chief secreatary
-
విభజన సమస్యల పరిష్కారం మరింత జఠిలం!
సాక్షి, అమరావతి : విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో ఇటీవల జరిగిన అధికారులతో కూడిన సమావేశం తీరు తెన్నూ లేకుండా సాగింది. దీంతో సమస్యల పరిష్కారం ఇప్పట్లో సాధ్యం కాదనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేశాయి. కాలికేస్తే.. వేలికి, వేలి కేస్తే కాలుకన్న చందంగా ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు సాగాయని, ప్రధాన సమస్యల పరిష్కారంపై ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణికి భిన్నంగా సమస్యలను మరింత జఠిలం చేశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గ్రూప్–4, నాన్ గెజిడెట్ ఉద్యోగుల విషయంలో తప్ప మిగతా ప్రధాన అంశాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదని, ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉన్నారనే అభిప్రాయాన్ని ఉన్నతాధికారి ఒకరు వ్యక్తం చేశారు.ఈ ఏడాది మే 7వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, (Chandrababu Naidu) రేవంత్ రెడ్డి హైదరాబాద్లో సమావేశమై విభజనకు సంబంధించి ఆస్తులు, నగదు పంపిణీ, బకాయిల చెల్లింపులపై చర్చించారు. ఆ సమావేశంలో సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఇటీవల మంగళగిరిలో ఇరు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశమై చర్చలు జరిపినప్పటికీ ఏ సమస్యకు పరిష్కారం లభించలేదని తెలిసింది. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు తెలంగాణ డిస్కంలు.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిస్కంలకు చెల్లించాల్సిన విద్యుత్ సరఫరా బకాయిలు రూ.7,230 కోట్ల గురించి కూడా గట్టిగా అడగలేదని సమాచారం. వెంటనే ఈ బకాయిలు ఆంధ్రప్రదేశ్కు చెల్లించాల్సిందేనని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణకు ఆదేశాలు జారీ చేయించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తెలంగాణ (Telangana) ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పైగా ఈ బకాయిల ప్రస్తావన వచ్చినప్పుడు.. తెలంగాణకే రూ.26 వేల కోట్ల విద్యుత్ బకాయిలు ఏపీ చెల్లించాలనే వాదనను తెలంగాణ అధికారులు తెచ్చారని తెలిసింది. అంగీకారం కుదిరిన వాటిపై ఎందుకు నిర్ణయం తీసుకోరు? 9, 10వ షెడ్యూల్లో మొత్తం 95 సంస్థలు ఉంటే.. 53 సంస్థలపై రెండు రాష్ట్రాలకు అంగీకారం ఉంది. మిగిలిన వాటిపై ఇరు రాష్ట్రాలకు అభ్యంతరాలున్నాయి. అయితే అంగీకారం కుదిరిన సంస్థల ఆస్తులు, నగదు పంపిణీపై ఇరు రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోకుండా, అన్ని సంస్థలకు చెందిన సమస్యలు పరిష్కారం అయ్యాకే తుది నిర్ణయాలు తీసుకోవాలనే ధోరణిలో అధికారులున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఆస్తుల వివాదంపై కేంద్రం నియమించిన షీలా బేడీ కమిటీ పలు సిఫార్సులు చేసింది. వాటిపై అనేక దఫాలుగా పదేళ్లుగా చర్చలు జరిగినా ఇరు రాష్ట్రాలు ఒక అభిప్రాయానికి రాలేకపోయాయి. 2014 విభజన చట్టం ప్రకారం కొన్ని భవనాలు ఎపీ కోసం హైదరాబాద్లో కేటాయించారని, అవి పదేళ్లపాటు వారి ఆదీనంలో కొనసాగుతాయని పేర్కొన్నారని, జూన్ 2వ తేదీతో ఆ గడువు ముగిసినందున గతంలో కేటాయించిన భవనాలు పూర్తిగా తెలంగాణకే వర్తిస్తాయని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు.చదవండి: నేను చెప్తే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లేఅయితే లేక్వ్యూ అతిథి గృహం, లక్డీకాపూల్లోని పోలీసు భవనాలను ఆంధ్రప్రదేశ్కు కేటాయించాల్సిందిగా ఏపీ అధికారులు చేసిన ప్రతిపాదనలను తెలంగాణ అధికారులు తిరస్కరించారు. భవనాలు కేటాయించడం సాధ్యం కాదని తేల్చి చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణలో భవనాలు నిర్మించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్కు స్థలం కేటాయిస్తామని, భవనాలు కట్టుకోవాలని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు.గెజిటెడ్ ఉద్యోగులు ఏపీ నుంచి తెలంగాణకు రావాలని కోరుకుంటున్నప్పటికీ తీసుకోవడం సాధ్యం కాదని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ తీసుకుంటే తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగుల పదోన్నతులపై ప్రభావం పడుతుందని తెలిపారు. నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులను ఇరు రాష్ట్రాలు మార్చుకోవడానికి గతంలోనే నిర్ణయాలు తీసుకున్నా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.చదవండి: కరెంట్ కోత.. చార్జీల మోత‘దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్’(దిల్)కు హైదరాబాద్ (Hyderabad) నగరం చుట్టుపక్కల దాదాపు నాలుగు వేల ఎకరాలు భూములున్నాయి. ఆ భూముల్లో తమకు వాటా కావాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రతిపాదించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. ఉమ్మడి రాష్ట్రంలో “దిల్’ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైనందున అందులో తమకు వాటా రావాల్సిందేనని ఏపీ వాదిస్తోంది. -
కేరళలో తొలిసారి.. భర్త స్థానంలో సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన భార్య
తిరువనంతపురం: కేరళలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న భర్త స్థానంలో భార్య నూతన చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వేణు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆగష్టు 31న పదవీ విరమణ చేశారు. వేణు స్థానంలో ఆయన భార్య శారదా మురళీధరన్ సీఎస్ పదవి బాద్యతలు చేపట్టారు.ఆమె గతంలో ప్రణాళిక విభాగంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ శారదను తదుపరి సీఎస్గా ఎంపిక చేస్తూ కేరళ కేబినెట్ ఆగష్టు 21న నిర్ణయం తీసుకుంది. కాగా కేరళ చరిత్రలోనే తొలిసారి ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న భర్త స్థానంలో భార్య బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి కావడం విశేషం.For the first time in India (at least as far as anyone can remember!), Kerala’s outgoing ChiefSecretary, Dr V, Venu, handed over the CS’s post to his wife, Sarada Murlidharan, at a formal handover ceremony at the secretariat in Thiruvananthapuram. Both are IAS officers of the… pic.twitter.com/E0nZmDDIWi— Shashi Tharoor (@ShashiTharoor) September 1, 2024కాగా భార్యభర్తలిద్దరూ 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికార్లే అయినప్పటికీ.. వేణు అతని భార్య కంటే కొన్ని నెలలు పెద్దవాడు. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘తిరువనంతపురంలోని సచివాలయంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో భారతదేశంలోనే తొలిసారిగా (ఎవరికైనా గుర్తున్నంత వరకు!) కేరళ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీ వేణు.. ఆయన భార్య శారదా మురళీధరన్కు సీఎస్ పదవిని అప్పగించారు.’ అని పేర్కొన్నారు.శుక్రవారం వేణు వీడ్కోలు సందర్భంగా సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. కేరళ చరిత్రలోనే తొలిసారి ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న భర్త వీ వేణు నుంచి శారదా మురళీధరన్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారని చెప్పారు. ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలెక్టర్లుగా.. వివిధ శాఖల అధిపతులుగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా వేర్వేరు సమయాల్లో విధులు నిర్వర్తిస్తుంటారని అన్నారు. -
