Eligibility
-
టీనేజ్ అకౌంట్' కు తాళం
సామాజిక మాధ్యమంలో అకౌంట్ లేదని ఎవరైనా చెబితే వెంటనే.. ‘ఇంకా ఏ కాలంలో ఉన్నారండీ.. నాకైతే రెండు మూడు ఖాతాలున్నాయి. ఒక్కో దాంట్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు’ అంటూ గొప్పలు చెప్పుకునే వారు కోకొల్లలు. సోషల్ మీడియాను కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త పరిచయాల వరకూ పరిమితమైతేనో, వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటేనో పర్లేదు. కానీ.. అదుపు తప్పి అనర్థాలు తెచ్చుకుంటున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగు చూస్తున్నాయి. ఎంతోమంది జీవితాలు కేవలం సోషల్ మీడియా ప్రభావం వల్ల నాశనమవుతున్నాయి.పిల్లలు, యుక్తవయసు వారు (టీనేజర్లు) సోషల్ మీడియాకు బానిసలుగా మారుతుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దీంతో పలు దేశాలు కొన్ని వయసుల వారు సామాజిక మాధ్యమాన్ని వినియోగించడంపై ఆంక్షలు పెడుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, యూట్యూబ్ వంటి సంస్థలు తమ ఖాతాదారుల వ్యక్తిగత సమాచార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. – సాక్షి, అమరావతిఖాతా కోసం వయసు ఎక్కువని అబద్ధాలుపిల్లలు, టీనేజర్స్, పెద్దలు అనే తేడా లేకుండా రోజుకి సగటున మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారని, దీనివల్ల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అనేక పరిశోధనలు తేల్చాయి. సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఆ యూజర్కు 13 ఏళ్ల వయసు ఉండాలి. తప్పుడు సమాచారంతో ఈ–మెయిల్ ఐడీలు తయారు చేసుకుని, 8 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు కూడా ఖాతాలు తెరుస్తున్నారు.8 నుంచి 17 సంవత్సరాల వయసు వారిలో 22% మంది సోషల్ మీడియా యాప్లలో తమకు 18 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నట్టు అబద్ధం చెబుతున్నారని అమెరికా సంస్థ ‘ఆఫ్కామ్’ అధ్యయనంలో తేలింది. 15 నుంచి 18 ఏళ్ల వయసులో శారీరక, మానసిక మార్పులు జరుగుతాయి. అటువంటి సమయంలో సోషల్ మీడియాకు అలవాటు పడితే వారి ఆలోచనల్లోనూ మార్పులు వస్తాయని, రకరకాల వింత, వికృత ప్రవర్తనలను నేర్చుకుంటారని వైద్యులు చెబుతున్నారు. రానున్న 2025 సంవత్సరంలో ‘ఆన్లైన్ భద్రతలో నిజమైన మార్పు’ రావాలని టెక్ నిపుణులు సోషల్ మీడియా సంస్థలను కోరుతున్నారు.వారి ఖాతాలకు ఆటోమేటిక్ ప్రైవసీ సోషల్ మీడియా వేదికల్ని నిర్వహిస్తున్న సంస్థలు ఇటీవల ఖాతాదారుల భద్రతపై దృష్టి సారించాయి. అనేక సాంకేతికతలను అభివృద్ధి చేశాయి. యువతకు సోషల్ మీడియాను సురక్షితమైనదిగా ఉంచడానికి ఇన్స్ర్ట్రాగామ్ ‘టీన్ అకౌంట్’లను తీసుకువచి్చంది. అలాగే రోజూ వేల సంఖ్యలో వయసు తప్పుగా నమోదు చేసిన వారి ఖాతాలను కొన్ని సంస్థలు తొలగిస్తున్నాయి. అలాగే టీనేజర్ల ఖాతాలకు ఆటోమేటిక్గా లాక్ (ప్రైవసీ) వేసేస్తున్నాయి.అంటే వారి ఖాతాను వారు అనుమతించిన స్నేహితులు మాత్రమే చూడగలరు. ఇతరులకు వారి వివరాలు కనిపించవు. మెషిన్ లెరి్నంగ్ టెక్నాలజీ ఇందుకు సహకరిస్తోంది. ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ను పటిష్టం చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఆస్ట్రేలియా ఓ అడుగు ముందుకు వేసి, 16 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలను వినియోగించడాన్ని నిషేధించింది.మార్చాల్సింది తల్లిదండ్రులే సోషల్ మీడియాలో సన్నిహితులతో, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. అది సైబర్ కేటుగాళ్లు దొంగిలించి, వాటిద్వారా బెదిరిస్తూ.. డబ్బులు గుంజుతారు. వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నట్టు నివేదికలు వెల్లడించాయి. అందుకే పదేళ్లు నుంచి 20 ఏళ్లలోపు వయసు పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేలా చేయాలి. ఇంటి పనుల్లోనూ భాగం చేయాలి. తల్లిందండ్రులు పిల్లలతో ముచ్చటిస్తుండాలి. ప్రతి చిన్న ఘటనను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాన్పించాలి. చదువుపై దృష్టి కేంద్రీకరించేలా అలవాటు చేయాలి. -
ఒలింపిక్ క్రీడలు తొలిసారిగా.. ఎక్కడ మొదలయ్యాయో తెలుసా?
ఒలింపిక్ క్రీడలు తొలిసారిగా క్రీస్తుపూర్వం 776లో నాటి గ్రీకు రాజ్యంలోని ఒలింపియా నగరంలో మొదలయ్యాయి. అప్పట్లో ఒకే ఒక్క పోటీ ఉండేది. అది పరుగు పందెం. ఇందులో పాల్గొనడానికి గ్రీకు రాజ్యంలో స్వతంత్ర పౌరులుగా పుట్టిన పురుషులు మాత్రమే అర్హులు. అప్పట్లో బానిసలకు, మహిళలకు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అర్హత ఉండేది కాదు. నాలుగేళ్లకు ఒకసారి ఈ క్రీడా పోటీలను నిర్వహించే పద్ధతి అప్పటి నుంచే ఉండేది.ఒలింపిక్ క్రీడలు మొదలైన తొలి రెండు శతాబ్దాల కాలంలో ఈ పోటీలు మత ప్రాధాన్యం గల ప్రాంతీయ పోటీలుగా మాత్రమే జరిగేవి. కాలక్రమంలో ఒలింపిక్ క్రీడలు గ్రీకు రాజ్యంలో జరిగే నాలుగు ప్రధాన క్రీడోత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి.క్రీస్తుశకం మూడో శతాబ్ది నుంచి ఒలింపిక్ క్రీడల వైభవం తగ్గుముఖం పట్టింది. రోమన్ చక్రవర్తి థియోడోసియస్ హయాంలో క్రీస్తుశకం 393లో చివరిసారిగా ఒలింపిక్ క్రీడలు జరిగినట్లు చరిత్రలో నమోదైంది. ప్రాచీన ఒలింపిక్ క్రీడలకు అదే పరిసమాప్తిగా భావించవచ్చు.గ్రీకు రాజ్యాన్ని రోమన్లు క్రీస్తుపూర్వం 146లో స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఒలింపిక్స్ కొనసాగినా, ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. క్రీస్తుపూర్వం 86లో రోమన్ సేనాని సూలా ఒలింపియాను కొల్లగొట్టాడు. అక్కడ కొల్లగొట్టిన నిధులతో జరిపిన యుద్ధంలో విజయం సాధించి, క్రీస్తుపూర్వం 80లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించాడు.రోమన్ చక్రవర్తి నీరో హయాంలో ఒలింపిక్ క్రీడలు అభాసుపాలయ్యాయి. పిచ్చిమారాజుల్లో ఒకడిగా పేరుమోసిన నీరో రథాల పందేల్లో తొండి ఆటలాడి తనను తానే విజేతగా ప్రకటించుకునేవాడు. తనను తాను మహా సంగీత విద్వాంసుడిగా భావించే నీరో చక్రవర్తి క్రీస్తుశకం 67లో తొలిసారిగా ఒలింపిక్స్లో గాత్ర, వాద్య సంగీత పోటీలను కూడా ప్రవేశపెట్టాడు.రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ హయాంలో ఒలింపిక్స్కు పునర్వైభవం వచ్చింది. అగస్టస్ సీజర్ ఆంతరంగికుడైన మార్కస్ అగ్రిపా ఒలింపియాలోని జూస్ ఆలయాన్ని పునరుద్ధరించి, క్రీస్తుపూర్వం 12లో ఒలింపిక్ క్రీడలను ఘనంగా నిర్వహించాడు.ఇవి చదవండి: యూసీసీ కింద నమోదైతే పోలీసు రక్షణ -
గ్రూప్ 1 కొట్టిన తండ్రి, కొడుకులు
-
గ్రాట్యుటీ.. ఎవరికొస్తుంది.. ఎంతొస్తుంది?
