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే ప్లీడెడ్ గిల్టీ కోసం ప్రయత్నిస్తాడు. అంటే.. ఆయా కేసుల్లో దర్యాప్తు పూర్తయి, చార్జ్షీట్లు దాఖలయ్యే వరకు జైల్లోనే ఉంటాడు. ఆపై న్యాయమూర్తి ఎదుట తాను చేసిన నేరాన్ని అంగీకరించేస్తాడు. దీనినే సాంకేతికంగా ప్లీడెడ్ గిల్టీ అంటారు. దీంతో కోర్టు అతడికి శిక్ష విధించేస్తుంది. అది పూర్తి చేసుకున్న తర్వాతే జైలు నుంచి బయటకు వస్తుంటాడు. ఇది సాధ్యం కాని సందర్భాల్లో మాత్రమే బెయిల్ తీసుకుంటాడని పోలీసులు పేర్కొన్నారు. అనేక కేసుల్లో సాక్షులు, ఫిర్యాదుదారులకు సైతం తన ‘అనారోగ్యం’ చూపించి రా>జీ కోసం ప్రయత్నాలు చేస్తుంటాడని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అఫ్తాబ్ 2007 నుంచి నగరంలో నేరాలు చేస్తున్నప్పటికీ ఒక్క కేసులోనూ ఎన్బీడబ్ల్యూ జారీ కాలేదని వివరిస్తున్నారు. ఇతగాడి నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న నిజామాబాద్ పోలీసుల పీడీ యాక్ట్ ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఎయిమ్స్లో.. ‘శంకర్దాదా ఎంబీబీఎస్’
సాక్షి, న్యూఢిల్లీ : అద్నన్ ఖుర్రమ్ 19 ఏళ్ల యువకుడు. ఎంతటివారినైనా బురిడీ కొట్టించగల ఘనుడు. తన ప్రతిభతో డాక్టర్ సీటు సంపాదించలేకపోయాడు గానీ ప్రొఫెసర్ల కళ్లుగప్పి ఐదు నెలలపాటు ఎయిమ్స్ జూనియర్ డాక్టర్గా నటిస్తూ లబ్ది పొందాలని చూశాడు. చివరికి మోసం బయటపడటంతో కటకటాల పాలయ్యాడు. బీహార్ టూ ఢిల్లీ.. బీహార్కు చెందిన అద్నన్ ఖుర్రమ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రొఫెసర్లతో పరిచయం పెంచుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎమ్సీ) బిల్లుకు వ్యతిరేకంగా రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్(ఆర్డీఏ) ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్లో ఖుర్రమ్ తనను తాను జూనియర్ రెసిడెంట్ డాక్టర్గా వారికి పరిచయం చేసుకున్నాడు. మోసం బయటపడిందిలా.. ఆర్డీఏ చేపట్టే ప్రతీ నిరసన కార్యక్రమాల్లో, మారథాన్లలో ఖుర్రం చురుగ్గా పాల్గొనేవాడు. అయితే ఆ కారణంగానే అతని మోసం బయటపడింది. మామూలుగా జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు 18 నుంచి 20 గంటల డ్యూటీ ఉంటుంది. డ్యూటీ చేయకుండా ఖుర్రం ఎప్పుడూ బయటే కనిపించేవాడని, దాంతో అతనిపై అనుమానం కలిగిందని డాక్టర్ హర్జీత్ సింగ్ భట్టి తెలిపారు. వెంటనే విద్యార్థుల ప్రవేశ పట్టికతో పాటు స్టైఫండ్ పొందే విద్యార్థుల జాబితా పరిశీలించగా ఖుర్రమ్ పేరు ఎక్కడా కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. ఎయిమ్స్లో సుమారు 2 వేల మంది రెసిడెంట్ డాక్టర్లు ఉంటారని.. అందుకే ఖుర్రం మోసాన్ని కనుక్కోలేకపోయామని తెలిపారు. అంతేకాకుండా నిరసనకు మద్దతు తెలిపేందుకు వచ్చే వీఐపీలతో ఫొటోలు దిగడానికి మాత్రమే ఆసక్తి చూపేవాడని పేర్కొన్నారు. అలా రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ వంటి ప్రముఖ వ్యక్తులతో ఫొటోలు దిగి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని.. జూనియర్ డాక్టర్లుగా చెప్పుకుంటూ తమ కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు పొందారన్నారు. ఖుర్రంను అరెస్టు చేసిన పోలీసులు సెక్షన్ 419(మోసం), సెక్షన్ 468(ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం)ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ప్రేమ పేరుతో మోసాలు
బంజారాహిల్స్: ప్రేమ పేరుతో యువతులకు వలవేసి పెళ్లి చేసుకున్నట్లు మభ్యపెట్టి వారి నుంచి అందినకాడికి దండుకొని మోసాలకు పాల్పడుతున్న యువకుడిపై జూబ్లీహిల్స్పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కార్వాన్, మొఘల్నగర్కు చెందిన మహ్మద్ మహబూబ్ షరీఫ్ అనే యువకుడు ఏడాది క్రితం కావూరిహిల్స్ ఫేజ్–1కు చెందిన యువతిని ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి కూడా చేసుకున్నాడు. అనంతరం ఆమె వద్ద కిలో బంగారం, రూ.10 లక్షల నగదు తీసుకొని జల్సాల కోసం ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. మూడు నెలలుగా ఆమెను వేధించడమేగాక ఇంట్లో నుంచి తరిమివేశాడు. బాధితురాలు అతని వైఖరిపై ఆరా తీయగా అప్పటికే మరో నలుగురు యువతులను ఇదే తరహాలో మోసం చేసి వారి నుంచి బంగారం, నగదు తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆమె షరీఫ్పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయితే అతను శనివారం రాత్రి బాధితురాలిని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45కు తీసుకువచ్చి కేసు విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. లేని పక్షంలో వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. షరీఫ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేస్బుక్ మోసగాడు అరెస్టు
కాకినాడ రూరల్: ఫేస్బుక్ ప్రేమ పేరుతో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులను మోసగించి, బెదిరించి డబ్బులు, బంగారు, మోటార్సైకిళ్లు దోచుకుంటున్న యువకుడిని సర్పవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గురువారం సర్పవరం స్టేషన్లో కాకినాడ డీఎస్పీ రవివర్మ, సర్పవరం సీఐ చైతన్యకృష్ణ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కాకినాడ రాజీవ్గాంధీ లా కళాశాలలో ఎల్ఎల్బీ చదువుతున్న ఉప్పాడ గ్రామానికి చెందిన స్వామిరెడ్డి శ్రీనివాసరావు (28) ఫేస్బుక్ ప్రేమపేరుతో మెడిసిన్, ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతున్న అమ్మాయిలను, వివిధ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులను బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలను, మోటార్సైకిళ్లను దోచుకుంటున్నాడన్నారు. తన పేరు షాలినీ కుసిరెడ్డి అని రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నట్టు ఫేస్బుక్లో పరిచయం చేసుకుని, బాగా పరిచయమైన తరువాత తన పేరు స్వామిరెడ్డి శ్రీనివాసరావు అని చెబుతున్నాడన్నారు. రూ.కోటి, రూ.రెండు కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టిస్తానని తనను ప్రేమించమంటూ వేధిస్తున్నాడని పోలీసులు వివరించారు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదా శారీరకంగా కలవాలని లేకపోతే అధిక మొత్తంలో డబ్బులు, బంగారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడని డీఎస్పీ రవివర్మ వివరించారు. డబ్బులు, బంగారం ఇవ్వక పోతే ఫేస్బుక్, వాట్సాప్లలో వారి ఫోటోలు డౌన్లోడ్ చేసుకుని మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలుగా నెట్లో పెడతానని బెదిరించేవాడన్నారు. స్వామిరెడ్డి శ్రీనివాసరావు విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థినిని, అమలాపురం కిమ్స్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని వేధింపులకు గురి చేసి డబ్బులు డిమాండ్ చేసినట్టు డీఎస్పీ రవివర్మ, సీఐ చైతన్యకృష్ణ వివరించారు. కిమ్స్ కళాశాల విద్యార్థిని నుంచి రూ. 10వేలు, జేఎన్టీయూకే విద్యార్థినిని బెదిరించి రూ.80వేల నగదు, బంగారు బ్రాస్లెట్, ఉంగరం వసూలు చేశాడన్నారు. అదే విధంగా విశాఖపట్నానికి చెంది ఐఓసీఎల్లో పని చేస్తున్న ఒక ఆమెను బ్లాక్ మెయిల్ చేసి రూ.18 వేలు వసూలు చేశాడని, కాకినాడకు చెందిన విద్యార్థిని నుంచి హోండా యాక్టీవా మోటర్ సైకిల్, విశాఖపట్నానికి చెందిన ఆమెకు సంబంధించి టీవీఎస్ జ్యూపిటర్ మోటర్సైకిల్ను దొంగిలించాడన్నారు. ఇదే విధంగా విశాఖపట్నానికి చెందిన ఒక మైనరు బాలికను వంచించి న్యూడ్ వీడియో తీసి డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నాడన్నారు. ఇతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు డీఎస్పీ రవివర్మ, సీఐ చైతన్యకృష్ణ వివరించారు. -