TG: పలువురు ఐఏఎస్ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి శనివారం(ఆగస్టు31)ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో సురేంద్రమోహన్,యాస్మిన్బాషా,వినయ్ కృష్ణారెడ్డి, మల్సూర్ తదితరులున్నారు. వీరిలో సురేంద్రమోహన్ను మైన్స్ అండ్ జియాలజీ సెక్రటరీగా యాస్మిన్ బాషాను హార్టీ కల్చర్ డైరెక్టర్గా మల్సూర్ను మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్చైర్మన్గా నియమించారు. -
TG: స్కూళ్లకు సెలవులు..! సీఎస్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి శనివారం(ఆగస్టు31) సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాల అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చే విషయంలో ఆయా జిల్లాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. డ్యాములు, చెరువులు, కుంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద వరద తీవ్రతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. జిల్లాల్లో వర్షం పరిస్థితిని ఎప్పటికప్పుడు సచివాలయానికి అప్డేట్ చేయాలని ఆదేశించారు. -
కేసీఆర్ ఫొటోలపై సీఎస్కు కేటీఆర్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్ల డిజిటల్ విధ్వంసానికి సంబంధించి జోక్యం చేసుకుని చర్యను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ‘ఎక్స్’వేదికగా మరోసారి విజ్ఞప్తి చేశారు.Smt. Santhi Kumari Garu @TelanganaCSThis is a gentle reminder to kindly intervene and expedite action regarding the digital vandalism of Telangana government websites and social media handlesImportant content from former CM Sri KCR’s tenure has been removed from these… https://t.co/NjQe6SjNWf— KTR (@KTRBRS) July 29, 2024 ‘‘సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల నుంచి మాజీ సీఎం కేసీఆర్ హయాంలోని ముఖ్యమైన కంటెంట్ తొలగించబడింది. ఈ కంటెంట్ ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో అంతర్భాగం. ఈ డిజిటల్ ఆస్తులను రక్షించడానికి, భవిష్యత్ తరాలకు ఈ విషయాన్ని భద్రపరచడానికి మీ తక్షణ చర్య అవసరం. మీరు చర్య తీసుకోకుంటే, మేము న్యాయపరమైన పరిష్కారాన్ని కోరవల్సి వస్తుంది’’ అని కేటీఆర్ అన్నారు. -
ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ పదవీకాలం పొడిగింపు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఆరు నెలలు సీఎస్ నీరబ్కుమార్ సర్వీస్ను పొడగించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. సీఎం చంద్రబాబు అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని కేంద్రం సీఎస్ నీరబ్ పదవీకాలాన్ని పొడిగించినట్లు తెలిపింది. సర్వీస్ పొడిగింపుతో డిసెంబర్ నెలాఖరు వరకు నీరబ్కుమార్ సీఎస్గా కొనసాగనున్నారు. -
Telangana: సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. ఇంటెలిజెన్స్ ఐజీగా శివధర్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నన్ను చంపేస్తానని బెదిరించాడు.. సీఎస్పై మంత్రి సంచలన ఆరోపణలు..
-
నన్ను చంపేస్తానని బెదిరించాడు.. సీఎస్పై మంత్రి సంచలన ఆరోపణలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన ఆరోపణలు చేశారు. చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ తనను చంపుతానని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈమేరకు ఆయన శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేపడతామన్నారు. రాత్రి 9:30 గంటల సమయంలో తన కార్యాలయానికి వచ్చిన సీఎఎస్.. 'నిన్ను చంపేస్తా' అని భయభ్రాంతులకుగురి చేశారని మంత్రి పేర్కొన్నారు. కాగా చీఫ్ సెక్రెటరీ తనను బెదిరిస్తున్నారని లెఫ్టినెంట్ గవర్నర్కు కూడా భరద్వాజ్ ఫిర్యాదు చేశారు. కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. చదవండి: ఢిల్లీలో భారీ సైబర్ క్రైం -
ఏపీలో ఏ బాధ్యతలు ఇచ్చినా ఓకే: సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్కుమార్కు హైకోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్కుమార్ను ఏపీ కేడర్కు కేటాయించినందు వల్ల అక్కడే విధులు నిర్వహించాలని కోర్టు పేర్కొంటూ తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది. ఈ క్రమంలో మాజీ సీఎస్ సోమేశ్కుమార్ ఏపీలో రిపోర్ట్ చేయనున్నారు. దీనిలో భాగంగా గురువారం ఉదయం విజయవాడకు చేరుకున్న సోమేష్ కుమార్.. ఏపీ సీఎస్ జవహర్రెడ్డిని కలిశారు. విజయవాడలో సోమేశ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీకి వచ్చాను. నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తాను. ఒక అధికారిగా డీవోపీటీ ఆదేశాలు పాటిస్తున్నాను. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడానికి వచ్చాను. వీఆర్ఎస్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కుటుంబ సభ్యులతో చర్చించాక చెబుతాను’ అని స్పష్టం చేశారు. ఏపీ సీఎస్ జవహర్రెడ్డిని కలిసిన అనంతరం సీఎం వైఎస్ జగన్తో సమావేశమయ్యారు సోమేష్ కుమార్. -
తెలంగాణ కొత్త సిఎస్ ఎవరు ?
-
ఏపీ సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన కెఎస్ జవహర్ రెడ్డి
-
తక్షణమే రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలి: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. రుణమాఫీ, ధరణి సమస్యలు, అటవీ, పోడుభూములు, నిషేధిత భూముల జాబితా, అసైన్డ్ భూములు, కౌలు రైతుల చట్టం, టైటిల్ గ్యారంటీ చట్టం వంటి అంశాలపై సీఎస్తో చర్చించి వినతిపత్రం సమర్పించారు. సీఎస్ను కలిసినవారిలో ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్ కుమార్ యాదవ్, మహేశ్ కుమార్గౌడ్, అజారుద్దీన్, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, మాజీమంత్రులు నాగం జనార్దన్రెడ్డి, షబ్బీర్ అలీ, గడ్డం ప్రసాద్కుమార్, మాజీ ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులున్నారు. కాగా, తమ విజ్ఞప్తిపట్ల సీఎస్ సానుకూలంగా స్పందించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ డిమాండ్లు ఇవే: ► ధరణి వెబ్సైట్ పేరుతో రాష్ట్రంలోని భూరికార్డుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు కంపెనీకి అప్పగించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ధరణిని రద్దు చేసి గతంలో మాదిరిగానే భూరికార్డుల నిర్వహణను భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) పరిధిలోకి తేవాలి. ► గ్రామసభలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి భూసమస్యలను పరిష్కరించాలి. నిషేధిత జాబితాలో ఉంచిన ప్రతి గుంట పట్టా భూమినీ అందులోంచి తొలగించాలి. ► అటవీహక్కుల చట్టం ప్రకారం అటవీ, పోడు భూములపై రైతులకు హక్కులు కల్పించాలి. కాంగ్రెస్ హయాంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. ఆ భూములపై అసైనీలకు హక్కులు కల్పించాలి. అందుకు చట్ట సవరణ చేయాలి. ► గ్రామస్థాయిలో కౌలు రైతులను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని రకాల రాయితీలను వారికి వర్తింపజేయాలి. ► రాష్ట్రంలోని ప్రతి ఎకరం భూమిని సర్వే చేసి మొత్తం భూవిస్తీర్ణాన్ని నమోదు చేసి రైతాంగానికి ప్రయోజనకరమైన టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలి. ► రాష్ట్రంలోని రైతులందరికీ వెంటనే పూర్తిగా రుణమాఫీ చేయాలి. రైతుల పక్షాన పోరాడుతాం: రేవంత్ రైతాంగం ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను సీఎస్ సోమేశ్కుమార్కు కూలంకషంగా వివరించామని, వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి చర్చించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరామని రేవంత్రెడ్డి చెప్పారు. సీఎస్ను కలిసిన అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంటనే సీఎం కేసీఆర్ అందుబాటులోకి వచ్చి రైతుల సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఈ మేరకు ఈ నెల 24 నుంచి డిసెంబర్ 5 వరకు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలు వివాదాలు సృష్టిస్తున్నాయని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని, దాడులు, ప్రతిదాడులతో గందరగోళం సృష్టిస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని రేవంత్ చెప్పారు. ఇదీ చదవండి: మత్స్యకారులకూ రూ. 5 లక్షల బీమా కల్పించాలి -
