Eluru District News
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేళాయె..
ద్వారకాతిరుమల: చిన్నతిరుమలేశునికి జరిగే బ్రహ్మోత్సవాలు ఇలలో ఓ అద్భుతం.. వర్ణనాతీతం. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈనెల 7 నుంచి 14 వరకు (8 రోజుల పాటు) ద్వారకాతిరుమల దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవాలు శ్రీవారి వైభవాన్ని చాటనున్నాయి. క్షేత్రంలో ప్రతి ఏటా (రెండు సార్లు) వైశాఖ మాసంలో వెలసిన స్వామికి, ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠ స్వామికి ఈ బ్రహ్మోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. వీటితో పాటు నిత్యోత్సవ, వారోత్సవ, మాసోత్సవాలను అట్టహాసంగా జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 7 నుంచి శ్రీవారి వైశాఖమాస బ్రహ్మోత్సవాలను కన్నులపండువగా నిర్వహించనున్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో స్వామివారు ఉభయ దేవేరులతో కలసి ఉదయం, సాయంత్రం వేళల్లో పలు వాహనాలపై తిరువీధుల్లో విహరించనున్నారు. అలాగే ఆలయ ముఖ మండపంలో రోజుకో విశేష అలంకారంలో శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికపై ఉదయం నుంచి రాత్రి వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉత్సవాలు జరిగేదిలా.. ● ఈనెల 7న ఉదయం శ్రీవారిని పెండ్లికుమారునిగా, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి గజ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ● 8న రాత్రి 7 గంటల నుంచి అంకురార్పణ, రుత్విగ్వరణ అనంతరం బ్రహ్మోత్సవాల వీక్షణకు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ధ్వజారోహణను నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల నుంచి హంస వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ● 9న ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవాలు జరుగుతాయి. ● 10న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 8.30 గంటల నుంచి వెండి శేష వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ● 11న రాత్రి 8 గంటల నుంచి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం, అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ● 12న రాత్రి 8 గంటల నుంచి క్షేత్ర పురవీధుల్లో రథోత్సవం జరుగుతుంది. ● 13న ఉదయం 10.30 గంటల నుంచి చక్రవారి–అపభృధోత్సవము, మధ్యాహ్నం 3 గంటల నుంచి వేద సభ, రాత్రి 8 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ, రాత్రి 9 గంటల నుంచి అశ్వ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ● 14న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవ వేడుకలు జరుగుతాయి. అలాగే రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగము – పవళింపు సేవ కార్యక్రమాలతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. దాదాపుగా పూర్తయిన ఏర్పాట్లుబ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడటంతో స్వామివారి వాహనాలను సిబ్బంది ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు నిర్మించారు. అలాగే ఆలయ రాజగోపురాలు, పరిసరాలకు విద్యుద్దీప అలంకారాలు చేశారు. దాంతో ఉత్సవ ఏర్పాట్లకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రేపటి నుంచి ద్వారకాతిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు 11న రాత్రి తిరుకల్యాణం, 12న రాత్రి రథోత్సవం రోజుకో ప్రత్యేక అలంకారంలో దర్శనమివ్వనున్న శ్రీవారు ఉత్సవాలు ముగిసే వరకు ఆర్జిత సేవలు రద్దు ప్రత్యేక అలంకారాలు ఇలా.. ఈనెల 7న శ్రీ మహావిష్ణువు 8న మత్స్యావతారం 9న శ్రీరామ 10న మురళీకృష్ణ 11న మోహిని 12న రాజమన్నార్ 13న కాళీయమర్థనం 14న శయన మహావిష్ణువు భక్తులు తరలిరావాలి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్సవాల్లో పాల్గొనే సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తాం. 8 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలి. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 7 నుంచి 14 వరకు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నాం. భక్తులు గమనించాలి. – ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి, శ్రీవారి దేవస్థానం ఈఓ -
కొనసాగుతున్న సీహెచ్ఓల నిరసన
భీమవరం (ప్రకాశం చౌక్): విలేజ్ క్లినిక్ల సీహెచ్ఓల నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. గత 8 రోజులుగా వారు తమ సమస్యలపై నిరసన గళం వినిపిస్తున్నారు. భీమవరం కలెక్టరేట్ వద్ద టెంట్ వేసుకుని ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉద్యోగ భద్రత, న్యాయమైన డిమాండ్లపై పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిత్యం గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించే వారు రోజుల తరబడి నిరసన కార్యక్రమంలో ఉండడం వల్ల గ్రామాల్లో స్థానిక వైద్య సేవలు నిలిచిపోయాయి. పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామం విలేజ్ క్లినిక్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ వెళ్లి వైద్య సేవలు అందించినట్లు సీహెచ్ఓల యూనియన్ నాయకులు మీడియా దృష్టికి తీసుకువచ్చారు. అతడు వైద్యం చేస్తున్న ఫొటోలు సేకరించి, వారు లేని విలేజ్ క్లినిక్లలో పరిస్థితి ఏ విధంగా ఉందో మీడియాకు తెలియజేశారు. అలాగే పలు చొట్లు ఆరోగ్య మిత్రలు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. వైద్యా ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శిస్తున్నారు. -
ౖరెతులతో సర్కారు చెలగాటం
మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025సాక్షి ప్రతినిధి,ఏలూరు: అకాల వర్షం అన్నదాతకు పుట్టెడు కష్టాలు తెచ్చిపెట్టింది. కల్లాల్లోని ధాన్యం తడిచిపోవడం, ఆయిల్పామ్, అరటి, బొప్పాయి, మామిడితో సహా పలు పంటలకు నష్టం వాటిల్లింది. ఆకస్మాత్తుగా ఆదివారం 4 గంటల పాటు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసి బెంబేలెత్తించింది. అధికారిక లెక్కలన్నీ వందల్లోనే ఉన్నా క్షేత్రస్థాయిలో వేల టన్నుల ధాన్యం తడిసిపోగా, వంద ల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అనాలోచిత నిర్ణయాలతో.. జిల్లాలో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ధా న్యం రైతు తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. రబీ సీజన్లో 77 వేల ఎకరాల సాగు విస్తీర్ణంలో 3.53 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ధాన్యం కొనుగోళ్లు మార్చి నెలాఖరు నాటికి ప్రారంభమై ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం 50 శాతం ధాన్యమే కొనుగోలు చేస్తా మని చెప్పి 1.50 లక్షల టన్నులే కొంటామని ముందుగా ప్రకటించింది. రైతుల నుంచి ఒత్తిడి రావడంతో ఈ లక్ష్యాన్ని 2 లక్షల టన్నులకు పెంచారు. చి వరగా 2.20 లక్షల టన్నులు కొంటామని, మిగిలిన పంట మిల్లర్లు, దళారులకు విక్రయించుకోవచ్చని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం 2.50 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు 2,14,900 టన్నుల ధాన్యం సేకరణ పూర్తయినట్టు అధికారులు ప్రకటించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చివరి గింజ వరకూ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి దళారీ వ్య వస్థకు అడ్డుకట్ట వేసి నేరుగా రైతులకే డబ్బులు జమచేశారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం దళారులకే అమ్ముకోండి అని ప్రత్యక్షంగానే చెబుతోంది. రైతుల ఆందోళనలతో లక్ష్యాన్ని పెంచి.. గత వారంలో జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ ఇచ్చిన నివేదికల ప్రకారం కొనుగోలు లక్ష్యాన్ని నిర్దేశించామని అయినా ప్రభుత్వం ధాన్యం వ్యాపారం చేయడం లేదు కదా అని అన్నారు. వారం రోజులు గా ఏలూరు రూరల్, దెందులూరు, ఉంగుటూరు మండలాల్లోని రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు ఆందో ళనలు చేయడంతో లక్ష్యాన్ని ఎట్టకేలకు 2.50 లక్షల టన్నులకు పెంచారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రైతులు కల్లాల్లోనే ధాన్యం రాశులు పోసి ఉంచగా అకాల వర్షంతో పంట తడిసిపోయింది. భీమడోలు, చింతలపూడి మండలాల్లో ఎక్కువగా నష్టం జరిగింది. సుమారు 500 నుంచి 600 టన్నుల ధాన్యం తడిసినట్టు అంచనా. అలాగే అకాల వర్షానికి 148 ఆయిల్పామ్ మొక్కలు నేలకొరిగాయి. జీలుగుమిల్లి మండలం తాడువాయిలో సింహాద్రి శ్రీనివాస్ అనే రైతుకు చెందిన 3.30 ఎకరాల విస్తీర్ణంలో 48 ఆయిల్పామ్ మొక్కలు పూర్తిగా నేలకొరిగాయి. చింతలపూడి మండలంలో శెట్టివారిగూడెం, ప్రగడవరంలో తోటల్లోని మామిడి కాయలు నేలరాలాయి. బొప్పాయి, అరటి పంటలకు కూడా నష్టం వాటిల్లింది. పశ్చిమగోదావరి జిల్లాలో 2,781 ఎకరాల్లో వరి నేలకొరిగింది. అక్కడ కూడా మామిడి, బొప్పాయి, అరటి పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. న్యూస్రీల్ధాన్యం.. వర్షార్పణం అకాల వర్షాలతో రైతుల బెంబేలు ధాన్యం కొనుగోళ్ల లక్ష్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం సర్కారు అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతల్లో ఆందోళన రైతుల వద్దే 40 వేల టన్నుల నిల్వలు అరటి, మామిడి, ఆయిల్పామ్, బొప్పాయి పంటలకూ దెబ్బ -
ఎంటర్ప్రెన్యూర్లు దేశాభివృద్ధికి అవసరం
నూజివీడు: విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఎంటర్ప్రెన్యూర్షి ప్ విద్యపై నిర్వహిస్తున్న ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుందని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ పేర్కొన్నారు. స్థానిక ట్రిపుల్ ఐటీలో ఆర్జీయూకేటీ, వాధ్వానీ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు ట్రిపుల్ ఐటీల నుంచి ఎంపిక చేసిన 49 మంది అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దే బదులుగా వారినే వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దినట్లయితే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి విద్యార్థి స్టార్ట్అప్ ప్రారంభించేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరైన నవీన్ అహ్మద్ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు విద్యార్థుల్లా నేర్చుకొని తరువాత విద్యార్థులకు శిక్షణనివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ ఈఐపీటీ పీ శ్యామ్, ఏఓ బీ లక్ష్మణరావు, సుజాత, ఫైనాన్స్ ఆఫీసర్లు నాగార్జునాదేవి, శ్రీనాఽథ్ డీన్ అకడమిక్స్ చిరంజీవి, డీన్ ఎవాల్యూషన్ రియాజ్హుస్సేన్ పాల్గొన్నారు. -
దళిత కుటుంబం ఆమరణ నిరాహార దీక్ష
బుట్టాయగూడెం: తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓ దళిత కుటుంబం సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ కుటుంబానికి చెందిన బాషా శ్యామ్బాబు, బాషా రాజేష్ మాట్లాడుతూ బుట్టాయగూడెం మండలం మర్రిగూడెం సమీపంలో సర్వే నంబర్ 415లో 10–58 సెంట్లు, సర్వే నంబర్ 415లో 4 ఎకరాల 28 సెంట్లు, సర్వే నంబర్ 417/1లో 8–50 సెంట్లు మొత్తం 23 ఎకరాల 36 సెంట్ల భూములు తమ తాతల కాలం నాటివని అన్నారు. 2002, 2006 సంవత్సరాల్లో బుట్టాయగూడెం రెవెన్యూ అధికారులు పంచనామా చేసి ఆ భూములను తమకు అప్పగించారని, అప్పటి నుంచి ఆ భూముల్లో తామే సాగు చేసుకుని జీవిస్తున్నామని తెలిపారు. ఈ భూముల్లో కొందరు ప్రవేశించి తమను బెదిరిస్తున్నారని, ఆ భూముల్లో ఉన్న జీడిమామిడి, మామిడి పంటలను దౌర్జన్యంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేసే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ దీక్షలో వెంకాయమ్మ, వేములూరి నాగేంద్ర, వేములూరి వెంకటలక్ష్మి, ముకుంద, బాషా నాగేశ్వరరావు, పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో రైతులు దివాలా
కొయ్యలగూడెం: కూటమి ప్రభుత్వంలో రైతులు దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నారని, రైతు వ్యతిరేకి చంద్రబాబు పాలనలో రైతులు దయనీయ స్థితికి చేరుకున్నారని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. సోమవారం కొయ్యలగూడెంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గిట్టుబాటు ధరలు లేవంటూ బాలరాజు వద్ద రైతులు ఏకరువు పెట్టారు. మిడిల్ గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయడం లేదని, అదేంటని బయ్యర్లను అడిగితే ఆర్డర్స్ రాలేదంటున్నారన్నారు. విదేశీ ఆర్డర్లను సాధించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని బాల రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలో పొగాకు సరాసరి ధర రూ.340 పైగా ఉంటేనే రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో మార్క్ ఫెడ్ సంస్థను కొనుగోళ్లలో ప్రవేశపెట్టి రైతుకు గిట్టుబాటు ధర కల్పించగలిగామని కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతుల కష్టాలను గాలికి వదిలేసిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించని పక్షంలో వైఎస్సార్సీపీ రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని కూటమి ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు, ఎంపీపీ గంజిమాల రామారావు, రైతు ప్రతినిధులు కాకర్ల నంది, గంటా రమేష్, గొడ్డటి నాగేశ్వరరావు, డి.బా బూరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
● రయ్.. రయ్.. స్కేటింగ్ వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో స్కేటింగ్లో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. ఐదేళ్లు నుంచి 18 సంవత్సరాల వరకు స్కేటింగ్లో మెళకువలు, పోటీ ప్రవేశాలకు శిక్షణ ఇస్తున్నారు. అండర్–14 అడ్మిషన్ ఫీజు రూ.1000, నెలకు రూ.600, 14 సంవత్సరాలు పైబడిన వారికి రూ. 2 వేలు అడ్మిషన్ ఫీజు, నెలకు రూ.1000 నిర్ణయించినట్లు స్కేటింగ్ కోచ్ చెప్పారు. వివరాలకు ఎస్కే ఖాసీం నంబర్ 94406 47391లో సంప్రదించాలని కోరారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు కుక్కునూరు: నెమలిపేట గ్రామ సమీపంలో ఉపాధి కూలీలపై సోమవారం తేనెటీగలు దాడి చేశాయి. గ్రామానికి చెందిన 20 మంది కూలీలు రాయికుంట గ్రామంలో ఉపాధి పనులు చేస్తుండగా సమీపంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా కూలీలపై దాడిచేశాయి. దీంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో కంటిపల్లి శిరీష, కంటిపల్లి కుమారి, పట్ల దుర్గమ్మ, కారం రామారావు, కారం భద్రమ్మ, వర్స సీత, కౌలూరి శిరీష తీవ్రంగా గాయపడడంతో వారిని స్థానికులు కుక్కునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం వారికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు ఇళ్లకు పంపించారు. బాధితులను వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు వై నాగేంద్రరావు పరామర్శించారు. -
వివాహ వేడుక వద్ద ఘర్షణ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
ముసునూరు: వివాహ వేడుక వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. రమణక్కపేట శివారు కండ్రిక గ్రామంలో సోమవారం దొడ్డి ప్రసాద్ కుమారుడి వివాహ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు మద్యం సేవించారు. మద్యం మత్తులో వారి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో అదే గ్రామానికి చెందిన పాలకుర్తి శేఖర్పై దొడ్డి ప్రసాద్, అతని సహచరులు కర్రలు, కత్తులతో దాడి చేశారు. క్షతగాత్రుడిని బంధువులు 108 వాహనంలో నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ దాడి గురించి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై ఎం.చిరంజీవి చెప్పారు. కోడి వ్యర్థాలను తరలిస్తున్న వాహనాల సీజ్ భీమడోలు: కోడి వ్యర్థాలను తరలిస్తున్న రెండు వాహనాలను సోమవారం పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై వై.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం పెదపాడు గ్రామానికి చెందిన గండికోట వినయ్ హైదరాబాద్ నుంచి భీమడోలు పంచాయతీ శివారు లింగంపాడు ఏరియాలోని లంక నానికి చెందిన చేపల చెర్వులకు రెండు వాహనాల్లో కోడి వ్యర్థాలను తరలిస్తుండగా భీమడోలు పోలీసులు పట్టుకున్నారు. సుమారు 15 టన్నుల కోడి వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యర్థాలను గోతుల్లో పూడ్చారు. వాహన డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ చెప్పారు. -
పంట నష్టపరిహారం చెల్లించాలి
ఏలూరు (టూటౌన్): అకాల వర్షాలకు పంట లు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏలూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. సంఘ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయిందని, మామిడి, జీడిమామిడి, అరటి, మొక్కజొన్న, కూరగాయలు, పొగాకు తదితర పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. వెంటనే పంట నష్టాలను నమోదు చేయాలని కోరారు. చింతల పూడి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలన్నారు. టార్గెట్లతో సంబంధం లేకుండా రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలన్నారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు సిరిబత్తుల సీతారామయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కోన శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు. ‘పోలవరం’ పనుల పరిశీలన పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మిస్తున్న పక్కా గృహాలను నాణ్యత ప్రమాణాల మేరకు పూర్తి చేయాలని ఎంపీ పుట్టా మహేష్కుమార్ ఆదేశించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులతో కలిసి సోమవారం ఆయన ఎంపీ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎల్ఎన్డీపేట సమీపంలోని కోండ్రుకోట పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. ప్రతి పంటా కొంటాం : రైతులు పండించిన ప్రతి పంటా కొనుగోలు చేస్తామని ఎంపీ పుట్టా అన్నారు. మండలంలో రైతులు రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్న రాశులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల లో జాప్యం జరుగుతోందని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అకాల వర్షాల వల్ల రోడ్లపై ఆరబెట్టిన మొక్కజొన్న, ధాన్యం తడిచిపోయాయని రైతులు వాపోయారు. జిల్లాస్థాయి అధికారులతో విచారణకు వినతి ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక తూర్పువీధి ఉర్దూ యూపీ స్కూల్, మౌలానా అబుల్ క లాం ఆజాద్ హైస్కూల్లో ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే చూపారని, వాటిని పరిశీలించి సరిచేయాలని చేసిన ప్రాతినిధ్యం మేరకు విచారణ అధికారులుగా హెచ్ఎం, ఎంఈఓను నియమించడం సముచితం కాదని ఏపీటీఎఫ్ 1938 నాయకులు అన్నారు. సోమ వారం డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మను కలిసి వినతిపత్రం సమర్పించారు. నిజ నిర్ధారణకు జిల్లాస్థాయి అధికారులను నియమించాలని కో రారు. అప్పటివరకూ తాము విచారణను బహిష్కరిస్తామన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మోహన్, ఉపాధ్యక్షుడు ఈ.రామ్మోహన్ తదితరులు ఉన్నారు. ఆరోగ్య రక్ష వాహనం ప్రారంభం ఏలూరు(మెట్రో): బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష వాహనాన్ని సోమవారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి జెండా ఊపి ప్రారంభించారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయ అధికారి పాల్ సతీష్కుమార్, జిల్లా వైద్యశాఖాధికారి ఆర్.మాలినిలతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రీయ బాల సురక్షా రక్షలో భాగంగా ఈ వాహనాన్ని ఏర్పాటు చేసిందన్నారు. పోడూరులో అధిక వర్షపాతం భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం పోడూరులో అత్యధికంగా 80.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా పాలకోడేరులో 9.6 మి.మీ వర్షం కురిసింది. సోమవారం జిల్లా సమాచార శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొల్లులో 73.4, తాడేపల్లి గూడెంలో 33.6, పెంటపాడులో 35, తణుకులో 16.6, అత్తిలిలో 31.6 మి.మీ వర్షం కురిసింది. -
ఫిర్యాదులపై వేగంగా విచారణ
ఏలూరు (టూటౌన్): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన ఫిర్యాదులపై వేగంగా విచారణ చేపట్టి చట్టపరంగా న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్లో భాగంగా 36 ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● కై కలూరుకి చెందిన ఓ మహిళ తన నుంచి రూ.4 లక్షలు తీసుకుని ఓ వ్యక్తి మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. ● జంగారెడ్డిగూడేనికి చెందిన ఓ మహిళ తన భర్త మరో మహిళను వివాహం చేసుకుని తనను ఇబ్బంది పెడుతున్నట్టు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ● చాట్రాయి పరిధిలో ఓ వ్యక్తి తనను ఆస్తి విషయాల్లో కొందరు చంపుతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ● మండవల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆస్తి సంబంధ విషయాలపై తన అన్న, వదిన బెదిరిస్తున్నారని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. -
అర్జీల పరిష్కారంపై దృష్టి
ఏలూరు(మెట్రో): అర్జీదారుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 226 దరఖాస్తులు స్వీక రించారు. విభిన్న ప్రతిభావంతులు, దివ్యాంగులు వద్దకు కలెక్టర్ స్వయంగా వెళ్లి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకుని చర్యలకు ఆదేశించా రు. అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్ కలెక్టర్తో కలిసి వినతులు స్వీకరించారు. అర్జీల్లో కొన్ని.. ● పెదవేగి మండలం న్యాయంపల్లి గ్రామానికి చెందిన కొమ్మిన వెంకటేశ్వరరావు తమ భూసమస్యపై అర్జీని అందజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ● ఏలూరు హనుమాన్నగర్కి చెందిన కుక్కర రమాదేవి అర్జీనిస్తూ తన భర్త నరసింహారావు ఆనారోగ్యంతో మరణించినందున తన జీవనోపాధి కోసం పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ● భీమడోలు మండలం ఎంఎం పురానికి చెందిన బుంగ చందర్రావు అర్జీనిస్తూ తన చేపల చెరువుకు సంబంధించి తనకు ఉన్న భూమి కన్నా తక్కువ ఆన్లైన్లో నమోదైందని, పరిశీలించి మొత్తం భూమి ఆన్లైన్లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలను కోరారు. ● కై కలూరు మండలం ఆలపాడు చెందిన సుందర కనకదుర్గ అర్జీనిస్తూ తమ భూమి అడంగల్లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ● ఏలూరు పవర్పేటకు చెందిన పిల్ల హరినారాయణరావు అర్జీనిస్తూ దెందులూరు మండలం సోమవరప్పాడులో భీష్మపురి కాలనీలో తమ ప్లాట్ సర్వే చేసి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి -
కుసుమ ధర్మన్న సాహిత్యం నేటి తరానికి ఆదర్శం
పాలకొల్లు సెంట్రల్: జాతీయ ఉద్యమకారుడు, 19వ శతాబ్ధపు తొలితరం దళిత కవి కుసుమ ధర్మన్న ఉద్యమ సమరంతో పాటు సామాజిక సేవలో ఎంతో విశిష్టత సాధించారని, ఆయన సాహిత్యం నేటితరానికి ఆదర్శనీయమని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపారాణి అన్నారు. సోమవారం స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లెల్ల సత్య సుధామ (సామాజిక సేవా రంగం), ఉన్నమాటి శ్యాంసుందర్ (కార్టూన్ జర్నలిజం), డాక్టర్ పెంకి విజయ్ కుమార్, వాసంశెట్టి దుర్గా శంకర్ (కళారంగం), మామిడిశెట్టి శ్రీనివాస్ (తెలుగు సాహిత్యం) లకు కుసుమ ధర్మన్న ప్రతిభా పురస్కారాలు అందజేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు కవులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. బత్తుల మురళీకృష్ణ రచించిన జముకు, దీర్ఘ కవితను, తంగిరాల సోనీ సంపాదకత్వంలో వెలువడిన ప్రజాకాంక్ష ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. కుసుమ ధర్మన్న సాహిత్య వేదిక రాష్ట్ర నూతన అధ్యక్షునిగా కోలాటి చిన పెద్దిరాజు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో నేలపూరి రత్నాజీ, పేరూరి మురళీకుమార్, గొల్లపల్లి అంబేద్కర్, డా అలుగు ఆనంద్, సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొన్నారు. -
ఏపీఈ సెట్కు సర్వం సిద్ధం
ఏలూరు (ఆర్ఆర్పేట): పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం ఏపీ ఈసెట్ పరీక్ష మంగళవారం నిర్వహించనున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లోని 10 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష జరుగనుంది. ఏలూరు సిద్థార్ధ క్వెస్ట్ సీబీఎస్ఈ స్కూల్లో ఉదయం 180 మంది, మధ్యాహ్నం 141 మంది, సీఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 148 మంది, మధ్యాహ్నం 100 మంది, ఏలూరు కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉదయం 100 మంది హాజరు కానున్నారు. భీమవరం డీఎన్నార్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉదయం 110 మంది, మధ్యాహ్నం 100 మంది, దంతులూరి నారాయణరాజు అటానమస్ కళాశాలలో ఉదయం 100 మంది మధ్యాహ్నం 100 మంది, విష్ణు కళాశాలలో ఉదయం 100 మంది, మధ్యాహ్నం 93 మంది హాజరు కానున్నారు. శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ ఆఫ్ ఉమెన్స్లో ఉదయం 100 మంది, నరసాపురం స్వర్ణాంధ్ర కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉదయం 150 మంది, మధ్యాహ్నం 98 మంది, తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 230 మంది, మధ్యాహ్నం 150 మంది, శశి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్లో ఉదయం 225 మంది మధ్యాహ్నం 120 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. -
మల్లఖాంబ్ జాతీయ పోటీలకు భీమవరం క్రీడాకారులు
భీమవరం: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మల్లఖాంబ్ పోటీలకు భీమవరం పట్టణానికి చెందిన క్రీడాకారులు 9 మంది ఎంపికయ్యారని ఎస్సీహెచ్బీఆర్ఎమ్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు జీపీసీ శేఖర్రాజు చెప్పారు. బీహార్ రాష్ట్రం బుద్ధగయలో జరిగే పోటీలకు రాష్ట్ర జట్టులో 12 మంది పాల్గొంటుండగా భీమవరం పట్టణానికి చెందిన పి.రోహిత్కుమార్, ఆర్.మనీషా, ఎ.భువనచంద్రిక, వైష్ణవి, బి.కీర్తి, జి.దివ్యజ్యోతి, ఎం.ఆదిత్యవెంకటదుర్గ, డి.ప్రసాద్, పి.గోపీకృష్ణ ఉన్నారని తెలిపారు. మల్లఖాంబ్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను శేఖర్రాజు, పీఈటీ ఎం.లక్ష్మి అభినంధించారు. మోటార్సైకిల్ చోరీపై కేసు నమోదు భీమవరం: మోటార్సైకిల్ చోరీపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్సై రెహమాన్ తెలిపారు. పట్టణంలోని ఏఎస్ఆర్ నగర్లో పి జ్యోతి తన ఇంటి వద్ద ఆదివారం రాత్రి బండి పార్కింగ్ చేయగా సోమవారం తెల్లవారేసరికి కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ముద్దాడ పాలకొల్లు సెంట్రల్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పాలకొల్లుకు చెందిన ముద్దాడ గణేష్ భవానీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ నియోజకవర్గ, డివిజన్, జిల్లాకు అధ్యక్షుడిగా, రాష్ట్ర పదవుల్లో ప్రధాన కార్యదర్శి, ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి, ప్రచార కమిటీ చైర్మన్, వర్కింగ్ అధ్యక్షుడిగా పనిచేశానన్నారు. ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా సంఘం మరింత అభివృద్ధి చెందడానికి తనవంతు కృషి చేస్తానని గణేష్ భవానీ చెప్పారు. గణేష్ నియామకం పట్ల రాష్ట్ర బీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. -
ప్రభుత్వం ప్రతి గింజా కొనాల్సిందే
ఉంగుటూరు: రైతులకు ఎల్లవేళలా వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, తడిసిన ధాన్యాన్ని ప్రభు త్వం కొనుగోలు చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), రాష్ట్ర రాజకీ య సలహా కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. సోమవారం మండలంలోని గోపీనాథపట్నం, చేబ్రోలు ఆయకట్టులో ధాన్యం రాశులు, నెట్లు కట్టిన ధాన్యాన్ని వారు పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎన్నార్, వాసుబాబు మాట్లాడుతూ రైతుల నుంచి ప్రతి గింజా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో ముందుగా 1.50 లక్షల టన్నులు తర్వాత 2 లక్షల టన్నులు, ఇప్పుడు 2.50 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే అని అన్నారు. రైతులు ధాన్యం పట్టుబడులు పట్టి పొలాల్లో నిల్వ ఉంచితే వాటి ఊసు లేకుండా.. ధాన్యం కొని ప్రభుత్వం వ్యాపారం చేస్తుందా అని మంత్రి నాదెండ్ల మనోహర్ అనడాన్ని ఖండించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు గుర్తు చేశారు. అప్పట్లో రూ.3 వేల కోట్లు రైతులకు సబ్సిడీ ఇచ్చామన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలుకు టార్గెట్ పూర్తయిందనడం సరికాదన్నారు. దళారులు మద్దతు ధర కంటే బస్తాకు రూ.400 తగ్గించి కొంటున్నారని, ఇలా రైతులు నష్టపోవాలా అని మండిపడ్డారు. చేబ్రోలులోని వైఎస్సార్ కాలనీకి వెళ్లే దారిలో, గోపీనాథపట్నం కాలనీ వద్ద ధాన్యం గుట్టలను వారు పరిశీలించారు. వైఎస్సార్సీపీ చింతలపూడి సమన్యయకర్త కంభం విజయరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), పార్టీ మండల అధ్యక్షులు మరడ మంగరావు, రాయిపాటి సత్య శ్రీనివాసు, దండు రాము, రాష్ట్ర బూత్ వింగు కమిటీ కార్యదర్శి యెలిశెట్టి పాపారావు బాబ్జి, నిడమర్రు జెడ్పీటీసీ కోడే కాశీ, బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ, నా యకులు పుప్పాల గోపి, కొరిపల్లి శ్రీను, తమ్మ గంట బవాని, వెజ్జు వెంకటేశ్వరరావు, కరణం బుజ్జి తదితరులు వారి వెంట ఉన్నారు. రైతులకు వైఎస్సార్సీపీ అండ పార్టీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
ధాన్యం మొత్తం కొనాల్సిందే
ఉంగుటూరు: ధాన్యం మొత్తం కొనుగోలు చేయండి.. లారీల్లో లోడు చేసిన ధాన్యం మిల్లులకు పంపండి.. ధాన్యం కొనుగోలు లక్ష్యాలు పెంచండి.. గోనె సంచులు ఇవ్వండి అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బొమ్మిడి సొసైటీ వద్ద ఆదివారం రైతులు, కౌలు రైతులు ఆదివారం ధర్నాకు దిగారు. లారీల్లో లోడు చేసిన ధాన్యం మూడు రోజులుగా మిల్లులకు తరలించకపోవడంపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ లారీల వద్ద బైఠాయించారు. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ టార్గెట్ల పేరుతో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడం అన్యాయమన్నారు. ఏలూరు జిల్లాలో 4 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా 2.20 లక్షల టన్నుల ఉమాత్రమే కొనుగోలు చేస్తా మని ప్రభుత్వం అనడం దారుణమన్నారు. ప్రతి గింజా కొంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బొమ్మిడిలో నిలిచిపోయిన 10 లారీల ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు. మండల నాయకులు దూడే కేశవ, వానపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోయి కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ఊడిమూడి దానియేలు, మరుకుర్తి ధనంజయరావు, లంక వెంకటేశ్వరరావు, నక్కా సత్యనారాయణ, సాధనాలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మల్కాపురంలో గళమెత్తి.. దెందులూరు: ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ ఏలూరు రూరల్ మండలం మల్కాపురంలో రైతు సేవా కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగా రు. ముందుగా బరకాలు కప్పి ఉన్న ధాన్యాన్ని పరిశీలించి, బరకాలపై పడిన వర్షం నీళ్లను తోడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్క మల్కాపురం రైతు సేవా కేంద్రం పరిధిలో 1,500 టన్నుల ధాన్యం కళ్లాల్లో ఉండిపోయిందన్నారు. ధాన్యం కొనలేం.. అంటూ ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణమని విమర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ని బంధనలు సడలించాలని కోరారు. మల్కాపురం పరిధిలో 700 టన్నుల కొనుగోలుకు టార్గెట్ ఇచ్చినట్టు రైతు సేవా కేంద్రం అసిస్టెంట్ చెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు. రైతులు ఆదాడ శ్రీనివాసరావు, లంకా వెంకటరమణ, గొర్రెల రొయ్యా రావు, గుర్రాల శోభన్బాబు, కండిబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు. ధర్నాలకు దిగిన అన్నదాతలు -
ఘనంగా భగీరథ జయంతి
ఏలూరు(మెట్రో) : లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని భగీరథ మహర్షి నిరూపించారని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. ఆదివారం ఏలూరు కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకలు నిర్వహించారు. భగీరథుని చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటిని దివి నుంచి భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని అన్నారు. మహనీయుల గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, సహాయ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ టి.వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏఓ నాంచారయ్య, కలెక్టరేట్ బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ అధికారులకు పదోన్నతులు, బదిలీలు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్లో పలువురు అధికారులకు పదోన్నతులు, బదిలీలు చేస్తూ సంస్థ సీఎండీ పృధ్వీతేజ్ ఇమ్మడి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరులో టెక్నికల్/ఎంఆర్టీ విభాగంలో ఏఈఈగా పనిచేస్తున్న ఎన్.ఉషారాణికి డిప్యూటీ ఈఈగా పదోన్నతి కల్పించి ఆమెను ఏలూరులోనే ఎల్టీఎం అండ్ ఎస్పీఎం విభాగానికి బదిలీ చేశారు. ఏలూరు ఎల్టీఎం అండ్ ఎస్పీఎం విభాగంలో డిప్యూ టీ ఈఈగా పనిచేస్తున్న కె.రమేష్ను జీలుగుమిల్లి ఆపరేషన్ డిప్యూటీ ఈఈగా బదిలీ చేశా రు. జీలుగుమిల్లి ఆపరేషన్ డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న ఎన్.పద్మినిని అనకాపల్లి ప్రొటెక్షన్ విభాగానికి బదిలీ చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల కట్టడి ఆగిరిపల్లి : గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు, చోరీలను అరికట్టవచ్చని డీఎస్సీ కేఎన్వీ ప్రసాద్ అన్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఆదివారం వ్యాపారస్తులకు సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. వ్యాపారులు తమ దుకాణాల ముందు తప్పకుండా సీసీ కెమెరా లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దుకాణాల ముందు వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా, ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. ఎస్సై శుభశేఖర్, ఆగిరిపల్లి మర్చంట్స్ చాంబర్ అసోసియేషన్ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంపు దెందులూరు/భీమడోలు: జిల్లాలో రైతుల విజ్ఞప్తి మేరకు ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 2.50 లక్షల టన్నులకు పెంచినట్టు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. దెందులూరు మండలంలోని కొవ్వలి, భీమడోలు మండలంలోని పోలసానిపల్లి జాతీయ రహదారిపై ఆరబెట్టిన ధా న్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రాల్లో టార్గెట్లు పెంచేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ధాన్యం కొనుగోలుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో రైతులకు 51,32,300 గోనె సంచులను సరఫరా చేసి 2.05 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రైతుల కోరిక మేరకు పెంచిన లక్ష్యానికి అనుగుణంగా 0.45 లక్షల టన్నులకు గాను 11.25 లక్షల సంచులు అవసరం కాగా 8,95,410 సంచులు అందుబాటు లో ఉంచామన్నారు. పెంచిన లక్ష్యానికి అనుగుణంగా సిబ్బంది ట్రక్ షీట్ నమోదు చేసి రైస్ మిల్లులకు పంపాలని ఆదేశించారు. జిల్లా పౌరసరఫరాల మేనేజర్ పి.శివరామమూర్తి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల అధికారి వై.భాను ప్రతాప్ రెడ్డి ఉన్నారు. -
దంచి కొట్టి.. వెతలు మిగిల్చి
పెదవేగి : ధాన్యంపై బరకాలు కప్పుతూ.. జంగారెడ్డిగూడెం : లక్కవరంలో కల్లాల్లో ధాన్యంపై బరకాలు కప్పుతున్న రైతు ఉంగుటూరు: తడిసిన ధాన్యం బస్తాలు ఏలూరు (మెట్రో): జిల్లాలో గాలివాన బీభత్సం బెంబేలెత్తించింది. వారం రోజులుగా విభిన్న వాతావరణం జిల్లావాసులను కలవరపెడుతోంది. ఆదివారం వేకువజాము నుంచే ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులు వీచాయి. ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 24.7 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు అంచనా. ఏలూరుతో పాటు బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడి, కై కలూరు ప్రాంతాల్లో ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. వాతావరణంలో మార్పులతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నేలకొరిగిన చెట్లు ఈదురుగాలులకు ఏలూరులో పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. ఎన్ఆర్ పేటలో భారీ వృక్షం నేల కూలింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. భీమడోలు మండలం గుండుగొలనులో చెట్లు నేలకొరిగాయి. చాట్రాయి మండలంలో వీధు లు జలమయం కాగా.. చింతలపూడిలో భారీ వర్షం కురిసింది. బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. లింగపాలెం మండలంలో ఉరుములు భయపెట్టాయి. కై కలూ రు, కై కలూరు మండలంలో తీవ్ర ఈదురుగాలులు, వర్షంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కై కలూరు, లింగపాలెం, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, ఏలూరులోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. 24.7 సెం.మీ వర్షపాతం జిల్లావ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుమారు 24.7 సెం. మీ వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. సోమవారం ఉదయానికి పూర్తి వివరాలు తెలుస్తామన్నారు. మండలాల వారీగా ముసునూరులో 66.4 మి.మీ, లింగపాలెంలో 55.2, ముదినేపల్లిలో 48.6, చాట్రాయిలో 46.2, మండవల్లిలో 42.2, జంగారెడ్డిగూడెంలో 38.4, పోలవరంలో 36.6, నూజివీడులో 33.2, బుట్టాయగూడెంలో 33.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉంగుటూరులో 30.2, ఆగిరిపల్లిలో 25.6, కై కలూరులో 22.6, పెదపాడులో 17.4, కామవరపుకోటలో 16.8, జీలుగుమిల్లిలో 15, టి.నరసాపురంలో 14.8, భీమడోలులో 12.8, ఏలూరు నగరంలో 12.4, నిడమర్రులో 12.2, చింతలపూడిలో 10.4, ద్వారకాతిరుమలలో 10, వేలేరుపాడులో 9.6, పెదవేగిలో 8.6, ఏలూరు రూరల్లో 8.2, కుకునూరులో 8.2, కలిదిండిలో 6.2, కొయ్యలగూడెంలో 5.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అన్నదాత.. గుండెకోత అకాల వర్షానికి రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. జిల్లాలో 78,317 ఎకరాల్లో వరి ప్రధాన పంటగా సాగు చేయగా 3.53 లక్షల టన్ను ల ధాన్యం ఉత్పత్తి అంచనా. ఇప్పటివరకూ 2.05 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించగా.. రైతుల వద్ద 1.40 లక్షల టన్నుల ధాన్యం ఉంది. దీనిలో సుమారు లక్ష టన్నుల ధాన్యం రైతులు ఆరబెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో ధాన్యం తడిచిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. జడిపించిన వాన జిల్లాలో గాలివాన బీభత్సం 24.7 సెం.మీ వర్షపాతం నమోదు కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు లోతట్టు ప్రాంతాలు జలమయం పంటను కాపాడుకునేందుకు రైతుల పాట్లు వారం రోజులుగా భిన్న వాతావ‘రణం’వాతావరణ మార్పులతో ఆరోగ్య సమస్యలు ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైరల్ ఫీవర్లు వస్తాయి. దగ్గు, జలుబు సమస్యలు ఎదురవుతాయి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వాతావరణ మార్పుల మూలంగా శరీరం రోగనిరోధక శక్తిని కోల్పోతుంది. ఈ వాతావరణానికి అనుగుణంగా ఆహారంలోనూ మార్పులు చేసుకోవాలి. – బంకా రవికుమార్, వైద్యుడు, ఏలూరు -
● బొండం కొట్టండి ప్లీజ్!