చీటర్ పట్టివేత
అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో సదరం సర్టి ఫికెట్ ఇప్పిస్తానంటూ ఓ వికలాంగురాలి నుంచి డబ్బు వసూలు చేసి, ముఖం చాటేసిన చీటర్ను సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే ఈ నెల 8న ధర్మవరం తారకరామాపురానికి చెందిన రామలక్ష్మి సదరం సర్టిఫికెట్ కోసం ఓపీ నంబర్ 9కి వెళ్లింది. ఓపీ వద్ద ఓ వ్యక్తి వైకల్యం సర్టిఫికెట్ ఇప్పిస్తానని, అందుకు రూ.వెయ్యి ఖర్చు అవుతుందని తెలిపాడు. దీంతో రామలక్ష్మి తన వద్ద అంత లేదని రూ.600 మాత్రమే ఉందని చెప్పింది. ఉన్న డబ్బులు ఇవ్వాలని, సర్టిఫికెట్ ఇచ్చే ముందు మిగతా రూ.400 ఇవ్వాలని చెప్పాడు. సర్టిఫికెట్ వస్తుందన్న ఆశతో ఆమె రూ.600 సమర్పించుకుంది. మొదట ఆధార్కార్డు జిరాక్స్ చేసుకుని రావాలని, తాను ఇక్కడే ఉంటానని తెలిపాడు. జిరాక్స్ చేయించుకుని ఓపీ వద్దకు వస్తే ఆ వ్యక్తి కనిపించకపోవడంతో తాను మోసపోయానని రామలక్ష్మి సెక్యూరిటీ సూపర్వైజర్ ఇర్ఫాన్ దృష్టికి తీసుకెళ్లింది. చాకచక్యంగా.. ఆస్పత్రి సెక్యూరిటీ సూపర్వైజర్ ఇర్ఫాన్ చాకచక్యంగా వ్యవహరించారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాలో నమోదైన ఫొటోను సెల్లో తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఓపీ నంబర్ 9 వద్ద మరోసారి సదరు వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. సెక్యూరిటీ సూపర్వైజర్లు ఇర్ఫాన్, నరేష్ గట్టిగా నిలదీయడంతో రామలక్ష్మి నుంచి సర్టిఫికెట్ కోసం డబ్బు తీసుకున్న మాట వాస్తవమేనని సదరు వ్యక్తి ఒప్పుకున్నాడు. తన పేరు రెడ్డప్పరెడ్డి అని, ఊరు నల్లమాడ మండలం అయ్యన్నగారిపల్లి అని తెలిపాడు. అనంతరం అతడిని సెక్యూరిటీ సిబ్బంది టూటౌన్ పోలీసులకు అప్పగించారు. -
రంగస్వామి లీలలు గుట్టురట్టు..
సాక్షి, హైదరాబాద్ : చదివింది అయిదో తరగతి, అయితేనేమీ ఫేస్బుక్ వాడటంలో మాత్రం ఆరితేరిన నిపుణుడు. దీంతో ఫేస్బుక్ ద్వారా ఒంటరి మహిళలతో పరిచయం పెంచుకొని మాయమాటలు చెప్పి వశపరుచుకోవటమే కాకుండా అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ ఘరానా మోసగాడిని ఎట్టకేలకు రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 20 మంది మహిళలు ఇతగాడి బారిన పడ్డారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావించి చాలామంది మిన్నకుండిపోగా, ఓ బాధితురాలు మాత్రం ధైర్యం చేసి పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో రంగస్వామి గుట్టురట్టు అయింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా బుక్కరాయపట్నంకు చెందిన రంగస్వామి చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్లో స్థిరపడ్డాడు. జల్సాలకు అలవాటు పడ్డ అతడు చిన్నతనం నుంచే నేరాలకు పాల్పడేవాడు. చదివింది ఐదో తరగతే అయినా ఫేస్బుక్ వాడటంలో రంగస్వామి దిట్ట. దీన్నే అస్త్రంగా భావించిన అతడు ఒంటరి మహిళలను టార్గెట్ చేశాడు. వారిని ప్రేమ, పెళ్లి అంటూ నమ్మించి లక్షల్లో దండుకొని పరారయ్యేవాడు. నగరంలోని నాచారం, లాలాపేట్, లాలాగూడలకు చెందిన సుమారు 20 మందికి పైగా మహిళలు మోసపోయారు. వీరంతా ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నవారు కావడం విశేషం. పరువు పోతుందని చాలా మంది బాధితులు బయటకు రాలేదు. అయితే లాలాగూడకు చెందిన ఓ మహిళ రంగస్వామి తనను మోసం చేశాడని, పెళ్లిచేసుకుంటానని నమ్మించి లక్షల్లో వసూలు చేసి పరారయ్యాడని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. తనపై పలుమార్లు అత్యాచారం కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలో దిగిన పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడిని అరెస్టు చేశారు. రంగస్వామికి ఇదివరకే నేరచరిత్ర ఉంది. చైన్ స్నాచింగ్, హత్యాయత్నం బెదిరింపు కేసులుకూడా నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయినా అతగాడి బుద్ధి మాత్రం మారలేదు. ప్రస్తుతం అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
ఘరానా మోసగాడి అరెస్ట్
ఏలూరు అర్బన్ : పోలీస్, విజిలెన్స్, ఏసీబీ అధికారినంటూ రేషన్ డీలర్లు లక్ష్యంగా నేరాలకు పాల్పడిన ఘరానా మోసగాడిని గణపవరం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వలిశెల రత్న వివరాలు వెల్లడిం చారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామానికి చెందిన అయితం రవిశేఖర్ అనే వ్యక్తి విలాసాలకు బానిసై మోసగాడికి మారాడు. తాను పోలీస్, విజిలెన్స్, ఏసీబీ అధికారినంటూ ప్రజ లకు పరిచయం చేసుకోవడంతో పాటు దొంగిలించిన కార్లకు ప్రభుత్వ నంబర్ ప్లేట్లను అమర్చుకుని వాటిపై ప్రభుత్వ వాహనం అని రాయించుకుని తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి తాను విజిలెన్స్ అధికారినంటూ హ డావుడి చేసేవాడు. కేసు లేకుండా చేస్తానని డీలర్లను నమ్మించి వారి వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కాజేసేవాడు. ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి సొమ్ములు వసూలు చేసుకుని పరారయ్యేవాడు. నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో అలపాటి రాజ్యలక్ష్మి అనే రేషన్ షాపు డీలర్ భార్యను మోసగించి 25 కాసుల బంగారు ఆభరణాలు, ఉంగుటూరుకు చెందిన పారంపాటి రాఘవేంద్రరావును ఏసీబీ అధికారినంటూ మోసగించి స్విఫ్ట్ డిజైర్ కారును అపహరించుకుపోయాడు. ఇలా ఇప్పటి వరకూ 80కు పైగా నేరాలకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో పలుమార్లు పోలీసులకు చిక్కి జైలు శిక్ష కూడా అనుభవించాడు. చివరిగా నల్గొండ జిల్లా భువనగిరిలో మోసానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవించి గతేడాది విడుదలయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 11 నేరాలకు పాల్ప డ్డాడు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, సీసీఎస్ డీఎస్పీ టి.సత్యనారాయణ పర్యవేక్షణలో సీసీఎస్ పోలీసులు, గణపవరం పోలీసు సిబ్బంది నిందితుడిని బాదంపూడి వై.జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. అతడి నుంచి 341 గ్రాముల బంగారు ఆభరణాలు, నకిలీ ఐడెంటిటీ కార్డులు, నకిలీ కార్ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ రత్న వివరించారు. ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, గణపవరం సీఐ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
మాయ మాటలు చెప్పి నగదు హుష్!