ఏపీ సీఎప్ సమీర్శర్మకు అస్వస్థత
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సమీర్శర్మ అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. -
యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు: సీఎస్ సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ మేరకు సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్న్ నిర్వహించారు. జిల్లాల వారీగా యాసంగిలో సాగు విస్తీర్ణం, పంట దిగుబడి అంచనాలపై చర్చించారు. కొనుగోలు కేంద్రాలు తగ్గించొద్దు: ‘సీఎం సూచనల మేరకు ప్రతి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పా టు చేయాలి. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం చేయాలి. సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై ఆయా జిల్లాల అధికారులతో వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించాలి. కొనుగోళ్లకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపొందించుకోండి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులతో వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి. ఎక్కడెక్కడ ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో నివేదిక రూపొందించుకోవాలి..’అని సీఎస్ సూచించారు. రోజుకు నాలుగైదు కేంద్రాల తనిఖీ: ‘జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించేలా ప్రణాళిక తయారు చేసుకోవాలి. గత సంవత్సరం యాసంగి సీజన్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల సంఖ్యకు తగ్గకుండా ఈసారి కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి కేంద్రానికి ఓ అధికారిని నియమించి కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలి. ముఖ్యంగా గన్ని బ్యాగుల సేకరణపై దష్టి పెట్టాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించి తగు పర్యవేక్షణ జరపాలి. రైతుకు కనీస మద్దతు ధర రూ.1,960 లభిం చేలా చర్యలు చేపట్టాలి. వ్యవసాయ విస్తరణాధికారుల సేవలను వినియోగించుకోవాలి. జిల్లాల్లో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలి..’అని ఆదేశించారు. ఏరోజుకారోజు నివేదికలు:‘కొనుగోలు కేంద్రా ల్లో సేకరించిన ధాన్యాన్ని వెం టనే రవాణా చేసేందుకు అవసరమైన వాహనాలు ఏర్పాటు చేసుకోవాలి. ధాన్యం సేకరణపై ఏరోజు కారోజు నివేదికలు పంపించాలి. జిల్లాల్లో వ్యవసాయ అధికారుల వద్ద ఉన్న వరి కోతల వివరాల ఆధారంగా తగు ప్రణాళిక రూపొందించుకోవాలి. పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చర్యలు చేపట్టాలి. అందు కోసం పోలీసు, రవాణా తదితర శాఖల అధికారుల సహకారం తీసుకోవాలి..’అని సీఎస్ చెప్పారు. హైదరాబాద్, కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయా లని సోమేశ్కుమార్ ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో హైదరాబాద్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్లో వ్యవసా య శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పంచా యి తీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాని యా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు.. ఆ ఆలోచనను విరమించుకోండి: సీఎస్ సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు సీఎం ఏమి చెయ్యగలరో అన్నీ చేస్తారని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్నారు. ఈ మేరకు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐఆర్ ఉన్నా.. ఐఆర్ లేకున్నా ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఎవ్వరికీ జీతం తగ్గకూడదని సీఎం చెప్పారు. గత పీఆర్సీ నుంచి ఇప్పటి పీఆర్సీ వరకు చూస్తూ ఎక్కువ పెరుగుదల ఉంది. ఐఆర్తో కలిపినా పెరుగుదల ఉంది. ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు. ఈ రోజు రాత్రికి అందరికీ జీతాలు వచ్చాక తెలుస్తుంది. ఉద్యోగులు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ప్రతి ఏటా 15 శాతం ఆదాయం పెరగాలి. పీఆర్సీకి అదనంగా గ్రాట్యుటీ, హౌసింగ్ స్కీమ్ వలన అదనపు ప్రయోజనం ఉంది. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగం. ప్రతి పీఆర్సీ అప్పుడు చర్చల కమిటీ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులు ఏ సమస్య ఉన్నా చర్చించుకుందాం. సమ్మె ఆలోచనను విరమించుకోండి. మనమంతా ఒక కుటుంబం. హెచ్ఆర్ఏ లాంటివి మాట్లాడుకుందాం రండి. ఉద్యోగులను చర్చలకు రమ్మని కోరుతున్నాను' అని సీఎస్ సమీర్ అన్నారు. చదవండి: (కేంద్ర బడ్జెట్ నిరుత్సాహపరిచింది: ఎంపీ విజయసాయిరెడ్డి) ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ నుంచి ఉద్యోగులను.. మంత్రులు, అధికారులతో చర్చలకు రమ్మని కోరుతున్నాను. ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం. ఒకటో తేదీన జీతాలు వెయ్యడం ప్రభుత్వ బాధ్యత. 3.69లక్షల సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు జీతాలు వేశాము. 1.75 లక్షల ఇతర ఉద్యోగులకు జీతాలు వేశాము. 94,800 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు జమచేశాము. 3.3 లక్షల మంది పెన్షనర్లకు జమచేశాము. 3,97,564 రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు కూడా వేశాము. వారికి శాలరీ బ్రేక్ అప్ కూడా పంపాము. ప్రతి ఉద్యోగి వారి జీతాల పెరుగుదలను తెలుసుకునేలా బ్రేక్ అప్ ఇచ్చాము అని ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్ అన్నారు. -
ఏపీ సీఎస్పై కోర్టు ధిక్కారం అవసరం లేదు: ఎన్జీటీ తీర్పు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: పర్యావరణ అనుమతి తీసుకున్న తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దిశానిర్దేశం చేసింది. పర్యావరణ ప్రభావ మదింపు ప్రకటన (ఈఐఏ)–2006 ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను పరిశీలించి.. పర్యావరణ అనుమతి జారీచేసే ప్రక్రియను వేగంగా ముగించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఎన్జీటీ (చెన్నై బెంచ్) ఉత్తర్వులు జారీచేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రైతు, తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్లపై ఎన్జీటీ విచారించింది. డీపీఆర్ రూపకల్పన కోసం అవసరమైన పనులు మాత్రమే చేశామని ఏపీ సర్కార్ చేసిన వాదనతో ఏకీభవించింది. ఎత్తిపోతల పనులు చేపట్టినందుకుగానూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. డీపీఆర్ రూపకల్పన కోసం చేసిన పనులను మదింపు చేయడానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయం, సీడబ్ల్యూసీ అధికారి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కమిటీతో ఎత్తిపోతల పనులను మదింపు చేసి.. వాటివల్ల పర్యావరణానికి ఏమైనా విఘాతం కలిగిందా? లేదా? అనే కోణంలో అధ్యయనం చేసి, నాలుగు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. డీపీఆర్ రూపకల్పన కోసం మార్గదర్శకాలు రూపొందించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ సూచించిన మార్గదర్శకాలను ఈఐఏ–2006లో చేర్చి.. పర్యావరణ అనుమతివ్వాలని నిర్దేశించింది. నివేదిక, పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ డీపీఆర్కు సంబంధించిన పనులతో సహా ఎలాంటి పనులు చేపట్టరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. చదవండి: చురుగ్గా ‘వైద్య’ పోస్టుల భర్తీ -
ఏ సీఎంకి రాని కష్టం మిజోరాం ముఖ్యమంత్రికే: కేంద్రానికి లేఖ