ప్రైవేటు రంగంలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత ఉంటుందని చెప్పలేం. అదే సమయంలో ఉద్యోగి తన వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల దృష్ట్యా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారిపోవడం సహజంగా చూస్తుంటాం. కారణాలు ఏవైనా కానీ ఉద్యోగం వీడితే వచ్చే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ఉద్యోగం నుంచి వైదొలగినప్పుడు వచ్చే ప్రయోజనాల్లో గ్రాట్యుటీ కీలకమైనది. ఉద్యోగి పనిచేసిన కాలంపై ఇది ఆధారపడి ఉంటుంది. గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 ఇందుకు ప్రామాణికం. చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పించే కథనమే ఇది.గ్రాట్యుటీ అంటే..? ఉద్యోగి సేవలను గుర్తిస్తూ సంస్థ అందించే ఆర్థిక ప్రయోజనమే గ్యాట్యుటీ. ఎన్నో ఏళ్లుగా సంస్థ అభ్యున్నతి కోసం సేవలు అందించే ఉద్యోగుల పట్ల చూపించే కృతజ్ఞత. ఇది వేతనంలో భాగం కాదు. ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. కానీ, ఇందుకు అర్హత సాధించాలంటే గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం, 1972లో నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగి సేవలు ఉండాలి. కనీసం ఐదేళ్ల సర్వీస్ (పని చేసిన కాలం) పూర్తి చేసుకున్న వారికే దీన్ని పొందే అర్హత లభిస్తుంది. ఎన్నో రంగాలకు ఈ చట్టం అమలవుతోంది. ప్రభుత్వ విభాగాలు, డిఫెన్స్, స్థానిక సంస్థల ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు దీని పరిధిలోకి వస్తారు. ఎన్నేళ్లు పనిచేయాలి?గడిచిన ఏడాది కాలం పాటు కనీసం 10 మంది ఉద్యోగులు కలిగిన సంస్థలకు గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం వర్తిస్తుంది. ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు నిబంధనలకు అనుగుణంగా గ్రాట్యుటీని అందించాల్సి ఉంటుంది. మైనింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగులకు కనీసం 190 పని దినాలు, నాన్ మైనింగ్ విధుల్లోని వారికి 240 పనిదినాలు ఏడాది కింద పరిగణిస్తారు. కనీసం ఐదేళ్ల పాటు అంతరాయం లేకుండా సేవలు అందించిన ఉద్యోగులు అందరూ గ్రాట్యుటీకి అర్హులు. సమ్మెలు, లాకౌట్లు, ప్రమాదాలు, సెలవులు, తాత్కాలిక తొలగింపు వల్ల గైర్హాజరుకు మినహాయింపులు ఉంటాయి. ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందే సంస్థ తొలగించిన సందర్భంలోనూ ఉద్యోగికి గ్రాట్యుటీ చెల్లించాల్సిందే. వారంలో ఆరు పనిదినాలు అమలు చేసే కంపెనీల్లో 4 ఏళ్ల 240 రోజులు పనిచేసినా గ్రాట్యుటీకి అర్హత లభిస్తుంది. వారంలో ఐదు రోజుల పనిదినాలున్న కంపెనీల్లోని వారు 4 ఏళ్ల 190 రోజులు పనిచేస్తే అర్హులు. కొన్ని రంగాల్లోని వారికి ఈ కనీస పదవీ కాలం భిన్నంగా ఉంటుంది. న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ కింద పనిచేసే వర్కింగ్ జరల్నిస్టులకు పదేళ్ల సర్వీస్ ఉంటేనే గ్రాట్యుటీకి అర్హత లభిస్తుంది. ఉద్యోగి మరణించినా లేదా వైకల్యం కారణంగా విధుల నుంచి తొలగించినప్పుడు పనిచేసిన కాలంతో సంబంధం లేకుండా గ్రాట్యుటీ చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. గ్రాట్యుటీ అనేది కేవలం పదవీ విరమణ వయసుకు వచ్చినప్పుడే కాకుండా.. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నప్పుడు, ఉద్యోగి తప్పిదం లేకుండా తొలగించినప్పుడు, రాజీనామా చేసినప్పుడు ఇవ్వాల్సి ఉంటుందని లెక్స్లెవర్ సర్వీసెస్ డైరెక్టర్ హర్షిత అగర్వాల్ శర్మ తెలిపారు.పరిమితి గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ.20 లక్షలు. నిబంధనల ప్రకారం సంస్థలు గరిష్టంగా ఇంతకు మించి ఇవ్వక్కర్లేదు. రూ.20లక్షలు మించితే అది ఎక్స్గ్రేషియా కిందకు వస్తుంది. ఎక్స్గ్రేషియా ఎంత ఇవ్వాలన్నది సంస్థల అభీష్టమే. ఇంత మేర ఇవ్వాలని నిబంధనలు చెప్పడం లేదు. గ్రాట్యుటీ లెక్కింపు చివరి నెల వేతనంలో మూల వేతనం, డీఏ ఎంతో తెలుసుకోవాలి. ఇలా ఒక ఏడాదికి 15 రోజుల వేతనం గ్రాట్యుటీ కింద వస్తుంది. మొత్తం పనిచేసిన సంవత్సరాలు ఇంటూ 15 రోజులు ఇంటూ చివరిగా అందుకున్న మూల వేతనం, డీఏ డివైడ్ 26(నెలలో పనిచేసిన రోజులు) సూత్రం అమలవుతుంది. ఆరు నెలలు దాటిన కాలాన్ని పూర్తి ఏడాదిగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి 12 సంవత్సరాల పాటు ఒక కంపెనీలో పనిచేసినట్టు అనుకుందాం. చివరిగా అందుకున్న మూల వేతనం, డీఏ కలిపి రూ.75,000. దీంతో ఎక్స్కు వచ్చే మొత్తం గ్రాట్యుటీ రూ.5,19,230. గ్రాట్యుటీ చట్టం పరిధిలోకి రాని వారికి ఇచ్చే గ్రాట్యుటీ ఫార్ములా కొంత భిన్నం. ఏడాదిలో 15 రోజులు ఇంటూ చివరి నెలలో మూల వేతనం, డీఏ ఇంటూ పనిచేసిన సంవత్సరాలు డివైడ్ 30(నెలలో పనిచేసిన రోజులు). పూర్తి ఏడాది పాటు పనిచేసిన కాలాన్నే వీరికి ఏడాది కింద పరిగణిస్తారు. దీని ప్రకారం ఎక్స్ అనే వ్యక్తి ఒక సంస్థలో 12 ఏళ్లు పనిచేసి, చివరి నెలలో మూలవేతనం, డీఏ కింద రూ.75,000 తీసుకున్నారని అనుకుంటే.. వచ్చే గ్రాట్యుటీ రూ.4,50,000. ఆలస్యం అయితే విధుల నుంచి వైదొలగిన 30 రోజుల్లోపు గ్రాట్యుటీ చెల్లించాలి. ఇంతకుమించి జాప్యం చేస్తే ఆ మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగికి గ్రాట్యుటీ ప్రయోజనం అన్నది పనిచేసిన కాలం ఆధారంగానే అర్హత ఉండాలి కానీ, రిటైర్మెంట్ వయసు ఆధారం కాకూడదని ఇటీవలే అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ‘‘60 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటేనే గ్రాట్యుటీ, లేకపోతే అర్హత లేదన్నది సరైనది కాదు. ఒక ఉద్యోగి ఎన్ని సంవత్సరాల పాటు పనిచేశాడన్న దాని ఆధారంగా గ్రాట్యుటీ హక్కు లభిస్తుంది’’అని అలహాబాద్ సింగిల్ జడ్జి ధర్మాసనం ఓ కేసులో భాగంగా తీర్పు జారీ చేసింది.పన్ను బాధ్యత గ్రాట్యుటీపై పన్ను విషయంలో ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగ ఉద్యోగులకు నిబంధనల్లో వ్యత్యాసం ఉంది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరికైనా (కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల) సరే గ్రాట్యుటీ ఎంత అందుకున్నా పన్ను లేదు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారికి రూ.20 లక్షలు లేదా, చివరి 15 రోజుల వేతనాన్ని పనిచేసిన సంతవ్సరాలతో హెచ్చించినప్పుడు వచ్చే మొత్తం, వాస్తవంగా అందుకున్న గ్రాట్యుటీ.. వీటిల్లో ఏది తక్కువ అయితే ఆ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 10(10) కిందకు గ్రాట్యుటీ వస్తుంది. గతంలో రూ.10 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను ఉండేది కాదు. ఈ పరిమితిని మోదీ సర్కారు రూ.20 లక్షలకు పెంచింది.ఇవి తెలుసుకోవాలి.. » పనిచేసిన కాలం ఆరు నెలలు దాటి ఒక్క రోజు ఉన్నా దాన్ని పూర్తి సంవత్సరం కింద గ్రాట్యుటీ చెల్లింపులకు పరిగణనలోకి తీసుకుంటారు. » ఉద్యోగి దుష్ప్రవర్తన కారణంగా సంస్థ తొలగించినప్పుడు గ్రాట్యుటీ ఇవ్వక్కర్లేదు. » ఉద్యోగి మరణించిన సందర్భాల్లో నామినీ లేదా వారసులకు గ్రాట్యుటీ చెల్లిస్తారు. » సంస్థలు దివాలా తీసినప్పటికీ గ్రాట్యుటీ చెల్లించాల్సిన బాధ్యత వాటిపై ఉంటుంది. » నోటీస్ పీరియడ్ కూడా గ్రాట్యుటీ లెక్కింపు పరిధిలోకి వస్తుంది. » మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే గ్రాట్యుటీకి అర్హత కల్పించాలన్న డిమాండ్ కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. -
హామీలపై సమాచారం.. ఓటర్ల హక్కు: సీఈసీ
చెన్నై: ఎన్నికల సమయంలో రాజకీయ పారీ్టలు ఇచ్చే హామీలు ఆచరణ సాధ్యమేనా? అనేది తెలుసుకొనే హక్కు ఓటర్లకు ఉందని ముఖ్య ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. అయితే, ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని గుర్తుచేశారు. మేనిఫెస్టోలో హామీలను పొందుపర్చే హక్కు రాజకీయ పారీ్టలకు ఉన్నట్లే.. ఆయా హామీల్లో నిజమెంత? వాటిని అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి ఎలా సేకరిస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లు ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై న్యాయస్థానం విచారణ కొనసాగిస్తోందని వెల్లడించారు. రాజీవ్ కుమార్ శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలు, వాటిని అమలు చేసే విధానం, నిధుల సేకరణ మార్గాలను రాజకీయ పారీ్టలు తప్పనిసరిగా వెల్లడించేలా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఒక ‘ప్రొఫార్మా’ సిద్ధం చేశామని తెలిపారు. -
జార్ఖండ్లో 50 ఏళ్లకే పెన్షన్
రాంచీ: పెన్షన్ల మంజూరు విషయంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనులు, దళితులకు పెన్షన్ అర్హత వయసును 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించింది. 50 ఏళ్ల వయసు రాగానే పెన్షన్ ప్రయోజనాలు అందుకోవచ్చని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రంలో జేఎంఎం కూటమి ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనులు, దళితుల్లో మరణాల రేటు అధికంగా ఉందని, 60 ఏళ్లు దాటాక వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడం లేదన్నారు. గిరిజనులు, -
6 గ్యారంటీలకు తెల్ల కార్డే కీలకం
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీల కింద లబ్ధి దారుల ఎంపికకు అర్హతగా తెల్లరేషన్కార్డును ప్రామాణికం(థంబ్రూల్)గా పెట్టుకుంది. ‘ప్రజాపాలన’పేరుతో కార్యక్రమం నిర్వహించి ప్రజల గుమ్మం దగ్గరే గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర కేబినెట్ మంత్రులతో కలిసి ఆదివారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను 28వ తేదీకి ముందే స్థానిక అధికారులు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. తక్కువ సమయం ఉందని, రద్దీ ఎక్కువగా ఉందని, దరఖాస్తు ఇవ్వలేదని ఆందోళన అక్కర్లేదన్నారు. అందరి దరఖాస్తులను ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. వన్సైడ్ బ్యాటింగ్ చేయం.. సలహాలు స్వేచ్ఛగా ఇవ్వండి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో అన్న అంశంపై వారి ఆలోచనలు, అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం తరహాలో వన్సైడ్ బ్యాటింగ్ చేయమని, ఏదైనా ఇబ్బందులు, సలహాలుంటే స్వేచ్ఛగా తెలియజేయాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరినట్టు చెప్పారు. ]అధికారులు కూడా మంచి సలహాలు ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు ఐపీఎస్. ఐఏఎస్ అధికారులే అని స్పష్టం చేశామన్నారు. విద్య వైద్యం, ఇతర రంగాల్లో ప్రభుత్వ ఆలోచనలను, విధానాలను వారికి వివరించామన్నారు. చాలా సౌకర్యవంతంగా అధికారులు ఫీల్ అయ్యారని, ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అర్థం చేసుకున్నారన్నారు. వ్యక్తులు, వ్యవస్థల పట్ల కక్షపూరితంగా వ్యవహరించమని, తప్పు చేస్తే ఎంత పెద్ద వారినైనా ఊపేక్షించేది ఉండదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కబ్జా చేసిన భూములను ప్రజలకు పంచిపెడతాం ధరణి పోర్టల్ను అడ్డంపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు, తొత్తులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, ఇంకా కొన్ని భూములకు సంబంధించిన ఫైల్స్ సర్క్యులేషన్లో ఉన్నాయని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ధరణిలో ఒకటే కాలమ్ ఇచ్చారని, ఒక సారి కలెక్టర్/ సీసీఎల్ఏ లాగిన్ అయితే పోర్టల్లో ఐటం కనబడదన్నారు. ’’ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించడంతో పాటు గత ప్రభుత్వం కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచిపెడ్తాం. ధరణిలో తప్పులను సరిదిద్ది సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఆరు గ్యారంటీలతో పాటు ధరణిపై కసరత్తు ప్రారంభించాం.. స్పష్టత వచ్చాక ప్రక్షాళన చేస్తాం. అన్ని ఆధారాలతో ఒక రోజు ధరణిపై మీడియా ముందుకు వస్తాం’’అని పొంగులేటి ప్రకటించారు. -
టీచర్లకూ మూడేళ్లలో టెట్ అర్హత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై విద్యాశాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత సాధించి ఉండాలన్న నిబంధనపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి కోర్టు గడువు ఇస్తూ, పదోన్నతుల ప్రక్రియపై స్టే విధించింది. ఇప్పటికే మొదలైన పదోన్నతుల ప్రక్రియ కోర్టు ఉత్తర్వుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. 2011 ముందు టెట్ అర్హత లేకుండా ఉపాధ్యాయులను ఇతర పరీక్షల ద్వారా నియమించారు. అలాంటప్పుడు టెట్ ఉత్తీర్ణత ఉండాలనే వాదన సరికాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2011కు ముందున్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2017లో టీచర్లుగా చేరిన వారు ఈ అంశంపై కోర్టులో సవాల్ చేశారు. తమిళనాడు కోర్టు కూడా టెట్ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో టీచర్ల పదోన్నతి అంశానికి టెట్ ముడిపడి ఉంది. అంతర్గత టెట్ నిర్వహణ రాష్ట్రంలో దాదాపు 1.03 లక్షల మంది టీచర్లున్నారు. వీరిలో 2017 తర్వాత నియమితులైన వారికే టెట్ అర్హత ఉంది. ఈ లెక్కన టెట్ అర్హత ఉన్నవాళ్లు 10 వేలకు మించి ఉండే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో టీచర్ల సంఘాలతో అధికారులు సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారం దిశగా అడుగులేయాలని నిర్ణయించారు. మూడేళ్లలో ఉపాధ్యాయులంతా టెట్ అర్హత పొందేలా ప్రభుత్వపరంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. టీచర్లకు అంతర్గతంగా పరీక్షలు నిర్వహించి, టెట్ అర్హత పొందేలా చూడాలనే యోచనలో ఉన్నారు. ఇదే అంశాన్ని కోర్టుకూ విన్నవించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిపై త్వర లో ఉన్నతస్థాయి సమావేశం జరిగే వీలుందని, అందులో నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. -
డిజిటల్ లోన్ గురించి తెలుసా? ఈ డాక్యుమెంట్లుంటే సులువుగా రుణం!
పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల చుట్టూ తిరగాలి. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే అధికారులు ఆమోదించి లోన్ మంజూరు చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. కానీ అలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో ఆన్లైన్లో పర్సనల్ లోన్ పొందవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.. డిజిటల్ ప్లాట్ఫామ్లో లేదా యాప్లో లభించే వ్యక్తిగత రుణాన్ని డిజిటల్ లోన్ అంటారు. దీన్నే ఆన్లైన్ పర్సనల్ లోన్ అని కూడా పిలుస్తారు. సాధారణ పర్సనల్ లోన్తో పోలిస్తే డిజిటల్ లోన్ చాలా తక్కువ సమయంలో మంజూరవుతుంది. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ విజయవంతం అయినప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అందువల్ల సరైన డాక్యుమెంటేషన్ ఇక్కడ కీలకం. బ్యాంకు ఉద్యోగాలు చేదయ్యాయా? అలా చేరుతున్నారు.. ఇలా మానేస్తున్నారు! అర్హత సాధారణ పర్సనల్ లోన్ పొందడానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్ పర్సనల్ లోన్కి కూడా అర్హులు. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, కనీస ఆదాయం లేదా టర్నోవర్ కలిగిన స్వయం ఉపాధి పొందుతున్నవారు ఈ లోన్ పొందవచ్చు. ఆన్లైన్ పర్సనల్ లోన్కు అర్హత దరఖాస్తుదారు క్రెడిట్ స్కోర్పై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ అందుబాటులో లేనప్పుడు ఆ వ్యక్తి సమర్పించే అదనపు డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతోపాటు కొన్ని సందర్భాల్లో దరఖాస్తుదారుల వయస్సు, ఉపాధి, వృత్తిపరమైన అనుభవం వంటి సమాచారం కూడా అవసరమవుతుంది. డాక్యుమెంట్లు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచడం వలన అనవసరమైన జాప్యాలు, తిరస్కరణలు, అభ్యర్థనలు లేకుండా లోన్ అప్రూవల్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. డిజిటల్ లోన్ దరఖాస్తు ప్రక్రియ సాఫీగా జరగడానికి అవసరమైన కొన్ని డాక్యుమెంట్లు ఏవో ఇక్కడ ఇస్తున్నాం.. ఐడెంటిటీ ప్రూఫ్ లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, రుణగ్రహీతలు తమ గుర్తింపును నిర్ధారించేందుకు చెల్లుబాటు అయ్యే ఐడెంటిటీ ప్రూఫ్ను అందించాలి. వీటిలో ముఖ్యమైనవి పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్. అడ్రెస్ ప్రూఫ్ లోన్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి ఐడెంటిటీ ప్రూఫ్తో పాటు చెల్లుబాటు అయ్యే అడ్రెస్ ప్రూఫ్ కూడా అవసరం. పాస్పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటివి కొన్ని చెల్లుబాటు అయ్యే అడ్రెస్ ప్రూఫ్లు. ఇన్కమ్ ప్రూఫ్ రుణగ్రహీతలు తమ ఆదాయాన్ని చూపించే ఏదైనా డాక్యుమెంట్ను కలిగి ఉండాలి. ఇందు కోసం లేటెస్ట్ శాలరీ స్లిప్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ వంటివి సమర్పించవచ్చు. ఈ డాక్యుమెంట్లు దరఖాస్తుదారు ఆర్థిక స్థిరత్వాన్ని, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ధ్రువీకరిస్తాయి. సంతకం ప్రూఫ్ దరఖాస్తుదారు, రుణ సంస్థ మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని రూపొందించడానికి ఈ-సైన్ అని పిలిచే డిజిటల్ సంతకం అవసరం. ఇది పరస్పర అంగీకారం, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. -
లక్షల్లో ఉత్తీర్ణులు.. వేలల్లో పోస్టులు, ఇదేం తీరు సర్కారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టెట్లో అర్హత సాధించినవారు 4,19,030 మంది ఉన్నారు. అయితే విద్యాశాఖలో ఉపాధ్యాయ ఖాళీలు కేవలం 22 వేల వరకే ఉన్నాయి. లక్షల్లో ఉత్తీర్ణులు అయ్యి ఉంటే వేలల్లో పోస్టులు భర్తీ చేస్తే ప్రయోజనం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో టెట్, డీఎస్సీ ఒకేసారి నిర్వహించేవారు. దీంతో కొంతమంది టీచర్ ఉద్యోగాలు పొందేవారు. వాస్తవానికి 2022లో భారీ నోటిఫికేషన్లు వస్తాయని ప్రభుత్వం ఆశలు కల్పించింది. దీంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నవారు కూడా ఉద్యోగాలు మానేసి టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) కోసం సన్నద్ధమయ్యారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రానేరాలేదు. ఈ నేపథ్యంలో యువతలో నెలకొన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకునే టెట్ను ముందుకు తెచ్చారనే విమర్శలొస్తున్నాయి. కోర్టు స్టేతో ఆగిన పదోన్నతుల ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లు, స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతి కల్పిస్తే దాదాపు 12 వేల పోస్టులు ఖాళీ అవుతాయి. ఉద్యోగ విరమణ వల్ల ఖాళీ అయిన పోస్టులు, కొత్తవి కలుపుకుంటే 22 వేల వరకూ ఉంటాయని అంచనా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. అయితే ఇది పూర్తవ్వకుండానే కోర్టు స్టేతో ఆగిపోయింది. కనీసం పదోన్నతులు అయినా ఇవ్వొచ్చని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. పదోన్నతులు, బదిలీలు చేపడితే తప్ప ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ సాధ్యం కాదని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించినా, అనేక మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఎన్నికల వేళ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాకపోతే తమ కలలు కల్లలుగానే మిగిలిపోతాయని నిరుద్యోగులు అంటున్నారు. టీఆర్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి టెట్ నిర్వహణను స్వాగతించాల్సిందే. ఇదే క్రమంలో ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోతే టెట్ ఉత్తీర్ణులైనా ప్రయోజనం ఏముంటుంది. టీచర్ పోస్టుల భర్తీపై గతంలో సీఎం అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచ్చేలోగా టీఆర్టీపై దృష్టి పెడితే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. టీచర్ పోస్టుల కోసం 4 లక్షల మంది ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం తెలుసుకోవాలి. – రావుల రామ్మోహన్ రెడ్డి (తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
చెప్పులే ధరించాలి
సాక్షి, హైదరాబాద్: పరీక్షలకు హాజరయ్యేవారికి గురుకుల బోర్డు 28 రకాల నిబంధనలు విధించింది. ప్రధానంగా ఎగ్జామ్హాల్లోకి వచ్చే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే వేసుకొని రావాలని, బూట్లు ధరించిన అభ్యర్థులకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 23వ తేదీ వరకు వరుసగా(సెలవులు మినహా) పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను ఇప్పటికే తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్ఈఐఆర్బీ) విడుదల చేసింది. ఇప్పటివరకు 88 శాతం మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా, పరీక్ష సమయానికి గంటముందు వరకు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు టీఆర్ఈఐఆర్బీ కల్పించింది. ముందస్తుగా హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకుని నిబంధనలు పాటించాలని, పరీక్ష కేంద్రాలను ముందస్తుగా పరిశీలించుకుంటే ఇబ్బందులు ఉండవని గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్యబట్టు తెలిపారు. అర్హత పరీక్షలు రోజుకు మూడు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 8.30 గంటల నుంచి 10.30 వరకు మొదటి సెషన్, రెండోసెషన్ మధ్యాహ్నం 12.30గంటల నుంచి 2.30గంటల వరకు, మూడోసెషన్ సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఉంటుంది. పరీక్ష సమయంకంటే గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను లోపలికి అనుమతిస్తారు. పరీక్ష సమయం 15 నిమిషాల వరకు మాత్రమే గేట్లు తెరిచి ఉంచుతారు. ఆ తర్వాత గేట్లు మూసివేస్తారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రంలోకి అనుమతించరు. అధికారుల పరిశీలనలో సంతృప్తి చెందితేనే లోనికి పంపిస్తారు. అభ్యర్థులు తమ వెంట ఏదేని ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపుకార్డు (పాస్పోర్టు, ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్) వెంట తీసుకెళ్లాలి. ఎగ్జామ్హాల్లోకి వెళ్లిన తర్వాత అభ్యర్థి బయోమెట్రిక్ సమాచారం సేకరిస్తారు. ప్రతి పరీక్ష 120 నిమిషాల పాటు నిర్వహిస్తారు. నిర్దేశించిన గడువు తర్వాతే అభ్యర్థిని బయటకు పంపిస్తారు. ప్రతి అభ్యర్థి హాల్టికెట్ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. హాల్టికెట్లో సాంకేతిక కారణాలతో ఫొటో ముద్రితం కాకుంటే ఒరిజినల్ ఫొటో అతికించి నిబంధనలకు అనుగుణంగా గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి హాజరుకావాలి. బోర్డు కార్యాలయం వద్ద అభ్యర్థుల ఆందోళన పరీక్ష కేంద్రాల కేటాయింపు గందరగోళంగా జరిగిందంటూ కొందరు అభ్యర్థులు సోమవారం ఉదయం దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్లో ఆందోళనకు దిగారు. దాదాపు 50 మంది అభ్యర్థులు బోర్డు కార్యాలయ ఆవరణకు చేరుకుని అధికారులను నిలదీశారు. ఒక్కో పరీక్షకు ఒక్కోచోట కేంద్రం కేటాయించడం, సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో ప్రయాణించడం కత్తిమీద సాముగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు ప్రశాంతంగా ఎలా రాయగలమని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాల కేటాయింపులో అధికారులు, ఉద్యోగుల ప్రమేయం ఏమీ లేదని, అభ్యర్థులకు సర్దిచెప్పి పంపించారు. -
నీట్ కనీస వయో పరిమితిపై జోక్యం చేసుకోలేం
సాక్షి, అమరావతి : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు హాజరయ్యేందుకు కనీస వయో పరిమితి 17 సంవత్సరాలుగా నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈ విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమంది. కనీస వయస్సును 17 సంత్సరాలుగా నిర్ణయించడం సమానత్వపు హక్కును హరించినట్లు కాదని స్పష్టంచేసింది. ఇదే అంశంపై జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ ఉమ్మడి హైకోర్టు గతంలోనే తీర్పునిచ్చిందని, ఓసారి తేలిన అంశంలో మరోసారి జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.నీట్కు కనీస వయోపరిమితి నిబంధనను కొట్టేయాలంటూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఓ మైనర్ విద్యార్థిని తండ్రి నాగ మునుస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అనూప్ కౌషిక్ వాదనలు వినిపిస్తూ, ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వ, వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందని అన్నారు. పిటిషనర్ కుమార్తెకు నీట్ అర్హత వయస్సుకు నాలుగు రోజులు తక్కువ ఉందన్నారు. పరీక్షకు అనుమతించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్, జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తరపున న్యాయవాది ఎస్.వివేక్ చంద్రశేఖర్లు వాదనలు వినిపిస్తూ.. ఇదే అంశంపై గతంలో దాఖలైన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం ఇదే అంశంపై తీర్పునిచ్చినప్పుడు దానికి విరుద్ధంగా స్పందించలేమంది. పరీక్ష రాసేందుకు నాలుగు రోజులు తక్కువైనా, ఒక్క రోజు తగ్గినా కూడా తాము ఏమీ చేయలేమని స్పష్టం చేసింది. -
అధిక పెన్షన్పై ఈపీఎఫ్ఓ సర్క్యులర్
న్యూఢిల్లీ: అధిక పెన్షన్ అర్హతకు సంబంధించి అలాగే ఇందుకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2022 నవంబర్ 4వ తేదీ జారీ చేసిన సూచనలకు అనుగుణంగా ఈ సరŠుయ్యలర్ జారీ అయ్యింది. వాస్తవ వేతనాలపై రూ.5,000 లేదా నెలకు రూ. 6,500 కంటే ఎక్కువ విరాళం అందించిన లేదా అధిక పెన్షన్ కోసం ఆప్షన్ను వినియోగించుకున్న లేదా 2014లో ఈపీఎస్–95కి సవరణకు ముందు అధిక పెన్షన్ కోసం చేసిన అభ్యర్థనను ఈపీఎఫ్ఓ పంí³, తిరస్కరణకు గురయిన వారు ఇందుకు అర్హులని నోటిఫికేషన్ వివరించింది. కమీషనర్ సూచించిన దరఖాస్తు ఫారమ్లో అలాగే జాయింట్ డిక్లరేషన్సహా అన్ని ఇతర అవసరమైన పత్రాలలో అర్హత కలిగిన చందాదారులు తమ సంస్థతో సంయుక్తంగా ఈ ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