నాకో కొబ్బరి బొండం కొట్టండి.. అంటూ భక్తులు ట్రాక్టర్ వద్ద ఎగబడ్డారు. చింతలపూడికి చెందిన జల్లిపల్లి రామకృష్ణ, సులోచన దంపతులు వారి పెళ్లిరోజు సందర్భంగా ఆదివారం భక్తుల కోసం 1,600 కొబ్బరి బొండాలు ట్రాక్టర్లో తీసుకొచ్చారు. వాటిని ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదిక వద్ద భక్తులకు పంపిణీ చేశారు. కొబ్బరి బొండాలు కొట్టివ్వడం ప్రహసనంగా మారింది. ఈ క్రమంలోనే బొండాలు అందుకున్న భక్తులు నాకో బొండం కొట్టివ్వండి అంటూ ట్రాక్టర్ వద్ద ఎగబడ్డారు. –ద్వారకాతిరుమల -
బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండ
ముసునూరు: ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల వేళ బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. చెక్కపల్లిలో ఆదివారం గాలివాన ధాటికి చెట్టు విరిగి ఇంటిపై పడడంతో మృతి చెందిన బాలుడు మామిళ్ల బాలగోవింద్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చి ఆర్థిక సాయం అందించారు. పార్టీ మండల అధ్యక్షుడు మూల్పూరి నాగ వల్లేశ్వరరావు, జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, వైస్ ఎంపీపీ రాజానాయన, సొసైటీ మాజీ అధ్యక్షుడు కాటేపల్లి లింగారావు, నాయకులు కె.రమేష్, శ్రీనివాసరావు, సత్యం ఉన్నారు. -
ప్రశాంతంగా నీట్ పరీక్షలు
ఏలూరు (ఆర్ఆర్పేట) : జిల్లాలోని ఐదు కేంద్రాల్లో నీట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కేంద్రాల్లోకి విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి అనుమతించారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేంద్రాల్లోకి పంపించారు. మొత్తం 1,200 మంది విద్యార్థులకు 1,162 మంది హాజరయ్యారు. ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 240 మందికి 232 మంది, కస్తూరిబా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలో 360 మందికి 347 మంది, ఆర్ఆర్పేట సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాల కేంద్రంలో 240 మందికి 234 మంది, గోపన్నపాలెం కేంద్రీయ విద్యాలయ కేంద్రంలో 240 మందికి 235 మంది, గోపన్నపాలెం ప్రభుత్వ హైస్కూల్ కేంద్రంలో 120 మందికి 114 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫిజిక్స్ ప్రశ్నలు క్లిష్టంగా, బయాలజీ సులువుగా, కెమిస్ట్రీ ప్రశ్నలు మోస్తరుగా ఉన్నట్టు విద్యార్థులు అన్నారు. -
పేరుపాలెం బీచ్లో యువకుడి గల్లంతు
యలమంచిలి: మండలంలోని అబ్బిరాజుపాలెం గ్రామానికి చెందిన వలవల పవన్కుమార్ (21) పేరుపాలెం వద్ద సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం భీమవరంలో హాస్టల్లో ఉంటూ డీఎన్నార్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో భీమవరం నుంచి ఎనిమిది మంది స్నేహితులు కలసి పేరుపాలెం బీచ్కు వెళ్లాడు. తెల్లవారుజామునే సముద్రం వద్దకు వెళ్లి స్నానానికి లోనికి వెళ్లారు. లోపలకు వెళ్లడంతో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్థానికులు చూసి తాడు సహాయంతో ఇద్దరిని రక్షించారు. పవన్కుమార్ గల్లంతయ్యాడు. పవన్కుమార్ గల్లంతుతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వలవల రాముడు, రామ తులసి దంపతులకు ఇద్దరు కుమారులు. ఆస్తి లేకపోయిన ఇద్దరు కుమారులను కష్టపడి ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చాలా బాధాకరమని అబ్బిరాజుపాలెం సర్పంచ్ కామిశెట్టి సాయిబాబు చెప్పారు. -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను అమ్మను ఆదివారం దర్శించుకున్నారు. కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూల అమ్మకం, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల ద్వారా మొత్తం రూ.61,105 ఆదాయం వచ్చిందని తెలిపారు. గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో భారీ వర్షం కురవడంతో మంగమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు. యోగా చాంపియన్కు సత్కారం తాడేపల్లిగూడెం (టీఓసీ): రెండో ఆసియా యోగాసన చాంపియన్షిప్ పోటీలలో ఇటీవల బంగారు పతకం సాధించిన భీమవరానికి చెందిన బాలం శిరీషను ఆదివారం తాడేపల్లిగూడెం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఆరా పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, నేషనల్ యోగాసన కోచ్ కరిబండి రామకృష్ణ, యోగా సభ్యులు ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ బాలం శిరీష కఠోరమైన దీక్షతో బంగారు పతకం సాధించడం పలువురికి ఆదర్శప్రాయం అన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి పెదవేగి: బైక్ అదుపుతప్పి పాల వ్యాన్ను ఢీ కొట్టిన ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు డెయిరీ ఫాంలో బిహార్కు చెందిన చందన్ యాదవ్, మనోజ్ యాదవ్లు 45 రోజులుగా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి కొప్పులవారిగూడెం నుంచి వేగివాడలో ఉన్న స్నేహితులను కలిసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ముండూరు సమీపంలో బైక్ అదుపుతప్పి పాల వ్యాన్ను ఢీ కొట్టింది. ప్రమాదంలో చందన్ యాదవ్ (25) అక్కడికక్కడే మృతిచెందగా మనోజ్ యాదవ్కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామకృష్ణ చెప్పారు. -
శ్రీవారి క్షేత్రంపై గాలివాన ఎఫెక్ట్
ద్వారకాతిరుమల: ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా శ్రీవారి ఆలయ ఆవరణలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పాక్షికంగా దెబ్బతింది. ద్వారకాతిరుమల–భీమడోలు ప్రధాన రహదారిలో పలు చోట్ల వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలో, గొల్లగూడెం, పంగిడిగూడెం వద్ద రోడ్డుపై నీరు నిలిచింది. వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. ద్వారకాతిరుమలలో వర్షం దాటికి డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మురుగు, చెత్తా, చెదారం రోడ్డుపైకి చేరింది. దాంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సొసైటీ పెట్రోల్ బంకు ఎదురుగా, లక్ష్మీపురం నిర్మిత కేంద్రం, దొరసానిపాడు శివారులో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ వైర్లపై పడ్డాయి. దాంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మార్కెట్ యార్డులో కూరగాయల దుకాణాలు గాలులకు అతలాకుతలమయ్యాయి. -
బాలికకు ఆర్థిక సాయం
కొయ్యలగూడెం: కొయ్యలగూడెంకు చెందిన కంచర్ల జ్యోత్స్నకు వైద్య చికిత్స నిమిత్తం రూ.30 వేలు ఉడుత స్వచ్ఛంద సంస్థ అందజేసిందని పాప తండ్రి కంచర్ల రాజేష్ ఆదివారం తెలిపారు. సాక్షిలో ఏప్రిల్ 29న ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు శీర్షికకు స్పందించిన హైదరాబాద్కు చెందిన ఉడుత స్వచ్ఛంద సంస్థ సహకారం అందించిందన్నారు. సుమారు పన్నెండు లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సకు ఖర్చు అవుతుందని వైద్యులు అనడంతో దాతలపై ఆధారపడి ఉన్నామని రాజేష్ తెలిపారు. ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి ఏలూరు (టూటౌన్): గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. అదివారం స్థానిక అన్నే వెంకటేశ్వరరావు భవనంలో మే 20న ఉపాధి పనులు బంద్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ముద్రించిన కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రెండు నెలలు కావస్తున్న పనిచేసిన కూలీలకు సకాలంలో వేతనాలు ఇవ్వలేదని మండిపడ్డారు. 11 కాసుల బంగారం చోరీ ఉండి: గ్రామంలోని శేషాద్రి మధుసూధనరావు చెందిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు ఆదివారం తెల్లవారుజామున దోపిడీకి పాల్పడ్డారు. చోరీలో 11 కాసుల బంగారం, రూ.35 వేల నగదు దోచుకుపోయారు. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలరించిన సంగీత నృత్యోత్సవాలు ఏలూరు (ఆర్ఆర్పేట): కళాదీపిక నృత్య అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక వైఎంహెచ్ఏ హాల్లో జరుగుతున్న సంగీత నృత్యోత్సవాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండో రోజున ఆదివారం సాయంత్రం త్యాగరాజ స్వామి దివ్య నామ సంకీర్తన సంగీత కార్యక్రమం వీనులవిందు చేసింది. కళా దీపిక నృత్య అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య విన్యాసాలు నేత్రపర్వంగా నిలిచాయి. అతిథులుగా కళారత్న కేవీ సత్యనారాయణ, ఈడా మాజీ చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి, గరికపాటి కాళిదాసు తదితరులు పాల్గొన్నారు. వయోలిన్ విద్వాంసురాలు ఏ.జయలక్ష్మి రామచంద్రన్, సంగీత విదుషిమణి గుడిపాటి లలితా శర్మ, సంగీత కళానిధి పరిమి సావిత్రి, నాట్యాచార్యలు డీ. హేమసుందర్, గండికోట రాజేష్, రాజ్కుమార్లను అకాడమీ తరఫున సత్కరించారు. రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు పెదవేగి: పెదవేగి మండలం రాట్నాలకుంటలో రాట్నాలమ్మను ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వారం పూజా టిక్కెట్లపై రూ.48,000, లడ్డూ ప్రసాదంపై రూ 23,250 ఆదాయం లభించిందని ఈవో చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
కూటమిలో నామినేటెడ్ రగడ
నేతల లాబీయింగ్ సాక్షి ప్రతినిధి,ఏలూరు: పేరుకే కూటమి ప్రభుత్వం.. పెత్తనమంతా టీడీపీదే.. కొన్నిచోట్ల జనసేన ఎమ్మె ల్యేలు ఉన్నా కూడా టీడీపీ నేతలే హవా సాగిస్తుండటం, గతంలోనే ముఖ్య నేతల మధ్య ఖరారైన పదవుల గురించి రెండు పార్టీల్లో ఆశావహులు పోటాపోటీగా మారుతుండటంతో ఉమ్మడి పశ్చిమలో నామినేటెడ్ రగడ తారాస్థాయికి చేరుకుంది. నియోజకవర్గ స్థాయి మార్కెట్ యార్డు పదవులు మొదలు జిల్లాస్థాయి డీసీసీబీ చైర్మన్ వరకు ప్రతిదీ పెండింగ్లోనే పడింది. డీసీసీబీ చైర్మన్ పదవి జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావుకు ఖరారు అయిందని గతంలో బలంగా ప్రచారం సాగింది. తాజాగా మారిన సమీకరణాలతో టీడీపీ నేత కోళ్ల నాగేశ్వరరావు పేరు తెరమీదకు రావడంతో నియామకం పెండింగ్లో పడింది. పెండింగ్లో పదవులు జిల్లాలో టీడీపీ, జనసేన నేతల మధ్య నామినేటెడ్ రగడ కొనసాగుతోంది. గతంలో కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక జిల్లా ఇన్చార్జి మంత్రి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ రెండు, మూడు ప ర్యాయాలు ఎమ్మెల్యేలు, రెండు పార్టీల ముఖ్యుల తో సమావేశాలు నిర్వహించారు. దానికి అనుగుణంగా నియోజకవర్గాల్లో పదవులను రెండు పార్టీలు ఆమోదయోగ్యంగా పంచుకోవాలని, ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గంలో ఆ పార్టీకి మొ దటి ప్రాధాన్యం కూటమిలో మిగిలిన పార్టీలకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. దీంతో పదవుల రగడకు తెరలేచింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్గా కొటికలపూడి గోవిందరావు, రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులను ఖరారు చేశారని నాలుగు నెలల క్రితమే ఆయా నేతల కార్యాలయాల్లో సంబరాలు నిర్వహించారు. పార్టీ జిల్లాస్థాయి నేతలు కొందరు ఇద్దరినీ కలిసి వ్యక్తిగతంగా అభినందనలు కూడా తెలిపారు. కట్ చేస్తే.. నాలుగు రోజుల క్రితం 10 జిల్లాల డీసీసీబీ చైర్మన్లను కూటమి ప్రభుత్వం నియమించింది. ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే జనసేన నేపథ్యంలో పెండింగ్లో పెట్టింది. పదవుల పందేరం డీసీసీబీ చైర్మన్ పదవి కోసం రెండు పార్టీల నేతల పోటాపోటీ ఈ పదవి జనసేనకని గతంలో ప్రకటన రెండు పార్టీల పోటీతో చైర్మన్ నియామకం పెండింగ్ మార్కెట్ యార్డు చైర్మన్ పదవుల్లోనూ ఇదే తంతు జిల్లాలో ప్రధాన యార్డుల పదవులన్నీ ఖాళీ నామమాత్రపు ప్రాధాన్యత కూడా లేదని జనసేన నేతల ఆవేదన తూర్పుగోదావరి జిల్లా పదవులతో లింక్ పెట్టి అక్కడ టీడీపీకి ఇస్తే ఇక్కడ జనసేనకు ఇవ్వాలని, అక్కడ జనసేనకు ఇస్తే ఇక్కడ టీడీపీకి ఇవ్వాలని కొందరు నేతలు చక్రం తిప్పడంతో డీసీసీబీ పెండింగ్లో పడింది. దీంతో అనూహ్యంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు పేరు తెరపైకి రావడంతో పాటు ఇద్దరు నేతలు లాబీయింగ్ మొదలుపెట్టారు. ఇదే రీతిలో ఏలూరు జిల్లాలో చింతలపూడి అసెంబ్లీ సీటును టీడీపీ కోసం తాము త్యాగం చేశాం కాబట్టి మార్కెట్ యార్డు చైర్మన్ ఇవ్వాలని జనసేన నేతలు బలంగా పట్టుపట్టడంతో పాటు ముఖ్యులందరికీ వినతిపత్రాలు కూడా ఇచ్చారు. అయితే ఈ పదవిని టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు టీడీపీ నేతకు ఖరారు చేశారు. దీనిపై వివాదం కొనసాగుతుండటంతో పెండింగ్లో ఉంది. అలాగే నూజివీడు, పోలవరం, కై కలూరులోనూ ఇవే డిమాండ్లు ఉండటంతో ఆయా యార్డుల పదవులు భర్తీ కాని పరిస్థితి. కై కలూరులో బీజేపీ నేతలెవ్వరూ యార్డు పదవులు అడగని పరిస్థితి. టీడీపీలోనే ఇద్దరు నేతలు పోటాపోటీగా డిమాండ్ చేస్తుండటం, ఎమ్మెల్యే ఒకరికి ఆమోదం తెలిపినా వివాదం రేగడంతో గతంలో ప్రకటించిన రెండు జాబితాలోనూ భర్తీ కాని పరిస్థితి. పోలవరంలో టీడీపీ నేతలు, జనసేన ఎమ్మెల్యే మధ్య ఇవే వివాదం కొనసాగుతుండటంతో ఇక్కడ కూడా పెండింగ్లో ఉంచారు. పోలవరం ఎస్టీ, కై కలూరు బీసీ–మహిళ, నూజివీడు ఎస్సీ–జనరల్కు కేటాయించారు. ఆశావహులు ఉన్నా గందరగోళంలో పరిస్థితి కొనసాగుతుండటం గమనార్హం. -
సంక్షోభంలో మామిడి పరిశ్రమ
చింతలపూడి: మామిడి పరిశ్రమ ఈ సంవత్సరం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అకాల వర్షాలు, వడగళ్లు, మంగుతెగులు వంటి అనేక కారణాలతో మామిడి దిగుబడి తగ్గింది. మామిడి ఎగుమతుల్లో ఏలూరు జిల్లాలో నూజివీడు తరువాత స్థానం చింతలపూడిదే.. ఈ ప్రాంతంలో ప్రస్తుతం వ్యాపారం మందగించింది. సీజన్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా ఇంతవరకూ ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేవు. కాయ దిగుబడి లేకపోవడం, కోతకు వచ్చిన కొద్దిపాటి కాయ నాణ్యత లోపించడంతో ఎగుమతులు మందగించాయని వ్యాపారులు చెబుతున్నారు. కాయ మంచి సైజుకు ఎదిగే వరకూ చెట్టుమీదే ఆపడానికి రైతులకు ధైర్యం చాలడంలేదు. అకస్మాత్తుగా గాలి దుమ్మో, వడగళ్ల వానో వస్తే మరింత నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇదే సమయానికి రోజుకు 25 లారీల సరుకు ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది ఐదు లారీలు కూడ ఎగుమతి చేయలేక పోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. ఇంతవరకు చింతలపూడి ప్రాంతం నుంచి 300 లారీల సరుకు మాత్రమే ఎగుమతి చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో టన్ను రూ.70 వేలు ఉన్న మామిడి ధర ఇటీవల హఠాత్తుగా పడిపోయింది. ప్రస్తుతం టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.25 వేలుగా ఉంది. ప్రస్తుత ధర రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కాదు. నాలుగేళ్లుగా మార్కెట్లో మామిడి ధరలు చూస్తే 2022లో ప్రారంభంలో టన్ను రూ.లక్షకు అమ్ముడైంది. సీజన్ చివరికి వచ్చేసరికి టన్ను రూ.25 వేలకు పడిపోయింది. 2023లో ప్రారంభంలో టన్ను రూ.80 వేలు అమ్మగా సీజన్ చివరిలో రూ.20 వేలకు చేరింది. 2024లో టన్ను రూ.90 వేలు అమ్మగా సీజన్ చివరిలో టన్ను రూ.30 వేలకు పడిపోయింది. ఇక్కడి నుంచి ముంబయ్, కోల్కతా, నాగపూర్, గుజరాత్, హైదరాబాద్, పూనే, అహ్మదాబాద్, ఢిల్లీ, కాన్పూర్, ఒడిశా వంటి ప్రాంతాలకు వ్యాపారులు మామిడి ఎగుమతి చేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన మామిడిని రవాణా చేయడం వ్యాపారులకు భారంగా మారింది. ఈ ప్రాంతం నుంచి నాగపూర్ ఎక్కువగా ఎగుమతవుతుంది. విడికాయలు గ్రేడింగ్, ప్యాకింగ్ చేస్తే టన్నుకు రూ.5 వేల వరకూ ఖర్చవుతుందని వ్యాపారులు వాపోతున్నారు. దీంతో పాటు కిరాయి రూ 50,000 అవుతుందంటున్నారు. ఈ దశలో అటు రైతుల్లో, ఇటు వ్యాపారుల్లో ఇకపై మామిడి లాభసాటి కాదన్న అభిప్రాయం నెలకొంది. జిల్లాలో తగ్గిన విస్తీర్ణం జిల్లాలో అన్ని రకాల ఉద్యాన పంటలు కలిపి 1,08,300 హెక్టార్లలో ఉన్నాయి. ఒకప్పుడు జిల్లాలో లక్షలాది ఎకరాల్లో విస్తరించి ఉండే మామిడి తోటలు ప్రస్తుతం 40,000 ఎకరాలకు తగ్గిపోయాయి. అధిక భాగం మామిడి తోటలు తొలగించి రైతులు పామాయిల్ తోటలు వేసుకున్నారు. మామిడి స్థానంలో పామాయిల్ 44 వేల హెక్టారుల్లో ఆక్రమించింది. జిల్లాలో నూజివీడు నియోజకవర్గంతో పాటు చింతలపూడి, ద్వారకా తిరుమల, నల్లజర్ల, టి.నరసాపురం ప్రాంతాల్లో మాత్రమే మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. మామిడి తోటల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులకు ప్రోత్సాహం అందించక పోతే భవిష్యత్తులో మామిడి అంతరించిపోయే ప్రమాదం ఉంది. భారీగా తగ్గిన దిగుబడి గిట్టుబాటు ధర లేక దిగాలు మెట్ట ప్రాంతంలో ఏటా రూ.10 కోట్ల వ్యాపారం మామిడి రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి. ఏటా సకాలంలో సరైన వర్షాలు కురవకపోవడం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడులు లేవు. ఏటా మామిడి వల్ల నష్టాలను తట్టుకోలేక నాకున్న 4 ఎకరాల తోటను తొలగించాల్సి వచ్చింది. – చేపూరి ఖాదర్బాబు, రైతు, చింతలపూడి మండలం నష్టం తప్పేలా లేదు ఈ ఏడాది నష్టం వచ్చేలా ఉంది. నాణ్యత లేని కారణంగా ఎగుమతులు మందగించాయి. ధర పెరిగితేనే కాని నష్టాల నుంచి బయటపడడం కష్టం. ప్రారంభంలో టన్ను రూ.70 వేల వరకూ ఉన్న ధర ప్రస్తుతం రూ.20 వేలు అమ్ముతుంది. ప్రస్తుతం ధర ఇలాగే కొనసాగితే రైతులు, వ్యాపారులు నష్టపోవాల్సిందే. – చిక్కాల నాగేశ్వర్రావు, మామిడి కమిషన్ వ్యాపారి, చింతలపూడి -
మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీసు
ఏలూరు (టూటౌన్): దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 20 నుంచి స మ్మెలోకి వెళుతున్నట్టు ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎ.అప్పరాజు తెలిపారు. శనివారం సమ్మె నోటీసును ఏలూరు అడిషనల్ కమిషనర్ చంద్రయ్యకు అందజేశారు. ఏలూరు కార్పొరేషన్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎన్ ఎంఆర్ కార్మికుల సర్వీసులను రెగ్యులరైజ్ చే యాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని, సరెండర్ లీవ్ బకాయిలు, డీఏలు, 11వ పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని సిబ్బందికి కనీస వేతనం రూ.35 వేలు, సమాన పనికి సమాన వేతనం కోసం సమ్మెలో పాల్గొంటున్నట్టు చెప్పారు. సంఘ సహాయ కార్యదర్శి డి.వెంకటేశ్వరరావు, కోశాధికారి బి.నారాయణరావు పాల్గొన్నారు. నాణ్యతతో పనులు చేపట్టాలి ఏలూరు(మెట్రో): జి ల్లాలో రూ.5.73 కోట్ల తో చేపట్టిన సోషల్ వె ల్ఫేల్ హాస్టళ్ల అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో హాస్టళ్ల అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా హాస్టళ్లలో వసతులు కల్పించాలన్నారు. వేసవి సెలవులు అనంతరం హాస్టళ్లు పునః ప్రారంభిచేలోపు పనులు పూర్తిచేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించిన 8 హాస్టళ్ల భవనాలు తొలగించడం, నూతన భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సోషల్ వెల్ఫేర్ ఇన్చార్జి జేడీ ఎం.ముక్కంటి, అధికారులు పాల్గొన్నారు. ధరల నియంత్రణకు చర్యలు ఏలూరు(మెట్రో): జిల్లాలో ధరల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పౌర సరపరాల శాఖ అధికారి వై.ప్రతాప్రెడ్డి, ఉద్యాన శాఖ అధికారి ఎస్.రామ్మోహన్, వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ అధికారి వి.మహేంద్రనాద్ పాల్గొన్నారు. లింగ నిర్ధారణను ఉపేక్షించం ఏలూరు టౌన్: జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిఘాతో పాటు అవగాహన సద స్సులు నిర్వహించాలని డీఎంహెచ్ఓ ఆర్.మాలిని అన్నారు. ఏలూరులోని డీఎంహెచ్ఓ కార్యా లయంలో శనివారం పీసీ, పీఎన్డీటీ యాక్టు– 1994 సలహా కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో డెకాయ్ ఆపరేషన్లు పటిష్టంగా అమలు పరిచి, సీ్త్ర నిష్పత్తిని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా లోని 115 స్కానింగ్ కేంద్రాల్లో తరచూ తనిఖీ లు నిర్వహించాలన్నారు. డెమో ఇన్చార్జి కె.ప్రదీప్తి, వైద్యాధికారులు పాల్గొన్నారు. అమరావతి సభకు వెళ్లొస్తుండగా ప్రమాదం నరసాపురం రూరల్: మండలంలోని సీతారామపురంలో 216 జాతీయ రహదారిపై శనివా రం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అమరావతిలో ప్రధాని సభకు వెళ్లి వస్తున్న రాజోలు డిపో బస్సు బ్రేక్ డౌన్ కావడంతో సంఘటనా స్థలంలో నిలిపివేశారు. అదే సభకు వెళ్లి తిరిగి వస్తున్న రాజోలు డిపో మరో బస్సు ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్, సిబ్బందికి గాయాలు కాగా 108లో నరసాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.అడిషనల్ కమిషనర్కు సమ్మె నోటీసు అందిస్తున్న దృశ్యం -
గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్య
భీమవరం: భీమవరం పట్టణంలో మతిస్థిమితం లేని వ్యక్తి చాకుతో గొంతుకోసుకుని మృతిచెందాడు. ఉండి గ్రామం పెదపేటకు చెందిన గాతల క్రాంతికుమార్(35) కొంతకాలంగా మానసికంగా ఇబ్బందిపడుతున్నాడు. శుక్రవారం పనికి వెళ్లిన క్రాంతికుమార్ అక్కడ పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి శనివారం భీమవరం ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం కుటుంబసభ్యులు తీసుకువెళ్లగా.. దెయ్యాలు వస్తున్నాయంటూ వైద్యానికి సహకరించలేదు. దీంతో ఇంటికి తీసుకు వెళ్తుండగా అంబేడ్కర్ సెంటర్కు వచ్చే సరికి యనమదుర్రు డ్రెయిన్లోకి దూకాడు. వెంటనే బయటకు తీయగా అక్కడే పండ్లు అమ్ముతున్న వ్యక్తి నుంచి చాకు తీసుకుని పరుగులు పెడుతూ ఒంటిపై గాయాలు చేసుకున్నాడు. ఉండి రోడ్డులోని మల్టీఫ్లెక్స్ వద్దకు వెళ్లేసరికి గొంతు కోసుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి జాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్సై ఇజ్రాయిల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో బస్సు దగ్ధం కై కలూరు: బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల స్కూల్ బస్సు దగ్ధమైన ఘటన కై కలూరు మాత ఇంగ్లీషు మీడియం స్కూల్ గ్రౌండ్లో శనివారం మధ్యాహ్నం జరిగింది. వేసవి సెలవులు కావడంతో బస్సు గ్రౌండ్లో ఉంచారు. బస్సు నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ ఆఫీసర్ క్రాంతికుమార్ సిబ్బందితో హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. రూ.3 లక్షలకు పైగా నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. కొబ్బరి చెట్టుకు మంటలు కై కలూరు: మండవల్లి మండలం చావలిపాడు రైల్వేగేటు సమీపంలో జమ్ము గడ్డికి నిప్పంటుకుని కొబ్బరి చెట్టు మొదలు వరకు మంటలు వ్యాపించాయి. సమీపంలో ఇళ్లతో పాటు ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కై కలూరు అగ్నిమాపక అధికారి సకాలంలో మంటలు అదుపు చేశారు. కలిదిండి పోలీసు స్టేషన్ వెనక భాగంలో కిక్కిస పొదలలో మంటలు వ్యాపించగా.. అగ్నిమాపక అధికారులు మంటలను ఆర్పివేశారు. -
అంజన్నకు అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో ఆంజనేయస్వామికి శనివారం అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖమండపంపై స్వామి ఉత్సవ మూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. మద్యాహ్నం వరకు వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,41,401 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. స్వామి నిత్యాన్నదాన సత్రంలో అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులతో పోటెత్తిన శ్రీవారి క్షేత్రం ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. తూర్పురాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణ కట్ట తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. ఆలయ అనివేటి మండపంలో ఒడుగు వేడుకలు అధిక సంఖ్యలో జరిగాయి. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు తెలపండి ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను పాఠశాల విద్యా శాఖ ఆర్జేడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, దీనిపై ఎవరికై నా అభ్యంతరాలున్నా తెలపాలని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జీ.నాగమణి ఒక ప్రకటనలో కోరారు. ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ఆధారంగా రూపొందించి గత ఏప్రిల్ 22వ తేదీ వరకూ అభ్యంతరాలకు గడువు ఇచ్చామని, అనంతరం తమకు అందిన అభ్యంతరాల ప్రకారం జాబితాను తయారు చేసి ఆర్జేడీ కాకినాడ వెబ్సైట్లో, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణ జిల్లా విద్యాశాఖల వెబ్సైట్లో, నోటీస్ బోర్డుల్లో అందుబాటులో ఉంచామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులకు గాయాలు
ద్వారకాతిరుమల: మండలంలోని రాళ్లకుంట సెయింట్ గ్జేవియార్ పాఠశాల వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కధనం ప్రకారం.. రాళ్లకుంటకు చెందిన పరసా జనార్ధన్, సరోజిని దంపతులు ద్వారకాతిరుమలలోని సొసైటీ పెట్రోల్ బంకు సమీపంలో నిమ్మకాయలు, కొబ్బరి కాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం ముగించుకుని సాయంత్రం టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నారు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి జి.కొత్తపల్లి నుంచి ద్వారకాతిరుమల వైపుకు వెళుతున్న ఆటోను వీరి వాహనం ఎదురుగా ఢీకొట్టింది. దాంతో జనార్ధన్, సరోజిని దంపతులు రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 ఆంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో స్థానికులు శ్రీవారి దేవస్థానం ఆంబులెన్స్లో పీహెచ్సీకి తరలించారు. ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి తణుకు అర్బన్: వాహనం ఢీకొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన తణుకు పట్టణంలో చోటు చేసుకుంది. 55 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తిని శుక్రవారం తణుకు ఆర్యోబీపై వాహనం ఢీకొట్టింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
తవ్వేయ్.. తరలించేయ్
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రోజూ రాత్రి వేళల్లో ఏదోక గ్రామంలో పొక్లెయిన్ల ద్వారా మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. పేదల గృహ నిర్మాణాలకు మట్టి రవాణాకు అనుమతి ఇవ్వని అధికారులు.. అక్రమార్కులు కొండలు, గుట్టలు తవ్వి మట్టి తరలిస్తూ కోట్లు గడిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుట్టాయగూడెం మండలం కె.బొత్తప్పగూడెం సమీపంలో నూతనంగా నిర్మించనున్న ఓ పెట్రోల్ బంక్ స్థలం వద్దకు చింతలపూడి ఎత్తిపోతల పథకం గట్టును కొల్లగొట్టి కొందరు మట్టిని తరలిస్తున్నారు. అధికారులు స్పందించి మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
నీట్కు సర్వం సిద్ధం
5 కేంద్రాలు.. 1,200 మంది విద్యార్థులు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో ఆదివారం జరుగ నున్న నీట్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. శనివారం ఏలూరులోని కస్తూరిబా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాల, కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. జిల్లాలోని ఐదు కేంద్రాల్లో 1,200 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, ఉదయం 11 గంటల నుంచి కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తామన్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు (సెల్ఫోన్, స్మార్ట్ వాచ్, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు) అనుమతి లేదన్నారు. దివ్యాంగ విద్యార్థుల కోసం వీల్ చైర్లు, సహాయకులను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 163బీ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. విద్యార్థులు అడ్మిట్ కార్డు తప్ప ఇంకేమీ తీసుకురాకూడదన్నారు. తహసీల్దార్లు వి.శేషగిరి, శ్రీనివాసరావు ఉన్నారు. పటిష్ట బందోబస్తు ఏలూరు టౌన్: నీట్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. శనివారం ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, జిల్లా అదనపు ఎస్పీ ఎన్.సూర్యచంద్రరావుతో కలిసి ఆయన పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశా రు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చే రుకునేలా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రాల వివరాలను అభ్యర్థులు సులభంగా తెలుసుకునేలా సహాయ కేంద్రాలు, సమాచార సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల పరిశీలన దెందులూరు: గోపన్నపాలెంలోని కేంద్రీయ విద్యాలయ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాలను డీఈఓ వెంకట లక్ష్మమ్మ, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ పరిశీలించారు. విద్యుత్, తాగునీరు, వైద్య సౌకర్యాలు, భవనాలను పరిశీలించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించమని స్పష్టం చేశారు. తహసీల్దార్ బి.సుమతి, ఎస్సై ఆర్.శివాజీ ఉన్నారు. పరీక్షా కేంద్రాలు.. విద్యార్థులు ● ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోటదిబ్బ, సబ్జైల్ ఎదురుగా, ఏలూరు – 240 ● కస్తూరిబా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాల, కోటదిబ్బ, ఏలూరు – 360 ● సుబ్బమ్మదేవి మున్సిపల్ హైస్కూల్, ఆర్ఆర్పేట, ఏలూరు – 240 ● కేంద్రీయ విద్యాలయ, గోపన్నపాలెం, దెందులూరు మండలం –240 ● ప్రభుత్వ హైస్కూల్, గోపన్నపాలెం – 120 -
ట్రిపుల్ ఐటీలో ఉత్తరం కలకలం
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆకాశ రామన్న ఉత్తరంతో కలకలం రేగింది. కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ, మెంటార్లందరికి ఈ ఉత్తరం శనివారం పోస్టులో వచ్చింది. యూనివర్సిటీ యాజమాన్యం కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ పట్ల ఒక విధంగా వ్యవహరిస్తూ , పర్మినెంట్ ఉద్యోగులకు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా దోచిపెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. తాము జీతాలు పెంచమని, గతంలో నెట్, సెట్ లేకుండా పీహెచ్డీకి ఇచ్చిన ఇంక్రిమెంట్లను ఇవ్వమని అడిగితే నిబంధనలంటూ అడ్డుపడుతున్న యాజమాన్యం, పర్మినెంట్ అధ్యాపకులకు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ తేదీలను మూడేళ్లు ముందుకు జరుపుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వమని అడిగితే జీవో నెంబరు 110ని బూచిగా చూపిస్తున్నారని, అదే శాశ్వత అధ్యాపకులకు మాత్రం జీవో నెంబరు 14, జీవో నెంబరు 20లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా పెయిడ్ జర్నల్స్, కాన్ఫరెన్స్ పేపర్లను చూపించి పదోన్నతుల తేదీలు జరిపించుకుంటున్నట్లు లేఖలో వివరించారు. ఇలా పలు ఆరోపణలు చేశారు. లోతైన విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అర్జీయూకేటీ కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ పేరుతో లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ఉన్నవన్నీ సత్యాలేనని, పీహెచ్డీ చేసిన మెంటార్లు, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.5 వేలు అదనపు ఇంక్రిమెంట్ కొన్నాళ్లు ఇచ్చి జీవో నెంబరు 110ను సాకుగా చూపించి ఆపేశారని, దీనివల్ల ఎంతో నష్టపోయామని వాపోతున్నారు. -
శవాలు కుళ్లిపోతున్నా పట్టించుకోరా?
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగం ఆధ్వర్యంలో శవ పరీక్ష కేంద్రం(మార్చురీ) పనిచేస్తోంది. నిత్యం జిల్లా పరిధిలో రోడ్డు, రైలు ప్రమాదాల్లో మరణించినవారు, అనుమానాస్పద మృతులు, హత్యలు, ఆత్మహత్యలు, చికిత్స పొందుతూ మృతిచెందిన వారి మృతదేహాల్ని మార్చురీలో భద్రపరుస్తారు. మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగానికి చెందిన వైద్య నిపుణులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తుంటారు. మార్చురీలోని ఫ్రీజర్ బాక్సులు పనిచేయక బంధువుల మృతదేహాలు పాడవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా సరిగా అంతిమ సంస్కారాలు చేయలేని పరిస్థితి నెలకొందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఐదు ఫ్రీజర్లే దిక్కు ఏలూరు జిల్లా వ్యాప్తంగా రోజూ రెండు, మూడు లేదా ఒక్కోసారి నాలుగైదు మృతదేహాలు జీజీహెచ్లోని మార్చురీకి వస్తాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణించినవారు, గుర్తు తెలియని మృతదేహాలు, రైల్వే డెత్స్ మృతదేహాలు మార్చురీలో రోజుల తరబడి భద్రపరచాల్సిన అవసరం ఉంటుంది. మార్చురీలో కేవలం రెండు పాత ఫ్రీజర్ బాక్సులు, మరో మూడు స్వచ్ఛంద సంస్థకు చెందిన ఫ్రీజర్ బాక్సులు ఏర్పాటు చేసిన అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే.. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన కొత్తలో 12 మృతదేహాలను భద్రపరిచేలా ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో ఉంచారు. మొదటి నుంచి ఈ ఫ్రీజర్ బాక్సులు పనిచేయటంలేదు. మరో రెండు పాత ఫ్రీజర్ బాక్సులు పూర్తిగా పాడైపోవటంతో బయో మెడికల్ ఇంజనీర్ విభాగం వాటిని పక్కన పెట్టేసింది. ఫ్రీజర్ బాక్సులు సక్రమంగా పనిచేయటం లేదని ఉన్నతాధికారులకు మొదట్లోనే నివేదించారని మెడికల్ కాలేజీ అధికారులు చెబుతున్నారు. జీజీహెచ్లో పరిష్కారం కాని ఫ్రీజర్ల సమస్యఆవేదనలో మృతుల బంధువులు ఏలూరు జీజీహెచ్లోని మార్చురీలో ప్రస్తుతం మరమ్మతులు చేసిన రెండు పాత ఫ్రీజర్ బాక్సులు, మరో మూడు స్వచ్చంద సంస్థకు చెందిన ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని మెడికల్ కాలేజీ అధికారులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా పరిధిలో రోజూ మూడు నుంచి నాలుగు మృతదేహాలు మార్చురీకి వస్తాయి. రైల్వే ప్రమాదాల్లో మృతదేహాలకు వారం రోజులకు పైగా పోస్టుమార్టం నిర్వహించే పరిస్థితి ఉండదు. సరాసరి రోజుకు మూడు నుంచి నాలుగు మృతదేహాలు మార్చురీలో భద్రపరుస్తారు. ఒక్కోసారి ఐదారు మృతదేహాలు మార్చురీకి వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2 పాత ఫ్రీజర్ బాక్స్ లు, స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన 3 ఫ్రీజర్ బాక్స్లు మాత్రమే ఉంటే మృతదేహాలను భద్రపర్చడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఫ్రీజర్ బాక్సులు లేకుంటే బంధువుల మృతదేహాలు పాడై దుర్గంధం వెదజల్లితే వారి కుటుంబ సభ్యులు ఎంత ఆవేదనకు గురవుతారనేది అధికారులకు పట్టదా? అని ప్రశ్నిస్తున్నారు. -
కారు ఢీకొని 8 గొర్రెల మృతి
ద్వారకాతిరుమల: మండలంలోని లైన్ గోపాలపురం జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం కారు ఢీకొని ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. స్థానికుల కథనం ప్రకారం.. లైన్ గోపాలపురానికి చెందిన రైతు దండుబోయిన కొండయ్య గొర్రెలను సమీపంలోని ఒక తోటలో మేపి, సాయంత్రం ఇంటికి తోలుకెళుతున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి రోడ్డు దాటుతున్న గొర్రెలను ఏలూరు నుంచి రాజమండ్రి వైపుకు వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 8 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వరకట్న వేధింపుల కేసు నమోదు కై కలూరు: వరకట్న వేధింపులతో పాటు, పరాయి సీ్త్రతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడంటూ భర్తపై భార్య రూరల్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చటాకాయి గ్రామానికి చెందిన ఘంటసాల చామంతి(29)తో అదే గ్రామానికి చెందిన ఘంటసాల వెంకన్నబాబు(35)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. భర్త మద్యానికి బానిసై వరకట్నం కోసం వేధిస్తున్నాడని, అతని తల్లిదండ్రులు సహకరిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదుపై రూరల్ ఎస్ఐ రాంబాబు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జోరుగా మట్టి అక్రమ రవాణా
కొయ్యలగూడెం : పొంగుటూరు పంచాయతీ కన్నాయగూడెం ఊర చెరువులో మట్టి అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తెల్లవారుజాము వరకు అక్రమార్కులు జేసీబీలతో టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. అధికారుల అండతో చట్టవిరుద్ధంగా తవ్వకాలు సాగిస్తున్నారని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. ఊర చెరువులో పశువుల కోసం ఉంచిన తాగునీటిని కూడా ఇంజిన్లతో తోడి అక్రమార్కులు తమకు అనువుగా ర్యాంపులను నిర్మించి మట్టి తోలకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్, మైనింగ్ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, అధికారుల సహకారంతోనే ఈ తవ్వకాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీడబ్ల్యుఏడి పరిధిలోని నందాల చెరువు, శ్రీరామ కట్టు, భీముని చెరువుల్లో రాత్రి వేళ రహస్యంగా తోలకాలు చేస్తున్నారు. తవ్వకాలు జరిపే వారి గురించి అధికారులకు సమాచారం ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే జేసీబీలు, టిప్పర్లు మాయమవుతున్నాయి. తవ్వకాల వల్ల చెరువు ఆకారం మారిపోతూ, భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. జెడ్పీలో పదోన్నతులు ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. ముగ్గురు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఎంపీడీవోలుగా, సీనియర్ అసిస్టెంట్లు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు వారికి ప్రమోషన్ ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మశ్రీ శుక్రవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో అందజేశారు. బర్డ్ హాస్పిటల్ ఇన్చార్జ్ డైరెక్టర్గా జగదీష్ ద్వారకాతిరుమల: టీటీడీ బర్డ్ హాస్పిటల్ ఇన్చార్జ్ డైరెక్టర్గా ద్వారకాతిరుమల విర్డ్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్, ప్రముఖ ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ గుడారు జగదీష్ నియమితులయ్యారు. ఈ మేరకు టీటీడీ ఈఓ శ్యామలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ జగదీష్ గతంలో బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇదిలా ఉంటే గత నెల 2న అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం, టీటీడీ బర్డ్ హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు ఆమోదం మేరకు ఈఓ శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. డాక్టర్ జగదీష్ బర్డ్ హాస్పిటల్ ఇన్చార్జి డైరెక్టర్గా కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడాది పాటు కొనసాగుతారు. అన్న కొడుకుపై కత్తితో దాడి పెంటపాడు: ఇంట్లో ఫ్యాన్ ఏర్పాటుపై వివాదం ఏర్పడి అన్న కొడుకుపై చిన్నాన దాడి చేసిన సంఘటన పరిమెళ్లలో చోటు చేసుకొంది. పెంటపాడు ఎస్సై కె.స్వామి తెలిపిన వివరాల ప్రకారం పరిమెళ్లకు చెందిన అన్నదమ్ములు వెన్నపు రాంబాబు, తన అన్న వెన్నపు రామకృష్ణలు రెండు పోర్షన్ల ఇంట్లో ఉంటున్నారు. బుధవారం రాంబాబు తన ఇంట్లో సీలింగ్ ప్యాన్ బిగించుకుంటున్నాడు. ఈ విషయంపై అన్న కొడుకై న నాగరాజుతో వాగ్వాదం జరిగింది. రాత్రి మళ్లీ ఘర్షణ పడగా.. చాకుతో నాగరాజుపై రాంబాబు దాడికి చేశాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
కొల్లేరు అందాలు కనుమరుగు
●లాంచీలతో ఆదాయం బాగుండేది నాకు 6 లాంచీలు ఉండేవి. సర్కారు కాల్వ నుంచి పెద్దింట్లమ్మ దేవస్థానానికి భక్తులను తీసుకెళ్లేవాడిని. లాంచీలపై వచ్చే ఆదాయంతో జీవించేవాళ్ళం. నేడు కొల్లేరు సరస్సులో నీరు లేదు. పైగా గుర్రపుడెక్క పేరుకు పోయింది. దీంతో లాంచీలు వెళ్ళలేని పరిస్థితి. – వై.త్రిమూర్తులు, లాంచీల యజమాని, గోకర్ణపురం తాటి దోనెలు నడపడం కళ కొల్లేరులో తాటిదోనెలు నడపడం పెద్ద కళ. ఇతర ప్రాంతాల ప్రజలు వీటిని నడపలేరు. కొన్ని సంవత్సరాల క్రితం అటవీశాఖ చిత్తడి నేలల దినోత్సవం రోజున సర్కారు కాల్వ వద్ద తాటిదోనెల పోటీలు నిర్వహించారు. కేరళ తరహా పడవల పోటీల మాదిరిగా కొల్లేరులో దోనెల పోటీలు నిర్వహిస్తే సంప్రదాయ దోనెల వేట తిరిగి జీవం పోసుకుంటుంది. బలే సముద్రుడు, గ్రామపెద్ద, పందిరిపల్లిగూడెంకై కలూరు : కొల్లేరు పేరు చెప్పగానే పక్షుల కిలకిలరావాలతో పాటు కొల్లేరులో ప్రయాణం మదిలో మెదులుతుంది. ఒకప్పటి కొల్లేరును, ఇప్పుడున్న పరిస్థితిని పరిశీలిస్తే.. ఆకులు రాలి ఎండిన మోడులా కనిపిస్తుంది. ముందు రోజు పట్టి నీటిలో ఉంచిన చేపలను తెల్లవారుజామునే మార్కెట్లో విక్రయించి జీవించేవారు. నేడు ఇలాంటి దృశ్యాలు కొల్లేరులో కానరావడం లేదు. కొల్లేరు జీవనానికి అద్దం పట్టే తిప్పతీగలతో మావులు(చేపలు పట్టడానికి వాడే బుట్టలు) అల్లే కార్మికుల జాడే లేదు. ఎంతో స్వచ్ఛంగా ఉండే కొల్లేరు నీరు నేడు కాలకూట విషంగా మారింది. కొల్లేరు పూర్వపు అందాలు భవిష్యత్తు తరాలకు పూర్తిగా కనుమరుగయ్యాయి. లాంచీల ధ్వనులు మాయం రాష్ట్రంలో కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణలో సమక్మ, సారక్క జాతరకు అడవులు దాటి వెళ్ళాలి. పెద్దింట్లమ్మ జాతరకు పూర్వం కొల్లేరు నీటిలో లాంచీలు, పడవలపై ప్రయాణించాలి. సూర్యుడు ఉదయిస్తున్న వేళ అప్పుడే విచ్చుకుంటున్న కొల్లేరు కలువ పువ్వల మధ్య ప్రయాణం మధురానుభూతి కలిగిస్తోంది. ఏటా జాతకు సర్కారు కాల్వ నుంచి అమ్మవారి దేవస్థానం వరకు 70 లాంచీలు తిరిగేవి. వీటికి పడవలు అదనం. ఇదే కాకుండా కొల్లేటికోట నుంచి ఆకివీడు, పెద ఎడ్లగాడి, చిన ఎడ్లగాడి, నందిగామలంక వరకు లాంచీలు తిరిగేవి. ఒక్కో లాంచీలో 100 మంది ప్రయాణించేవారు. జాతరకు రాజమండ్రి, విజయవాడ, యానాం, ధవళేశ్వరం నుంచి కాల్వల ద్వారా లాంచీలు కొల్లేరుకు వచ్చేవి. నేడు నీటి కొరత కారణంగా ఒక్క లాంచీ కనిపించడం లేదు. కొల్లేరు సరస్సులో వేట సాగించే ప్రజలకు పేదోడి రాకెట్గా తాటిదోనెకు పేరుంది. బలమైన తాటిచెట్టును ఎంపిక చేసి మొదలతో సహా తీసుకొచ్చి 15 రోజులు బరిసెలతో చెక్కేవారు. నీరు చేరకుండా తారును అద్దెవారు. దీనిలో ఇద్దరు కూర్చుని ప్రయాణించేవారు. తాటిదోనెలను నడపడం ఎంతో కష్టం. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పిన బోర్లా పడతారు. తాటిదోనె తయారీ రూ.350 నుంచి రూ.15,000కు చేరింది. తర్వాత ఇనుముతో చేసిన డొంగ్రీలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో డొంగ్రీ రూ.35,000 నుంచి రూ.40,000 పలుకుతోంది. తాటిదోనెల్లో వేటాడే సమయంలో సరస్సులో సహజసిద్ధ చేపలకు తాకినా వాటికి ప్రమాదం ఉండేది కాదు. ఇనుప డొంగ్రీల వల్ల చేపలు గాయపడుతున్నాయి. దోనెల తయారీదారులు తగ్గిపోయారు. తాటిచెట్ల కొరత ఏర్పడింది. మావన తప్పిదాలతో ప్రమాదం సరస్సుకి సమీప పట్టణాల నుంచి 19 ఫ్యాక్టరీల వ్యర్థజలాలు కొల్లేరులో చేరుతున్నాయని అంచనా. దీని కారణంగా సరస్సులో నల్లజాతి చేపలు అంతరిస్తున్నాయి. డ్రెయిన్లు, వాగుల ద్వారా కొల్లేరుకు చేరే నీటి వనరులు తగ్గాయి. ప్రధానంగా ఎగువ నుంచి కొల్లేరుకు చేరుతున్న నీటిని సరస్సు మధ్యలో అక్రమ చేపల సాగుదారులు చెరువులకు తోడుతున్నారు. దీంతో కొల్లేరులో నీరు కనిపించడం లేదు. ఈ కారణంతో ప్రజలకు చేపల వేట కరువవుతోంది. రెగ్యులేటర్లు నిర్మిస్తే కొల్లేరుకు తిరిగి పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారు. నెర్రలిచ్చి ఎడారిలా మారిన సరస్సు కలగా మిగిలిన తాటి దోనెలపై వేట.. లాంచీలపై ప్రయాణంఒకనాటి కొల్లేరు అందాలు నేడు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మానవ తప్పిదం కారణంగా కొల్లేరు ఎడారిగా మారింది. జలసిరులతో కళకళలాడిన కొల్లేరు నెర్రలిచ్చి వెక్కిరిస్తోంది. తాటి దోనెల స్థానాన్ని ఇనుప డొంగ్రీలు ఆక్రమించాయి. లాంచీల ప్రయాణం చరిత్రలో కలిసిపోయింది. -
ఆక్వా వేసవి సాగులో అప్రమత్తం
కై కలూరు: ఉష్ణోగ్రతల పెరుగుదల ఆక్వాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు మేలని మత్స్యశాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో చేపలు, 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. మొత్తం 2.90 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు జరుగుతోంది. వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు కాగా.. వార్షిక టర్నోవర్ రూ.18 వేల కోట్లకుపైనే.. ప్రభుత్వానికి అధిక ఆదాయం తీసుకొచ్చే ఆక్వారంగం వేసవిలో నష్టాల పాలవుతోంది. నీటి కొరత, హెచ్చు ఉష్ణోగ్రతలతో చేపలు, రొయ్యలు వ్యాధుల బారినపడుతున్నాయి. వేసవిలో ఆక్వా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాకినాడకు చెందిన విశ్రాంత ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ పి.రామ్మోహనరావు వివరించారు రొయ్యల, చేపల పెరుగుదల 28–32 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర బాగుంటుంది. వేసవిలో నీటి ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగి 35 డిగ్రీలు దాటుతోంది. ఈ పరిస్థితులలో నీటిలో ప్రాణవాయువు కరిగే శక్తి తగ్గుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల కొన్ని చెరువులలో (ముఖ్యంగా లోతు ఎక్కువున్న చెరువులలో) నీటి లెవల్స్ 3 అంతస్తులుగా వేరుపడుతుంది. దీనివల్ల చెరువు పైపొరలలో డీవో ఎక్కువగా, అడుగు పొరలలో డీవో తక్కువగా వుంటూ చేపలు, రొయ్యలకు ఇబ్బంది కలిగిస్తోంది. చెరువు నీటిలో అనవసరమైన, హానికారక శైవలాలు కూడా ఏర్పడతాయి. అధిక శైవలాల వల్ల నీటి పీహెచ్ పెరిగిపోతుంది. నీటి ఉష్ణోగ్రత, పీహెచ్ అధికంగా ఉన్నప్పుడు అమ్మోనియా స్థాయి పెరిగి రొయ్యలు, చేపలకు ఒత్తిడి కలిగించి వ్యాధులకు దారి తీస్తోంది. చిరు చేపలు, రొయ్యలు అధిక నీటి గుణాల తారతమ్యాలు తట్టుకోలేవు. మేత యాజమాన్యం వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు రొయ్యలు, చేపలు ఎక్కువ మేత తింటాయి. ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద(33 డిగ్రీలు దాటితే), ఎక్కువ మేతను తీసుకున్నా రొయ్యలలో పెరుగుదల పెద్దగా కనబడదు. రైతులు మేత యాజమాన్యం సరిగా చేయాలి. చేపలకు ఒక్కసారే మేత ఇస్తారు. అది ఉదయం 8 గంటల తర్వాత ఇవ్వడం మంచిది. రొయ్యలకు 4–5 సార్లు ఇచ్చే ఆహారం చెక్ ట్రేని బట్టి ఇవ్వాలి. వ్యాధుల నివారణ ఇలా వేసవిలో చేపలకు, రొయ్యలకు వివిధ రకాల వ్యాధులు వస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపలలో శంకు జలగ, రెడ్ డిసీజ్, ఇతర బ్యాక్టీరియా వ్యాధులు, పేను వంటి పరాన్న జీవుల వ్యాధులు వ్యాపిస్తాయి. రొయ్యలలో శరీరం వంపు తిరగడం (బోడి క్రాంప్స్) వైట్ గట్, వైట్ ఫీసెస్, వైట్ మజిల్, రన్నింగ్ మోర్టాలిటీ, విబ్రియో వంటి బాక్టీరియా విజృంభిస్తుంది. చెరువులో పెంచే చేప, రొయ్యలకు ఏవిధమైన ఒత్తిడి కలిగించకుండా చర్యలు చేపట్టాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రైతుల ఆందోళన చుట్టుముడుతున్న వ్యాధులు ముందస్తు జాగ్రత్తలు మేలంటున్న మత్స్య విభాగ నిపుణులు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెరువు నీటి లోతు కనీసం 1.5 మీటర్లు ఉండాలి నీటిలో ఏరియేటర్లను క్రమపద్ధతిలో అమర్చి తిప్పుకోవాలి. నీటిలో డీవో స్థాయి తగ్గితే సర్దుబాటు కోసం హైడ్రోజన్ పెరాకై ్సడ్, కాల్షియం పెరాకై ్సడ్ వంటి రసాయనాలు అందుబాటులో ఉంచుకోవాలి. వారం వారం రొయ్యల మేతను చెక్ ట్రే ఆధారంగా లెక్కించి అవసరమైతేనే పెంచాలి. అనవసరంగా చెరువులో ఎరువులు వాడకూడదు. వ్యాధులకు అనుగుణంగా రసాయనాలు, ప్రోబయోటిక్స్ అందుబాటులో ఉంచుకోవాలి. కొత్తగా చెరువులో రొయ్య సీడ్ వేసే వారు, ముందుగా సీడ్(రొయ్య పిల్ల)ని చెరువు వాతావరణానికి అలవాటు చేసి వదలండి. దీని వల్ల నెంబరు తగ్గకుండా నిలబడుతుంది. -
విద్యార్థులభవిష్యత్తుతో చెలగాటం
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శాఖలుగా విస్తరించిన ఒక ప్రైవేటు విద్యా సంస్థ ఏలూరు పరిసర ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతోంది. కొన్నేళ్ళుగా నగరంతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులను పాఠశాలలో చేర్చుకుని, తల్లిదండ్రుల నమ్మకం సంపాదించి ఈ విద్యా సంవత్సరంలో ఎలాంటి సమాచారం లేకుండా పాఠశాలను మూసివేశారని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. పాఠశాల మూసివేత సమయానికి సుమారు 300 మంది విద్యార్థులు ఉన్నట్లు చెబుతున్నారు. పాఠశాల మూసివేసే ఆలోచన ఉంటే ఒక ఏడాది ముందుగా విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టిలో పెట్టాలని, పాఠశాల యాజమాన్యం అలా చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా మూసివేసి తమ బిడ్డలకు మరో పాఠశాలలో ప్రవేశాలు పొందే అవకాశం కూడా లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదంతా మూసివేత విషయం చెప్పకుండా వారం క్రితం మాత్రమే సమావేశం పెట్టి ఈ విషయం చెప్పారని మండిపడుతున్నారు. పాఠశాల మూసివేత విషయాన్ని గోప్యంగా ఉంచి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేసుకున్నారని, ఫీజుల చెల్లింపునకు కొంత సమయం కావాలని వేడుకున్నా ప్రిన్సిపాల్ ససేమిరా అంటూ పిల్లలను ఇబ్బందులకు గురిచేశారని వాపోతున్నారు. ఉచిత సీట్లు పొందిన వారి నుంచి సైతం ఫీజులు వసూలు చేశారని, ఫీజులు చెల్లించకపోతే ఇబ్బందులకు గురి చేశారని తల్లిదండ్రులు చెబుతున్నారు. పాఠశాలకు వెళ్ళి తమ బిడ్డల టీసీలు ఇవ్వాలని కోరగా విజయవాడ వెళ్ళి తీసుకోవాలని, ప్రిన్సిపాల్, డీన్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల అక్రమంగా మూసివేసి తమ బిడ్డల భవిష్యత్ను ప్రశ్నార్థకం చేసిన ఆ విద్యా సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మను కలిసి వినతిపత్రం సమర్పించారు. తన కుమార్తెకు ఉచిత సీట్ల కోటాలో సీటు వచ్చినా ఫీజు చెల్లించాల్సిందేనని చెప్పగా.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోలేదని లంకపేటకు చెందిన ఎన్.దుర్గా నాగేంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు ఈ ఏడాది 10లోకి వచ్చాడని, కొన్ని రోజులు తరగతులు నిర్వహించి పుస్తకాలు కొనుగోలు చేయాలని రూ.13 వేలు వసూలు చేసి ఇప్పుడు స్కూలు మూసేయడం అన్యాయమని ఏలూరుకు చెందిన వి.నాగలక్ష్మి తప్పుపట్టారు. ఏలూరులో అర్ధాంతరంగా పాఠశాల మూసివేత ఫీజులు వసూలు చేసి, పుస్తకాలు అమ్ముకున్న వైనం -
పంటల్లో పెరిగిన ఎరువుల వినియోగం
పెనుమంట్ర : వరి, మొక్కజొన్న లాంటి పంటల్లో ఎరువుల వినియోగం చాలా ఎక్కువగా ఉందని, దానికి తగ్గట్టు దిగుబడిలో పెరుగుదల కనిపిస్తుందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్ పీవీ సత్యనారాయణ అన్నారు. మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రెండో రోజు గోదావరి మండల పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భవిష్యత్లో డ్రోన్ల వినియోగం పెరిగే అవకాశం ఉందని, సిఫార్సు చేస్తున్న పురుగు మందుల మోతాదును కూడా పునః పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి శివనారాయణ మాట్లాడుతూ పరిశోధనా స్ధానాలు, విత్తనోత్పత్తి సంస్ధలపై భారం తగ్గించడానికి రైతు విత్తనోత్పత్తిదారులను గ్రామాలలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని విస్తరణ కేంద్రాలను ఆదేశించారు. వరి ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో పండించే 127 లక్షల టన్నుల ధాన్యం నుంచి సుమారు 80 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుందని, మన రాష్ట్ర అవసరాలకు సుమారు 50 లక్షల టన్నుల బియ్యం సరిపోతుందని, మిగిలిన 30 లక్షల టన్నుల బియ్యాన్ని బాసుమతి యేతర రకాల కేటగిరి కింద ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్ల రైతులకు అధిక ఆదాయంతో పాటు రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధికి మరింత మేలు జరిగే అవకాశం ఉందని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం సహ సంచాలకుడు డాక్టర్ టి.శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. -
నేత్రపర్వం చాత్మార్ ఉత్సవం
ద్వారకాతిరుమల: శ్రీవారికి చాత్మార్ ఉత్సవం శుక్రవారం రాత్రి క్షేత్ర పురవీధుల్లో నేత్రపర్వంగా జరిగింది. శ్రీమద్రామానుజుల తిరు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు తొళక్క వాహనంపై ఉంచి, సుగంధ భరిత పుష్పమాలికలతో అలంకరించారు. అనంతరం పూజాధికాలు జరిపి హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. -
విద్యుదాఘాతంతో మృతి
నూజివీడు: మండలంలోని మీర్జాపురం హైస్కూల్ విద్యాకమిటీ చైర్మన్ పిన్నిబోయిన రామకృష్ణ (36) విద్యుత్షాక్తో గురువారం రాత్రి మృతిచెందారు. మీర్జాపురం శివారం కండ్రికలో రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి బజారుకు వెళ్తుండగా కరెంటు స్తంభానికి చేయి తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే పడిపోయాడు. స్థానికులు, అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన హనుమాన్ జంక్షన్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. రూరల్ ఎస్ఐ జ్యోతిబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ మృతితో కుటుంబం ఆధారం కోల్పోయినట్లయింది. విద్యుత్ షాక్తో మృతిచెందిన పిన్నిబోయిన రామకృష్ణ కుటుంబ సభ్యులను శుక్రవారం గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారధి పరామర్శించారు. సీపెట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం యలమంచిలి :విజయవాడలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్)లో పదో తరగతి విద్యార్హతతో మూడేళ్ల వ్యవధి డిప్లమో ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ(డీపీటీ), డిప్లమో ఇన్ పాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సీపెట్ డైరెక్టర్ అండ్ హెడ్ సీహెచ్ శేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ విద్యార్హతతో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ కోర్సులకు మే 29లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జూన్ 8న పరీక్ష నిర్వహించి వచ్చిన ర్యాంక్ ఆధారంగా విజయవాడ కేంద్రంలో 150 సీట్లు భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్లాస్టిక్ రంగంలో జూనియర్ ఇంజనీర్ (ప్రొడక్షన్), మౌల్డ్ డిజైనర్ అండ్ మేకర్ జూనియర్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు వస్తాయని వివరించారు. మరిన్ని వివరాలకు 9398050255 నెంబరులో సంప్రదించాలని కోరారు. -
మన్యం బంద్ ప్రశాంతం
బుట్టాయగూడెం: గిరిజన నిరుద్యోగులకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని కోరుతూ గిరిజన సంఘాల పిలుపు మేరకు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో శుక్రవారం మన్యం బంద్ ప్రశాంతంగా జరిగింది. ఉద యం నుంచే గిరిజన సంఘాల నాయకులు బంద్ లో పాల్గొన్నారు. దుకాణాలు, పాఠశాలలు, ప్రభు త్వ కార్యాలయాలు మూతపడ్డాయి. బుట్టాయగూ డెం బస్టాప్ సెంటర్లో బైటాయించిన ఏపీ గిరిజన సంఘం నాయకులు తెల్లం రామకృష్ట, మొడియం నాగమణి, పోలోజు నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు జీఓ 3కి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ వల్ల గిరిజన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. జీలుగుమిల్లి మండలంలో బంద్ విజయవంతమైంది. వేలేరుపాడులో.. వేలేరుపాడు: వేలేరుపాడులో బంద్ను గిరిజన సంఘాలు ప్రశాంతంగా నిర్వహించాయి. తొలుత వేలేరుపాడు నుంచి భూదేవిపేట వరకు బైక్ ర్యాలీ జరిగింది. అనంతరం అంబేడ్కర్ సెంటర్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మడివి దుర్గారావు అధ్యక్షతన సభ జరిగింది. గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కారం దారయ్య, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ధర్ముల రమేష్, ఏఎస్పీ మండల అధ్యక్షులు ఊకె ముత్యాలరావు మాట్లాడు తూ షెడ్యూల్ ఏరియా ఆదివాసీ ప్రాంతంలో 100 శాతం రిజర్వేషన్ నియామక చట్టం చేయాలన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కారం వెంకట్రావు, కరటం ప్రకాష్, గిరిజన సమైక్య జిల్లా నాయకులు పిట్టా వీరయ్య, బంధం అర్జున్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు సొడే సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. కుక్కునూరులో.. కుక్కునూరు: కుక్కునూరు మండలంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. హోటళ్లు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. గిరిజన సంఘం నాయకులు శ్యామల లక్ష్మణ్రావు, సీఐటీయూ నాయకులు యర్నం సాయికిరణ్, వలీపాషా బంద్లో పాల్గొన్నారు. పోలవరంలో.. పోలవరం రూరల్: ప్రత్యేక డీఎస్సీ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఆదివాసీ యువతకు న్యాయం చేయాలని ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన్యం బంద్లో భాగంగా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోలవరం ఏటిగట్టు సెంటర్ వద్ద మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. మెగా డీఎస్సీలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1,035 పోస్టులకు ఎస్టీలకు కేవలం 61 మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు బొరగం భూచంద్రరావు, నాయకులు యం.చలపతి, జి.పాండవులు, కె.పోసిరత్నం తదితరులు పాల్గొన్నారు. -
7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు మైలవరంలోని ఆయన చాంబర్లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈనెల 7 నుంచి 14 వరకు జరిగే ఉత్సవాల విశేషాలను ఆయన వెల్లడించారు. 7న ఉదయం శ్రీవారిని పెండ్లి కుమారుడిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేయడం, 8న అంకురార్పణ, రుత్విగ్వరణ, ధ్వజారోహణ, 9న సూర్యప్రభ, చంద్ర ప్రభ వాహనాలపై తిరువీధి సేవలు, 10న రాత్రి ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుందన్నారు. 11న రాత్రి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం, 12న రాత్రి రథోత్సవం, 13న చక్రవారి–అపభృధోత్సవం, వేద సభ, ధ్వజావరోహణ వేడుకలు నిర్వహిస్తామన్నారు. 14న చూర్ణోత్సవం, వసంతోత్సవం, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగం–పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తారని చెప్పారు. ఉత్సవాల నేపథ్యంలో ఈనెల 7 నుంచి 14 వరకు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నివృతరావు, డీఈఓ బాబూరావు, ఏఈఓ పి.నటరాజారావు పాల్గొన్నారు. -
డీఎస్సీలో గిరిజనులకు అన్యాయం
విద్యార్థుల భవిష్యత్తో చెలగాటం రాష్ట్రవ్యాప్తంగా శాఖలుగా విస్తరించిన ఓ ప్రైవేట్ విద్యాసంస్థ ఏలూరు పరిసర ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతోంది. 10లో uబుట్టాయగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్లో గిరిజన నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని దుద్దుకూరులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు జీఓ 3కి చట్టభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచినా ఈ హామీని అమలు చేయకుండా తాత్సారం చేయడం చూస్తుంటే గిరిజనులపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు. జీఓ 3పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వైఎస్సార్సీపీ ఆలోచన చేసి ప్రత్యామ్నాయంగా గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు టీఏసీలో సభ్యులంతా తీర్మానం చేసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా గవర్నర్కు తీర్మాన పత్రాన్ని అందజేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆ తీర్మానం గవర్నర్ వద్దే ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఈ తీర్మానానికి అనుగుణంగా గిరిజన యువతకు న్యాయం చేయాలని కోరారు. గిరిజన యువతకు న్యాయం జరిగేందుకు చేపట్టే కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఏపీపీగా రాజ్కుమార్ నూజివీడు: నూజివీడులోని 15వ అదనపు జిల్లా జడ్జి కోర్టుకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా పట్టణానికి చెందిన వాకా రాజ్కుమార్ నియమితులయ్యారు. పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. రాజ్కుమార్ గతంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలువురు న్యాయవాదు లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
మొగల్తూరు మామిడి.. తడబడి
నరసాపురం: మొగల్తూరు మామిడి ప్రాభవం కోల్పోతుంది. ఏటేటా తీర ప్రాంతంలో మామిడి తోటల విస్తీర్ణం తగ్గుతోంది. పట్టణీకరణతో తోటలు నరికివేయడం, తెగుళ్లు కారణాలుగా ఉన్నాయి. ప్రస్తుతం మొగల్తూరు, పేరుపాలెం పరిసర ప్రాంతాల్లో సుమారు 1,800 ఎకరాల్లో మాత్రమే తోటలు ఉన్నాయి. చెరుకు రసం, చిన్న రసాలు, పెద్ద రసాలు, కొత్తపల్లి కొబ్బరి రకాలు ప్రత్యేకం. ముఖ్యంగా మొగల్తూరు బంగినపల్లికి మంచి పేరుంది. సువర్ణరేఖ, కలెక్టర్, హైజర్లు రకాలు పచ్చళ్లకు ప్రసిద్ధి. జిల్లాతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ రకాలను కొనుగోలు చేస్తుంటారు. తెగుళ్లతో సతమతం మామిడి చెట్లకు మచ్చతెగులు, మంచు తెగుళ్లు సోకుతున్నాయి. రియల్ ఎస్టేట్ పెరగడంతో తోటలు నరికివేస్తున్నారు. దీంతో ఒకప్పుడు 5 వేల ఎకరాల్లో ఉన్న తోటలు నేడు 1,800 ఎకరాలకు పరిమితమయ్యాయి. అలాగే ఈ ప్రాంతంలో ఇంటి పెరట్లలోనూ మామిడి చెట్లు ఉన్నాయి. ఏటా గాలి దుమారంతో పిందెలు, కాయలు రాలిపోవడంతో కాపు తగ్గుతోంది. వేసవికి ముందే.. మొగల్తూరు మామిడి వ్యాపారం వేసవి సీజన్కు ముందే ప్రారంభమవుతుంది. శీతాకాలంలో పిందె దశలోనే రైతులు తోటల్లో పంటను విక్రయిస్తుంటారు. ఒక్కో చెట్టూ రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ విక్రయిస్తుంటారు. ఆలస్యం.. వీటి ప్రత్యేకం మొగల్తూరు మామిడి పండ్లు ఆలస్యంగా కాపునకు వస్తాయి. మే రెండో వారం నుంచి జూన్, జూలై నెలల్లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే మామిడి పండ్లు మా ర్కెట్కు వస్తునాయి. ప్రస్తుతం మొగల్తూరు మా మిడి పండ్లు పరక రూ.250 ధర పలుకుతోంది. బంగినపల్లి రకం డిమాండ్ను బట్టి కాయ ఒకటి రూ.40 నుంచి రూ.80కు విక్రయిస్తున్నాయి. -
సీహెచ్ఓల ధర్నాకు మద్దతు
భీమవరం(ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్ వద్ద ఐదు రోజులుగా ధర్నా చేస్తున్న విలేజ్ క్లినిక్ల సీహెచ్ఓలకు ఎమ్మెల్సీ గోపిమూర్తి శుక్రవారం మద్దతు తెలిపారు. సమస్యను ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానన్నారు. అనంతరం సీహెచ్ఓలతో కలిసి జేసీ రాహుల్కుమార్రెడ్డికి వినతిపత్రం అందించారు. జడ్జీల బాధ్యతల స్వీకరణ నూజివీడు: నూజివీడుకు బదిలీ అయిన పలువురు జడ్జీలు శుక్రవారం బాధ్యతలు స్వీకరించా రు. ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఓ.అనూష (నెల్లూరు), రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.శ్రావణి (జగ్గయ్యపేట) బాధ్యతలను చేపట్టారు. నూజివీడులో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శివపార్వతి ఇక్కడే ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. న్యాయవాదులు వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 4న ప్రభుత్వ ఉద్యోగుల సంఘ ఎన్నికలు ఏలూరు (టూటౌన్): ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏలూరు తాలూకా ఎన్నికలు ఈనెల 4న టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న సంఘ కార్యాలయంలో జరుగుతాయని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రాము, ఎన్ఎస్వీ రామకృష్ణారావు, ఎన్నికల అధికారి వై.శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. అలాగే రాష్ట్ర మహాసభ జూన్లో విజయవాడలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పరీక్ష ఫీజు గడువు పొడిగింపు ఏలూరు (ఆర్ఆర్పేట): ఈనెల 12 నుంచి జరుగనున్న ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును మూడు రోజులపాటు పొడిగించినట్టు ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈనెల 5 వరకు అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రమేష్కు ‘అకడమిక్’ అవార్డు పాలకోడేరు: తమ కళాశాల అకడమిక్ అడ్వైజర్, మెంటర్ పి.వెంకట రమేష్ అకడమిక్ అడ్వైజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నట్టు బైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పర్తి సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఏషియా టుడే మీడియా సంస్థ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన విశ్వ విద్యా సమ్మేళనం– 2025లో కేంద్ర మంత్రి చేతులమీదుగా రమేష్ అవార్డు అందుకున్నారన్నారు. కళాశాల చైర్మన్ అడబాల శ్రీ వెంకటేశ్వరరావు, సెక్రటరీ, కరస్పాండెంట్ అడ్డాల శ్రీహరి, డీన్కురెళ్ల భాస్కరరావు, హెచ్ఓడీలు రమేష్ను అభినందించారు. పారిజాతగిరిలో తిరునక్షత్ర వేడుకలు జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలోని గో కుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వా మి దేవస్థానంలో శుక్రవారం విశిష్టాద్వైత సి ద్ధాంత ప్రచారకులు భగవద్ రామానుజాచార్యస్వామి వారి తిరు నక్షత్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేంకటేశ్వర స్వామి ధృవమూర్తితో సహా భగవద్ రామానుజాచార్య స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో రామానుజాచార్య స్వామి ఉత్సవమూర్తిని ప్రత్యేక వేదికపై అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో పూజాదికాలు జరిగాయి. జంగారెడ్డిగూడెం వికాస తరంగిణి ఆధ్వర్యంలో కార్య క్రమాలు నిర్వహించారు. ఏర్పాట్లను ఈఓ మానికల రాంబాబు పర్యవేక్షించారు. 7,500 మంది తరలింపు భీమవరం(ప్రకాశంచౌక్): అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమ సభకు పశ్చిమగో దావరి జిల్లా నుంచి బయలుదేరి వెళ్లే బస్సుల ను కలెక్టర్ సీహెచ్ నాగరాణి శుక్రవారం భీమవరం పాత బస్టాండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. 150 బస్సుల్లో 7,500 మంది ప్రజలు బయలుదేరి వెళ్లారని చెప్పారు. -
చేతులెత్తేసిన సర్కారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చివరి గింజ వరకూ ప్రభు త్వం కొంటుంది.. 24 గంటల్లో ప్రతి రైతు ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం.. నచ్చిన మిల్లులో విక్రయించుకోవచ్చు.. ఇది పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మొదలు జిల్లా అధికారుల వరకు రబీ సీజన్కు ముందు ప్రకటించిన మాట. కట్ చేస్తే.. కొనుగోళ్లు ప్రారంభం కాగానే 50 శాతం ధాన్యమే రైతు సేవా కేంద్రాల్లో కొంటాం.. మిగిలి నవి కొనుగోలు చేయమని.. ప్రభుత్వమేమీ ధాన్యం వ్యాపారం చేయదు కదా అంటూ మంత్రి ప్లేట్ ఫిరాయించారు. దీంతో జిల్లాలో అన్నదాత పరిస్థితి రోడ్డున పడింది. ఆరుగాలం శ్రమించి పంట పండించడం ఒక ఎత్తయితే.. వాటిని అమ్ముకుని సొమ్ము చేయడానికి రైతు సేవా కేంద్రాలు, మిల్లుల వద్ద వాహనాలకు అద్దెలు చెల్లించి మరీ రోజుల తరబడి ఎదురుచూసే పరిస్థితులు జిల్లాలో ఉత్పన్నమయ్యాయి. శుక్రవారం ఉంగుటూరు మండలం కై కరం, ఏలూరు రూరల్, దెందులూరుతో సహా పలు చోట్ల రైతులు ఆందోళనలకు దిగారు. తుది దశకు కొనుగోళ్లు జిల్లాలో రబీ కొనుగోళ్లు ప్రభుత్వ అధికారిక సమాచార ప్రకారం తుది దశకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 77 వేల ఎకరాల్లో 3.53 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. కొనుగోళ్లకు ముందు నుంచే గోనె సంచుల కొరత, అందుబాటులో ఉన్న అరకొర గోనె సంచులు కూడా చినిగిపోయి ఉండటం, అలాగే తేమ శాతం ఎక్కువ ఉందనే సాకుతో పీఆర్–126 ధాన్యంపై ఆంక్షలు విధించి కొనుగోలు చేయకపోవడం వంటి సమస్యలతో సీజన్ ప్రారంభమైంది. అయితే ప్రభుత్వం మాత్రం వేలం పాట తరహాలో ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని నిర్ణయించింది. తొలుత జిల్లాలో 1.50 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించిందని జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. రైతుల అభ్యర్థన మేరకు 2 లక్షల టన్నులకు పెంచినట్టు మరలా అధికారులు ప్రకటించారు. ఇప్పుడు రైతుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని మరో 20 వేల టన్నులు మొత్తంగా 2.20 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని సరిగ్గా రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాలో 1.98 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం 117 రైతు సేవా కేంద్రాల ద్వారా సేకరించింది. ఈ మేరకు రైతులకు రూ.287 కోట్లు జమ చేయగా రూ.155 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రోజురోజుకూ ధాన్యం కొనుగోలు టార్గెట్ పెంచడం, తగ్గించడం వంటి చర్యలతో పల్లెల్లో అగచాట్లు పెరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో నూరు శాతం గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు అన్నదాత జిల్లాలో రోడ్డెక్కిన సందర్భం లేదు. పండిన పంటను రైతు భరోసా కేంద్రాల్లో నూరు శాతం కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర రైతు ఖాతాలో జమ చేయడంతో దళారులకు ఆస్కారం లేకుండా కొనుగోళ్లు సజావుగా సాగాయి. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. 60 శాతం ప్రభుత్వం కొనుగోలు చేస్తే 40 శాతం తప్పనిసరిగా దళారులకు విక్రయించాల్సిన పరిస్థితి ప్రభుత్వమే కల్పించడం గమనార్హం. అన్నదాతల ఆందోళన అధికారులు టార్గెట్లను పెంచుతూ, తగ్గిస్తూ ఉండటంతో రైతు సేవా కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఏలూరు రూరల్, దెందులూరు మండలంలోని కొవ్వలి, ఉంగుటూరు నియోజకవర్గంలో కై కరంలో శుక్రవారం రైతులు ఆందోళనలు చేశారు. టార్గెట్ పూర్తవుతుందని కొనుగోలు చేయలేమని సేవా కేంద్రాల సిబ్బంది చెబుతున్నారు. రైతు పండించిన పంటను అద్దె వాహనాల్లో తీసుకువచ్చి కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తే టార్గెట్ రివైజ్డ్ జరిగితే ఆన్లైన్లో ట్రక్ షీక్ జనరేట్ చేస్తున్నారు. అక్కడ నుంచి మిల్లుకు చేర్చడానికి మరో రెండు రోజులు మొత్తంగా మూడు రోజుల వాహనం అద్దె రైతు చెల్లిస్తున్నారు. అలాగే శాంపిల్స్ పేరుతో బస్తాకు కేజీ మిల్లర్లు తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోళలో తీవ్ర గందరగోళం జిల్లాలో 2.20 లక్షల టన్నులు కొంటామని ప్రభుత్వం ప్రకటన 1.98 లక్షల టన్నుల సేకరణ పూర్తి కై కరం, ఏలూరు రూరల్లో ధాన్యాన్ని నిరాకరిస్తున్న మిల్లర్లు ఆందోళనలు చేస్తున్న రైతులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోచివరి గింజ వరకూ కొనుగోలు పది రోజుల నుంచి తిరుగుతున్నా.. పది రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తిరుగుతున్నాను. టార్గెట్ అయిపోయింది మేమేం చేయలేం, ధాన్యం కొనలేమని సమాధానం చెబుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. నాకు న్యాయం చేయాలని కోరుతున్నా. – పర్సా సుబ్రహ్మణ్యం, రైతు, రామారావుగూడెం -
బాలికల భవితకు ‘కిశోరి వికాసం’
ఏలూరు(మెట్రో): యుక్త వయసులో ఉన్న బాలికలు, మహిళల ఉజ్వల భవిష్యత్కు కిశోరి వికాసం కార్యక్రమం దోహదపడుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కౌమార బాలికల సాధికారత లక్ష్యంగా జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కిశోరి వికాశంపై వాల్పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నుంచి వచ్చేనెల 10 వరకు పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలోప్రత్యేక సమ్మర్ క్యాంపెయిన్ గ్రామ, వార్డు స్థాయిలో ఆరు అంశాలను చర్చిస్తూ ముందుకు సాగేలా పుస్తకాలను రూపొందించామన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి పి.శారద, జిల్లా బాలల సంరక్షణా అధికారి సీహెచ్ సూర్య చక్రవేణి, డీపీహెచ్ఎన్ఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రారంభం ఏలూరు (టూటౌన్): జిల్లావ్యాప్తంగా కిశోరి వికాసం కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఏలూరులోని 12 పంపుల సెంటర్లోని సచివాలయ పరిధిలో వేసవి శిక్షణ శిబిరాన్ని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ సాధికారత అధికారి పి.శారద, అధికారులు సందర్శించారు. -
వ్యవసాయ పరిశోధనా ఫలితాలు రైతులకు చేరువ చేయాలి
పెనుమంట్ర: వ్యవసాయ పరిశోధనా ఫలితాలు కేవలం పరిశోధనా స్థానానికే పరిమితం కాకుండా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఫలితాలు రైతులకు చేరువ చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో రెండు రోజుల పాటు జరిగే గోదావరి మండల పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాన్ని గురువారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. మార్టేరు వ్యవసాయ పరిశోధన సహ సంచాలకులు డాక్టర్ టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మార్టేరు పరిశోధన స్థానంలో విడుదల చేసిన వరి రకాలు ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం, భారతదేశంలో 33 శాతం విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్వర్ణ రకం ఈ పరిశోధనా స్థానం నుంచి విడుదల కావడం గర్వించదగ్గ విషయమన్నారు. పీఆర్ 126 రకానికి ప్రత్నామ్నాయ రకాలైన ఎంటీయూ 1290, ఎంటీయూ 1293, ఎంటీయూ 1273 రకాలను ప్రదర్శన క్షేత్రాల్లో సాగు చేసి రైతులు అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గుర్రపుడెక్క నుంచి కంపోస్టు తయారు చేసే ప్రక్రియను డ్వాక్రా సంఘాల ద్వారా నిర్వహిస్తున్నామని, డి కంపోజర్ల వాడకంపై అవగాహన కల్పించాలన్నారు. మరో ముఖ్య అతిథిగా వ్యవసాయ రంగ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు అవకాశం ఉన్న ప్రాంతాల్లో అనువైన సాంబ మసూరి(బీపీటీ 5204) మార్టేరు సాంబ(ఎంటీయూ 1224) మసూరి (ఎంటీయూ 1262) వంటి సన్నగింజ రకాలను సాగుచేయాలని అన్నారు. మరో ముఖ్య అతిథి ఆచార్య ఎన్జీ రంగా విశ్వ విద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి శివన్నారాయణ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ వ్యవసాయ పరిస్థితులు, నెలకొన్న సమస్యలను గుర్తించి వాటికి తగ్గట్టుగా విస్తరణ ప్రణాళికలను రూపొందించాల్సి అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో గత సమావేశంలో రైతులు లేవనెత్తిన సమస్యలపై తీసుకున్న కార్యాచరణ, 2024–25 సంవత్సరపు పరిశోధన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభికులకు తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి జడ్ వెంకటేశ్వరరావు, ఎస్కే బాషా, మాధవరావు, శ్రీహరి, వివిథ జిల్లాలనుంచి వచ్చిన వ్యవసాయ అధికారులు, అభ్యుదయ రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి -
శీతల పానీయాలతో జాగ్రత్త!
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి జిల్లాలో గత కొన్ని రోజులుగా 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ప్రజలు దాహం తీర్చుకునేందుకు తహతహ లాడుతున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో చల్లదనం కోసం ప్రజలు ఎక్కువగా కూల్డ్రింక్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా కూల్డ్రింక్స్ దుకాణాలు కళకళలాడుతున్నాయి. అయితే రుచితో పాటు ఆరోగ్యమూ ప్రధానమని కూల్డ్రింక్స్ కంటే సంప్రదాయ ద్రవాలే మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఒక్క ఏలూరు నగరంలోనే వివిధ కంపెనీల కూల్డ్రింక్స్ వ్యాపారం రోజుకు సుమారు 60 నుంచి 70 వేల బాటిల్స్ అమ్మకాలు జరుగుతున్నాయని, వాటి ద్వారా సుమారు రూ.20 లక్షల వరకూ వ్యాపారం జరుగుతోందని అంచనా. కూల్డ్రింక్స్తో అనారోగ్యం ప్రస్తుతం అన్ని దుకాణాల్లో శీతల పానీయాలు లభిస్తున్నాయి. ఫుట్పాత్పై వెలసిన దుకాణాల నుంచి కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, కూల్డ్రింక్ షాపులు, ప్రత్యేకంగా వెలసిన ఫ్రూట్జ్యూస్ దుకాణాల్లో సైతం కూల్డ్రింక్స్ లభిస్తున్నాయి. రెడీమేడ్గా తయారు చేసిన ద్రవంతో అప్పటికప్పుడు కొన్ని రకాల కూల్డ్రింక్స్ తయారు చేసి అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో మాక్ టైల్స్ పేరుతో వివిధ రంగుల్లో ద్రావకాలను కలిపి ఇస్తున్నారు. వీటితోపాటు కొన్ని చెరకు, బత్తాయి రసాలు, మజ్జిగ దుకాణాల్లో అపరిశుభ్రమైన నీటితో తయారైన ఐస్ ముక్కలను వాడుతున్నారు. ప్రతి దుకాణంలో రోజుకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు వ్యాపారం సాగుతోంది. ఇలాంటి పానీయాలు ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రంగులు, రసాయనాలతో పలు జబ్బులు శీతల పానీయాల్లో వాడే కార్బన్ డై ఆకై ్సడ్, ఫాస్పరస్ ఆమ్లాలు శరీరంలోకి చేరి కణాల్లోని ఆక్సిజన్ నిల్వలను తగ్గించి కేన్సర్కు దారి తీస్తాయని చెబుతున్నారు. దీనితో పాటు సోడియం బెంజోయేట్ అనే ప్రిజర్వేటివ్ రసాయనం శరీరంలో కణాల్లోని డీఎన్ఏపై ప్రభావం చూపుతాయంటున్నారు. వాటిలోని అదనపు కేలరీలు ఊబకాయానికి దారి తీస్తాయని, పానీయంలో ఉండే ఫ్రక్టోజ్ వల్ల రక్తపోటు పెరుగుతుందని వివరిస్తున్నారు. వాటిని అధికంగా సేవిస్తే దంతాల పై పొర దెబ్బతింటుందని, కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని, దీర్ఘకాలంగా శీతల పానీయాలు తాగితే మెటబాలిక్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సంప్రదాయ పానీయాలే మేలు రసాయనాలు, నిషేధిత రంగులు, అపరిశుభ్రమైన ఐస్ ముక్కలను కలిపిన కూల్డ్రింక్స్ తాగడం కంటే సహజసిద్ధమైన సంప్రదాయ పానీయాలను తాగడం ఆరోగ్యకరమని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మనం ఇంట్లో తయారు చేసుకునే మజ్జిగ, లస్సీ, నిమ్మరసం, తాజా పండ్ల జ్యూస్లు, కొబ్బరి నీళ్లు, రాగిమాల్ట్, నన్నారి షర్బత్ మొదలైనవి శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే గాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. కూల్డ్రింక్స్తో అనారోగ్యం తప్పదంటున్న నిపుణులు సంప్రదాయ పానీయాలే మేలని సూచన కూల్డ్రింక్స్ హాని చేస్తాయి చాలా మంది వేసవి వచ్చిందంటే కూల్డ్రింక్స్ తాగేందుకే మక్కువ చూపుతారు. వాస్తవంగా అందులో పొటాషియం ఉన్న ఉప్పు ఉంటుంది. ఇది శరీరానికి హాని చేస్తుంది. దానికి బదులు మజ్జిగ, నిమ్మకాయ సోడాలో ఉప్పు వేసుకుని తాగాలి. మనం వేసుకొని తాగే ఉప్పులో సోడియం ఉంటుంది. దీంతో పాటు కూరల్లోనూ ఉప్పును వాడాలి. ప్రతిఒక్కరూ రోజుకు నాలుగు లీటర్ల మంచినీటిని తాగాలి. ఎండవేడిమి కారణంగా మూత్రం పచ్చగా వస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. మాంసాహారం మితంగా తీసుకోవాలి. నిమ్మజాతి పండ్లను బాగా తినాలి. – డాక్టర్ ఎంఎల్వీ ప్రసాద్, ఆంధ్రా హాస్పిటల్స్ డైరెక్టర్ -
సమయపాలన అలవాటైంది
సమయపాలన పాటించడం బాగా నేర్పించారు. ఇండియన్ రైల్వే పోలీస్ ఆఫీసర్గా పనిచేయాలని కోరుకుంటున్నాను. – పి జోషిత, బీకాం ఫైనల్ ఇయర్, సెయింట్ థెరిస్సా ఎయిర్ఫోర్స్ ఆఫీసర్ అవుతా ఎన్డీఏలో జాయిన్ అయ్యి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని అవ్వాలని ఉంది. విభిన్న రకాల వ్యక్తులతో ఎలా మెలగాలో నేర్పారు. దేశం పట్ల ప్రేమ చాలా పెరిగింది. – డీ అభిలాష్, సీబీఎస్ఈ ప్లస్వన్, సర్ సీఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్ నా తండ్రి ప్రోత్సహించారు ఈ క్యాంప్లో ఐకమత్యం, క్రమశిక్షణలను బాగా నేర్పించారు. నా తండ్రి ప్రోత్సా హంతో క్యాంప్కు వచ్చాను. ఇండియన్ ఎయిర్వింగ్ నా లక్ష్యం. – యు శ్రావ్యమౌనిక, 9వ తరగతి, భారతీయ విద్యాభవన్, భీమవరం సద్వియోగం చేసుకోవాలి డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ క్రైమ్, తదితర విషయాలపై పూర్తి అవగాహన కల్పించారు. అమ్మాయిలు ధైర్యంగా ఇలాంటి క్యాంప్లో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలి. – డీ దీప, 9వ తరగతి, ఏకేఆర్జీ, నల్లజర్ల ఇండియన్ రైల్వే ఆఫీసర్ అవ్వాలి ఇండియన్ రైల్వే ఆఫీసర్ అవ్వాలని కోరిక. మిలటరీ జీవన విధానం, క్రమశిక్షణ నేర్చుకున్నాను. – జి పవన్కుమార్, 9వ తరగతి, టీబీఆర్ సైనిక్ స్కూల్, అలంపురం -
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం
ఏలూరు రూరల్ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 50 శిక్షణా శిబిరాల్లో ఈనెల 31 వరకూ బాలబాలికలకు వివిధ ఆటలపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి శిబిరంలో సుమారు 30 నుంచి 50 పిల్లలు సాధన చేయనున్నారు. 8 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు శిక్షణ అందించి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసిన పిల్లలకు ఈనెల 31వ తేదీన పోటీలు నిర్వహించి బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందిస్తామని డీఎస్డీఓ బి.శ్రీనివాసరావు తెలిపారు. క్రీడా శిక్షణా శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏ క్రీడా శిబిరం ఎక్కడంటే.. ● అథ్లెటిక్స్: ఏలూరులో ఏఎస్ఆర్ స్టేడియం, సీఆర్ఆర్ కళాశాల, జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చింతలపూడి జడ్పీ పాఠశాల, చేగొండపల్లి టైబల్ వెల్ఫేర్ స్కూల్, కూచింపూడి ఎంపీయూపీ స్కూల్, కై కరం, గోకవరం జడ్పీ పాఠశాలలు. ● ఆర్చరీ: రావికంపాడు జెడ్పీ పాఠశాల ● బాస్కెట్బాల్ : నూజివీడులో వీటిహెచ్ గ్రౌండ్, డీఏఆర్ కళాశాల, ఏలూరు ఇండోర్స్టేడియం ● బాల్ బ్యాడ్మింటన్ : నూజివీడు వీటీహెచ్ గ్రౌండ్ ● చెస్ : ఏలూరు స్వర్ణభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ● ఫుట్బాల్ : పంగిడిగూడెం, నూజివీడు జీఎంహెచ్ హాస్పటల్ గ్రౌండ్, కొయ్యలగూడెం, ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం ● హేండ్బాల్ : ఏలూరులో సీఆర్ఆర్ పబ్లిక్ స్కూల్, సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల, ఏలూరు ఇండోర్ స్టేడియం, శనివారపుపేట రాయన్ ఇంగ్లీషు మీడియం స్కూల్, ఏలూరు కస్తూరిభా బాలికల పాఠశాల, జోగన్నపాలెం ఎస్వీఎన్ హైస్కూల్, ఏలూరు కేపీడీటీ హైస్కూల్, నూజివీడు డీఏఆర్ కళాశాల ● హాకీ : ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం ● జూడో : ఏలూరు సిద్ధార్ధ క్వెస్ట్ పబ్లిక్ స్కూల్ ● కబడ్డీ : ఈస్ట్ యడవల్లి, జడ్పీ పాఠశాల ● ఖోఖో: ఏలూరు సీఆర్ఆర్ పభ్లిక్ స్కూల్, ఏలూరు సిద్ధార్ధ క్వెస్ట్ పబ్లిక్ స్కూల్ ● రోయింగ్ : ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ రిజర్వాయర్ ● టేబుల్ టెన్నిస్ : ఏలూరులో సిద్ధార్ధ క్వెస్ట్ పభ్లిక్ స్కూల్, సీఆర్ఆర్ పభ్లిక్స్కూల్ ● టెన్నిస్ : ఏలూరు సీఆర్ఆర్ డిగ్రీ కళాశాల, నూజివీడు జేబీకే క్లబ్, వీటీహెచ్ గ్రౌండ్స్ ● వాలీబాల్ : ఏలూరు సిద్ధార్ధ క్వెస్ట్ పబ్లిక్ స్కూల్, వట్లూరు జడ్పీ పాఠశాల, కొల్లేటికోట కమ్యూనిటీ హాల్ ఎదురుగా ● వెయిట్లిఫ్టింగ్ : చాటపర్రు వెయిట్లిఫ్టింగ్ హాల్, ఏలూరు ఇండోర్స్టేడియం, ఏఎస్ఆర్ స్టేడియం ● యోగా : ఏలూరు ఎంఆర్ఎఫ్ షోరూం ఆప్స్టైర్ హాల్ ● కయాకింగ్ : జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ రిజర్వాయర్ ● స్కేటింగ్ : ఏలూరు ఇండోర్స్టేడియం రోయింగ్ సమ్మర్ కోచింగ్ ప్రారంభం ద్వారకాతిరుమల: స్థానిక వసంత్నగర్ కాలనీలో జిల్లా స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఏలూరు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఇండోర్ రోయింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ను గురువారం క్యాంప్ ఇన్చార్జి, కోచ్ ఊదర్ల విజయ్ ప్రారంభించారు. స్కల్లింగ్, రోయింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని, కార్యదర్శి ఎన్ పవన్ కుమార్, కోచ్ విజయ్ మాట్లాడుతూ ఈ ఉచిత క్యాంపును నెలరోజుల పాటు నిర్వహిస్తామన్నారు. పిల్లలకు ఈ కోచింగ్ క్యాంప్ ఎంతగానో ఉపయోగ పడుతుందని చెప్పారు. పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్కుమార్, పడవల మోహన్బాబు పాల్గొన్నారు. -
ఆర్మీ ఆఫీసర్ లక్ష్యం
ఎన్సీసీలో చేరడంతో నాలో చాలా మార్పు వచ్చింది. జీవితంలో ఏదైనా సాధించగలనన్న నమ్మకం ఏర్పడింది. భవిష్యత్లో ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నాను. – కె సంపత్సాయి, 9వ తరగతి, భారతీయ విద్యాభవన్, భీమవరం దేశానికి సేవ చేయాలి ఎరోనాటికల్ ఇంజనీర్ అయ్యి దేశానికి సేవలు అందించాలని ఆశపడుతున్నాను. తల్లిదండ్రులు, మా ఎన్సీసీ అధికారులు చాలా ప్రోత్సహిస్తున్నారు. – ఎం ప్రభాకర్, 9వ తరగతి, భారతీయ విద్యాభవన్, భీమవరం గన్ ఫైరింగ్ బాగా నచ్చింది నా ధ్యేయం ఐపీఎస్ ఆఫీసర్. ఎన్సీసీలో నాకు ఫైరింగ్ బాగా నచ్చింది. దేశానికి సేవ చేయాలని ఆశగా ఉంది. ఎన్సీసీ కుటుంబం అన్ని రకాలుగా నాకు అండగా ఉంది. – బి నాగనిఖిల, బీబీఏ ద్వితీయ సంవత్సరం, సెయింట్ ఽథెరిస్సా, ఏలూరు ధైర్యంగా జీవించేలా శిక్షణ ఈ ఎన్సీసీలో ఒక అమ్మాయి ధైర్యంగా సమాజంలో ఎలా రాణించాలో నేర్చుకున్నాను. ఆర్మీలో డిఫెన్స్ సర్వీస్లో సేవలు అందించాలని అనుకుంటున్నాను. ఆర్మీ మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తుందని గ్రహించాను. – బి సమృద్ధి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, సర్ సీఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్ ● -
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ
ఏలూరు(మెట్రో) : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని జెడ్పీ హైస్కూళ్లలో పదో తరగతి చదవి అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ఆరుగురు విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమం స్థానిక జెడ్పీ మినీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు రూ.10 వేలు (ప్రథమ), రూ.5 వేలు (ద్వితీయ) చొప్పున పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మశ్రీ వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కె.భీమేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఎం.వెంకట లక్ష్మమ్మ, ఇ.నారాయణ, డీసీఈబీ కార్యదర్శి ఎ.సర్వేశ్వరరావు, డీవైఈవో ఎన్.రవీంద్ర భారతి, ఎంఈవోలు, హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు. కోకో గింజల చోరీపై కేసు నమోదు ద్వారకాతిరుమల: కోకో గింజల చోరీపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల ప్రకారం తిమ్మాపురం గ్రామానికి చెందిన గంటా అజయ్కుమార్ తన 6 ఎకరాల తోటలో పండే కోకో గింజలను నిత్యం తన ఇంటి వద్ద ఆరబెట్టి, విక్రయిస్తాడు. ఈ క్రమంలోనే 350 కేజీల కోకో గింజలను గత నెల 30న రైతు తన ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో ఆరబెట్టాడు. సాయంత్రం వర్షపు చినుకులు పడుతున్నాయని కోకో గింజలను గుట్టగా చేసి, తడవకుండా బరకం కప్పాడు. గురువారం ఉదయం నిద్రలేచి చూసేసరికి కోకో గింజలు కనిపించలేదు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాటిని దొంగిలించినట్టు గుర్తించి, స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీటి విలువ రూ. 2 లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. అలంపురంలో హత్యాయత్నం నిందితుల అరెస్ట్ పెంటపాడు: అలంపురంలో బుధవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. పెంటపాడు ఎస్సై కె. స్వామి తెలిపిన వివరాల ప్రకారం ప్రత్తిపాడు గ్రామానికి చెందిన పెనుమాక రాజుకు, అదే గ్రామానికి చెందిన పేకేటి సుమన్కు మధ్య పాతగొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అలంపురం రజకచెరువు గట్టున వెళుతున్న రాజుతో సుమన్, తనతో పాటు ఉన్న మరో ఇద్దరితో కలిసి ఘర్షణకు దిగాడు. వారి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణ చోటుచేసుకొంది. దీంతో సుమన్ తన వద్ద ఉన్న చాకుతో రాజును పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్వామి చెప్పారు. నిందితుడు సుమన్తో పాటు, అతనికి సహకరించిన బాదంపూడి జయప్రకాష్, గనిసాల మణిరత్నంలను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ఎన్సీసీ శిక్షణ.. ఉన్నతికి నిచ్చెన
రైఫిల్ షూటింగ్లో పాల్గొన్న కేడెట్లు పరేడ్ నిర్వహిస్తున్న విద్యార్థులు ● పెదవేగి మండలం పినకడిమిలో ఎన్సీసీ క్యాంప్ ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 602 మంది కేడెట్ల హజరు ● షూటింగ్లో అదరగొట్టిన కేడెట్లు ● వృత్తి నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తున్న ఆర్మీ అధికారులు పెదవేగి : పెదవేగి మండలం పినకడిమి గ్రామంలోని విన్సెంట్ డీపాల్ కళాశాలల్లో ఇండియన్ ఆర్మీ 19వ ఆంధ్రా బెటాలియన్ కల్నల్ అమిత్ పాండే ఆధ్వర్యంలో ఎన్సీపీ శిక్షణ ఉత్సాహంగా సాగుతోంది. మొత్తం 5 కళాశాలలు, 12 పాఠశాలల నుంచి 602 మంది కేడెట్లు ఈ క్యాంప్లో పాల్గొని వృత్తి నైపుణ్యాలపై అవగాహన పెంపొందించుకుంటున్నారు. గత నెల 24 నుంచి ఈ శిక్షణ ప్రారంభం కాగా ఈనెల 3వ తేదీతో ముగుస్తుంది. శిక్షణలో భాగంగా రైఫిల్ షూటింగ్, డ్రిల్, దేశ సరిహద్దుల్లో ఆర్మీ శిబిరాలు ఏ విధంగా ఉంటాయో కేడెట్లకు అవగాహన కల్పించారు. ఎన్సీసీలో శిక్షణ ద్వారా దేశభక్తి, నైతిక విలువలు పెంపొందింపజేయడం, క్రమశిక్షణ, సాయం చేసే తత్వం అలవడతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయడంతోపాటు వివిధ రకాల ఉద్యోగాలు, కళాశాలల అడ్మిషన్లలో ప్రాధాన్యత కల్పిస్తారు. సుబేదార్ మేజర్ జె ఆదినారాయణ, ఎన్సీసీ అధికారులు ఎం సోమశేఖర్, కె భీమేశ్వరరావు, ఎన్ అనంత రాజ్యలక్ష్మి, లాజరస్, వలీ, ధనరాజు, చీలి తంబి, వీ రమ, సూపరింటెండెంట్ కొండయ్య, ఆర్మీ, సివిల్ సిబ్బంది ఈ ఎన్సీపీ క్యాంప్ను నిర్వహిస్తున్నారు. డైమండ్ షూటింగ్ను నేర్పుతున్న ఆర్మీ అధికారి అన్ని రకాల స్ట్రక్చర్ ట్రైనింగ్ ఇస్తున్నాం ఈ క్యాంప్లో మిలటరీ క్రమశిక్షణను విద్యార్థులు నేర్చుకున్నారు. మ్యాప్ రీడింగ్, షూటింగ్, నేషనల్ ఇంటిగ్రేటర్ సిమిలేటర్ ఫైరింగ్, వెపన్ హ్యాండ్లింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చాం. చాలెంజ్లు స్వీకరించడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడంపై నైపుణ్యం కలిగిన వ్యక్తులతో అవగాహన కల్పించాం. రోడ్డు భద్రతా చర్యలు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అన్ని రకాల స్ట్రక్చర్ ట్రైనింగ్ ఇక్కడ ఇస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు దేహదారుడ్యం, ప్రాథమిక యుద్ధ తంత్రాలపై శిక్షణ ఇచ్చాం. ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు డ్రగ్స్ చెడు పరిణామాలపై అవగాహన కల్పించారు. – కల్నల్ అమిత్పాండే, క్యాంప్ కమాండింగ్ అథికారి, 19 ఆంధ్రా బెటాలియన్ -
ధాన్యం రైతుల గగ్గోలు
● ధాన్యం కొనడం లేదని ఆందోళన ● రైతు సేవా కేంద్రాల వద్ద నిరసనలు దెందులూరు: దెందులూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం, ప్రభుత్వ నిర్వాకంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ధాన్యం టార్గెట్లు అయిపోయాయని, మేం కొనుగోలు చేయలేమంటూ ధాన్యం కేంద్రాల సిబ్బంది చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలో 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయగా కొవ్వలి, దెందులూరుతో పాటు పలు గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం రాత్రి కొవ్వలి, దెందులూరు కేంద్రాల వద్ద రైతులు ధాన్యం ట్రాక్టర్లతో నిరసనలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రభుత్వ ధాన్యం సేకరణ అధ్వానంగా ఉండటంతో గత్యంతరం లేక పంటను అయినకాడికి అమ్ముకుంటున్నామని అన్నా రు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజా కొంటాం.. సరిపడా గోనె సంచులు ఇస్తాం.. స కాలంలో సొమ్ములు ఖాతాల్లో జమచేస్తామని పాల కులు చెప్పిన మాటలు ఇక్కడ మాత్రం అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెందులూరులో జరిగిన నిరసనలో గాసే రామారావు, నిట్టా సురేష్, వెంకటేష్, శ్రీను, మల్లయ్య, వీర్రాజుతో పాటు మరికొందరు రైతులు ఉన్నారు. ఆన్లైన్ చేయట్లేదు ధాన్యం కేంద్రంలో టార్గెట్ అయిపోయిందని చెప్పి ఆన్లైన్ చేయట్లేదు. అలాగని రైస్ మిల్లులు వద్దకు వెళితే కొనమని మిల్లర్లు చెబుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధాన్యాన్ని రోడ్లపై ఉంచాం. సంచులు లేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనక, మిల్లర్లు కూడా కొనమంటే మా పరిస్థితి ఏంటి. అలాగే పాలగూడెం, దెందులూరు కేంద్రాల్లో ధాన్యం బస్తాకు 600 గ్రాములు తీస్తుంటే.. కొవ్వలిలో మాత్రం రెండు కిలోలు తీస్తున్నారు. అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలి. –నాగరాజు, రైతు, కొవ్వలి -
కూటమిపై సీహెచ్ఓల తిరుగుబాటు
ఏలూరు (టూటౌన్): ఉద్యోగ, ఆర్థిక భద్రత కల్పించాలని కోరుతూ విలేజ్ హెల్త్ క్లినిక్లలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)లు కొద్ది రోజులుగా సమ్మె బాట పట్టారు. దీంతో గ్రా మీణ ప్రజలకు వైద్య సేవలు దూరమవుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీహెచ్ఓలు డిమాండ్ చేస్తున్నారు. ఎంఎల్హెచ్సీ/సీహెచ్ఓ లకు రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన ప్రోత్సాహకాలను నిలిపివేయడంతో పాటు వారిపై అదనపు పనిభారం మోపుతుండటంతో గత నెల 15 నుంచి వీరు ఉద్యమ బాట పట్టారు. గత నెల 27 వరకు పలురకాలుగా నిరసనలు తెలిపినా పాలకుల్లో చలనం లేకపోవడంతో 28 నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 460 విలేజ్ హెల్త్ క్లినిక్లు మూతపడ్డాయి. జగన్ హయాంలో హెల్త్ క్లినిక్లు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామాల్లోని సబ్ సెంటర్ల స్థానంలో విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేశారు. వీటిలో సీహెచ్ఓతో పాటు ఒక ఏఎన్ఎం, ఆశ కార్యకర్త కొన్ని చోట్ల మేల్ హెల్త్ అసిస్టెంట్లు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించేవారు. 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు, 67 రకాల వైద్య పరికరాలను అప్పటి ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఇందులో ప్రత్యేక శిక్షణ పొందిన బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వారు మిడ్ లెవిల్ హెల్త్ ప్రొవైడర్లు/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా సేవలందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చిన్నచూపు : విలేజ్ క్లినిక్లపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందనే విమర్శలు ఉన్నాయి. సీహెచ్ఓలకు జీతభత్యాల చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపి స్తున్నాయి. అలాగే ఆరేళ్ల సర్వీసు పూర్తయిన సీహెచ్ఓల సర్వీసులను క్రమబద్ధీకరించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. జీఓ.64 ప్రకారం ఎన్హెచ్ఎంలో అన్ని కేడర్ల ఉద్యోగులకు 23 శాతం పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. అయితే 189 కేడర్లకు ఇచ్చి సీహెచ్ఓలకు మాత్రం ఇవ్వలేదు. ఈపీఎఫ్ జమచేయడం లేదు. ఏడాదిగా ఇన్సెంటివ్లు ఇవ్వడం లేదు. అలాగే సీహెచ్ఓలపై అదనపు పని భారాలను మోపుతున్నారు. వీరికి హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయడం లేదు. కనీసం చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామాల్లో స్తంభించిన వైద్యసేవలు విలేజ్ క్లినిక్లు మూతపడటంతో గ్రామాల్లో వైద్యసేవలు స్తంభించాయి. ప్రజలు చిన్నపాటి వైద్యానికీ దూరంగా ఉన్న పీహెచ్సీలకు వెళ్లాలి వస్తోంది. సమస్యలపై సమరం నాలుగు రోజులుగా విధుల బహిష్కరణ కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు మూతపడిన విలేజ్ క్లినిక్లు నిరవధిక సమ్మెలో 460 మంది.. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు దూరం -
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఆరేళ్లుగా సీహెచ్ఓలుగా పనిచేస్తున్న మాకు ఉద్యోగ, ఆర్థిక భద్రత కల్పించాలి. ఏడాదిగా పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్లను విడుదల చేయాలి. తమను ప్రజలకు సేవ చేసే కోణంలోనే పాలకులు చూడాలి. అప్పుడే గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. – కురెళ్ల సురేంద్ర, సీహెచ్ఓల సంఘ చీఫ్ అడ్వయిజర్, హెచ్డబ్ల్యూసీ, జి.కొత్తపల్లి చర్చలకు పిలిచేంత వరకూ.. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 15 నుంచి పలు రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో గత నెల 28 నుంచి సమ్మెలోకి వెళ్లాం. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచేంత వరకూ సమ్మెలోనే ఉంటాం. – సొంగా సిద్ధయ్య, అసోసియేషన్ అధ్యక్షుడు, హెచ్డబ్ల్యూసీ, తెడ్లం నిరసనలను పట్టించుకోరా? మా నిరసనలను పాలకులు పట్టించుకోవడం లేదు. గత నెల 24, 25 తేదీల్లో విజయవాడలో జరిగిన మహాధర్నాలో సీహెచ్ఓలంతా పాల్గొన్నాం. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వేతనాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నాం. చివరి అస్త్రంగా సమ్మెకి దిగాం. – ఎస్కే రేష్మా, హెచ్డబ్ల్యూసీ, కొయిదా సర్వీసులను క్రమబద్ధీకరించాలి ఆరేళ్లు దాటిన సీహెచ్ఓల సర్వీసులను క్రమబద్ధీకరించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఎన్హెచ్ఎంలో ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు తీర్చేలా హామీ ఇవ్వాలి. ఆయా సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. – గెడ్డం లావణ్య, హెచ్డబ్ల్యూసీ, గోపన్నపాలెం ● -
గూడెం కూటమిలో మంటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘మా కూటమి నేతలు కొంతమంది నేను తొందరగా చనిపోతే బాగుండును... ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిపోవాలని కోరు కుంటున్నారు.. నేనేమి వాళ్ల త్యాగాలతో గెలవలేదు.. నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు.. ఎన్డీఏ ఎమ్మెల్యేను. నా చావును కోరు కోవడం అన్యాయం.. నేను చనిపోయాక ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్న వాళ్ళ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నాను’ అంటూ టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జిని ఉద్దేశించి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన, టీడీపీ నేతల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. తాజాగా తాడేపల్లిగూడెంలో మొదలైన రాజకీయ పోరు తారాస్థాయికి చేరింది. పొత్తుల్లో భాగంగా జనసేన ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్కు సీటు కేటాయించడంతో గెలుపొందారు. ఇదే స్థానం టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జి ఆశించి భంగపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న రీతిలో వివాదాలు కొనసాగుతున్నాయి. అక్రమ గ్రావెల్, మైనింగ్, పేకాట శిబిరాలు, బెల్టుషాపులు, వైన్ షాపుల వసూళ్ల వ్యవహారంలో మొదలైన విబేధాలు తాజాగా రచ్చకెక్కాయి. ఇద్దరు నేతల మధ్య అధికారులు పూర్తిగా నలిగిపోతున్నారు. అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామా?: టీడీపీ నేతలు రెండురోజుల క్రితం నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ పరిశీలకుడు నక్కా చిట్టిబాబు నేతృత్వంలో జరిగింది. ఈ సభలో టీడీపీ నేతలు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి తీరుపై విమర్శలు గుప్పించారు. మేము అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామా అన్న విషయం తెలియడం లేదని.. చిన్న పని కూడా కార్యకర్తలకు జరగడం లేదని.. పార్టీ నేతలకు ఎక్కడా ఆహ్వానాలు గాని, ప్రొటోకాల్ గాని లేదని, చిన్న పోస్టులు కూడా నియోజకవర్గ ఇన్చార్జి వేయించే పరిస్థితి లేదని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఏకపక్ష ధోరణిలో ఎస్సై మొదలుకొని మున్సిపల్ కమిషనర్ వరకు తన మాటే వినాలని, టీడీపీ వాళ్ళకు పనిచేస్తే సహించేది లేదని హుకుం జారీ చేశారని ఆరోపణలు గుప్పించారు. టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జి ఎన్ఆర్జీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు, అతని వార్డులో రెండు సీసీ రోడ్లు వేయాలని అధికారులకు చెప్పినా ఎవరూ స్పందించడం లేదని సమావేశంలో ఆరోపించారు. ఈ పరిణామాల క్రమంలో బుధవారం నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో బొలిశెట్టి టీడీపీ నేతల ఆరోపణలపై పరోక్షంగా ఘాటుగా స్పందించారు. ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల గెలవలేదు తాను ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల గెలవలేదని, మరో పిఠాపురం చేస్తానంటే నేను గాజులు తొడుక్కుని కూర్చొలేదని, కొందరి నాయకుల్లాగా స్థలాలు, పొలాలు పూడ్చుకోలేదని ఎవరి త్యాగం వల్ల తనకు సీటు రాలేదని ఎమ్మెల్యే బొలిశెట్టి బుధవారం వ్యాఖ్యానించారు. అధికారులను ఇబ్బంది పెట్టినా, బెదిరించినా సహించనని ఎలాంటి హోదా లేకుండా అధికారులను ఇంటికి పిలిచి నాకు తెలియకుండా టీడీపీ నేతలు సమీక్షా సమావేశాలు ఎలా పెడతారంటూ ఆరోపించారు. జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి మధ్య మాటల యుద్ధం కూటమి నేతలు కొందరు నా చావును కోరుకుంటున్నారన్న జనసేన ఎమ్మెల్యే టీడీపీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతల ఆరోపణ మీ త్యాగాలతో ఎమ్మెల్యే కాలేదంటూ బొలిశెట్టి వ్యాఖ్యలు చిచ్చు రేపిన అరకమ తవ్వకాలు నియోజకవర్గంలో ఎర్రకాల్వతో సహా అక్రమ గ్రావెల్ తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతలే రింగ్ లీడర్లుగా మారి భారీగా తవ్వకాలు చేసి ఎమ్మెల్యే సొంత స్థలంలో, టీడీపీ ఇన్చార్జి సొంత లేఅవుట్లలో మట్టిని నింపుతున్నారు. ఈ వ్యవహారాల్లో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. వైన్ షాపులు, అధికారుల పోస్టింగులు, పనుల కేటాయింపులు ఇలా అన్నింటిలోనూ ఈ విభేదాలు పెరిగి వివాదానికి దారితీశాయి. తాడేపల్లిగూడెం కమిషనర్, కొందరు ఎస్సైలు, తహసీల్దార్లను టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్నారని, ఎమ్మెల్యే జనసేన అయినా పైన ప్రభుత్వం మాదని నియోజకవర్గంలో లేకుండా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని జనసేన ఎమ్మెల్యే బహిరంగంగా ఆరోపించారు. అధికారుల జోలికి వస్తే ఎవరిని ఉపేక్షించనని.. ప్రజలు ఓట్లు వేసి అవకాశం ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచానని, చిల్లర వ్యవహారాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ పరోక్షంగా హెచ్చరించారు. -
రీ సర్వే పనులు ఆపాలి
బుట్టాయగూడెం: రీ సర్వే పనులను నిలిపివేయాలని కోరుతూ ఏజెన్సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఐటీడీఏ పీఓ రాములు నాయక్కు ఒక వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ జిల్లా కార్యదర్శి కుంజం రామారావు, నాయకులు సవలం రాంబాబులు మాట్లాడుతూ పోలవరం మండలం నాగంపాలెం రెవెన్యూ పరిధిలో జరగనున్న రీసర్వే వల్ల గిరిజనులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పారు. 1994లో నాగంపాలెం సమీపంలో రెవెన్యూ, ఎల్ఎన్డీ పేట రెవెన్యూ గిరిజన సంఘ నాయకత్వంలో భూములను గత 30 సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్నారని అన్నారు. వీటికి 1/70, పీసా చట్టం అనుసరించి సాగు పట్టాలు అందించాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలకు పలుమార్లు వినతిపత్రం అందజేశామని చెప్పారు. ఇప్పుడు రీ సర్వే వల్ల ఆ భూముల్లో సాగు చేసుకునే గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 5 ప్రభుత్వ, 14 ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రవేశాల కన్వీనర్, ఏలూరు ప్రభుత్వ ఐటీఐ ప్రధానాధికారి పీ. రజిత ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో 804, 14 ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ఆయా కోర్సుల్లో 1672 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రవేశాల కౌన్సెలింగ్కు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా విద్యార్థులు నేరుగా ఐటీఐ వెబ్సైట్లో స్టూడెంట్ ఏరియాలోకి వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తులను మే నెల 24వ తేదీ సాయంత్రం 5గంటల లోపు సమర్పించాలని సూచించారు. అనంతరం ఆ దరఖాస్తు కాపీ ప్రింట్ను తన ఒరిజినల్స్తో విద్యార్థి ఏదైనా ప్రభుత్వ ఐటీఐలలో మే 26వ తేదీ సాయంత్రం 5గంటల లోపు వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. వివరాలకు 08812–230269 నెంబరులో సంప్రదించవచ్చన్నారు. సీహెచ్ఓల ఆందోళనకు మద్దతు ఏలూరు (టూటౌన్): ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గత మూడు రోజులుగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సీహెచ్ఓలకు బుధవారం ఎన్జీవో నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు, కార్యదర్శి ఎన్వి రామారావులు ధర్నా చేస్తున్న ప్రాంతానికి చేరుకుని వారికి మద్దతు తెలిపారు. న్యాయ మైన కోర్కెలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. పలువురు సీహెచ్ఓల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్దీకరించాలన్నారు. ఈపీఎఫ్ఓను పునరుద్దరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలన్నారు. పింఛన్ల పంపిణీపై సమీక్ష ఏలూరు(మెట్రో): జిల్లాలో మే నెలలో 2,59,685 మంది పింఛన్దారులకు రూ.112.98 కోట్ల పంపిణీని సమర్ధవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పింఛన్ల పంపిణీపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ప్రకారం మే 1న ఉదయం 7 గంటలకు పంపిణీ ప్రారంభించాలన్నారు. మే 1న 100 శాతం పింఛన్లు పంపిణీ చేయాలని దానికి అనుగునంగా అధికారులు అందరూ పనిచేయాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి పింఛన్లు ఇస్తున్న విషయాన్ని వ్యక్తిగతంగా తెలియజేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.విజయరాజు, జిల్లా పరిషత్ సీఈవో కె.భీమేశ్వరరావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ డి.నీలాద్రి, పంచాయతీ అధికారి కె.అనురాధ తదితరులు ఉన్నారు. మే 2న ప్రధాన మంత్రి పాల్గొనే రాజధాని పునఃనిర్మాణ కార్యక్రమ సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వెళ్లేలా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తిచేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
రూ.17,785 కోట్ల అంచనాతో రుణ ప్రణాళిక
అకాల వర్షం.. రైతన్నకు నష్టం అకాల వర్షం రైతన్నకు నష్టాన్ని మిగిల్చింది. ఆచంట నియోజకవర్గంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో రైతులు నష్టపోయారు. 8లో uఏలూరు(మెట్రో): జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన జిల్లా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలు, జాతీయ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని వివిధ శాఖల సమన్వయంతో రూపొందించిన పీఎల్పీని బుధవారం కలెక్టరేట్లో వెట్రిసెల్వి ఆవిష్కరించారు. రూ.17,785 కోట్ల అంచనాతో రుణ ప్రణాళిక రూపొందించారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.11,282 కోట్లు కాగా.. ఇది మొత్తం అంచనాలో 63 శాతం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణం రూ.3,633 కోట్లగా అంచనా వేశారు. ఎగుమతుల రంగానికి రూ.147.90 కోట్లు, విద్యా రంగానికి రూ.83.70 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.534.64 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాలకు రూ.46.63 కోట్లు, పునరుత్పాదక శక్తికి రూ.12.70 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.1106.09 కోట్లగా అంచనా వేశారు. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం టి.అనిల్ కాంత్, వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు తదితరులు పాల్గొన్నారు. వెబ్సైట్లో గురుకుల ప్రవేశ పరీక్ష హాల్టికెట్స్ ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్ ప్రవేశానికి మే నెల 4న పరీక్ష నిర్వహిస్తుందని వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఆర్.నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. హాల్టికెట్స్ సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉన్నా యని తెలిపారు. వెబ్సైటు నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకుని మే నెల 4న ఉదయం 9 గంటలకు పరీక్షకు హాజరు కావాలని కోరారు. -
రాష్ట్రంలో అధ్వానంగా శాంతిభద్రతలు
చింతలపూడి: రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా మారాయని పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిడపర్తి ముత్తారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం చింతలపూడిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మీడియాపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రాణాలకు తెగించి వార్తలు సేకరించే జర్నలిస్టులపై భౌతిక దాడులు చేస్తుండడం దారుణమని అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి వెళ్లి ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయం ముందు హల్చల్ చేయడమే కాక ఆయన అనుచరులు అక్కడి కంప్యూటర్లను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తించిన చింతమనేనిపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడం శోచనీయమన్నారు. అదే విధంగా శ్రీకాళహస్తిలో వార్త సేకరణకు వెళ్లిన సాక్షి విలేకరిపై జరిగిన దాడి కూడా మీడియాపై దాడులకు ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. ఈ దాడులు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. నిత్యం మీడియాపై, మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను దేశంలోని మేధావులు ఖండించాలని పిలుపునిచ్చారు. -
1.84 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
ఏలూరు(మెట్రో): రైతుల నుంచి ఇంతవరకు 1.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. బుధవారం జాయింట్ కలెక్టర్ చాంబర్లో రబీ ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రబీ ధాన్యం దిగుబడి ఎక్కువ ఉన్నందున టార్గెట్ను 2 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామన్నారు. అనంతరం మరో 20 వేల మెట్రిక్ టన్నులు అదనంగా చేర్చామన్నారు. జిల్లాలో అన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా 44,53,250 గోనె సంచులు రైతులకు సరఫరా చేసి జిల్లాలో 1.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశామన్నారు. -
భక్తుల మృతి కూటమి ప్రభుత్వ వైఫల్యమే
తాడేపల్లిగూడెం అర్బన్: కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్లే సింహాచలంలో భక్తులు ప్రాణాలు కోల్పోయారని మాజీ డిప్యూటీ సీఎం, మాజీ దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే హిందూ ఆలయాల్లో వరుసగా ఘోరాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో లడ్డూ కల్తీ అయ్యిందంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రచారం చేసి.. చివరకు సుప్రీంకోర్టుతో మొట్టికాయలు తిన్నా చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. తిరుపతిలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా కళ్ల ముందే కదులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన వాదినని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్ ఆనాడు కేవలం క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. శ్రీ కూర్మంలో నక్షత్ర తాబేళ్లు చనిపోతే వాటికి పోస్టుమార్టం చేయకుండా ఈవో ఆఫీసు వెనుకే దహనం చేయడం చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు నిదర్శనమన్నారు. తిరుమలలో వందలాది గోవులు మరణిస్తే.. తగిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్య ధోరణితో మాట్లాడటం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు. టెండర్లను రద్దు చేసి.. దోపిడీకి పాల్పడ్డారు రాష్ట్రంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం అవినీతిని వీడటం లేదని కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ నిధులతో పలు ఆలయాలను అభివృద్ధి చేశామని చెప్పారు. రూ.50 కోట్లతో సింహాచలం ఆలయాన్ని అభివృద్ధి చేశామని.. ఇప్పటికీ కొనసాగించాల్సిన అభివృద్ధి పనుల టెండర్లను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. వారికి కావల్సిన వ్యక్తులకు వాటిని కట్టబెట్టిందని దుయ్య బట్టారు. అభివృద్ధి పనుల అంచనాలను పెంచి దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు పచ్చ మీడియా రక్షణ కవచంలా పనిచేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పవన్కల్యాణ్.. ఇప్పుడు ఆలయాల్లో ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. సింహాచలం దుర్ఘటనకు కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి.. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు.దేవదాయ శాఖ మాజీ మంత్రి కొట్టు ఆగ్రహం -
ప్రశాంతంగా పాలిసెట్
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం బుధవారం నిర్వహించిన పాలిసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలు ఏలూరు జిల్లాలోని ఏలూరులో 10 కేంద్రాల్లో, నూజివీడులో రెండు కేంద్రాల్లో జరిగాయి. మొత్తం 4312 మంది విద్యార్థులకు 3714 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఏలూరులో ఏర్పాటు చేసిన 10 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 3542 మంది విద్యార్థుల్లో 2225 మంది బాలురు, 1,317 మంది బాలికలు పరీక్షలు రాయాల్సి ఉండగా 1924 మంది బాలురు, 1091 మంది బాలికలు మొత్తం 3015 మంది రాశారు. నూజివీడులోని రెండు పరీక్షా కేంద్రాల్లో 498 మంది బాలురకు 452 మంది పరీక్ష రాయగా, 272 మంది బాలికలకు 247 మంది మొత్తం 699 మంది పరీక్షలు రాశారు. పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని ఏలూరు జిల్లా పాలిసెట్ కో–ఆర్డినేటర్ పెదపట్ల సుబ్రహ్మణ్యం తెలిపారు. -
చేపలు పడుతూ.. ఎర్రకాలువలో పడి వ్యక్తి మృతి
జంగారెడ్డిగూడెం: ప్రమాదవశాత్తు లక్కవరం సమీపంలోని ఎర్రకాలువలో పడి వ్యక్తి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలివి. మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన దల్లి రామాంజనేయులు (49) అలియాస్ రామాంజి కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాడు. ఖాళీ సమయంలో గేలం వేసుకుని చేపలు పడుతుంటాడు. మంగళవారం లక్కవరం పరిధిలో ఉన్న ఎర్ర కాలువలో గట్టుమీద కూర్చొని చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. కాలువ లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయి రామాంజనేయులు మృతి చెందాడు. లక్కవరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. -
పొగాకు రైతులను దెబ్బతీసిన వర్షం
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షం పొగాకు రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేసింది. భారీ వర్షం రెడ్డిగణపవరంలోని పొగాకు రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక విలవిలలాడిపోతున్నారు. కనీస మద్దతు ధర కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది పొగాకు రైతులకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో గిట్టుబాటు ధర రాకపోతే రోడ్డుపై పడతామని ఆందోళన చెందుతున్న తరుణంలో ప్రకృతి కూడా రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. వర్షానికి బేళ్లన్నీ తడిచిపోయాయి. బుధవారం ఉదయం తడిసిన బేళ్లను చూసిన రైతులు గుండెలు బాదుకున్నారు. వారికి జరిగిన నష్టాన్ని బోర్డు అధికారులకు తెలి యజేశారు. ఐటీసీ అధికారులు తడిచిన పొగాకును పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసారు. రెడ్డిగణపవరానికి చెందిన అల్లూరి సోమేశ్వరరావుకు చెందిన పొగాకు తడవడంతో సుమారు రూ.15 లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అల్లూరి రామ్మోహన్రావుకు చెందిన బేళ్లు తడిచిపోయాయని కనీసం అమ్మకానికి కూడా వచ్చే పరిస్థితి లేదని అకాల వర్షం కారణంగా తనకు రూ. 10 లక్షల వరకూ నష్టం వాటిల్లిందని చెప్పారు. మొత్తం రూ. 57 లక్షల వరకూ రైతులు నష్టపోయారు. ప్రభుత్వం, బోర్డు అధికారులు ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కారణంగా పొగాకు పంటలు పాడయ్యాయి. -
కార్మిక లోకం.. మీకు సలాం
రక్తాన్ని చెమటగా మార్చి ఎండనక... వాననక కష్టపడి తమ కుటుంబాలను పోషించడానికి రోజువారీ వేతనాల కోసం పనిచేస్తూ శ్రమిస్తున్న కార్మికులు ఎంతో మంది ఉన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో సంస్థలు, సంఘాలు పనిచేస్తున్నా.. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పటికీ మిఽథ్యగానే కనిపిస్తోంది. కార్మికుల వేతనాల కోసం ఎన్నో చట్టాలు వచ్చినా అవి ఆచరణలో మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ కార్మిక దినాన్ని అధికారికంగా, సంఘాలపరంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నా వారికి మాత్రం న్యాయం జరగడం లేదు. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితిలో కూలి పనులే దిక్కుగా నిత్యం శ్రమిస్తున్న కార్మికులకు మేడే సందర్భంగా ‘సాక్షి’ సలాం.. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
ఇటుకలు మీదపడి కార్మికుడి దుర్మరణం
తణుకు అర్బన్ : తణుకు జాతీయ రహదారిపై ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టరు ట్రక్కు బోల్తా పడిన ఘటనలో ఒక వ్యక్తి దుర్మరణం చెందగా ముగ్గురు గాయపడ్డారు. ఘటనలో ట్రాక్టరు ట్రక్కుపై ప్రయాణిస్తున్న కార్మికుడు నక్కా ఏసు (42)పై ఇటుకలు పడడంతో మృతిచెందాడు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు నుంచి తాడేపల్లిగూడెం ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టరు తణుకు జాతీయరహదారి పాత టోల్గేట్ ప్రాంతానికి వచ్చేసరికి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇటుకలోడు దింపే కార్మికులు పెనుగొండ మండలం వడలి గ్రామానికి చెందిన నక్కా ఏసు, సీహెచ్ నాగబాబు, తొంట దుర్గాప్రసాద్, మద్దే ఏసు ఇటుకలోడుతో ఉన్న ట్రాక్టరుపై ప్రయాణం చేస్తున్నారు. ట్రక్కు తిరగబడిన వెంటనే కింద పడిన ఏసుపై ఇటుకలు పడిపోయాయి. స్థానికులు, తోటి కార్మికులు బలవంతంగా ఇటుకల్లోంచి అతడిని బయటకు లాగినా అప్పటికే మృతి చెందాడు. ఏసు మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీకి తరలించగా, క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వడలి.. కన్నీటి కడలి వడలి గ్రామానికి చెందిన నక్కా ఏసు మృతితో ఆ కుటుంబం రోడ్డున పడిందని కుటుంబసభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. మృతుడికి భార్య భవానితోపాటు 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. ఒక రోజు క్రితమే నేను లేకపోతే మీరు ఎలా బతుకుతారని ఏసు తనను నిలదీశాడని భార్య భవాని రోదిస్తూ చెబుతున్న తీరు స్థానికులను కలచివేసింది. ఇలా అర్థంతరంగా వెళ్లిపోయావు.. మాకెవరు దిక్కంటూ ఆస్పత్రి ఆవరణలో ఆమె రోదనలు మిన్నంటాయి. తణుకు ఏఎస్సై రంగారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తణుకు జాతీయ రహదారిపై అదుపు తప్పి ఇటుక ట్రాక్టర్ బోల్తా ఒకరి మృతి.. మరో ముగ్గురికి గాయాలు -
అకాల వర్షం.. రైతన్నకు నష్టం
పెనుగొండ: అకాల వర్షం రైతన్నకు నష్టాన్ని మిగిల్చింది. ఆచంట నియోజకవర్గంలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వేసవి కాలం కావడంతో రైతులు కళ్లాల్లోని ధాన్యానికి పూర్తి స్థాయి రక్షణ ఏర్పాటు చేయలేదు. అరగంట పాటు భారీ వర్షం కురవడంతో రైతులు ఉరుకులు, పరుగులు పెట్టినా పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కాపాడుకోలేకపోయారు. ప్లాస్టిక్ బరకాలు కప్పినా కొంతమేర ధాన్యం వర్షార్ఫణం అయింది. ఆచంట నియోజకవర్గంలో పెనుగొండ మండలంలో 11,782 ఎకరాల్లోనూ, పెనుమంట్ర మండలంలో 12,103, ఆచంట మండలంలో 10,600, పోడూరు మండలంలో 12,800 ఎకరాల్లో వరి సాగు చేశారు. దీనిలో ఎంటీయూ 1121 వరి రకం అధికంగా సాగు చేయగా, పీఆర్ 126, ఎంటీయూ 1153 రకాలు కూడా సాగు చేశారు. వీటిలో పెనుగొండ మండలంలో ఎంటీయూ 1121, ఎంటీయూ 1153 రకాలు ముందుగా కోతకు వచ్చాయి. 50 శాతంకు పైగా కోతలు పూర్తిచేసిఽ ధాన్యాన్ని తేమ శాతం తగ్గించుకోవడానికి ఆరబెట్టుకొనే స్థాయిలో మాసూళ్లు ఉన్నాయి. మంగళవారం కురిసిన వర్షంతో చాలా మంది రైతులు నష్టపోయారు. ఇదిలా ఉండగా, కోతకు కోయకుండా ఉన్న వరిచేలు భారీ ఈదురు గాలులకు నేలనంటాయి. వరి కోత యంత్రాలతో కోత కోసే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వలన కోత ఖర్చులు పెరిగిపోతున్నాయన్నారు. యంత్రాలు కోయడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో సమయం పెరగడం వలన యంత్రాలకు అధికంగా ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. పంట చేతికందే సమయంలో కురిసిన వర్షం నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పచ్చిరొట్ట సాగుతో భూసారం మెండు
చింతలపూడి: రసాయన ఎరువుల వాడకం నానాటికీ పెరుగుతుండడంతో భూసారం తీవ్రంగా దెబ్బతింటోంది. దీంతో పోషకాల లోపం ఏర్పడి పంటలు చీడపీడల బారిన పడి రైతులు నష్టాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పంట భూములను సారవంతంగా మార్చుకుని అధిక దిగుబడులు సాధించాలంటే పచ్చిరొట్ట సాగు ఒక్కటే మార్గం. రైతులు తమ పొలాల్లో పంటలు సాగులో లేనప్పుడు పచ్చిరొట్ట సాగు చేసుకోవాలి. తొలకరికి ముందు వివిధ రకాల పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు రాయితీపై అందిస్తున్నారు. ప్రతి ఏటా వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు వాటి నివేదికలను వ్యవసాయశాఖ అందచేస్తుంది. భూసారాన్ని పెంచడానికి రైతులు కనీసం రెండు పంటలు వేసిన తరువాత పచ్చిరొట్ట పైర్లు సాగుచేయాలని వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి నాగకుమార్ తెలిపారు. ● పచ్చిరొట్ట సాగు వల్ల భూసారం పెరగడమే కాక చీడ, పీడల బెడద తగ్గుతుంది. దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. భూసారం పెంచే పచ్చిరొట్ట పైరులైన జనుము, జీలుగ, పిల్లి పెసర సాగు చేసి ప్రయోజనం పొందవచ్చు. ● సేంద్రియ పదార్థాలను నేలకు అందించడం, కలుపు మొక్కలను నివారించడం, నేలలో జీవ రాశులకు ఆహారంగా, మొక్కలకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలను అందించే సాధనాలుగా పచ్చిరొట్ట పైర్లు ఉపయోగపడతాయి. ● ప్రస్తుతం పొలాలకు కృత్రిమంగా ఉపయోగిస్తున్న నత్రజని వాడకాన్ని 20 నుంచి 30 శాతం వరకూ ఆదా చేసుకోవచ్చు. పచ్చిరొట్ట పైర్లు సాగు చేసిన భూముల్లో పంటలు ఆరోగ్యంగా పెరిగి, చీడ, పీడలను తట్టుకోవడమే కాకుండా నేలలో నీరు, రసాయన ఎరువులు భూమి కింది పొరలకు జారిపోకుండా పచ్చిరొట్ట అడ్డుకుంటుంది. ● నేలలో చౌడును తగ్గించి శీతాకాలంలో కూడా నేలలోని ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండటానికి పచ్చిరొట్ట సాగు ఉపకరిస్తుంది. చౌడు భూముల్లో జీలుగ, నీరు నిల్వ ఉండే భూముల్లో జనుము వేసుకోవడం ఉత్తమం. ● జీలుగ హెక్టారుకు 20 టన్నులు, జనుము 21 టన్నులు, పిల్లి పెసర 18 టన్నుల దిగుబడి వస్తుంది. ఇటు పశుగ్రాసం కొరతను తీర్చడమే కాక భూమిని సారవంతం చేస్తాయి. ఎరువు కోసమైతే పచ్చిరొట్ట పైర్లను పూత సమయంలో నేలలో కలియదున్నుకోవాలి. ● పైరు వయసు 50 రోజుల నుంచి 60 రోజులు మించకుండా కలియదున్ని ఒకటి రెండు వారాల తరువాత నాట్లు వేసుకోవాలి. జీలుగ, పిల్లి పెసర విత్తనాలు ఎకరానికి 16 కిలోలు, జనుము 20 కిలోల చొప్పున వేసుకోవాలి. రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై రైతులకు పచ్చి రొట్ట విత్తనాలు అందిస్తుంది. సబ్డివిజన్లో ఈ ఏడాది 3,152 క్వింటాళ్లు పచ్చి రొట్ట విత్తనాలు రైతులకు పంపిణీ చేశారు. చింతలపూడి మండలంలో 1,475 క్వింటాళ్లు, కామవరపుకోట మండలంలో 525 క్వింటాళ్లు, లింగపాలెం మండలంలో 332 క్వింటాళ్లు, జంగారెడ్డిగూడెం మండలంలో 820 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేసినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. బి నాగకుమార్ వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాడి – పంట రసాయన ఎరువుల వినియోగంతో అనర్థాలు మెట్ట భూముల్లో లోపిస్తున్న పోషకాలు భూసారం, అధిక దిగుబడుల కోసం పచ్చిరొట్ట సాగు మేలంటున్న నిపుణులు -
హైస్కూల్ గ్రౌండ్లో మద్యం సేవించిన ఇద్దరిపై కేసు
ద్వారకాతిరుమల: స్థానిక శ్రీవారి దేవస్థానం సంస్కృతోన్నత పాఠశాల గ్రౌండ్లో ఈనెల 28న మద్యం సేవించి, వివాదానికి కారణమైన ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులపై స్థానిక పోలీస్టేషన్లో మంగళవారం రాత్రి కేసు నమోదైంది. వివరాల ప్రకారం. దేవస్థానంలో పారిశుద్ధ్య పనులకు వినియోగించే ట్రాక్టర్ను నడిపే డ్రైవర్ కందికొండ భూషణం, స్కావెంజర్ కొండాబత్తుల సూరిబాబు ఈనెల 28న మధ్యాహ్నం హైస్కూల్ గ్రౌండ్లోని స్టేజీపై కూర్చుని మద్యం సేవించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్తా వివాదంగా మారింది. దీనిపై ఆలయ అధికారులు స్పందించారు. ఈ క్రమంలో దేవస్థానం సెక్యూరిటీ సూపర్వైజర్ ప్రవీణ్ కుమార్ మంగళవారం స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన భూషణం, సూరిబాబు లపై పోలీసులు పెట్టీ కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి నూజివీడు: మండలంలోని బత్తులవారిగూడెం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదపాడు మండలం పాతముప్పర్రుకు చెందిన రంజుల ఏసుబాబు (34) మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై మైలవరం వెళ్తుండగా బత్తులవారిగూడెం శివారులో వెనక నుంచి బొలేరో వాహనం వచ్చి ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన ఏసుబాబును పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి 8 గంటల సమయంలో మృతిచెందాడు. రూరల్ ఎస్సై జ్యోతీబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టమ్ నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు బుధవారం అప్పగించారు. నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏలూరు రూరల్: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నట్లు డీఎస్డీఓ బి శ్రీనివాసరావు తెలిపారు. ఈ శిబిరాల్లో ఈనెల 31వ తేదీ వరకూ 8 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు శిక్షణ అందించి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం జిల్లాలోని పలు ప్రాంతాల్లో 50 శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అథ్లెటిక్స్, అర్చరీ, బాస్కెట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, చెస్, ఫుట్బాల్, హేండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ, ఖోఖో, రోయింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, యోగా, కయాకింగ్, స్కేటింగ్ వంటి విభాగాల్లో జిల్లాలో ఎంపిక చేసిన శిబిరాల్లో తర్ఫీదు ఇస్తామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉత్తమ ప్రీమియం బిజినెస్ హోటల్గా అంబికా ఎంపైర్ ఏలూరు (ఆర్ఆర్పేట): నగరానికి చెందిన అంబికా సంస్థల ఆధ్వర్యంలో చైన్నెలో నిర్వహిస్తున్న అంబికా ఎంపైర్ హోటల్కు 2025వ సంవత్సరపు ఉత్తమ ప్రీమియం బిజినెస్ హోటల్ (4 స్టార్ సౌకర్యాలతో) అవార్డు లభించింది. ఈ అవార్డును ఇటీవల చైన్నెలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ మాజీ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ చేతుల మీదుగా అంబికా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంబికా రాజా అందుకున్నారు. చైన్నెలోని తమ అంబికా ఎంపైర్ హోటల్ అత్యున్నత స్థాయి సేవ, నాణ్యత, ఆతిథ్యాన్ని అందిస్తూ వినియోగదారుల మన్ననలను పొందినట్లు రాజా తెలిపారు. అవార్డు ప్రదాన కార్యక్రమంలో అంబికా గ్రూప్ ఆప్ హోటల్స్ జనరల్ మేనేజర్ ఆర్. కళాతినాథన్, మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ కృష్ణకుమార్, అంబికా ఎంపైర్ హోటల్ అడ్మిన్ మేనేజర్ పుష్పలత, న్యాయమూర్తులు ఎస్కే కృష్ణన్, కే వెంకటేశన్ తదితరులు పాల్గొన్నారని చెప్పారు. -
జిరాయితీ భూముల సర్వే ప్రారంభం
నిడమర్రు: నిడమర్రు కొల్లేరు అభయారణ్య పరిధిలో జిరాయితీ, అన్సర్వే భూముల సర్వే మంగళవారం నుంచి ప్రారంభించినట్లు తహసీల్దారు ఎన్.నాగరాజు తెలిపారు. శనివారం గండి కొట్టిన చెరువు సరిహద్దులు నిర్ణయించేందుకు అధికారులు సర్వే నిర్వహించారు. ఈ చెరువులో కొంత భాగం భీమడోలు మండలం చెట్టున్నపాడులో మరి కొంతభాగం నిడమర్రు వెంకటాపురంలో ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో రెండు మండలాల రెవిన్యూ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేకు అటవీ శాఖ అధికారులు హాజరవని కారణంగా మరో రోజుకు వాయిదా వేస్తున్నట్లు తహసీల్దారు నాగరాజు తెలిపారు. -
ఎర్రకాల్వలో ఇసుక దందా
ప్రజాప్రతినిధి అండదండలతో.. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతోనే ఈ వ్యవహారమంతా సాగుతుంది. వీఆర్ఓ మొదలుకొని మైనింగ్ అధికారుల వరకు అందరికీ నెలవారీ ముడుపులు ఖరారు చేశారు. ప్రజాప్రతినిధి సహకారం అన్ని విధాలుగా ఉండటంతో పాటు మామూళ్లు సక్రమంగా అందుతున్నట్లు సమాచారం. వీఆర్ఓ, ఇతర రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్, మైనింగ్, ఎస్ఐ, పొలిటికల్ ఇలా అందరికీ ముడుపులు చెల్లించి బహిరంగంగా సాగిస్తున్నారు. అక్రమ దందాపై స్థానికంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారుల నుంచి వెంటనే ఇసుక మాఫియాకు సమాచారం అందిస్తారు. సంఘటన స్థలం నుంచి లారీలు, జేసీబీలు పంపి ఒకటి, రెండు ట్రాక్టర్లు పెట్టి నామమాత్రపు కేసులు పెట్టేలా వ్యవహారం సాగిస్తున్నారు. నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున సాగుతున్నా ట్రాక్టర్లతో అక్రమంగా రవాణా చేస్తున్న కేసులు మాత్రమే నమోదు చేస్తున్నారు. రోజూ స్థానిక లారీలతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి వచ్చే లారీలు 20 వరకూ ఉంటాయి. మూడు జేసీబీలతో తవ్వకాలు కొనసాగుతున్నారు. అక్రమ ర్యాంపుల నిర్మాణంతో ఎర్రకాల్వ ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. గంగవరం సమీపంలోని ఎర్రకాల్వలో జేసీబీతో తవ్వకాలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎర్రకాల్వను దోచేస్తున్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దుల వెంట ఉన్న ఎర్రకాల్వలో ఇసుక మాఫియా పగలూ రాత్రి తేడా లేకుండా అడ్డగోలుగా తవ్వేస్తుంది. కాల్వకు నాలుగు ప్రాంతాల్లో ప్రైవేటు పొలాలను లీజుకు తీసుకుని ర్యాంపులు నిర్వహించి అక్రమ రవాణా సాగిస్తున్నారు. కొయ్యలగూడెం మండలం గంగవరం కేంద్రంగా ఈ ఇసుక దందా సాగుతోంది. రోజూ 50కి పైగా లారీలతో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు ఇసుక తరలిస్తున్నారు. గ్రామ స్థాయి అధికారి మొదలుకొని ప్రజాప్రతినిధి వరకు అందరికీ ముడుపులు ఖరారు చేసి నెలరోజులుగా దందా సాగిస్తున్నారు. ఆరు నెలలుగా అక్రమ తవ్వకాలు ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం నుండి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర ఎర్రకాల్వ విస్తరించింది. కరాటం కృష్ణమూర్తి జలాశయం వద్ద బయనేరు, జల్లేరు కాల్వలు ఎర్రకాల్వలో కలిసి దిగువన నిడదవోలు దగ్గర గోదావరి కాల్వలో కలుస్తుంది. గత ఆరు నెలలుగా జంగారెడ్డిగూడెం మొదలుకొని నల్లజర్లలోని సుభద్రపాలెం వరకు యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగించారు. నెల రోజుల నుంచి కొయ్యలగూడెం మండలాన్ని కేంద్రంగా చేసుకుని దోపిడీ పర్వానికి తెరదీశారు. కొయ్యలగూడెం మండలంలోని గంగవరం, రాజవరంలో రోజూ పదుల సంఖ్యలో టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నారు. సుమారు 3 కిలోమీటర్ల మేర ఎర్రకాల్వను పూర్తిగా తవ్వేశారు. కొయ్యలగూడెం మండలంలోని మంగపతిదేవునిపేట వద్ద ప్రారంభమై నల్లజర్ల మండలంలోని పోతిరెడ్డిపాలెం వరకు ఎర్రకాల్వపై అక్రమ రవాణాకు వీలుగా నాలుగు ర్యాంపులు నిర్మించి రాకపోకలు సాగిస్తున్నారు. ఎర్రకాల్వ సమీపంలోని పొలాలను లీజుకు తీసుకున్నారు. ఎకరాకు ఏటా లక్ష చెల్లించి ఆ పొలంలో ఎలాంటి సాగు చేయకుండా పొలం వెంట రహదారి నిర్మించి జేసీబీలతో కాల్వ గర్భంలో ఇసుక తవ్వి లారీల్లో నింపి తోడేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో దాదాపు వెయ్యికిపైగా లారీల్లో ఇసుకను ఏలూరు, చింతలపూడి, గోపాలపురం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో విక్రయించారు. దూరాన్ని బట్టి రూ.5 వేలు మొదలుకొని రూ.30 వేల వరకు లారీకి వసూలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే అక్రమంగా రవాణా కాల్వ గట్లకు ర్యాంపులేసి మరీ భారీగా తవ్వకాలు రోజూ 50కు పైగా లారీల ఇసుక తరలింపు మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసులకు తెలిసే అక్రమ దందా -
వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకుల నియామకం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులను మంగళవారం నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు వెలువరించింది. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు అనుసంధానంగా పరిశీలకులు పనిచేసేలా నియమించారు. ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడిగా ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడిగా కాకినాడ జిల్లా పత్తిపాడుకు చెందిన పార్టీ నేత ముదునూరి మురళీకృష్ణంరాజును నియమించారు. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావును మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులుగా నియమించారు. జీవిత బీమా సమస్యలు పరిష్కరించాలి ఏలూరు(ఆర్ఆర్పేట): జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న జీవిత బీమా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ పీఆర్టీయూ జిల్లా నాయకులు ఏపీజీఎల్ఐ డిప్యూటీ డైరెక్టర్ కే.శ్రీనివాస ప్రసాద్కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ మెచ్యూర్ అయిన ఏపీజీఎల్ఐ బాండ్లను నిధి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే క్రమంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించాలని కోరారు. చెరువు గండిని అడ్డుకున్న రైతులు నిడమర్రు: కొల్లేరు అభయారణ్యం పరిధిలో అన్సర్వే భూముల్లో సాగు చేస్తున్న ప్రతి చేపల చెరువును అటవీ శాఖ అధికారులు ధ్వస్వం చేస్తున్నారు. దీని భాగంగా ఆకివీడు–నిడమర్రు మండలాల సరిహద్దుల్లో ఉన్న సుమారు 100 ఎకరాల చేపల చెరువుకు మట్టం వరకూ గండి కొట్టేందుకు మంగళవారం అటవీ శాఖ అధికారులు ప్రయత్నించగా స్థానిక వరి రైతులు అడ్డుకున్నారు. ఆ చెరువు పాయలో సుమారు 50 ఎకరాల వరకూ కొతలకు సిద్ధంగా ఉన్న వరి పంట మునిపోతుందని ఆందోళనకు దిగారు. వరి పంట మొత్తం భాగం అడవికొలను భాగంలో ఉండటంతో అడవికొలను నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చి వాగ్వాదానికి దిగారు. వరి కోతలు అనంతరం గండ్లు పెట్టాలని ధర్నా చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు విషయాన్ని ఉన్నతాధికారులు నివేదించారు. వేసవి సెలవులు సద్వినియోగం చేసుకోవాలి దెందులూరు: న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ మంగళవారం దెందులూరులోని బాల సదనాన్ని దర్శించారు. బాలలకు అందుకున్న సౌకర్యాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల వేసవి సెలవుల్లో కాలాన్ని వృథా చేయకుండా జనరల్ నాలెడ్జి పుస్తకాలు చదవడం, చదరంగం ఆడటం మొదలైన కార్యకలాపాలు చేయాలన్నారు. సమయాన్ని వృథా చేసుకోకుండా సెల్ఫోన్లకు దూరంగా ఉండి విద్యలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. -
టైర్ పంక్చర్.. అరటి గెలల వ్యాన్ బోల్తా
ద్వారకాతిరుమల: టైర్ పంక్చరై అరటి గెలల లోడుతో వెళుతున్న వ్యాన్ బోల్తా పడిన ఘటన ద్వారకాతిరుమల మండలంలోని గుణ్ణంపల్లి జాతీయ రహదారిపై, పోలవరం కుడి కాలువ వంతెన వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం. కాకినాడ జిల్లా ఏలేశ్వరంనకు చెందిన పులుమంచుల ఆనందం (ఆనందరావు) అరటి గెలల వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని తోటల్లో అరటి గెలలను కొనుగోలు చేశాడు. వాటిని నరికేందుకు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం, లింగంపర్తికి చెందిన బొలేరో డ్రైవర్ కాకర లోవరాజు, భద్రవరంనకు చెందిన పులుమంచుల ఈశ్వరరావు, లింగంపర్తికి చెందిన కోనా సత్యన్నారాయణ, అనుబోలు రామకృష్ణ (55), గుంప సూర్యనారాయణ(శివ) వ్యాపారి ఆనందంతో కలసి బొలేరో వ్యాన్లో వెళ్లారు. గెలలు నరికి, వ్యాన్లో లోడు చేసుకుని, ఏలేశ్వరం మండలం ఎర్రవరంలోని మార్కెట్కు వెళుతున్నారు. ద్వారకాతిరుమల మండలంలోని గుణ్ణంపల్లి జాతీయ రహదారిపై, పోలవరం కుడి కాలువ వంతెన వద్దకు వచ్చేసరికి వ్యాన్ వెనుక టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా వ్యాన్లో ఉన్న ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను భీమడోలు, నల్లజర్ల 108 ఆంబులెన్స్లలో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనుబోలు రామకృష్ణ మృతి చెందాడు. మిగిలిన ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు అందరూ కాకినాడ జిల్లా వాసులే ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి వద్ద ఘటన -
చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలి
నూజివీడు: నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని మూడో జోన్లోని 2.36 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తిచేయాలని ఎన్నెస్పీ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. నూజివీడులోని ఎన్నెస్పీ డివిజన్ కార్యాలయంలో మంగళవారం ప్రాజెక్ట్ కమిటీ సమావేశాన్ని చైర్మన్ కోట వీరబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పులిచింతల ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎం.ఆర్. మొహిద్దీన్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ కమిటీ గత తీర్మానం ప్రకారం కృష్ణానది యాజమాన్యం బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అలాగే ఎడమ కాలువ పరిధిలో 2వ, 3వ జోన్లలో ఉన్న కాలువల నిర్వహణకు ఎస్టిమేట్లు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు మాట్లాడుతూ ఎడమ కాలువ పరిధిలో వేసవిలో తాగునీటి అవసరాల కోసం ప్రతిపాదించిన 3.75 టీఎంసీల నీటిని తెలంగాణ ఎన్నెస్పీ అధికారులతో విడుదల చేయించాలన్నారు. అలాగే వేదాద్రి, కంచల ఎత్తిపోతల పథకాన్ని త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైస్ చైర్మన్, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణ మాట్లాడుతూ 3వ జోన్ పరిధిలో ఎడమ కాలువల ఆధునికీకరణకు 16వ ఆర్థిక సంఘం నుంచి ప్రతిపాదించిన రూ.199 కోట్ల నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు చెందిన 15 మంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, నూజివీడు డివిజన్ ఈఈ ఆర్ సంతోష్, జగ్గయ్యపేట డివిజన్ ఈఈ కే.కిషోర్ డీఈలు కే సీతారావమ్మ, వీఎస్ఆర్ ప్రభు, కే రామదాసు, శశికుమారి, రాంబాబు, విజయలక్ష్మి, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. కాలువల ఆధునికీకరణకు 16వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయాలి నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ సర్వసభ్య సమావేశం తీర్మానం -
జూలై నుంచి ఆక్వా పంట విరామం
పెనుమంట్ర: ఆక్వా ఫీడ్ ధరల నియంత్రణతో పాటు ప్రాసెసింగ్ యూనిట్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే జూలై నుంచి ఆక్వా సాగు విరామం ప్రకటిస్తామని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్రాజు అన్నారు. మంగళవారం రాత్రి పెనుమంట్రలోని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భూపతి రాజు శ్రీనివాస్ రాజు నివాసంలో ఆక్వా రైతుల అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న భగవాన్ రాజు మాట్లాడుతూ కూలీ ధరలతో పాటు ఫీడ్ ధరలు గణనీయంగా పెరగడం, రొయ్యల ధరలను సిండికేట్లు భారీగా తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, సిండికేట్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే క్రాప్ హాలిడే ఒకటే సరైన పరిష్కారం అన్నారు. జూలై నుంచి ఆక్వా సాగును నిలిపివేయాలని ప్రకటించారు. -
గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
కుక్కునూరు: గోదావరిలోకి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం మండలంలోని వింజరం రేవులో జరిగింది. కుక్కునూరు ఎస్సై రామక్రిష్ణ చెప్పిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం, అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామానికి చెందిన ఉప్పల సాయిరాం (27) ఆటోమొబైల్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు, తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినా ఇంట్లో వాళ్లు వినకుండా పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో మంగళవారం ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. మధ్యాహ్నం ఇంటి నుంచి పొలిపాకలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు వింజరం రేవుకు చేరుకున్న సాయిరాం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను ఇంట్లో గొడవ పడి వచ్చిన విషయం తెలుసుకున్న బంధువులు గోదావరి నది ఒడ్డున సాయిరాం బైక్ ఉండడాన్ని చూసి గోదావరిలో వెతకగా మృతదేహం లభించినట్టు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్సై రామక్రిష్ణ చెప్పారు. -
గంధకంతో ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులు
చింతలపూడి: ఉద్యాన పంటల్లో మొక్కల పెరుగుదలకు, అభివృద్ధికి అవసరమైన ముఖ్యమైన పోషక పదార్థాల్లో గంధకం ఒకటి. ఉద్యాన పంటల్లో గంధకం వాడకం వల్ల 25 శాతం దిగుబడి పెరుగుతుందని ఉద్యానాధికారి ఎండీ షాఫియ ఫర్హీన్ తెలిపారు. మెట్ట ప్రాంతంలో రైతులు ఉద్యాన పంటలను ఎక్కువగా పండిస్తుంటారని, ఈ నేపథ్యంలో ఉద్యాన పంటల్లో వాడే పోషకాలను గురించి ఆమె వివరించారు. సాధారణంగా మెట్టప్రాంత రైతులు స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాస్, మెగ్నీషియం, బోరాన్లను వాడుతుంటారన్నారు. వీటితో పాటు అదనంగా గంధకం వాడితే ఆయిల్పాం, కొబ్బరి, నిమ్మ, బత్తాయి, అరటి, మామిడి తోటల్లో దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గంధకం ఉపయోగాలు గంధకం క్లోరోఫిల్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేయడానికి అవసరం. కొన్ని విటమిన్ల ఉత్పత్తికి గంధకం చాలా అవసరం. పండ్ల రుచి, వాసన, రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, ఉల్లిపాయ, వెల్లుల్లిలో వాటి ప్రత్యేకమైన వాసన గంధకం వల్లనే వస్తుంది. కొన్ని సందర్భాల్లో, గంధకం శిలీంద్ర నాశినిగా, కొన్ని రకాల తెగుళ్లను నివారించడానికి కూడా ఉపయోగించబడుతుంది. వేటిలో లభిస్తుంది గంధకం మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అమ్మోనియ సల్ఫేట్, జిప్సం, సల్ఫేట్ ఆఫ్ పొటాష్, జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, మాంగనీస్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్ల రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. గంధకం నేలలో వాడినప్పుడు దాని ఆమ్ల స్వభావం నేల ఉదజని సూచిక 6 నుంచి 6.5 వరకు వచ్చే సరికి నేలలోని అన్నిరకాల పోషకాలు మొక్కకు అందుబాటులోకి వస్తాయి. చౌడు భూములను బాగు చేసుకోవడానికి నేలలోని ఉదజని సూచికను బట్టి ఎకరానికి 500 కేజీల జిప్సంను వాడినట్లయితే దిగుబడి బాగా పెరుగుతుంది. గంధకం వాడకంతో పంట నాణ్యత, పరిమాణము,గింజల్లో నూనె శాతం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది ఉద్యాన పంటల్లో తక్కువ ధరలో అందుబాటులో ఉండే జిప్సం, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 50 శాతం, సల్ఫర్ గుళికలు 90 శాతం వాడినట్లయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. కాపుకాసే తోటలైతే 500 గ్రాములు, వయస్సును బట్టి 5 నుంచి 10 కేజీల జిప్సం సంవత్సరానికి రెండు సార్లు వేసుకున్నట్లయితే దిగుబడులు పెరుగుతాయి. ఇతర పండ్ల తోటలకు, కూరగాయల తోటలకు అయితే దుక్కిలో ఎకరానికి నేల స్వభావాన్ని బట్టి 300 నుంచి 500 కేజీల జిప్సంను వాడుకోవచ్చు. -
చిన్నారి చికిత్సకు రూ.1,05,600 సాయం
కొయ్యలగూడెం: చిన్నారి చికిత్స నిమిత్తం దాతలు స్పందించి సాయం అందజేశారు. కొయ్యలగూడెంకు చెందిన కంచర్ల జ్యోత్స్న (7) అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు కాకినాడలో చికిత్స చేయిస్తుండగా ప్లాస్మా థెరపీ అవసరమని, రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతోందని వైద్యులు తెలపడంతో చిన్నారి కుటుంబ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీనిపై ఈనెల 29న ‘ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన కొల్లూరు సత్తిబాబు ఫ్రెండ్స్ సర్కిల్ రూ. రూ.1,05,600 జోత్స్న బంధువులకు అందజేశారు. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ చిన్నారి మెరుగైన వైద్యానికి ప్రజాప్రతినిధులు సహకరించాలని, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు ఇప్పించాలని కోరారు. -
నీట్కుకట్టుదిట్టమైన ఏర్పాట్లు
కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో): జిల్లాలో మే 4న నీట్ పరీక్షను పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో నీట్ కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షకు ఏలూరులోని కస్తూర్బా మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సబ్బమ్మదేవి మున్సిపల్ హైస్కూల్, దెందులూరు మండలం గోపన్నపాలెంలోని కేంద్రీయ విద్యాలయం, గోపన్నపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. 1200 మంది హజరవుతున్న నేపథ్యంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రం పరిధిలో 144వ సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణకు సిటీ కో–ఆర్డినేటర్గా కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ వ్యవహరిస్తారన్నారు. ఉన్నత లక్ష్యం, పట్టుదల ఉండాలి ఉన్నత లక్ష్యం, పట్టుదలతో దేనినైనా సాధించవచ్చని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో కోవిడ్–19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలలు, పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ స్కీంలో ఉన్న లబ్ధిదారులతో కలెక్టర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 26 మంది బాలబాలికలకు గార్డియన్గా ఉన్న కలెక్టర్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆకాష్ పరీక్షలో తప్పిన ఒక సబ్జెక్ట్కు సప్లిమెంటరీ పరీక్ష రాయించి ఫలితాలు వచ్చాక అప్డేట్ చేయాలని డీసీపీవోకు సూచించారు. పదో తరగతిలో ఒక సబ్జెక్ ఫెయిల్ అయిన అజేయ్ ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాలని డీఈవోను ఆదేశించారు. 18 ఏళ్లు నిండి వివాహం చేసుకున్న ఇద్దరు యువతులను కలెక్టర్ ఆశీర్వదించారు. 18 ఏళ్లు నిండిన ఇద్దరికి రూ.10 లక్షలు డిపాజిట్ పోస్టల్ పాస్బుక్స్ కలెక్టర్ అందజేశారు. -
రూ.39.50 లక్షల గంజాయి పట్టివేత
ఏలూరు (టూటౌన్): ఏలూరు పోలీసులు రూ.39.50 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ టీం ఐజీ ఏ.రవికృష్ణ ఎస్పీ కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం సీఐ వి.కృష్ణబాబుకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా, స్థానిక పోలీసులతో కలిసి ఈగల్ టీం ఈ ఆపరేషన్ను చేపట్టిందని చెప్పారు. మంగళవారం ఉదయం జంగారెడ్డిగూడెం ఎస్సై ఓ.జబీర్, ఈగల్ టీం దేవరపల్లి–తల్లాడ మార్గంలోని మార్కెట్ యార్డు చెక్ పోస్టు వద్ద రెండు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. తనిఖీలో గంజాయితో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన మనం చంద్రదొర అలియాస్ దొరబాబు, నాయుడు రాజా, బొంతు దుర్గా సతీష్, కుడితి చిన్ని, అనకాపల్లి జిల్లాకు చెందిన ఈపు ధనరాజ్ను అరెస్టు చేశారు. టాటా వ్యాన్, డిజైర్ కారును సీజ్ చేశారు. ఈ ఆపరేషన్లో మొత్తం 394.795 కిలోల గంజాయి, రెండు వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని, ఇతర నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని ఐజీ రవికృష్ణ చెప్పారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న వారిని అభినందించారు. -
కోళ్ల వ్యర్థాలతో ఆక్వా సాగుపై ఆగ్రహం
స్పందనకై కలూరు: కోళ్ల వ్యర్థాలతో ఫంగసిస్ చేపల సాగు చేస్తున్న చటాకాయి గ్రామానికి చెందిన రైతు ఘంటసాల సుబ్బరాజుకు మత్స్యశాఖ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ‘చేపల సాగులో కోడి వ్యర్థాలు’ అనే శీర్షికతో సాక్షిలో మంగళవారం వెలువడిన కథనంపై అధికారులు స్పందించారు. కై కలూరు మత్స్యశాఖ అధికారి చెలపురి గణపతి వెంటనే స్పందించారు. వ్యర్థాలతో సాగు చేస్తున్న 6.5 ఎకరాల చెరువును సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎఫ్డీవో మాట్లాడుతూ కోళ్ళ వ్యర్థాలతో సాగు చేయడం నేరమన్నారు. సదరు రైతుకు కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్వా సాగు అనుమతి పత్రాన్ని రద్దు చేస్తున్నామన్నారు. సాగును వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. -
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ
వేసవిలో పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ మే 1వ తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం పలువురు పీఈటీ, పీడీ, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాము. నెలరోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాల్లో పిల్లలు ఆటలు నేర్చుకునేందుకు బాల్స్, హాకీ స్టిక్స్, నెట్స్ తదితర క్రీడాపరికరాలు అందిస్తాం. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శిక్షణ ఇస్తాం. శిక్షణ తర్వాత పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తారు. – బి శ్రీనివాసరావు, డీఎస్డీఓ -
పక్షుల కేంద్రం చెరువులో నీటిని నింపాలి
కై కలూరు: తాగునీటి అవసరాలకు విడుదల చేసిన పంట కాల్వల నీటిని ఆటపాక పక్షుల కేంద్రం చెరువుకు మళ్లించాలని పర్యావరణ ప్రేమికుడు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ఎస్.భాస్కరరావు డిమాండ్ చేశారు. నీరు లేక అడుగంటిన ఆటపాక పక్షుల కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీటి కొరత కారణంగా పక్షులకు ఆహారపు కొరత ఏర్పడుతోందన్నారు. నెల రోజులుగా కేంద్రంలో బోటు షికారు నిలిచిపోడడంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నా పర్యాటకులు నిరాశగా వెనుతిరుగుతున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు చెరువులో నీటిని నింపే ప్రయత్నం చేయాలని కోరారు. చెల్లని చెక్కు కేసులో జైలు, జరిమానా నూజివీడు: బాకీ తీర్మానం నిమిత్తం ఇచ్చిన చెక్కు బ్యాంకులో చెల్లని నేరానికి టి.నరసాపురం మండలం వెలగపూడికి చెందిన చింతపల్లి చక్రిసాయి రాంబాబుకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2018 నవంబరు 18న కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మడిచర్లకు చెందిన తలకొండ గోపాలకృష్ణ, చక్రిసాయి రాంబాబుకు రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తరువాత ఆ బాకీ తీర్చమని గోపాలకృష్ణ కోరగా, సాయి రాంబాబు రూ.1.50 లక్షలకు చెక్కు ఇచ్చాడు. ఈ చెక్కును బ్యాంకులో వేయగా సాయి రాంబాబు ఎక్కౌంట్లో నగుదు లేదని వెనక్కు తిరిగి వచ్చింది. దీంతో గోపాలకృష్ణ కోర్టులో కేసు వేయగా విచారించిన మీదట జరిమానా, జైలుశిక్ష విధిస్తూ స్పెషల్ మేజిస్ట్రేట్ తీర్పును వెలువరించారు. కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలు నూజివీడు: కోతుల దాడిలో ఓ వృద్ధురాలికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. 15వ వార్డులోని కృష్ణవిలాస్ కాలనీలో నివాసముంటున్న కౌన్సిలర్ హరికోటి రమాదేవిని చూసేందుకు ఆమె తల్లి విస్సన్నపేట మండలం తాతకుంట్ల మిట్టగూడెంకు చెందిన మేడా కుమారి (55) వచ్చింది. రమాదేవి ఇంటి ఆవరణలో ఉన్న కుమారిపై మంగళవారం సాయంత్రం 6 గంటలకు కోతులు దాడి చేసి గాయపరిచాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గుండెనొప్పితో ఉపాధి కూలీ మృతి కుక్కునూరు: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన కుక్కునూరు పంచాయతీ పరిఽధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి, గ్రామంలోని సంజయ్నగర్ కాలనీకి చెందిన పెంకె వెంకయ్య (55) రోజులానే మంగళవారం ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనిముగించుకోని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి కూలీలు ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందాడు. గుర్తుతెలియని మృతదేహం లభ్యం దెందులూరు: ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం పంచాయతీ మాదేపల్లిలో రోడ్డుపక్క పంట బోదెలో పురుషుడి మృతదేహం లభ్యమైనట్లు ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. మృతుడి వయసు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని, వివరాలు తెలిస్తే 94407 96636 ఫోన్ నంబర్కు తెలియజేయాలన్నారు. -
ఏజెన్సీలో భారీ వర్షం
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న ప్రజలకు మంగళవారం సాయంత్రం కారుమబ్బులు కమ్మి వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో సుమారు 2 గంటల పాటు వాన పడింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. బుట్టాయగూడెం, రెడ్డిగణపవరం, దొరమామిడి, గుబ్బల మంగమ్మ గుడి, పులిరామన్నగూడెం గ్రామాలతోపాటు కొండ ప్రాంతాల్లోని అన్ని గ్రామాల్లో కూడా భారీ వర్షం కురిసింది. విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడడంతో వాటిని తొలగించి విద్యుత్ను పునరుద్ధరించేందుకు ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. పోలవరంలో ఈదురుగాలులతో వర్షం పోలవరం రూరల్: మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గాలుల ప్రభావానికి అక్కడక్కడా చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. జంగారెడ్డిగూడెంలో.. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బుట్టాయగూడెం రోడ్డు, అశ్వారావుపేట రోడ్డు, పాతబస్టాండ్ రోడ్డులో చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖాధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. -
పాలిసెట్ కేంద్రాల పరిశీలన
నూజివీడు: పట్టణంలోని జెడ్పీ బాలికల హైస్కూల్ ప్లస్, ఎస్ఆర్ఆర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష కేంద్రాలను పాలిసెట్ రాష్ట్ర సెక్రటరీ జీవీ రామచంద్రరావు మంగళవారం పరిశీలించారు. పరీక్ష కేంద్రాలను పట్టణంలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. జెడ్పీ బాలికల హైస్కూల్ ప్లస్లో బాలురు 108 మంది, బాలికలు 204 మంది, మొత్తం 312మంది పరీక్షకు హాజరుకానున్నారు. ఎస్ఆర్ఆర్ హైస్కూల్లో బాలురు 293 మంది, బాలికలు 163 మంది కలిపి మొత్తం 456 మంది హాజరవ్వనున్నారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు 11 గంటల కంటే ముందుగా పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలన్నారు. వేసవి నేపథ్యంలో చల్లని నీరు, ఫ్యాన్లు వంటి సౌకర్యాలు కల్పించామన్నారు. -
నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
తాడేపల్లిగూడెం అర్బన్: నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకొంది. రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాత చింతలపూడికి చెందిన కొండమురుగు తేజశ్వి (23) తాడేపల్లిగూడెంలోని మదర్ వన్నినీ నర్సింగ్ స్కూల్లో బీఎస్సీ నర్సింగ్ విద్యను అభ్యసిస్తోంది. తాడేపల్లిగూడెంలోని గొల్లగూడెం ప్రాంతంలో ఉన్న ఎస్సీ హాస్టల్లో నివాసం ఉంటుంది. మంగళవారం ఉదయం 11 గంటల వరకు హాస్టల్లోని తోటి విద్యార్థులతో కలసి మాట్లాడింది. తరువాత 12.30 గంటల సమయంలో తేజస్వీని కనబడకపోవడంతో హాస్టల్ వార్డెన్ సుజాత ఆరా తీయగా హాస్టల్లోని ఎవరూ లేని ఒక గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని కనపించింది. వార్డెన్ సుజాత పెద్దగా కేకలు వేయడంతో తోటి విద్యార్థులు అక్కడకు చేరుకొని తేజశ్విని కిందకు దింపే ప్రయత్నం చేశారు. తేజశ్విని 108 అంబులెన్స్ ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తేజశ్వి మృతికి ప్రేమ వ్యవహారం కారణమై ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమెకు తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా తల్లి, అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. రూరల్ ఎస్సై జీవీఎన్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్లో చాటింగ్.. ఆపై మోసం
ఏలూరు (టూటౌన్): భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆన్లైన్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. భీమడోలు మండలం, ఆగడాలలంక గ్రామానికి చెందిన బలే శైలజ (26)కు ఈలో–ఈలో ఆన్లైన్ యాప్ ద్వారా రాజు యాదవ్ అనే పేరుతో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్నని చెప్పి నమ్మించాడు. బాధితురాలి సమస్యలను తెలుసుకొని ప్రైవేట్ బ్యాంక్లలో లోన్ ఇప్పిస్తానని నమ్మించాడు. లోన్ ప్రొసెసింగ్ ఫీజ్ చెల్లించాలని చెప్పి దఫాదఫాలుగా సుమారు రూ.1,60,900 ఫోన్ పే ద్వారా వసూలు చేశాడు. ఎన్ని రోజులైనా లోన్ రాకపోవడంతో ఆమె నాగరాజును నిలదీయగా నీ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె భీమడోలు పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడు కడప జిల్లా వేములకు చెందిన నారుబోయిన రాజశేఖర్ అలియాస్ రాజుయాదవ్ను గుండుగొలను గ్రామ శివారు పోతునూరు రోడ్డులోని వాటర్ కల్వర్ట్ వద్ద అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు సెల్ఫోన్లు, రెండు లాప్టాప్లను సీజ్ చేశారు. కేసును ఛేదించిన భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్సై వై.సుధాకర్, హెచ్సీలు ఎస్కేఎస్ బాజీ, ఎస్.శ్రీనివాస్, పీసీ ఎం.వెంకటేశ్వరరావులను డీఎస్పీ అభినందించారు. కేసును ఛేదించిన భీమడోలు పోలీసులు -
‘(అ) సత్యం’ నాటికకు మొదటి బహుమతి
భీమవరం: చైతన్య భారతి సంగీత, నృత నాటక పరిషత్ ఆధ్వర్యంలో భీమవరం డీఎన్నార్ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో నిర్వహించిన 18వ జాతీయస్థాయి నాటికల పోటీల్లో చైతన్య కళా స్రవంతి విశాఖపట్నం వారి ‘(అ) సత్యం’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ప్రథమ బహుమతిని గెల్చుకుంది. విజేతల వివరాలను సోమవారం నాటిక న్యాయనిర్ణేతలు మానాపురం సత్యనారాయణ, ఎల్ రుద్రమూర్తి, సుసుము నాగ భూషణం వెల్లడించారు. సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి ‘జనరల్ భోగీలు’ ద్వితీయ బహుమతి, యువభేరి థియేటర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారి ‘నా శత్రువు’ తృతీయ బహుమతిని గెల్చుకున్నాయి. జ్యూరీ ప్రదర్శనగా అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి ‘చిగురు మేఘం’, ఉత్తమ రచనగా ‘నా శత్రువు’, ఉత్తమ దర్శకత్వం బాలాజీ నాయక్ ((అ) సత్యం), ఉత్తమ నటుడు కావూరి సత్యనారాయణ (చెన్నయ్య పాత్రధారి – చిగురు మేఘం), ఉత్తమ నటి సురభి ప్రభావతి (సావిత్రమ్మ పాత్రధారిణి – జనరల్ భోగీలు), ఉత్తమ విలన్గా గోపరాజు విజయ్ (సీఐ పాత్రధారి – జనరల్ భోగీలు), ఉత్తమ హాస్యనటుడు పి కోటేశ్వరరావు (మా ఇంట్లో మహాభారతం), ఉత్తమ బాల నటుడు యశ్విత (నా శత్రువు), ద్వితీయ ఉత్తమ నటుడు చెరుకూరి సాంబశివరావు (కిడ్నాప్), ద్వితీయ ఉత్తమ నటి జ్యోతిరాణి (మా ఇంట్లో మహాభారతం), ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గంగోత్రి సాయి (విడాకులు కావాలి) ఎం రత్నకుమారి (బ్రహ్మ స్వరూపం), ఉత్తమ రంగాలంకరణ పీవీ కుమార్ (బ్రహ్మ స్వరూపం), ఉత్తమ సంగీతం లీలమోహన్ (అ సత్యం), ఉత్తమ మేకప్ థామస్ (ఉక్కు సంకెళ్ళు), జ్యూరీ బహుమతి చిగురు మేఘం, ఇది రహదారి కాదు నాటికలు గెల్చుకున్నాయి. విజేతలకు పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు రాయప్రోలు భగవాన్, మంతెన రామ్కుమార్రాజు, భట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండా రాంబాబు, కట్రెడ్డి సత్యనారాయణ, పెన్నాడ శ్రీనివాస్, కృత్తివెంటి సత్యకుమార్ తదితరులు బహుమతులు అందజేశారు. -
శ్రీవారి దేవస్థానం కాంట్రాక్ట్ సిబ్బంది నిర్వాకం
దేవస్థానం హైస్కూల్ గ్రౌండ్లో మద్యం సేవించిన ట్రాక్టర్ డ్రైవర్, స్కావెంజర్ ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం హైస్కూల్ గ్రౌండ్లో ఇద్దరు ఆలయ కాంట్రాక్ట్ ఉద్యోగులు సోమవారం మద్యం సేవించడం వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానంలో సెవెన్ హిల్స్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తోంది. కాంట్రాక్ట్ తరుఫున పనిచేస్తున్న ఒక ట్రాక్టర్ డ్రైవర్, మరో స్కావెంజర్ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో స్థానిక హైస్కూల్ గ్రౌండ్లోని స్టేజీపై కూర్చుని మద్యం సేవిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పారిశుద్ధ్య పనులకు వినియోగించే ట్రాక్టర్ను సైతం గ్రౌండ్లో వారి వద్దే పెట్టుకున్నారు. మధాహ్నం 3 గంటలకు విధులకు వెళ్లాల్సి ఉండగా, ఇప్పుడు మద్యం సేవిస్తున్నారేమిటని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు, వేసవికాలం కావడంతో సాయంత్రం 4 గంటలకు విధులకు వెళ్తామని ట్రాక్టర్ డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. అయినా పాఠశాల గ్రౌండ్లో తాగడం ఏమిటని అడిగితే గ్రౌండ్లో ఉన్న ఖాళీ మద్యం బాటిళ్లను చూపించి, ఇవన్నీ అవే కదా అని చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బెల్లం అమ్మిన కేసులో రూ.25 వేల జరిమానా కామవరపుకోట: నాటు సారా తయారు చేసే వారికి బెల్లం అమ్మిన కేసులో ఒక వ్యక్తికి రూ. 25 వేల జరిమానా విధించినట్లు చింతలపూడి ఎకై ్సజ్ సీఐ పి.అశోక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈస్ట్ యడవల్లికి చెందిన శ్రీ సాయి రంగ ప్రకాష్ గ్రామంలో నాటు సారాయి తయారు చేసే వారికి బెల్లం సరఫరా చేసిన కేసులో తహసీల్దార్ జి.ఎలిసా జరిమానా విధించినట్లు తెలిపారు. -
దాడి కేసులో ఆరుగురిపై కేసు నమోదు
భీమవరం: రెస్టారెంట్లోని ఆహారం బాగాలేదని వంటమనిషిపై దాడిచేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఏఎస్సై నర్సింహస్వామి సోమవారం చెప్పారు. పట్టణంలోని అజయ్ బార్ అండ్ రెస్టారెంట్కు పట్టణానికే చెందిన సుధీర్, మరో అయిదుగురు వెళ్లారు. అక్కడ ఆహారం బాగాలేదని వంట మనిషి ప్రకాష్పై బీరుబాటిల్ పగులగొట్టి దాడిచేశారు. దీనిపై బార్ అండ్ రెస్టారెంట్ సూపర్వైజర్ దారపురెడ్డి గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై నర్సింహస్వామి చెప్పారు. ట్రిపుల్ ఐటీలో మెస్లనిర్వహణపై అభిప్రాయ సేకరణ నూజివీడు: ట్రిపుల్ఐ టీలోని మెస్ల నిర్వహణపై సోమవారం అధికారులు విద్యార్థుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. తహసీల్దార్ బీవీ సుబ్బారావు తన సిబ్బందితో వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. మెస్లలో భోజనం ఎలా ఉంది, డైనింగ్ హాల్, కిచెన్లలో శుభ్రత తదితర విషయాలపై అభిప్రాయాన్ని తెలపమని విద్యార్థులకు ప్రింటెండ్ పత్రాలు అందించారు. వాటిల్లో విద్యార్థులు వారి అభిప్రాయాన్ని తెలిపారు. అభిప్రాయ సేకరణను సబ్ కలెక్టర్ బచ్చు స్మరణ్రాజ్ పరిశీలించారు. భోజనం ఎలా ఉందంటూ పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు పెట్టే భోజనం శుచిగా, రుచిగా ఉండాలన్నారు. ట్రిపుల్ ఐటీ అధికారులు నిరంతరం మెస్లను పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదు ముదినేపల్లి రూరల్: మండలంలోని పేరూరులో స్థానిక సమస్యలపై ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో దళితులను కులం పేరుతో దూషించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సేవా నాగజగన్బాబురావు స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన మురళీ, అతని తల్లి ఆ గ్రామంలోని సమస్యలకు సంబంధించి దళితులకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ పెద్దల సమక్షంలో దళితులను కులం పేరుతో దూషించి కించపరిచారంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినవారిలో దళిత నాయకులు గరికిముక్కుల రాజేష్, భూపతి సునీత, తదితరులున్నారు. మ్యాజిక్ ఫెస్టివల్లో మెరిసిన లేడీ మెజీషియన్ లక్ష్మీప్రసన్న తణుకు అర్బన్: పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈనెల 27వ తేదీన నిర్వహించిన పల్నాడు మ్యాజిక్ ఫెస్టివల్లో తణుకుకు చెందిన లేడీ మెజీషియన్ దండా లక్ష్మీప్రసన్న తృతీయ స్థానంలో నిలిచారు. దేశం నలుమూలల నుంచి 250 మందికిపైగా హాజరైన ఈ ఫెస్టివల్లో తృతీయ స్థానంలో నిలవడం చాలా సంతృప్తినిచ్చిందని ప్రసన్న తెలిపారు. ఈ ఫెస్టివల్తో వరుసగా మూడేళ్లపాటు మెజీషియన్ ఫెస్టివల్స్లో విజయం సాధించి హాట్రిక్గా నిలిచినట్లు వివరించారు. 2023లో అమరావతి జరిగిన మ్యాజిక్ ఫెస్టివల్లో స్టేట్ ఫస్ట్గాను, 2024లో ఉత్తరప్రదేశ్లో ఆగ్రా తాజ్ మ్యాజిక్ ఫెస్టివల్లో జాతీయస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఫెస్టివల్ నిర్వాహకులు జీవీఆర్, పల్నాడు ఫెస్టివల్ అధ్యక్షుడు బాబునాయుడు, కార్యదర్శి నాగరాజు, గురువు దండా రాములకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
ఉత్తమ ప్రదర్శనగా ‘స్వేచ్ఛ’ నాటిక
యలమంచిలి: కొంతేరు గ్రామంలోని శ్రీ పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిర్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ప్రదర్శితమైన 43వ అఖిల భారత స్థాయి నాటిక పోటీల్లో విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారిచే ప్రదర్శించిన స్వేచ్ఛ నాటిక ఉత్తమ ప్రదర్శనగా మొదటి బహుమతి గెలుచుకుంది. విజేతలకు యూత్ కమిటీ అధ్యక్షుడు అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పాలకొల్లు చాంబర్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ చేగొండి సత్యనారాయణమూర్తి బహుమతులు అందజేశారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా శ్రీసాయి ఆర్ట్స్–కొలకులూరు వారి జనరల్ భోగీలు నిలువగా, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నటీ నట సమాక్య–పాలకొల్లు వారి అనూహ్యం నాటిక నిలిచింది. జ్యూరీ విభాగంలో కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ వారి ద్వారబంధాల చంద్రయ్యనాయుడు నాటిక నిలిచింది. ఈ పోటీలకు కొంతేటి సర్వేశలింగం, గంటా రామమోహనరావు, కొడమంచిలి సత్యప్రసాద్ గుణ నిర్ణేతలుగా వ్యవహరించారు. నిద్రమత్తులో డాబాపై నుంచి పడి వ్యక్తి మృతి పాలకోడేరు: నిద్ర మత్తులో డాబాపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం మోగల్లులో జరిగింది. పాలకోడేరు ఎస్సై ఎం.రవి వర్మ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉండ్రాజవరపు నాగేశ్వరరావు (45) ఆదివారం రాత్రి ఎప్పటిలాగానే డాబాపై నిద్రించాడు. మూత్ర విసర్జన నిమిత్తం వేకువజామున కిందికి దిగే క్రమంలో పైనుంచి జారి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవివర్మ చెప్పారు. -
ముక్తికి మార్గం.. నత్తా రామేశ్వరుడి దర్శనం
పెనుమంట్ర: నత్తారామేశ్వరం గ్రామంలోని గోస్తనీ నదిలో వేంచేసియున్న పరశురామ ప్రతిష్ఠ శ్రీసప్త రామ కోటిలింగేశ్వరుడు సోమవారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిలింగ క్షేత్రంగా పేరుగాంచిన నత్తారామేశ్వరం గ్రామంలో శ్రీఉమా రామలింగేశ్వరుడు, లక్ష్మణేశ్వరుడు, సప్త రామ కోటి లింగేశ్వరులను ఒకే సమయంలో దర్శించుకునే అవకాశం ఒక్క వైశాఖమాసంలోనే భక్తులకు దక్కుతుంది. రామేశ్వర క్షేత్రంలో సీతారాములు, లక్ష్మణుడు, పరశురాముడు, స్వయంగా శివలింగాలను ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం చెబుతుంది. ఏడాదిలో 365 రోజులు ఉమా రామలింగేశ్వరుడు, లక్ష్మణేశ్వరుడులను దర్శించుకునే అవకాశం ఉన్నా.. నీటిలో ఉండే పరశురామ ప్రతిష్ఠ రామలింగేశ్వరుని దర్శించుకునే అవకాశం కేవలం 30 రోజులు మాత్రమే ఉంటుంది. వైశాఖ మాసం ప్రారంభకావడంతో సోమవారం దేవాదాయశాఖ కోనేరులోని నీటిని పూర్తిగా తొలగించి స్వామిని భక్తులు దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో సోమవారం జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి సప్తరామ కోటేశ్వరుడిని దర్శించుకున్నారు. భక్తులకు దాతలు అన్నసమారాధనతోపాటు చక్రపొంగలి, పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈసందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి బారులు తీరి త్రిలింగాలను దర్శించుకున్నారు. సోమవారం నుంచి ప్రారంభమైన సప్తకోటి రామలింగేశ్వరుడి దర్శనం ఏడాదిలో వైశాఖ మాసంలోనే స్వామివారి దివ్య దర్శనం బారులు దీరి త్రిలింగాలను దర్శించుకున్న భక్తులు -
బోధన కంటే అదనపు బాధ్యతలతోనే సరి
నూజివీడు: ట్రిపుల్ఐటీ.. ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించే విద్యాసంస్థ. అయితే ఇందులో పనిచేసే బోధనా సిబ్బందికి బోధన కంటే అదనపు బాధ్యతలతోనే సరిపోతోంది. ట్రిపుల్ ఐటీలో పర్మినెంట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెంటార్లు, ఐటీ మెంటార్లు పీయూసీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధన చేస్తున్నారు. వీరిలో కొందరికి పలు అదనపు బాధ్యతలను అప్పగించారు. తెలుగు డిపార్ట్మెంట్కు చెందిన ఏకంగా ముగ్గురికి అదనపు బాధ్యతలను అప్పగించడంతో వారు నిత్యం అదనపు బాధ్యతల్లోనే మునిగి తేలుతున్నారు. క్యాంపస్ మెయింట్నెన్స్ ఇన్చార్జిగా తెలుగు మెంటార్ ఓ శ్రీహరికి అప్పగించారు. ఈయన సెక్యూరిటీ, హౌస్కీపింగ్, గార్డెనింగ్, గెస్ట్హౌస్ల మెయింట్నెన్స్ను చూసుకుంటున్నారు. మూడు షిఫ్టులలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది విషయాలతో పాటు హౌస్కీపింగ్, గార్డెనింగ్ సిబ్బంది వ్యవహారాలు చూసుకోవడంతోనే ఉన్న సమయం కాస్తా సరిపోయే పరిస్థితి నెలకొంది. అలాగే తెలుగు సబ్జెక్టు బోధించే కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లలో జడ సీతాపతికి డీన్ స్టూడెంట్ వెల్ఫేర్(బాలుర) బాధ్యతలను, పీ లక్ష్మణరావుకు బాలుర చీఫ్ వార్డెన్ బాధ్యతలను అప్పగించారు. ఇలా ఒకే సబ్జెక్టుకు చెందిన ముగ్గురు బోధన సిబ్బందిని అదనపు బాధ్యతల్లో నియమిస్తే ఆ సబ్జెక్టులో విద్యార్థులకు న్యాయం ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫైనాన్స్ ఆఫీసర్గా ఏడాదికో ఫ్యాకల్టీ ట్రిపుల్ఈ విద్యార్థులకు పాఠాలు బోధించే శ్రీనాథ్కు ఫైనాన్స్ ఆఫీసర్గా బాధ్యతలు అప్పగించారు. ఫైనాన్స్ ఆఫీసర్గా ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఏడీ స్థాయి అధికారిని డిప్యూటేషన్పై నియమించుకోవాలని ట్రిపుల్ ఐటీకి సంబంధించిన యాక్ట్–18లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అదేమీ పాటించకుండా ఏడాదికొక ఫ్యాకల్టీని ఫైనాన్స్ ఆఫీసర్గా నియమిస్తున్నారు. సెంట్రల్ డీన్, సెంట్రల్ ఏఓ, ఏఓ, ప్లేస్మెంట్ ఆఫీసర్ అంటూ కొందరిని నియమించారు. మరికొందరికి మెస్ల ఇన్చార్జిలుగాను బాలికల హాస్టళ్లకు చీఫ్ వార్డెన్గా బాధ్యతలు అప్పగించారు. ఇలా అత్యధిక మంది నిరంతరం అదనపు బాధ్యతల్లోనే మునిగి తేలుతుండటంతో బోధన కొంతమేరకు కుంటుపడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదనపు బాధ్యతలు ఉన్న కొందరు వీటిని సాకుగా చూపించి పరీక్షల సమయంలో ఇన్విజిలేషన్ను సైతం తప్పించుకుంటున్నారు. మరికొందరైతే డబ్బులు వచ్చే సెమిస్టర్ పరీక్షలకు ఇన్విజిలేషన్ వేయించుకుంటూ డబ్బులు రాని మిడ్ పరీక్షల ఇన్విజిలేషన్కు దూరంగా ఉంటున్నారు. కొన్ని బ్రాంచిలకు ఫ్యాకల్టీ తక్కువ మెకానికల్ బ్రాంచికి సంబంధించి నాలుగు సంవత్సరాలకు సంబంధంచి 240 మంది విద్యార్థులకు 11 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. సీఎస్ఈ, ఈసీఈ బ్రాంచిలకు 1,440 మంది చొప్పున విద్యార్థులండగా సీఎస్ఈకి 20 మంది, ఈసీఈకి 15 మంది మాత్రమే ఫ్యాకల్టీ ఉన్నారు. కెమికల్కు 240 మందికి ఏడుగురు, ట్రిపుల్ ఈ కి 480 మందికి 14 మంది, సివిల్కు 240 మందికి 13 మంది, మెటలర్జీకి 240 మందికి ఐదుగురు ఫ్యాకల్టీ మాత్రమే ఉన్నారు. దీంతో కొందరికి ఎక్కువగా, మరికొందరికి తక్కువగా పనిభారం ఉండటం జరుగుతోంది. వీటన్నింటిని సరిదిద్ది విద్యార్థులకు మేలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం ట్రిపుల్ ఐటీ వర్గాల్లోనే వినిపిస్తోంది. తెలుగు డిపార్ట్మెంట్లోనే ముగ్గురికి అదనపు బాధ్యతలు ఫ్యాకల్టీల్లో కొందరికి ఎక్కువ పనిభారం ట్రిపుల్ ఐటీలో కుంటుపడుతున్న బోధన -
ముంపు చేలను పరిశీలించిన అధికారులు
నిడమర్రు: ‘అటవీ శాఖ నిర్లక్ష్యం–అన్నదాత ఆక్రోశం’ అని సాక్షి పత్రికలో సోమ వారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. తాహసీల్దారు నాగరాజు, వ్యవసాయ అధికారి గీతా కుమారితో కలిసి పెదనిండ్రకొలనులో నీట మునిగిన వరి చేలను పరిశీలించారు. మరో వైపు అటవీ శాఖ అధికారులు ముంపు నీటిని ఇంజిన్లతో, జేసీబీలతో బయటకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారి గంగారత్నం తెలిపారు. తహసీల్దారు మాట్లాడుతూ కౌలు రైతు వెంకన్న సాగు చేస్తున్న 7 ఎకరాల్లోని ముంపు నీటిని పూర్తిగా బయటకు తోడిన తర్వాత పంట నష్ట నివేదికను కలెక్టర్కు సమర్పిస్తామన్నారు. -
ద్వారకాతిరుమలలో గణేష్ శర్మకు శిక్షణ
ద్వారకాతిరుమల: కంచికామకోటి పీఠం ఉత్తరాధికారిగా నియమితులైన రుగ్వేద పండితోత్తముడు దుడ్డు సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్వారకాతిరుమలలో రుగ్వేదాన్ని అభ్యసించారు. 2009లో వేసవి సెలవుల్లో తిరుపతిలోని మేనమావ ఇంటికి వెళ్లిన గణేష్ శర్మను ఆదే సమయంలో తిరుపతి వచ్చిన కంచికామకోటి పీఠం శంకరాచార్యస్వామీజీ దగ్గరకు పిలిచి ఆశీర్వదించారు. ద్వారకాతిరుమల దేవస్థానం రుగ్వేద సలక్షణ ఘనాపాటి, సకల జ్ఞాన సంపన్నుడైన రత్నాకర్ శర్మ వద్ద చేర్పించాలని ఆదేశించారు. దాంతో ఆయన రత్నాకర శర్మ ఇంటి వద్ద ఉండి 2009 నుంచి దాదాపు 12 ఏళ్లపాటు వేద విద్యను పట్టుదలతో నేర్చుకున్నారు. ఆయన వద్ద రుగ్వేద సంహిత, ఐతరేయ బ్రాహ్మణ అరణ్యకం, ఉపనిషత్తులు వంటి వాటిలో నిష్ణాతులయ్యారు. సప్తమంజరి, ధాతురూపావళి, సమస కుసుమావళి వంటి ఎన్నో పుస్తకాలను అవపోసన పట్టారు. 12 ఏళ్ల పాటు ద్వారకాతిరుమలలో శిక్షణ పొందిన అన్నవరానికి చెందిన గణేష శర్మ కంచికామకోటి పీఠం ఉత్తరాధికారిగా నియమితులవడం పట్ల ఇక్కడ వేద పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంచి పీఠం ఉత్తరాధికారిగా నియామకం -
కొల్లేరు అతిథి పక్షుల తిరోగమనం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆహారం, ఆవాసం కోసం వేల మైళ్ల దూరం నుంచి కొల్లేరుకు వలస వస్తున్న విదేశీ అతిథి పక్షులు తిరుగుబాట పడుతున్నాయి. రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు కొల్లేరు పక్షి జాతుల ఉసురు తీస్తున్నాయి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కొల్లేరు సరస్సుపై పడింది. దీంతో జల సిరులతో కళకళలాడే సరస్సు ఎడారిని తలపిస్తోంది. కొల్లేరు భూమి నెర్రలతో కళావిహీనంగా మారింది. విదేశీ, స్వదేశీ పక్షులకు నీరు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు పయనమవుతున్నాయి. అభయారణ్య పరిధిలో వివిధ జాతులకు చెందిన 105 రకాల పక్షి జాతులను, 81,495 పక్షులను గుర్తించారు. వీటిలో 16 రకాల జాతులు సైబీరియా, యూరప్, చైనా, ఇండోనేషియా, అమెరికా, ఆస్ట్రేలియా, నైజీరియా, శ్రీలంక వంటి దేశాల నుంచి ఏటా వలస వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏలూరు జిల్లా కై కలూరు, మాధవపురం పక్షి సంరక్షణ కేంద్రాలకు పెలికాన్ పక్షులు వేలల్లో విచ్చేస్తాయి. దాదాపు వీటి సంఖ్య 7వేల పైనే ఉంటాయి. వీటిలో పాటు సూదితోక బాతు (నార్తరన్ పిన్ టయల్), కంకణాల పిట్ట (గ్లోబీ ఐబీస్), నల్ల రెక్కల ఉల్లంకి (బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్), బంగారు ఉల్లంకి(పసిఫిక్ గోల్డెన్ ప్లోవర్), చిన్న నీటి కాకి (లిటిల్ కార్మోరెంట్) వంటివి ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొల్లేరులో నీరు లేకపోవడంతో సుమారు 35 వేల పైనే పక్షులు వెనుదిరుగుతున్నాయి. గోదావరి జలాలు మళ్లించాలి పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కొల్లేరుకు మళ్లించాలని అనేక సంవత్సరాలుగా ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా కొల్లేరులో నిత్యం నీరు నిల్వ ఉండాలంటే రెగ్యులేటర్ల నిర్మాణం అవశ్యమని కొల్లేరుపై అధ్యయనం చేసిన మిత్రా, శ్రీరామకృష్ణయ్య కమిటీలు తేల్చిచెప్పాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీటి నిర్మాణాలకు నిధులు సైతం కేటాయించారు. ప్రభుత్వం మారడంతో రెగ్యులేటర్ల అంశం అటకెక్కింది. కూటమి ప్రభుత్వం రెగ్యులేటర్లను నిర్మిస్తే వర్షాకాలం, వరదల సమయంలో కొల్లేరుకు వచ్చే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. నీరు లేక ఎడారిగా మారిన కొల్లేరు సరస్సు సుమారు 35 వేల పక్షులు వెళ్లిపోయాయని అంచనా గోదావరి జలాలు కొల్లేరుకు పంపాలని డిమాండ్ కొల్లేరులో సహజ సిద్ధ చేపలు మృత్యువాత రెగ్యులేటర్లు నిర్మించండి కొల్లేరులో ఎల్లప్పుడూ నీరు ఉండాలంటే రెగ్యులేటర్లు నిర్మిం చాలి. దీనివల్ల వరదల సమ యంలో వచ్చే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఏటా సముద్రపు ఉప్పునీరు కొల్లేరుకు చేరుతోంది. ఈ నీటి వల్ల కొల్లేరులో సహజసిద్ధంగా పెరిగే చేపలు అంతరించిపోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం రెగ్యులేటర్ల నిర్మాణంపై దృష్టి సారించాలి. – ముంగర నరసింహారావు, ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అటవీ శాఖ అధికారులు పక్షులకు వేసవిలో నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలి. వేసవికి ముందుగానే అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. అరుదైన పక్షులు కొల్లేరుకు వలస వస్తున్నాయి. సామాజిక బాధ్యతగా పలు స్వచ్ఛంద సంస్థలు నీటి తొట్టెల ఏర్పాటుకు ముందుకు రావాలి. – ఎం.హరిప్రసాద్, హిస్టరీ హెచ్ఓడీ, వైవీఎన్నార్ డిగ్రీ కాలేజీ, కై కలూరు నెర్రలిచ్చిన కొల్లేరు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 9 మండలాల్లో 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. మొత్తం 122 కొల్లేరు గ్రామాల్లో దాదాపు 3 లక్షల మంది జీవిస్తున్నారు. కొల్లేరు సరస్సుకు 67 డ్రెయిన్ల ద్వారా 1.11 లక్షల క్యూసెక్కుల నీరు ఏటా చేరుతోంది. కృష్ణా, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో తూర్పు కనుమల కొండ ప్రాంతాల నుంచి వచ్చే రామిలేరు, బుడమేరు, తమ్మిలేరు వాగులు కొల్లేరుకు ప్రధాన నీటి వనరులు. గత తెలుగుదేశం పాలనలో వెలగలేరు వద్ద రామిలేరు, తమ్మిలేరును పోలవరం కుడి కాల్వకు, అదే విధంగా చిన్న కాల్వలు, డ్రెయిన్లను పట్టిసీమ ప్రాజెక్టు కాల్వలోకి మళ్ళించారు. దీంతో కొల్లేరుకు వచ్చే నీరు తగ్గింది. కొల్లేరు సరస్సులో అక్రమ చేపల చెరువులు వేల ఎకరాల్లో విస్తరించడం, ఎగువ నుంచి వచ్చే నీటిని చెరువుల్లో నింపుకోవడం వల్ల కొల్లేరులో నీటి జాడ కనిపించడం లేదు. నీరు లేకపోవడంతో కొల్లేరులో సహజసిద్ధంగా పెరిగే అనేక నల్ల జాతి చేపలు మృత్యువాత పడుతున్నాయి. -
చేపల సాగులో కోడి వ్యర్థాలు
కై కలూరు: కుళ్ళిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, చనిపోయిన కోడి పిల్లలు, పాడైన కోడిగుడ్లు ఇవి కొల్లేరు ప్రాంతమైన చటాకాయి గ్రామంలో ఫంగస్ చేపలకు వేస్తున్న ఆహారం. వీటిని తిన్న చేపలను మనం తింటే ఆరోగ్యం పాడవడం ఖాయం. అయినా కొందరు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో చేపల సాగు, 1.10 ఎకరాల్లో రొయ్యల సాగు వెరసి మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. కై కలూరు నియోజకవర్గం నాలుగు మండలాల్లో 84,852.4 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 30,972 మంది రైతులు ఆక్వాపై ఆధారపడి జీవిస్తున్నారు. నియోజకవర్గంలో ఫంగసీస్ సాగు సుమారు 8 వేల ఎకరాల్లో జరుగుతుందని అంచనా. ఫంగసిస్ చేపలు వ్యాధులను తట్టుకుని, ఎలాంటి మేతనైన జీర్ణం చేసుకునే గుణం కలిగి ఉంటాయి. దీంతో వీటికి కోడి వ్యర్థాలు ఆహారంగా వేస్తున్నారు. కేరాఫ్గా చటాకాయి: కై కలూరు మండలం చటాకాయి గ్రామం వ్యర్థాల సాగునకు కేరాఫ్గా మారుతోంది. గతంలో నిషేధిత క్యాట్ ఫిష్ సాగుకు అడ్డాగా గ్రామం ఉండేది. అనేక సందర్భాల్లో కోడి వ్యర్థాల వ్యాన్లు పట్టుబడ్డాయి. తాజాగా ఆదివారం రాత్రి గ్రామ పెద్దగా చాలామణి అవుతున్న వ్యక్తి చెరువులో కోడి వ్యర్థాలు విడిచిపెట్టారు. పోలీసులు ఆలస్యంగా రావడంతో అప్పటికే చెరువులో కోడి వ్యర్థాలు చల్లాడు. ఇదే గ్రామంలో దాదాపు 100 ఎకరాల్లో ఫంగసీస్ సాగులో కోడి వ్యర్థాలు వినియోగిస్తున్నట్లు సమాచారం. మచిలీపట్నం, విజయవాడ నుంచి ఈ వ్యర్థాలు వస్తున్నాయి. హైదరాబాదు, విజయవాడ నుంచి కుళ్ళిన కోడిగుడ్లను ఆమ్లెట్ రూపంలో ట్రేలలో తీసు కొచ్చి వినియోగిస్తున్నారు. కోడి వ్యర్థాలు కేజీ రూ. 15కి విక్రయిస్తోండగా, కోడి గుడ్ల ఆమ్లెట్ కేజీ రూ. 20కి కొనుగోలు చేస్తున్నారు. చేపల మేత ఫిల్లెట్ ధరలు కేజీ రూ.40కి చేరడంతో మేత ధరలను తగ్గించుకోడానికి వ్యర్థాల వైపు మళ్ళుతున్నారు. జీవో 56 అమలులో విఫలం : కోడి వ్యర్థాలు, ఇతర వ్యర్థాలతో చేపల సాగు చేసి పర్యావరణానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జీవో 56ను తీసుకొచ్చింది. వీటిని నియంత్రించడానికి చైర్పర్సన్గా తహసీల్దారు, సభ్యులుగా వీఆర్వో, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, ఎస్సై, మెంబరు కన్వీనర్గా ఫిషరీస్ డెవలప్మెంటు ఆఫీసర్ను నియమించారు. చటాకాయిలో వ్యర్థాల సాగుపై కై కలూరు రూరల్ ఎస్సైను వివరణ కోరగా వాహనాన్ని సీజ్ చేశామని, లక్ష పూచికత్తుతో తహసీల్దారుకు బైండోవర్ చేశామన్నారు. ఆరోగ్యానికి ముప్పు వ్యర్థాలతో సాగు చేసిన చేపలు తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రధానంగా ఇన్ఫెక్షన్ సమస్యలు తలెత్తుతాయి. నరాల బలహీనతలు, కడుపునొప్పి, వాంతులతో పాటు ఉదర సంబంధ వ్యాధులు వస్తాయి. – డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు, సూపరింటెండెంటు, ఏరియా ఆస్పత్రి, కై కలూరు. ఆక్వా రంగానికి చెడ్డ పేరు కొందరు చేసే తప్పు వల్ల మొత్తం ఆక్వా రంగానికి చెడ్డ పేరు వస్తుంది. పలు సమావేశాల్లో వ్యర్థాలతో సాగు చేయవద్దని హెచ్చరిస్తున్నాం. కొందరు పెడచెవిన పెడుతున్నారు. కలెక్టరు, ఎస్పీలకు వ్యర్థాల సాగుపై ఫిర్యాదు చేస్తాం. – నంబూరి వెంకటరామరాజు, రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు, తాడినాడ ఆరోగ్యానికి ప్రమాదమంటున్న వైద్యులు చటాకాయి గ్రామంలో ఫంగస్ చేపలకు మేతగా కోడి వ్యర్థాలు జీవో 56 అమలులో అధికారుల విఫలం -
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి
ఆన్లైన్లో చాటింగ్.. ఆపై మోసం భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళకు ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి నమ్మించి బాధితురాలి నుంచి దఫాదఫాలుగా రూ.1,60,900లు స్వాహా చేశాడు. 8లో uఏలూరు(మెట్రో): పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమంలో కలెక్టరు కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అధికారులు అందుకు అనుగుణంగా అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కారం చూపాలన్నారు. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులు పరిష్కరించని అధికారులపై చర్యలు తప్పవని కలెక్టరు హెచ్చరించారు. అధికారులే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి చక్కని పరిష్కారాన్ని చూపించాలన్నారు. ఆర్బీకే నిర్మిస్తే బిల్లులు చెల్లించడం లేదు ఏలూరు (టూటౌన్): భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామంలో ఆర్బీకే కేంద్రం 90 శాతం నిర్మాణం పూర్తయ్యిందని.. కాంట్రాక్టర్ అయిన తనకు అన్యాయం చేసి బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ అంబటి నాగేంద్ర సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. రైతు భరోసా కేంద్రంలో మిగిలిన 10 శాతం పనులు సర్పంచ్, ఈఓ, ఎంపీడీఓ కలిసి పూర్తి చేసి రైతు భరోసా కేంద్రాన్ని పంచాయతీగా మార్చి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్నారు. తాను 90 శాతం పనులు పూర్తి చేస్తే కేవలం 9.24 లక్షలు చెల్లించారని, మొత్తం గ్రాంటు 23.94 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. -
ప్రభుత్వాసుపత్రి మార్చురీలో కొత్త దందా
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని మార్చురీ అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో మృతదేహాలతో అక్రమ వ్యాపారం సాగించిన సిబ్బంది.. తాజాగా మరో వ్యాపారానికి తెరదీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్చు రీలోని ఫ్రీజర్ బాక్సులు పనిచేయటం లేదు. రెండ్రోజుల క్రితం దెందులూరు మండలం పోతునూరు గ్రామానికి చెందిన లింగాల పరశురాం విద్యుత్ షాక్తో మృతిచెందాడు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్లో మార్చురీకి తరలించగా ఫ్రీజర్ బాక్సులో పెట్టారు. సాయంత్రానికి మృతదేహం దుర్వాసన రావడంతో బంధువులు నిలదీశారు. మార్చురీ సిబ్బంది వారిపై ఎదురుదాడికి దిగారు. మీకు అవసరమైతే వెళ్ళి ఫ్రీజర్ బాక్సు తెచ్చుకుని పెట్టుకోండి? అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇంత జరుగుతున్నా స్పందించని అధికారులు ఏలూరు జీజీహెచ్లో మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్ బాక్సులు పనిచేయకపోవటంతో సిబ్బంది కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టారంటున్నారు. వారే ప్రైవేటు ఫ్రీజర్ బాక్సులు పురమాయిస్తారు. రోజుకి రూ.3 వేల నుంచి రూ.3,500 చెల్లిస్తే ఫ్రీజర్ బాక్సు తీసుకొచ్చి దానిలో మృతదేహాన్ని భద్రపరుస్తారు. ఇంత జరుగుతున్నా మెడికల్ కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుందో అర్థం కావడం లేదని పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది ఈ తరహాలో వ్యాపారం చేస్తుంటే అధికారులకు తెలియదా? లేక వారికీ దీనిలో వాటాలు ఉన్నా యా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా అక్రమ వ్యాపారం సాగిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారా? అని మృతుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పనిచేయని ఫ్రీజర్ బాక్సులు రూ. 3 వేలు ఇస్తే ఫ్రీజర్ బాక్సు పురమాయింపు -
భూసేకరణ పూర్తి చేయాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో జాతీయ రహదారి భూసేకరణ పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి, భూ యజమానులకు వెంటనే పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమ వారం జిల్లాలో 365 బిజి (గ్రీన్ ఫీల్డ్ హైవే), 165 జాతీయ రహదారుల నిర్మాణ, భూసేకరణ అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులకు భూములు అందించిన వారికి వెంటనే పరిహారం అందించి, భూములు స్వాధీనం చేసుకుని రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలందరూ వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ హాలులో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఎంహెచ్ఓ ఆర్.మాలిని, డీసీహెచ్ఎస్ డా.పాల్ సతీష్ కుమార్తో కలెక్టర్ సమీక్షించారు. వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పరచాలన్నారు. -
ఖైదీలకు మెరుగైన వైద్యం అందించాలి
ఏలూరు(టూటౌన్)/చింతలపూడి: ఖైదీలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. తక్షణం వైద్య సదుపాయం కల్పించాలని ఉభయ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ ఆదేశించారు. ఏలూరు కోటదిబ్బలోని జిల్లా కారాగారాన్ని సోమవారం ఆయన సందర్శించారు. అక్కడ వంటకాలను పరిశీలించి రుచి చూశారు. కారాగారంలోని ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందించే ఆహారం, మంచి నీరు విషయంలో రాజీ పడొద్దన్నారు. చింతలపూడి సబ్ జైలును ఆయన తనిఖీ చేశారు. ఉచిత న్యాయ సలహాలు, ముద్దాయిలకు అందించిన సాయంపై ఆరాతీశారు. వంటశాల, స్టోర్ రూం తనిఖీ చేశారు. 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో 2024–25 రబీ సీజన్కు సంబంధించి 12,380 మంది రైతుల నుంచి 1,55,529 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి చెప్పారు. సోమవారం గోదావరి సమావేశ మందిరంలో రబీ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఇంతవరకు రూ.359.27 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా రూ.206.71 కోట్లను ఖాతాల్లో జమచేశామన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఫిర్యాదు చేసేందుకు 08812–230448, 77020 03584, 75695 62076 నెంబర్లకు తెలియజేయాలన్నారు. బీమా అని చెప్పి టీడీపీ సభ్యత్వం ఉంగుటూరు: ఉంగుటూరు మండలం వెల్లమిల్లి పంచాయితీ లంబాడి గూడెం గ్రామానికి చెందిన వడితే లాలు మండల వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ కన్వీనర్గా ఉన్నారు. ఇటీవల గ్రామంలో టీడీపీ నాయకులు బీమా అని ఇంటింటికీ తిరిగారు. లాలు ఇంటికొచ్చి బీమా అని నమ్మించి రూ. 200 కట్టించుకున్నారు. సోమవారం టీడీపీ నాయకులు వచ్చి సభ్యత్వ నమోదు కార్డు ఇచ్చారు. అయితే తాము ఆ పార్టీలో చేరలేదని.. తమకు కార్డు ఎందుకు ఇచ్చారని లాలు గట్టిగా ప్రశ్నించారు. బీమా పేరుతో తెలుగుదేశం నాయకులు మోసం చేశారని, తాము ఎప్పుడూ వైఎస్సార్సీపీ పార్టీయేనని ఆయన తెలిపారు. వృద్ధుడిని అనాథగా వదిలేసిన కొడుకు తణుకు అర్బన్: వృద్ధుడిని అతని కుటుంబ సభ్యులు తణుకు రైల్వేస్టేషన్లో వదిలి వెళ్లిన ఘటన సోమ వారం ఉదయం వెలుగులోకి వచ్చింది. రైల్వేస్టేషన్లో మూలుగుతూ ఇబ్బందిపడుతున్న వృద్ధుడిని ప్రయాణికులు ప్రశ్నించగా.. తన పేరు ముత్యాల పల్లపరాజు అని తణుకు ముత్యాలవారి వీధిలో ఉంటున్నట్లు చెప్పారు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధుడిని రైల్వే స్టేషన్లో వదలివెళ్లినట్లుగా రైల్వే పోలీసులు చెప్పారు. వృద్ధుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడని, కాలుపై పుండు పడి దుర్వాసన వస్తుండడంతోపాటు రాత్రి నుంచి ఆహారం కూడా తీసుకోకపోవడంతో బాగా నీరసించిపోయారు. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని కుటుంబసభ్యులు వదిలించుకోవాలని చూడడం బాధాకరమని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వృద్ధుడి వ్యవహారం వైరల్ కావడంతో చివరకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అతని కుమారుడు వచ్చి తీసుకువెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. -
అటవీ శాఖ నిర్లక్ష్యం.. అన్నదాత ఆక్రోశం
నిడమర్రు: అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కోత కు సిద్ధంగా ఉన్న ఏడెకరాల వరి పంట నీటి పాలైన సంఘటన పెదనిండ్రకొలనులో చోటుచేసుకుంది. రైతులు, అధికారుల వివరాల ప్రకారం.. కొల్లేరు అభయారణ్యం పరిధిలో అన్సర్వే భూముల్లో అనధికారంగా చేపల చెరువులు సాగు చేస్తున్నారంటూ అటవీ శాఖ అధికారులు శనివారం 17 ఎకరాల చేప ల చెరువుకు గండి కొట్టారు. దీంతో చెరువు నీరు పంట కాలువలు, బోదెల్లో నీరు ఎగదన్నడంతో సరి హద్దుల్లోని వరి చేలు ఆదివారం ముంపు బారిన ప డ్డాయి. కౌలు రైతు చెన్నుబోయిన వెంకన్నకు చెందిన ఏడెకరాల వరి చేను పూర్తిగా నీటమునిగి సు మారు రూ.8 లక్షలు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పులు చేసి సాగు చేశామని బాధిత రైతు వాపోయాడు. సమాచారం ఇవ్వకుండా.. కొల్లేరు అభయారణ్యం పరిధిలో అక్రమ చేపల సా గు చేస్తున్న వారికి, అటవీ శాఖ సిబ్బందికి మధ్య ఇటీవల వ్యవహారం చెడింది. దీంతో పట్టుబడికి వచ్చిన చెరువులను గండి కొడతామని క్షేత్రస్థాయి సిబ్బంది ఇబ్బందులు పెడుతూ సొమ్ములు వసూ లు చేస్తున్నారని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో నిడమర్రు కొల్లేరు పాయలో అన్సర్వే, జిరాయి తీ భూముల లెక్కలు తేల్చాలని రైతులు సర్వేకు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 29న సర్వేకు సిద్ధమవుతున్నట్లు తహసీల్దార్ నాగరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేష్, వ్యవసాయ శాఖ సి బ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అటవీ శాఖ అధికారులు ఓ చెరువుకు గండి కొట్టారు. దీ నిపై అటవీ శాఖ డీఎఫ్ఓ డి.విజయను వివరణ కో రగా పూర్తి వివరాలు తెలియదని, తమ సిబ్బందిని విచారణకు ఆదేశించానని, నివేదిక అనంతరం ఉ న్నతాధికారులకు తెలుపుతామని సమాధానమిచ్చారు. పరిహారంపై సందిగ్ధం గండి విషయంలో తమకు సమాచారం లేదని, ఉంటే పంటను ఒబ్బిడి చేసుకోవాలని రైతును అప్రమ త్తం చేసేవారమని మండల వ్యవసాయ అధికారి పి.గీతాదేవి అన్నారు. ఈ–క్రాప్లో పంట నమోదు చేశామని, నష్టం విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ముంపు చేనును ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పరిశీలించారు. కొల్లేరులో అక్రమ చెరువుకు గండి నీరు ఎగదన్ని సమీపంలోనిఏడు ఎకరాల వరి పంట మునక లబోదిబోమంటున్న రైతు మరోసారి కూటమి మోసం కొల్లేరును 3వ కాంటూరుకి కుదిస్తామంటూ ఎన్నికల్లో కూటమి నేతలు ప్రచారం చేసుకుని ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు అభయా రణ్యం పరిధిలో జిరాయితీ పట్టా భూములన్న వారిపైకి అధికారులను పంపి వేధిస్తున్నారు. ఇలా మరోమారు చంద్రబాబు సర్కారు కొల్లేరు రైతులను మోసం చేసింది. కౌలు రైతు వెంకన్నకు నష్టపరిహారం ఇవ్వాలి. –కోడే కాశి, జెడ్పీటీసీ, నిడమర్రు అధికారులను వేడుకున్నా.. మా భూముల లెక్కల తేల్చాలని సర్వేకు నెల రోజుల క్రితమే ఆయ కట్టు జిరాయితీ రైతులంతా దరఖాస్తు చేసుకున్నాం. గండి కొట్టడానికి వచ్చిన అధికారులకు సర్వే అనంతరం అన్సర్వే, జిరాయితీ విడదీసిన తర్వాత గండి కొట్టాలని వేడుకున్నా అటవీ శాఖ సిబ్బంది వినలేదు. – వగ్వాల సుబ్బారావు, జిరాయితీ భూమి రైతు, నిడమర్రుమా గోడు వినలేదు ఒక్క రోజు సమయం ఇవ్వండి కోత యంత్రంతో పంటను ఒబ్బిడి చేసుకుంటామని చెప్పి నా అధికారులు వినలేదు. చెరువుకు గండి కొట్టారు. ఎకరాకు రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టాను. ఎకరాకు 60 బస్తాల వరకూ పండింది. ఆదివారం కోతకు సిద్ధ మయ్యాం. అటవీ అధికారుల నిర్లక్ష్యంతో మా కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. –బోరున విలపిస్తున్న చెన్నుబోని వెంకన్న, సుబ్బాయమ్మ దంపతులు -
ప్రజా పంపిణీ.. పర్యవేక్షణ లేమి
ఏలూరు (మెట్రో): ఇంతన్నారు.. అంతన్నారు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు ఇది రాష్ట్రంలో కూటమి సర్కారు తీరు. ప్రజాపంపిణీ వ్యవస్థపై నిండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాగే నిత్యాసరాల సరఫరాలో కోతలు విధిస్తున్నారు. ప్రజా పంపిణీని నిర్వీర్యం చేసేలా.. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలను గుర్తించే ఆహార సలహా సంఘాల (ఫుడ్ అడ్వయిజరీ కమిటీ) ఏర్పాటులో నూ నిర్లక్ష్యం చూపుతోంది. దీంతో రేషన్ సరఫరా లో లోటుపాట్లు, డీలర్ల మోసాలు, కార్డుదారుల సమస్యలు, వారి డిమాండ్లు వంటి వాటిపై చర్చించాల్సిన అవసరమే లేకుండా పోతుంది. తద్వారా ప్రజలు రేషన్ విషయంలో ఏ ఇబ్బందులు పడుతున్నా ఎవరికీ పట్టనట్టుగా మారింది. ఆహార సలహా సంఘాలు ఇలా.. రేషన్ సరుకులు సక్రమంగా అందేలా ఆహార సల హా సంఘాలు బాధ్యతలు నిర్వహిస్తాయి. ఆయా సలహా సంఘాలకు చైర్మన్గా సబ్కలెక్టర్ లేకుంటే డిప్యూటీ కలెక్టర్ వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్గా ఎంపీపీ, కన్వీనర్గా తహసీల్దార్, సభ్యులుగా ఎంపీడీఓ, జెడ్పీటీసీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నా యకులు, డీలర్ల సంఘం అధ్యక్షులు, పాత్రికేయు లు, ఉపాధ్యాయులు ఉంటారు. రేషన్ షాపుల తనిఖీలు, బియ్యం సరఫరాపై నిఘా, తూకాల్లో మోసాలు వంటి బాధ్యతలను ఈ సంఘాలు నిర్వహిస్తాయి. ప్రస్తుతం ఈ సంఘాలు ఏర్పాటు కాకపోవడంతో రేషన్ సరుకుల పంపిణీపై పర్యవేక్షణ పూర్తిస్థాయిలో కొరవడింది. మధ్యాహ్న భోజనాన్నీ.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో అ మలవుతున్న మధ్యాహ్న భోజనం పథకం నాణ్యత ప్రమాణాలను సైతం ఆహార సలహా సంఘాల సభ్యులు పరిశీలిస్తారు. అయితే ఇవి ఏర్పాటుకాకపోవడంతో మధ్యాహ్న భోజన నిర్వహణపైనా పర్యవేక్షణ కొరవడింది. దీంతో చిన్నారులకు అందించే ఆహారంలో నాణ్యత ప్రమాణాలు కొరవడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కందిపప్పు లేదు నిత్యావసరాల సరఫరా విషయంలోనూ కూటమి సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికే రేషన్ అందించగా.. వాహనాలను తొలగించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. వీటి స్థానంలో రేషన్ దుకాణాలు పెంచుతామని ప్రకటించింది. అలాగే పూర్తిస్థాయిలో సరుకులను కూడా పంపిణీ చేయడం లేదు. గత ప్రభుత్వం సరఫరా చేసిన కందిపప్పుకు మంగళం పాడింది. పంచదార కూడా పూర్తిస్థాయిలో అందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం బియ్యం పంపిణీతోనే ప్రభుత్వం సరిపెడుతోంది. ఆహార సలహా సంఘాల ఏర్పాటుఊసెత్తని ప్రభుత్వం ప్రజా పంపిణీని పట్టించుకోని వైనం సరుకుల్లో కోతలు.. మరో వైపు నిర్లక్ష్యం కానరాని పూర్తిస్థాయిలో రేషన్ సరుకులు మధ్యాహ్న భోజన నిర్వహణపైనా పర్యవేక్షణ కరువు జిల్లాలో వివరాలు రేషన్ దుకాణాలు 1,123 ఎండీయూ వాహనాలు 395 రేషన్ కార్డులు 6,31,044 బియ్యం సరఫరా (నెలకు) 8,701.03 టన్నులు పంచదార 218.75 టన్నులు -
ఆశల పల్లకీలో కొల్లేరు
●● హద్దులను పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశం ● ప్రభుత్వమే అఫిడవిట్ వేయాలని కొల్లేరు ప్రజల డిమాండ్ ● కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేనా? ● అత్యున్నత న్యాయస్థానం సూచనలను అనుకూలంగా మార్చుకుంటున్న నేతలు ● రెగ్యులేటర్ల నిర్మాణం మాటెత్తని కూటమి ప్రభుత్వం రాజకీయం చేయొద్దు కొల్లేరు కాంటూరు కుదింపు చేస్తామని రాజకీయ నాయకులు చెబుతున్నారు. ముందుగా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలి. కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ఏళ్లు గడిచిపోయాయి. అమాయకులైన కొల్లేరు ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పాలి. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ అమలు చేయడానికి కూటమి నేతలు కృషి చేయాలి. –బలే గణేష్, శృంగవరప్పాడు, కై కలూరు మండలం రెగ్యులేటర్లు నిర్మించాలి కొల్లేరు అభయారణ్యంలో ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో 10వ కాంటూరు వరకు నిబంధనలు విస్తరించాలని చూస్తున్నారు. మరోవైపు కాంటూరు 5 నుంచి 3నకు కుదిస్తానని చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యమో అర్థం కావడం లేదు. కొల్లేరులో నీరు లేక ఎడారిగా మారింది. ప్రజల వలసలు తగ్గాలంటే ప్రభుత్వం ముందుగా రెగ్యులేటర్లు నిర్మించాలి. – ఎల్ఎస్ భాస్కరరావు, ప్రజాస్వామ్య పరిరక్షణ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మండవల్లి మండలం సాక్షి టాస్క్ఫోర్స్: కొల్లేరు అనే ఈ మూడక్షరాల పదం రాష్ట్రంలో మరోమారు చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు చెబుతున్న సూచనలతో రా జకీయ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్నారు. తాజాగా మరోసారి కొల్లేరు సరిహద్దులను పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర సాధికారత కమిటీని ఆదేశించింది. కొల్లేరు ఆపరేషన్ ద్వారా అక్రమ చెరువులను ధ్వంసం చేసి 19 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అభయారణ్యం ఆక్రమణల చెరలోనే చిక్కుకుంది. కొల్లేరు కాంటూరు కుదింపు సాధ్యం కాదని అధ్యయన కమిటీలు గతంలోనే నివేదిక ఇచ్చాయి. కొల్లేరుకు శాశ్వత పరి ష్కారం చూపుతామంటున్న నేతల వాగ్దానాలు నెరవేరేనా అనే అనుమానాలు కొల్లేరు ప్రజల్లో సర్వత్రా వినిపిస్తున్నాయి. మరోమారు తెరపైకి.. కొల్లేరు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అంతర్జాతీయ రామ్సర్ ఒడంబడిక ప్రకారం 1999 అక్టోబరు 4న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీఓ 120ను తీసుకొచ్చింది. పూర్వపు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 9 మండలాల్లో + 5 కాంటూరు పరిధి వరకు 77,138 ఎకరాలను అభయారణ్యంగా నిర్ణయించారు. అక్రమ చేపల చెరువుల సంఖ్య అభయారణ్యంలో పెరగడంతో 2006లో కొల్లేరు ఆపరేషన్ ద్వారా వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులను ధ్వంసం చేశారు. కొల్లేరు సంరక్షణకు 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వ అధికారులు అమలు చేయలేదని ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కాకినాడకు చెందిన కె.మృత్యుంజయరావు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ప్రధాని హామీ అమలు చేయాలి ఎన్నికల ప్రచారంలో భాగంగా 2014లో భీమవరం వచ్చిన ప్రధాని మోదీ కొల్లేరు కాంటూరును కుదిస్తానని హామీ ఇచ్చారు. ఆ సభలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. 2015 జూలైలో అప్పటి కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొల్లేరుపై సమావేశం నిర్వహించారు. అనంతరం కాంటూరు కుదింపుపై త్రిసభ్య కమిటీని నియమించారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్, రివ్యూ పిటీషన్లు దాఖలు చేసి వాదనలు వినిపించాలని కొల్లేరు ప్రజలు కోరుతున్నారు. కాంటూరు కుదింపు జరగాలంటే జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు (ఎన్టీడబ్ల్యూఎల్) ఆమోదం కోసం రాష్ట్ర బోర్డు తీర్మానం చేయాల్సి ఉంది. అలాగే కొల్లేరు సరస్సులో నిత్యం నీరు నిల్వ ఉండాలంటే రెగ్యులేటర్ల నిర్మాణం జరగాలి. కూటమి ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని పలువురు కోరుతున్నారు. కాంటూరు కుదింపు సాధ్యమయ్యేనా..? రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచం గుర్తించిన ఏకై క చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. 10వ కాంటూరు పై వరకు కొల్లేరు విస్తరించి ఉన్నప్పటికీ 5వ కాంటూరు వరకు మాత్రమే 77,138 ఎకరాల్లో అభయారణ్యంగా గుర్తించారు. కొల్లేరు అభయారణ్యాన్ని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదిస్తే 48,777 ఎకరాలు మిగులుతుంది. అభయారణ్యంలో పట్టా భూములు 14,932 ఎకరాలు, సొసైటీ భూములు 5,510 ఎకరాలు ఉన్నాయి. గతంలో నష్టపరిహారం చెల్లించకుండా ధ్వంసం చేశారని కొల్లేరు ప్రజలు వాదన వినిపిస్తున్నారు. కొల్లేరుపై అధ్యయనం చేసిన పలు కమిటీలు కాంటూరు కుదింపు సాధ్యం కాదని నివేదికలు అందించాయి. కూటమి నేతలు మాత్రం కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేసినట్లుగానే ప్రచారం చేస్తున్నారు. -
పేదల ఇళ్లు కూల్చడమే అభివృద్ధా?
కాళ్ల: పేదల ఇళ్లు కూల్చడమే కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధా అని వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నర్సింహరాజు ప్రశ్నించా రు. మండలంలోని పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏర్పడేది ప్రజల యోగక్షేమాలు తెలుసుకొని వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకే కానీ ఇబ్బందులకు గురిచేసేందుకు కాదన్నారు. ఉండి నియోజకవర్గంలో కొంతకాలంగా ఇళ్లను తొలగిస్తున్నారని, దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా ఆక్రమణలో ఉన్న ఇళ్లు ఇబ్బందికరంగా ఉంటే నివాసితులకు సమయం ఇచ్చి, ప్రత్యామ్నాయం చూపించి తొలగించాలి తప్ప దుర్మార్గంగా ఇళ్లను కూలగొట్టడం సరికాదన్నారు. ఇళ్ల తొలగింపుతో రోడ్డున పడి ఇబ్బందులు పడుతున్న బాధితులను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాధితులు నానా కష్టాలు పడుతున్నా గ్రామ, మండల స్థాయి, కనీసం జిల్లా అధికారులు కూడా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో గ్రామాలు ఏర్పడ్డాయని, గృహ నిర్మాణాలకు సాయం కూడా చేశారని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రజంతా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ సుఖసంతోషాలతో ఉండేవారని గుర్తుచేశారు. అయితే కూటమి పాలనలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అప్పులపాలవుతున్నారని పీవీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త పీవీఎల్ -
ప్రశాంతంగా ‘గురుకుల’ పరీక్షలు
ఏలూరు (టూటౌన్) : మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి (2025–26) ఆదివారం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్వీ నాగరాణి తెలిపారు. ఏలూరు బాలికల గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏలూరులో పాఠశాలలో 80 సీట్లకు 147 నుంచి విద్యార్థులు దరఖాస్తు చేయగా 116 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. జిల్లా సమన్వ యకర్త, బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సి పాల్ లక్ష్మి ఉన్నారు. ఆప్కాస్ రద్దు యోచన తగదు ఏలూరు (టూటౌన్): మున్సిపల్ ఉద్యోగులకు 12వ పీఆర్సీ ప్రకటించాలని, ఆప్కాస్ రద్దు ఆ లోచన విరమించుకుని, ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డి మాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో ఏ లూరులో జరుగుతున్న శిక్షణ తరగతులకు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు కోరుతూ మే 20న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటున్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు బి.బాలరాజు, ప్రధాన కార్యదర్శి ఎ.జానుబాబు, జంగారెడ్డిగూడెం అధ్యక్షుడు ఆర్.నాగరాజు, నగర అధ్యక్షులు లావేటి కృష్ణారావు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా జయలక్ష్మి ఉంగుటూరు: వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉంగుటూరుకి చెందిన మంద జయలక్ష్మి నియమితులయ్యారు. ఆమె మండల మహిళా విభాగం అధ్యక్షురాలిగా, జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు రాష్ట్ర పదవి వరించింది. మండల నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ తనకు రాష్ట్ర పదవి కేటాయించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, సహకరించిన మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబా బుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి నిరంతం కృషి చేస్తానని, మహిళల్లో చైత న్యం తీసుకువస్తానని జయలక్ష్మి అన్నారు.ఏలూరు రైల్వేస్టేషన్లో తనిఖీలు ఏలూరు టౌన్ : అసాంఘిక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు, ముందస్తు చర్యల్లో భాగంగా ఏలూరు, పవర్పేట స్టేషన్లలో రైల్వే ఎస్సై పి.సైమన్ ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఏలూరు స్టేషన్లోని ప్లాట్ ఫామ్స్, వెయిటింగ్ హాల్స్, బుకింగ్ కార్యాలయం, రిజర్వేషన్ కౌంటర్లు, పార్సిల్ కేంద్రాల్లో ముమ్మరంగా సోదాలు చేశారు. ఆర్పీఎఫ్, రైల్వే పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రైల్వేస్ డీఎస్పీ జి.రత్నరాజు, సీఐ ఎంవీ దుర్గారావు సిబ్బందికి సూచించారు. అనుమానిత వ్యక్తులపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలని ఆదేశించారు. పాలిసెట్కు పటిష్ట ఏర్పాట్లు పెంటపాడు: జిల్లాలోని నాలుగు పట్టణాల్లో ఈనెల 30న జరిగే పాలిసెట్–2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పాలిసెట్ జిల్లా కో–ఆర్డినేటర్, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డి.ఫణీంద్రప్రసాద్ ప్రకటనలో తెలిపారు. తాడేపల్లిగూడెం, తణు కు, భీమవరం, నరసాపురంలో కేంద్రాలు ఏ ర్పాటుచేశామని, 7,254 మంది పరీక్షలకు హా జరుకానున్నారన్నారు. -
పాదయాత్ర భక్తులను ఢీకొట్టిన లారీ
ద్వారకాతిరుమల: మొక్కుబడులు తీర్చుకునేందుకు ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రానికి కాలినడకన వెళుతున్న ముగ్గురు యువకులను వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు యువకుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం, పుల్లలపాడులోని పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రకారం.. దేవరపల్లి గ్రామానికి చెందిన దాసు దుర్గాప్రసాద్, బిరదా అంజి(20), జాజుమొగ్గల సాయిచరణ్ తేజ ద్వారకాతిరుమల క్షేత్రానికి పాదయాత్రగా వెళ్తున్నారు. మార్గమధ్యంలో పుల్లలపాడు వద్దకు వచ్చేసరికి రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు వెళ్తున్న కర్నాటకకు చెందిన లారీ వీరిని వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలై రోడ్డుపై పడి ఉన్న క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం రాజమండ్రి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బిరదా అంజి మృతి చెందినట్టు అతని మేనమామ శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు -
కొబ్బరి బొండాలకు గిరాకీ
ఉంగుటూరు: ఏప్రిల్లోనే ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం కోసం సహజమైన కొబ్బరి నీరు తాగే ఎండ తీవ్రత పెరగడంతో కొబ్బరి బొండాలకు గిరాకీ పెరిగింది. బాటిల్ కొబ్బరి నీరు ధర రూ.120 నుంచి రూ.150 పలుకుతోంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. శక్తి నివ్వడంతో పాటు డిహైడ్రేషన్ తగ్గిస్తుంది. శరీరంలో నీటి శాతం పెంచి శక్తిని ఇస్తుంది. బొండంలో సుమారు 300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. మూత్ర, కిడ్నీ సంబంధిత వ్యాధులకు ఇది చక్కగా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్లు ఒంటిలో వేడిని తగ్గిస్తాయి. అలాగే మంచి ఎనర్జీ డ్రింక్గా పనిచేస్తుంది. ఎండ దెబ్బకు పెరిగిన అమ్మకాలు ఎండలు పెరగడంతో ఉమ్మడి ఏలూరు జిల్లా నుంచి కొబరి బొండాల అమ్మకాలు బాగా పెరిగాయి. దాంతో కొబ్బరి రైతులకు గిట్టుబాటు అవుతోంది. వ్యాపారులు ఆటోలు, మిని లారీలు, లారీల మీద బొండాల తీసుకెళ్లి చిల్లర వ్యాపారులకు అమ్ముతున్నారు. అలాగే లారీల మీద ఏలూరు, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి నగరాలకు భారీగా ఎగుమతి అవుతున్నాయి. పలు చోట్ల జాతీయ రహదారి మీద చిరు వ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతి ఏలూరు జిల్లాలో 35,000 ఎకరాలలో కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయి. పెదవేగి, పెదపాడు, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, ద్వారకా తిరుమల, కామవరపుకోట, టీ నర్సాపురం, జంగారెడ్డిగూడెం మండలాల్లో కొబ్బరి తోటలు విస్తారంగా ఉన్నాయి. అక్కడనుంచి కొబ్బరి బొండాలు ఎగుమతులు సాగుతున్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంతంలో చేపలు చెరువుల గట్ల మీద పెంచిన కొబ్బరి చెట్ల నుంచి బొండాలు దింపుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం ధర పెరగడంతో రైతులకు గిట్టుబాటు గిరాకీ పెరగడంతో రైతులకు లాభం కొబ్బరి బొండాలకు గిరాకీ పెరగడంతో రైతులకు గిట్టుబాటు ధర వస్తోంది. ఇటీవల కొబ్బరి బొండాలు అమ్మకాలు భారీగా పెరిగాయి. వైద్యులు కూడా బొండాలు తాగమని సూచించడంతో ఎక్కువ మంది తాగుతున్నారు. ఎకరాకు రూ.60 వేలకు తక్కువ కాకుండా ఆదాయం వస్తోంది. –దేవదానం, హార్టీకల్చర్ ఏఓ, ఉంగుటూరు -
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట పంచాయతీ పరిధిలో వెంకటరామానుజపురం గ్రామంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం ఎడమ చేతిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వైఎస్సార్సీపీ నాయకులు దీనిని గుర్తించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని సందర్శించారు. వైఎస్సార్ విగ్రహం చేతిని ధ్వంసం చేసిన వ్యక్తులను పోలీసులు గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఇర్ల విజయశాంతి, ఇర్ల శ్రీనివాసరెడ్డి, దోరేపల్లి సుబ్బారావు, మర్రెడ్డి పెద రామాజంనేయులు, డి.సుబ్బారావు, జె.కమలాకరరెడ్డి, కఠారి నారాయణరావు, కఠారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన బాస్కెట్బాల్ జట్టు ఎంపిక ఏలూరు రూరల్: ఆదివారం ఏలూరు కస్తూర్బా బాలికల పాఠశాలలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సబ్ జూనియర్ బాలికల జట్టు ఎంపిక పోటీలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలకు నిర్వాహకులు పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కలిగిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి గవ్వ శ్రీను, కోశాధికారి కె.మురళీకృష్ణ వెల్లడించారు. మే 15 నుంచి 18 వరకూ చిత్తూరులో అంతర జిల్లాల అండర్–14 సబ్ జూనియర్ బాలబాలికల బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో జట్టు పాల్గొంటుందన్నారు. గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. -
కళారంగానికి చేయూతనిస్తాం
భీమవరం: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు పుంజుకున్న తరువాత కళారంగానికి చేయూతనిస్తామని సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న చైతన్య భారతి సంగీత, నృత్య నాటక పరిషత్ 18వ జాతీయస్థాయి నాటికల పోటీల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నాటకాలపై ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదని ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం ఇబ్బందికరంగా ఉందన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను రాజమహేంద్రవరంలో ఏర్పాటుచేయడానికి కృషిచేస్తున్నట్లు చెప్పారు. కళా పరిషత్ల ద్వారా నాటకరంగం నిరంతరం కొనసాగడానికి పరిషత్ నిర్వహణ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి సమావేశం నిర్వహణకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం చవాకుల సత్యనారాయణకు రాయప్రోలు రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటుడు బాలాజీ నాయక్కు మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారంతో సత్కరించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పెన్మెత్స కృష్ణంరాజును ఆత్మీయ చైతన్య పురస్కారంతో సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులపర్తి అంజిబాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పరిషత్ అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్, తదితరులు పాల్గొన్నారు. -
వేరుశెనగ కోత తర్వాత జాగ్రత్తలు
చింతలపూడి: దేశంలో పండించే నూనె గింజల పంటల్లో వేరుశెనగ అతి ముఖ్యమైంది. వేరుశెనగ కోతలు పూర్తయ్యాక సరైన జాగ్రత్తలు పాటిస్తే విత్తనాలు రాబోయే కాలంలో పనికొస్తాయి. లేదంటే పుచ్చుపట్టి పనికి రాకుండా పోతాయి. వేరుశనగలో కోసిన పంటను తగిన తేమ (9 శాతం) వచ్చే వరకు మొక్కనుంచి కాయలను వేరు చేయడానికి ముందు ఎండ బెట్టాలి. విత్తనాలను భద్రపరుచుకుని వచ్చే పంటకు ఉపయోగించుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వేసవిలో అవలంభించాల్సిన పద్ధతుల గురించి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు బి.నాగకుమార్ రైతులకు సూచించారు. ఎండబెట్టే విధానం వేరుశెనగ కాయలు పై భాగానికి వచ్చేటట్లు చెట్లను చిన్న, చిన్న కుప్పలుగా వేయాలి. లేదా మొక్కలను కర్రలకు కట్టి కాయలను పక్కలకు వచ్చేలా చేసి ఎండబెట్టుకోవచ్చు. తేమశాతం తగ్గించడం ఇలా కాయల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటే ఎండలో ఆరబెట్టకుండా తేమను 7, 8 శాతానికి తీసుకురావాలి. వేడి గాలులను వదిలే పరికరాలను ఇందుకు ఉపయోగించవచ్చు. వేరుశెనగ పంటను నిల్వ చేయడానికి ఒకసారి వాడిన సంచులను మళ్లీ వాడకూడదు. పాలిథీన్ పేపర్ ఉన్న గోనె సంచులు బాగా ఎండిన వేరుశెనగ కాయలను నిల్వ చేయడానికి ఉపయోగం. ఎండలో ఆరబెట్టకూడదు రబీలో పీకేటప్పుడు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు. నీడలో ఆరబెట్టాలి. ఎండ తీవ్రత ఉదయం 11 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల తరువాత తక్కువగా ఉంటుంది. ఆయా సమయాల్లో ఆరబెట్టుకోవాలి. ఎండబెట్టే సమయంలో వేరే రకాల కాయలు కలవకుండా చూసుకోవాలి. నిల్వ చేసుకునే విధానం విత్తనం కోసం బాగా ముదిరిన కాయలను నిల్వ చేసుకోవాలి. కాయలను కదిలిస్తే ఘల్లుమని శబ్దం రావాలి. అప్పుడే బాగా ఎండినట్లు అర్ధం. కాయలను నిల్వ చేసుకోవడానికి శుభ్రమైన పాలిధిన్ లైనింగ్ ఉన్న గోనె సంచులను వాడాలి. గోనె సంచులను 0.5 శాతం మలాథియాన్ ద్రావణంలో ముంచి బాగా ఆరబెట్టుకోవాలి. దీని వల్ల కాయల్లోని గింజలకు శిలీంధ్రాల బెడద ఉండదు. బి నాగకుమార్ –సహాయ వ్యవసాయ సంచాలకులు -
రాత్రివేళల్లో జోరుగా మట్టి తవ్వకాలు
బుట్టాయగూడెం: మండలంలోని దొరమామిడి పరిసర ప్రాంతాల్లో రాత్రివేళల్లో అక్రమ మట్టి తవ్వకాలు,, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో కొందరు కూటమి నాయకులు జేసీబీలు పెట్టి ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యుడు ఒక ట్రక్కు మట్టి కావాలంటే కనీసం అనుమతి కోసం సరైన సమాధానం చెప్పని అధికారులు, యథేచ్ఛగా మట్టి రవాణా జరుగుతున్నా పట్టించుకోకపోవడం పట్ల పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులు కావడంతో మండుటెండను సైతం లెక్కచేయకుండా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో ఎటు చూసినా భక్త జనమే కనిపించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. తూర్పురాజగోపుర ప్రాంతంలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, స్వామివారి ఉచిత ప్రసాదం పంపిణీ ప్రాంతం, దర్శనం క్యూలైన్లు భక్తులతో పోటెత్తాయి. అలాగే ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల, నిత్యాన్నదాన భవనం తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిశాయి. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. -
ఉప్పుటేరు ఆక్రమణల తొలగింపునకు సహకరించండి
కై కలూరు : వరదల సమయంలో కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి పంపించడానికి ప్రధాన భూమిక వహించే ఉప్పుటేరు ఆక్రమణల తొలగింపునకు అందరూ సహకరించాలని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే, ఉప సభాపతి కనుమూరి మురళీకృష్ణంరాజు అన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు కొల్లేరు అంశంపై కమిటీ నివేదిక కోరిన నేపథ్యంలో వారు కొట్టాడ గ్రామం వద్ద ఉప్పుటేరు ఆక్రమణలను డ్రోన్ సాయంతో శనివారం పరిశీలించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉప్పుటేరులో ఆక్రమణల కారణంగా 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించే ఉప్పుటేరు 6 వేల క్యూసెక్కులకు పడిపోయిందన్నారు. ఇలానే కొనసాగితే కొల్లేరు ముంపు మరొకసారి తప్పదన్నారు. వర్షాకాలం వచ్చే నాటికీ ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించారు. ఇందుకు ఆక్రమణదారులు డ్రెయినేజీ, రెవెన్యూ, పోలీస్ శాఖలకు సహకరించాలన్నారు. లేనిపక్షంలో చట్టం తన పని చేసుకుంటుందని ఆక్రమణదారులను పరోక్షంగా హెచ్ఛరించారు. త్వరలో సుప్రీంకోర్టు సాధికారత కమిటీ పర్యటనకు వస్తోందని కొల్లేరు ప్రజలు సమస్యలను విన్నవించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, వడ్డీ సాధికారిత రాష్ట్ర కన్వీనర్ బలే ఏసురాజు, కూటమి నేతలు పెన్మత్స త్రినాథరాజు, పూలా రాజీ, కొల్లి బాబీ, సర్పంచులు, కొల్లేరు పెద్దలు పాల్గొన్నారు. -
కరెంట్ షాక్తో పెయింటర్ మృతి
ఏలూరు టౌన్: కరెంట్ షాక్తో పెయింటర్ మృతి చెందాడు. దెందులూరు మండలం పోతునూరు కు చెందిన లింగాల పరుశురాం (31) పెయింటర్గా పనిచేస్తుంటాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం ఏలూరు సుబ్రహ్మణ్యం కాలనీలో ఒక భవనానికి మొదటి అంతస్తులో ఐరన్పైపునకు రోలర్ బిగించి గోడకు పెయింటింగ్ వేస్తున్నాడు. సమీపంలో 11కేవీ విద్యుత్ వైర్లు ఐరన్ పైపునకు తగిలి పరశురాం విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. ఏలూరు వన్టౌన్ ఎస్సై నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరశురాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. గుర్రపుడెక్క తొలగిస్తూ... ఏలూరు టౌన్: గుర్రపుడెక్క తొలగిస్తూ ప్రమాదవశాత్తూ కోనేరులో మునిగి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఏలూరు తూర్పువీధికి చెందిన తిర్లంగి జీవరత్నం (36) శనివారం మరో ముగ్గురితో కలిసి ఏలూరు శివారులోని రామయ్యకోనేరులో గుర్రపుడెక్క తొలగింపు పనికి వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ జీవరత్నం కోనేరులో ముగిని మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. రూరల్ ఎస్సై సీహెచ్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు మట్టి లారీల సీజ్ జంగారెడ్డిగూడెం : కేతవరంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు లారీలను సీజ్చేశారు. కేతవరం చెరువు నుంచి రాత్రి సమయంలో అక్రమంగా మట్టిని తరలిస్తుండగా, వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు లారీలను స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. తహసీల్దార్ కె.స్లీవజోజి చర్యలు తీసుకుంటారని స్టేషన్ రైటర్ సత్యనారాయణ తెలిపారు. శ్రీవారి కొండపై షార్ట్కట్ మార్గం మూసివేత ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఉన్న షార్ట్కట్ మార్గాన్ని ఆలయ అధికారులు పూర్తిగా మూసివేశారు. స్వామివారి దర్శనానంతరం పలువురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలోని మార్గం గుండా కొండపైన నిత్యాన్నదాన భవనం, శివాలయం వద్దకు కాలినడకన వెళుతున్నారు. ఆ ప్రాంతంలో జేసీబీతో పూడిక పనులు జరుగుతున్నాయి. దీనిపై సాక్షి దినపత్రికలో ఈనెల 25న ‘శ్రీవారి కొండపై షార్ట్కట్ మార్గం వద్దు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఆలయ అధికారులు ఆ మార్గాన్ని ఇనుప బారిగేట్తో పూర్తిగా మూసివేశారు. -
ధాన్యం లారీ బోల్తా
ఉంగుటూరు: కాకర్లమూడి నుంచి ధాన్యం బస్తాల లోడుతో వెళుతున్న లారీ శుక్రవారం రాత్రి గ్రామాన్ని ఆనుకుని ఉన్న చెరువులోకి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడగా లారీలో ఉన్న ధాన్యం బస్తాలు మొత్తం తడిచిపోయాయి. సుమారు 5 లక్షలు విలువైన ధాన్యం తడిచిపోయినట్లు గుర్తించి కై కలూరు ఉప్పడు మిల్లుకు తరలించినట్లు డీటీ పూర్ణచంద్రప్రసాదు తెలిపారు. ట్రాక్ షీటు జనరేటర్ అయినందున పూర్తి బాధ్యత రైస్మిల్లర్దే అవుతుందని, రైతులు ఆందోళన చెందవద్దని తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. -
ఆ కలపను ఎవరి కోసం వదిలేశారో..?
ద్వారకాతిరుమల: మండలంలోని పంగిడిగూడెం–గుణ్ణంపల్లి మధ్యలోని పోలవరం కుడి కాలువ గట్టుపై ఉన్న భారీ వేప చెట్లను ఒక టీడీపీ నాయకుడు అడ్డగోలుగా నరికివేసిన విషయం తెలిసిందే. అయితే సంబంధిత అధికారులు దీనిపై ఇప్పటివరకు ఏవిధమైన చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. అంతే కాకుండా నరికిన కొంత కలప కాలువ గట్టుపైనే దర్శనమిస్తున్నా అధికారులు ఇప్పటివరకు దాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఇదేంటని అధికారులను కొందరు అడిగితే చిన్న చెట్లే కదా.. నరికిన వారు తీసుకుంటారని వారు సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి భారీ చెట్ల కలపను ఇప్పటికే బయటకు తరలించినట్టు స్థానికులు చెబుతున్నారు. మిగిలిన కలప ఎం.నాగులపల్లి–గుణ్ణంపల్లి మధ్య కాలువ గట్టుపై అక్కడక్కడా గుట్టలుగా ఉన్నాయి. ఈ చెట్ల నరికివేత వెనుక అధికారుల హస్తం ఉన్నట్టు స్థానికులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకే చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని అంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చెట్లు నరికిన సదరు నాయకుడిపై, అతనికి సహకరించిన వారిపై, అలాగే జంగిల్ క్లియరెన్స్ కాంట్రాక్టు తీసుకుని ఇష్టానుసారంగా బయట వ్యక్తులతో చెట్లు నరికించిన కాంట్రాక్టరుపై సైతం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా కలపను స్వాధీనం చేసుకుని, వేలం నిర్వహించగా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని అంటున్నారు. దీనిపై కాలువ ఇరిగేషన్ ఏఈ బాపూజీని వివరణ కోరగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలవరం కుడి కాలువ గట్టుపైనే దర్శనమిస్తున్న కలప స్వాధీనం చేసుకోని అధికారులు కలపను అమ్ముకునేందుకు చూస్తున్న పచ్చ నేతలు -
బీచ్లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
ద్వారకాతిరుమల: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో శుక్రవారం గల్లంతైన ద్వారకాతిరుమలకు చెందిన యువకుడు లాలూ నాయక్ (17) మృతదేహం శనివారం లభ్యమైంది. మండలంలోని కొమ్మర, కోడిగూడెం, ద్వారకాతిరుమల, సత్తెన్నగూడెం గ్రామాలకు చెందిన 10 మంది స్నేహితులతో కలసి లాలూ నాయక్ పేరుపాలెం బీచ్కు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో స్నానం చేస్తుండగా గల్లంతయ్యాడు. అర్ధరాత్రి సమయం నుంచి అతడి ఆచూకీ కోసం స్నేహితులు వెదకడం మొదలు పెట్టారు. అయితే నీటి మునిగిన ప్రాంతానికి 5 కిలో మీటర్ల దూరంలో, బీచ్ ఒడ్డున లాలూ నాయక్ మృత దేహం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అతడి అన్నయ్య చిన్నాకు కనిపించింది. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించగా, వారు కొవ్వూరు ఘాట్లో ఖననం చేశారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
పెదవేగి : అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన దిబ్బగూడెంలో చోటుచేసుకుంది. పెదవేగి ఎస్సై కె రామకృష్ణ తెలిపిన వివరాలివి. ఏలూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన తేటకాల పావని మొదటి కుమార్తె మీనాక్షికి పెదవేగి మండలం దిబ్బగూడెం గ్రామానికి చెందిన బాల సురేష్తో ఐదేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి 19 నెలల ఆడబిడ్డ సంతానం ఉంది. వివాహ సమయంలో రూ.3 లక్షలు కట్నం ఇవ్వగా మిగిలిన రూ.2 లక్షలు గురించి భర్త, అత్త మామలు వేధిస్తున్నారని ఈనెల 25వ తేదీ రాత్రి మీనాక్షి తల్లి పావనికి ఫోన్ చేసి చెప్పింది. శనివారం మీనాక్షి చనిపోయిందని చెప్పారని, కానీ ఆమె ఒంటిమీద దెబ్బలు ఉన్నాయని మృతురాలు తల్లి పావని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె రామకృష్ణ తెలిపారు. మీనాక్షి మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ వెంకటేశ్వరరావు చెప్పారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ కార్యదర్శుల నియామకం
ముసునూరు : వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల కమిటీ నియామకాల్లో రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా గోపవరం ఎంపీటీసి, వైస్ ఎంపీపీ పాముల గంగాధర్ నియమితులయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి నూజివీడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు ముఖ్య అనుచరుడుగా ఉన్న ఆయన్ను రాష్ట్ర స్థాయి ప్రచార వింగ్ పదవికి ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం గంగాధర్ మాట్లాడుతూ శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. కొయ్యలగూడెం నుంచి చిటికెన శ్రీనివాస్ కొయ్యలగూడెం: వైఎస్సార్సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా కొయ్యలగూడెంకి చెందిన చిటికెన శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా గౌడ సంఘం యాక్టివ్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం చిటికెన విధులు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ పటిష్టతకు కృషి చేస్తానని చిటికెన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీలో నియామకాలు గణపవరం: వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉంగుటూరు నియోజకవర్గంలోని నలుగురు నాయకులకు రాష్ట్ర స్థాయిలో వివిధ అనుబంధ కమిటీల్లో స్థానం కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం నియామక ఉత్తర్వులు ఇచ్చింది. వీరిలో ఎలిశెట్టి పాపారావు బాబ్జి (ఉంగుటూరు)ను రాష్ట్ర బూత్కమిటీ వింగ్ కార్యదర్శిగా నియమించింది. ఇదే మండలానికి చెందిన మంద జయలక్ష్మి రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. నడింపల్లి సోమరాజు(గణపవరం)ను రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా, భీమడోలు మండలానికి చెందిన కేతినీడి విశ్వేశ్వరరావును రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శిగా నియమించారు. శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.6 లక్షల విరాళం ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఇద్దరు భక్తులు వేర్వేరుగా శనివారం రూ.6 లక్షలను విరాళంగా అందజేశారు. అందులో భాగంగా తణుకు మండలం కానూరుకు చెందిన వీరమల్లు వెంకట్రావు రూ.5 లక్షలు, కాజా పడమరకు చెందిన గుబ్బల రామారావు రూ.లక్ష ఆలయ కార్యాలయంలో జమ చేశారు. దాతలకు ఆలయ ఏఈఓ పి.నటరాజారావు విరాళం బాండ్ పత్రాలను అందించారు. అనంతరం వారికి స్వామివారి ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పించారు. -
శ్రీవారి చెంత సేద తీరి
●అలసట మాయం ఆలయానికి వచ్చేటప్పుడు ఎండ వేడిమికి భయపడ్డాను. బయట వాతావరణం చూసి దర్శనం క్యూలైన్లలో ఉండగలమా అనిపించింది. కానీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనూ, క్యూలైన్ల వద్ద ఎయిర్ కూలర్ల నుంచి వస్తున్న చల్లదనం అలసటను మాయం చేసింది. క్యూ కాంప్లెక్స్లో ఇంకాసేపు ఉంటే బాగుండేదని అనిపించింది. – కామిశెట్టి దుర్గా లక్ష్మి, భక్తురాలు, పోలవరం మండలం, రేపల్లెవాడ గ్రామం ఏ ఆలయంలోనూ ఇలా లేదు క్యూ కాంప్లెక్స్లో సౌకర్యాలు బాగున్నాయి. ఏ ఆలయంలోనూ లేని విధంగా ఇక్కడ ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు. అలాగే క్యూ కాంప్లెక్స్లోని స్క్రీన్పై క్షేత్ర చరిత్ర, వేంకటేశ్వర స్వామికి సంబంధించిన చిత్రాలను ప్రదర్శించడం బాగుంది. భక్తులందరికీ మజ్జిగను కూడా అందిస్తున్నారు. వేసవిని పురస్కరించుకుని ఆలయ అధికారులు చేపట్టిన చర్యలు అద్భుతంగా ఉన్నాయి. – పరసా రాఘవేంద్ర, మచిలీపట్నం, భక్తుడు ద్వారకాతిరుమల: రాష్ట్రంలో ఏ దేవాలయంలోనూ లేని విధంగా ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలో ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని దాతల సహకారంతో ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన ఈ కూలర్లు భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనార్థం క్షేత్రానికి వస్తున్న భక్తులు ఎండ వేడిమి కారణంగా అలసిపోతున్నారు. ఈ క్రమంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూ లైన్లలోకి అడుగుపెట్టగానే ఎయిర్ కూలర్ల నుంచి వస్తున్న చల్లదనాన్ని వారు ఆస్వాదిస్తున్నారు. హమ్మయ్య.. అనుకుంటూ ఉపశమనాన్ని పొందుతున్నారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే సమయంలో కొందరు భక్తులు, చిన్నారులు అక్కడే విశ్రాంతి పొందుతున్నారు. పిల్లలను వారి తల్లిదండ్రులు కూలర్ల వద్ద ఆడిస్తున్నారు. ఒక్కో కంపార్ట్మెంట్లో నాలుగు కూలర్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మొత్తం ఐదు కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక్కో కంపార్ట్మెంట్కు నాలుగు కూలర్లు (నాలుగు మూలల) చొప్పున మొత్తం 20 కూలర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆలయంలోని క్యూలైన్ల వద్ద మరో 5 కూలర్లను ఏర్పాటు చేశారు. సిబ్బంది నిరంతరాయంగా ఆ కూలర్లను నీటితో తడుపుతున్నారు. భక్తుల పట్ల వారు చూపుతున్న శ్రద్ధను పలువురు కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే ఒక్కో కూలర్ ధర రూ. 18 వేలు అని, దాతల సహకారంతో మరికొన్ని కూలర్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. మరిన్ని సౌకర్యాలు క్యూ కాంప్లెక్స్లో దేవస్థానం సిబ్బంది భక్తులకు మజ్జిగను, మంచి నీటిని అందిస్తున్నారు. అలాగే అందులో ఉన్న స్క్రీన్పై క్షేత్ర చరిత్ర, అన్నమయ్య, దేవతామూర్తుల చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. దాంతో చల్లని వాతావరణంలో వాటిని తిలకిస్తూ, దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని భక్తులు మరచిపోతున్నారు. క్షేత్రంలో సౌకర్యాల కల్పనకు అధికారులు చేపడుతున్న చర్యలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ఎయిర్ కూలర్ల ఏర్పాటు క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లలో ఎండ వేడమి నుంచి భక్తులకు ఉపశమనం దాతల సహకారంతో ఇప్పటికే 25 కూలర్ల ఏర్పాటు మరికొన్ని కూలర్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్న అధికారులు -
జిల్లా వ్యాప్తంగా పోలీసు తనిఖీలు
భీమవరం: కశ్మీర్లో ఇటీవల ఉగ్రదాడి దృష్ట్యా.. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. బాంబు గుర్తింపు బృందం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది నేతృత్వంలో జిల్లాలోని అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. హోటళ్లు, లాడ్జీలలో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు తనిఖీ చేశారు. విస్తృత తనిఖీలకు జిల్లా ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనిస్తే తక్షణమే పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. గ్రంథాలయాల్లో వేసవి శిక్షణా శిబిరాలు ఏలూరు (టూటౌన్): జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో పాఠశాల విద్యార్థులకు ఈ నెల 28 నుంచి జూన్ 6 వరకు వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిక్షణా శిబిరాలు ఉంటాయని, ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల వరకు కథ వినడం, 8.30 నుంచి 10 గంటల వరకు పుస్తకాలు చదవడం/కథలు చెప్పడం, 10 గంటల నుంచి 10.10 గంటల వరకు విరామం ఉంటుందన్నారు. 10.10 నుంచి 10.30 వరకు పుస్తక సమీక్ష, 10.30 నుంచి 11 గంటల వరకు స్పోకెన్ ఇంగ్లీష్/డ్రాయింగ్/పెయింటింగ్/పేపర్ క్రాప్ట్స్/డ్యాన్స్ వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. 28న ఏలూరులో ప్రత్యేక ఉద్యోగ మేళా ఏలూరు (టూటౌన్): జిల్లా ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్సీఎస్) భాగస్వామ్యంతో ఈ నెల 28న ఉదయం 10:30 గంటలకు ఏలూరులో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల పురుష అభ్యర్థులు.. ఆటోమొబైల్ రంగంలో అనుభవం ఉన్నవారు లేదా ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సేల్స్ విభాగానికి డిగ్రీ ఉండాలని, వర్క్షాపు సంబంధిత పోస్టులకు మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో డిప్లమో లేదా బీ.టెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరింత సమాచారం కోసం 8886882032 నెంబరులో సంప్రదించాలన్నారు. మెగా డీఎస్సీ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాకు చెందిన కాపు అభ్యర్థులకు మెగా డీఎస్సీ –2025 కోసం ఆన్లైన్ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్. పుష్పలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణా కార్యక్రమానికి సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లపై సమీక్ష భీమవరం (ప్రకాశంచౌక్): ఉజ్వల యోజన ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పొంది వినియోగించని లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ చాంబర్లో పౌర సరఫరాల అధికారులు, గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉజ్వల 2.0 పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొంది రెండు సంవత్సరాలుగా రీఫిల్ చేసుకోని లబ్ధిదారుల జాబితాను గ్రామాల వారీగా సిద్ధం చేయాలన్నారు. లబ్ధిదారులకు మొదటి నోటీసు జారీ చేసిన 15 రోజులలోపు వారికి సంబంధించిన గ్యాస్ పంపిణీదారుల కంపెనీకి వెళ్ళి, వారి ఈకేవైసీ ఫార్మాలిటీలు, బయోమెట్రిక్ మళ్ళీ పూర్తి చేసుకోవాలని చెప్పాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలి తాడేపల్లిగూడెం (టీఓసీ): సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈఓ) నారాయణ పేర్కొన్నారు. మేలో జరిగే సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్పెషల్ క్లాస్ల నిర్వహణను శనివారం డీఈఓ పరిశీలించారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలపై సమీక్షించారు. -
నర్సింగ్ విద్యార్థినులకువసతి వెతలు
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రిలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎం), బీఎస్సీ నర్సింగ్ విద్య అభ్యసిస్తున్న పేద వర్గాల బాలికలకు వసతి, ఇతర అవసరాలకు అన్ని విధాల ఆర్థిక సాయం చేస్తున్నామని సర్కారు చెబుతున్నా.. వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. గత పదేళ్ళుగా ప్రభుత్వం జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కాలేజీల్లో విద్యార్థినులకు నర్సింగ్ విద్య ఉచితమంటూనే.. అరకొర స్టైఫండ్తో గడిపేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే కొద్ది మొత్తంతో నెట్టుకురావాల్సి ఉండడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా గాలికి వదిలేస్తోందని, పేద పిల్లలకు కనీసం నిధులు కేటాయించే పరిస్థితి లేకపోవటం దారుణమని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చదువుతున్న 550 మందికి పైగా నర్సింగ్ విద్యార్థినులకు రూ.19 లక్షల స్టైఫండ్ బకాయిలు ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 3, 4 నెలకోసారి స్టైఫండ్ : ఏలూరు సర్వజన ఆసుపత్రి భవనంలో జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సులు ఉచితంగా అందిస్తున్నారు. జీఎన్ఎం కోర్సులో సుమారుగా 150 మంది విద్యార్థినులు ఉండగా, బీఎస్సీ నర్సింగ్ కోర్సులో 400 మంది ఉన్నారు. వీరిలో మొదటి సంవత్సరం జీఎన్ఎం కోర్సు చదివే విద్యార్థినికి రూ.3 వేలు, రెండు, మూడో ఏడాదిలో రూ.3500 స్టైఫండ్ ఇస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులకు రూ.4 వేల నుంచి రూ. 4500 వరకు ఇస్తారు. ప్రభుత్వం స్టైఫండ్ నెల నెలా ఇస్తే తప్ప గడవని పరిస్థితి. అలాంటిది మూడు, నాలుగు నెలకోసారి స్టైఫండ్ ఇవ్వడంతో ఖర్చులకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రతి నెలా స్టైఫండ్ ఇవ్వకపోవడంతో వారి కష్టాలు వర్ణణాతీతం. వసతి, భోజనం ఖర్చులు భరించాల్సిందే.. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, మచిలీపట్నంలో జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. బీఎస్సీ నర్సింగ్కు నీట్ ద్వారా ఎంపికలు చేస్తుండగా, జీఎన్ఎం కోర్సుకు డీఎంఈ నోటిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నర్సింగ్ కాలేజీల నిర్వహణకు, భోజనం, వసతి కోసం నిధులు కేటాయించకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఎస్సీ నర్సింగ్లో మెంటల్ హెల్త్ సబ్జెక్టుకు సంబంధించి శిక్షణ కేవలం విశాఖపట్నంలోనే ఉంది. ఈ సబ్జెక్టులో శిక్షణకు విశాఖపట్నం వెళ్లాలి. అక్కడ వసతి, భోజనం ఖర్చులు భరించాల్సి రావటంతో వారిపై పెనుభారం మోపినట్లేనని విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్వేలు, శిక్షణల కోసం అదనపు ఆర్థిక భారం వేస్తున్నాయంటున్నారు. నెలకు రూ.3 వేలతోనే నెట్టుకొస్తున్న వైనం 550 మందికి రూ.19 లక్షల స్టైఫండ్ బకాయిలు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇక్కట్లు ప్రభుత్వానికి నివేదించాం ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని జీఎన్ఎం నర్సింగ్ కాలేజీకి సంబంధించి నిర్వహణ, భోజనం నిమిత్తం ప్రత్యేకంగా నిధులు ఏమీ మంజూరు చేయడం లేదు. విద్యార్థినులకు అందిస్తున్న స్టైఫండ్తోనే నిర్వహణ ఖర్చులు, భోజనం ఖర్చులు భరించాలి. ఇప్పటికే చాలా సార్లు నిధులు కేటాయించాలంటూ నివేదికలు పంపించాం. – వరలక్ష్మి, ప్రిన్సిపల్, జీఎన్ఎం నర్సింగ్ కాలేజీ -
నరికిన చెట్ల కలప సంగతేంటి.?
ద్వారకాతిరుమల మండలంలో పోలవరం కాలువ గట్టుపై భారీ చెట్లను అడ్డగోలుగా నరికేశారు. చెట్ల కలప సంగతిని అధికారులు ఇంతవరకూ తేల్చలేదు. 11లో uఇసుక పాయింట్ల పరిశీలన ఉంగుటూరు: చేబ్రోలులోని ఇసుక పాయింట్ను కలెక్టరు వెట్రిసెల్వి, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఽకలెక్టర్ మాట్లాడుతూ పాయింట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, స్టాకు పాయింట్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తహసీల్దారు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని అన్నారు. చేబ్రోలు ఇసుక పాయింట్కు తాడిపూడి నుంచి ఇసుక రవాణా చేస్తారని చెప్పారు. చేబ్రోలు గ్రామంలో పారిశుధ్యం మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలపై సర్పంచ్ రందే లక్ష్మి సునీతతో సమీక్షించారు. -
సమాజంలో నాటికలది కీలక పాత్ర
యలమంచిలి: సమాజంలోని రుగ్మతల్ని వేలెత్తి చూపడంలో నేటికీ నాటికలు కీలకపాత్ర పోషిస్తున్నాయని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి చెప్పారు. కొంతేరు గ్రామంలోని పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిరంలో 43వ జాతీయ స్థాయి నాటిక పోటీల ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. సినిమాలు, టీవీ, ఓటీటీ వంటి మీడియా ప్రభంజనం సృష్టిస్తున్న నేటి రోజుల్లో కూడా నాటికలకు ఆదరణ లభించడం మంచి పరిణామం అన్నారు. కళలకు కాణాచి వంటి గోదావరి జిల్లాలో జన్మించడం తన అదృష్టమన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి) మాట్లాడుతూ కొంతేరు ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఈ నాటిక పోటీలు విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయిని డాక్టర్ బాబ్జీ, కమిటి సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో నరసాపురం ఆర్డీఓ దాసి రాజు, కొంతేరు యూత్ క్లబ్ అధ్యక్షుడు అంబటి మురళీకృష్ణ, కొంతేటి సర్వేశలింగం, గుండా రామకృష్ణ, ఉన్నమట్ల కబర్ది, బుద్దాల రామారావు, పులపర్తి రాజగోపాలరావు, వంగా నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు అలరించిన నాటికలు టెక్నాలజీ అవసరానికి వాడితే మిత్రుడు, అవసరానికి మించి వాడితే శత్రువు అని ‘నా శత్రువు’ నాటిక.. సమాజం బాగు కోసం కళాకారుల్లో ఉండే తపన రాజకీయ నాయకుల్లో ఉంటే దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ‘ఆంగికం భువనం యస్య’ నాటికలోను.. జనరల్ బోగీలో ప్రయాణికుల కష్టాలు ఏ విధంగా ఉంటాయో ‘జనరల్ బోగీలు’ నాటికలోను వివరించారు. మూడు నాటికలు అలరించాయి. రెండవ రోజు నాటిక ప్రాంగణానికి బొండాడ వెంకట రాధా రమణ గుప్తా పేరిట నామకరణం చేశారు. ఆకట్టుకున్న నాటికలు భీమవరం: పట్టణంలోని డీఎన్నార్ కళాశాల ఆవరణలోని గన్నాబత్తుల క్రీడామైదానంలో చైతన్య భారతి సంగీత, నృత్య, నాటక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ జాతీయస్థాయి సాంఘిక నాటిక పోటీల్లో శనివారం మూడు నాటికలు రసవత్తరంగా సాగాయి. హైదరాబాద్ శ్రీమహతి క్రియేషన్స్ వారి సింహ ప్రసాద్ రచించగా.. ఉప్పలూరి సుబ్బరాయశర్మ దర్శకత్వంలో ప్రదర్శించిన ‘ఉక్కు సంకెళ్లు’ నాటిక ఈస్టిండియా కంపెనీ దురాగతాలను ఎత్తి చూపింది. ఫిలిప్స్ దొర అడిగిన వెంటనే హిల్సా చేప ఇవ్వలేదనే కోపంతో హుగ్లీ నదిలో చేపల వేట నిషేధిస్తే దానికి ఆనాటి జమిందారిణి రాణీ రాస్మణీదేవి ఏ విధంగా అడ్డుకున్నది కళ్లకు కట్టినట్లు చూపించారు. రెండో ప్రదర్శనగా విశాఖ ఉక్కు నగరం శ్రీచైతన్య కళాస్రవంతి వారి ‘(అ)సత్యం’ నాటిక పి.బాలాజీ నాయక్ దర్శకత్వంలో ప్రదర్శించారు. కంటికి కనిపించేదంతా సత్యం కాదు, కనిపించనిదంతా అసత్యం కాదనే సందేశంతో ప్రదర్శించిన నాటిక ప్రేక్షకులను ఆలోచింపచేసింది. మూడో ప్రదర్శనగా హైదరాబాద్ మిత్రా క్రియేషన్స్ ‘ఇది రహదారి కాదు’ నాటిక ఎస్ఎం బాషా దర్శకత్వంలో ప్రదర్శించారు. సంపాదనే ముద్దు పిల్లలు వద్దు అనే రీతిలో నేటి యువత తీసుకుంటున్న నిర్ణయాలను, దారితప్పిన యువ జంటను చక్కదిద్దిన దృశ్యరూపమే ఈ నాటిక ఇతివృత్తం. కార్యక్రమంలో చైతన్య భారతి అధ్యక్ష, కార్యదర్శులు రాయప్రోలు భగవాన్, మంతెన రామ్కుమార్రాజు, పీఆర్వో భట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండా రాంబాబు, పేరిచర్ల లక్ష్మణవర్మ, కట్రెడ్డి సత్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు. -
దళారుల నిలువు దోపిడీ
ఏలూరు (మెట్రో): జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతులను దళారులు నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో.. మద్దతు ధర లభించకపోవడంతో రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. ప్రకృతి కరుణించడంతో దిగుబడులు బాగానే వచ్చినా.. కూటమి సర్కారు రైతులపై కక్ష కట్టింది. జిల్లాలో ఎక్కువగా మెట్టప్రాంతం ఉండటంతో ప్రస్తుత సీజన్లో రెండో పంటగా రైతులు 48,878 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ప్రస్తుతం దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆనందపడ్డారు. ప్రకృతి కనికరించడంతో ఎకరానికి 35 నుండి 40 క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చింది.అయితే మద్దతు ధర లేకపోవడం, దళారులు దోపిడీతో ఆ ఆనందం కాస్తా ఆవిరైంది. క్వింటాల్కు రూ.400 తగ్గింపు గత వైఎస్సార్సీపీ సర్కారు క్వింటాల్కు రు.2600 కనీస మద్దతు ధర ప్రకటించింది. గతేడాది కంటే ఈ ఏడాది కనీస మద్దతు ధర పెరుగుతుందని రైతులు భావించారు. ప్రస్తుతం రూ.2,225కు ధర తగ్గించడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. క్వింటాల్కు సుమారు రూ.400 తగ్గించడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎకరం సాగు చేసేందుకు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకూ ఖర్చవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం ఖర్చులు, పెట్టుబడి పోను ఎకరానికి రూ.20 వేల వరకే మిగులుతుందని రైతులు చెబుతున్నారు. గత ఏడాది ఇచ్చిన మద్దతు ధర ఇచ్చినా లాభాలు వచ్చేవని రైతులు అంటున్నారు. గతంలో రైతు భరోసాతో ప్రభుత్వం ఆదుకునేది. రైతులకు కనీస మద్దతు ధర అందించి రైతులు పండించిన పంటను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసేది. నేరుగా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా సాయాన్ని అందిస్తూ రైతులను గత ప్రభుత్వం ఆదుకునేది. ప్రస్తుతం మద్దతు ధర లేదు, రైతులకు సాయం లేదు. బర్డ్ఫ్లూ దెబ్బకు తగ్గిన డిమాండ్ జిల్లాలో మొక్కజొన్నను 80 శాతం పైగా కోళ్ల ఫారాలకు సరఫరా చేసి మేతగా వినియోగించేవారు. ఇటీవల కోళ్లకు బర్డ్ఫ్లూ వ్యాపించడంతో పౌల్ట్రీ రంగం కుదేలైంది. దీంతో కోళ్ల ఫాంలు మూతపడ్డాయి. దీంతో మొక్కజొన్నకు డిమాండ్ తగ్గడంతో రైతుల పండించిన పంటను దళారులు తమ ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారు. ఒక వైపు రైతులను ప్రభుత్వం ఆదుకోకపోగా మరో వైపు మద్దతు ధర తగ్గించడం వంటి పరిణామాలతో మొక్కజొన్న రైతు లబోదిబోమంటున్నాడు. మొక్కజొన్న రైతు గగ్గోలు మద్దతు ధర తగ్గింపు.. దోచుకుంటున్న దళారులు జిల్లా వ్యాప్తంగా 48,878 ఎకరాల్లో సాగు జిల్లాలో మొక్కజొన్న సాగు వివరాలు జిల్లాలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు: 18,345 మంది జిల్లాలో సాగు: 48,878 ఎకరాలు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర: రూ.2,225 దళారులు కొనుగోలు చేస్తున్న ధర: రూ.2 వేల నుంచి 2,200 -
ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపాలి
ఆకివీడు: ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని వారి అంతానికి దేశ ప్రజలంతా అండగా ఉంటారని వైఎస్సార్సీపీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి. ఉగ్రదాడులకు నిరసనగా స్థానిక వైఎస్సార్ సెంటర్లో శనివారం కొవ్వొతుల ప్రదర్శన, శాంతి ర్యాలీ నిర్వహించారు. పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, మండల, పట్టణ కమిటీ అధ్యక్షులు నంద్యాల సీతారామయ్య, అంబటి రమేష్, ఏఎంసీ మాజీ చైర్మన్లు మోటుపల్లి గంగాధరరావు, ఎండీ.మస్తాన్ వలీ మాట్లాడుతూ ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారిని కూడా మట్టుబెట్టాలన్నారు. అమరులైన వ్యక్తుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించి, ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి భద్రత ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎండీ.జహంగీర్, ఎస్కే. ఆరీఫ్, ఎండీ.జక్కీ, ఎండీ.సిద్ధిక్, ఎస్కే.హుస్సేన్, గుండా సుందరరామనాయుడు, జీ.ధనరాజు, మోరా జ్యోతిరెడ్డి, పడాల శ్రీనివాసరెడ్డి, నిమ్మల నాగు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన -
చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
జంగారెడ్డిగూడెం: తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లోకి పట్టపగలు తాళాలు పగులగొట్టి ఇళ్లల్లోకి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టి.నరసాపురం మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన ఒంటెద్దు క్రాంతికుమార్రెడ్డిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడు ఇటీవల డాంగేనగర్ ప్రాంతంలో రెండు చోరీలకు పాల్పడ్డాడని వివరించారు. నిందితుడి వద్ద నుంచి 200 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒంటెద్దు క్రాంతికుమార్రెడ్డి ప్లంబర్ పని చేస్తుంటాడని, ప్లంబింగ్ పనికి ఉపయోగించే కట్టర్లు, స్క్రూడ్రైవర్ల సహాయంతో ఇంటి తాళాలు పగులగొడతాడని డీఎస్పీ చెప్పారు. సీఐ వి.కృష్ణబాబు పర్యవేక్షణలో ఎస్సై షేక్ జబీర్ క్రాంతి కుమార్రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. కాగా నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై షేక్ జబీర్, ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, కానిస్టేబుల్ ఎన్.రమేష్, రాజశేఖర్లకు రివార్డుకు జిల్లా ఎస్పీకి సిఫార్సు చేస్తామన్నారు. -
యథేచ్ఛగా చెట్ల నరికివేత
నిబంధనలను మీరి మరీ.. ఏలూరు డివిజన్(4, 5 ప్యాకేజీలు) పరిధిలోని పోలవరం కుడి కాలువ వద్ద జంగిల్ క్లియరెన్స్ పనులు నిర్వహించేందుకు భీమవరానికి చెందిన పంచగర్ల సత్యనారాయణ కాంట్రాక్టుకు తీసుకున్నాడు. నారాయణపురం పరిధిలోని కాలువ వద్ద జంగిల్ క్లియరెన్స్ పనులను తామే చేసి, అప్పగిస్తామని పార్టీ గ్రామ కమిటీ అద్యక్షుడు కేఎన్ఆర్ కాంట్రాక్టర్తో మాట్లాడుకుని, అక్కడ తుమ్మచెట్లు నరకకుండా మొత్తం వేప చెట్లను నరికేశారు. దీనిపై నాకు శుక్రవారం కొందరు ఫిర్యాదు చేశారు. వెంటనే సంబంధిత వ్యక్తులను ఏలూరు కార్యాలయానికి వచ్చి ఫైన్ కట్టమని హెచ్చరించాను. అలాగే దగ్గరుండి పనులు చేయించాలని కాంట్రాక్టరుకు సూచించాను. – బాపూజీ, ఇరిగేషన్ ఏఈ ●ద్వారకాతిరుమల : ఓ పచ్చనేత పోలవరం కుడి కాలువ గట్టుపై ఉన్న చెట్లపై కన్నేశాడు. ఇంకేముంది పట్టపగలే వాటిని నరికించే పనిలో పడ్డాడు. ఇప్పటికే వేప తదితర జాతులకు చెందిన దశాబ్దాల కాలం నాటి ఎన్నో చెట్లను నరికించేశాడు. ఇప్పటికే కొంత కలపను విక్రయించగా, మరి కొంత కలపను విక్రయించేందుకు సిద్ధం చేశాడు. చెట్లు నరికివేతపై ఆ నాయకుడిని ఎవరైనా ప్రశ్నిస్తే, నేనెవరో తెలుసా..? టీడీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ని అంటున్నాడు. దాంతో సంబంధిత అధికారులు సైతం ఆ వైపు కన్నెత్తి చూడడానికి భయపడుతున్నారు. వివరాల ప్రకారం ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం–గుణ్ణంపల్లి మధ్యలోని పోలవరం కుడి కాలువ గట్టుపై గత పది రోజులుగా చెట్లు నరికివేత పనులు జరుగుతున్నాయి. పట్టపగలే ఈ పనులు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దాంతో ఎంతో విలువైన వేప, తదితర జాతులకు చెందిన భారీ వృక్షాలను నరికి వేస్తున్నారు. ఇప్పటికే కొంత కలపను విక్రయించగా, మరి కొంత కలపను అమ్మేందుకు సిద్ధం చేశారు. కాలువ గట్టుపై అక్కడక్కడా ఆ కలపను గుట్టలుగా ఉంచారు. అసలు నేనెవరో తెలుసా..? ఎం.నాగులపల్లి–గుణ్ణంపల్లి మధ్యలో శుక్రవారం చెట్లు నరికే సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్పై అటుగా వెళ్లారు. నరికిన చెట్లను ట్రాక్టర్తో బయటకు లాగడాన్ని చూసి, అక్కడున్న వారిని నిలదీశారు. ఎంతో విలువైన వేప చెట్లను ఎవరి అనుమతులతో నరుకుతున్నారని ప్రశ్నించారు. దాంతో కోపోద్రిక్తుడైన ఒక నాయకుడు అసలు నేనెవరో తెలుసా.. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిని, నేను చూసుకుంటాను అంటూ ఊగిపోయాడు. ఫోన్లో వీడియో ఎందుకు తీస్తున్నారని బైక్పై ఉన్న వారితో సదరు నాయకుడు, అతనితో ఉన్నవారు వాగ్వివాదానికి దిగారు. దాంతో ఏం చేస్తారోనన్న భయంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ అక్రమాలను ఆపేదెవరూ? కళ్లముందే పచ్చని చెట్లను నరికేస్తుంటే సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడం దారుణమని స్థానికులు అంటున్నారు. ఎంత అధికార పార్టీ నాయకులైతే మాత్రం అక్రమంగా చెట్లు నరికి, అమ్మేస్తుంటే పట్టించుకోరా? అని ప్రశ్నిస్తున్నారు. కాలువ గట్టుపై జంతుజాలాలు, పక్షు జాతులకు ఆవాసంగా ఉన్న చెట్లను అక్రమంగా నరికివేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, చెట్లను నరికి, అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలవరం కాలువ గట్టుపై ఉన్న చెట్లపై టీడీపీ నేత కన్ను కొంత కలప విక్రయం, మరికొంత అమ్మేందుకు సిద్ధం -
చెరువుల్లో మట్టిని తోడేస్తున్న మాఫియా
నూజివీడు: అధికార పార్టీ మట్టి మాఫియా చెరువుల్లోని మట్టిని తోడేస్తోంది. అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తు న్నా అధికార వర్గాలు కళ్లుమూసుకుని కూర్చుంటున్నారే గానీ వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నూజివీడు మండలం ఓగిరాల తండాకు చెందిన టీడీపీ నాయకుడు గ్రామంలో ఉన్న పాలెం చెరువులో మూడు రోజులుగా అక్రమ తవ్వకాలు చేపట్టి మట్టిని బయటకు తరలిస్తున్నారు. ట్రాక్టరు ట్రక్కు మట్టిని రూ.500ల నుంచి రూ.600లకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇందులో ప్రొక్లెయిన్తో తవ్వి ట్రాక్టర్ నింపడానికి రూ.100లు చెల్లిస్తున్నారు. ఈ చెరువు మట్టి ఓగిరాల తండా, హటియాతండా, హరిశ్చంద్ర తండాలకు వెళ్తోంది. ఆయా గ్రామాల్లో వైఎస్సార్ సీపీకి చెందిన వారు ఎవరైనా తమకు మట్టి కావాలంటే వారికి తోలకుండా కేవలం టీడీపీ వారికే మట్టిని అమ్ముతున్నారని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు. చెరువు అనేది గ్రామ ప్రజలందరదీ అయినప్పుడు కొంతమందికి తోలడం, కొంతమందికి తోలకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అక్రమంగా మైనింగ్ చేసి మట్టిని అమ్ముకుంటున్నా ఇటు రెవెన్యూ అధికారులు గానీ, అటు ఇరిగేషన్ అధికారులు గానీ, మైనింగ్ అధికారులు గానీ ఏమీ పట్టనట్లు ఉండటం గమనార్హం. అయితే శుక్రవారం మధ్యాహ్నానికి గ్రామస్తుల నుంచి రెవెన్యూ అధికారులకు అక్రమ తవ్వకాలపై పదేపదే ఫోన్లు రావడంతో మట్టి తవ్వకాలను ఆపారు. ఇటీవల ఆగిరిపల్లి మండలం నర్సింగపాలెంలో సీఎం ఇంటి మెరక పనులకు అంటూ కొండ నుంచి గ్రావెల్ను అక్రమంగా తవ్వి టిప్పర్లలో తరలించి అమ్ముకున్నారు. ఇక్కడ విచ్చలవిడిగా జరుగుతున్న తవ్వకాల గురించి అధికారులు పట్టించుకోకపోయినా గ్రామస్తులే అడ్డుకున్నారు. ఇదే మండలంలోని ఈదరలోని పంగిడమ్మ చెరువులోని మట్టిని సైతం కొల్లగొడుతున్నారు. ఈ చెరువు నుంచి మట్టి ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీలకు మట్టిమాఫియా సరఫరా చేస్తోంది. నూజివీడు మండలంలో కొన్నంగుంట, పోతురెడ్డిపల్లి, మొర్సపూడి, చాట్రాయి మండలం పోలవరం తదితర గ్రామాల్లో కూడా చెరువుల్లోని మట్టిని అడ్డగోలుగా కొల్లగొడుతున్నారు. -
కొంతేరులో నాటిక పోటీలు ప్రారంభం
యలమంచిలి: యూత్ క్లబ్ నాటక పరిషత్ ఆధ్వర్యంలో కొంతేరు గ్రామంలోని పులపర్తి వీరాస్వామి కళామందిరంలో నిర్వహించిన అఖిల భారత స్థాయి నాటిక పోటీలలో తొలి రోజు రెండు నాటికలు ప్రదర్శించారు. మొదటగా గుడివాడకు చెందిన కృష్ణ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసి యేషన్ వారు ప్రదర్శించిన ద్వారబంధాల చంద్రయ్యనాయుడు నాటిక ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. పీవీ సత్యనారాయణ రచించిన ఈ నాటకానికి పి.కృష్ణ హితేష్ దర్శకత్వం వహించారు. రెండవ నాటికగా హైదరాబాద్ విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన స్వేచ్ఛ నాటిక అలరించింది. ఈ నాటికను పరమాత్ముని శివరాం రచించారు.సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టుపాలకొల్లు (సెంట్రల్): కూటమి నాయకులను ఎక్స్ ఖాతాలో దూషించారంటూ అందిన ఫిర్యాదు మేరకు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిగురువాడ గ్రామానికి చెందిన అమితి హరి ప్రసాద్అనే వ్యక్తిని అదుపు తీసుకున్నామని పాలకొల్లు టౌన్ పోలీసులు శుక్రవారం తెలి పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కు టుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించడం, బూతులు తిడుతూ వారి వ్యక్తిత్వహన నానికి పాల్పడ్డాడని పాలకొల్లుకు చెందిన టీడీపీ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు ధనాని సూర్యప్రకాష్ ఫిర్యాదు చేశారన్నారు. అలాగే సీఎం చంద్రబాబు, లోకేష్లపై కూడా తిడుతూ పోస్టులు పెట్టారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కె.రజిని కుమార్ తెలిపారు. ఎంపీడీఓను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నం ఉంగుటూరు: ఉంగుటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంజి రాజ్మనోజ్కు శుక్రవారం ఓ వింత అనుభవం ఎదురైంది. శుక్రవారం ఎంపీడీఓకు ఓ నంబర్ నుంచి ఓ ఫోన్ వచ్చింది. లైన్లో ఉండండి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడుతున్నారని ఎంపీడీఓకు ఫోను కలిపారు. నేను పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ త్రివేదిని అంటూ మాట్లాడుతూ మా మేనల్లుడు ఆశ్రం ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు . డబ్బు సర్దండి అంటూ ఒక ఫోను నెంబరు చెప్పారు. పైగా ఈ విషయం ఎవరికి చెప్పకండంటూ చెప్పారు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన ఎంపీడీఓ ముందు తడబడినా ఆ తర్వాత పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సత్యభూషణ కుమార్ కదా? అని గుర్తు వచ్చి మిన్నకుండిపోయారు. దొంగ అరెస్టుభీమవరం: నడిచి వెళ్తున్న మహిళ మెడలో బంగారుచైన్ లాక్కుని పారిపోతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు భీమవరం వన్టౌన్ ఎస్సై కృష్ణాజీ శుక్రవారం చెప్పారు. మెంటేవారితోటకు చెందిన జి.వాసవి బుధవారం మార్కెట్కు రైల్వే అండర్ టన్నెల్ నుంచి నడుచుకుంటూ వస్తుండగా పాలకొల్లుకు చెందిన కొప్పర్తి అలెగ్జాండర్ పౌల్ ఆమె మెడలోని చైన్ లాక్కుని పారిపోతుండగా వాసవి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కలవారు పౌల్ను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితుడిని చేసి కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై కృష్ణాజీ చెప్పారు. లారీ తిరగబడి డ్రైవర్ మృతి జంగారెడ్డిగూడెం: మండలంలోని పుట్లగట్లగూడెం నుంచి పంగిడిగూడెం వైపు వెళ్ళే గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రీన్ ఫీల్డ్ హైవే లారీ డ్రైవర్ ధనుంజయ్ సింగ్ (44) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. లక్కవరం ఎస్సై శశాంక తెలిపిన వివరాల ప్రకారం ఝార్ఖండ్ రాష్ట్రం పిప్రా గ్రామానికి చెందిన ధనుంజయ్ సింగ్ కొంత కాలంగా గ్రీన్ ఫీల్డ్ హైవే స్టాక్ పాయింట్లో కాంక్రీట్ మిక్చర్ లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. శుక్రవారం లారీలో కాంక్రీట్ తీసుకుని పంగిడిగూడెం వైపునకు వెళ్తున్నాడు. రహదారి మధ్యలో లారీ నిలిచిపోవడంతో పదేప దే లారీను స్టార్ట్ చేయగానే లారీ వెనక్కి వెళ్లి డివైడర్ను ఢీకొట్టి తిరగబడింది. ఈ ప్రమాదంలో ధనుంజయ్ సింగ్ తలకు తీవ్రగాయాలై ఘటనా స్థలం వద్దనే మృతి చెందాడు. ఈ ఘటనపై గ్రీన్ ఫీల్డ్ హైవే సంస్థ ఫీల్డ్ ఆఫీసర్ కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పేరుపాలెం బీచ్లో యువకుడి గల్లంతు
ద్వారకాతిరుమల: పేరుపాలెం బీచ్లో స్నేహితులతో కలసి సరదాగా స్నానం చేస్తుండగా ద్వారకాతిరుమలకు చెందిన ఒక యువకుడు గల్లంతయ్యాడు. వివరాల ప్రకారం మండలంలోని కొమ్మర, కోడిగూడెం, ద్వారకాతిరుమల, సత్తెన్నగూడెం గ్రామాలకు చెందిన 10 మంది యువకులు శుక్రవారం ఉదయం ఒక ఆటోలో పేరుపాలెం బీచ్కు వెళ్లారు. మధ్యాహ్నం సరదాగా బీచ్లో స్నానం చేస్తున్నారు. అయితే ద్వారకాతిరుమలకు చెందిన లాలూ నాయక్(17), సత్తెన్నగూడెం గ్రామానికి చెందిన మధు బీచ్ లోపలికంటూ వెళ్లారు. దాంతో లాలూ నాయక్ గల్లంతు కాగా, మధు ప్రాణాలతో బయటపడ్డాడు. సహాయక సిబ్బంది నాయక్ కోసం గాలిస్తున్నారు. తొమ్మిది మంది యువకులు ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఉన్నారు. -
వారెవ్వా.. షవర్ బాత్
శ్రీవారి కొండపై జల్లు స్నానంతో సేదతీరుతున్న మూగజీవాలు భానుడి భగభగలకు మూగజీవాలు అల్లాడుతున్నాయి. అయితే ద్వారకాతిరుమల క్షేత్రంలోని దేవస్థానం గో సంరక్షణశాలలో మూగజీవాలు షవర్ బాత్లు చేస్తూ ఉపశమనాన్ని పొందుతున్నాయి. ఎక్కడాలేని విధంగా దేవస్థానం అధికారులు ఈ మూగజీవాల కోసం రూ. 2 లక్షలు పైగా వెచ్చించి గో, గజ శాలల్లో గతంలోనే షవర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ ఆవులు, గిత్తలకు, అలాగే అశ్వానికి షవర్ల కిందే సిబ్బంది జల్లు స్నానం చేయిస్తున్నారు. అదేవిధంగా గజలక్ష్మి సైతం జల్లు స్నానంతో ఉపసమనాన్ని పొందుతోంది. కజానా బాతులైతే ఎక్కువ సమయం గోసంరక్షణశాలలోని కొలనులోనే ఉంటున్నాయి. ఇవి చూపరులను ఆకర్షిస్తున్నాయి. – ద్వారకాతిరుమల -
పాలిటెక్నిక్,ఐటీఐ కోర్సులతో ఉద్యోగావకాశాలు
భీమవరం: పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు చేసిన వారికి ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. టెన్త్లో మంచి మార్కులు సాధించి పాలిటెక్నిక్లో చేరాలనుకోవడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో కాళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యనభ్యసించిన నిమ్మల యశస్విని పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 586 మార్కులను సాధించిన సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా ఏం చదవాలి? అనుకుంటున్నావని కలెక్టర్ ప్రశ్నించగా పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి పాలిటెక్నిక్ చదవాలనుకుంటున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేయడంతో మంచి నిర్ణయమంటూ యశస్వినిని కలెక్టర్ నాగరాణి అభినందించారు. టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు కోర్సుల ఎంపికలో యశస్వినిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మంచి ఫలితాల సాధనకు విద్యార్థులను ప్రోత్సహించిన ప్రధానోపాధ్యాయుడు జేఎల్ఎం శాస్త్రి శాలువాతో కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ, ఎంఈఓ ఎ.రవీంద్ర, విద్యార్థిని తల్లిదండ్రులు నిమ్మల శ్రీనివాసరావు, భారతి తదితరులు పాల్గొన్నారు. -
చెల్లి మరణం తట్టుకోలేక అన్న ఆత్మహత్య
పెనుగొండ: తోడబుట్టిన చెల్లెలు మరణాన్ని తట్టుకోలేక అమ్మా నేనూ వచ్చేస్తున్నానంటూ అన్న ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన సిద్ధాంతం ప్రజలను కలచి వేసింది. సిద్ధాంతానికి చెందిన ఈదుపల్లి లక్ష్మీ నరసింహ(21) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి మృత్యువుతో పోరాడి బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచాడు. వివరాల్లోకి వెళితే సిద్ధాంతంకు చెందిన ఈదుపల్లి నాగలక్ష్మీ అనారోగ్యంతో ఈ నెల 10న ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఏసీ మెకానిక్గా జీవనం సాగిస్తున్న అన్న లక్ష్మీ నరసింహ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చెల్లె మరణం జీర్ణించుకోలేక ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తల్లిదండ్రులు వెంటనే గమనించి తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచాడు. దీంతో తండ్రి ఈదుబిల్లి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు పెనుగొండ ఎస్సై కొప్పిశెట్టి గంగాధరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు పిల్లలూ మృత్యువాత పడడంతో ఈదుబిల్లి సూర్యనారాయణ దంపతులు తల్లడిల్లిపోతున్నారు. పెనుగొండలో చదువుకుంటున్న కూతురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే చేతికందివచ్చి, కుటుంబానికి అండగా నిలుస్తాడునుకున్న కొడుకూ మృతి చెందడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. -
దళితుల భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి
ఏలూరు (టూటౌన్): చింతలపూడి మండలం బట్టువారిగూడెం గ్రామం విష్ణు సాగర్రోడ్డులో దళిత మహిళ పాము రాణిసాగు చేసుకునే భూమిని ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవిప్రకాష్ కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి అదనపు విశ్వేశ్వరరావు ని కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి ప్రకాష్ మాట్లాడుతూ సర్వే నంబర్ 1373/1 కి చెందిన మెట్ట భూమి 2.55 ఎకరాల భూమిని అగ్రవర్ణానికి చెందిన కంభం మెట్టు ఉషశ్రీ తన భర్త శ్యామసుందర్, ఆమె బంధువులు ఆమె తీసుకొచ్చిన కొంతమంది దళారులు కూలీలతో దౌర్జన్యంగా భూమిలోకి చొరబడి నారు పాము రాణిపై ఆమె భర్త పై కులం పేరుతో దూషణకు పాల్పడి వారిని కింద పడేసి కొట్టారన్నారు. దళిత మహిళ నారపాము రాణి జీవనాధారమైన మెట్ట సాగు భూమినే సుమారు 70 సంవత్సరాల నుండి ఆమె పూర్వికులు నుండి ఇప్పటివరకు సాగు చేసుకుని జీవిస్తున్నారు. సదరు భూమిలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ బావి, బోరు ఏర్పాటు చేశారు. ఈ ఆక్రమణపై స్పందించిన డీఆర్ఓ విచారణ నిమిత్తం నూజివీడు ఆర్డీఓకు ఎండార్స్ చేసినట్లు రవిప్రకాష్ తెలిపారు. -
ఉగ్ర దాడిపై నిరసన
చింతలపూడి: జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిని చింతలపూడి పట్టణ జామియా మసీదు కమిటీ, పట్టణ జమాతే ఇస్లామీ హింద్ నాయకులు తీవ్రంగా ఖండించారు. గురువారం జామియా మసీదు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ రహీమ్ (బాబు) మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతుందని, కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి ఉంటున్నారన్నారు. దేశంలో మత సామరస్యాన్ని చూసి ఓర్వలేక ఉగ్ర మూకలు పాశవికంగా కాల్పులు జరపడం పిరికి పంద చర్య అని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమాత్ ఇస్లామీ హింద్ పెద్దలు ఎండీ అక్బర్ అలీ మాట్లాడుతూ ఇస్లాం అంటేనే శాంతి అని, ఇస్లాంలో హింసకు తావు లేదన్నారు, ఎవరెన్ని కుట్రలు, దాడులు చేసినా దేశంలో మతసామరస్యాన్ని విడదీయలేరన్నారు. మసీదు కమిటీ కార్యదర్శి ఎండీ జిలానీ, కమిటీ ముఖ్య కార్యవర్గ సభ్యులు ఎండీ ఇస్మాయిల్, సయ్యద్ రజాక్, టజు సుభాని తదితరులు పాల్గొన్నారు. -
ఫెయిల్ అయ్యామని కుంగిపోవద్దు
ఏలూరు(మెట్రో): ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యా ర్థులు ఎంతమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఉద్బోధించారు. పబ్లిక్ పరీక్షల్లో చిన్నపాటి పొరపాట్ల వల్ల మార్కులు తగ్గి ఫెయిల్ అయి ఉండొచ్చన్నారు. అంతేగానీ ఫెయిల్ అయిన విద్యార్థులు తెలివితేటలు లేనివారు మాత్రం కాదని స్పష్టం చేశారు. ఈ సమయంలో నిరాశ చెందకుండా సాధన చేసి ఉత్తీర్ణులు కావాలన్నారు. విద్యార్థులకు అవసరమైన మెరుగైన విద్యాబోధనను అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఎటువంటి ప్రతికూల ఆలోచనలతో ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా నిర్విరామంగా కృషి చేస్తే విజయం తథ్యమని అన్నారు. మే 19 నుంచి 28వ తేదీ వరకు జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో హాజరై ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 22,365 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 17,274 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫెయిలైన 5,091 మంది విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు కౌన్సెలింగ్ ఇవ్వాలని, పునశ్చరణ తరగతులు కూడా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే విద్యార్థుల ఉత్తీర్ణతకు ఎంఈఓలు, హెచ్ఎంలు కార్యాచరణ తయా రు చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా ఒకటి, రెండు సబ్జెక్టుల్లో పాస్ కాని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థులు నిరాశ, నిస్పృహలకు గురి కాకుండా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెట్రిసెల్వి -
సినిమాల్లో ఇతర భాషల నటులే ఎక్కువ
సినీ నటుడు రావు రమేష్ భీమవరం: తెలుగు సినీ రంగంలో నిర్మాతలు మినహా ఎక్కువ మంది ఇతర భాషల వారే ఉన్నారని సినీ నటుడు రావు రమేష్ అన్నారు. గురువారం రాత్రి భీమవరం డీఎన్నార్ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో చైతన్య భారతి సంగీత, నృత్య, నాటక పరిషత్ 18వ జాతీయస్థాయి సాంఘిక నాటికల పోటీలు ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాటి సినీ నటులు నాటక రంగం నుంచి వెళితే నేడు నాటక రంగంతో ఎలాంటి పరిచయం లేకున్నా ఇన్స్టా గ్రామ్, సోషల్ మీడియాలో స్క్రిట్స్, రీల్స్ వంటివి చూసి నటులను ఎంపిక చేసుకునే రోజులు నడుస్తున్నాయన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ నాటక రంగానికి ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని, సినీ పరిశ్రమకు ఇస్తున్న రాయితీలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కళారంగాన్ని ప్రత్యేకించి నాటక రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి మాట్లాడుతూ డిజిటల్ రంగంలో ప్రజలు మునిగి తేలుతున్న సమయంలో కళాపరిషత్లు నాటక రంగాన్ని రక్షించడం గొప్ప విషమని, నాటక రంగాన్ని బతికించాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ మాట్లాడుతూ నాలుగు రోజులపాటు 10 నాటికలు ప్రదర్శిస్తామన్నారు. ముందుగా సినీ నటుడు రావు రమేష్ కు ఆత్మీయ చైతన్య పురస్కారం, రంగస్థల నటుడు, రచయిత ఎస్కే మిశ్రోకు చుక్కన సత్యనారాయణరాజు రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటీమణి పి.మణిబాలకు పెనుబోతుల శేషగిరిరావు హార్థిక చైతన్య పురస్కారాలతో సత్కరించారు. అనంతరం ప్రదర్శించిన కళానికేతన్ కాట్రపాడు వారి కిడ్నాప్, మైత్రి కళానిలయం హైదరాబాద్ వారి బ్రహ్మ స్వరూపం నాటికలు ఆకట్టుకున్నాయి. డీఎన్నార్ కళాశాల అధ్యక్షుడు గోకరాజు వెంకట నర్సింహరాజు, చిలుకూరి నర్సింహరాజు, మంతెన రామ్కుమార్ రాజు, పీఆర్వో భట్టిప్రోలు శ్రీనివాసరావు, నడింపల్లి మహేష్కుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’పై దాడి అమానుషం
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి చేయటం, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయంలో కంప్యూటర్లు ధ్వంసం చేయటం సరికాదని వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ... మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, మంచి చేయండి, ప్రజలకు చేరువ కావటానికి ప్రయత్నం చేయండి, పత్రికా స్వేచ్ఛను ఒక ప్రజాప్రతినిధి స్థాయిలో ఉంటూ బెదిరింపులు, అనుచరులతో దాడులు చేయటం ఏమాత్రం సమర్థనీయం కాదు అని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, అధికారం తమకు వస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో పథకాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. దౌర్జ న్యాలు, అరాచకాలు, లిక్కర్ మాఫియా, కోడిపందాలు, జూదాలు తప్ప ఏమున్నాయని సునీల్ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ ఇన్చార్జి సునీల్ -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
భీమవరం: పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆశా కార్యకర్తల ఐక్యంగా పోరాడాలని ఎమ్మెల్సీ బి.గోపీమూర్తి పిలుపునిచ్చారు. గురువారం ఆశా వర్కర్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా భీమవరం త్యాగరాజ భవనంలో చింతపల్లి లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆశా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సర్వీస్ను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలకు కనీస సౌకర్యాలు లేవని, ప్రభుత్వం యాప్తో పనిభారం పెంచిందని విమర్శించారు. ఆశా కార్యకర్తలకు గ్రాట్యూటీ, కనీస వేతనాలు లేవని పీఎఫ్, ఈఎస్ఐ ఊసెత్తకుండా ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటోందని గోపీమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తేస్తున్న లేబర్ కోడ్స్ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా నాయకులు బి. వాసుదేవరావు, డి.కల్యాణి, ఎ.అజయ్ కుమారి, యూనియన్ జిల్లా కార్యదర్శి డి.జ్యోతి పాల్గొన్నారు. -
ఆస్పత్రి ప్రారంభమెప్పుడో?
నూజివీడు: జిల్లాలోనే అతిపెద్ద కాలనీగా పేర్గాంచిన నూజివీడు ఎమ్మార్ అప్పారావు కాలనీలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.80 లక్షలతో చేపట్టిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులు పూర్తయి ఆరు నెలలు గడిచింది. అయినా ఇప్పటికీ అధికారులు ఈ కేంద్రాన్ని ప్రారంభించలేదు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కృషితో కాలనీలో ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ప్రారంభానికి నోచుకోకపోవడంతో కాలనీ వాసులు చిన్నపాటి అనారోగ్యానికీ ఐదు కిలోమీటర్ల దూరంలోని ఏరియా ఆస్పత్రికి పరుగులు తీయాల్సి వస్తోంది. ఆస్పత్రి ప్రారంభమైతే వైద్య సేవలతో పాటు పది పడకలు అందుబాటులో వస్తాయి. అన్ని రకాల రక్తపరీక్షలు నిర్వహిస్తారు. ఆరోగ్య కేంద్రంలో ఫార్మసీ, ఔట్పేషెంట్ గదులు, రెండు శస్త్రచికిత్స గదులు, లాబోరేటరీ, రోగుల సహాయకులకు విశ్రాంతి గదులు, వైద్యుల గది ఉన్నాయి. ఆస్పత్రికి అవసరమైన వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లను సైతం గతంలోనే ప్రభుత్వం నియమించింది. మీ కోసంలో వినతి ఆస్పత్రిని ప్రారంభించాలని కాలనీవాసులు ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లో అర్జీని సైతం అందజేశారు. మున్సిపల్ అధికారులు వైద్యారోగ్య శాఖకు భవనాన్ని అప్పగించలేదని, అప్పగిస్తే ప్రారంభిస్తామని డీఎంహెచ్ఓ కార్యాలయం అర్జీదారుడికి సమాధానం కూడా పంపించింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఆస్పత్రి అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. వెంటనే ప్రారంభించాలి భవన నిర్మాణం పూర్త యినందున ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి. పేదలైన కాలనీవాసులంతా చిన్నపాటి అనారోగ్యానికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిని ఎప్పుడు ప్రారంభిస్తారని ఎదురుచూస్తున్నారు. – షేక్ రజియాబేగం, కౌన్సిలర్, ఎమ్మార్ అప్పారావు కాలనీ, నూజివీడు. నిర్మాణం పూర్తయి 6 నెలలు పట్టించుకోని అధికారులు గత ప్రభుత్వంలో రూ.80 లక్షలతో నిర్మాణం -
ఉపాధిలో వేతన వెతలు
సాక్షిప్రతినిధి, ఏలూరు: ఉపాధి హామీ కూలీల బకాయిలు నెలనెలకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ. 66.39 కోట్లు బకాయిలున్నాయి. వాస్తవానికి ప్రతి 15 రోజులకోసారి చేసిన పనులకు చెల్లింపులు జరగాల్సి ఉన్నా జిల్లాలో మాత్రం మూడు నెలలుగా బకాయిలు చెల్లించడం లేదు. జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ పనులైతే జరుగుతూ ఉన్నా ఇప్పుడు చేసే పనుల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారోననే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఒక పక్క పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేకపోయినా కూలి డబ్బుల కోసం ఆశపడి పనిచేస్తున్నా వేతనాలు చెల్లించకపోవడంపై కూటమి ప్రభుత్వంపై జిల్లాలోని ఉపాధి హామీ కూలీలు మండిపడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి 15 రోజులకోసారి ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించేవారని దానికి భిన్నంగా ప్రస్తుత కూటమి పాలకులు దాదాపు మూడు నెలలు కావస్తున్నా తమకు వేతనాలు చెల్లించకపోవడంపై ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క మండిపోతున్న నిత్యావసరాలు, కూరగాయలు, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు.. మరో పక్క సక్రమంగా అందని ఉపాధి వేతనాలు వెరసి తమ జీవనం మరింత దుర్భరంగా మారిందని చెబుతున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం తమపై సానుకూలంగా స్పందించి బకాయి వేతనాలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 5.57 లక్షల మంది ఉపాధి కూలీలు జిల్లాలోని 27 మండలాల పరిధిలో మొత్తం 3.77 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 5.57 లక్షల మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. ప్రతి కూలీకి ఏడాదికి వంద రోజులు పనిదినాలు కల్పించాల్సి ఉండగా జిల్లాలో సగటున ఒక్కో కూలీకి 46 రోజుల పనిదినాలనే కల్పించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన ప్రకారం ప్రతి 15 రోజులకోసారి కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా అది ఎక్కడా అమలు కావడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించాలి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల్లో భాగంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఇటు ఉపాధి కూలీలు, అటు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పని ప్రదేశాల్లో టెంట్, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, పనిముట్లు, మేట్లకు రూ.5 అదనపు పారితోషికం ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని వాటిని ఎదు ర్కోవటం కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు. వేతన పెంపుతో సరి ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.300 చెల్లించేవారు. తాజాగా కేంద్రం 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.7 వేతనం పెంచుతూ రోజుకు కూలీలకు రూ.307 చెల్లించాలని జీఓ విడుదల చేసింది. పెరిగిన ధరలతో పోలిస్తే కేంద్రం పెంచిన రూ.7 ఏ మూలకు సరిపోతాయి అంటూ ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలు.. రూ.66.39 కోట్లు జిల్లావ్యాప్తంగా ఉపాది హామీ పథకంలో కూలీలకు ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటివరకు దాదాపు మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో జిల్లాలో కూలీలకు రూ.61.39 కోట్లు వేతన బకాయిలు పేరుకుపోయాయి. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి వేతన బకాయిలు మొత్తం రూ.49.83 కోట్లు ఉన్నాయి. వీటికి అదనంగా ప్రస్తుత ఏప్రిల్ నెలకు సంబంధించిన బకాయి వేతనాలు రూ.16.56 కోట్లు కలిపి మొత్తం రూ.66.39 కోట్ల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలే ఇంత పెద్ద మొత్తంలో పేరుకుపోతే ఉపాధి కూలీలు ఏం తిని బతుకుతారు అంటూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పని దినాలు పెంచాలి ఉపాధి హామీలో పని దినాలు 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలి. సుప్రీంకోర్టు చెప్పినట్లు కనీస వేతనం రూ.600 ఇవ్వాలి. పని ప్రదేశాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి. పనికి తగ్గ వేతనం సక్రమంగా ఇవ్వాలి. అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పని చూపించాలి. ఒంటరి మహిళలకు జాబ్ కార్డులు ఇవ్వాలి. – పీవీ రామకృష్ణ, జిల్లా కార్యదర్శి, ఏలూరు పేదల బతుకులు భారం కూలి డబ్బుల బకాయిలు రూ.66.39 కోట్లు 3 నెలలుగా కూలీల ఎదురుచూపులు 100 రోజుల పని దినాలకు 46 రోజులే పూర్తి గత ప్రభుత్వంలో 15 రోజులకోసారి వేతనాలు జిల్లాలో 5.57 లక్షల మంది కూలీలు -
నర్సింగ్ కాలేజీలో వసూళ్ల పర్వం!
ఏలూరు టౌన్: ఏలూరు జీజీహెచ్ భవనంలో నిర్వహిస్తున్న జీఎన్ఎం నర్సింగ్ కాలేజీ వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు తెలుస్తోంది. అడ్మిషన్ల నుంచి క్యాపింగ్ సెర్మనీ వరకు విద్యార్థినుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు చెల్లించాలంటూ నర్సింగ్ విద్యార్థినులపై కాలేజీ యాజమాన్యం వత్తిడి చేస్తూ వేధింపులకు గురిచేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేదవర్గాల పిల్లలకు వృత్తివిద్యా కోర్సులు అందించేందుకు ప్రభుత్వం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) మూడున్నర సంవత్సరాల డిప్లమో కోర్సును అందిస్తోంది. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో భవనంలోనే ఒక విభాగంలో జీఎన్ఎం నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ప్రభుత్వం కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్లు అందిస్తూ పూర్తి ఉచితంగా జీఎన్ఎం కోర్సును పేద వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. మూడున్నరేళ్ల కోర్సుకు సంబంధించి ఒక్కో ఏడాది 60 మందికి అడ్మిషన్లు ఇస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద వర్గాల పిల్లలకు ఉచితంగా నర్సింగ్ కోర్సును అందిస్తూ వారి కాళ్లపై వారు నిలబడి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పర్చుకోవటమే ప్రభుత్వ లక్ష్యం. కానీ ఏలూరు జీజీహెచ్లోని జీఎన్ఎం కోర్సు చదివే విద్యార్థినులతో యాజమాన్యం దారుణంగా ఆటలాడుతూ భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారీగా వసూళ్లు? ఏలూరు సర్వజన ఆసుపత్రి భవనంలోని జీఎన్ఎం నర్సింగ్ కాలేజీలో రెండు రోజుల్లో క్యాపింగ్ సెర్మనీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు 240 మంది విద్యార్థినులకు వారి విద్య పూర్తిచేసి ఉత్తీర్ణత సాధించిన నేపథ్యంలో క్యాపింగ్ సెర్మనీ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఒక్కో విద్యార్థిని నుంచి రూ.2 వేలు వసూలు చేసేలా యాజమాన్యం టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థినిల నుంచి రూ.4.80 లక్షల సొమ్ములు వసూలు చేసేలా నిర్ణయించారు. కాలేజీ యాజమాన్యం పేరు చెప్పకుండా కాలేజీలోని సీనియర్ విద్యార్థినిలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. నర్సింగ్ కాలేజీలోని అధికారులకు బంగారు ఆభరణాలు చేయించాలనీ, ఇతరత్రా ఖర్చులు ఉంటాయనీ, కచ్చితంగా డబ్బులు కట్టాలంటూ వత్తిడి చేస్తున్నారనీ, తమకు తినటానికే డబ్బులు లేకుంటే ఇక రెండు వేలు ఎక్కడి నుంచి తెస్తామంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పేద విద్యార్థినులను వేధిస్తున్న కాలేజీ యాజమాన్యం అడ్మిషన్ల నుంచి క్యాపింగ్ వరకూ భారీగా వసూళ్లు? ఏలూరు జీజీహెచ్లో జీఎన్ఎం నర్సింగ్ కాలేజీ దుస్థితి డబ్బులు ఇవ్వకుంటే.. వేధింపులే జీఎన్ఎం కోర్సు పూర్తి చేయాలంటే తమ కనుసన్నల్లోనే ఉండాలనీ, తాము తలచుకుంటే మీరు పాస్ కూడా కారంటూ కాలేజీ యాజమాన్యం నిత్యం విద్యార్థినిలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారని చెబుతున్నారు. క్యాపింగ్ సెర్మనీకి రూ.2వేలు చెల్లించకుంటే మీకు సర్టిఫికెట్లు చేతికి రాకుండా ఎలా చేయాలో తమకు తెలుసంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. వృత్తివిద్యా కోర్సు కావటంతో విద్యార్థినులు సైతం మౌనంగా వేధింపులు భరిస్తూ ఉంటున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలి
ఏలూరు (టూటౌన్): పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఎస్సీ సర్పంచ్లు హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ అన్నారు. పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని స్థానిక ఎన్ఆర్పేటలోని ఎస్సీఆర్పీఎస్ అండ్ ఏఐఏవైఎస్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అత్యంత కీలకమైనదని, మేధావులతో కూడిన అనేక కమిటీలు దీన్ని ఏర్పరిచారన్నారు. కానీ పంచాయతీరాజ్ చట్టాలను అమలు చేయటంలో గ్రామ స్థాయి అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు విఫలమయ్యారని చరిత్ర తెలియజేస్తుందన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సర్పంచ్, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు పాలనను వారిని చేయనియ్యకుండా ఎమ్మెల్యేలు హైజాక్ చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నూకపెయ్యి కార్తీక్ పాల్గొన్నారు. హత్యాయత్నం కేసులో నిందితుడికి రిమాండ్ ఏలూరు టౌన్: హత్యాయత్నం కేసులో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు కత్తేపువీధికి చెందిన షేక్బాజీ గతంలో బావిశెట్టివారిపేటకు చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇరువరి మధ్య వివాదం తలెత్తడంతో ఆమెను వదిలివేశాడు. అయితే అత్త జయలక్ష్మిపై బాజీ కక్ష పెంచుకున్నాడు. ఈనెల 22న రాత్రివేళ జయలక్ష్మిపై బిర్లాభవన్ సెంటర్ వద్ద షేక్బాజీ ఆకస్మికంగా వెనుకవైపు నుంచి దాడి చేశాడు. తీవ్ర గాయాలైన జయలక్ష్మిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏలూరు వన్టౌన్ పోలీసులు షేక్బాజీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అతడ్ని గురువారం సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. నారాయణపురంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఉంగుటూరు: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులకు నారాయణపురం శ్రీ అరవింద శతజయంతి ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ టి కే విశ్వేశ్వరరావు తెలిపారు. ఈనెల 26వ తేదీలోగా విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 81251 55788 నంబర్లో సంప్రదించాలని కోరారు.