* క్రెడిట్ కార్డు నుంచి డెబిట్కు నగదు బదిలీ చేయవచ్చంటూ బురిడీ * పోలీసులకు ఫిర్యాదుచేసిన బాధితుడు నరసరావుపేట టౌన్: క్రెడిట్ కార్డు నుంచి డెబిట్ కార్డులోకి నగదును బదిలీ చేసుకోవచ్చంటూ ఓ ఆగంతకుడు అధ్యాపకుడికి మాయమాటలు చెప్పి అతని ఖాతానుంచి రూ.1.45 లక్షల నగదును అపహరించిన సంఘటన పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. ఒన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం పట్టణంలో ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న బి.వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి 73963 51661 నుంచి గత రెండురోజులుగా ఫోన్ వస్తోంది. సోమవారం మరోమారు ఫోన్ చేసి తనపేరు వేణు అని, హైదరాబాదు గచ్చిబౌలీ ఐసీఐసీఐ బ్యాంకులో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నట్లు చెప్పుకున్నాడు. మీ క్రెడిట్ కార్డు నుంచి మీకున్న డెబిట్కార్డులోకి నగదును ఎటువంటి చార్జీలు లేకుండానే బదిలీ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. అతని మాటలను నమ్మిన ఆ అధ్యాపకుడు తన ఖాతా నంబరుతోపాటు క్రెడిట్ కార్డుపై నున్న నంబర్ను సైతం తెలియచేశారు. దీంతో ఆ ప్రబుద్ధుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తొలుత రూ.20 వేలు నగదును అధ్యాపకుడి ఖాతా నుంచి డ్రా చేశాడు. వెంటనే వెంకటేశ్వరరావు సెల్కు మెసేజ్ రావడంతో బ్యాంకుకు వెళ్లి విచారించగా ఖాతాలో ఉండాల్సిన రూ.1.45 లక్షలు నగదు మాయమైనట్లు గుర్తించాడు. దీంతో తాను మోసపోయినట్లుగా భావించి జరిగిన విషయాన్ని ఎస్ఐ లోకనాథంకు వివరించాడు. బాధితుడి ఫిర్యాదుమేరకు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
మోసగాడు అరెస్ట్
– పెళ్లిచేసుకుని కట్నకానుకలతో విదేశాలకు ఉడాయించిన ఘనుడు – బాధితురాలు విన్నపంతో చొరవ తీసుకున్న ఎస్పీ – రెడ్కార్నర్ నోటీస్తో పట్టుబడిన నిందితుడి వెల్దుర్తి రూరల్: పెళ్లి చేసుకుని భార్యను వదిలేసి కట్నకానుకలతో ఉడాయించిన మోసగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వేధింపుల కేసు నుంచి తప్పించుకునేందుకు నాలుగేళ్లుగా విదేశాల్లో ఉంటున్న నిందితుడిని వెల్దుర్తి పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. వెల్దుర్తి మండలం ఎల్ నగరానికి చెందిన రాధికకు హైదరాబాద్లో స్థిరపడి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న నెల్లూరి వాసి శ్రీధర్రెడ్డితో 2010లో వివాహమైంది. కట్నకానుకల కింద రూ.15 లక్షలు, 25 తులాల బంగారం అందజేశారు. భార్యకు వీసా వచ్చిన వెంటనే తీసుకెళ్తానని నమ్మించి వివాహమైన 15 రోజుల తర్వాత కట్నకానుకలతో ఉడాయించాడు. కొన్నాళ్లు అత్తమామల వద్ద ఉన్న రాధికను నిత్యం వేధించారు. భర్త కూడా అదనపు కట్నం తేవాలని ఒత్తిడి తెచ్చాడు. వేధింపులు భరించలేని రాధిక పుట్టింటికి చేరుకుంది. భర్త, అత్తమామలు వేధిస్తున్నారని 2012లో వెల్దుర్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అదుబాటులో ఉన్న శ్రీధర్రెడ్డి తల్లిదండ్రులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుచగా జడ్జి శిక్ష విధించారు. ఇదే కేసులో ప్రథమ నిందితుడైన శ్రీధర్రెడ్డి నాలుగేళ్లుగా విదేశాల్లో ఉంటూ తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితురాలు విషయం ఎస్పీ ఆకే రవికష్ణ దష్టికి వెళ్లగా ఆయన రెడ్కార్నర్ నోటీసు జారీ చేశారు. కోర్టు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ సైతం జారీ చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్కు వచ్చి వెళ్లే ప్రయత్నంలో నిందితుడు ఈనెల 18న చాకచక్యంగా ఆస్ట్రేలియా నుంచి బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. అయితే రెడ్కార్నర్ నోటీసు ఉండడంతో ఎయిర్పోర్టు అధికారులు విచారించి వెలుర్తి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఎఎస్ఐ నజీర్ బాషా, పోలీసులు విష్ణు, చంద్రమౌళిలు వెంటనే బెంగళూరు చేరుకుని శ్రీధర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు రాత్రి డోన్ మెజిస్ట్రేటు ఎదుట హాజరు పరచగా నిందితుడు పాస్పోర్ట్ స్వాధీన పరుచుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ రిమాండు విధించారు. మరో మహిళకు ఇలా జరుగకుండా ఎస్పీ తీసుకున్న చొరవకు రాధిక తల్లిదండ్రులు శుక్రవారం కతజ్ఞతలు తెలిపారు. -
స్తంబానికి కట్టేసి మోసగాడికి దేహశుద్ధి
కర్నూలు: సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానంటూ మోసం చేస్తున్న ఓ వ్యక్తికి బాధితులు దేహశుద్ధి చేశారు. కర్నూలు పట్టణంలోని లక్ష్మీనగర్లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీరామ్నగర్కు చెందిన హరినాథ్ అలియాస్ శ్రీకాంత్ ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల తరఫున సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.7వేల వరకు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇలా 50 మంది నుంచి నగదు వసూలు చేశాడు. దీంతో లక్ష్మీనగర్ వాసులు ఆదివారం మధ్యాహ్నం అతడ్ని పట్టుకుని విద్యుత్ స్తంభానికి గొలుసుతో కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. -
నకీలీ దస్తావేజులతో మోసగించే ముఠా అరెస్ట్
విజయవాడ(కృష్ణాజిల్లా): నకిలీ దస్తావేజులతో కొనుగోలుదారులను మోసగించే ముఠాను శనివారం విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈ నెల 5న కంకిపాడు పోలీస్స్టేషన్లో యలమంచిలి శేఖర్బాబు అనే వ్యక్తిని పలివేటి కృష్ణప్రసాద్(55) స్థల కొనుగోలు విషయంలో మోసం చేశాడనే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠా గురించి తెలుసుకున్నారు. గుంటూరుకు చెందిన చింతం రమణారెడ్డి అలియాస్ పలివేటి కృష్ణప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనితో ఖాళీ స్టాంపు పేపర్లు విక్రయించే వెళ్లచెరువు కృష్ణారావు, రబ్బరు స్టాంపులను తయారు చేసే అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి(48)లు కలసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు పలు ఏరియాల్లోని వెంచర్ల సర్వేనంబర్లతో నకిలీ స్టాంపు పేపర్లు తయారుచేసి కొనుగోలు దారులను మోసం చేశారు. వీరి పై దృష్టి పెట్టిన కంకిపాడు పోలీస్ బృందం నిందితులను అరెస్ట్ చేసి భారీగా నకిలీ స్టాంపు పేపర్లు, దస్తావేజులను స్వాధీనం చేసుకుంది. -
రణ్బీర్ మోసగాడా?