న్యూజిలాండ్లో 16 ఏళ్లకే ఓటు హక్కు
వెల్లింగ్టన్: ఓటు హక్కు అర్హతను 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశ పెడతామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ చెప్పారు. దేశ సుప్రీంకోర్టు కూడా 16 ఏళ్ల వారికి ఓటు హక్కు కల్పించడంపై సానుకూలంగా స్పందించడంతో సోమవారం ఆమె ఈ ప్రకటన చేశారు. రాబోయే నెలల్లో ఈ బిల్లుపై పార్లమెంట్లో చర్చిస్తామన్నారు. రాజ్యాంగం ప్రకారం ఇలాంటి వాటిపై పార్లమెంట్లోని 75% మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే, రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తుండటంతో ‘16 ఏళ్లకే ఓటు’ ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశాల్లేవు. కాగా, 16 ఏళ్ల వారికీ ఓటు హక్కు కల్పించిన దేశాల్లో ఆస్ట్రియా, మాల్టా, బ్రెజిల్, క్యూబా, ఈక్వెడార్ ఉన్నాయి. -
జగనన్న విదేశీ విద్యా దీవెనకు 392 దరఖాస్తులు
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు పెద్ద చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన కోసం 392 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఈ పథకంలో దరఖాస్తులకు సెప్టెంబర్ 30 వరకు ఇచ్చిన గడువు శుక్రవారం ముగిసింది. ప్రభుత్వ ఆర్థికసాయంతో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన ఈ పథకం రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలు (ఈబీసీ), బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వర్తిస్తుంది. వచ్చిన దరఖాస్తులు, వాటికి జతచేసిన ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించిన తరువాత ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. జగనన్న విదేశీ విద్యాదీవెనను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటుగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారందరికీ వర్తింపజేయడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్ ర్యాంకులు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఇది మేలు చేస్తుంది. ఒకటి నుంచి వంద క్యూఎస్ ర్యాంకింగ్ కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న వారికి ఫీజు రూ.కోటి అయినా నూరుశాతం ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుంది. 101 నుంచి 200 క్యూఎస్ ర్యాంకులున్న యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే రూ.50 లక్షల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుంది. ఈ పథకానికి వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షల వరకు పెంచడం విశేషం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత ఉన్న ఎంతమందికైనా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు కె.హర్షవర్ధన్ తెలిపారు. (క్లిక్ చేయండి: ట్రిపుల్ ఐటీ సీట్లలో అగ్రభాగంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా) -
సకల సౌకర్యాలతో లేఅవుట్లు.. తక్కువ ధరకే ఉద్యోగులు, మధ్యతరగతి వారికి ప్లాట్లు
సొంతిల్లు...ప్రతి ఒక్కరి కల. నిరుపేదలకు ప్రభుత్వమే ఉచితంగా ఇంటిస్థలం ఇస్తోంది. అర్హత ఆధారంగా ఇల్లు కూడా కట్టిస్తోంది. కానీ ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు ఆ అవకాశం లేదు. వీరంతా దాదాపు పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. సమీపంలో స్థలం కొందామంటే..ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పైగా అనుమతుల తిరకాసులెన్నో...ఇలాంటి వారికీ ప్రభుత్వం అండగా నిలిచింది. ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’ పేరుతో సకల సౌకర్యాలు, అన్ని అనుమతులతో కూడిన స్థలాన్ని అతితక్కువ ధరకే అందిస్తోంది. హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా): మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ (ఎంఐజీ) పేరుతో లేఅవుట్ల రూపొందించి తక్కువ మొత్తానికే పట్టణ పరిధిలో ఇంటి స్థలాలను అందిస్తోంది. న్యాయపర సమస్యలు లేకుండా క్లియర్ టైటిల్తో లాభాపేక్ష లేకుండా చర్యలు తీసుకుంటోంది. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్’ పేరిట పట్టణ సమీప ప్రాంతాల్లోనే వందల ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో లేఅవుట్లు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో రెండు ప్రాంతాల్లో.. జిల్లాలోని ధర్మవరం, హిందూపురం నియోజకవర్గాల్లో ఎంఐజీ లేఅవుట్లు సిద్ధం చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గం కుణుతూరులో ఇప్పటికే ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయ. మౌలిక వసతుల కల్పన పనులు ముమ్మరమయ్యాయి. సదుపాయాలు ఇలా.. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లేఅవుట్లన్నీ ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా రిజిష్టర్ అయి ఉంటాయి. లేఅవుట్లో 60 అడుగుల బీటీ రోడ్డు, 40 అడుగుల సిమెంట్ కాంక్రీట్ రోడ్డు, ఫుట్పాత్లు, ఈఎల్ఎస్ఆర్లతో నీటి సరఫరా, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, భూగర్భ మురుగు కాల్వలు, వీధి దీపాలు ఉంటాయి. అలాగే వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలతో పాటు ఆహ్లాదం పంచేలా పార్కులు అభివృద్ధి చేస్తారు. ఇతర అన్ని రకాల సదుపాయలూ కల్పిస్తారు. అర్హతలు ఇలా.. ఎంఐజీ లేఅవుట్లలో ఒక కుటుంబానికి ఒక ప్లాటు మాత్రమే కేటాయిస్తారు. సంవత్సర ఆదాయం రూ. 18 లక్షల్లోపు ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్లు నిండి ఉండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ఆధార్ కార్డు ద్వారా మాత్రమే దరఖాస్తు నమోదు సాధ్యమవుతుంది. ఆసక్తి కలిగిన వారు migapdtcp.ap.gov.in వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసి ప్లాటు కేటగిరీ మొత్తం విలువలో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. లేఅవుట్లలో విక్రయాల అనంతరం పారదర్శకంగా లాటరీ పద్ధతిలో దరఖాస్తుదారులకు ప్లాటు నంబర్లు కేటాయిస్తారు. ఆ తర్వాత నిర్ణీత సమయంలో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్లాటు కేటాయింపు రద్దు చేసి, అర్హత కలిగిన ఇతరులకు కేటాయిస్తారు. అగ్రిమెంట్ చేసుకున్న తేదీ నుంచి దరఖాస్తుదారులు నెలలోపు ప్లాటు మొత్తంలో 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. వందశాతం చెల్లిస్తే 5 శాతం రాయితీ కూడా ఇస్తారు. ఉద్యోగులకు 20 శాతం రాయితీ.. ప్రభుత్వ ఉద్యోగులకు మరికొంత లబ్ధి చేకూరే విధంగా లేవుట్ మొత్తం ప్లాట్లలో పదిశాతం రిజర్వు చేశారు. అంతేకాకుండా లేఅవుట్ ఏర్పాటు చేసిన నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితీ కూడా ఇస్తున్నారు. ఇంటి స్థలం కావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఫాం–16 సమర్పించాల్సి ఉంటుంది. ► హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం కోడూరు గ్రామ సమీపంలో బెంగళూరు 44 జాతీయ రహదారి పక్కనే 774, 775 సర్వే నంబర్లలో 7 ఎకరాల్లో 98 ప్లాట్లతో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ లేఅవుట్లో సెంటు రూ.3.63 లక్షలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఈ లేవుట్లో వివిధ అభివృద్ధి పనుల కోసం పబ్లిక్ హెల్త్ ఎస్ఈ టెండర్లు ఆహ్వానించారు. ► ధర్మవరం నియోజకవర్గంలో కుణుతూరు సర్వే నంబర్లు 498,499, 628 నుంచి 642 వరకు 120 ఎకరాల్లో 1,272 ప్లాట్లతో అతిపెద్ద జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఏర్పాటు చేశారు. 2021 నవంబర్ 21న రూ.106.00 కోట్లతో పనులు ప్రారంభించారు. ఈ లేఅవుట్లో సెంటు ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే ప్లాట్లు విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్ని అనుమతులతో లేఅవుట్లు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లేఅవుట్ల పథకం వల్ల మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కొంత రాయితీ కూడా ఉంటుంది. అన్ని మౌలిక వసతులతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా, వివాదాలు లేని లేఅవుట్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. 150/200/240 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు రూ. 3 లక్షల నుంచి రూ.18 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారందరూ అర్హులు. ఆసక్తి గల వారు సచివాలయం, లేదా మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో సంప్రదించవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తుచేసుకోవచ్చు. – డాక్టర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్, హిందూపురం అన్ని సదుపాయాలతో అభివృద్ధి ఎంఐజీ లేఅవుట్లలో అన్ని సదుపాయాలు కల్పించి ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుంది. నిజంగా ఇది మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు మంచి అవకాశం. కొడికొండ వద్ద, హైవే పక్కనే లేఅవుట్ సిద్ధం అవుతోంది. హిందూపురం ప్రాంత ప్రజలకు చక్కటి అవకాశం. త్వరలోనే మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభమవుతున్నాయి. ధర్మవరం కుణుతూరు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వరలోనే అది పూర్తవుతుంది. – ఈశ్వరయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అహుడా.అనంతపురం. -
వైఎస్సార్ వాహన మిత్ర.. కొత్తవారికీ అవకాశం
సాక్షి, అమరావతి : ‘వైఎస్సార్ వాహనమిత్ర పథకం–2022–23’ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 13న ఆర్థిక సహాయం అందించనుంది. దీనికింద అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ఏటా రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా.. ఈ ఏడాదికిగాను అర్హుల నుంచి రవాణా శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 7లోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని రవాణా శాఖ కమిషనర్ పి.రాజాబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్నవారితోపాటు కొత్తగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కొనుగోలు చేసిన డ్రైవర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఇలా.. ► ఈ పథకం కింద ఇప్పటికే లబ్ధిదారులుగా ఉన్నవారు తమ వాహనం వద్ద ఫొటోను గ్రామ, వార్డు సచివాలయంలో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ► కొత్తగా వాహనం కొనుగోలు చేసిన డ్రైవర్లు తమ ఆధార్కార్డు, తెల్ల రేషన్ కార్డు, భూమి వివరాలు, ఆదాయ పన్ను, ఇంటి విద్యుత్ వినియోగం, కులం, ఇతర వివరాలకు సంబంధించిన అర్హత పత్రాలతో దరఖాస్తు చేయాలి. ► గత ఆరు నెలల్లో సగటున నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించిన వారు ఈ పథకానికి అనర్హులు. ఒకవేళ ఒకటికంటే ఎక్కువ ఇళ్లకు కలిపి ఒకే మీటరుంటే ఇళ్ల సంఖ్యను బట్టి ఒక ఇంటికి సగటు విద్యుత్ వినియోగాన్ని లెక్కిస్తారు. ► వచ్చిన దరఖాస్తులను ఆరు అంచెల్లో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ► అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఎంపీడీవో/మునిసిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ఈ నెల 9లోగా ఆమోదిస్తారు. ► 10న ఆ దరఖాస్తులను కలెక్టర్లు ఆమోదించిన తరువాత 11, 12 తేదీల్లో సీఎఫ్ఎస్ఎస్ ద్వారా సంబంధిత కార్పొరేషన్లకు పంపిస్తారు. ► ఇక అర్హులైనప్పటికీ జాబితాలో పేరు లేకపోతే ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ► వారి ఫిర్యాదులను పరిశీలించి అర్హులుగా నిర్ధారణ అయితే వారికి కూడా వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తారు. (క్లిక్: అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభం) -
సెబీలో గ్రేడ్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలు.. త్వరపడండి!