ఐజ్వాల్: దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని కష్టం మిజోరాం ముఖ్యమంత్రికి వచ్చిపడింది. విషయమేంటంటే.. సాధారణంగా మిజో ప్రజలకు, ఆయన క్యాబినెట్ మంత్రులకు హిందీ తెలియదు. మంత్రి వర్గంలో కొందరికి ఇంగ్లీష్ సమస్య కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో మిజో ప్రజల స్థానిక భాషపై అవగాహన లేని సీనియర్ అధికారి రేణు శర్మను ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా నియమించారు. ఆయన ఏం చేయాలన్నా అన్ని ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లోనే చేస్తున్నారు. అధికారులు కూడా ఇదే ఫాలో అవ్వాలని అంటున్నారు. ఇక్కడ అధికారుల వరకూ ఇబ్బంది లేదు కానీ మంత్రులకు భాషాపరమైన సమస్య తలెత్తింది. దీంతో ఏ పని ముందుకు సాగాలన్నా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జోరంతంగా కేంద్రానికి ఓ లేఖ రాశారు. చదవండి: (అతనితో సన్నిహిత సంబంధాలు.. ఐజీపై సస్పెన్షన్ వేటు) లేఖలో ఏముందంటే.. క్యాబినెట్ మంత్రులకు హిందీ తెలియదు, ఇంగ్లీష్ కూడా అంతంతమాత్రమే. కనుక మిజో భాషపై పరిజ్ఞానం ఉన్న ప్రధాన కార్యదర్శిని నియమించాలని మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్తంగా కేంద్రాన్ని కోరారు. స్థానికపై భాషపై పట్టున్న అధికారి అయితే ప్రభావవంతంగానూ, సమర్థవంతంగానూ ఉండగలరు అని పరిస్థితిని వివరించారు. కేంద్రంలో ఉండేది యూపీఏ ప్రభుత్వమైనా, ఎన్డీఏ ప్రభుత్వమైనా స్థానిక భాషపై ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులనే సీఎస్లుగా నియమిస్తున్నారు. మిజోరాం ఏర్పడి నుంచి ఇది ఆచారంగా వస్తోందని తెలియజేశారు. నేను మొదటి నుంచి ఇప్పటి వరకు ఎన్డీయే భాగస్వామిగా ఉన్నాను. చాలా రాష్ట్రాలు ఒక కూటమి నుంచి మరో కూటమికి మారుతున్నప్పటికీ ఈశాన్య ప్రాంతంలో ఎన్డీయేకు నమ్మకమైన భాగస్వామిగా ఉన్నది నేను మాత్రమే. కాబట్టి, ఎన్డీయేతో ఈ నమ్మకమైన స్మేహానికి నేను ప్రతేకం అని నమ్ముతున్నాను అంటూ లేఖలో రాశారు. తన అభ్యర్థనను ఆమోదించకుంటే ఎన్డీయేలో విశ్వాసపాత్రుడిగా పనిచేసినందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ తనను అపహాస్యం చేస్తుందని ముఖ్యమంత్రి జోరంతంగా లేఖలో పేర్కొన్నారు. -
ఏపీ నూతన సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1985 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన డాక్టర్ సమీర్శర్మ గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సీఎస్గా పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్దాస్ స్థానంలో ఆయన నూతన బాధ్యతలు చేపట్టారు. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరి సహకారంతో రాష్ట్ర పురోభివృద్ధి, నవరత్నాల అమలు కోసం కృషి చేస్తానని సమీర్శర్మ తెలిపారు. పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్దాస్ ఢిల్లీలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులైన విషయం తెలిసిందే. శుక్రవారం సచివాలయంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్దాస్కు వీడ్కోలు, డాక్టర్ సమీర్ శర్మకు స్వాగత సభ కార్యక్రమాన్ని గురువారం సచివాలయం మొదటి బ్లాక్ సీఎం సమావేశ మందిరంలో సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏపీని ఉత్తమ రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యం: ఆదిత్యనాథ్దాస్ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా, అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు ఆదిత్యనాథ్దాస్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన తొలి ఇన్నింగ్స్ పూర్తి చేసుకుని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. అధికారులు, సిబ్బందితో కలసి టీమ్ వర్క్తో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేలా కృషి చేశామన్నారు. పదేళ్లపాటు నీటిపారుదల శాఖలో పనిచేసిన తనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రితోపాటు యావత్ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేశారు. తన పదవీకాలంలో ఏ ఒక్కరినీ తక్కువ చేయకుండా అందరినీ సమానభావంతో చూశానన్నారు. నూతన సీఎస్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సమీర్శర్మను తాను నరసాపురం సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు కలిశానని గుర్తు చేసుకున్నారు. ఆయన సమర్ధుడైన అధికారి అని, నూతన భావాలు కలిగినవారని అభినందించారు. మరో ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నారు: సమీర్ శర్మ తనకు సాదర స్వాగతం పలుకుతున్న అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు నూతన సీఎస్ డాక్టర్ సమీర్శర్మ పేర్కొన్నారు. మంచి వ్యక్తిత్వం కలిగిన ఆదిత్యనాథ్దాస్ తన కుటుంబ స్నేహితుడని చెప్పారు. ఆయనది పదవీ విరమణ కాదని, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా మరో ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఉన్నత విలువలు ఆయన సొంతం.. సభకు అధ్యక్షత వహించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆదిత్యనాథ్దాస్ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అధికారులందరికీ పలు అంశాల్లో నిరంతరం మార్గదర్శనం చేసే వారని చెప్పారు. డాన్సింగ్ విత్ డ్రీమ్స్ అనే పుస్తకాన్ని రచించడం ద్వారా ఆయనలో మంచి కవి ఉన్నాడని నిరూపించారన్నారు. ఆదిత్యనాథ్ దాస్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇరువర్గాలను పిలిచి సామరస్యపూర్వకంగా పరిష్కరించే వారని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య కొనియాడారు. నీటిపారుదల రంగంలో విశేష అనుభవాన్ని గడించిన ఆదిత్యనాథ్దాస్ను వాటర్మెన్గా పిలవవచ్చని సర్వీసులు శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ పేర్కొన్నారు. ఆదిత్యనాథ్ దాస్ సమర్థంగా పనిచేశారని, సీఎస్గా బాధ్యతలు చేపట్టిన సమీర్ శర్మ పట్టణాభివృద్ధి రంగంలో నిపుణులని సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి సునీత చెప్పారు. ఆదిత్యనాథ్ దాస్ మంచి మానవతావాది అని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ పేర్కొన్నారు. ఆదిత్యనాథ్ దాస్ ఫైళ్లను చాలా వేగంగా క్లియర్ చేసేవారని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి తెలిపారు. ఆదిత్యనాథ్ దాస్ వద్ద సౌకర్యవంతంగా విధులు నిర్వహించగలిగినట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు. ఆదిత్యనాథ్ దాస్, డాక్టర్ సమీర్ శర్మను ఈ సందర్భంగా అధికారులు దుశ్శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. సమాచార, పౌర సంబంధాలశాఖ ఈవో కార్యదర్శి టి.విజయకుమార్రెడ్డి, ఆర్ధిక శాఖ ఈఓ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. -
హైదరాబాద్: మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత
-
మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత: సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన కరోనాతో చికిత్స పొందుతూ హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. 2010లో ఉమ్మడి ఏపీలో సీఎస్గా పనిచేసిన ఎస్వీ ప్రసాద్ పలువురు ముఖ్యమంత్రులకు కార్యదర్శిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి హయాంలో ఎస్వీ ప్రసాద్ విజిలెన్స్ కమిషనర్గా పనిచేశారు. ఆయన 1975 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం: మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎస్వీ ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరిపాలనలో ఎస్వీ ప్రసాద్ తనదైన ముద్ర వేశారని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు. చిరంజీవి సంతాపం: మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సినీ నటుడు చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చదవండి: కోవిడ్తో తల్లిదండ్రులు మృతి: బడికెళ్లే వయసులో బరువైన బాధ్యత -
Alapan Bandyopadhyay: ఆలాపన్ ఢిల్లీకి వెళ్లనట్లే!
కోల్కతా/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరు కాని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయను ఢిల్లీకి రావాలని ఆదేశిస్తూ(రీకాల్) కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు అమలవ్వడం సాధ్యం కాకపోవచ్చని మాజీ ఐఏఎస్ అధికారులు, న్యాయ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఆలాపన్ బందోపాధ్యాయ సోమవారం పదవీ విరమణ చేయాల్సి ఉంది. సివిల్ సర్వీసు అధికారులను రీకాల్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలని నిపుణులు చెబుతున్నారు. ఆలాపన్ విషయంలో బెంగాల్ ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోవడం లేదు. మరోవైపు రిలీవ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించడం లేదన్న కారణంతో సెంట్రల్ డిప్యూటేషన్కు నిరాకరిస్తే ఆయనపై పరిపాలనాపరమైన చర్యలు తప్పకపోవచ్చని ఢిల్లీలోని అధికార వర్గాలు చెబుతున్నాయి. అడకత్తెరలో... బెంగాల్లో తుపాను నష్టంపై శుక్రవారం మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆలాపన్ బందోపాధ్యాయ హాజరు కాకపోవడాన్ని కేంద్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది. సోమవారం ఢిల్లీలో సిబ్బంది వ్యవహారాల శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మమత కోరిక మేరకు కొద్దిరోజుల కిందటే ఆలాపన్ బందోపాధ్యాయ పదవీ కాలన్ని కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు పొడిగించడం గమనార్హం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆయన సేవలు అవసరమని మమత భావిస్తున్నారు. ఆలిండియా సర్వీసు రూల్స్ (ఏఐఎస్)ను గుర్తుచేస్తూ బెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి ఒక మర్యాదపూర్వకమైన లేఖ రాస్తే మంచిదని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి జవహర్ సర్కార్ సూచించారు. ఆలిండియా సర్వీసు రూల్స్లోని 6(1) నిబంధన ప్రకారం.. అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్రానికి లేదా ఏదేని ప్రభుత్వరంగ సంస్థకు డిప్యూటేషన్పై పంపించాలంటే సదరు అధికారి అప్పటిదాకా పని చేస్తున్న రాష్ట్రంలోని ప్రభుత్వం అందుకు అంగీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఆలాపన్ బందోపాధ్యాయను డిప్యూటేషన్పై ఢిల్లీకి పంపడానికి బెంగాల్ ప్రభుత్వం ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆలాపన్ బందోపాధ్యాయ ఈ సంకటం నుంచి తప్పించుకోవాలంటే పదవీకాలం పొడిగింపును వదులుకొని ఈ నెల 31న పదవీ విరమణ చేస్తే మంచిదని మాజీలు సలహా ఇస్తున్నారు. ఆయన సేవలు అవసరమంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సలహదారుడిగా నియమించుకోవాలని మమతకు సూచిస్తున్నారు. సమ్మతించని బెంగాల్ సర్కారు ఆలాపన్ బందోపాధ్యాయను డిప్యూటేషన్పై ఢిల్లీకి పంపడానికి బెంగాల్ సర్కారు ఇంకా సమ్మతించలేదు. దీంతో ఆయన సోమవారం కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖకు రిపోర్టు చేసే అవకాశాలు లేవని అధికారులు అంటున్నారు. ఆలాపన్ ఆదివారం కూడా బెంగాల్ సచివాలయంలో విధులకు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఆయన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సచివాలయంలో నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. -
మోదీ వర్సెస్ దీదీ: భారీ హైడ్రామా.. ట్విస్టులు
ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య కోల్డ్వార్ రసవత్తరం. నిన్న తుపానుపై సమీక్ష సమావేశానికి దీదీ అర గంట ఆలస్యం. పావు గంటలోనే తిరుగుముఖం. దీదీ ఉద్దేశ్యపూర్వకంగానే చేశారని బీజేపీ ఆరోపణ. గవర్నర్తో పాటు కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా కూడా గరం. సీఎస్ను వెనక్కి పంపించేయాంటూ ఆఘమేఘాల మీద ఆదేశాలతో కేంద్రం రివెంజ్!. న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీరుపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంతో ఊగిపోతోంది. యాస్ తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మమతా.. సీఎస్తో సహా ఉన్నతాధికారుల్ని కూడా ఉద్దేశ్యపూర్వకంగానే హాజరుకావొద్దని ఆదేశించినట్లు కేంద్రం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యకార్యదర్శి అలపన్ బందోపాధ్యాయను వెనక్కి పంపించాల్సిందిగా బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర ఆదేశాలు జారీ చేసింది. నిజానికి నాలుగు రోజుల క్రితమే బందోపాధ్యాయ కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగించింది కేంద్రం. అయితే తాజా పరిణామాలతో ఆయన్ని వెనక్కి పిలిపించుకోవడంపై ప్రతీకార చర్యగానే మమత ప్రభుత్వం భావిస్తోంది. దిగజారుడుతనమే! సీఎస్ను వెనక్కి రావాలన్న కేంద్రం ఆదేశాలపై తృణముల్ ఎంపీ సుఖేందు తీవ్రంగా మండిపడ్డాడు. ‘స్వాంతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇలా బలవంతంగా ప్రతీకార దేశాలు ఇవ్వడం ఏమిటి? మోదీ షాలు ఇంకెంత దిగజారుతారు. మమత సర్కార్కి ఇలాంటి ఆదేశాలిచ్చి ఈ ఇద్దరూ బెంగాల్ ప్రజలు ఘోరంగా అవమానించారు’ అని సుఖేందు వ్యాఖ్యానించాడు. కాగా, ఉన్నతాధికారులను కేంద్రం వెనక్కి తీసుకోవడం ఇదేం కొత్త కాదు. బెంగాల్ ఎన్నికలకు ముందు ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేంద్రం వెనక్కి తీసుకుంది. అయితే అలపన్ బందోపాధ్యాయను రూల్స్ ప్రకారమే కేంద్రం వెనక్కి తీసుకుంటోందని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సోన్నెల్ అండ్ ట్రైనింగ్ తెలిపింది. ఐఎఎస్ కాడర్ రూల్స్లోని సెక్షన్ 6(1) ప్రకారం.. బందోపాధ్యాయను మే 31లోగా రిపోర్టింగ్ చేయాలని సంబంధిత విభాగంలోని ఓ అధికారి వెల్లడించాడు. ఇలా వచ్చి, అలా.. కాగా, ఏరియల్ సర్వే కలైకుందా ఎయిర్బేస్లో సమీక్ష సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఈ మీటింగ్లో ప్రధాని మోదీతో పాటు బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్, సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత సువేందు, సీఎస్, ఉన్నతాధికారులు పాల్గొనాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరిగిన తర్వాత ప్రధాని, మమతా బెనర్జీ మధ్య సమావేశం తొలిసారి కావడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఉన్నతాధికారులు ఎవరూ ఈ సమావేశానికి హాజరుకాకపోగా, దీదీ కోసం అంతా 30 నిమిషాల పాటు వేచి చూశారని తెలుస్తోంది. ఆ తర్వాత వచ్చిన మమతా వేరే కార్యక్రమాలు ఉన్నందున ఆలస్యం అయ్యిందని తెలిపారు. ఆ తర్వాత యాస్ తుపాన్ నష్టంపై రిపోర్టులు సమర్పించి.. దిఘాలో జరిగే మీటింగ్ కోసం వెళ్లాలని చెప్పి పావుగంటలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే మమతా ఆ సమావేశానికి హాజరుకాలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గరం.. గరం ప్రధానితో సమావేశానికి మమతా బెనర్జీ గైర్హాజరు పట్ల బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధనకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సమావేశానికి గైర్హాజరు కావడం రాజ్యాంగం, సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారరు. ఇక మమతా బెనర్జీ తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానిని కించపరిచేలా, అమర్యాదగా ఓ ముఖ్యమంత్రి ప్రవర్తించడం గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొంది. నియంతృత్వ స్వభావానికి ఇది పరాకాష్ట అని కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ఒక ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానితో కలిసి పనిచేయాల్సింది పోయి రాజకీయాలు చేయడం దీదీ పట్ల అసహ్యం కలిగేలా చేస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. Mamata Didi’s conduct today is an unfortunate low. Cyclone Yaas has affected several common citizens and the need of the hour is to assist those affected. Sadly, Didi has put arrogance above public welfare and today’s petty behaviour reflects that. — Amit Shah (@AmitShah) May 28, 2021 -
మత విద్వేషాలకు భారీ కుట్ర
సాక్షి, అమరావతి: అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవిస్తున్న రాష్ట్ర ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో వైషమ్యాలను రగిల్చేందుకు భారీ కుట్ర జరుగుతోందని, ఇలాంటి సంఘ విద్రోహ చర్యల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకు ఇటీవల భారీ కుట్ర జరుగుతోందన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీయడం ద్వారా సమాజాన్ని విచ్ఛిన్నం చేసి అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పథకం ప్రకారం కుట్రలకు పాల్పడుతున్నాయని, ఇటీవల దేవాలయాలపై జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి విధ్వంసకర శక్తులను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గురువారం విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో సీఎస్ ఆదిత్యనాథ్దాస్ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే దుశ్చర్యలు.. దేశవ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో దూసుకెళుతున్న ఆంధ్రప్రదేశ్లో మతకల్లోలాలను సృష్టించడం ద్వారా శాంతి భద్రతలను దెబ్బతీసి అభివృద్ధిని నిరోధించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయని సీఎస్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలపై దాడులు చేస్తూ దేవతామూర్తుల విధ్వంసాలకు పాల్పడుతున్నారన్నారు. పథకం ప్రకారం విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడంతో పాటు సమాజాన్ని విడదీసి ప్రజల దృష్టి మరల్చానే కుట్ర జరుగుతోందన్నారు. దుశ్చర్యలకు పాల్పడేవారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలను, శక్తులను సమాజం అంతా కలిసి అడ్డుకుంటుందని, ఇందులో భాగంగానే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మతసామరస్య కమిటీలను ఏర్పాటు చేస్తూ జీవో 6 జారీ చేసినట్లు వివరించారు. కమిటీల్లో అన్ని మతాలకు స్థానం.. మతసామరస్యాన్ని కాపాడేందుకు ఏర్పాటైన కమిటీలు తరచూ సమావేశమై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కృషి చేయడంతోపాటు శాంతియుత వాతావరణం వెల్లివిరిసేలా దోహదం చేస్తాయని సీఎస్ వివరించారు. అన్ని వర్గాల్లో విశ్వాసం, మనోధైర్యాన్ని పెంపొందిస్తూ మత సామరస్యాన్ని పరిరక్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మత సామరస్య కమిటీలు దోహదం చేస్తామని సీఎస్ తెలిపారు. కమిటీల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారని, ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే కమిటీలు సందర్శిస్తాయని చెప్పారు. కొన్ని ఘటనలకు సంబంధించి వెంటనే కేసులు నమోదు చేశామని, నిందితులను గుర్తించడంతో పాటు వీటి వెనక ఎవరున్నారో కూడా బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వ అధికారులకు కులమతాలను ఆపాదించడం హేయమైన చర్య అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీఎస్, కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతోపాటు విధివిధానాలను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా ఉండే రాష్ట్ర స్థాయి కమిటీకి డీజీపీ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. సభ్యులుగా హిందు, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధులు, జైన్లతో పాటు ఇతర మతాలకు చెందిన ఒక మత పెద్ద ప్రతినిధిగా ఉంటారు. హోం, దేవదాయ, మైనార్టీ వెల్ఫేర్, సాధారణ పరిపాలన (రాజకీయ) ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా, ఇతర భాగస్వామ్యులు సభ్యులుగా ఉంటారని ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వైస్ చైర్మన్గా జిల్లా ఎస్పీ ఉంటారు. జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా, రెవిన్యూ) కన్వీనర్ సభ్యులుగా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయి కమిటీ విధివిధానాలు.. ►మతవిద్వేషాలను రగిల్చేలా సందేశాలను ప్రచారం చేయడం, మతసామరస్యాన్ని దెబ్బతీసే ఘటనలపై రాష్ట్ర స్థాయి కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై చర్చించాలి. ►స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్, ప్రార్థన మందిరాల వద్ద భద్రతా చర్యలకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలి. మత సామరస్యం పెంపొందించేలా కార్యక్రమాలతో పాటు కార్యాచరణ సిద్ధం చేయాలి. ►జిల్లా స్థాయి మతసామరస్య కమిటీలతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలి ►మతవిద్వేషాలు రెచ్చగొట్టిన వారిపై ఐపీసీ కింద నమోదైన క్రిమినల్ చర్యలన్నింటినీ పరిశీలించాలి. ►మతసామరస్యం వెల్లివిరిసేలా పాఠశాల, కళాశాల స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలి జిల్లా స్థాయి కమిటీ విధివిధానాలు ►జిల్లా స్థాయిలో ఏదైన సంఘటన వల్ల మతసామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉంటే తక్షణం బాధ్యులపై చర్యలు తీసుకోవడం ద్వారా గట్టి సంకేతాన్ని పంపాలి. క్రమం తప్పకుండా కమిటీ సమావేశాలు నిర్వహించాలి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సామాజిక, మతపరమైన సమతుల్యతను కాపాడే విధంగా జిల్లాస్థాయి కమిటీ సభ్యులు కృషి చేయాలి. ►గతంలో జరిగిన సంఘటనలను పరిగణలోకి తీసుకుంటూ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. ►సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు సమీక్షించాలి ►భూములు, లేదా ఇతర సంఘటనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉన్నచోట్ల పరిష్కారం కోసం ప్రణాళిక సిద్ధం చేయాలి. ►ప్రార్థనా మందిరాలు, ప్రముఖ భవనాలు, చారిత్రక కట్టడాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలి. ► ప్రజల్లో మతసామరస్యం పెంపొందించేలా జిల్లా స్థాయి కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి ►మతవిద్వేషాలు రెచ్చగొట్టిన వారిపై ఐపీసీ వివిధ సెక్షన్ల కింద నమోదైన క్రిమినల్ కేసుల విచారణ పురోగతిపై సమీక్షించాలి. కరెంట్ రంపం వాడిన దుండగులు రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం విధ్వంసానికి వినియోగించిన ఎలక్ట్రికల్ రంపాన్నే రాజమహేంద్రవరం, కృష్ణా జిల్లాలో విగ్రహాల ధ్వంసానికి ఉపయోగించినట్లు ఆధారాలు సేకరించామని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. ఒక ప్రణాళిక ప్రకారం దేవాలయాలపై దాడులు చేస్తూ మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేసినట్లు అనుమానిస్తున్నామన్నారు. కేసుల దర్యాప్తులో ఆధారాలను సాంకేతికంగా, ఇతర రూపాల్లో సేకరిస్తున్నామని వాటిని క్రోడీకరించి నిందితులను పట్టుకుంటామని, వారి వెనుక ఉన్న వారిని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసుల విచారణ బాధ్యతను సీఐడీ విభాగానికి అప్పగించామన్నారు. ముందే ఒక అభిప్రాయానికి వచ్చి దర్యాప్తు చేయడం లేదని, సీసీ కెమెరాలు, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో గతంలోనూ దేవాలయాలపై దాడులు జరిగాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేవతా విగ్రహమూర్తులపై 2017లో రెండు, 2018లో మూడు, 2019లో ఒకటి, 2020లో 29, ఈ ఏడాది మూడు చోట్ల విగ్రహాలను ధ్వంసం చేశారని చెప్పారు. 2019లో నమోదైన కేసులకు సంబంధించి ఆరు చోట్ల గతంలో దెబ్బతిన్న విగ్రహాలను ఇప్పుడు దెబ్బతిన్నట్లుగా చిత్రీకరించారని తెలిపారు. సమావేశంలో సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ప్రకాష్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజీత్, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్, కమిషనర్ అర్జునరావు, మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ పాల్గొన్నారు. -
మమత సర్కార్పై గవర్నర్ ధన్కర్ తీవ్ర వ్యాఖ్యలు
-
నడ్డాపై దాడి: బెంగాల్ డీజీపీ, సీఎస్లకు సమన్లు
కోల్కతా: రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్ వెళ్లిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగాల్లో బీజేపీ, టీఎంసీ నాయకుల మధ్య మాటల వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో తమ నాయకుడిపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని.. వడ్డితో సహా చెల్లిస్తామని బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ హెచ్చరించారు. ‘మేం మారుస్తాం.. మేం ప్రతీకారం తీర్చుకుంటాం. వడ్డీతో సహా చెల్లిస్తాం’ అంటూ దిలీప్ ఘోష్ ఫేస్బుక్లో ఓ పోస్ట్ షేర్ చేశారు. డైమండ్ హర్బర్లో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్తుండగా.. టీఎంసీ కార్యకర్తలు నడ్డా కాన్వాయ్ని అడ్డుకోవడమే కాక రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన అనంతరం బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బెంగాల్ డీజీపీకి సమన్లు ఇక నడ్డా కాన్వాయ్పై దాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ బెంగాల్ సీఎస్, డీజీపీలకు సమన్లు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాల్సిందిగా హోం మంత్రి అమిత్ షా గవర్నర్ని కోరిన సంగతి తెలిసిందే. బీజేపీ రియాక్షన్.. నడ్డాపై దాడిని బెంగాల్ బీజేపీ నాయకులు సీరియస్గా తీసుకున్నారు. ప్రతీకారం తీర్చుకుంటామని దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు. ఈ క్రమంలో సయంతన్ బసు ‘మీరు ఒక్కరిని చంపితే.. మేం నలుగురిని చంపుతాం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నడ్డా కాన్వాయ్పై దాడి అనంతరం ఢిల్లీలోని అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీన్ని ఉద్దేశిస్తూ.. బసు ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ముందు ముందు చాలా ఉంటాయి’ అంటూ హెచ్చరించారు. -
వాయిదాల్లో చెల్లించొచ్చు
సాక్షి, హైదరాబాద్ : భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, చార్జీల చెల్లింపులో ప్రభుత్వం రాష్ట్రమంతటికీ వెసులుబాటు కల్పించింది. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ ఫీజులను 4 సమ వాయిదాల్లో (6 నెలలకు ఒకటి... మొత్తం రెండేళ్ల వ్యవధి ఇస్తారు) చెల్లించడానికి వీలు కల్పిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. స్థిరాస్తి రం గాన్ని ప్రోత్సహించడానికి బిల్డింగ్ పర్మిట్ ఫీజు, బెటర్మెంట్, డెవలప్మెంట్, క్యాపిటలైజేషన్ చార్జీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండీఏల పరిధిలో వాయిదాల్లో చెల్లించడానికి అనుమతిస్తూ ఈ ఏడాది జులై 8న రాష్ట్ర ప్రభుత్వం జీవో 108ను జారీచేసింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు దీన్ని వర్తింపజేస్తూ అరవింద్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. ♦ అన్ని రకాల చార్జీలను నాలుగు సమ అర్ధ వార్షిక వాయిదాల్లో చెల్లించవచ్చు. ♦ ఫీజు ఇంటిమేషన్ లేఖ అందిన 30 రోజుల్లోగా తొలి వాయిదా చెల్లించాలి. ♦ ఎవరైనా బిల్డర్, డెవలపర్ బిల్డింగ్/ లే అవుట్ అనుమతుల సమయంలోనే మొత్తం ఫీజులు, చార్జీలు చెల్లించేందుకు ముందుకు వస్తే ఎర్లీబర్డ్ పథకం కింద మొత్తం ఫీజుల్లో 5 శాతం రాయితీ లభిస్తుంది. ♦ పోస్ట్డేటెడ్ చెక్కుల్లో పేర్కొన్న తేదీల్లోగా వాయిదాలను చెల్లించడంలో విఫలమైతే జాప్యం జరిగిన కాలానికి 12% వడ్డీతో కలిపి చెల్లించాలి. ♦ 2021 మార్చి 31 లోగా వచ్చే కొత్త దరఖాస్తులతో పాటు అన్ని పెండింగ్ దరఖాస్తులకు ఈ వెసులుబాటు వర్తించనుంది. -
తెలంగాణ కొత్త సీఎస్గా సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కొత్త సీఎస్గా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ కమిషనర్గా ఉన్న సోమేశ్ కుమార్.. రేపటి నుంచి (జనవరి 1) సీఎస్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శైలేంద్ర కుమార్ జోషి పదవీకాలం నేటితో ముగియనుంది. నేడు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం జోషి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగనున్నారు. అలాగే నీటిపారుదల వ్యవహారాల సలహాదారుడిగా వ్యవహరించనున్నారు. ఇక బీహార్కు చెందిన సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్కు చెందిన అధికారి. ఆయన 2023 డిసెంబర్ 31 వరకు సీఎస్గా కొనసాగనున్నారు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా సోమేశ్ విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
పదవీ విరమణ చేయనున్న మాజీ సీఎస్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనిల్ చంద్ర పునేతా రేపు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ప్రస్తుతం ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అనిల్ చంద్ర పునేతా 1984 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తేలడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీ, అప్పుడు ఏపీ సీఎస్గా పని చేస్తున్న అనిల్ చంద్ర పునేతాను సీఎస్గా తప్పించిన సంగతి తెల్సిందే. అనంతరం ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఏపీ సీఎస్గా నియమించిన విషయం విదితమే. -
కేవలం మంత్రులతో భేటీ అయి సరిపెడతారా?
-
బాబు కేబినెట్ భేటీ.. సీఎస్ సమాలోచనలు!
సాక్షి, అమరావతి : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంతో ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమాలోచనలు ప్రారంభించారు. సీఎం కార్యదర్శి సాయిప్రసాద్, జీఏడీ పొలిటికల్ కార్యదర్శి శ్రీకాంత్తో ఆయన మంగళవారం తన చాంబర్లో భేటీ అయ్యారు. ఇదే విషయమై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదితోనూ ఆయన భేటీ అయి సమాలోచనలు జరిపారు. ఈ నెల 10వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎస్కు ముఖ్యమంత్రి కార్యాలయం నోట్ పంపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఆ రోజు ఉదయం 10.35 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్మహ్యణ్యంకు నోట్ వచ్చింది. దీనిని ఆయన సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లికి పంపించారు. ఈ అంశం సచివాలయంలోని అఖిల భారత సర్వీసు (ఐఏఎస్) సీనియర్ అధికారుల్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించడం సహేతుకమేనా? అసలు ఈ సమావేశం జరుగుతుందా? జరగదా? అనే అంశాలు ప్రస్తుతం ఐఏఎస్ల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈనెల 10న కేబినెట్ సమావేశం జరుగుతుందా? జరగదా? అని సీనియర్ ఐఏఎస్ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా జరిగే అవకాశం లేనేలేదని కుండబద్దలు కొట్టారు. సీఎం తీసుకున్న నిర్ణయం సమంజసమైనది కాకపోవడం, నిబంధనలను పాటించకపోవడమే ఇందుకు కారణాలని వారు విశ్లేషిస్తున్నారు. -
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకల కారణంగా 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనపై ఎన్హెచ్ఆర్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్ ఫలితాల విషయంలో గందరగోళం నెలకొనడం..3.5 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్లో ఫెయిల్ అయిన నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ ఈ కేసును సుమోటాగా స్వీకరించింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. -
సీఎస్, డీజీపీలతో ఈసీ ప్రత్యేక భేటీ
హైదరాబాద్: తెలంగాణ సీఎస్, డీజీపీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి ప్రత్యేకంగా సోమవారం సమావేశం కానున్నారు. మాసాబ్ టాంక్లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో ఈ నెల 18వ తేదీన హోటల్ మారియట్లో సమావేశం కానున్నారు. శాంతిభద్రతలు, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. 18వ తేదీ సమావేశం తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపీటీసీలకు పింక్, జెడ్పీటీసీలకు వైట్ కలర్ బ్యాలెట్లు వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వతంత్ర అభ్యర్థుల కోసం ముందు జాగ్రత్తగా 100 గుర్తులను అధికారులు అందుబాటులో ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 57 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తాజాగా మరో 3 లక్షల మంది ఓటర్లు పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. -
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ రేసులో ఆ ముగ్గురు..!
సాక్షి, అమరావతి: హైకోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో నూతన ఇంటెలిజెన్స్ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని కోసం ముగ్గురు సీనియర్ అధికారులు పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించారు. ఈ మేరకు ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎస్ పంపారు. సీఎస్ పంపిన జాబితాలో నళినీ ప్రభాత్ (1992 బ్యాచ్), కుమార్ విశ్వజిత్, కృపానంద త్రిపాఠి ఉజెలా (1994) ఉన్నారు. వీరిపై ఎలాంటి శాఖాపరమైన విచారణలు పెండింగ్లో లేవని స్పష్టం చేశారు. ఏపీలో అధికార టీడీపీ సేవలో తరిస్తూ, విధి నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం విదితమే. ఆయనతోపాటు వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్దేవ్ శర్మ, వెంకటరత్నంలను కూడా బదిలీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులు పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఇంటెలిజెన్స్ డీజీపై వేటు -
ఏపీలో రాచరికపు పాలన: అజేయ కల్లాం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పాలనపై ప్రభుత్వ మాజీ సీఎస్ అజేయ కల్లాం తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులో సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అజేయ కల్లాం చంద్రబాబు చర్యలను తీవ్రంగా విమర్శించారు. ఏపీలో రాజరికపు ప్రజాస్వామ్యం నడుస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాచరికపు పోకడలు వచ్చాయి.. ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలన పెత్తనం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఒక రోజు ఎమ్మెల్యేగా కూడా చేయని వారు మంత్రులు అవుతున్నారని పరోక్షంగా నారా లోకేష్ని ఉద్దేశించి అన్నారు. ప్రజాస్వామ్యంలో రాచరికపు వ్యవస్థలకు ప్రజలే చెక్ పెట్టాలని సూచించారు. తమిళనాడు పుణ్యమా అని సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడం ఇక్కడా వచ్చిందని అన్నారు. రాజకీయాల్లో ఆదర్శవంతమైన నేతలు ఈరోజుల్లో కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్వవస్థలకు స్వతంత్ర కావాలని కోరారు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అసెంబ్లీ అనుమతి లేకుండా రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. కాగ్ తప్పుబట్టినా ఈ విషయాన్ని ఎవరూ ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వాలు చేస్తున్న వేల కోట్ల రూపాయల అప్పులు ఎవరి కోసం చేస్తున్నారో చెప్పాలని సూటిగా అడిగారు. ప్రజల అభిప్రాయాలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలే పెత్తనం చేస్తున్నాయని ఆరోపించారు. జిల్లాలో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేశారు. సింగపూర్ విమానం కోసం కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. చనిపోయిన రైతులకు ఆదుకోరు కానీ విమాన ప్రయాణానికి రాయితీలు ఆగమేఘాల మీద చెల్లిస్తారని విమర్శించారు. తెలంగాణాలో డబుల్ బెడ్రూం నిర్మాణంలో భాగంగా చదరపు అడుగుకు రూ.800 ఖర్చు అవుతుంటే...ఏపీలో మాత్రం చదరపు అడుగుకు రూ.2700 అయినట్లు ఖర్చు చూపిస్తున్నారని, ఈ విషయంలోనే చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏవిధంగా దోచుకుంటున్నారో అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడానికా ప్రభుత్వం ఉంది అని అజేయ్ కల్లాం సూటిగా అడిగారు. -
టిట్లీ అలర్ట్ : ఒడిశాలో హైఅలర్ట్
భువనేశ్వర్ : ఒడిశా- ఏపీ తీరంలో టిట్లీ తుపాన్ ముంచుకొస్తోందన్న భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాన్తో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకోకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ముందస్తు చర్యలకు సంసిద్ధమైంది. తీర ప్రాంత జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. పెద్ద ఎత్తున ఆహారపదార్ధాల నిల్వలను ప్రభావిత ప్రాంతాలకు చేరవేయడంతో పాటు ప్రజలను సైక్లోన్ షెల్టర్లకు తరలించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏపీ పాధి పేర్కొన్నారు. మరోవైపు గంజాం, గజపతి, పూరీ, జగత్సింగ్పూర్ ప్రాంతాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. గతంలో 2013లో ఫైలిన్, 2014లో హుద్హుద్ తుపాన్ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా విపత్తు నిర్వహణ చేపట్టామని ఆయన గుర్తుచేశారు. టిట్లీ తుపాన్ ధాటికి గంటకు 100 నుంచి 110 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, బుధవారం నాటికి తుపాన్ విస్తరించి తీవ్రరూపు దాల్చుతుందని ఐఎండీ అంచనా వేసినట్టు వెల్లడించారు. ప్రభుత్వ కార్యదర్శులు, సహాయ పునరావాస కమిషనర్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో ప్రధాన కార్యదర్శి నిర్వహించిన అత్యున్నత స్ధాయి సమావేశంలో తుపాన్ పరిస్థితిని సమీక్షించారు. కాగా బుధ, గురువారాల్లో ఒడిశాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్అలర్ట్ జారీ చేసింది. కాగా టిట్లీ ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్పూర్ తీరానికి 510 కి.మీ. దూరంలో ఏపీలోని కళింగపట్నం తీరానికి 460 కిలోమీటర్ల దూరం మధ్య కేంద్రీకృతమైందని వాతావరణ విభాగం పేర్కొంది. -
ఈపీడీసీఎల్లో ఏం జరుగుతోంది..?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పది కాదు.. ఇరవై కాదు 720 కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నప్పుడు పర్యవేక్షణ ఎలా ఉండాలి.? ఎలా పడితే అలా భూగర్భ కేబుళ్ల పనులు చేస్తుంటే నియంత్రించకుండా ఏం చేస్తున్నారు.? పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంటే కనీసం పట్టించుకోరా.? అత్యంత ప్రతిష్టాత్మకమని చెప్పినా నిర్లక్ష్యం వహిస్తే ఎలా.? అసలు ఈపీడీసీఎల్లో ఏం జరుగుతోందంటూ సీఎండీ దొరపై చీఫ్ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యుత్ శాఖలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దినేష్కుమార్ అమరావతిలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ముఖ్య అధికారులు, ట్రాన్స్కో, జెన్కో సంస్థల ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ ప్రాజెక్టు(ఏపీడీఆర్పీ) కింద చేపడుతున్న భూగర్భ కేబుల్ ఏర్పాటు పనుల ప్రస్తావన సమయంలో పై వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో తొలిసారిగా అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్వర్క్ ప్రాజెక్టు విశాఖలో తొలిసారిగా ప్రారంభించాం. ప్రపంచ బ్యాంకు వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనుల్ని ఎలా చెయ్యాలి, కానీ.. మీరెలా చేస్తున్నారంటూ’ సీఎండీ దొరపై సీఎస్ దినేష్కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.720 కోట్ల విలువైన భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులపై ఈపీడీసీఎల్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటాన్ని తప్పుబట్టారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో చాలా చోట్ల నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, ఇష్టమొచ్చినట్లు అడ్డగోలుగా పనులు చేస్తున్నా పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎండీగా ఉండి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో నిబంధనలు, ప్రమాణాలు పాటించేలా ప్రతి పనినీ పర్యవేక్షించాలని అధికారులను చీఫ్ సెక్రటరీ దినేష్కుమార్ సూచించారు. -
తిరుమలలో చీఫ్ సెక్రటరీ టక్కర్
తిరుమల (అలిపిరి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ మంగళవారం తిరుమలకు వచ్చారు. ఇక్కడి పద్మావతి అతిథి గహాల వద్దకు చేరుకున్న ఆయకు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. 04టీఎంఎల్107–603001 :