బాలీవుడ్ బాత్ రణ్బీర్కపూర్, దీపికా పదుకొనే కలిసి చేసిన ‘తమాషా’ ప్రేక్షకులకు మంచి ఫీల్ కలిగించింది. నిజమైన ప్రేమపక్షుల్లా రెచ్చిపోయి కెమిస్ట్రీ పండించారు. ఒకానొక టైమ్లో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట... ఏవో కారణాలతో విడిపోయారు. మళ్లీ కత్రినా కైఫ్తో ప్రేమలో పడ్డాక, రణ్బీర్ కొన్నాళ్లు దీపికతో నటించడం మానేశారు. అయితే ఇటీవలే నటించిన ‘తమాషా’తో వాళ్లిద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఇద్దరూ మునుపటి కన్నా క్లోజ్గా మూవ్ కావడం వీరిద్దరి మధ్య అనుబంధం మీద సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఈ విషయంపై రణ్బీర్ మీద కత్రినా కైఫ్ బాహాటంగానే ఫైర్ అయ్యారని తెలుస్తోంది. ‘‘మోసగాళ్లు ఎక్కడైనా, ఎప్పుడైనా మోసగాళ్లే. ఇలాంటివి నేను సహించలేను’’ అని తన కోపాన్ని ప్రదర్శించారని సమాచారం. మరి వీరిద్దరి బంధం కూడా మూణ్ణాళ్ల ముచ్చటేనా..? అని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. -
మోసగాడు
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 25 ‘‘ఒకవేళ యురేనియం లభించకపోతే వంద డాలర్లు తిరిగి ఇచ్చేస్తారా?’’ ‘‘ఆ. నా ప్రకటనలో హామీ ఇచ్చినట్లుగా ఎవరిది వారికి తిరిగి ఇచ్చేస్తా.’’ ‘‘మీరు తప్పకుండా యురేనియాన్ని కనుగొంటాననే నమ్మకంతో ఉన్నారా?’’ ‘‘అవును. నేను తప్పకుండా కనుక్కుంటా.’’ ‘‘ఇక మీరు వెళ్లవచ్చు’’ రాబర్ట్ నిట్టూర్చి చెప్పాడు. ద వాల్ స్ట్రీట్ జర్నల్లో ఓ రోజు ఓ ప్రకటన వచ్చింది. ఫైనాన్స్ మై యురేనియం హంట్! ఇంపాజిబుల్ టు లూజ్!! ఫైవ్ ఇయర్ మనీ బ్యాక్ గ్యారంటీ. కంప్లీట్ రిఫండ్ ఈవెన్ ఇఫ్ యురేనియం ఈజ్ నెవర్ ఫౌండ్. ఇన్వెస్ట్ 100 డాలర్స. కాంటాక్ట్ ఓల్డ్ ప్రాస్పెక్టర్, బాక్స్ 313. ఈ ప్రకటన అమెరికన్ నేర పరిశోధక సంస్థ ఎఫ్బీఐ దృష్టిలో పడింది. దాని గురించి వివరాలన్నీ సేకరించారు. ఆ ప్రకటన ఇచ్చిన వ్యక్తి పేరు పీటర్ అని, అతను గతంలో కొన్ని ఆర్థిక నేరాలు చేశాడని గుర్తించారు. ఐతే ఇంకా నేరం జరగలేదు. కాబట్టి వాళ్లు వెంటనే ఏం చేయలేరు. అందుకే దాని గురించి చర్చించారు. ఆ చర్చల అనంతరం ఇలా నిర్ణయించారు. ‘అమెరికన్ పెట్టుబడిదారీ విధానంలో ఆ ప్రకటన నేరం కాదు. అంతే కాదు. ఐదేళ్ల దాకా అది నేరం కాదు. ఆ తర్వాత జరిగేది పరిశీలించాక కాని అది నేరమో, కాదో నిర్ణయించలేం. యురేనియం లభిస్తే తద్వారా వచ్చే లాభంలోంచి అందులో పాల్గొని వంద డాలర్లు పంపినవారికి భాగం పంచకపోతే నేరం. లేదా డబ్బు తిరిగి ఇవ్వకపోయినా నేరం’ అని ఫైల్లో రాశారు. అదంతా గమనించే పనిని ఎఫ్బీఐ ఏజెంట్ రాబర్ట్కి అప్పగించారు. అతను పీటర్ని పిలిపించాడు. ‘‘నన్నెందుకు పిలిపించారు?’’ పీటర్ అడిగాడు. ‘‘యురేనియం వేటలో మీరు విజయం సాధిస్తే మీకు వంద డాలర్లు ఇచ్చిన వారందరికీ లాభాలు పంచుతారా?’’ అడిగాడు రాబర్ట. ‘‘తప్పకుండా. ఐదు వేల మందికీ. నా ప్రకటనలో చెప్పింది అదేగా’’ పీటర్ జవాబు చెప్పాడు. ‘‘ఒక్కొక్కరికీ ఎంత ఇవ్వగలరని మీ అంచనా?’’ ‘‘ఐదు వేల డాలర్లు.’’ ‘‘ఐదు వేల డాలర్లా?’’ ఆశ్చర్యంగా అన్నాడు. ‘‘అవును. మీరు కూడా పెట్టుబడి పెట్టాలనుకుంటే టైమ్ ముగిసినా అంగీకరిస్తాను’’ పీటర్ అతణ్ని ఆహ్వానించాడు. ‘‘ఒకవేళ యురేనియం లభించకపోతే వంద డాలర్లు తిరిగి ఇచ్చేస్తారా?’’ ‘‘ఆ. నా ప్రకటనలో హామీ ఇచ్చినట్లుగా ఎవరిది వారికి తిరిగి ఇచ్చేస్తా.’’ ‘‘మీరు తప్పకుండా యురేనియాన్ని కనుగొంటాననే నమ్మకంతో ఉన్నారా?’’ ‘‘అవును. నేను తప్పకుండా కనుక్కుంటా’’ ఏమాత్రం తడబడకుండా చెప్పాడు పీటర్. ‘‘ఇక మీరు వెళ్లవచ్చు’’ రాబర్ట్ నిట్టూర్చి చెప్పాడు. ఐదేళ్ల తర్వాత పీటర్, పెట్టుబడి దారులకి తన కృతజ్ఞతలని తెలియచేస్తూ, యురేనియం గనిని తాను కనుగొనలేక పోయినందుకు అందరి డబ్బునూ తిప్పి పంపానని, చెక్లు అందనివారు తనని సంప్రదించమని మరోసారి పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ‘‘అందరి డబ్బూ ముట్టిందా?’’ ఎఫ్బీఐ డెరైక్టర్ రాబర్ట్ని అడిగాడు. ‘‘అవును సార్. ఒక్క మినహాయింపు ఉన్నా పీటర్ని అరెస్ట్ చేసేవాడిని. కాని ఐదు వేల మందికీ డబ్బుని తిప్పి పంపాడని నా విచారణలో తెలిసింది.’’ ‘‘అంటే పీటర్ నేరం చేయలేదన్నమాట.’’ ‘‘లేదు సార్.’’ ‘‘యురేనియం కనుగొని ఆ లాభాన్నంతా అతనే అనుభవించడం కూడా జరగలేదు కదా?’’ ‘‘అవును సర్. జరగలేదు.’’ ‘‘అంటే ప్రతి పెట్టుబడిదారుడికీ ప్రతి డాలర్నీ ఆఖరు డాలర్ దాకా చెల్లించాడన్నమాట.’’ ‘‘చెల్లించాడు సర్.’’ ‘‘మరి? పీటర్ ఈ ఐదేళ్లూ పడ్డ శ్రమ వృథాయేనా? అతనికి వచ్చిన లాభం ఏమిటి? ఓసారి పీటర్ని తీసుకురా’’... అదేశించాడు డెరైక్టర్. ‘‘సరే సర్’’ అన్నాడు రాబర్ట. పీటర్ వయసు అరవై పైనే. ఎండలో పని చేయడం వల్ల శరీరఛాయ రాగి రంగుకి మారింది. తెల్లటి గడ్డం, తెల్లటి మీసాలు. ఆరోగ్యంగా ఉన్న అతను ఖరీదైన సిగార్ని వెలిగించుకోబోయే ముందు ఎఫ్బీఐ డెరైక్టర్కి ఒకటి ఆఫర్ చేశాడు. ఆయన తిరస్కరించాడు. ‘‘మీరు నన్నెందుకు పిలిపించారు? నేనేం నేరం చేయలేదే?’’ పీటర్ ప్రశ్నించాడు. ‘‘నువ్వు చట్టరీత్యా నేరం చేయలేదు. కానీ నువ్వు నేరస్థుడివని, ఏదో నేరం చేశావని నాకు తెలుసు. అదేమిటో వివరిస్తావని పిలిచాను తప్ప నేరస్థుడిని పిలిచినట్లుగా పిలిపించలేదు’’ అన్నాడు డెరైక్టర్. పీటర్ సిగరెట్ పొగని లోపలికి బాగా పీల్చి వదిలి చెప్పాడు. ‘‘సర్... నేనా ఐదు లక్షల డాలర్లనీ ముట్టనేలేదు.’’ ‘‘ముట్టకుండా ఐదేళ్లు ఎలా యురేనియం వేటని సాగించావు?’’ అర్థం కాక అడిగాడు డెరైక్టర్. ‘‘ప్రపంచంలోని అతి తేలిక మోసం ఇది. ఆ డబ్బుని బ్యాంక్లో ఐదు శాతం వడ్డీకి ఐదేళ్లకి డిపాజిట్ చేశాను. ఏటా నాకు దానిమీద పాతిక వేల డాలర్ల వడ్డీ వచ్చింది. నా ఖర్చు ఏటా పది వేల డాలర్లే. సంవత్సరానికి మిగిలిన పదిహేను వేల డాలర్ల చొప్పున ఐదేళ్లలో మొత్తం డెబ్భై ఐదు వేల డాలర్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఆ మొత్తం నేను మరణించేదాకా సరిపోతుంది. మరి బయట ఎందుకు అంత శారీరక శ్రమ చేశాననా మీ అనుమానం? అది కేవలం కాలక్షేపం కోసం, నా ఆరోగ్యం కోసం. నేను మోసగాడినే కాని నిజాయితీ గల మోసగాడిని’’ పీటర్ నవ్వుతూ చెప్పాడు. (ఎల్లరీ క్వీన్స్ కథకి స్వేచ్ఛావాదం) -