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ).. వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్ ఏ(అసిస్టెంట్ మేనేజర్లు) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 120 ► పోస్టుల వివరాలు: జనరల్–80, లీగల్–16, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)–14, రీసెర్చ్–07, అఫీషియల్ లాంగ్వేజ్–03. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 31.12.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: మూడు దశల్లో జరుగుతుంది. మొదటిగా ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఫేజ్ 1 స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. దీనిలో ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపికచేస్తారు. ఫేజ్ 2లో సాధించిన స్కోర్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.01.2022 ► వెబ్సైట్: sebi.gov.in -
డీఎస్ఎస్ఎస్బీ, న్యూఢిల్లీలో 691 పోస్టులు
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(ఎన్సీటీ ఢిల్లీ) ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(డీఎస్ఎస్ఎస్బీ).. జూనియర్ ఇంజనీర్/సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 69 ► పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)/సెక్షన్ ఆఫీసర్(ఎలక్ట్రికల్)–116, జూనియర్ ఇంజనీర్(సివిల్)/సెక్షన్ ఆఫీసర్(సివిల్)–575. ► జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)/సెక్షన్ ఆఫీసర్(ఎలక్ట్రికల్): అర్హత: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు రూ.9300 నుంచి 34,800+గ్రేడ్ పే 4200 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► జూనియర్ ఇంజనీర్(సివిల్)/సెక్షన్ ఆఫీసర్(సివిల్): అర్హత: సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు రూ.9300 నుంచి రూ.34,800+గ్రేడ్ పే 4200 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష(టైర్1, టైర్2) ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 10.01.2022 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.02.2022 ► వెబ్సైట్: dsssbonline.nic.in -
ఏపీపీఎస్సీ గెజిటెడ్ ఉద్యోగాలు.. ఆన్లైన్లో అప్లై చేయండి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)... వివిధ విభాగాల్లో గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 25 ► పోస్టుల వివరాలు: ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్(ఏపీ ఫిషరీస్ సర్వీస్)–11, సెరీకల్చర్ ఆఫీసర్(ఏపీ సెరీకల్చర్ సర్వీస్)–01, అగ్రికల్చర్ ఆఫీసర్(ఏపీ అగ్రికల్చర్ సర్వీస్)–06, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(ఏపీ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్)–02, టెక్నికల్ అసిస్టెంట్(ఏపీ పోలీస్ సర్వీస్)–01, అసిస్టెంట్ కమిషనర్(ఏపీ ఎండోమెంట్స్ సర్వీస్)–03, అసిస్టెంట్ డైరెక్టర్(ఏపీ హార్టికల్చర్ సర్వీస్)–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ► వయసు: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు 21–28 ఏళ్లు, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు 28–42 ఏళ్లు, మిగతా పోస్టులకు 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.29,760 నుంచి రూ.93,780 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రారంభ తేది: 08.12.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 28.12.2021 ► వెబ్సైట్: https://psc.ap.gov.in -
బీహెచ్ఈఎల్లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్).. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 10 ► విభాగాలు: హైడ్రోజన్ ఎకనామిక్స్, ఆడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్, అప్స్ట్రీమ్ సోలార్ వాల్యూ చైన్, ఎనర్జీ స్టోరేజ్, కోల్ టూ మిథనాల్, కార్బన్ క్యాప్చర్. ► అర్హత: మేనేజ్మెంట్లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పని అనుభవం ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వయసు: 01.11.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు. ► వేతనం: నెలకు రూ.80,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: సెలక్షన్ బోర్డ్ ద్వారా అభ్యర్థుల్ని స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ ద్వారా షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థుల్ని ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021 ► వెబ్సైట్: www.bhel.com -
ఫెడరల్ బ్యాంక్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రాం
ముంబై: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ త్వరలో ప్రారంభించే ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో చేరేందుకు అర్హత గల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఫెడరల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం (ఎఫ్ఐపీ) పేరిట నిర్వహించే ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్లుగా ఉంటుంది. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ (ఎంఏజీఈ)తో కలిసి ఈ కోర్సును అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. కోర్సు పూర్తయిన తర్వాత మణిపాల్ అకాడెమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సర్టిఫికెట్ అందుకోవచ్చని ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. అంతేకాదు ప్రొబేషనరీ ఆఫీసర్గా ఫెడరల్ బ్యాంక్లోనే అవకాశాలు దక్కవచ్చు కూడా. ఈ ప్రోగ్రాంలో చేరే అభ్యర్థులు ఏటా రూ. 5.70 లక్షల దాకా ఆర్జించే అవకాశాలు ఉంటాయని పేర్కొంది. దరఖాస్తు చేసుకోవాలంటే.. ► ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు ► పదో తరగతి, ఇంటర్(ఫ్లస్ టూ), గ్రాడ్యుయేషన్.. ఏదైనా సరే 60 శాతం మార్కులకు పైబడి ఉండాలి ► 2021 అక్టోబర్ 1 నాటికి అభ్యర్థి వయస్సు 27 సంవత్సరాలకు మించకూడదు. ► దరఖాస్తు సమర్పించడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 23 ►నవంబర్ 11న ఆన్లైన్లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి కింద లింక్ను క్లిక్ చేయండి.. https://www.federalbank.co.in/federal-internship-program -
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్.. అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: అసిస్టెంట్ ఇంజనీర్స్ ► మొత్తం పోస్టుల సంఖ్య: 190 ► విభాగాలు: సివిల్, ఈఎన్వీ, మెకానికల్. ► సర్వీస్లు: ఏపీ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్, పీహెచ్ అండ్ ఎంఈ సబార్డినేట్ సర్వీస్, ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ పంచాయతీరాజ్ అండ్ డెవలప్మెంట్ సబార్డినేట్ సర్వీస్లు, ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ వాటర్ రిసోర్సెస్ సబార్డినేట్ సర్వీస్. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ /బీటెక్, ఎల్సీఈ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు:01.07.2021 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. దీన్ని మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 21.10.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.11.2021 ► వెబ్సైట్: https://psc.ap.gov.in -
ఈసీఐఎల్లో టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ.. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 22 ► అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వయసు: 31.08.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి. ► వేతనం: నెలకు రూ.23,000 చెల్లిస్తారు. ► పని ప్రదేశం: న్యూఢిల్లీ ► ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► ఇంటర్వ్యూ తేది: 06.10.2021(అర్హులైన అభ్యర్థులు సంబంధిత విద్యార్హతలు తదితర ధ్రువపత్రాలతో కింద పేర్కొన్న చిరునామాలో ఉదయం పది గంటల నుంచి 12 మధ్య రిపోర్ట్ చేయాలి) ► ఇంటర్వ్యూ వేదిక: ఈసీఐఎల్ జోనల్ ఆఫీస్, డీ–15, డీడీఏ లోకల్ షాపింగ్ కాంప్లెక్స్, ఏ–బ్లాక్, రింగ్ రోడ్, నరైనా, న్యూఢిల్లీ–110028. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ecil.co.in -
రుణ అర్హత పెంచుకోవడానికి మార్గలివే
దేశంలో సగం మంది స్వయం ఉపాధిలో ఉన్న వారే. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ సొంత కాళ్లపై నిలబడ్డవారే ఉంటారు. వీరు రెండు విభాగాలుగా ఉంటారు. ‘సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్’ అంటే ఏదో విభాగంలో నైపుణ్యం ఉన్న వారు. వీరికి ఏదో ఒక విభాగంలో డిగ్రీ లేదా డిప్లోమా ఉంటుంది. మెడికల్ ప్రాక్టీషనర్స్, డెంటిస్ట్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు ఇలాంటి వారిని సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్గా పేర్కొంటారు. ప్రత్యేక నైపుణ్యాల్లేకుండా ఉపాధి ఏర్పాటు చేసుకున్న వారు నాన్ ప్రొఫెషనల్స్ విభాగంలోకి వస్తారు. ప్రధానంగా వీరు హోల్సేల్, రిటైల్ వ్యాపారం, ట్రేడింగ్ తదితర పనుల్లో ఉంటుంటారు. రెండో విభాగం ఎక్కువగా అసంఘటిత రంగం కిందకే వస్తుంది. చిన్న పట్టణాల్లో వీరి ప్రాతినిధ్యం బలంగా ఉంటుంది. చిన్న వ్యాపారస్థుల వృద్ధిని కాంక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన చర్యలు ఎన్నో తీసుకున్నాయి. అయినప్పటికీ సొంత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు రుణం పొందాలంటే నిపుణులు కాని స్వయం ఉపాధిలోని వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి వారు రుణ అర్హతలను పెంచుకునే మార్గాలు చూద్దాం.. రుణానికి అడ్డంకులు.. - నెలవారీ అస్థిర ఆదాయం ఉండడం - క్యాష్ రూపంలో ఆదాయం చూపించే రుజువులు లేకపోవడం - వ్యాపారానికి సంబంధించిన డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో లేకపోవడం. ఉదాహరణకు ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్, వ్యాట్ రిజిస్ట్రేషన్, ఇతర లైసెన్స్లు - రుణ చరిత్ర లేకపోవడం లేదా పరిమితంగా ఉండడం. లేదంటే ప్రతికూల చరిత్ర ఉండడం. - పన్ను రిటర్నుల చరిత్ర లేకపోవడం - కేవైసీకి సంబంధించి అసంపూర్ణ డాక్యుమెంట్లు - ఖాతాల నిర్వహణ సజావుగా లేకపోవడం ఇటువంటివి రుణ అర్హతలకు ప్రతికూలతలుగా భావించాలి. దీంతో రుణాలిచ్చే సంస్థలకు.. రుణ గ్రహీత చరిత్రను సమగ్రంగా తెలుసుకుని, రుణ అర్హతను అంచనా వేయడం కష్టమవుతుంది. రుణాలిచ్చే సంస్థలకు ఈ విభాగం పెద్ద సవాళ్లతో కూడుకున్నదే. దీంతో రుణ పరపతి తెలుసుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దరఖా స్తు ప్రాసెసింగ్ కూడా ఆలస్యమవుతుంది. అంతేకాదు దరఖాస్తు తిరస్కరణకు కూడా గురికావచ్చు. అందుకనే స్వయం ఉపాధిలోని వారు వ్యాపారం, ఆదాయానికి సంబంధించి వీలైనన్ని డాక్యుమెంట్లను సమర్పించడం మంచిది. తద్వారా వేగంగా రుణాలను పొందేందుకు మార్గం సులువవుతుంది. ఇందుకోసం చేయాల్సినవి ఏవిటంటే..? రుణ అర్హతలను పెంచేవి.. - వ్యాపార ఖాతాలను ఎటువంటి తప్పుల్లేకుండా, కచ్చితంగా నిర్వహించాలి. అంతేకాదు ఆయా అకౌంట్లను చార్టర్డ్ అకౌంటెంట్లతో ఆడిట్ కూడా చేయించుకోవాలి. - ఆదాయపన్ను రిటర్నులను సమయానికి కచ్చితంగా దాఖలు చేయాలి. - వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. - వ్యాపారంలో భాగంగా వచ్చే ఇతర ఆదాయానికి రుజువులను కూడా దగ్గర ఉంచుకోవాలి. రుణ దరఖాస్తు అధికారి కోరిన ప్రతీ సమాచారంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలి. దీనివల్ల మీ గురించి, మీ వ్యాపారం గురించి మెరుగ్గా అర్థం చేసుకునేందుకు వీలు పడుతుంది. - మీకు సంబంధించి, మీ వ్యాపారానికి సంబంధించి తీసుకునే ఏ రుణంలో అయినా చెల్లింపుల్లో వైలఫ్యం, జాప్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల క్రెడిట్హిస్టరీపై ప్రభావం పడకుండా ఉంటుంది. చదవండి : బంగారం రుణాల్లోకి షావోమీ ! -
గేట్–2022: ఈ మార్పులు గమనించారా?
గేట్.. గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్! ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ల్లో.. ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్డీ తదితర కోర్సుల్లో.. ప్రవేశానికి తొలి మెట్టు! అంతేకాదు గేట్ స్కోర్తో ప్రభుత్వ రంగ సంస్థల్లో.. కొలువులు సైతం సొంతం చేసుకోవచ్చు. అందుకే.. ప్రతి ఏటా గేట్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. తాజాగా గేట్–2022 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల(ఆగస్టు) 30న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. గేట్–2022లో మార్పులు.. పరీక్ష విధానం.. ప్రిపరేషన్పై ప్రత్యేక కథనం.. గేట్–2022లో పలు మార్పులు జరిగాయి. ముఖ్యంగా కొత్తగా రెండు పేపర్లను చేర్చారు. అవి..నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్; జియోమాటిక్స్ ఇంజనీరింగ్. దీంతో గేట్లో మొత్తం సబ్జెక్ట్ పేపర్ల సంఖ్య 29కి చేరింది. వీటిలో ఒకటి లేదా రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. రెండు పేపర్లకు హాజరు విధానాన్ని గేట్–2021 నుంచి కొత్తగా అమల్లోకి తెచ్చారు. అనుమతించిన(రెండు పేపర్ల కాంబినేషన్) జాబి తా నుంచి అభ్యర్థులు తాము రాయాల్సిన పేపర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. రెండు పేపర్లకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు.. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది. అర్హత ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/కామర్స్ /సైన్స్/ఆర్ట్స్ విభాగాల్లో.. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు సైతం దరఖాస్తుకు అర్హులే. దరఖాస్తుకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ఆన్లైన్ పరీక్ష ► గేట్ పరీక్ష ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో 3 గంటల వ్యవధిలో జరుగుతుంది. ► మొత్తం 65 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ► రెండు విభాగాలుగా జరిగే గేట్లో.. పార్ట్–ఏ జనరల్ అప్టిట్యూడ్. ఈ విభాగం 15 మార్కులకు ఉంటుంది. ఇందులో ఒక మార్కు ప్రశ్నలు అయిదు, రెండు మార్కుల ప్రశ్నలు అయిదు ఉంటాయి. ► పార్ట్–బీ అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్పై ఉంటుంది. ఈ విభాగంలో మొత్తం 55 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 25 ప్రశ్నలు ఒక మార్కు, 30 ప్రశ్నలు రెండు మార్కులకు ఉంటాయి. ► పార్ట్–బీలోనే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి 10–15 మార్కులకు ప్రశ్నలుంటాయి. ప్రశ్నలు.. మూడు రకాలు ► గేట్ పరీక్షలో మూడు రకాల ప్రశ్నలను అడుగుతారు. అవి.. మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్(ఎంసీక్యూలు)గా పేర్కొనే ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు. రెండో రకం ప్రశ్నలు.. మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్(ఎంఎస్క్యూ). మూడో విధానంలో న్యూమరికల్ ఆన్సర్ టైప్(ఎన్ఏటీ) ప్రశ్నలు. ► ఎంసీక్యూ ప్రశ్నల విధానంలో.. నాలుగు లేదా అయిదు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ను సరైన సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. ► మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్లో.. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సరైన సమాధానాలుగా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. అభ్యర్థులకు సంబంధిత అంశంపై సమగ్ర అవగాహన ఉండాలి. ► న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు కొంత కాలిక్యులేషన్స్తో కూడినవిగా ఉంటాయి. వీటికి వర్చువల్ కీ ప్యాడ్ ద్వారా సమాధానం టైప్ చేయాల్సి ఉంటుంది. సిలబస్ విశ్లేషణ ముందుగా అభ్యర్థులు గేట్ పరీక్ష విధానంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అందుకోసం తాము ఎంచుకున్న సబ్జెక్ట్కు సంబంధించి సిలబస్ను పరిశీలించాలి. గత ప్రశ్న పత్రాలను విశ్లేషించాలి. గత ప్రశ్న పత్రాల్లో ఆయా టాపిక్స్కు లభిస్తున్న వెయిటేజీని గుర్తించాలి. ఆ తర్వాత గేట్ సిలబస్ను అకడమిక్ సిలబస్తో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. దానికి అనుగుణంగా తమ ప్రిపరేషన్ వ్యూహాలు రూపొందించుకోవాలి. ముఖ్యంగా బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించడం మేలు అంటున్నారు నిపుణలు. వెయిటేజీని అనుసరిస్తూ గేట్–2022 పరీక్ష తేదీలను పరిగణనలోకి తీసుకుంటే.. అభ్యర్థులకు ఆరు నెలలకు పైగా సమయం అందుబాటులో ఉంది. సీరియస్ అభ్యర్థులకు విజయ సాధన దిశగా ఈ సమయం సరిపోతుందనే చెప్పొచ్చు. ఇందుకోసం కొన్ని ముఖ్యమైన వ్యూహాలను అనుసరించాలి. ప్రధానంగా ఆయా సబ్జెక్ట్లలో తమ బలాలు, బలహీనతలపై స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. గత అయిదారేళ్లుగా గేట్లో లభిస్తున్న వెయిటేజీ, అకడమిక్ వెయిటేజీ ప్రాధాన్యాన్ని అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్ పూర్తి చేసుకునేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. బేసిక్స్, అప్లికేషన్ అప్రోచ్ గేట్లో మంచి స్కోర్ సాధించి ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే.. అభ్యర్థులు తాము ఎంచుకున్న సబ్జెక్ట్లో బేసిక్స్పై గట్టి పట్టు సాధించాలి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ టెక్నిక్స్పై అవగాహన పెంచుకోవాలి. ప్రతి టాపిక్ను చదివేటప్పుడు అందులో ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించాలి. వాటికి సంబం«ధించి ప్రాథమిక భావనలపై స్పష్టత తెచ్చుకోవాలి. ఒక టాపిక్ నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో అంచనావేయాలి. ఆ మేరకు సాధన చేయాలి. దీంతో పరీక్షలో ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. దాంతోపాటు వీక్లీ టెస్ట్లు, మాక్ టెస్ట్లు, మోడల్ టెస్ట్లకు హాజరు కావాలి. సమయ పాలన గేట్ విజయంలో సమయ పాలన ఎంతో ముఖ్యం. ప్రస్తుత సమయంలో విద్యార్థులు రోజుకు కనీసం ఐదారు గంటలు గేట్ ప్రిపరేషన్కు కేటాయించేలా ప్లాన్ చేసుకోవాలి.వాస్తవానికి ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు.. ఇది కొంత కష్టమైన విషయమే. అయినా సమయం కేటాయించే ప్రయత్నం చేయాలి. గేట్ పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే ఆన్లైన్ పరీక్ష తీరుపై అవగాహన పెంచుకోవాలి. వర్చువల్ కాలిక్యులేటర్ వినియోగం, ఆన్స్క్రీన్ ఆన్సర్స్ రికగ్నిషన్ వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఇందుకోసం వీలైతే ఆన్లైన్ మోడల్ టెస్ట్లకు హాజరవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష పాత ప్రశ్న పత్రాల సాధన కూడా గేట్లో విజయానికి దోహదపడుతుంది. అకడమిక్స్ ఆలంబనగా గేట్ విద్యార్థులు అకడమిక్ పుస్తకాలను ఆలంబనగా చేసుకుని ముందడుగేయాలి. ఎందుకంటే.. గేట్ గత ప్రశ్నలు, పరీక్ష తీరుతెన్నులను పరిశీలిస్తే.. అకడమిక్ పుస్తకాల నుంచే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్న విషయం స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదైనా ఒక టాపిక్ను చదివేటప్పుడు.. దానికి సంబంధించి పూర్వాపరాలు ఉన్న పుస్తకాలను అధ్యయనం చేయాలి. అంతేకాకుండా ప్రతి అంశానికి సంబంధించి.. మూల భావనలు, కాన్సెప్ట్లు, అప్లికేషన్స్ను క్షుణ్నంగా తెలుసుకోవాలి. మలి దశలో ఇలా గేట్ స్కోర్ అనేది.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి తొలి మెట్టు మాత్రమే. తర్వాత దశలో అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న ఐఐటీలు నిర్వహించే ప్రత్యేక ప్రవేశ ప్రక్రియలోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. ఆయా ఐఐటీలు పర్సనల్ టాస్క్, గ్రూప్ డిస్కషన్స్ పేరిట పరీక్షలను నిర్వహిస్తున్నాయి. కొన్ని ఐఐటీలు.. ఎస్సే రైటింగ్ను కూడా నిర్వహిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికే అడ్మిషన్ ఖరారవుతోంది. పీఎస్యూలు.. మలిదశ గేట్ స్కోర్ ఆధారంగా ఎంట్రీ లెవల్ నియామకాలను చేపడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్యూలు).. మలి దశలో రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్స్ వంటివి నిర్వహిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. గేట్ స్కోర్కు 70 శాతం, మలి దశ ఎంపిక ప్రక్రియకు 30 శాతం వెయిటేజీ లభిస్తోంది. స్కోర్ సాధిస్తేనే గేట్లో విజయం ద్వారా ఐఐటీల్లో సీట్లు, పీఎస్యూ కాల్స్ ఆశించే అభ్యర్థులు... గేట్లో కనీసం 650కు పైగా స్కోర్ సాధించేందుకు కృషి చేయాలి. పలు ఇన్స్టిట్యూట్లు కనీస కటాఫ్ను 600గా నిర్దేశిస్తున్నాయి. తుది ఎంపికలో కోర్ బ్రాంచ్లలో ఫైనల్ కటాఫ్ 800 వరకు ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఈఈఈ, మెకానికల్ వంటి బ్రాంచ్ల విద్యార్థులు.. ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి. గేట్–2022 సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్ 30, 2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 24, 2021 ► గేట్ పేపర్ మార్పు, కేటగిరీ, పరీక్ష కేంద్రం మార్పునకు చివరి తేది: నవంబర్ 12, 2021 ► గేట్–2022 ఆన్లైన్ పరీక్ష తేదీలు: 2022 ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో రోజుకు రెండు స్లాట్లలో పరీక్ష ఉంటుంది. ► గేట్ పరీక్ష ఫలితాల వెల్లడి: మార్చి 17, 2022 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, అనంతపురం, కర్నూలు, ఏలూరు, కాకినాడ, మచిలీపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విశాఖపట్నం, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, వరంగల్. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://gate.iitkgp.ac.in/index.html -
50 వేల మంది ఆశలు గల్లంతు
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దాదాపు 50 వేల మంది అర్హత కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇంతకు ముందే ఆయా పోస్టులను భర్తీచేసి ఉంటే వారంతా అర్హులయ్యేవారని అంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పీహెచ్డీ చేసి ఉండాలన్న యూజీసీ నిర్ణయం అనేకమంది నిరుద్యోగులకు నష్టం చేకూర్చుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేంద్రానికి లేఖ రాయాల్సి ఉన్నా, అధికారులు పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో దశాబ్దంగా వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ జరగలేదు. 2017లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ కొన్ని కారణాలతో ఈ పోస్టులను ఇప్పటికీ భర్తీ చేయలేదు. గతంలో ఈ పోస్టులకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్), స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (స్లెట్) అర్హతగా నిర్ధారించారు. ఇవి లేనివారికి ఎంఫిల్, పీహెచ్డీ చేసినా సరిపోయేది. కానీ తాజాగా నెట్, స్లెట్ ఉన్నా వాటికి వెయిటేజీ మార్కులు మాత్రమే ఉం టాయని, పీహెచ్డీ తప్పనిసరిగా ఉండాల్సిందేనని యూజీసీ స్పష్టం చేసింది. పైగా ఈ నిర్ణయాన్ని గత నెల ఒకటో తేదీ నుంచే అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని ఉన్నత విద్యా మండలి చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఎంతో కష్టపడి నెట్ లేదా స్లెట్లలో అర్హత సాధించిన వారంతా నష్టపోతారని అంటున్నారు. వారికి పీహెచ్డీ చేసే అవకాశం ఉన్నా అసిస్టెంట్ ప్రొఫె సర్ పోస్టులకు నెట్, స్లెట్ సరిపోతుందని భావించి చాలామంది ఊరుకున్నారు. కానీ యూజీసీ నిర్ణ యం వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసిందని అం టున్నారు. యూజీసీ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో కేవలం ఆరు వేల మంది పీహెచ్డీ పూర్తి చేసిన వారే అర్హులవుతారని ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలోనే పోస్టుల భర్తీ జరగాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పరిశోధన అంశంపై నిర్ణయం యూజీసీదే.. ప్రస్తుతం పీహెచ్డీలో ప్రవేశం పొందిన వారు ఏ అంశంపై పరిశోధన చేయాలన్నది వారి ఇష్టానుసారంగా జరుగుతుంది. ఆ మేరకు అభ్యర్థి తాను ఎంచుకున్న అంశంలో పరిశోధన తీరును వివరిస్తూ క్లుప్తంగా నివేదిక తయారు చేసి విశ్వవిద్యాలయానికి సమర్పించాలి. అయితే వారి సొంతానికి పరిశోధన అంశాన్ని వదిలేయడం వల్ల ఒరిగేదేమీ ఉండటం లేదని, సులువైన అంశాలు తీసుకొని చాలామంది తూతూమంత్రంగా పీహెచ్డీ పూర్తి చేస్తున్నారన్నది నిపుణుల ఆరోపణ. అంతేకాక ఇతరులు పూర్తి చేసిన పీహెచ్డీ థీసిస్లను దగ్గర పెట్టుకొని కొందరు కాపీ కొడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. పరిశోధన అంటే అది సమాజానికి ఉపయోగపడాలన్నది యూజీసీ భావన. కాబట్టి ఏ అంశంపై పీహెచ్డీ చేయాలన్నది కూడా యూజీసీనే నిర్ణయిస్తుందని ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉందని అంటున్నారు. -
ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు
నేను ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో చేరాలనుకుంటున్నాను. అర్హతలు, కెరీర్ అవకాశాల గురించి వివరించండి? ప్రకృతిని ప్రేమించే వారికి, పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా బావించే వారికి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మంచి కెరీర్గా చెప్పొచ్చు. పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను నివారించడం.. వ్యర్థాలను రీసైక్లింగ్ విధానాలతో శుద్ధి చేయడం.. నింగి, నేల, నీరు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాలకు సిఫార్సులు చేయడం వంటి విధులను ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లు నిర్వర్తించాల్సి ఉంటుంది. ► కోర్సులు: దేశంలోని చాలా విద్యాసంస్థలు యూజీ, పీజీ స్థాయిలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్నాయి. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలతోనే బీఈ/బీటెక్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరవచ్చు. ఐఐటీలు, ఎన్ఐటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్; పీజీ కోర్సులకు గేట్ వంటి పరీక్షల్లో అర్హత సాధించాలి. ఈ కోర్సుల్లో చేరినవారికి బయాలజీ, కెమిస్ట్రీ, సాయిల్ సైన్స్, ఇంజనీరింగ్ సూత్రాలు, అనువర్తనాలు వంటి వాటిపై అవగాహన లభిస్తుంది. ► అర్హతలు: ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాలనుకునే వారు ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ చదివి ఉండాలి. ► కోర్సులను అందించే పలు విద్యా సంస్థలు: ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్, బాంబే, ఐఐటీ ఖరగ్పూర్ తదితర ఐఐటీలు, పలు నిట్లు, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ తదితర విద్యాసంస్థలు. ► జాబ్ ప్రొఫైల్స్: హైడ్రాలజిస్ట్, ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్, వైల్డ్లైఫ్ బయాలజిస్ట్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మేనేజ్మెంట్, ఎన్విరాన్ మెంటల్ లాయర్. ► కెరీర్: ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కోర్సులను పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ శాఖలు, ఎన్జీవోలు, నిర్మాణ సంస్థలు, పర్యావరణ ఆధారిత సంస్థలు వంటి వాటిలో అవకాశాలను పొందవచ్చు. ఇవే కాకుండా ఫెర్టిలైజర్ ప్లాంట్లు, మైన్స్, రిఫైనరీలు, టెక్స్టైల్ మిల్స్, అర్బన్ ప్లానింగ్, వాటర్ రిసోర్సెస్ అండ్ అగ్రికల్చర్, అటవీ శాఖల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అంతర్జాతీయంగా యునైటెడ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లయిమెట్ ఛేంజ్, ఎర్త్ సిస్టమ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వంటి వాటిలో అవకాశాలు అందుకోవచ్చు. ► వేతనాలు: పనిచేసే సంస్థ, అనుభవం, నైపుణ్యాల ఆధారంగా వేతనాలు లభిస్తాయి. ప్రారంభంలో రూ.30వేల నుంచి రూ.50 వేల వరకు వేతనంగా పొందవచ్చు. -
ఐబీపీఎస్ నోటిఫికేషన్, 10 వేలకు పైగా ఉద్యోగాలు
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టే.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో..కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 10,447 పోస్టుల వివరాలు: ► ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 5096 ► ఆఫీసర్ స్కేల్–1: 4119 ► ఆఫీసర్ స్కేల్–2(అగ్రికల్చర్ ఆఫీసర్): 25 ► ఆఫీసర్ స్కేల్–2(మార్కెటింగ్ ఆఫీసర్): 43 ► ఆఫీసర్ స్కేల్–2(ట్రెజరీ మేనేజర్): 10 ► ఆఫీసర్ స్కేల్–2(లా): 27 ► ఆఫీసర్ స్కేల్–2(సీఏ): 32 ► ఆఫీసర్ స్కేల్–2(ఐటీ): 59 ► ఆఫీసర్ స్కేల్–2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): 905 ► ఆఫీసర్ స్కేల్–3: 151 ► అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత,ఎంబీఏ,సీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్(ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామ్), సూచించిన పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.06.2021 ► ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 28.06.2021 ► ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేది: ఆగస్టు 2021 ► ఆన్లైన్ మెయిన్ పరీక్ష తేది: సెప్టెంబర్/అక్టోబర్ 2021 ► వెబ్సైట్: https://www.ibps.in మరిన్ని నోటిఫికేషన్లు: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్లో ఉద్యోగాలు NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో 89 పోస్టులు సదరన్ రైల్వేలో 3378 అప్రెంటిస్ ఖాళీలు -
ఏప్రిల్ 1: ఇక 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ నిరోధానికి వేస్తున్న టీకాల పంపిణీ విస్తృతంగా సాగుతోంది. ప్రపంచంలోనే వేగంగా వ్యాక్సిన్ వేస్తున్న దేశంగా భారత్ మొదటి స్థానంలో ఉంది. అయితే వ్యాక్సిన్ పంపిణీ ఎంత వేగంగా జరుగుతుందో అంతే వేగంగా కేసుల పెరుగుదల ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. వైరస్ కట్టడికి కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేయగా దాంతో పాటు వ్యాక్సినేషన్ వయసును తగ్గించింది. ఇకపై 45 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ పొందేందుకు అర్హులు అని కేంద్ర హోం మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ పొందవచ్చని స్పష్టం చేసింది. ఆన్లైన్లో కానీ నేరుగా గానీ వ్యాక్సిన్ పొందవచ్చని కేంద్ర మంత్రి పకాశ్ జవదేకర్ తెలిపారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా సాగుతోంది. 5 కోట్ల మార్క్కు చేరువలో ఉంది. మార్చి 22వ తేదీ వరకు దేశంలో 4,84,94,594 టీకాలు పంపిణీ చేశారు. చదవండి: కేంద్రం అలర్ట్.. కరోనా కట్టడికి ‘ట్రిపుల్ టీ’లు చదవండి: తెలంగాణలో విద్యాసంస్థలు బంద్ -
లోక్సభ సభ్యుడిగా పోటీ చేయాలంటే?
లోక్సభ సభ్యుడిగా పోటీ చేయడానికి అర్హతలు భారతీయ పౌరసత్వం ఉండాలి. 25 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండకూడదు. ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో ఉండ కూడదు. నేరారోపణ రుజువై ఉండకూడదు. దివాళా తీసి ఉండకూడదు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. షరతులు పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రంతో పాటు రూ.25,000 ధరావతు చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీలకు రూ.12,500). అభ్యర్థి తన ఆస్తులు, అప్పులు, ఇతర వివరాలను తప్పనిసరిగా అఫిడవిట్ రూపంలో తెలియజేయాలి. పదవీ కాలం ప్రకరణ 83(2) ప్రకారం లోక్సభ సాధారణ కాల వ్యవధి 5 ఏళ్లు. జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ఏడాది వరకు పొడిగించొచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి రద్దయిన తర్వాత ఆరు నెలల కంటే ఎక్కువ కాలం పొడిగించడానికి వీల్లేదు. అలాగే రాజకీయ అనిశ్చితి నెలకొన్నప్పుడు ప్రకరణ 85 ప్రకారం 5 ఏళ్ల కంటే ముందే లోక్సభను రద్దు చేయొచ్చు. ప్రత్యేక వివరణ: 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ పదవీ కాలాన్ని ఆరేళ్లకు పొడిగించారు. అయితే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తిరిగి ఐదేళ్లకు పున రుద్ధరించారు. రాజ్యసభ–నిర్మాణం–ఎన్నిక దేశంలో మొదట కేంద్ర ఎగువసభను 1919లో ఏర్పాటు చేశారు. ఇది 1921 నుంచి అమల్లోకొచ్చింది. 1954, ఆగస్టు 23న ఎగువసభకు రాజ్యసభగా నామకరణం చేశారు. అప్పటి రాజ్యసభ అధ్యక్షులు సర్వేపల్లి రాధాకృష్టన్. రాజ్యసభ నిర్మాణం గురించి ప్రకరణ 80 తెలియజేస్తుంది. రాజ్యసభలో గరిష్టంగా 250 మంది సభ్యులుంటారు. వీరిలో 238 మంది నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో రాష్ట్ర విధాన సభకు ఎన్నికైన శాసన సభ్యుల ద్వారా పరోక్షంగా ఎన్నికవుతారు. కళలు, సాహిత్యం, సంఘసేవ, శాస్త్ర, సాంకేతికం తదితర రంగాల్లో నిష్ణాతులైన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. వీరిలో 229 మంది రాష్ట్రాల నుంచి, నలుగురు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు. ఆయా రాష్ట్రాల జనాభా మేరకు రాజ్యసభ సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు. రాజ్యసభలో అత్యధిక స్థానాలున్న రాష్ట్రాలు రాష్ట్రం సభ్యులు 1. ఉత్తరప్రదేశ్ 31 2. మహారాష్ట్ర 19 3. తమిళనాడు 18 4. పశ్చిమ బెంగాల్ 16 5. బిహార్ 16 6. కర్ణాటక 12 7. ఆంధ్రప్రదేశ్ 11 8. మధ్యప్రదేశ్ 11 9. గుజరాత్ 11 రాజ్యసభలో ఒకే సభ్యుడున్న రాష్ట్రాలు అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, గోవా, మేఘాలయ, సిక్కిం, త్రిపుర. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో కూడా రాజ్యసభ స్థానం ఒకటి. అలాగే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (డీఎల్)కి రాజ్యసభలో 3 స్థానాలున్నాయి. రాజ్యసభలో తెలంగాణ, అసోం, పంజాబ్లకు 7 స్థానాలున్నాయి. రాజ్యసభ సభ్యులు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరి ఎన్నిక నియోజకవర్గాల ప్రాతిపదికన జరగదు. అందుకే రాజ్యసభను రాష్ట్రాల మండలి అంటారు. రాజ్యసభ సభ్యుల అర్హతలు భారత పౌరుడై ఉండాలి. 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండకూడదు. పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కూడా ఉండాలి. ఇతర షరతులు లోక్సభ సభ్యులతో సమానంగా ఉంటాయి. ప్రత్యేక వివరణ రాజ్యసభకు ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నారో ఆ రాష్ట్రంలో సాధారణ ఓటరై ఉండాలి అనే నిబంధన గతంలో ఉండేది. అయితే 2003లో ప్రజాప్రాతినిధ్య చట్టం– 1951ను సవరించి, దేశంలో ఎక్కడ ఓటరుగా నమోదై ఉన్నా పోటీ చేయొచ్చని చట్టం చేశారు. దీన్ని సు్రïపీంకోర్టు కూడా సమర్థించింది. రాజ్యసభ కాల వ్యవధి అమెరికా ఎగువసభ సెనెట్ తరహాలో రాజ్యసభ కూడా శాశ్వత సభ. లోక్సభ మాదిరిగా ఇది రద్దు కాదు. కానీ, సభ్యులు మాత్రం ఆరేళ్ల కాల వ్యవధికి ఎన్నికవుతారు. అయితే, ప్రతి రెండేళ్లకు 1/3 వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. ఇలా నిరంతరంగా సభ కొనసాగుతుంది. అందుకే దీన్ని శాశ్వత సభ, నిరంతర సభ అని అంటారు. పార్లమెంటు çసభ్యుల ప్రమాణ స్వీకారం (ప్రకరణ 99) రాష్ట్రపతి లేదా వారి ద్వారా నియమితులైన అధికారి పార్లమెంటు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీని గురించి మూడో షెడ్యూల్లో ప్రస్తావించారు. పదవీ ప్రమాణ స్వీకారం చేయకుండా సభా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అలా చేస్తే సభా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి రోజుకు రూ.500 అపరాధ రుసుము చెల్లించాలి. పార్లమెంటు çసభ్యుల రాజీనామా ప్రకరణ101(3)(బి) పార్లమెంటు సభ్యులు నిర్ణీత విధానంలో తమ రాజీనామా పత్రాన్ని సమర్పించాలి. వీటిని సంబంధిత సభాధ్యక్షులను సంబోధిస్తూ పంపాలి. వారు స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు సభాధ్యక్షులు దాన్ని ధ్రువీకరించుకున్న తర్వాతే రాజీనామాను ఆమోదిస్తారు. ఈ అంశాన్ని 1974లో 33వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. పార్లమెంటు çసభ్యుల జీతభత్యాలు (ప్రకరణ 106) పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను పార్లమెంటు తొలుత 1954లో, మళ్లీ 2010 ఆగస్టులో కొత్త చట్టం ద్వారా నిర్ణయించింది. 2010లో పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు కింది విధంగా ఉన్నాయి. వేతనం (నెలకు): రూ.50,000 నియోజకవర్గ అలవెన్సు (నెలకు): రూ.45,000 దినసరి అలవెన్సు: రూ.2,000 ఇతర ఖర్చుల కోసం: రూ.45,000 మొత్తం: రూ.1,42,000 అలాగే వారికి ఉచిత నివాసం, రవాణా, వైద్యం తదితర సౌకర్యాలు కూడా ఉంటాయి. పదవీ కాలం ముగిసిన తర్వాత నెలకు రూ.20,000 పెన్షన్ ఉంటుంది. పార్లమెంటు – సమావేశాలు ప్రకరణ 85 ప్రకారం.. పార్లమెంటు ఏడాదికి కనీసం రెండుసార్లు సమావేశమవ్వాలి. అయితే, రెండు సమావేశాల మధ్య కాలం ఆరు నెలలకు మించకూడదు. అవసరమైనప్పుడు, ప్రత్యేక పరిస్థితుల్లో మరికొన్ని సమావేశాలు నిర్వహించొచ్చు. గరిష్ట సమావేశాలపై ఎలాంటి పరిమితి లేదు. ప్రస్తుతం పార్లమెంటు ఏడాదికి మూడుసార్లు సమావేశమవుతోంది. అవి.. 1. బడ్జెట్ సమావేశం: జనవరి – ఏప్రిల్ 2. వర్షాకాల సమావేశం: జూలై – ఆగస్టు 3. శీతాకాల సమావేశం: నవంబర్–డిసెంబర్ ప్రతి సమావేశాన్ని నిర్దిష్టంగా ఇన్ని రోజులు నిర్వహించాలన్న నియమం లేదు. మూడు సమావేశాలు కలిపి సుమారు 90 నుంచి 110 రోజుల వరకు జరుగుతాయి. పార్లమెంటు సభ్యుల అనర్హతలు పార్లమెంటు సభ్యుల అనర్హతకు సంబంధించిన అంశాలను ప్రకరణ 102(1)లో పేర్కొన్నారు. కింది సందర్భాల్లో పార్లమెంటు సభ్యుల సభ్యత్వం రద్దవుతుంది. లాభదాయక పదవుల్లో కొనసాగినప్పుడు మానసిక స్థిమితం లేదని కోర్టు ధ్రువీకరించినప్పుడు దివాళా తీసినప్పుడు భారత పౌరసత్వాన్ని కోల్పోయినప్పుడు ఎన్నికల్లో అక్రమాలు రుజువైనప్పుడు ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనప్పుడు పదవిని దుర్వినియోగపర్చినప్పుడు. వరకట్నం, సతీ, అస్పృశ్యత చట్టాల కింద శిక్షకు గురైనప్పుడు పార్టీ ఫిరాయించినా, పార్టీ విప్నకు వ్యతిరేకంగా ఓటు వేసినా, పార్టీకి రాజీనామా చేసినా, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం సభ్యత్వం రద్దవుతుంది. (ప్రకరణ 102(2)) చివరి కారణం మినహా మిగిలిన అన్ని సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘం సలహా మేరకు రాష్ట్రపతి పార్లమెంటు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. సభ్యుల అనర్హత – వివాదాలు (ప్రకరణ–103) పార్లమెంటు సభ్యుల అనర్హతకు సంబంధించి తుది నిర్ణయం రాష్ట్రపతిదే. దీనికి సంబంధించి న్యాయస్థానాలు సాధారణంగా జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. సుప్రీంకోర్టు తీర్పులు: 2006లో జయాబచ్చన్ Vటయూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు చెప్పింది. గౌరవ వేతనం కూడా లాభదాయక పదవి కిందకు వస్తుందని, వేతనం తీసుకోకపోయినా ఆ పదవిలో ఉండే అధికారం, హోదా, గుర్తింపును కూడా లాభంగానే పరిగణించాలని, అలాంటి సందర్భాల్లో వారిని అనర్హులుగా ప్రకటించవచ్చని పేర్కొంది. గమనిక: లిల్లీ థామస్ Vటస్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు.. రెండేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడినవారు వెంటనే అనర్హతకు గురవుతారని పేర్కొంది. -
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) ప్రిలిమినరీ రాత పరీక్షా ఫలితాలను డీజీపీ అనురాగ్శర్మ గురువారం విడుదల చేశారు. సివిల్, ఆర్మ్డ్ రిజర్వుడ్(ఏఆర్), కమ్యూనికేషన్ విభాగాల్లో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఈ నెల 17న రాత పరీక్షలు నిర్వహించింది. సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ విభాగాల్లో 510 పోస్టులకుగాను 1,74,962 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రాయగా 88,875 మంది(50.79 శాతం) ఉత్తీర్ణత సాధిం చారు. వీరిలో పురుషులు 79,854 మంది కాగా.. మహిళలు 9,021 మంది ఉన్నారు. కమ్యూనికేషన్, పీటీవో విభాగాల్లో 29 పోస్టులకుగాను 10,584 మంది ప్రిలిమినరీ రాత పరీక్ష రాయగా 1,709 మంది (16.14 శాతం) అర్హత సాధించారు. వీరిలో పురుషులు 1,513 మంది ఉండగా, మహిళలు 196 మంది ఉన్నారు. మొత్తమ్మీద పరీక్షా ఫలితాల్లో ఖమ్మం జిల్లా 54.36 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత సాధించగా.. మెదక్ జిల్లా అతి తక్కువగా కేవ లం 44 శాతం ఉత్తీర్ణత సాధించింది. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి జూన్లో దేహదారుఢ్య, మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు స్పష్టం చేశారు. ఓఎంఆర్ ఆన్సర్ షీట్లు శుక్రవారం నుంచి మే 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. జవాబు పత్రాల మధింపులో ఏమైనా అనుమానాలు ఉంటే మే 5వ తేదీలోగా అభ్యర్థులు నిర్దేశిత మొత్తం చెల్లించి ఓఎంఆర్ షీట్లు పొందవచ్చు. ఇందుకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది.ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లోనే అత్యధిక ఉత్తీర్ణత ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు అతి తక్కువగా అర్హత సాధించారు. ఓపెన్ కేటగిరీ వారికి అర్హత మార్కులు అత్యధికంగా ఉండటంతో కేవలం 28.62 శాతం మంది మాత్రమే తదుపరి పరీక్షలకు ఎంపికయ్యారు. ఎస్సై ప్రిలిమినరీలో జనరల్ కేటగిరీకి కటాఫ్గా 80 మార్కులు నిర్ణయించడంతో కేవలం 4,454 మంది మాత్రమే అర్హత సాధించారు. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించారు. ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 17,386 మంది(63.74 శాతం), ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు 22,882 మంది (61.54 శాతం) అర్హత సాధించారు. అలాగే బీసీ-ఏ కేటగిరీలో 5,742 మంది(42.77 శాతం), బీసీ-బీలో 18,422 మంది (49.20 శాతం), బీసీ-సీలో 174 మంది (31.35 శాతం), బీసీ-డీలో 17,728 మంది (48.19 శాతం) బీసీ-ఈలో 2,009 (30.19 శాతం) మంది అర్హత సాధించారు. -
ఆదాయ పరిమితి పెంచిన కేసిఆర్ సర్కార్