delayed
-
HYD: అంతరాయం తర్వాత యథావిధిగా మెట్రో రైళ్లు
సాక్షి,హైదరాబాద్: నగరంలో మెట్రోరైలు సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. బుధవారం(జనవరి29) ఉదయం అమీర్పేట్- హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైళ్లు గంటకుపైగా ఆలస్యంగా నడిచాయి.ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు హైటెక్ సిటీ నుంచి అమీర్పేట్ వైపునకు మెట్రో రైళ్లు రాలేదు. మరోవైపు జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్లో ఒక రైలు ఆగిపోయింది. అయితే గంట తర్వాత రైళ్లను మెట్రో అధికారులు పునరుద్ధరించారు. తర్వాత రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి.ఆఫీసులకు వెళ్లే వేళలు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.సాంకేతిక సమస్యల కారణంగా రైళ్లు ఆలస్యం అవుతున్నాయని మెట్రో రైలు అధికారులు ప్రకటించారు.కాగా, గతంలోనూ మెట్రో రైలు సర్వీసులకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. అంతరాయాలు ఎక్కువగా ఉదయం ఆఫీసు వేళల్లో ఏర్పడుతుండడంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైటెక్సిటీ వైపు రూట్లో రైళ్లు ఆలస్యమవుతుండడంతో ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
42 గంటలే ప్రయాణం.. మూడేళ్లకు స్టేషన్ చేరింది
రైలు ఆలస్యంగా రావడం సర్వసాధారణమే. ఆలస్యం అంటే ఒక గంట, రెండు గంటలు.. మహా అయితే ఒక రోజు అనుకుందాం. కానీ 42 గంటల్లో గమ్యాన్ని చేరాల్సిన రైలు.. తన గమ్యాన్ని చేరుకోవడానికి 3 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్లోని బస్తీకి వెళుతున్న గూడ్స్ రైలు 42 గంటల్లో గమ్యాన్ని చేరాల్సి ఉంది. 2014లో బస్తీలోని వ్యాపారవేత్త 'రామచంద్ర గుప్తా' తన వ్యాపారం కోసం విశాఖపట్నంలోని ఇండియన్ పొటాష్ లిమిటెడ్ నుంచి సుమారు రూ.14 లక్షల విలువైన డైమోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) కోసం ఆర్డర్ ఇచ్చాడు.నవంబర్ 10, 2014న, షెడ్యూల్ ప్రకారం బయలుదేరిన గూడ్స్ రైలులో 1,316 బస్తాల డీఏపీ లోడ్ చేశారు. కానీ చేరుకోవాల్సిన సమయానికి ట్రైన్ చేరలేదు. రామచంద్ర గుప్తా అనేక ఫిర్యాదుల తరువాత, రైలు మార్గమధ్యంలో అదృశ్యమైనట్లు అధికారులు కనుగొన్నారు.ఇదీ చదవండి: రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?2014 నవంబర్ 10న బయలుదేరిన గూడ్స్ ట్రైన్.. జూలై 25, 2018న బస్తీ స్టేషన్కు చేరింది. కానీ రామచంద్ర గుప్తా ఆర్డర్ చేసిన డీఏపీ మొత్తం పాడైపోయింది. అయితే ఇండియన్ రైల్వే చరిత్రలోనే ఇంత ఆలస్యంగా గమ్యాన్ని చేరుకున్న ట్రైన్ ఇదే కావడం గమనార్హం. ఇప్పటి వరకు కూడా ఏ ట్రైన్ ఇంత ఆలస్యంగా ప్రయాణించలేదు. -
ఢిల్లీ ఎయిర్పోర్టులో దట్టమైన పొగమంచు.. ఏడు విమానాలు రద్దు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. పొల్యూషన్ కారణంగా ఏర్పడిన పొగమంచు విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత(విజిబులిటీ) తగ్గడంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 8.30 గంటల వరకు దాదాపు 160 విమానాలు ఆలస్యంగా నడిచాయి.ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం విమానాలు బయలుదేరే సమయంలో సగటున 22 నిమిషాల ఆలస్యం జరిగింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండటంతో ఐదు విమానాలను (జైపూర్-04, డెహ్రాడూన్-01) దారి మళ్లించారు. ప్రస్తుతం అన్ని విమాన కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని విమనాశ్రయ అధికారులు పేర్కొన్నారు.ఎకనామిక్ టైమ్స్ వార్తల ప్రకారం దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గినందున సోమవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ఏడు విమానాలను రద్దు చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ విమానాల రాకపోకలపై ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రస్తుతం ఢిల్లీలో ఏర్పడిన పొగమంచు విజిబులిటీని ప్రభావితం చేస్తోంది. ఫలితంగా విమాన షెడ్యూళ్లలో జాప్యం జరగవచ్చు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు విమాన రాకపోకల స్థితిని ఒకసారి చెక్ చేసుకోవాలి’ అని తెలియజేసింది. స్పైస్జెట్ కూడా ఇదే విధమైన సూచన చేసింది. ఢిల్లీలో ప్రస్తుతం గాలి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 481కి చేరింది. కాలుష్యం కారణంగా ఏర్పడిన అధ్వాన్న పరిస్థితుల దృష్ట్యా నేటి (సోమవారం) నుంచి ఢిల్లీలో గ్రాప్-4 నిబంధనలను అమలు చేశారు.ఇది కూడా చదవండి: Gujarat: ర్యాగింగ్కు ఎంబీబీఎస్ విద్యార్థి బలి -
చేదు వార్త.. నైరుతి రుతుపవనాలు ఆలస్యం.. రాక ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: కేరళ తీరాన్ని ఇప్పటికే తాకాల్సిన నైరుతి రుతుపవనాల రాక ఇంకాస్త ఆలస్యం కానుంది. మరో మూడు, నాలుగు రోజులు పడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా ఏటా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకి దేశమంతటా విస్తరించడంతో వానలు కురుస్తాయి. ఒక్కో ఏడాది వాటి రాక వారం దాకా ఆలస్యమవుతుంది. గత అంచనాల మేరకు జూన్ 4 కల్లా రుతుపవనాలు కేరళకు రావాల్సింది. ‘‘వాటి రాకకు అన్నీ అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. పశ్చిమం నుంచి వస్తున్న గాలులు దక్షిణ అరేబియా సముద్రం మీదుగా బలంగానే వీస్తున్నాయి. ఆదివారం నాటికి సముద్ర మట్టానికి 2.1. కిలోమీటర్ల పైకి వీస్తున్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంపై ఆకాశం దట్టంగా మేఘావృతమై ఉంది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల మరో మూడు నాలుగు రోజుల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నాం’’ అని ఐఎండీ ప్రకటనలో వివరించింది. -
కాస్త ఆలస్యం నైరుతి రాక.. జూన్ 4న దేశంలోకి! ఐఎండీ వెల్లడి
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్త ఆలస్యం కానున్నాయి. అవి జూన్ 4న దేశంలోకి ప్రవేశించవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు తొలుత కేరళలో ప్రవేశిస్తాయి. ఈ ఏడాది రుతుపవనాలు కొంత ఆలస్యమైనప్పటికీ దేశవ్యాప్తంగా పంటల సాగుపై, మొత్తం వర్షపాతంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఐఎండీ చీఫ్ ఎం.మొహాపాత్రా స్పష్టం చేశారు. రుతుపవనాలు ప్రవేశించే తేదీకి, ఈ సీజన్లో నమోదయ్యే మొత్తం వర్షపాతానికి సంబంధం లేదని తెలిపారు. సాధారణ వర్షపాతమే! నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఏటా జూన్ 1న కేరళలో అడుగు పెడతాయి. 2018లో మే 29న, 2019లో జూన్ 8న, 2020లో జూన్ 1న, 2021లో జూన్ 3న, 2022లో మే 29న ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాల రాకపై తమ అంచనాలు 2015 మినహా గత 18 ఏళ్లలో ఎప్పుడూ తప్పలేదని ఐఎండీ పేర్కొంది. మోకా తుఫాను కారణంగానే ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమవుతున్నట్లు చెప్పలేమని కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ మాజీ కార్యదర్శి ఎం.రాజీవన్ అన్నారు. ఈ ఏడాది నైరుతి రతుపవనాల సీజన్లో దేశంలో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని తాము అంచనా వేస్తున్నట్లు ఐఎండీ గత నెలలో తెలియజేసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. దేశంలో గత నాలుగేళ్లు సాధారణం, సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఆహారంలో 40 శాతం ఆహారం వర్షాధార సాగుతోనే ఉత్పత్తి అవుతోంది. ఆహార భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి తగిన వర్షపాతం నమోదు కావడం చాలా కీలకం. మన దేశంలో 52 శాతం సాగుభూమి వర్షాలపైనే ఆధారపడి ఉంది. -
ఇడియట్స్ అని తిడుతూ..సహనం కోల్పోయిన ఎమ్మెల్యే
కొందరూ ఎమ్మెల్యే కింద స్ధాయి ఉద్యోగులపై తమ ఆవేశాన్ని వెళ్లగక్కడం మామూలే. మరికొందరూ ఏకంగా చేయి జేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అచ్చం అలానే ఇక్కడొక ఎమ్మెల్యే రోడ్డునిర్మాణ పనులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ కాంట్రక్టర్ని తిడుతూ..భౌతిక దాడికి దిగారు. ఏకంగా ఆ కాంట్రాక్టర్ కళ్ల అద్దలను కూడా పగలు కొట్టేసి..తోసేస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఈఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కవితా పట్టణంలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని రాయ్చూర్లో నిర్మాణ పనుల ప్రాజెక్టును తనిఖీ చేసేందుకు వచ్చిన జేడీఎస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప సహనం కోల్పోయారు. ఈ పనుల్లోజాప్యం ఎందుకు జరుగుతోందంటూ నిర్మాణ పనుల బాధ్యులపై మండిపడ్డారు. అక్కడు ఉన్న కాంట్రాక్టర్ని చూస్తూ..ఇడియట్స్ మీరు గుల్బర్గా నంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారని ప్రశ్నించారు. మన జిల్లా నుంచి ఉద్యోగానికి ఎవరూ లేరా? అంటూ తిట్టిపోశారు. మనవాళ్ల అయినతే ఈపాటికి పని పూర్తి అయిపోయేదంటూ విరుచుకుపడ్డారు. అంతేగాదుఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్ ముఖానికి ఉన్న కళ్లద్దాలను లాక్కొని పగలు కొట్టడమే గాక ఇక్కడ నుంచి తోసేస్తానని బెదరించారు. ఆ తర్వాత జేఈ శ్యామలప్ప అనే మరో వ్యక్తిని కూడా దుర్భాషలాడారు. వాస్తవానికి రోడ్డు నిర్మాన పనులు ప్రారంభించి ఏడాది దాటిని పూర్తవ్వకపోవడంపై కవితా పట్టణం స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జేడీఎస్ ఎమ్మెల్యే వెంకటప్ప రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. మీరంతా నాప్రతిష్టను దిగజార్చాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ వారిపై ఆరోపణలు చేశారు. చెప్పుడు మాటలు వింటూ కావాలనే జాప్యం చేస్తూ..నాసిరకంగా పనులు చేస్తున్నారంటూ శారీరక దాడికి దిగారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కొందరూ కెమరాలో బంధించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. (చదవండి: మీకు జీవితఖైదు సరైనదే: షాక్ ఇచ్చిన హైకోర్టు) -
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం వాయిదా
న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్- ఎస్ ప్రయోగం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటంతో మరో మూడు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు హైదరాబాద్కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఆదివారం ప్రకటించించింది. ఈ నెల 15నే విక్రమ్-ఎస్ ప్రయోగం నిర్వహించాలని భావించినప్పటికీ.. నవంబర్ 18కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ‘వాతావరణం అనుకూలించకపోవటం వల్ల విక్రమ్-ఎస్ రాకెట్ లాంఛ్ను మరో మూడు రోజులు 15-19 మధ్య చేపట్టాలని నిర్ణయించాం. నవంబర్ 18 ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జరిగేందుకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరి కోట ఇస్రో లాంఛ్పాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.’ అని తెలిపింది స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేటు రంగంలో నిర్మించిన రాకెట్ విక్రమ్-ఎస్. ‘ప్రారంభ్’ అనే ఈ మిషన్లో రెండు భారతీయ, ఒక విదేశీ ఉపగ్రహం ఉంటాయని హైదరాబాద్కు చెందిన స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ తెలిపింది. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్ రాకెట్ను డెవలప్ చేస్తోంది. విక్రమ్–1 రాకెట్ 480 కిలోల పేలోడ్ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్–2 595 కిలోలు, విక్రమ్–3 815 కిలోల పేలోడ్ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి. ఇదీ చదవండి: తిండి లేని రోజుల నుంచి.. అమెరికాలో సైంటిస్ట్ దాకా.. ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం -
పట్టాలు తప్పిన రైలు.. విశాఖ వైపు వెళ్లే పలు ట్రైన్స్ ఆలస్యం!
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బాలాజీపేట వద్ద గూడ్స్ రైలు పట్టింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు భోగి పూర్తిగా పట్టాలపై పడిపోయింది. ఇక, ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని భోగిని పట్టలాపై నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం కారణంగా విశాఖ వైపునకు వెళ్లు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్తిలి వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి. -
Pensions: ప్రతినెలా ఇదే తంతు.. సర్వర్ మొరాయింపు
కీసర(మేడ్చల్ జిల్లా): ఆసరా పింఛన్ల పంపిణీ ప్రహాసనంగా మారింది. పింఛన్ల సోమ్ము తీసుకునేందుకు వృద్ధులకు ఆగచాట్లు తప్పడం లేదు. సర్వర్లు మొరాయించడంతో వేలిముద్రలు తీసుకోవడం ఆలస్యం అవుతుండటంతో వృద్ధులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దీంతో పింఛను పంపిణీ కేంద్రాల వద్ద లబ్ధిదారులు బారులుతీరుతున్నారు. ఒక్కోసారి రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రతినెలా ఇదే తంతు నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో నిలబడాల్సి వస్తోందని వాపోతున్నారు. రోజంతా పింఛన్ కేంద్రం వద్ద ఉన్నా పింఛన్ డబ్బులు తీసుకుంటామన్న నమ్మకం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. తిప్పలు తప్పాలంటే నేరుగా ఖాతాలోకి వేయాలి రెండు, మూడు రోజులుగా పింఛన్ల కోసం తిరుగుతున్నా సర్వర్ సమస్యతో డబ్బులు తీసుకోలేకపోతున్నానని ఎస్వీనగర్కు చెందిన మోహన్రావు వాపోయారు. మరికొందరు ఉదయం 7 గంటలకు టిఫిన్ తీసుకొని వచ్చి పింఛన్ల డబ్బుల కోసం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ తిప్పలు తప్పాలంటే తమకు బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చూడాలని ఉన్నతాధికారులను లబ్ధిదారులు కోరుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో చాలా ప్రాంతాల్లో ఫించన్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నారని మున్సిపాలిటీల్లోనూ ఇది అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. -
ఆస్తుల విక్రయంలో ఫ్యూచర్ సప్లైకు ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: అవసరమైన అనుమతులు పొందడంలో జాప్యం జరుగుతుందన్న అంచనాలతో ఆస్తుల విక్రయ ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నట్లు ఫ్యూచర్ సప్లై చైన్స్ లిమిటెడ్(ఎఫ్ఎస్సీఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు బోర్డు ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు వెల్లడించింది. అయితే వ్యాపార కార్యకలాపాల పునరుద్ధరణకున్న ఇతర అవకాశాల అన్వేషణ, పరిశీలన చేపట్టనున్నట్లు ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలియజేసింది. అంతేకాకుండా ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ల పరిష్కారాలను వెదకనున్నట్లు వివరించింది. ఈ అంశాలలో తుది నిర్ణయాలకు వచ్చినప్పుడు వివరాలను అందించనున్నట్లు తెలియజేసింది. ఎఫ్ఎస్సీఎల్ దేశీయంగా ఆర్గనైజ్డ్ విభాగంలో అతిపెద్ద థర్డ్పార్టీ సప్లై చైన్, లాజిస్టిక్స్ సేవలు సమకూర్చే కంపెనీగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. రిటైల్, ఫ్యాషన్, ఆటోమోటివ్ తదితర పలు రంగాల కస్టమర్లకు వేర్హౌసింగ్, పంపిణీ, ఇతర లాజిస్టిక్స్ సొల్యూషన్లు అందిస్తోంది. 2022 జులై 26న కంపెనీ బోర్డు అవసరమైన అనుమతులు పొందాక వేర్హౌస్ ఆస్తులతోపాటు కొన్ని విభాగాలను విక్రయించేందుకు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తిరిగి ఈ నెల 13న నిర్వహించిన అత్యవసర వాటాదారుల సమావేశం(ఈజీఎం)లో ఆస్తుల విక్రయానికి ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే తాజాగా ఈ ప్రణాళికలను వొదిలిపెడుతున్నట్లు వెల్లడించడం గమనార్హం! -
ఇన్ఫ్రా ప్రాజెక్టులు.. ప్రజల నెత్తిన రూ 4.38 లక్షల కోట్ల భారం!
న్యూఢిల్లీ: ఒకటో వంతు మౌలిక రంగ ప్రాజెక్టులు అధిక వ్యయ భారంతో, జాప్యంతో కొనసాగుతున్నట్టు కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ తెలిపింది. రూ.150 కోట్ల వ్యయాలకు మించి 1,679 కోట్ల ప్రాజెక్టులకు గాను సుమారు 439 ప్రాజెక్టులు.. మొత్తం మీద రూ.4.38 లక్షల కోట్ల అధిక వ్యయ భారంతో నెట్టుకొస్తున్నాయని పేర్కొంది. ‘‘1,679 ప్రాజెక్టుల వాస్తవ వ్యయం రూ.22,29,544 కోట్లు. కానీ, వీటిని పూర్తి చేసేందుకు రూ.26,67,594 కోట్లు అవసరమవుతుంది. అదనంగా రూ.4,38,049 కోట్లు కావాలి. ఇది 19.65 శాతం అధికం’’ అని ప్రణాళిక శాఖ తెలిపింది. 2021 నవంబర్ నాటికి ఈ ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చు రూ.12,88,558 కోట్లు కాగా, మొత్తం అంచనా వ్యయాల్లో 48.30 శాతమని వివరించింది. ‘‘నిర్ణీత కాలవ్యవధికి అనుగుణంగా కాకుండా, ఆలస్యంగా నడుస్తున్న 541 ప్రాజెక్టుల్లో.. 90 ప్రాజెక్టులు 1–12 నెలలపాటు ఆలస్యం కాగా, 113 ప్రాజెక్టులు 13–24 నెలలుగా జాప్యంతో నడుస్తున్నాయి. 212 ప్రాజెక్టులు 25–60 నెలలుగా పూర్తికాకుండా ఉన్నాయి. మరో 126 ప్రాజెక్టులు 61 నెలల జాప్యంతో ఉన్నాయి’’ అని ప్రణాళిక శాఖ తెలిపింది. చదవండి:ఏఏఐకు ఎయిర్లైన్స్ బకాయిలు రూ.2,636 కోట్లు -
భారత్ బయోటెక్ కు మళ్ళీ షాక్
-
రిలయన్స్ కొంపముంచిన జియోఫోన్..!
ముంబై: ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్గా పేర్కొన్న జియోఫోన్ నెక్ట్స్ లాంఛింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. రిలయన్స్ 44 ఏజీఎం సమావేశంలో వినాయక చవితికి తమ ఫోన్ను లాంఛ్ చేస్తామని కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. కాగా ఈ ఫోన్ను దీపావళి పండుగకు లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా జియోఫోన్నెక్ట్స్ లాంచ్ రిలయన్స్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ స్మార్ట్ఫోన్ లాంచ్ వాయిదా పడడంతో రిలయన్స్ షేర్లు సోమవారం రోజున 2 శాతం మేర నష్టపోయాయి. చదవండి: జియో నుంచి మరో సంచలనం..! త్వరలోనే లాంచ్..! సోమవారం జరిగిన బీఎస్ఈ ఇంట్రా డే ట్రేడ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2 శాతం క్షీణించి రూ .2,382.85 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభంలో రిలయన్స్ షేర్ విలువ రూ. 2425.60 వద్ద ఉండగా ట్రేడింగ్ ముగిసే సమయానికి సుమారు రూ. 55.80 మేర నష్టపోయి షేర్ విలువ రూ. 2,382.85 వద్ద నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్ కొరత కారణంగా జియోఫోన్నెక్ట్స్ లాంచింగ్ వాయిదా పడిందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ఫోన్ను రిలయన్స్, గూగుల్ కంపెనీలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. మరింత మెరుగుదల కోసం రెండు కంపెనీలు పరిమిత వినియోగదారులతో జియోఫోన్ నెక్స్ట్ ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళి పండుగ సీజన్లో ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటుంది. స్మార్ట్ఫోన్ లాంచ్ను వాయిదా వేయడంతో వచ్చే అదనపు సమయం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్ కొరతను తగ్గించడంలో సహాయపడుతుందని జియో, గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! -
భారత తొలి ఆపిల్ స్టోర్పై కోవిడ్-19 దెబ్బ..!
ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్కు క్రేజ్ మామూలుగా ఉండదు.సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్కు పోటి అసలు ఉండదు. ఐఫోన్ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. భారత మార్కెట్లలో ఆపిల్ స్మార్ట్ఫోన్లకు ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. భారత మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని ఆపిల్ అధికారిక ఆన్లైన్ స్టోర్ను 2020 సెప్టెంబర్ నెలలో ప్రారంభించింది. ఆపిల్ తన తొలి అధికారిక ఫిజికల్ రిటైల్ స్టోర్ను ముంబైలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 రాకతో భారత్లో ఫిజికల్ రిటైల్ స్టోర్ను ఏర్పాటు చేయడంలో నీలినీడలు కమ్ముకున్నాయి. ఆపిల్ తొలి ఫిజికల్ రిటైల్ స్టోర్ ఏర్పాటు ఆలస్యమయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ గత ఏడాది 2021 నుంచి భారత్లో ఆపిల్ తన తొలి ఫిజికల్స్టోర్ను తెరవనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా భారత రిటైల్ రంగంలో ఆపిల్ తన స్థానిక ఉనికిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆపిల్ తన పరికరాలను ప్రాంచైజ్ రిటైల్ నెట్వర్క్ కింద పనిచేసే పంపిణీదారుల ద్వారా దేశంలో విక్రయిస్తోంది. ఆప్ట్రాన్సిక్స్ వంటి ఫ్రాంచైజ్లతో ఆపిల్ తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆపిల్ రెండంకెల వృద్ధితో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని నమోదుచేసింది. ఆపిల్ టర్నోవర్ 36 శాతం అధికమై రూ.6,05,616 కోట్లు సాధించినట్టు సంస్థ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4.43 లక్షల కోట్లుగా ఉంది. నికరలాభం రూ.83,328 కోట్ల నుంచి రూ.1,61,448 కోట్లకు చేరింది. ఏ దేశం నుంచి ఎంత మొత్తం ఆదాయం సమకూరింది వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. -
చేపా.. చేపా ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారులకు చేయూతనందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ ఈసారి ఆలస్యమయ్యే సూచనలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముందస్తుగా చేపపిల్లలను చెరువుల్లో వదలాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే చెరువులు అలుగు దూకుతుండడంతో పంపిణీకి కొద్దిరోజులు ఆగితే మంచిదనే ఆలోచనలో మత్య్సశాఖ ఉంది. కొన్ని చెరువులు పూర్తిగా నిండగా, మరికొన్ని చెరువులు సగంకంటే ఎక్కువగా నిండాయి. నిండిన చెరువుల్లో ఇప్పుడే చేపపిల్లలు వదిలితే.. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే.. అవి కొట్టుకుపోయే ప్రమాదముంది. అలాగని, సకాలంలో వదలకపోతే ఎదుగుదల లోపిస్తుంది. దీంతో అధికారులు తర్జనభర్జనపడుతున్నారు. గతేడాది తేలని లెక్క గతేడాది ప్రభుత్వం గుర్తించిన చెరువుల్లో ఉచిత చేపపిల్లలు వదిలిన తర్వాత భారీ వర్షాలతో చెరువులు అలుగుదూకాయి. దాదాపు 80 శాతం చెరువుల్లోని చేపలు కొన్ని ఎదురెక్కిపోతే, మరికొన్ని కొట్టుకుపోయాయి. దీంతో ఏ చెరువులో ఎన్ని చేపలున్నాయనే లెక్క తేలలేదు. ఈసారి 43,870 చెరువుల్లో 24వేల చెరువులు పూర్తిగా నిండి అలుగు దూకాయి. మిగతా చెరువుల్లో సగానికంటే ఎక్కువగానే అలుగు దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి. గతేడాది చేప, రొయ్యలు కలిపి 71.02 కోట్ల మేరకు చెరువుల్లో వదిలారు. ఈసారి రెండూ కలిపి 99 కోట్ల వరకు వదలాలని మత్స్యశాఖ యోచిస్తోంది. అందుకనుగుణంగా టెండర్లను సిద్ధం చేసింది. అప్పుడే కాదు భారీ వర్షాలు కురుస్తుండడంతో కొద్ది రోజులు ఆగిన తర్వాత చెరువుల్లో చేప, రొయ్యపిల్లలు వదలాలని అనుకుంటున్నాం. ఈసారి వంద శాతం రాయితీపై చేపపిల్లలు పంపిణీ చేస్తాం. – తలసాని శ్రీనివాస్యాదవ్, మత్స్యశాఖ మంత్రి -
ఒలింపిక్స్ ముగిశాకే జాతీయ క్రీడా పురస్కారాలు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ ముగిశాకే జాతీయ క్రీడా పురస్కారాల విజేతల వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. త్వరలోనే ఒలింపిక్స్ జరుగనున్న నేపథ్యంలో ఎంపిక కసరత్తు మాత్రం ఆలస్యం కానుందని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. టోక్యోలో భారత అథ్లెట్ల ప్రదర్శన, పతక విజేతలను బట్టి పురష్కారాలను ఖాయం చేయాలని క్రీడా శాఖ భావి స్తోంది. ‘నామినేషన్లు వచ్చాయి. గడువు కూడా ముగిసింది. కానీ టోక్యో పతక విజేతలకూ ఇందులో చోటివ్వాలని గత సమావేశంలో నిర్ణయించాం. ఒలింపిక్స్ క్రీడలు ఆగస్టు 8న ముగుస్తాయి. ఆ తర్వాత మరోసారి సమావేశమై ఎంపిక ప్రక్రియపై తుది కసరత్తు పూర్తి చేస్తాం. ఒలింపిక్స్ ముగిసిన వారం పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయితే ఎప్పట్లాగే ఆగస్టు 29న అవార్డుల ప్రదానం జరుగుతుంది’ అని కేంద్ర క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. -
ఇంటి ఈఎంఐలు చెల్లించట్లేదు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి కరోనా వైరస్ రూపంలో కొత్త కష్టాలొచ్చాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లలో గృహ కొనుగోలుదారులు 65% వాయిదా చెల్లింపులు చేయటం లేదని ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) తెలిపింది. కొత్త ప్రాజెక్ట్లలో గృహ అమ్మకాలు క్షీణించడంతో పాటూ వాయిదా చెల్లింపుల్లేక నిర్మాణ సంస్థలు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయని ఐసీసీ డైరెక్టర్ రజనీష్ షా తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో గృహ కొనుగోలుదారులు కూడా లిక్విడిటీ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది కస్టమర్లు తమ చెల్లింపులను వాయిదా వేయాలని డెవలపర్లను కోరుతున్నారు. వచ్చే కొన్ని నెలల్లో ఈ తరహా అభ్యర్థనలు మరింత పెరిగే సూచనలున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశీ రియల్టీ రంగం విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉంది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రియల్టీ రంగం వాటా 5%గా ఉంటుంది. రియల్టీకి పేమెంట్ యాక్ట్ తేవాలి.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు(ఎంఎస్ఎంఈ) మాదిరిగానే ఆలస్యం చెల్లింపు చట్టం (డిలేయిడ్ పేమెంట్ యాక్ట్) రియల్ ఎస్టేట్ రంగానికి కూడా వర్తింపజేయాలని.. ఈ మేరకు కొన్ని సిఫార్సులను ఐసీసీ కేంద్రానికి సూచించింది. ఈ చట్టంతో కస్టమర్ల డిఫాల్ట్ పేమెంట్స్ను నిరుత్సాహపరుస్తుందని.. ఒకవేళ డెవలపర్లు అంగీకరించిన కాలానికి వాయిదా చెల్లింపులు మించిపోతే గనక సంబంధిత ఆలస్య చెల్లింపులపై జరిమానా వడ్డీని వసూలు చేయడానికి వీలవుతుందని రజనీష్ తెలిపారు. రియల్టీకి అత్యవసర ప్రాతిపదికన సహాయ ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. గడువును 6 నెలలు పొడిగించాలి.. కార్మికులు, ముడిసరుకుల కొరత కారణంగా నివాస ప్రాజెక్ట్లను పూర్తి చేయడం కష్టమవుతుంది. అందుకే సంబంధిత ప్రాజెక్ట్ల నిర్మాణ గడువు తేదీని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నుంచి 6 నెలల కాలం పొడిగించాలని షా కోరారు. కనీస ఒక త్రైమాసికం పాటైనా మున్సిపల్ పన్నులను మాఫీ చేయాలని సూచించింది. పన్నులు, బిల్లులు చెల్లించలేని సంస్థలకు జరిమానాలు విధించరాదని, ఆయా సంస్థలు తిరిగి చెల్లించడానికి 3–6 నెలల సమయం ఇవ్వాలని సూచించారు. వడ్డీ లేని రుణ వాయిదాలను 6 నెలల పాటు అందించాలన్నారు. -
కొత్త విద్యాసంవత్సరం ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో ఈసారి నిర్దేశిత పని దినాలు పూర్తికాకుండా విద్యా సంవత్సరం ముగుస్తోంది. కరోనా నేపథ్యంలో అకడమిక్ కార్యక్రమాలకు 220 పనిదినాలు లేకుండానే విద్యాసంవత్సరం పూర్తి కానుంది. అంతేకాదు ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియని పరిస్థితుల్లో ఎలా ముందుకు సాగాలో అర్థం కాకుండా తయారైంది. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో అన్ని సెలవులు పోగా కనీసంగా 220 పనిదినాలు పాఠశాలలు, కాలేజీలు పనిచేయాలి. ఆయా రోజుల్లోనే సిలబస్ పూర్తయ్యేలా ముందుగానే ఆయా విభాగాలు అకడమిక్ క్యాలెండర్ను రూపొందిస్తాయి. అందుకు అను గుణంగా బోధన కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలు,ముఖ్యంగా స్కూళ్లన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండో శనివారాల్లో పని చేసేలా షెడ్యూల్ జారీ చేసి పనిదినాలను సర్దుబాటు చేసింది. అయితే ఇప్పుడు కరోనాతో కొత్త సమస్య వచ్చిపడింది. దీంతో ఈసారి నిర్దేశిత పని దినాలు లేకుండా ఈ విద్యా సంవత్సరం ముగియనుంది. వాస్తవానికి ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినం. కానీ రాష్ట్రంలో కరోనా కారణంగా దాదాపు నెలన్నర రోజుల ముందుగానే పాఠశాలలు బంద్ అయ్యాయి. మార్చి 15 నుంచి 31వ తేదీ వరకు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. వాటిని ఈనెల 14వ తేదీ వరకు పొడిగించింది. అంటే అప్పటి వరకు పాఠశాలలు ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. పైగా వేసవి ఎండల కారణంగా ఇప్పుడు నిర్వహించాల్సినవి ఒంటి పూట బడులే. అవీ మూత పడ్డాయి. ఈనెల 14 తర్వాత మరో 9 రోజులు గడిస్తే విద్యా సంవత్సరమే పూర్తి కానుంది. అప్పటివరకు కూడా కరోనా అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో 220 పనిదినాల నిబంధనకు విఘాతం కలుగుతోంది. 40 రోజుల ముందుగానే విద్యా సంవత్సరాన్ని ముగించే పరిస్థితి వచ్చింది. వచ్చేది వేసవి కాబట్టి ఆ 40 రోజులు పాఠశాలలను నిర్వహిద్దామన్నా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై విద్యాశాఖలో స్పష్టత లేకుండా పోయింది. దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ‘పరీక్షల్లేకున్నా పాస్’ఉత్తర్వుల్లో జాప్యం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గత నెల 19న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఈనెల 6వ తేదీలోగా పూర్తి కావాలి. కరోనా కారణంగా మార్చి 23వ తేదీ నుంచి నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.అకడమిక్ కేలండర్ ప్రకారం ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈనెల 7వ తేదీ నుంచి నిర్వహించాల్సిన పరీక్షలు జరిగేలా లేవు. ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు ఈనెల 14 వరకు సెలవులను ప్రకటించింది. 15న పాఠశాలలు ప్రారంభ మైనా విద్యా సంవత్సరం ముగిసే 23వ తేదీలోగా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. అందుకే ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఆటోమేటిక్గా పాస్ చేసి పైతరగతికి పంపించాలని భావిస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇంకా జారీ చేయలేదు. ఈ విషయంలో విద్యాశాఖలో కిందిస్థాయి అధికారులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పాఠశాల విద్యా కమిషనర్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఒకరే కావడంతో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందన్నది కింది స్థాయి అధికారులకు తెలియని పరిస్థితి. అందుకే ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని ఓ ఉన్నతాధికారి చెప్పారు. జూన్ 1న బడులు ప్రారంభమయ్యేనా? ఇక కరోనా ప్రభావం ఈ నెలంతా ఉండే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మే నెలలో ఆ ప్రభావం ఉండవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే జూన్ 1న వేసవి సెలవులు ముగిసి, తిరిగి బడులు ప్రారంభం కావడం (కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం) కష్టమేనని అధికారులు పేర్కొంటున్నారు. పరిస్థితులు చక్కబడితే ఈ నెలాఖరులో మిగిలిపోయిన పదో తరగతి పరీక్షలను నిర్వహించే అవకాశముంటుంది. లేదంటే మే నెలలోనే నిర్వహించాల్సి వస్తుంది. దాంతో ప్రాథమిక పాఠశాలలకు బోధించే టీచర్లంతా మే నెలలోనూ ఇన్విజిలేటర్లుగా పని చేయాల్సి వస్తుంది. అంతేకాదు పరీక్షలు అయ్యాక సబ్జెక్టు టీచర్లు జవాబు పత్రాల మూల్యాంకనం చేయాల్సి వస్తుంది. దీంతో వారికి అదనంగా సెలవులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాటిని సర్దుబాటు చేస్తూ కొత్త విద్యా సంవత్సరాన్ని ఆలస్యంగా ప్రారంభించాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. -
ఉరి మళ్లీ వాయిదా
-
సేఫ్ సిటీ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్లో మహిళా భద్రత కోసం ఉద్దేశించిన ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. దిశ ఘటనతో ఈ ప్రాజెక్టు అమలు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల బడ్జెట్తో సేఫ్సిటీ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందుకోసం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్ నగరాలను ఎంపిక చేసింది. అంతర్జాతీయ ప్రాజెక్టులు, ఐటీ, ఫార్మా, తదితర రంగాల్లో నగరం సాధిస్తున్న పురోగతి కారణంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. బహుళ జాతి కంపెనీలకోసం మహిళలు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. వీరి భద్రత కోసం ఉద్దేశించిందే ఈ ప్రాజెక్టు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీన్ని చేపడతాయి. ఇందుకోసం ప్రతి నగరానికి రూ.280 కోట్లు వెచ్చించాలి. ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. ఏమేం చేస్తారు..? ఈ ప్రాజెక్టు అమలులో జీహెచ్ఎంసీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, రవాణాశాఖ కమిషనర్, డీజీపీ, విమెన్సేఫ్టీ వింగ్, ఐజీ తదితరులు భాగస్వాములుగా ఉంటారు. ఈ ప్రాజెక్టుకు ఐజీ స్వాతి లక్రా కన్వీనర్గా, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నగరంలో మహిళల భద్రతకోసం అదనంగా 3వేల సీసీ కెమెరాలు బిగించాలి. రాత్రిపూట మహిళల రవాణా కోసం ప్రత్యేక బస్సులు, క్యాబ్లు నడపాలి. అందులో సీసీ కెమెరాలు అమర్చాలి. మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, అదనంగా మహిళా పోలీసుల రిక్రూట్మెంట్, మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలి. అయితే దీనిపై పలుమార్లు సమావేశమయ్యారే తప్ప.. ఇంతవరకూ ఈ ప్రాజెక్టు కోసం చెప్పుకోదగ్గ కార్యక్రమాలు చేపట్టలేదు. ఇక నిధుల విషయానికి వస్తే.. రూ.282 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.138 కోట్ల మేర పనులకు అనుమతులు లభించాయి. ఈ పనులు ప్రస్తుతం నగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో నిదానంగా సాగుతున్నాయి. అధికారులు మాత్రం త్వరలోనే పూర్తవుతాయని చెబుతున్నారు. -
రుతు పవనాల రాక మరింత ఆలస్యం
న్యూఢిల్లీ: రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తాజాగా అంచనా వేసింది. రుతుపవనాల్లో మందగమనం కారణంగా జూన్ 7వ తేదీకి రెండు రోజులు అటూఇటుగా కేరళను తాకనున్నాయని పేర్కొంది. ఇంతకు ముందు అంచనా ప్రకారం జూన్ 4వ తేదీకి రెండు రోజులు అటూఇటుగా కేరళను తాకవచ్చని తెలిపింది. రుతుపవనాల పురోగమనం మందకొడిగా సాగడంతో ఈ అంచనాలను మార్చుకోవాల్సి వచ్చిందని స్కైమెట్ ప్రెసిడెంట్ జీపీ శర్మ తెలిపారు. రుతుపవనాలు నెమ్మదిగా కదలటానికి సొమాలియా తీరంలో అల్పపీడనం, మధ్య అరేబియా సముద్రంపై అధికపీడనం, సొమాలియా తీరంపై వైపు నుంచి వీస్తున్న బలమైన గాలులే కారణమన్నారు. -
చంద్రయాన్–2 మరోసారి వాయిదా
న్యూఢిల్లీ : చంద్రయాన్–2 ప్రయోగం మరోసారి వాయిదా పడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగం వాయిదా పడటం ఇది రెండోసారి. తొలుత ఈ ప్రయోగాన్ని ఏప్రిల్లో నిర్వహించాలని భావించారు. ప్రయోగానికి ముందు మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, దీంతో ప్రయోగాన్ని అక్టోబర్ లేదా నవంబర్కు వాయిదా వేయాలని ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో అది వాయిదా పడింది. తాజాగా అక్టోబర్ మొదటి వారంలో చేపట్టాల్సిన ప్రయోగం డిసెంబర్ చివరికి లేదా వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసినట్టు ఇస్రో వెల్లడించింది. చంద్రుడి కక్ష్య చుట్టూ అధ్యయనం చేయడం కోసమే చంద్రయాన్–1 ప్రయోగాన్ని చేపట్టారు. చంద్రుడి కక్ష్యతోపాటు ఉపరితలంపై రోవర్ను దింపి అక్కడ పరిస్థితులపై పరిశోధనలు చేసేందుకు గాను చంద్రయాన్–2 ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఇటీవల ఇస్రో చేపట్టిన ఉపగ్రహ ప్రయోగాలు సరైన ఫలితాలనివ్వలేక పోయాయి. జీశాట్–6ఏతో సంబంధాలు కోల్పోవడం, జీశాట్–11 ప్రయోగ తేదీని మార్చడం, ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ నేవిగేషన్ ఉపగ్రహంలో హీట్షీల్డ్ పనిచేయక పోవడంతో అది విఫలమవడం లాంటి సంఘటనల నేపథ్యంలో చంద్రయాన్–2పై ఇస్రో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. -
ఐడియా–వొడాఫోన్ విలీనం ఆలస్యం!
న్యూఢిల్లీ: ఐడియా–వొడాఫోన్ విలీనం ముందు అనుకున్నట్టు ఈ నెల 30లోపు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వొడాఫోన్ ఇండియా వన్టైమ్ స్పెక్ట్రమ్ చార్జీల రూపంలో రూ.4,700 కోట్ల మేర బకాయి ఉంది. దీంతో ఐడియాలో విలీనానికి ముందే ఈ బకాయిలను చెల్లించాలని టెలికం శాఖ కోరనుంది. లేదా బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని కోరనున్నట్టు సమాచారం. నిజానికి 2015లో వొడాఫోన్ తన సబ్సిడరీలైన వొడాఫోన్ ఈస్ట్, వొడాఫోన్ సౌత్, వొడాఫోన్ సెల్యులర్, వొడాఫోన్ డిజిలింక్లను వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్లో విలీనం చేసింది. ఇదే ఇప్పుడు వొడాఫోన్ ఇండియాగా మారింది. అయితే, విలీనం సమయంలోనే రూ.6,678 కోట్ల వన్టైమ్ స్పెక్ట్రమ్ బకాయిలను చెల్లించాలని టెలికం శాఖ డిమాండ్ నోటీసు చేయడంతో వొడాఫోన్ కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వొడాఫోన్ రూ.2,000 కోట్ల బకాయిలనే చెల్లించింది. దీంతో బకాయిలపై టెలికం శాఖ న్యాయ సలహా కోరగా, వొడాఫోన్ నుంచి బకాయిల చెల్లింపునకు డిమాండ్ చేయవచ్చని వచ్చింది. దీంతో వడ్డీ సహా మొత్తం ఎంత బకాయి అన్నది ఖరారు చేసే పనిలో ఉన్నట్టు ఆ అధికారి తెలిపారు. -
ఈసారీ ఆలస్యమే
విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయం ప్రభుత్వానికి తెలుసు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలు ఇవ్వాలనీ తెలుసు. అయినా పాఠ్యపుస్తకాల పంపిణీ చేయడంలో ఏటా సర్కారు విఫలమవుతోంది. ఇది విద్యార్థులకు శాపంగా మారుతోంది. సర్కారు పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీకి ఏటారూ.కోట్లు వెచ్చిస్తున్నా, వాటిని సకాలంలో అందుబాటులోకితీసుకురావడం లేదు. ఈ ఏడాది అదే పరిస్థితినెలకొననున్నదన్న విసయం స్పష్టమవుతోంది. సాక్షి, తిరుపతి:ప్రైవేటు పాఠశాలల కంటే ఒకడుగు ముందుగా ఉండాల్సిన సర్కారు బడులు వెనకడుగు వేస్తున్నాయి. ఓ వైపు ప్రైవేటు పాఠశాలలు సెలవుల్లోనూ గప్చిప్గా తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకు తగ్గట్టు వారు ముందే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించారు. అయితే సర్కారు మాత్రం పాఠాలు నేర్వలేకపోతోంది. మరో నెల రోజుల్లో బడులు తెరవనున్నా... ఇంత వరకు పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభమే కాలేదు. అందుకు అవసరమైన ఇండెంట్ కూడా క్షేత్రస్థాయి నుంచి విద్యాశాఖకు అందలేదని విశ్వసనీయ సమాచారం. దీంతో ఈ సారి పాఠ్యపుస్తకాలు సమయానికి అందే అవకాశాలు లేవని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండెంట్పై స్పష్టత లేదు జిల్లాలోని ప్రతి పాఠశాలల నుంచి ఎన్ని పాఠ్యపుస్తకాలు అవసరమనే వివరాలను మండల విద్యాశాఖ అధికారులు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ మార్చి నెలలోనే పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియకు స్వస్తి పలికినట్లు ప్రచారం జరుగుతోంది. అలా సేకరించిన వివరాలను మండలాల నుంచి జిల్లాలకు, అక్కడ నుంచి రాష్ట్రా ఉన్నతాధికారులకు పుస్తకాల ఇండెంట్ పంపాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయి నుంచి పాఠ్యపుస్తకాల ఇండెంట్ విద్యాశాఖ సేకరించలేదని తెలిసింది. కేవలం డైట్ లెక్కల ప్రకారమే పాఠ్యపుస్తకాలను ముద్రించటానికి విద్యాశాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గత ఏడాది ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో 2.50 లక్షలు మిగులు ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చెబుతున్న మాట. మిగులు పోను 19.50 లక్షల పాఠ్యపుస్తకాలు ముద్రించి పంపుతామని జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే జిల్లా అధికారులు మాత్రం తమ వద్ద మిగులు పుస్తకాలు లేవని చెబుతున్నారు. అయితే రాష్ట్ర, జిల్లా అధికారుల మధ్య ఈ లెక్కలు తేలాల్సి ఉంది. ముద్రణ ఎప్పుడు..పుస్తకాలు చేరేదెప్పుడు? గత ఏడాది ఏప్రిల్లోనే పుస్తకాల ముద్రణ పూర్తి చేశారు. ఆ పుస్తకాలు జిల్లాకు చేరి, అక్కడి నుంచి మండలాలకు, గ్రామాలకు చేరటానికే ఆలస్యమైంది. గత ఏడాది పాఠశాలలు పునఃప్రాంభమైనా సమయానికి పుస్తకాలు అందించలేకపోయా రు. అయితే ఈ ఏడు ఇంకా పుస్తకాల ముద్రణే ప్రారంభం కాలేదంటే... పరిస్థితి అర్థం చేసుకోవ చ్చు. వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభమైలే... జూలైలో కాని పుస్తకాలు అందే అవకాశాలు లేవని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారంలో టెండర్లు పిలుస్తాం పాఠ్యపుస్తకాల పంపిణీకి సంబంధించి మరో వారం రోజుల్లో టెండర్లు పిలుస్తాం. డైట్ లెక్కల ప్రకారమే పాఠ్యపుస్తకాల ముద్రణ జరుగుతుంది. పాఠ్యపుస్తకాలు ముద్రిస్తున్నారా? లేదా? అనే విషయంపై మా వద్ద స్పష్టమైన సమాచారం లేదు. – పాండురంగ స్వామి -
టీటీడీ బడ్జెట్టుపై తీవ్ర ఉత్కంఠ
వారం రోజుల్లో మార్చి నెల ముగియనుంది. ఇంత వరకూ టీటీడీ వార్షిక బడ్జెట్టుపై స్పష్టత రాలేదు. అధికారుల తీరు చూస్తుంటే ‘సెనగలు తిని చేయి కడుక్కున్నట్లుంది. బడ్జెట్టు ప్రతిపాదనలను ఎప్పుడో ప్రభుత్వానికి పంపామ ని, రేపోమాపో అక్కడి నుంచి గ్రీన్సిగ్నల్ లభిస్తుందని చెబుతున్న టీటీడీ అ«ధికారులు రోజులు గడుస్తున్న కొద్దీ సందిగ్ధంలో పడుతున్నారు. బడ్జెట్టు విషయంలో నిత్యం ఉత్కంఠను చవిచూస్తున్నారు. ఏం జరుగుతుందో ఏమోనంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఏటా వ్యయ అంచనాలతో కూడిన వార్షిక బడ్జెట్టును టీటీడీ జనవరిలోనే సిద్ధం చేస్తుంది. జనవరి 15 లోగానే దీన్ని తయారు చేసి పాలక మండలి ముందుంచుతుంది. ప్రత్యేక సమావేశం ద్వారా బడ్జెట్టును ఆమోదించడం ఆనవాయితీ. ఈసారి టీటీడీలో ఊహించని విపత్కర పరిస్థితి నెలకొంది. పది నెలలుగా ధర్మకర్తల మండలి లేదు. స్పెసిఫైడ్ అథారిటీ కూడా లేదు. నూతన పాలకమండలి ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం కనబరిచారు. రాజకీయ సమీకరణల నేపథ్యంలో పాలకమండలి ఎన్నిక ప్రహసనంగా మారింది. ఇదిగోఅదిగో అంటూనే ప్రభుత్వం పది నెలలు నెట్టుకొచ్చింది. ఈ కాలంలో అధికారులే పాలనాపరమైన, ఆదాయ వ్యయాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు కీలక సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ మాసం మొదలైతే ఏ పనికి ఎంతెంత ఖర్చు పెట్టాలో, ఏయే పనులకు శ్రీవారి సొమ్ములను వినియోగించాలో బోధపడని పరిస్థితి. టీటీడీ హిందూ దేవాదాయ ధార్మిక చట్టం ప్రకారం పాలకమండలి లేకుండా అధికారులు నిధులు ఖర్చు చేయకూడదు. దేవాదాయ చట్టం కూడా ఇదే చెబుతోంది. ధర్మకర్తల మండలి లేనపుడు స్పెసిఫైడ్ అథారిటీ అన్నా ఉండాలి. అదీ లేనప్పుడు మేనేజ్మెంట్ కమిటీ అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా తామే నిర్ణయాలు తీసుకున్నామని అధికారులు చెబితే రేపటి రోజున ఆడిట్ అధికారులకు, కొత్తగా వచ్చే ధర్మకర్తల మండలి సభ్యులకు ఎవరు సమాధానం చెబుతారన్నది ప్రశ్న. బోర్డు లేకుండా తీసుకున్న నిర్ణయాలన్నీ చట్టవిరుద్ధమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2018–19 వార్షిక బడ్జెట్టు ఎంత.. గత ఏడాది రూ.2,858 కోట్ల బడ్జెట్టుకు ఆమోదం లభించింది. ఈ ఏడాది సుమారు రూ.3 వేల కోట్ల మేర బడ్జెట్టు అంచనాలు ఉండవచ్చని అంటున్నారు. ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకుని సంక్షేమ కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలను నిర్వహించాల్సి ఉంది. ఏటా సుమారు రూ.570 కోట్లకు పైగా ఉద్యోగుల వేతనాలు, ఇంజినీరింగ్ పనులకు రూ.200 కోట్లు, హిందూ ధార్మిక ప్రచారం కోసం రూ.125 కోట్లు, ఉద్యోగుల పెన్షన్ల కోసం రూ.125 కోట్లు, విద్యా ఆరోగ్య సదుపాయాలకు రూ.112 కోట్లు, విజిలెన్సు విభాగానికి రూ.90 కోట్లు ఇలా విభాగాల వారీగా అయ్యే వార్షిక వ్యయాలను అంచనా వేసుకుని ఏడాది మొత్తం గా అయ్యే వ్యయాన్ని వార్షిక బడ్జెట్టుగా తయారు చేసి పంపుతుంటారు. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేనట్లు ఈ ఏడాది పది నెలలుగా ధర్మకర్తల మండలి లేకపోవడం, బడ్జెట్టు విషయంలో సందిగ్ధత నెలకొనడం టీటీడీ వర్గాల్లో తీవ్ర గందరగోళాన్ని రేపుతోంది. పాలక మండలి లేకపోవడాన్ని అదునుగా తీసుకున్న టీటీడీ శ్రీవారి సొమ్ములను దుబారా చేస్తోందన్న ప్రచారం విస్తృతమైంది. ప్రభుత్వ పెద్దలకు భయపడి స్వామివారి నిధులను దారి మళ్లించి ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని భక్త జనావళి మండిపడుతోంది. -
డబుల్
సాక్షి, మెదక్: జిల్లాలో డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ ముందకు సాగడం లేదు. నిర్మాణానికి కాంట్రాక్టర్లు మందుకు రాకపోవడం ఒక కారణమైతే, కావల్సిన మెటీరియల్ ధరలు అమాంతంగా పెరగడం మరో కారణం. దీంతో ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పలు చోట్ల ఇంకా టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి కాలేదు. జిల్లాలోని లబ్ధిదారులు ఇళ్ల కోసం మరింత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అర్హులైన పేదలకు వారి సొంతింటి కల నెరవేర్చాలని భావిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో నేటికీ ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వం జిల్లాకు 4,929 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో అధికారులు 4,589 ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో 950, గ్రామీణ ప్రాంతాల్లో 3,639 ఇళ్ల నిర్మాణం పనులను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించారు. 1,854 ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు మందుకు వచ్చారు. మిగితా 2,735 ఇళ్ల నిర్మాణాలకు ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. ఎన్నికలు సమీపిస్తున్నా.. జిల్లాలో 1,854 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు ఫైనల్ అయ్యాయి.వీటిలో 1,704 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. మెదక్ మండలం పల్లికొటాల, చేగుంట, బోనాలకొండాపూర్, తూప్రాన్ మండలం కోనాయిపల్లి, నర్సాపూర్, శివ్వంపేట మండలంలోని దంతాన్పల్లి, వెల్దుర్తిలో పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 1,430 ఇళ్ల నిర్మాణం పనులు ఇంకా పునాది దశలోనే ఉన్నాయి. 85 ఇళ్ల నిర్మాణం పనులు పిల్లర్ల దశలో ఉండగా.. 100 వరకు రూఫ్ లెవల్కు చేరుకున్నాయి. 63 ఇళ్ల గోడలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాయి. 26 ఇళ్ల గోడలు పూర్తి అయ్యాయి. ఆయా ఇళ్ల నిర్మాణానికిగాను ఇప్పటి వరకు రూ.1.44 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు ఒక్కచోటా కూడా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. దీనికి తోడు ఇంకా 2,735 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. ఓవైపు ఎన్నికల సమయం సమీపిస్తున్నా ఇంకా డబుల్ పనులు పూర్తికాక పోవడంతో ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ముందుకు రావడం లేదు.. ప్రభుత్వం సూచించిన రూ.5.30 లక్షల వ్యయంతో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యే అవకాశం లేదు. ఈ కారణంగానే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. హైదరాబాద్లో స్క్వయర్ ఫీట్కు రూ.1,350 చెల్లిస్తుండగా.. జిల్లాలో మాత్రం రూ.900 చెల్లిస్తోంది. దీంతో కాంట్రాక్టర్లు నిర్మాణం పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. స్టీల్ ధర గణనీయంగా పెరగడంతో మరింత భయపడుతున్నారు. ప్రసుత్తం నిర్మాణం పనులు చేపడితే ఆర్థికంగా నష్టపోతామన్న భావన కాంట్రాక్టర్లలో నెలకొంది. దీంతో ఇళ్ల నిర్మాణం పనులు సకాలంలో పూర్తికాని పరిస్థితి ఉంది. -
ఇప్పట్లో పార్టీ ప్రకటన లేదు
సాక్షి, చెన్నై: రాజకీయ పార్టీ ప్రకటన ఇప్పట్లో ఉండబోదని సినీ నటుడు రజనీకాంత్ చెప్పారు. నాలుగు రోజుల పాటు మలేసియాలో పర్యటించిన ఆయన ఆదివారం రాత్రి చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ ప్రకటన ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా.. ఇప్పట్లో అలాంటి ప్రకటన ఏదీ లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు. -
రుణం..రణం
చిత్తూరు, నిమ్మనపల్లె : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ రుణాల మంజూరులో చోటు చేసుకుంటున్న జాప్యంపై పలువురు లబ్ధిదారులు రగిలిపోయా రు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయానికి తాళం వేసి దిగ్బంధం చేశారు. తమకు తక్షణం రుణాలు మంజూరు చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకున్నారు. అధికా రుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ముగ్గు రు ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైస్ ఎంపీపీ ఈతగట్టు చంద్రశేఖర్, వడ్డెర సంఘం నిమ్మనపల్లె అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో పలువురు బాధితులు మధ్యాహ్నం 12గంటల నుంచి 2గంటల వరకు ఆందోళన చేపట్టారు. మదనపల్లె డివిజన్ వడ్డెర సంఘం అధ్యక్షుడు పద్మనాభరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. స్థానిక ఎంపీడీఓ, బ్యాంకు అధికారులు సకాలంలో రుణాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ముగ్గురి ఆత్యహత్యాయత్నం అధికారుల తీరుకు నిరసనగా స్థానిక వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, కొండయ్యగారిపల్లెకు చెందిన నారాయణ, అగ్రహారం బండమీదమాలపల్లెకు చెందిన వెంకటరమణ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక ఎస్ఐ హరిహరప్రసాద్, బ్యాంకు మేనేజర్ వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. శనివారం ఎంపీడీఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులతో సమీక్షించి అర్హులందరికీ రుణాలు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పడంతో ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి పలువురు వివిధ రాజకీయపార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు మద్దతు పలికారు. -
డీఎస్సీ ఇంకొన్నాళ్లు ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీకి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. టెట్ ఫలితాలు వెల్లడించిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొన్నా.. వాటికి సంబంధించిన నిబంధనల రూపకల్పన ఇంకా పూర్తి కాలేదు. దీంతో 8,792 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీలో ఆలస్యం తప్పేలా లేదు. పైగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విదేశీ పర్యటనలో ఉండటం కూడా ఇందుకు ఒక కారణంగా మారింది. ఆయన ఈ నెల 10న వచ్చాక అర్హతలు, నిబంధనలను ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కంటే ముందుగా ఉపాధ్యాయ బదిలీలు చేయాల్సి ఉంటుంది. సీనియారిటీ కలిగిన టీచర్లకు ప్రాధాన్య పాయింట్లు ఉన్నందున వారికి ముందుగా బదిలీలు చేపట్టాకే కొత్త వారికి పోస్టింగులు ఇచ్చే వీలుంటుంది. -
ఎయిర్ ఇండియా ఉద్యోగుల జీతాలు?
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఉద్యోగులు ఇబ్బందుల్లో పడ్డారు. ఒకవైపు అప్పుల భారంతో కునరిల్లుతున్న సంస్థను ప్రయివేటు పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు సంక్షోభంలో ఉన్న సంస్థ ఖర్చులు తగ్గించుకునేందుకు అష్టకష్టాలుపడుతోంది. ఈ నేపథ్యంలో ఏకంగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని స్థితికి చేరుకుంది. దీంతో వేలమంది ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. జూలై నెలలో ఎయిర్ ఇండియా ఉద్యోగులకు జీతాలు చెల్లింపును ఆలస్యం చేసిందని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. వీటిని వచ్చే వారం చెల్లించే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు. అయితే ఈ ఆలస్యానికి గల కారణాలపై ఇప్పటివరకు అధికారికంగాఎలాంటి ప్రకటన రాలేదని ఆయన చెప్పారు. దీంతో ఇప్పటికే ప్రయివేటైజేషన్కు వ్యతిరేకంగా, ఉద్యోగభద్రతపై ఆందోళనలో పడిన ఉద్యోగులు ఇపుడు మరింత కలవర పడుతున్నారు. ఎయిర్ఇండియాలో సుమారు 21,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా మునుపటి యుపిఎ ప్రభుత్వం 2012లో పది సంవత్సరాల కాల వ్యవధిలో రూ.30 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని అందించింది. రూ. 50,000 కోట్ల రుణ భారంతో ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా విక్రయానికి ఇటీవల కేంద్ర క్యాబినెట్ సూత్ర ప్రాయ అంగీకారం చెప్పింది. సంస్థలోని పెట్టుబడుల ఉపసంహరణపై ఏర్పాటు చేసిన మంత్రత్వి కమిటీ తీవ్రంగా పని చేస్తోంది. అటు ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఇండిగో, టాటా గ్రూప్ ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. -
వేతన పెంపు జాప్యానికి కారణం ఇదేనా?
ఏడవ వేతన సంఘ సిఫారసులకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపి దాదాపు ఆరు నెలల కావొస్తోంది. అయినా వేతన పెంపు శుభవార్త కోసం ఇంకా ప్రభుత్వోద్యోగులు వేచిచూస్తునే ఉన్నారు. ఆమోదం పొందినా ఈ సిఫారసులు అమలుకు నోచుకోవడం లేదు. దీనికి గల ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన నగదు కొరతేనని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. గత జనవరి 1 నుంచే ఉద్యోగులకు ఏడవ వేతన కమిషన్ ప్రతిపాదనలను అమలుచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న అనంతరం పరిస్థితంతా తలకిందులైంది. అప్పటినుంచి ప్రభుత్వం వేతన పెంపును ఎప్పుడు చేపడుతుందో క్లారిటీగా వెల్లడించడం లేదు. ఏడవ వేతన సంఘ ప్రకారం హౌసింగ్ అలవెన్స్ కింద 138.71 శాతం, ఇతర అలవెన్స్ కింద 49.79 శాతం ఉద్యోగులకు పెంచాల్సి ఉంది. ఈ అలవెన్స్ ప్రతిపాదనల అమలుతో ప్రభుత్వం దాదాపు రూ.29,300 కోట్ల మేర భారాన్ని భరించాల్సి ఉంది. ఇప్పటికే డీమానిటైజేషన్ ఎఫెక్ట్తో నగదు కొరతను ప్రభుత్వం ఎదుర్కొంటుండటంతో, ఈ వేతనాలను పెంచి మరింత నగదు కొరత భారాన్ని భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. త్వరగా తమకు అలవెన్స్ పెంపును చేపట్టాలని ఉద్యోగుల సంఘాలు తెచ్చిన ఒత్తిడి మేరకు, వేతనసంఘ సిఫారసులకు ఆమోదం తెలిపినప్పటికీ, అమలును మాత్రం చేపట్టడం లేదు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ మధ్యలో అలవెన్స్ పెంపు చేపట్టడానికి ప్రభుత్వానికి అనుమతి ఉండదు. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లో ఉన్నంత కాలం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేయాల్సి ఉంటుంది. ఈ లోపల నగదు చలామణి కూడా పెరిగి, వేతన పెంపుకు ప్రభుత్వానికి కొంత ఉపశమనం దొరుకుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కానీ ఈ జాప్యం ఉద్యోగుల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోందని రిపోర్టులు చెబుతున్నాయి. -
ఆలస్యంగా సికింద్రాబాద్-గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్
సికింద్రాబాద్: సికింద్రాబాద్ నుంచి శుక్రవారం బయల్దేరాల్సిన సికింద్రాబాద్ గోరఖ్పూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12590) ఆలస్యంగా బయలు దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే పీఆర్ఓ ఎం.ఉమాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ఉదయం 7.20 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు రాత్రి 10.15 గంటలకు బయల్దేరుతుందని పేర్కొన్నారు. -
ఆరు గంటలు ఆలస్యంగా రైళ్లు
రామగుండం: న్యూఢిల్లీలో పొగమంచు కారణంగా బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నై వైపు వెళ్లే రైళ్లు ఆరు గంటల ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆలస్యంగా నడుస్తున్న వాటిలో గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ (జీటీ), తెలంగాణ ఎక్స్ప్రెస్, దక్షిణ్ ఎక్స్ప్రెస్ తదితర సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లున్నారుు. -
కేకే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఎస్.కోట(విజయనగరం): విశాఖ జిల్లా కిరండోల్- కొత్తవలస మార్గంలో రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఈ మార్గంలో కొండచరియలు విరిగి రైలు పట్టాలపై పడటంతో గురువారం ఉదయం విశాఖ నుంచి అరకు బయలుదేరిన రైలును ఎస్.కోట వద్ద నిలిపివేశారు. పట్టాలపై అడ్డంకులను తొలిగించటంతో గంటన్నర అనంతరం తిరిగి రైలును ముందుకు నడిపారు. -
విమానాలు ఆలస్యం...ప్రయాణికుల ఆందోళన
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయి వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గురువారం ఉదయం దుబాయి వెళ్లాల్సిన ఎమిరేట్స్ సంస్థకు చెందిన మూడు విమానాలను సాంకేతిక కారణాలతో అధికారులు నిలిపివేశారు. తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. -
ఆలస్యంగా ప్రారంభమైన పోలీస్ ఈవెంట్స్
నల్లగొండ క్రైం : వర్షం కారణంగా జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో బుధవారం పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఆలస్యగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈవెంట్స్ను 8 గంటలకు ప్రారంభించారు. మంగళవా రం రాత్రి వర్షం పడడంతో గ్రౌండ్లో నీళ్లు నిలిచాయి. దీంతో పోలీసులు అభ్యర్థులు రన్నింగ్ చేసేందుకు అనుకూలంగా నేలను మట్టిపోసి చదును చేశారు. ఎస్పీ ఎన్.ప్రకాశ్రెడ్డి ప్రతి ఈవెంట్లో పాల్గొనే అభ్యర్థికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయించారు. అభ్యర్థులను టెంట్ల కింద కూర్చోబెట్టి సర్టిఫికెట్లను పరిశీలించారు. 900మంది అభ్యర్థులకు ఈవెంట్స్ను పూర్తి చేశారు. -
మోక్షంలేని మోడల్ స్కూళ్లు
మోర్తాడ్ : గ్రామీణ స్థాయిలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీయస్ఈ) సెలబ స్ను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లు కొన్ని మండలాలకే పరిమితం అయ్యాయి. గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో యూపీఏ సర్కార్ మండలానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు నిధులను కేటాయించింది. అయితే ఇప్పటి ఎన్డీఏ సర్కార్ మోడల్ స్కూళ్ల నిర్వహణ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై మోపడమే కాకుండా కొత్త మోడల్ స్కూ ళ్ల ఏర్పాటుకు నిధులను కేటాయించడం లేదు. దీంతో మోడల్ పాఠశాలల విద్య పరిమితం అయి ఎక్కువ మంది విద్యార్థులు లబ్ధిపొందలేక పోతున్నారు. సీబీయస్ఈ సిలబస్ ద్వారా ప్లస్ టూ వరకు ఉచితంగా మెరుగైన విద్యను అందించడానికి మోడల్ స్కూళ్ల అంకురార్పణ జరిగింది. రెసిడెన్సియల్ విధానంతో పాటు డే స్కాలర్ విధానంలో మోడల్ స్కూళ్లలో విద్యను అందించడానికి ఏర్పాట్లు చేశారు. మోడల్ స్కూ ళ్ల ఏర్పాటుకు ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సొంత భవనాల నిర్మాణం కోసం 2014 అక్టోబర్24 జీవో నంబర్ యంయస్ 8 ద్వారా ఒక్కో మోడల్ స్కూల్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.4.80 కోట్లను కేటాయింది. అయితే జిల్లాలో మొదట 15 చోట్ల స్థలాల సేకరణ వేగంగా జరగడంతో 15 మోడల్ స్కూళ్ల నిర్మాణం పూర్తయింది. బాల్కొండ మండలంలో మాత్రం స్థల సేకరణ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మోడల్ స్కూల్ నిర్మాణం మొదలయ్యే సమయంలో పనులు నిలిచిపోయాయి. 21 మండలాల్లో పాఠశాలల కోసం స్థల సేకరణలో జాప్యం ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం తన నిధులను వెనక్కి తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 21 మండలాలకు అన్యాయం జరిగిందని పలువురు విమర్శస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రతి నియోజకవర్గంలో ఒకటి, రెండు మండలాల్లో మోడల్ స్కూళ్లు ఉండగా ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే ఎక్కడ కూడా మోడల్ స్కూళ్ల నిర్మాణం సాగలేదు. ఐదు మండలాల్లో స్థల సేకరణ పూర్తి అయినా కేంద్రం మనసు మారడంతో ఈ మండలాల్లోని విద్యార్థులకు తీవ్ర నష్టం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పాఠశాలలను సక్సెస్ స్కూళ్లుగా మార్చి వాటిలో ఆంగ్ల మాధ్యమంను అమలు చేస్తోంది. సక్సెస్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో పదో తరగతి చదివిన విద్యార్థులకు ఇంటర్ ఇంగ్లిష్ మీడియంలో సీట్లు లభించడానికి మోడల్ స్కూళ్లు ఒక్కటే మార్గంగా ఉన్నాయి. అయితే మోడల్ స్కూళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో విద్యార్థులకు సరిపడేంత సీట్లు ఉండటం లేదు. మోడల్ స్కూళ్ల సంఖ్య ఎక్కువగా ఉండిఉంటే ఇంటర్ ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు అవకాశం లభించేది. మోడల్ స్కూళ్లు లేని మండలాలు ఇవే... జిల్లాలోని మోర్తాడ్, కమ్మర్పల్లి, బాల్కొండ, భీమ్గల్, వేల్పూర్, కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, పిట్లం, జుక్కల్, బిచ్కుంద, గాంధారి, తాడ్వాయి, లింగంపేట్, బోధన్, ఎడపల్లి, నిజామాబాద్, కోటగిరి, బీర్కూర్, మాక్లూర్, భిక్కునూర్ మండలాల్లో సరైన సమయంలో స్థల సేకరణ జరుగకపోవడంతో మోడల్ స్కూళ్లు ఏర్పాటు కాలేదు. ఇప్పుడు స్థలాలు ఉన్నా నిధులు కేటాయించకపోవడంతో మోడల్ విద్య విద్యార్థులకు అందడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మోడల్ పాఠశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు బ్రెగ్జిట్ షాక్ ?
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేసిన బ్రెగ్జిట్ ఉదంతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కూడా భారీ షాక్ ఇవ్వనుంది. సుదీర్ఘ కాలంగా గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న ఏడవ ఆర్థిక కమిషన్ అమలు ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. తొందర్లోనే అమలుకు నోచుకుంటుం దనుకుంటున్న 7వ వేతన సంఘం కమిషన్ సిఫారసుల అమలు మరో 2-3 నెలల జాప్యం కావచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ చెల్లింపులు భారం ప్రభుత్వ ఖజానాపై భారీగా పడనుందనీ, దేశీయ మార్కెట్లలో పెరిగిన అస్థిరత నేపథ్యంలో దీని అమలు ఆలస్యం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఫలితంగా ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిణామాల కారణంగా మన మార్కెట్ల స్థిరీకరణకు మరొక 2-3 నెలలు పట్టవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో చెల్లింపుల జాప్యానికి బలమైన అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనావేశారు. తత్ఫలితంగా వచ్చే ద్వైమాసిక ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష కూడా మరికొంతకాలం వాయిదా పడొచ్చంటున్నారు. అలాగే చెక్కుచెదరకుండా యథాతథంగా ఉంటాయని అంచనా వేస్తున్నవడ్డీ రేట్లలో స్వల్ప పెంపు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. దేశీయ ఈక్విటీ మార్కెట్లు కోలుకొని స్థిరపడేదాకా , అంటే సుమారు మరో మూడు నెలలు ప్రభుత్వం వెయిట్ అండ్ వాచ్ విధానాన్ని అవలంబించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ లో మరింత అస్థిరత పెరిగితే ఆర్థిక పరిస్థితి, రూపాయి మరింత బలహీనతపడుతుందని చెబుతున్నారు. కాగా బ్రెగ్జిట్ నిర్ణయంతో, ప్రపంచ మార్కెట్ల సంక్షోభం, పౌండ్ ధర రికార్డు క్షీణత, ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో దాదాపు లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిన సంగతి తెలిసిందే. -
ఆరురోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఆరు రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎమ్ డి) తెలిపింది. జూన్ 1 నాటికి కేరళకు చేరుకో్వాల్సిన పవనాలు ఆలస్యంగా ఏడో తేదీన తాకే అవకాశాలున్నట్టు వెల్లడించింది. దీంతో దేశ వ్యాప్తంగా వర్షాలు ఆలస్యమవనున్నాయి. గత 11ఏళ్లుగా నైరుతి ఆగమనాన్ని వాతావరణ శాఖ సరిగ్గా అంచనా వేస్తోంది. ఈ కొద్ది రోజులు ఆలస్యమవడం పెద్ద విషయమేమీ కాదని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోర్ తెలిపారు. రానున్న రోజుల్లో దక్షిణ భారత దేశంలో మరిన్ని వర్షాలు కురిసి ప్రజలకు వేడిమి నుంచి కొంచెం ఉపశమనం లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడంలో కేరళ, తమిళనాడు, కర్నాటకలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాథోర్ వెల్లడించారు. -
ఆమె పంచ్కి..విమానం ఆగింది
మాంచెస్టర్: విమానంలో ఓ యువతి అనుచిత ప్రవర్తన విమాన ఆలస్యానికి కారణమైంది. ఈ సంఘటన మాంచెస్టర్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. సైప్రస్లోని పపోస్కు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఈజీ జెట్ఫ్లైట్లో ప్రవర్తనలో తేడా ఉన్న ఓ యువతిని విమాన సిబ్బంది బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఆగ్రహం చెందిన ఆ యువతి సిబ్బంది సమక్షంలోనే పైలెట్ పై దాడికి దిగింది. ఆగ్రహంతో ఊగిపోతూ పైలట్ మోహంపై పంచ్ల వర్షం కురిపించింది. దీంతో వివాదం చెలరేగింది. అటు పైలెట్పై దాడి చేసినందుకుగానూ గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు ఆ అమ్మడిని అరెస్ట్ చేశారు. రెండు గంటలు ఆలస్యం తర్వాత విమానం తిరిగి బయలుదేరింది. అయితే సదరు యువతి మాదకద్రవ్యాల కేసులో పోలీసుల వాంటెడ్ లిస్ట్లో ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ఇలాంటి ఘటనే గత ఏడాది కూడా ఈజీ జెట్ఫ్లైట్లో చోటు చేసుకుంది. సాండ్ విచ్కోసం చాలా సేపు వేచి చూసిన ఓ ప్రయాణికుడు విమాన అటెండెంట్పై దాడికి దిగాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. -
ఫీజు రీయింబర్స్ మెంట్ మరింత ఆలస్యం
అఫిలియేషన్ నిబంధనతో సమస్య సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్యకు ఇప్పట్లో పరిష్కారం దొరికే సూచనలు కనిపించడం లేదు. గత రెండేళ్ల ఫీజు బకాయిలు అందక విద్యార్థులతో పాటు, కాలేజీల యాజమాన్యాలూ ఇబ్బందులెదుర్కొంటున్నాయి. 2014-15, 2015-16కు సంబంధించిన ఫీజు బకాయిలను మొత్తంగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా అది వాస్తవరూపం దాల్చడం లేదు. కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు (ఆర్టీఎఫ్)నకు అనుసరిస్తున్న విధానంలో మార్పు వల్ల ఈ సమస్య మరి న్ని నెలలు కొనసాగే పరిస్థితి ఏర్పడింది. అప్పుడలా.. ఇప్పుడిలా... 2014-15 విద్యా సంవత్సరం వరకు కాలేజీల అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) వారీగా ఫీజు రీయింబర్స్మెంట్ను ఇచ్చేవా రు. అయితే 2015-16కు సంబంధించి కొత్త సమస్యలు ముందుకు రావడంతో కాలేజీల అఫిలియేషన్ కాకుండా, ఆయా కాలేజీల్లో కోర్సుల వారీగా అఫిలియేషన్ ఉంటేనే ఫీజు రీయింబర్స్చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ పరిణామంతో కాలేజీలు, కోర్సు ల వారీగా అనుబంధ గుర్తింపును పరిశీలించడం అధికారులకు సమస్యగా మారింది. ముందు 2014-15 బకాయిలు చెల్లింపు ఈ నేపథ్యంలో 2014-15కు సంబంధించి ముందుగా కాలేజీలకు ఆర్టీఎఫ్, విద్యార్థులకు మెయింటెనెన్స్ ఫీజు ఈ నెలాఖరు లోగా చెల్లించనున్నారు. 2015-16కు సం బంధించి పూర్తి బకాయిల చెల్లింపునకు మరో రెండు, మూడు నెలలు పట్టవచ్చని సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. జూలై నుంచి నెల నెలా స్కాలర్షిప్.. ఇదిలా ఉండగా 2016-17 విద్యాసంవత్సరం మొదలయ్యాక జూలై నుంచి ఏ నెలకు ఆ నెల విద్యార్థులకు స్కాలర్షిప్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
సర్థార్ గబ్బర్సింగ్ విడుదల వాయిదా..?
ప్రస్తుతం టాలీవుడ్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా సర్థార్ గబ్బర్సింగ్. లాంగ్ గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలోగా హీరోగా చేస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ను సమ్మర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. చిత్ర నిర్మాత శరత్ మరార్ కూడా పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్నట్టుగా సర్థార్ గబ్బర్సింగ్ సినిమాను ఏప్రిల్ 8న రిలీజ్ చేయటం సాధ్యం అయ్యేలా కనిపించటం లేదు. ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు పెండింగ్లోనే ఉంది. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందన్న విషయంపై కూడా క్లారిటీ లేదు. దీంతో అనుకున్న సమయానికి గబ్బర్ సింగ్ అభిమానుల ముందుకు రావటం కష్టంగానే కనిపిస్తోంది. యూనిట్ సభ్యులు ఇంత వరకు ప్రమోషన్ను ప్రారంభించకపోవటం కూడా అనుమానాలకు తావిస్తోంది. రిలీజ్కు ఇంకా నెల సమయం కూడా లేకపోవటం, ఇప్పటి వరకు ఆడియో రిలీజ్ డేట్ కూడా ఫైనల్ కాకపోవటంతో సర్థార్ రిలీజ్ వాయిదా పడ్డట్టే అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి ఇప్పటికైన యూనిట్ సభ్యులు ఈ విషయంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. -
ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కేనా?
► రైల్వేలో జాయింట్ వెంచర్ కంపెనీల ఏర్పాటు ►ఏపీతో ఇటీవల కుదుర్చుకున్న రైల్వేశాఖ ► రూ.9 వేల కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో రైల్వే ప్రాజెక్టులు హైదరాబాద్: రైల్వే ప్రాజెక్టులను వేగంగా అమలు చేయడం, అవసరమైన నిధుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీలను (జేవీలు) ఏర్పాటు చేసేందుకు కేంద్రం తాజాగా అనుమతిచ్చింది. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు రైల్వే శాఖకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైల్వేశాఖ జాయింట్ వెంచర్ కంపెనీల ఏర్పాటుపై ఏపీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్లో రూ.9 వేల కోట్లతో పలు రైల్వే ప్రాజెక్టులు 50 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా పనులు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టులకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా నిధులు విదుల్చుతోండటంతో సుదీర్ఘకాలంగా ఇవి పట్టాలెక్కడం లేదు. వాటా ప్రాజెక్టులన్నీ పడకేశాయి. అరకొరగా కేటాయిస్తున్న నిధులతో ఈ ప్రాజెక్టులు ఎన్నటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. జాయింట్ వెంచర్ కంపెనీల ఏర్పాటుతోనైనా పడకేసిన రైల్వే ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయని రైల్వే వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జాయింట్ వెంచర్ కంపెనీలేం చేస్తాయి? రైల్వే మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటవుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను గుర్తించడం, భూసేకరణ సమస్యలు, నిధులు సమకూర్చడం వంటివి ఎప్పటికప్పుడు జేవీలు పర్యవేక్షిస్తాయి. ఎంపిక చేసిన ప్రతినిధులతో కలిసి ఏర్పాటయ్యే జాయింట్ వెంచర్ కంపెనీ చేపట్టబోయే ప్రాజెక్టును బట్టి రూ.100 కోట్ల వరకు నిధులు సమకూర్చుకోవాలి. రైల్వేశాఖ ముందుగా ప్రతి రాష్ట్రానికి ఇచ్చేది రూ.50 కోట్ల వరకు ఉంటుంది. రైల్వేశాఖ ప్రాజెక్టుకు, నిధుల సమీకరణకు ఆమోదముద్ర వేశాక రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీలు, ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలి. ► కడప-బెంగళూరు రైల్వే లైన్కు రూ.1,000.23 కోట్లతో అంచనా వేశారు. ఇప్పటి వరకు కేంద్రం, రాష్ట్రం కలిపి రూ.189.95 కోట్లు కేటాయించాయి. ► నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ అంచనా వ్యయం రూ.1,314 కోట్లు. ఇప్పటివరకు రూ.6 కోట్లే కేటాయించారు. గుంటూరు, నెల్లూరు జిల్లాలో భూసేకరణ కోసం రాష్ట్రం రూ.289 కోట్ల నిధులు విడుదల చేసింది. ► కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్ అంచనా వ్యయం రూ.1,050 కోట్లు. రాష్ట్రం రూ.2.69 కోట్లు, కేంద్రం రూ.5 కోట్లు కేటాయించింది. ► కాకినాడ-పిఠాపురం లైన్ రూ.123.68 కోట్లు అంచనా వ్యయం కాగా, ఇంతవరకు పైసా మంజూరు చేయలేదు. ► తుమ్కూరు-రాయదుర్గం రైల్వేలైన్కు 970.34 కోట్లు అంచనా వ్యయమైతే, ఇప్పటివరకు రూ.200 కోట్లు కేటాయింపులు జరిగాయి. ► విజయవాడ-గుడివాడ-మచిలీపట్నం, భీమవరం/నర్సాపురం-నిడదవోలు లైన్కు డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్కు రూ.1009.08 కోట్లకుగాను ఇప్పటివరకు రూ.141 కోట్లు కేటాయించారు. ► గుంటూరు-తెనాలి-రేపల్లె డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్కు రూ.133.46 కోట్లు అంచనా వ్యయం. ఇప్పటివరకు రూ.35 కోట్లు కేటాయించారు. ► భద్రాచలం-కొవ్వూరు కొత్త లైన్కు రూ.923.23 కోట్లు అంచనా వ్యయం కాగా, ఇంతవరకు సర్వే దశ దాటలేదు. దేవరపల్లి-పెనుకొండ 48 కి.మీ. లైన్ రూ.400 కోట్ల అంచనా వ్యయం కాగా, ఏపీ తన వాటా నిధులపై నోరు మెదపడం లేదు. ► గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్కు రూ.2,033 కోట్లు అంచనా వ్యయమైతే కాగితాలకే పరిమితమైంది. -
తిరుపతి నుంచి విశాఖ వెళ్లే రైళ్లు ఆలస్యం
తిరుపతి : తుని సంఘటన నేపథ్యంలో తిరుపతి నుంచి విశాఖపట్టణంవైపు వెళ్లే రైళ్లు సోమవారం ఆలస్యంగా బయలుదేరతాయని తిరుపతి రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి విశాఖపట్టణం వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్ రాత్రి 8.35 గంటలకు బయలుదేరాల్సి ఉండగా రెండు గంటలు ఆలస్యంగా రాత్రి 10.35 గంటలకు బయలుదేరుతుంది. అలాగే విశాఖపట్టణం మీదుగా భువనేశ్వర్ వెళ్లే భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వెళ్లాల్సిన రైలు రాత్రి 7.15 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. -
నిర్లక్ష్యం మూల్యం.. నిండు ప్రాణం
సిరిసిల్ల: ప్రభుత్వాస్పత్రిలో నిర్లక్ష్య వైద్యానికి ఓ పసిగుడ్డు పురిట్లోనే కన్నుమూసింది. నవమాసాలు మోసిన కన్నతల్లి పురిటినొప్పులతో ఆస్పత్రికి వస్తే.. నార్మల్ డెలివరీ చేయాలని జాప్యం చేయడంతో పసిగుడ్డు లోకంపోకడ చూడకుండానే కన్నుమూసింది. బాధితుల కథనం.. సిరిసిల్ల పట్టణంలోని అంభికానగర్కు చెందిన ఎండీ సాదుల్లా, షబానా దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. షబానా గర్భవతి కావడంతో గత శనివారం సిరిసిల్ల ప్రాంతీయ వైద్యశాలలో చేరింది. పరీక్షించిన అధికారులు నార్మల్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం తెల్లవారుజామున నొప్పులు రావడంతో ఆపరేషన్ చేయకుండా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఉదయం స్కానింగ్ చేసి బాబు చనిపోయాడని సమాధానం ఇచ్చారని తెలిపారు. మెకానిక్ పనిచేసే సాదుల్లా నిరుపేద కావడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లలేక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారని కుటుంబ సభ్యులు రోదించారు. సిబ్బంది నిర్లక్ష్యం.. తెల్లవారుజామునే షబానాకు నొప్పులు రావడంతో సకాలంలో వైద్యసేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నొప్పులు భరించలేక ఆర్తనాదాలు చేస్తే.. అప్పుడు వచ్చి గ్లూకోజ్ పెట్టారని రెండు గంటల వరకు డాక్టర్ రాలేదని ఆరోపించారు. తొలుత రక్తం తక్కువ ఉందని చెప్పారని, తల్లికి బాగా రక్తస్రావం అయిందని, సబ్బు, నూనె తెచ్చుకోమని చెప్పి నమ్మించి నిండా ముంచారంటూ ఆవేదనగా చెప్పారు. మూడో సంతానంగా బాబు కావడంతో ఆ కుటుంబ సభ్యుల వేదనకు అంతే లేదు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు. మా తప్పేమీ లేదు.. ఇందులో మా తప్పేమీ లేదు. పాప తల్లి కడుపులోనే ఉమ్మనీరు మింగింది. రెండో కాన్పు నార్మల్ డెలివరీ అయింది. అందుకే నార్మల్ డెలివరీ కోసం వేచిచూశాం. చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. సకాలంలోనే వైద్యసేవలు అందించి తల్లిని రక్షించాం. పాప చనిపోవడం బాధాకరం. - డాక్టర్ గూడూరి రవీందర్, సూపరింటెండెంట్ -
బాబు తీరింతే.. హామీ.. అదేమి!
నిబంధనల ఛట్రంలో ‘రుణమాఫీ’ కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం రుణమాఫీ అమలులో అనుసరిస్తున్న విధానాలు, జాప్యం కారణంగా రైతులపై వడ్డీ భారం పెరుగుతోంది. ఇదే సమయంలో రైతులు పంటల బీమా కోల్పోయే పరిస్థితి నెలకొంది. అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం... రుణమాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు రోజుకో నిబంధన, షరతులు తెరపైకి తీసుకొస్తోంది. ఫలితంగా అర్హుల జా బితా గణనీయంగా తగ్గిపోతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుణమాఫీకి అర్హత లభిస్తుందా... లేదా అనే ఆందోళనకు రైతుల్లో కనిపిస్తోంది. 2013 డిసెంబర్ చివరిలోపు రుణాలు తీసుకుని, చెల్లించకుండా ఉన్న వారికి మాత్రమే రుణ మాఫీ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకారం జిల్లాలో 5,24,340 మంది రైతుల వివరాలను బ్యాంకర్లు ఆన్లైన్లో ప్రభుత్వానికి పంపారు. ఇందుకు సంబంధించి దాదాపు రూ.2800 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. అయితే నిబంధనలు, షరతుల పేరిట భారీగా కోత విధిస్తుండటం గమనార్హం. ఆధార్ సాకుతో 60వేల మందికి ఎగనామం రుణ మాఫీ వివరాలు అప్లోడ్ చేసిన రైతుల్లో దాదాపు 60వేల మందికి ఆధార్ నెంబర్లు లేవు. వీరికి రుణ మాఫీ వర్తించదని ప్రభుత్వం చెబుతుండటంతో ఆ రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆధార్ కార్డు పొందేందుకు వివరాలు నమోదు చేసుకున్నా యూఐడీ అందని పరిస్థితి. అయితే ప్రభుత్వం యూఐడీ నెంబర్లు ఇవ్వలేదని రుణమాఫీకి దూరం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యాన పంటలకు రుణ మాఫీ లేదని తేల్చారు. సాధారణ ఎన్నికల ప్రచారం ముగిసే వరకు రైతులు వ్యవసాయ రుణాలు చెల్లించక్కర్లేదని.. అధికారంలోకి రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు విస్పష్టంగా ప్రకటించారు. ఈ ప్రకారం 2014 మార్చి చివరిలోపు తీసుకున్న రుణాలన్నిటికీ మాఫీ అమలు చేయాలి. కానీ డిసెంబర్ 31, 2013 వరకు తీసుకున్న రుణాల కు మాత్రమే మాఫీ అని ప్రకటించి వేలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లారు. డిఫాల్టర్లుగా మారిన రైతులు: రుణాలు కట్టొద్దని ప్రోత్సహించి, రుణ మాఫీ అమలులో అంతులేని జాప్యం చేస్తూ నిర్ణీత సమయంలోగా మాఫీ చేయకపోవడంతో రైతులు డీఫాల్టర్లుగా మారుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 30 వరకు 7 శాతం వడ్డీ భారాన్ని భరించాల్సి వస్తోంది. ఈ ప్రకారం రైతులపై రూ.98 కోట్ల వడ్డీ భారం పడుతోంది. అయితే, ఇందులోనూ 4 శాతం కేంద్రం, 3 శాతం రాష్ర్ట ప్రభుత్వం తిరిగి రైతులకు చెల్లిస్తాయి. అంటే రైతులకు వడ్డీలేని రుణాలు అందుబాటులో ఉంటాయన్నమాట. అయితే, రుణ మాఫీ వస్తుందని రైతులు రుణాలు చెల్లించకపోవడంతో జులై 1 నుంచి రైతులు డిఫాల్టర్లుగా మారారు. అప్పటి నుంచి రైతులు 14 శాతం వడ్డీని భరించాల్సి వస్తోంది. దీని ప్రకారం అక్టోబర్ 31 వరకే రైతులపై రూ.93.30 కోట్ల భారం పడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 31 వరకు జిల్లా రైతులపై రూ.261 కోట్ల వడ్డీ భారం పడనుండటం గమనార్హం. మొదటి దశలో కేవలం 20 శాతం మాత్రమే రుణ మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రుణ మాఫీలో అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో పంట రుణాలకు దూరమయ్యారు. ఫలితంగా పంటల బీమాకు నోచుకోలేకపోయారు. పొదుపు సొమ్ము హుష్కాకి: జిల్లాలో 35వేల డ్వాక్రా సంఘాలకు చెందిన రూ.530 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. వీటికి కేవలం లక్ష ప్రకారం రివాల్వింగ్ ఫండ్ మాత్రమే ఇస్తామని ప్రకటించారు. రుణ మాఫీ వస్తుందనే ఉద్దేశంతో రుణాలు చెల్లించకుండా ఉండిపోయిన మహిళలపై వడ్డీ భారం భారీగా పడుతోంది. మరోవైపు మహిళలు ప్రతీ నెలా దాచుకున్న పొదుపు మొత్తాలను రుణాల చెల్లింపు కింద బ్యాంకులు తీసేసుకుంటున్నాయి. కనీసం సంఘం నుంచి అనుమతి కూడా తీసుకోని పరిస్థితి. రుణమాఫీ కాకపోవడం, పొదుపు మొత్తం కూడా బ్యాంకులు లాగేసుకుంటుండటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో గ్రూపుల మధ్య తగాదాకు కారణమవుతోంది.