అమ్మాయిలను ట్రాప్ చేసే కీచకుడు అరెస్ట్
-
'దేశంలోనే పెద్ద మోసగాడు చంద్రబాబు'
డాబాగార్డెన్స్(విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో పెద్ద మోసగాడని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి విమర్శించారు. మహిళల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటే ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని మండిపడ్డారు. ఐద్వా విశాఖ నగర కమిటీ ప్లీనరీ సమావేశం సోమవారం వైశాఖి జల ఉద్యానవనంలో జరిగింది. సమావేశంలో ప్రభావతి, రమాదేవి మాట్లాడుతూ నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ర్యాగింగ్ సంఘటనలో ప్రిన్సిపాల్ని అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. నారాయణ కాలేజిలో ఇద్దరు అమ్మాయిలు చనిపోతే, వారి ప్రవర్తన మంచిది కాదని ప్రచారం చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. నర్సీపట్నంలో దివ్యశ్రీ హత్య కేసులో నిందితులను శిక్షించాలని ఆందోళన చేస్తే హంతకులను కాకుండా నిరసనకారులను నిర్బంధించి కేసులు పెట్టడం చంద్రబాబు ప్రభుత్వం నైజానికి దర్పణమన్నారు. ఎన్టీ రామారావు ఆస్తిహక్కు చట్టాన్ని తీసుకువస్తే..దేశ వ్యాప్తంగా చట్టం చేశారని, ప్రస్తుతం ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. -
ఆరుగురితో ప్రేమాయణం
హైదరాబాద్: ఆకట్టుకొనే రూపం.. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటం.. మాటకారితనం.. ఈ మూడు ఆ యువకుడికి పెట్టుబడి... కేవలం పదో తరగతి వరకు చదువుకున్న అతను పూటకో వేషం వేస్తాడు. ప్రేమపేరుతో అమ్మాయిలను వలలో వేసుకోవడం.. నమ్మినోళ్లను నట్టేట ముంచడం... ఇదీ ఇటీవల రాజమండ్రి గోదావరి పుష్కరాలకు వెళ్లిన ఓ ఎన్ఆర్ఐ దంపతుల కారుకు తాత్కాలిక డ్రైవర్గా వెళ్లి నగలతో పాటు కారుతో ఉడాయించిన శ్రీనివాస్రెడ్డి అలియాస్ గౌతంకృష్ణ అలియాస్ సూర్యతేజ(29) నైజం. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన శ్రీనివాస్రెడ్డి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అతని కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో శ్రీనివాస్రెడ్డి మోసాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. ఈ మోసాల్లో కుటుంబ సభ్యులంతా పాత్రధారులు కావడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివరాలు... రంగారెడ్డి జిల్లా బండ్లగూడ కు చెందిన వ్యాపారి కొల్లి గాంధీ అల్లుడు నారాయణరెడ్డి తన భార్య, కుమార్తెతో కలిసి గతనెల 17న పుష్కరస్నానాల కోసం లండన్ నుంచి నగరానికి వచ్చాడు. మరుసటిరోజు తమ స్విఫ్ట్ డిజైర్ కారు (ఏపీ28 డీఆర్ 4408)కు తాత్కాలిక డ్రైవర్గా జూబ్లీహిల్స్ గాయిత్రీహిల్స్కు చెందిన శ్రీనివాస్రెడ్డి అలియాస్ గౌతంకృష్ణను నియమించుకొని రాజమండ్రి వెళ్లారు. నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు నదిలో పుష్కర స్నానాలు చేసి వచ్చేలోగా శ్రీనివాస్రెడ్డి వారి నగలు, సెల్ఫోన్లతో పాటు కారుతో ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా నగలను నిందితుడు బ్యాంకులో తనఖా పెట్టినట్లు తేలింది. పోలీసులు కారును స్వాధీనం చేసుకోగా నిందితుడు పరారీలో ఉన్నాడు. అయితే విచారణలో శ్రీనివాస్రెడ్డి లీలలు ఒకొక్కటీ బయటపడుతున్నాయి. ఆరుగురు యువతులతో ప్రేమాయణం నడుపుతున్నట్టు తేలింది. అలాగే ఒకొక్కరికి ఒక్కో పేరుతో పరిచయం చేసుకొని, ఒక్కొక్కరికి తాను అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో ఉంటున్నట్టు చెప్పి ప్రేమాయణం సాగిస్తునట్టు పోలీసులు గుర్తించారు. నేరం చేసిన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఇతను దాదాపు 40 సిమ్కార్డులు మార్చినట్టు తేలింది. తాను దొంగిలించిన ఆభరణాలను కుటుంబ సభ్యుల ద్వారానే నగరానికి తరలించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇప్పటికే అతని కుటుంబ సభ్యులందరినీ పోలీసులు విచారిస్తున్నారు. నేరంలో వారందరి భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ఇదిలా ఉండగా నిందితుడు శ్రీనివాస్రెడ్డి ఇంకా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. -
దిగ్విజయ్ వంచకుడు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్సింగ్ నయవంచకుడని పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్(డీఎస్) మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తనకు అవమానం జరిగిందని, తనకు అన్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. అందువల్లే ఆ పార్టీని వీడుతున్నానని.. మంచి ముహూర్తం చూసుకుని టీఆర్ఎస్లో చేరతానని చెప్పారు. గురువారం డీఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా ఆకుల లలితను తానే ప్రతిపాదించినట్టుగా దిగ్విజయ్ మాట్లాడటం పచ్చి అబద్ధమని డీఎస్ చెప్పారు. ఎమ్మెల్సీగా తాను రిటైరైతే, తనకు చెప్పకుండా ఆకుల లలితను ఎంపిక చేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా 300 మందికి రెండు సార్లు ఎమ్మెల్యే బీ-ఫారాలు అందించానని... తనకు ఎమ్మెల్సీ పదవి లెక్కకాదని డీఎస్ పేర్కొన్నారు. కానీ ఆ సందర్భంగా జరిగిన అవమానమే బాధపెట్టిందన్నారు. పార్టీలో సీనియర్ అయిన తనతో మాట్లాడాల్సిన బాధ్యత పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దిగ్విజయ్సింగ్కు లేదా అని ప్రశ్నించారు. చెప్పుడు మాటలు విని తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కావాలంటూ పార్టీలో చర్చకు తానే కారణమయ్యానని, కానీ తెలంగాణ ఏర్పాటు జాప్యం కావడం వల్ల తనకు, పార్టీకి నష్టం జరిగిందని డీఎస్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు ఆశిస్తున్న పరిపక్వతను, పరిణతిని టీపీసీసీ ప్రదర్శించలేకపోతోందని విమర్శించారు. దీనిని వ్యక్తిగతంగా జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. బంగారు తెలంగాణ కోసమే.. తెలంగాణ రాజకీయాల్లో ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని, విస్తృత ప్రజా సంబంధాలను బంగారు తెలంగాణ కోసం వినియోగిస్తానని డీఎస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని చెప్పారు. రాజ్యసభ కోసం, ఎమ్మెల్సీ కోసం టీఆర్ఎస్లో చేరడం లేదని... పదవుల గురించి కేసీఆర్తో చర్చించలేదని, తనను ఎలా ఉపయోగించుకున్నా సిద్ధమేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలనే ఆంధ్రా శక్తుల కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందని డీఎస్ చెప్పారు. కాంగ్రెస్ను వీడాల్సిన పరిస్థితులు వస్తాయనుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో సోనియాగాంధీదే కీలకపాత్ర అయినా పార్టీని వీడాల్సిన పరిస్థితులు వచ్చాయని.. సోనియాకు జీవితాంతం రుణపడి ఉంటానని డీఎస్ వ్యాఖ్యానించారు. తనతో పాటు కాంగ్రెస్ నుంచి ఎవరినీ రావాలని కోరడం లేదన్నారు. టీఆర్ఎస్లో ఎప్పుడు చేరాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మంచి ముహూర్తం చూసి చేరతానని వెల్లడించారు. టీఆర్ఎస్ నేతలు ఎవరూ తన చేరికను వ్యతిరేకించడం లేదని చెప్పారు. -
ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల!
-
ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల!
అడ్డగుట్ట (హైదరాబాద్): పెళ్లైనా... పరస్త్రీలతో రాసలీలలు సాగిస్తూ.. వారిని నిలువునా వంచిస్తున్న ఓ కామాంధుడిని కట్టుకున్న ఇల్లాలే పోలీసులకు పట్టిచ్చింది. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన జీ. శ్రీకాంత్కు, నగరంలోని గౌలిగూడకు చెందిన మాధవితో 2012లో వివాహం జరిగింది. ఇద్దరికీ అది రెండో వివాహం. ఈస్ట్ మారేడుపల్లిలో నివాసం ఉంటున్న వీరికి కవల పిల్లలు సంతానం. కాగా, శ్రీకాంత్ తుర్కపల్లిలోని ఓ కంపెనీలో రీసెర్చ్ కెమిస్ట్గా పనిచేస్తున్నాడు. ఇతడు పెళ్లి అయినప్పటి నుంచి భార్యను తరచూ వేధింపులకు గురిచేస్తుండేవాడు. తనకు వివాహం కాలేదంటూ సహచర ఉద్యోగినులతో పాటు ఇతర అమ్మాయిలను నమ్మించి వంచించడం అలవాటుగా మార్చుకున్నాడు. వారితో ఏకాంతంగా గడుపుతూ ఆ దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరించి, తర్వాత వారిని బెదిరించేవాడు. తన రాసలీలలకు భార్య అడ్డుగా ఉంటుందని తరచూ ఆమెను పుట్టింటికి పంపించేవాడు. దీంతో భర్త తీరుపై అనుమానం వచ్చిన మాధవి తన సోదరుడితో నిఘా పెట్టించింది. ఈ క్రమంలో ఆదివారం శ్రీకాంత్ వేరే అమ్మాయితో ఓ ప్రైవేటు గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని తుకారాంగేట్ పోలీసులకు పట్టిచ్చారు. పోలీసులు శ్రీకాంత్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకొని చూడగా అందులో చాలామంది అమ్మాయిలతో నగ్నంగా ఉన్న దృశ్యాలు వెలుగు చూశాయి. శ్రీకాంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
కి‘లేడీ’ అరెస్టు
రూ.52.50లక్షల సొత్తు స్వాధీనం నెల్లూరు(క్రైమ్): తక్కువ ఫీజుకే మేనేజ్మెంట్ కోటాలో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని పలువురిని మోసగించి రూ. కోట్లతో ఉడాయించిన కి‘లేడి’ని శనివారం రాత్రి రెండోనగర ఇన్స్పెక్టర్ వి. సుధాకర్రెడ్డి నాయుడుపేటలో అరెస్ట్చేశారు. పోలీసుల కథనం మేరకు...గుంటూరు బ్రాడీపేటకు చెందిన దద్దుకూరి లక్ష్మీపార్వతి, ఆదినారాయణ దంపతులు. వారు ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల కిందట నెల్లూరు వచ్చారు. ఉస్మాన్సాహెబ్పేటలోని ఏడీఆర్లేఅవుట్లో నివాసం ఉండేవారు. ఆదినారాయణ ఓ కళాశాలలో పార్ట్టైమ్ లెక్చరర్గా పనిచేసేవాడు. లక్ష్మీపార్వతి సైతం గతంలో ఓ ప్రైవేటు కళాశాలలో పీఆర్వోగా పనిచేసింది. అనంతరం అక్కడ పనిమానివేసింది. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు మెడికల్ కళాశాలల ఉద్యోగులతో పరిచయాలు ఏర్పరచుకొంది. వారి సహకారంతో మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటాల కింద రాష్ట్రానికి చెందిన కొంతమందికి మెడికల్ సీట్లు ఇప్పించింది. కొంతకాలం కిందట తక్కువ ఫీజులతో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని ఎస్ఎంఎస్లు, పేపర్ ప్రకటనలు ఇచ్చింది. దీంతో గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన సుమారు 19 మంది ఆమెను సంప్రదించారు. తమ పిల్లలకు సీట్లు ఇప్పించాలని కోరారు. ఒక్కొక్కరి నుంచి రూ. 25 నుంచి 30లక్షలు ఇలా సుమారు రూ. 3కోట్లు వసూలు చేసింది. వారిని తన వెంట కర్నాటక రాష్ట్రం బెంగుళూరులోని వైదేహి, షియోగ సుబ్బయ్య మెడికల్ కళాశాలల వద్దకు తీసుకెళ్లింది. అక్కడ తనకు పరిచయమున్న ఉద్యోగుల ద్వారా కళాశాల యాజమాన్యాలతో మాట్లాడించేది. నిజంగానే మెడికల్ సీట్లు వస్తాయని అందరూ భావించారు. నెలలు గడుస్తున్నా సీట్లు రాకపోవడంతో వారు కళాశాలలకు వెళ్లి ఆరాతీయగా అంతా బోగస్ అని తేలింది. దీంతో తీసుకొన్న నగదును తిరిగి చెల్లించాలని బాధితులు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. సుమారు రూ. కోటి వరకు ఆమె తిరిగి చెల్లించింది. ఇక డబ్బులు లేవని రాత్రికి రాత్రే ఉడాయించింది. ఈ నేపథ్యంలో తమకు జరిగిన మోసంపై పలువురు బాధితులు జిల్లా ఎస్పీ ఎస్ సెంథిల్కుమార్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన తక్షణమే కేసు నమోదు చేయాలని రెండోనగర పోలీసులను ఆదేశించారు. నర్సారావుపేటకు చెందిన కె.వి రామకృష్ణ తన కుమార్తెకు మెడికల్ సీటు ఇప్పిస్తానని రూ. 25లక్షలు తీసుకొని మోసగించిందని లక్ష్మీపార్వతిపై ఫిర్యాదు చేశారు. గతేడాది నవంబర్ 8వ తేదిన లక్ష్మీపార్వతిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా పొదిలికి చెదిన ఐ. ఆదినారాయణ సైతం రూ. 8లక్షలు తీసుకొని మోసగించిందని ఫిర్యాదు చేయడంతో అదేనెల 28వ తేదిన మరో కేసు నమోదు చేశారు. నగర డీఎస్పీ ఎస్ మగ్బుల్ సారధ్యంలో ప్రత్యేక బృందం ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఈనేపథ్యంలో బాధితురాలు నాయుడుపేటలోని తమ బందువుల ఇంట్లో ఉందన్న సమాచారం అందుకున్న రెండోనగర ఇన్స్పెక్టర్ వి. సుధాకర్రెడ్డి శనివారం రాత్రి నిందితురాలిని అరెస్ట్చేశారు. ఆమె నుంచి సుమారు రూ. 52.50లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్టుకు తరలించారు. దళారులను నమ్మవద్దు.... మెడికల్ కళాశాలలో సీట్లు ఇప్పిస్తామని ప్రకటనలు గుప్పించి దళారులను నమ్మి మోసపోవద్దని ఇన్స్పెక్టర్ వి. సుధాకర్రెడ్డి సూచించారు. ఎన్ఆర్ఐ, మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందగోరేవారు నేరుగా కళాశాల యాజమన్యాలను సంప్రదించాలన్నారు. -
నయవంచకుని అరెస్ట్
ఖమ్మం క్రైం : ప్రేమ పేరుతో ఓ మహిళకు చేరువై, కులం పేరు మార్చుకుని ఆమెను పెళ్లాడి, డబ్బు కోసం హింసించి, ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించి తప్పించుకుని పారిపోరుున నయవంచకుడిని రెండేళ్ల తరువాత ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది హైదారబాద్లో పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం మహిళ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ అంజలి వెల్లడించారు.ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన మద్ది చైతన్యకు వివాహమైన కొద్ది కాలానికే భర్త మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా శామీర్పేట మండలం ఆరియాబాద్లో తన అత్తగారింటికి వెళ్లిన ఆమె కొంతకాలం అక్కడే ఉంది. అదే ప్రాంతంలో ఉంటున్న నిజామాబాద్ జిల్లా మాచిరెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన కఠాధ శషాంక్(పూర్తి పేరు శషాంక్ నాయక్)తో పరిచయమేర్పడింది. ఓ సెల్ కంపెనీలో సిమ్స్ కార్డ్స్ సేల్స్మన్గా చేస్తున్నట్టు చెప్పాడు. అతడు తన పేరు శశాంక్ రెడ్డిగా చెప్పి ఆమెను ప్రేమలోకి దింపి, అక్కడే ఉన్న బాలాజీ టెంపుల్లో వివాహమాడాడు. ఆ తరువాత వీరిద్దరినీ చైతన్య తల్లిదండ్రులు చేరదీసి, ఘనంగా వివాహం జరిపించి కాపురానికి పంపారు. ఆరియూబాద్లో వీరికి ఓ పాప కూడా జన్మించింది. కొంతకాలం తర్వాత, తనకు సింగపూర్లో ఉద్యోగం వచ్చిందంటూ చైతన్యను నమ్మించి ఆమె బంగారు నగలన్నీ అమ్మాడు. ఇంకా మూడులక్షల రూపాయలు తేవాలంటూ ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించసాగాడు. దీనిని తట్టుకోలేని ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించి, శశాంక్ కోసం వెతకగా ఆచూకీ తెలీలేదు. వారు 2013, మే 11నఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి శశాంక్ కోసం వెతకసాగారు. ఎప్పటికప్పుడు సిమ్ కార్డులను మారుస్తూ తప్పించుకుని తిరుగుతున్న అతనిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని సీఐ అంజలి ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తిరుగుతున్న అతడిని హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకుని ఖమ్మం తీసుకొచ్చారు. వీరిద్దరినీ అభినందిస్తూ నగదు బహుమతిని సీఐ అంజలి అందించారు. కులం పేరు తప్పుగా చెప్పి, కట్నం కోసం వేధించి, పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతున్నందుకుగాను శశాంక్ నాయక్పై కేసులు నమాదు చేసి, అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు నర్సయ్య, జైపాల్రెడ్డి, ఏఎస్ఐ ఎమిల్టన్ పాల్గొన్నారు. -
ప్రజలను మోసం చేశాడు.. పోలీసులిలా..!
-
అమ్మాయిలకు వల వేసి దోచేస్తాడు!
-
చంద్రబాబే.. నెం.1 మోసగాడు!
-
చంద్రబాబు పచ్చి మోసగాడు: కేసీఆర్
తెలంగాణకు దయ్యంలా దాపురించావు.. ఏపీ సీఎంపై కేసీఆర్ ఫైర్ ఇక్కడి రైతులంటే నీకెందుకంత కక్ష? మాకు ముందుచూపు లేదంటావా? నీలా దొంగ చూపుల్లేవ్.. నీవన్నీ అసత్యాలే మా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు యత్నిస్తున్నావ్ తెలంగాణకు విద్యుత్ రాకుండా అడ్డుకుంటున్నావ్ ఉల్లంఘనలపై సుప్రీంకోర్టుకు వెళతాం }Oశెలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపే ప్రసక్తే లేదు కృష్ణపట్నంలో వాటాను ముక్కుపిండి వసూలు చేస్తాం {పకాశం బ్యారేజీ వద్ద చర్చకైనా సిద్ధం ఏపీ రైతులను, డ్వాక్రా మహిళలనూ మోసగిస్తున్నావ్ బాబు మోసాలన్నీ బయటపెడతామన్న ముఖ్యమంత్రి విద్యుత్పై జోక్యం చేసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్:‘దేశంలో నీచాతి నీచమైన సీఎం నువ్వొక్కడివే. తెలంగాణ రాష్ట్రానికి దయ్యంలా దాపురించావు. ఇక్కడి రైతులంటే ఎందుకంత పగ. తెలంగాణ పంటలను ఎండబెట్టాలని కంకణం కట్టుకున్నావు. తెలంగాణ రైతుల ప్రాణాలు పట్టడం లేదు. విద్యుత్ విషయంలో నీ మాటలన్నీ అబద్ధాలు, అసత్యాలు. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని పూర్తిస్థాయిలో ఉల్లంఘిస్తున్నావు. మాకు ముందు చూపులేదంటున్నావ్. నిజమే, మాకు నీలా దొంగచూపుల్లేవు. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి అసత్యాలు ప్రచారం చేస్తున్నావ్. ఇదే అసత్యాలతో ఏపీలో రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నావ్. నీ బండారం బయట పెడతాం. నీవొక చీటర్వు’ అంటూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించేందుకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తీరుపై విమర్శలు గుప్పిస్తూనే, విద్యుత్ విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. ‘జూన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే బాబు దొంగచూపు మొదలైంది. అన్యాయంగా, అప్రజాస్వామికంగా సీలేరు నుంచి విద్యుత్ రాకుండా అడ్డుకున్నాడు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఈఆర్సీ(విద్యుత్ నియంత్రణ కమిటీ) చెంప మీద కొట్టి చెప్పడంతో ఆ కమిటీనే తొలగించావు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీఈఏ(కేంద్ర విద్యుత్ అథారిటీ) చెప్పినా ఉల్లంఘనలు మానుకోలేదు. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళతాం’ అని సీఎం పేర్కొన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కృష్ణపట్నం నీ బాబు జాగీరు కాదు ఏపీలోని కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే థర్మల్, జల విద్యుత్లో రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాను చంద్రబాబు అడ్డుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ‘కృష్ణపట్నంలో మాకు వాటా ఉంది. తెలంగాణకు పవర్ ఇవ్వొద్దంటూ హిందూజాలను బెదిరిస్తున్నావ్. ఆ హిందూజాలే నాకు ఈ విషయం చెప్పారు. కృష్ణపట్నంలో తెలంగాణ రాష్ట్రం నుంచి రూ. 1050 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రూ. 550 కోట్లు టీఎస్ జెన్కో పెట్టగా, ఎన్పీడీసీఎల్ - 1453 కోట్లు, ఎస్పీడీసీఎల్ - 352కోట్లు పెట్టాయి. కృష్ణపట్నం నుంచి 220 మిలియన్ యూనిట్లకు గాను మొత్తం కొట్టేశారు. ఒక్క యూనిట్ కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు. కృష్ణపట్నంలో వాటా ఎలా ఇయ్యవో.. సుప్రీం కోర్టుకు ఎక్కిస్తం. ముక్కుపిండి వసూలు చేస్తం’ అని కేసీఆర్ ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. జీవోలు ఇచ్చిందె వరు.. రాద్దాంతం చేసిందెవరు? చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటి మట్టాలను 834 అడుగులుగా పేర్కొంటూ జీవో 69ని(15-06-1996) జారీ చేశారని, అవసరాన్ని బట్టి మరిన్ని అడుగులు నీటిని వినియోగించుకోవచ్చునని ఆ జీఓలో పేర్కొన్నారని కేసీఆర్ వివరించారు. అదే ఏడాది 779 అడుగుల వరకు నీటిని వినియోగించారని గుర్తు చేశారు. కానీ, 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఇచ్చిన మరో జీవో 107 (28-09-2004) మేరకు రిజర్వాయర్ కనీస నీటిమట్టాన్ని 834 నుంచి 854 అడుగులకు పెంచినప్పుడు నానా యాగీ చేసి విజయవాడ ప్రకాశం బ్యారేజీలో షో చేసింది ఎవరని సీఎం ప్రశ్నించారు. చంద్రబాబు అండ్ కో దీనిపై కొట్లాడలేదా? జనం పిచ్చోళ్లు కాదు. నీది నాలుకా.. తాటి మాట్టా? నీ మోసం బయట పెడతాం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రకాశం బ్యారేజీ వద్దనైనా సరే చంద్రబాబుతో చర్చకు సిద్ధమని కేసీఆర్ ప్రతిసవాల్ చేశారు. ఏపీ రైతులనూ మోసగిస్తున్నావ్ ‘‘నీవొక చీటర్వు. ఎన్నికల్లో ఏమేం హామీలు ఇచ్చావ్? ఏపీలో రైతులు, డ్వాక్రా మహిళలను మోసిగిస్తున్నావ్. ఎన్నికల్లో అన్ని రకాల పంట రుణాలు రూ. 95 వేల కోట్లు మాఫీ అన్నావ్. డ్వాక్రా మహిళలకు చెందిన రుణాలు రూ. 50 వేల కోట్లు మాఫీ అన్నావ్. ఇది సాద్యం కాదన్న పార్టీలను బచాగాళ్లు అన్నవ్. 9 ఏళ్లు సీఎంగా చేశా, అన్నీ తెలుసన్నావ్. కానీ, ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు. మెలికలు పెడుతున్నవ్. ఈ విషయాలపై ఆంధ్రా రైతులకు సమాధానం చెప్పాలి. నీ బండారం బయట పెడతాం’’ అంటూ చంద్రబాబుపై సీఎం కేసీఆర్ ద్వజమెత్తారు. ఎన్నికల సమయంలో బాబు చెప్పిన అంశాలకు సంబంధించిన క్లిప్పింగులను బయటపెట్టి ఆయన మోసాలను బయటపెడతానని హెచ్చరించారు. బాబు మోసంతో కరెంటుకు రూ. 608 కోట్లు చంద్రబాబు మోసం వల్ల రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు, వారి పంటలను కాపాడేందుకు ఇప్పటికే రూ. 608.79 కోట్లు ఖర్చు పెట్టినట్లు కేసీఆర్ తెలిపారు. ‘నీకు నిద్ర పట్టడం లేదు. ఉమాభారతితో సమావేశం పెట్టిస్తవ్, కృష్ణా వాటర్ బోర్డును పిలిపిస్తవ్, ఎందుకంత గాయి గాయి చేస్తున్నవ్’ అని ప్రశ్నించారు. ‘శ్రీశైలం రెండు రాష్ట్రాల ప్రాజెక్టు. శ్రీశైలం ఎగువలో కృష్ణా నదిలో 97 టీఎంసీల వాటా ఉంది. కానీ, ఇప్పటి దాకా మేము వాడుకుంది కేవలం 16 టీఎంసీలే. ఇంకా 81 టీఎంసీల వాటా ఉంది. ఎస్ఎల్బీసీని రెండు దశాబ్దాలు జాప్యం చేశారు. ఇపుడు టన్నెల్ అని మరికొన్ని దశాబ్దాలు పనులు సాగేలా చేశారు. పుట్టంగండి నుంచి 11.7 టీఎంసీలే వాడుకుంటున్నాం. అదీ ఎత్తిపోసి. ఉల్లంఘనలు నీవి, అన్యాయం నీది. నా మాటలు తప్పని రుజువు చే స్తే ముక్కు నేలకురాస్తా’ అని సీఎం వ్యాఖ్యానించారు. మూడేళ్లలో మిగులు విద్యుత్ హైదరాబాద్: ‘తెలంగాణ కరెంటు కష్టాలకు కారణం చంద్రబాబే. చంద్రబాబు హయాంలో కేవలం ఆర్టీపీపీ-3లో 210 మెగావాట్ల యూనిట్ మాత్రమే ప్రారంభమైంది. మిగతావన్నీ ఒప్పందాలే(పీపీఏలే). కానీ, మేం చాలా ముందుచూపుతో ఉన్నాం. కరెంటు కష్టాలుంటాయని ఎన్నికల్లోనే చెప్పా. ఏదీ దాయలేదు. రానున్న మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తాం. వెయ్యి మెగావాట్లు ఇవ్వడానికి ఛత్తీస్గఢ్ సిద్ధంగా ఉంది. మరో వెయ్యి మెగావాట్లు అడుగుతున్నాం. ఒప్పందం కోసం త్వరలో నేనే ఆ రాష్ట్రానికి వెళతా. ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్లు, బీహెచ్ఈఎల్తో 6 వేల మెగావాట్లు, సోలార్ బిడ్డింగ్ ద్వారా 2 వేల మెగావాట్ల విద్యుదుత్పికి ప్రణాళికలు ఉన్నాయి. 6 వేల మెగావాట్ల అణు విద్యుత్ కోసమూ ఆహ్వానించాం. ఇలా మూడేళ్లలో మిగులు విద్యుత్తును సాధిస్తాం. అప్పుడు రెప్పపాటు కూడా కరెంటు పోనీయం. ఈ వాస్తవాలన్నీ గమనించాలని రాష్ర్ట రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని సీఎం కేసీఅర్ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
హర్షవర్ధన్ వేషాలు ఇన్నిన్ని కావయా!!
-
ఆత్మహత్య చేసుకుందామనే వెళ్లాను : వంశీకృష్ణ
-
ఎమ్మెల్యేలు, ఎంపీలకు టోకరా వేసిన మోసగాడి అరెస్ట్
ఎమ్మెల్యేలు, ఎంపీలకే టోకరా వేసిన ఘరానా మోసగాడు బాలాజీ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ పోలీసులు గురువారం అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్ యువకిరణాల పేరుతో బాలాజీ నాయుడు చాలామందిని మోసం చేశాడు. వీరిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బాధితులుగా ఉండటం గమనార్హం. ఉద్యోగాల పేరుతో 22 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల నుంచి లక్షల్లో నగదు వసూలు చేశాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు.