Funday
-
నూటొక్క దేవళాల శిల్పగిరి
∙సాహెబ్ జాన్, ఆలూరు రూరల్ఒకనాటి శిల్పగిరి గ్రామమే నేటి చిప్పగిరి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామంలో ఆనాటి కాలంలో నూటొక్క దేవాలయాలు ఉండేవి. నూటొక్క బావులు ఉండేవి. పురాతన ఆలయాలకు, చారిత్రక శిల్పకళా వైభవానికి నిలయంగా ఉండటంతో ఈ గ్రామానికి శిల్పగిరి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ పేరు చిప్పగిరిగా మారింది. ఆనాటి ఆలయాల్లో దాదాపు తొంభై శాతం కనుమరుగైపోగా, పది శాతం ఆలయాలు మాత్రమే ఇప్పటికి మిగిలి ఉన్నాయి.మిగిలి ఉన్న వాటిలో ఐదో శతాబ్ది నాటి దిగంబర జైన ఆలయం ఒకటి. ఈ ఆలయం ఆనాటి శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యంగా నేటికీ చెక్కు చెదరకుండా ఉంది.ఇక్కడి ఆలయాల్లో భోగేశ్వర ఆలయం ప్రసిద్ధమైనది. ఈ ఆలయంలో ప్రతి అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఏటా వేసవిలో చిప్పగిరి గ్రామంలో పర్యాటకుల హడావుడి కనిపిస్తుంటుంది. ఇక్కడి పురాతన ఆలయాలను, చారిత్రక నిర్మాణాలను తిలకించేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు.రాయల వంశానికి చెందిన గుండప్ప దేవర పదకొండో శతాబ్దంలో శిల్పగిరిని రాజధానిగా చేసుకుని, పరిపాలన సాగించాడు. ఆయన హయాంలోనే ఇక్కడ చెన్నకేశవ స్వామివారి ఆలయంతో పాటు మరో వంద ఆలయాలను నిర్మించారు. తాగునీటి కోసం నూటొక్క బావులు తవ్వించారు. గుండప్ప దేవర తదనంతరం రామరాయలు, బుక్కరాయలు పన్నెండో శతాబ్దిలో ఇక్కడ భోగేశ్వర ఆలయాన్ని నిర్మించారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా యాభై అడుగుల ఏకశిలా స్తంభాలతో రంగ మండపాన్ని నిర్మించారు. దీనినే ‘సభా సింహాసన కట్ట’ అంటారు.రామరాయలు, బుక్కరాయలు ఈ ప్రాంతంలో మరికొన్ని బావులను కూడా తవ్వించారు. తర్వాతి కాలంలో ఇక్కడ నీటి ఎద్దడి బాగా పెరిగింది. బావులలో నీరు ఇంకిపోయింది. గ్రామస్థులు చిప్పలతో నీళ్లు తోడుకునేవారు. అందువల్ల ప్రజలు చిప్పగిరిగా గ్రామానికి నామకరణం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి పాలన కొనసాగించలేక రామరాయలు, బుక్కరాయలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు. పల్లవుల జైనాలయంపల్లవ రాజులు ఐదో శతాబ్ది కాలంలో ఇక్కడ జైన ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో దేశ పర్యటనకు బయలుదేరిన పల్లవ రాజులు మార్గమధ్యంలో ఈ గ్రామ పరిసరాల్లో విడిచి చేసి, కొంతకాలం గడిపారు. అప్పట్లోనే వారు ఈ గ్రామ శివార్లలో ఉన్న కొండపై కోటను నిర్మించుకున్నారు. అక్కడే ఏకశిలతో దిగంబర జైన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. కాలక్రమంలో కోట దెబ్బతినగా, కోట గోడలు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి.విజయదాసుల కట్టకర్ణాటకకు చెందిన విజయదాసులు పద్నాలుగో శతాబ్దిలో మాన్వి జిల్లాలో తుంగభద్ర తీరాన ఉన్న చిలకలపర్వి గ్రామంలో జన్మించారు. కర్ణాటక సంగీత పితామహుడైన పురందరదాసుకు శిష్యుడు విజయదాసులు. ఆయన ధ్యాన గానాలలో నిమగ్నమై, దేశమంతటా సంచరించేవాడు. ఒకసారి ఆయన చిప్పగిరిలోని పురాతన బావిలో దైవచింతనలో ఉండగా, బావిలో ఆయనకు శ్రీకృష్ణుడి విగ్రహం దొరికింది. ఆయన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, రెండేళ్ల తర్వాత పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ ప్రతి ఏటా నవంబర్ నెలలో పదకొండు రోజుల పాటు విజయదాసుల కట్టలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి పురోహితులు ఈ ఆరాధనోత్సవాలకు తరలి వచ్చి హోమాలు, ప్రత్యేక పూజలు జరుపుతారు. వీటిని తిలకించడానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. -
ఫ్యాషన్ మోజా? ఉందిగా శ్రీజా!
శ్రీజాకు ఊహ తెలిసేనాటికే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్కి వెళ్లే వయసులోనే పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని నిశ్చయించుకుంది. అనుకున్నట్టుగానే ఫ్యాషన్ రంగంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక ఫ్యాషన్ మ్యాగజీన్స్లో పనిచేసింది. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్గా పాపులర్ అయిన మిథిలా పాల్కర్, మసాబా గుప్తా వంటి ప్రముఖులను కలసి స్టయిలింగ్ నేర్చుకుంది. ఇండివిడ్యువల్ పర్సనాలిటీని హైలైట్ చేసే ఆమె డిజైన్స్, స్టయిలింగ్ ఎంతోమంది పెళ్లికూతుర్లకు నచ్చింది. స్పెషల్ అకేషన్ ఏదైనా స్టయిలిస్ట్గా శ్రీజా ఉండాల్సిందే అనిపించుకుంది.కొన్ని నెలల్లోనే బొటిక్తో పాటు ‘డ్రేపింగ్ డ్రీమ్స్’ అనే వెడ్డింగ్ ఫ్యాషన్ సర్వీసెస్ను స్టార్ చేసింది. వివాహాది శుభకార్యాలకు పెళ్లికూతుర్లకు, అతిథులకు డ్రెస్ డిజైనింగ్, స్టయిలింగ్ చేస్తూ వెడ్డింగ్ స్పెషలిస్ట్గా పాపులర్ అయింది. దేశీ బ్రైడల్ దుస్తులకు పర్ఫెక్ట్ బ్రాండ్గా స్థిరపడింది. ఆ క్రియేటివ్ కంఫర్ట్కి సామాన్యులే కాదు సెలబ్రిటీలూ ముచ్చటపడ్డారు. మిథిలా పాల్కర్, శ్రియా పిల్గొంకర్, కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను, నిహారిక కొణిదెల, శ్రద్ధా శ్రీకాంత్, సయీ మంజ్రేకర్, హన్సిక, ఆలియా భట్ లాంటి వాళ్లెందరికో శ్రీజా స్టయిలిస్ట్గా పనిచేసింది.⇒ జెట్ స్పీడ్తో పరుగెట్టే ఫ్యాషన్తో పాటే.. తాను పరుగెడుతూ, పడిపోతూ, తిరిగి లేస్తూ.. బ్రైడల్ స్పెషలిస్ట్ట్ అనిపించుకుంది డిజైనర్, స్టయిలిస్ట్ శ్రీజా రాజ్గోపాల్. ఫ్యాషన్లపై మోజుగల సెలబ్రిటీలు ఆమె డిజైన్లకు ఫిదా అవుతున్నారు. తన ప్రతిభతో ఫ్యాషన్లో మ్యాజిక్ చేసిన ఆమె గురించిన కొన్ని విషయాలు..⇒ పెళ్లిలో పెళ్లికూతురు గిల్టు నగలు ధరించకూడదని చాలామంది నమ్ముతుంటారు. వారి నమ్మకాన్ని గౌరవిస్తూ, ఉన్నవాటితోనే పెళ్లికూతుర్లను అందంగా చూపించా. అదే నా కెరీర్ గ్రోత్కు ఫ్లస్ అయింది. – శ్రీజా రాజ్గోపాల్ -
ఇంతటితో ఈ ప్రసారాలు..?!
ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ మొదలైంది. హ్యారీ ఎస్.ట్రూమన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కమ్యూనిస్టు దేశాల దురుద్దేశాలను బట్టబయలు చేసేందుకు ‘రేడియో ఫ్రీ యూరప్’ ప్రారంభమైంది. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యం కలిగి ఉన్న ఈ రెండు అమెరికన్ రేడియో నెట్వర్క్లు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ‘డబ్బు దండగ’ అనే ఒకే ఒక కారణంతో మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడెనిమిది దశాబ్దాల పాటు ఖండాంతర శ్రోతల్ని జాగృతం చేసిన ప్రసారాలు ఆగిపోవటం అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రేడియో అభిమానుల మనసు మోగబోవటమే!అమెరికా దగ్గర సొంత రేడియో లేని టైమ్లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ దగ్గర రాబర్ట్ షేర్వుడ్ ఉన్నాడు. షేర్వుడ్ నాటక రచయిత. రూజ్వెల్ట్కు స్పీచ్ రైటర్. ‘‘మన చేతిలో కనుక ఒక రేడియో ఉంటే, ప్రపంచం మన మాట వింటుంది. మాటకు ఆలోచనను అంటించి సరిహద్దులను దాటిస్తే శతఘ్నిలా దూసుకెళ్లి దుర్బుద్ధి దేశాల తప్పుడు సమాచారాలను తుదముట్టిస్తుంది..’’ అన్నాడు షేర్వుడ్ ఓరోజు, రూజ్వెల్ట్తో!షేర్వుడ్ ఆ మాట అనే నాటికే నెదర్లాండ్స్ దగ్గర రేడియో ఉంది. సోవియెట్ యూనియన్ దగ్గర రేడియో ఉంది. ఇటలీ, బ్రిటన్ల దగ్గరా రేడియోలు ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీల్లోనూ ఉన్నాయి. లేనిది ఒక్క అమెరికా దగ్గరే! ‘‘మనకూ ఒక రేడియో ఉండాలి మిస్టర్ ప్రెసిడెంట్...’’ అని 1939లో రాబర్ట్ షేర్వుడ్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్తో అనటానికి ముందు 1938లో, 1937లో కూడా అమెరికాకు ఒక అధికారిక రేడియో అవసరం అనే ప్రతిపాదనలు యు.ఎస్. ప్రతినిధుల సభ నుంచి వచ్చాయి. అయితే రేడియో ఏర్పాటుకు రూజ్వెల్ట్ అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. షేర్వుడ్ చెప్పాక కూడా, రెండేళ్ల సమయం తీసుకుని 1941 మధ్యలో యు.ఎస్. ఫారిన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఎఫ్.ఐ.ఎస్.)ను నెలకొల్పి, షేర్వుడ్ను తొలి డైరెక్టర్ని చేశారు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించిన రెండు నెలల లోపే ఎఫ్.ఐ.ఎస్. ఆధ్వర్యంలో అమెరికా అధికారిక రేడియో ప్రసారాలు తొలిసారి జర్మన్ భాషలో ఐరోపా లక్ష్యంగా మొదలయ్యాయి. అనౌన్సర్ విలియమ్ హర్లాన్ హేల్ మాట్లాడుతూ, ‘‘ఇక నుంచి రోజూ మేము అమెరికా గురించి, యుద్ధం గురించి మీతో మాట్లాడతాం. వార్తలు మాకు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. కానీ మీకు నిజమే చెబుతాము...’’ అని అన్నారు. అలా 83 ఏళ్ల క్రితం 1942 ఫిబ్రవరి 1న వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా మొదలైందే ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ రేడియో నెట్వర్క్. దీనినే అమెరికా ఇప్పుడు మూసేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేడియో ఫ్రీ యూరప్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కట్టేయబోతున్న రెండో రేడియో.. ‘రేడియో ఫ్రీ యూరప్ / రేడియో లిబర్టీ’. ప్రస్తుతం చెక్ రిపబ్లిక్లోని ప్రేగ్లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఈ అమెరికా అధికారిక రేడియో నెట్ వర్క్– రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా నియంత్రణలోకి వచ్చిన జర్మనీలోని మ్యూనిక్లో – 1950 జూలై 4న చెకోస్లోవియాకు వార్తలను ప్రసారం చేయటంతో మొదలైంది. కమ్యూనిస్టు దేశాలలోని మీడియా నిష్పాక్షికంగా ఉండదని భావించిన అమెరికా.. తూర్పు ఐరోపా, సోవియట్ యూనియన్ ప్రజలకు రాజకీయ వాస్తవాలను అందించే ఉద్దేశంతో ఈ రేడియో నెట్వర్క్ను ప్రారంభించింది.సోవియెట్ ఆధిపత్య దేశాలలోని కోట్లమంది శ్రోతల్ని 15 భాషల్లో తన ప్రసారాలతో అలరించింది. అయితే కొన్ని కమ్యూనిస్టు దేశాలు ప్రజలకు ఆ ప్రసారాలు చేరకుండా నిరోధించటానికి ప్రయత్నించాయి. అంతేకాదు, ఆర్.ఎఫ్.ఇ. సిబ్బంది కొందరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆర్.ఎఫ్.ఇ. కార్యాలయంపై ఒకసారి బాంబు దాడి కూడా జరిగింది. ఒక్క ఆంగ్లంలో మాత్రం ప్రసారాలు ఇవ్వని (ఇవ్వటం అనవసరం అనుకుని) ‘రేడియో ఫ్రీ యూరప్’ ప్రస్తుతం 30 స్థానిక భాషలలో 20కి పైగా ఐరోపా దేశాలకు ఆలకింపుగా ఉంది. 75 ఏళ్లుగా నిరవధికంగా నడుస్తున్న ఈ నెట్వర్క్ కూడా ‘ఇంత ఖర్చా!’ అనే ఆశ్చర్యంతో సమాప్తం కానుంది. వేలమంది సిబ్బంది, వందల రేడియో స్టేషన్లతో నడుస్తున్న ఈ రెండు ఆడియో మీడియా హౌస్ల నిర్వహణకు ఏడాదికి అవుతున్న ఖర్చు కనీసం 100 కోట్ల డాలర్లకు పైమాటేనని అంచనా వేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) తక్షణం వీటిని మూసివేయాలని అమెరికా అధ్యక్షుడికి సిఫారసు చేసే ఉద్దేశంలో ఉంది. ట్రంప్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ‘డోజ్’ చీఫ్ ఎవరో తెలుసు కదా! అపర కుబేరుడు ఎలాన్ మస్క్. -
పెళ్లెప్పుడంటే...?
సాయిపల్లవి తన వ్యక్తిగత విషయాలను మీడియాతో చాలా అరుదుగా మాత్రమే పంచుకుంటుంది. పెళ్లెప్పుడని ఆమెను అడిగితే, కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే సాయిపల్లవి ఇష్టాయిష్టాలు, ఆమె జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..⇒ తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని విడిచి పెట్టడం సాయిపల్లవికి ఇష్టం లేదు. పెళ్లి తర్వాత తనని అన్నీ విడిచి రమ్మని చెప్పే వారిని అసలు పెళ్లే చేసుకోనని ‘అస్ట్రో ఉలగం’ అనే తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.⇒ సాయిపల్లవిది బడగ గిరిజన కుటుంబం. ఆమె తల్లి రాధామణి సాయిబాబా భక్తురాలు. అందుకే, ఆమె పేరులో ‘సాయి’ అని చేర్చారు.⇒ డ్యాన్స్ అంటే పిచ్చి, కేవలం టీవీలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ డ్యాన్స్ వీడియోలను చూస్తూ డ్యాన్స్ నేర్చుకుంది. మెడిసిన్ చదువులో చేరడానికి ముందు ‘ధామ్ ధూమ్’, ‘కస్తూరిమాన్’ అనే తమిళ సినిమాల్లో నటించింది.⇒ మొదటిసారి టీ రుచి చూసింది ‘ప్రేమమ్’ సినిమా షూటింగ్ సెట్లోనే.. అప్పటి వరకు ఆమెకు టీ, కాఫీ అలవాటే లేదు. హీరోయిన్గా అదే ఆమె మొదటి సినిమా.⇒ భాష ఏదైనా తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలనే ఎంపిక చేసుకుంటారట సాయిపల్లవి.⇒ అసలైన అందం మనిషి మనసులో ఉంటుందని, రూ. 2 కోట్ల విలువైన బ్యూటీ ప్రోడక్ట్ యాడ్ను తిరస్కరించింది.⇒ బన్తో తయారుచేసే ఆహారం, కొబ్బరి నీళ్లు ఇష్టం. వంట వండటం, తోటపని, తేనెటీగల పెంపకం ఆమెకు ఇష్టమైన పనులు.⇒ దైవ భక్తి ఎక్కువ. తన తాతయ్య ఇచ్చిన రుద్రాక్ష మాలను ఎప్పుడూ చేతికి ధరిస్తుంది.⇒ సినిమాల్లోకి రాకముందు సాయిపల్లవి చేసిన ఓ డ్యాన్స్ వీడియో వైరల్గా మారింది. అప్పుడే ఇకపై శరీరం ఎక్కువగా కనిపించేలా దుస్తులు వేసుకోకూడదని నిర్ణయించుకుంది. అందుకే, ఎక్కువ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తుంది.⇒ ప్రస్తుతం బుజ్జితల్లిగా ‘తండేల్’ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తోంది. బాలీవుడ్లో ‘రామాయణ’ అనే పాన్ ఇండియా సినిమాలోనూ నటిస్తోంది. -
యాప్రే.. యాప్!
అరచేతిలో స్మార్ట్ఫోన్– స్మార్ట్ఫోన్ నిండా రకరకాల యాప్స్– యాప్స్తో కావలసినంత కాలక్షేపం, వినోదం మాత్రమే కాదు, అంతకు మించి కూడా! యాప్స్ మన రోజువారీ పనులను సునాయాసం చేస్తున్నాయి. యాప్స్ నగదు బదిలీని సులభతరం చేసి, వ్యాపార లావాదేవీలకు ఊతమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యాప్స్ వ్యాపారం శరవేగంగా దూసుకుపోతోంది. యాప్స్ వినియోగం, వాటి చుట్టూ జరుగుతున్న వ్యాపారం గురించి ఈ ప్రత్యేక కథనం.మనం వాడే స్మార్ట్ఫోన్ లో యాభైకి పైగా అప్లికేషన్స్ (యాప్స్) ఉంటాయి. వీటిని తరచు డౌన్ లోడ్ చేస్తుంటాం. అలా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎన్ని యాప్స్ డౌన్ లోడ్ అవుతున్నాయో మీకు తెలుసా? వీటిని రూపొందించిన కంపెనీలకు మొబైల్ యూజర్ల వల్ల ఎంత ఆదాయం సమకూరుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా యాప్ డౌన్ లోడ్స్లోను, మొబైల్లో యాప్స్పై యూజర్లు వెచ్చించే సమయంలోను భారత్ తొలి స్థానంలో ఉంది.మొబైల్ ప్రపంచంలో మనదే రికార్డు. గత ఏడాది 2,436 కోట్ల డౌన్ లోడ్స్తో భారత్ తొలి స్థానంలో నిలిచింది. గత ఏడాది మన భారతీయులు మొబైల్లో వెచ్చించిన సమయం 11,26,60,00,00,000 గంటలు. చదవడానికి కష్టంగా ఉంది కదూ! సింపుల్గా చెప్పాలంటే 1,12,660 కోట్ల గంటలు. మరో ఆసక్తికర విషయమే మంటే, డేటింగ్ యాప్ ‘బంబుల్’కు భారతీయులు కోట్లాది రూపాయలు గుమ్మరించారు. గత ఏడాది ప్రపంచంలోని యాప్ పబ్లిషర్స్, పబ్లిషర్ల ఆదాయం 12.5 శాతం పెరిగి, వారి ఆదాయం రూ.13.12 లక్షల కోట్లుగా నమోదైంది. యాప్స్ వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉన్నా, యాప్స్ ఆదాయంలో మాత్రం టాప్–20లో చోటు దక్కలేదు. గేమ్స్ యాప్స్ విషయంలో ప్రపంచస్థాయిలో ‘ఫ్రీ ఫైర్’ మొదటి స్థానంలో నిలిస్తే, భారత్లో ‘పబ్జీ’ అగ్రగామిగా ఉంది. ఫైనాన్స్ యాప్స్లో ‘ఫోన్ పే’ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మన దేశానికి చెందిన పేటీఎం 4వ స్థానంలోను, బజాజ్ ఫిన్సర్వ్ 10వ స్థానంలోనూ నిలిచాయి.అంతర్జాతీయంగా యాప్స్ తీరుప్రపంచవ్యాప్తంగా 2024లో 13,600 కోట్ల యాప్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే వృద్ధి 1 శాతం క్షీణించింది. ‘కోవిడ్–19’ కాలంలో యాప్ డౌన్ లోడ్స్ బాగా పెరిగాయి. లాక్డౌన్ల వల్ల జనాలు ఇంటి పట్టునే ఉండడంతో కాలక్షేపం కోసం మొబైల్స్లో మునిగిపోయారు. ఆ తర్వాత వరుసగా నాలుగేళ్లు డౌన్ లోడ్స్ తిరోగమనంలో పడ్డాయి. అయితే, ఫుడ్ అండ్ డ్రింక్స్ విభాగంలో ప్రపంచంలో మెక్డొనాల్డ్స్, జెప్టో, కేఎఫ్సీ, డామినోస్ పిజ్జా, జొమాటో టాప్–5లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా యాప్ డెవలపర్స్, పబ్లిషర్స్ ఆదాయం విషయంలో ఉత్తర అమెరికా, యూరప్లోని అగ్ర మార్కెట్లలో గణనీయమైన వృద్ధి నమోదైంది. అమెరికా రూ.4.5 లక్షల కోట్లతో ముందుంది. గేమ్స్ రాబడి వృద్ధి నాన్–గేమ్స్ కంటే వెనుకబడి ఉండటంతో ఆసియాలోని కొన్ని గేమింగ్–ఫోకస్డ్ మార్కెట్లు నామామాత్రపు వృద్ధిని చూస్తే, ఇంకొన్ని స్వల్పంగా క్షీణించాయి. ఇన్ యాప్ పర్చేజ్ మరింత సౌకర్యవంతంగా మారుతోంది. 2024లో ప్రధాన యాప్ విభాగాలైన సోషల్ మీడియా, ఓవర్ ది టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ , జనరల్ షాపింగ్ యాప్స్ స్వల్ప వృద్ధిని సాధించాయి. కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉప విభాగాలు కూడా వీటిని అనుసరించాయి. ఇందుకు విరుద్ధంగా యాంటీవైరస్, వీపీఎన్ (–32 శాతం) ఫైల్ మేనేజ్మెంట్ (–24 శాతం) సహా అనేక సాఫ్ట్వేర్ ఉప విభాగాలు క్షీణతను చవిచూశాయి. మన దేశంలో ఇలా..పోటీ దేశం అయిన అమెరికా కంటే మన దేశంలో యాప్ డౌన్ లోడ్స్ రెండింతలు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 2024లో మొత్తం 4.2 లక్షల కోట్ల గంటలు మొబైల్ను ఆస్వాదించారు. ఇందులో 1,12,660 కోట్ల గంటలు.. అంటే 26.8 శాతం వాటా భారత్దే! ఇది పోటీదేశాలైన ఇండోనేషియా, అమెరికాల కంటే మూడు రెట్లకుపైగా ఎక్కువ. 2023తో పోలిస్తే 2024 భారతీయులు 13,510 కోట్ల గంటలు అధికంగా మొబైల్లో మునిగిపోయారు. జనాలు టీవీలు చూడటం కంటే ఎక్కువసేపు మొబైల్లోనే గడుపుతున్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయులు విరివిగా ఉపయోగించి, యాప్ డెవలపర్లకు అధికాదాయం తెచ్చిపెట్టిన యాప్స్లో ఆన్ లైన్ డేటింగ్ యాప్ ‘బంబుల్’ తొలి స్థానంలో నిలవడం విశేషం.‘యూట్యూబ్’ రెండవ స్థానంలోను, లైవ్ వీడియో చాట్ యాప్ ‘చామెట్’ మూడవ స్థానంలోనూ నిలిచాయి. ఇక జనరేటివ్ ఏఐ యాప్స్ 2023లో 911 శాతం దూసుకెళ్లి, 7.5 కోట్ల డౌన్ లోడ్స్ నమోదు చేసుకున్నాయి. 2024లో 135 శాతం వృద్ధితో ఈ సంఖ్య 17.7 కోట్లకు చేరింది. చాట్జీపీటీ, గూగుల్ జెమినై, జీనియస్, వాట్ఆటో, ఆర్టిమైండ్ గత ఏడాది టాప్ యాప్స్గా నిలిచాయి. యాప్స్లో టాప్–5 ఉప విభాగాల డౌన్ లోడ్స్ 2023తో పోలిస్తే 2024లో క్షీణించాయి. అయితే కస్టమైజేషన్ , రింగ్టోన్ యాప్స్ 3 శాతం, సోషల్ మెసేజింగ్ 4 శాతం, డిజిటల్ వాలెట్స్, పీ2పీ పేమెంట్స్ 9 శాతం, బిజినెస్, ప్రొడక్టివిటీ 7 శాతం, టెలికం 6 శాతం, కన్జ్యూమర్ బ్యాంకింగ్ 3 శాతం, లా, గవర్నమెంట్ 23 శాతం, కాలింగ్, ఎస్ఎంఎస్ యాప్స్ 9 శాతం వృద్ధి చెందాయి. ‘గేమ్’చేంజర్స్బిలియన్ డాలర్ క్లబ్లో గత ఏడాది అంతర్జాతీయంగా 11 గేమ్స్, 6 యాప్స్ చేరాయి. గేమ్స్లో లాస్ట్ వార్, వైట్ఔట్ సర్వైవల్, డంజన్ అండ్ ఫైటర్, బ్రాల్ స్టార్స్తోపాటు నాన్ –గేమ్స్లో వీటీవీ ఈ క్లబ్లో కొత్తగా చోటు సంపాదించాయి. మొబైల్ గేమ్స్ ద్వారా డెవలపర్లకు రూ.7,07,875 కోట్ల ఆదాయం సమకూరింది. 2023తో పోలిస్తే ఇది 4 శాతం పెరిగింది. 2023తో పోలిస్తే డౌన్ లోడ్స్ 6 శాతం తగ్గి 4,960 కోట్లుగా ఉన్నాయి. మెక్సికో, భారత్, థాయ్లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు వేగానికి ఆజ్యం పోశాయి. ప్రతి వారం సుమారు 100 కోట్ల డౌన్ లోడ్స్ కాగా, యూజర్లు ఇన్ యాప్ పర్చేజ్ కింద రూ.13,475 కోట్లు ఖర్చు చేశారు.సిమ్యులేషన్ , పజిల్, ఆరేక్డ్, లైఫ్స్టైల్, టేబుల్టాప్ టాప్–5 మొబైల్ గేమ్ విభాగాలుగా నిలిచాయి. డౌన్ లోడ్స్లో సబ్వే సర్ఫర్స్ గేమ్, ఆదాయంలో లాస్ట్ వార్ సర్వైవల్ గేమ్ టాప్లో ఉన్నాయి. మన దేశంలో డౌన్ లోడ్స్లో ఇండియన్ వెహికిల్స్ సిమ్యులేటర్ 3డీ, ఆదాయంలో ఫ్రీ ఫైర్ అగ్రస్థానంలో నిలిచాయి. కొత్తగా విడుదలైన గేమ్స్లో భారత్లో శ్రీ రామ్ మందిర్ గేమ్ తొలి స్థానంలో దూసుకెళుతోంది. సోషల్ మీడియా దూకుడుసోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్లు 2,37,410 కోట్ల గంటలు గడిపారు. 2023తో పోలిస్తే ఇది 6 శాతం పెరిగింది. మొబైల్స్లో గడిపిన మొత్తం సమయంలో సోషల్ మీడియా వాటా ఏకంగా 56 శాతం దాటింది. సోషల్ మెసేజింగ్కు 60,661 కోట్ల గంటల సమయం వెచ్చించారు.చాట్ జీపీటీ మూడంకెల వృద్ధిఇన్ యాప్ పర్చేజ్ రెవెన్యూ సాధించిన టాప్–20 యాప్ విభాగాల్లో చాట్ జీపీటీ ఏకంగా మూడంకెల వృద్ధి (209 శాతం) సాధించి, రూ.9,362.5 కోట్ల ఆదాయం పొందింది. బుక్స్, కామిక్స్ (9 శాతం) మినహా మిగిలిన ఇతర విభాగాలన్నీ రెండంకెల వృద్ధితో దూసుకెళ్తున్నాయి. 31 శాతం వృద్ధితో రూ.1,04,825 కోట్లతో ఫిల్మ్, టెలివిజన్ తొలి స్థానం కైవసం చేసుకుంది. 29 శాతం ఎగసి రూ.1,02,891 కోట్లతో సోషల్ మీడియా, 13 శాతం దూసుకెళ్లి రూ.46,637 కోట్లతో మీడియా, ఎంటర్టైన్ మెంట్, డేటింగ్ విభాగాలు టాప్–3లో నిలిచాయి. ఆదాయపరంగా బుక్స్, కామిక్స్, మ్యూజిక్, పాడ్కాస్ట్ తర్వాతి వరుసలో ఉన్నాయి.ఏఐ చాట్బాట్స్ హవాగత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల ఏఐ చాట్బాట్స్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే 2024లో 63.5 కోట్ల డౌన్ లోడ్స్ పెరిగాయి. ఏఐ చాట్బాట్స్ అత్యధికంగా 112 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. యాప్స్లో సోషల్ మీడియా, సోషల్ మెసేజింగ్ తర్వాత 599 కోట్ల గంటలు అదనంగా వెచ్చించడంతో చాట్బాట్స్ మూడవ స్థానంలో ఉన్నాయి. ఏఐ చాట్బాట్స్ కోసం వెచ్చించిన సమయం 347 శాతం పెరిగి 772 కోట్ల గంటలు నమోదైంది.నాన్ –గేమ్స్ ఆదాయంఇన్ యాప్ పర్చేజ్ ఆదాయం నాన్గేమ్స్ విభాగాల్లో అంతర్జాతీయంగా గడిచిన పదేళ్లలో విపరీతంగా పెరిగింది. నాన్ గేమ్స్ ఆదాయం 2014లో రూ.30,625 కోట్ల నుంచి 2024లో రూ.6,05,500 కోట్లకుపైగా చేరుకుంది. 2023తో పోలిస్తే 2024లో 25 శాతం వృద్థితో రూ.1,19,875 కోట్ల అదనపు ఆదాయం పొందింది.⇒ 4.2 లక్షల కోట్ల గంటలు యాప్స్ గణాంకాలు 2024⇒ ప్రపంచ జనాలు మొబైల్లో వెచ్చించిన సమయం⇒ ప్రపంచ జనాలు యాప్స్తో గడిపిన సగటు సమయం 500 గంటలు⇒ ఒక్కొక్కరు మొబైల్తో వెచ్చించే సగటు సమయం 210 నిమిషాలు⇒ నిద్రలేవగానే మొబైల్తో గడిపే సగటు సమయం 13 నిమిషాలు⇒ప్రపంచ జనాలు రోజుకు సగటున వాడిన యాప్స్ సంఖ్య 7⇒ ప్రతి నిమిషానికి యాప్ డెవలపర్స్ ఆదాయం రూ. 2.49 కోట్లు⇒యాప్స్ డౌన్లోడ్స్ 13,600 కోట్లు⇒ప్రతి నిమిషానికి సగటు మొబైల్ డౌన్లోడ్స్ 2.58 లక్షలు⇒మొత్తం డౌన్లోడ్స్లో భారత్ వాటా 17.91 శాతం -
అల్లుడు యముడు!
అజిత్కుమార్ లండన్లో ఫార్మసిస్ట్. అతడి భార్య, ఆమె కుటుంబసభ్యులు హైదరాబాద్లో ఉంటారు. అతడు లండన్లో ఉంటూనే, హైదరాబాద్లో ఉంటున్న భార్య కుటుంబసభ్యులపై 2023లో విషప్రయోగం చేశాడు. విషప్రయోగానికి అతడి అత్త మరణించింది. అత్తవారి కుటుంబంలోని మరో ఐదుగురు అస్వస్థులయ్యారు. ఈ సంఘటనపై మియాపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. అజిత్పై ఇక్కడి కోర్టు అరెస్టు వారంట్ జారీ చేయడంతో ఇటీవల లండన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిని హైదరాబాద్ తీసుకురావడానికి సైబరాబాద్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.మియాపూర్ గోకుల్ప్లాట్స్కు చెందిన హనుమంతరావు, ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె డాక్టర్ శిరీషకు 2018 జూన్ 23న అజిత్కుమార్తో పెళ్లి జరిగింది. భార్యాభర్తలు లండన్లో స్థిరపడ్డారు. వారికి ఒక కూతురు పుట్టింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త వేధింపులపై శిరీష లండన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ లండన్లోనే వేర్వేరుగా ఉంటూ, అక్కడి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీంతో అజిత్ తన భార్యపైన, ఆమె కుటుంబసభ్యులపై కక్ష పెంచుకున్నాడు. వారందరినీ అంతంచేయాలని నిశ్చయించుకుని, 2023 ఫిబ్రవరిలో ఇక్కడకు వచ్చి వెళ్లాడు. తన వద్ద పనిచేసే వినోద్కుమార్కు ఈ పనిని పర్యవేక్షించే బాధ్యత అప్పగించి, మేలో అతడిని హైదరాబాద్ పంపాడు. అతడి ద్వారా నగరానికి చెందిన భవానీశంకర్, అశోక్, గోపీనాథ్లతో పాటు తన స్నేహితులను రంగంలోకి దించాడు.అత్తింటివారు ఉండే ఫ్లాట్స్ వాచ్మెన్ కొడుకు రమేష్కు డబ్బు ముట్టజెప్పి, అతడి ద్వారా అత్తింటివారి కదలికలను తెలుసుకోసాగాడు. శిరీష సోదరుడు పూర్ణేందర్కు 2023 జూన్లో పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లి కోసం శిరీష తన కూతురితో పాటు వచ్చింది. రమేష్ ద్వారా అజిత్ ఈ సంగతి తెలుసుకుని, అత్తింటివారిని అంతం చేయడానికి ఇదే అదనుగా భావించాడు. అందరూ పెళ్లి హడావుడిలో ఉండగా, విషపు ఇంజెక్షన్లతో వారిని చంపాలనుకున్నాడు. శిరీష వాళ్ల పైఫ్లాట్లో ఉండే పూర్ణచందర్ను తనవైపు తిప్పుకున్న అజిత్, అతడి సాయంతో ఈ పథకాన్ని అమలు చేయాలనుకున్నాడు. భవానీశంకర్, అశోక్, గోపీనాథ్లకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి, జూన్ 25న తన అత్తవారింటికి పంపాడు. ఈ పథకం పారకపోవడంతో పథకాన్ని మార్చుకున్నాడు. ఫార్మసిస్టుగా తన పరిజ్ఞానంతో స్లోపాయిజనింగ్ చేయాలని భావించాడు.అజిత్ సోదరి నగరంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. తన స్కూలు అవసరాల కోసం కొన్న ఆర్సెనిక్ను ఆమె ద్వారానే భవానీశంకర్ తదితరులకు అందేలా చేశాడు. అజిత్ సలహాపై ఈ ముగ్గురూ డెలివరీ బాయ్స్ అవతారమెత్తారు. ఆర్సెనిక్ కలిపిన పసుపు, కారం, మసాలా పొడులను శిరీష ఇంట్లోని వారికి అందించారు. పెళ్లి హడావుడిలో ఉన్న వాళ్లు వాటిని తీసుకుని, వంటల్లో వినియోగించారు. ఆ వంటకాలు తిన్న శిరీష, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరుడు, అతడి భార్య సహా ఆరుగురు అస్వస్థులై, ఆస్పత్రి పాలయ్యారు. వారిలో శిరీష తల్లి ఉమామహేశ్వరి చికిత్స పొందుతూ జూలై 5న మరణించింది. ఎందరు వైద్యులను సంప్రదించినా, ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఎవరూ ఏం జరిగిందో గుర్తించలేకపోయారు.పూర్ణేందర్ తన భార్యతో కలసి 2023 ఆగస్టు మొదటివారంలో ఆమె స్వస్థలమైన గుంటూరు వెళ్లాడు. అక్కడ ఒక సీనియర్ వైద్యుడిని ఈ దంపతులు సంప్రదించారు. దాదాపు నలభై ఏళ్ల కిందట ఇలాంటి రోగులకు చికిత్స చేసిన ఆయన, వారిపై ఆర్సెనిక్ పాయిజనింగ్ జరిగినట్లు గుర్తించారు. ఆయన సూచనపై జరిపించిన పరీక్షల్లో విషప్రయోగం జరిగినట్లు తేలడంతో, వారికి చికిత్స చేశారు. శిరీష దీని వెనుక తన భర్త అజిత్ పాత్రను అనుమానించి, 2023 ఆగస్టు 17న మియాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి, ప్రాథమిక ఆధారాలను అందించింది. శిరీష కుటుంబం నివసించే అపార్ట్మెంట్ సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, వాటిలో బయటపడ్డ అంశాల ఆధారంగా వాచ్మన్ కొడుకు రమేష్ను అదుపులోకి తీసుకుని, విచారించారు. అతడి ద్వారా గుట్టు బయటపడటంతో పూర్ణచందర్, భవానీశంకర్, అశోక్, గోపీనాథ్లను అరెస్టు చేశారు. తన అత్తింటివారంతా చనిపోలేదని తెలుసుకున్న అజిత్కుమార్ మరో కుట్రకు తెరలేపాడు. దీని అమలుకు వినోద్ను మళ్లీ హైదరాబాద్కు పంపాడు. ఇది తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో అజిత్ సహా మొత్తం పది మంది నిందితులు ఉన్నట్లు తేల్చారు. ఈ కేసులో 2023 ఆగస్టులోనే తొమ్మిది మందిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. అజిత్ అరెస్టు కోసం కోర్టు ఉత్తర్వులు పొంది, కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా లండన్ పోలీసులను సంప్రదించారు. కేసు వివరాలను, అజిత్పై అరెస్టు వారంట్ను వారికి పంపారు. ఈ ఏడాది జనవరి రెండోవారంలో లండన్ పోలీసులు అజిత్ను అరెస్టు చేశారు. అజిత్ తన బెయిల్ కోసం లండన్ కోర్టులో వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం లండన్ జైలులో ఉన్న అతడిని ఇక్కడకు తీసుకురావడానికి సైబరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ∙శ్రీరంగం కామేష్ -
పన్నుపోటుండదు దేనికీ లోటుండదు
ఆ దేశాలలో ప్రజలకు ఆదాయపు ‘పన్ను’పోటు ఉండదు.అయినా అభివృద్ధికి, సంక్షేమానికి లోటు ఉండదు.పన్నులు లేకున్నా, ఖజానా నిండుగానే ఉంటుంది.అన్ని వర్గాల పౌరులకు సామాజిక భద్రత ఉంటుంది.పన్యాల జగన్నాథదాసుమన దేశంలో కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ఏటేటా బడ్జెట్ ప్రవేశపెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీల్లో బడ్జెట్ ప్రవేశపెడతాయి. బడ్జెట్ వెలువడటానికి కొన్నాళ్ల ముందు నుంచి ‘పన్ను’పోటుపై జనాల్లో భయాలు మొదలవుతాయి. బడ్జెట్ వెలువడిన కొన్నాళ్ల వరకు ‘పన్ను’పోటుకు గురైన వర్గాలకు సలపరింత తప్పదు. రకరకాల వస్తువుల కొనుగోళ్ల మీద, అమ్మకాల మీద, రకరకాల సేవల మీద, ఆస్తుల లావాదేవీల మీద ‘పన్ను’పోటు తప్పదు. వీటికి తోడు ఆదాయం మీద కూడా ‘పన్ను’ చెల్లించాల్సి రావడం చాలామందిని బాధించే విషయం. భారత్ సహా పలుదేశాలు జనాల నుంచి ‘పన్ను’లూడగొడుతుంటే, అసలు ఆదాయపు పన్ను లేని దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ‘పన్ను’పోటు బెడదలేని ఆ దేశాల గురించి తెలుసుకుందాం.‘పన్ను’పోటు గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి; చాలా వెటకారాలు ఉన్నాయి; ‘పన్ను’పోటు ఆవశ్యకతను బోధించే ఉపదేశాలు కూడా ఉన్నాయి. ‘ఈ ప్రపంచంలో నిశ్చయమైనవేవీ లేవు; పన్నులు, మరణం తప్ప’ అన్నాడు అమెరికన్ రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞశాలి బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఏటా బడ్జెట్ వచ్చేటప్పుడల్లా ఈ సంగతి జనాలకు బాగానే అర్థమవుతూ ఉంటుంది.‘రాజకీయ నాయకుల నిన్నటి వాగ్దానాలే నేటి పన్నులు’ అన్నాడు కెనడా మాజీ ప్రధాని విలియమ్ లైయన్ మెకంజీ కింగ్. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఊరించి, అరచేతిలో వైకుంఠాన్ని చూపించే నాయకులు అన్నిచోట్లా ఉంటారు. వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే, ‘పన్ను’లూడగొట్టి మరీ పరిపాలిస్తారు. ప్రపంచంలో ‘పన్ను’పోటుతో విలవిలలాడే దేశాలు ఎక్కువగానే ఉన్నా, అసలు ‘పన్ను’పోటు లేని దేశాలు ఈ ప్రపంచంలో ఉండటం విశేషం. వాటిలో కొన్ని దేశాలు ఆర్థికాభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుండటం ఇంకా విశేషం. ప్రజల ఆదాయం మీద కన్నేసి, దాని మీద పన్ను వేయకుండా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయంటే, ఎంత విడ్డూరం!ఆదాయపు పన్నులేని దేశాలుఆదాయపు పన్నులేని దేశాల్లో కొన్ని ప్రముఖ దేశాలు ఉన్నాయి. ఇంకొన్ని చిన్నా చితకా అనామక దేశాలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్నులేని దేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలను చెప్పుకోవాలి. గల్ఫ్లోని చాలా దేశాలు ప్రజల ఆదాయంపై పన్నులు విధించవు. వాటిలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతర్, ఒమన్, బహ్రెయిన్ దేశాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని కేమన్ ఐలండ్స్, బెర్ముడా, బహామాస్, ఆంగ్విలా, సెయింట్ కిట్స్ అండ్ నీవిస్, బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్, టర్క్స్ అండ్ కేకోస్, ఆంటిగ్వా అండ్ బార్బుడా, సెయింట్ బార్తెలమీ దేశాలు; ఆసియాలోని బ్రూనై, ఉత్తర కొరియా దేశాలు; యూరోప్లోని వాటికన్ సిటీ, మొనాకో దేశాలు; ఒషియానా ప్రాంతంలోని వాలిస్ అండ్ ఫుటునా, వనువాటు, నౌరు దేశాలలోని ప్రజలకు ఆదాయంపై ఎలాంటి పన్నుపోటూ ఉండదు.‘పన్ను’పోటు లేని సంక్షేమంప్రభుత్వ ఆదాయానికి పన్నులే కీలకమని; పన్నుల రాబడి లేకుండా దేశ ఆర్థిక పురోగతి సాధ్యం కాదని; అభివృద్ధి పనులు చేపట్టాలన్నా; సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా; ప్రజల నుంచి పన్నులు వసూలు చేయక తప్పదని చాలా ప్రభుత్వాలు చెబుతుంటాయి. ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకపోయినా, అభివృద్ధిలో ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్న దేశాల్లో గల్ఫ్ దేశాలే ముందు వరుసలో నిలుస్తాయి. ఈ దేశాలు ఖజానాకు పన్నుల రాబడి లేకున్నా, అవి ఎలా అభివృద్ధి సాధిస్తున్నాయో, భారీ స్థాయిలో సామాజిక సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తున్నాయో చూద్దాం.బహ్రెయిన్: గల్ఫ్ ప్రాంతంలో చమురు నిల్వలను గుర్తించిన తొలి దేశాల్లో బహ్రెయిన్ ఒకటి. చమురు ఎగుమతుల ఆదాయంతో ఈ దేశం సుసంపన్న దేశంగా మారింది. చమురు వ్యాపారాన్ని ఇక్కడి ప్రభుత్వమే పూర్తిగా నియంత్రిస్తుంది. ఇబ్బడి ముబ్బడిగా వచ్చే చమురు ఎగుమతుల ఆదాయాన్ని పౌరుల సంక్షేమం కోసం వినియోగిస్తుంది. బహ్రెయిన్ ప్రభుత్వం తన పౌరులకు, వారి పిల్లలకు విద్య, వైద్యం, గృహ వసతి, వృద్ధులకు సామాజిక భద్రత, అంగవైకల్యం లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి పునరావాసం వంటి సౌకర్యాలను పూర్తి ఉచితంగా కల్పిస్తోంది. ఇతర దేశాల వారు ఇక్కడకు ఉద్యోగాల కోసం వస్తుంటారు. విదేశీయులు ఎవరైనా ఇక్కడ శాశ్వత నివాస హక్కును పొందాలనుకుంటే, వారు ఇక్కడ స్థిరాస్తుల్లో 50 వేల దినార్లు (రూ.1.15 కోట్లు) లేదా వ్యాపారాల్లో లక్ష దినార్లు (రూ.2.30 కోట్లు) పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.కువైట్: కువైట్ ప్రభుత్వ ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. కువైట్లో వ్యాపారాలు సాగిస్తున్న విదేశీ కంపెనీల ద్వారా కూడా ఇక్కడి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకుండానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. కువైట్ ప్రభుత్వం తన పౌరులకు అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పిస్తోంది. విదేశాల్లో చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడితే, ప్రభుత్వమే ఆ ఖర్చులను భరిస్తుంది. తక్కువ ఆదాయం ఉన్నవారికి చౌక ధరలకు ఇళ్లు, సొంత వ్యాపారాలు చేసుకోవాలనుకునే వికలాంగులకు తక్కువ వడ్డీ రుణాలు, పేదలకు ఆర్థిక సహాయం సహా పలురకాల సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది.ఒమన్: ఒమన్ ప్రభుత్వానికి కూడా చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. తీర ప్రాంతం ఉండటంతో మత్స్య సంపద ద్వారా కూడా కొద్దిపాటి ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుంది. పౌరులపై ఆదాయపు పన్ను విధించకపోయినా, ఒమన్ ప్రభుత్వం పలు సంక్షేమ, సామాజిక భద్రత కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. ఒమన్ ప్రభుత్వం తన పౌరులందరికీ ఉచిత వైద్యం కల్పిస్తోంది. కంటిచూపు సమస్యలు ఉన్నవారికి ఉచిత ప్రజారవాణా కల్పిస్తోంది. శారీరక వైకల్యాలు ఉన్నవారికి ఉచితంగా కృత్రిమ అవయవాలను అందిస్తోంది. ఉన్నత విద్య, పరిశోధనలు కొనసాగించే విద్యార్థులకు స్కాలర్షిప్లు సహా పౌరులకు పలు సౌకర్యాలను అందిస్తోంది.ఖతర్: మిగిలిన గల్ఫ్ దేశాల మాదిరిగానే ఖరత్ ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. ప్రజలపై ఆదాయపు పన్ను భారం మోపకున్నా, ఖతర్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గల దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఖతర్ ప్రభుత్వం అమ్మకపు పన్ను, విదేశీ కంపెనీల నుంచి ఇతర పన్నులు కూడా వసూలు చేయదు. అయినప్పటికీ పౌరులకు గరిష్ఠ స్థాయిలో సకల సౌకర్యాలను సమకూరుస్తోంది.ఖతర్ ప్రభుత్వం తన పౌరులకు విద్య, వైద్యం, సామాజిక భద్రత సేవలను ఉచితంగా కల్పిస్తోంది. వితంతువులకు, విడాకులు పొందిన మహిళలకు, పిల్లలకు పలు సేవలను ఉచితంగా అందిస్తోంది. యువకులు ఏర్పాటు చేసుకునే సాంస్కృతిక వినోద సంఘాలకు ప్రభుత్వం నిధులు చెల్లిస్తోంది. అలాగే పౌరుల గృహావసరాలకు ఉచిత విద్యుత్తు, ఇళ్లు కట్టుకోవడానికి ఉచితంగా స్థలాలను కూడా సమకూరుస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏడు ఎమిరేట్స్ ఉన్నాయి. చమురు ఎగుమతులు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయినా, పర్యాటకం, పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా కూడా భారీగానే ఆదాయం ఉంటుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకపోయినా, అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగించగలుగుతోంది. యూఏఈ ప్రభుత్వం పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయదు గాని, కార్పొరేట్ సంస్థల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేస్తుంది.యుఏఈలోని ఏడు ఎమిరేట్స్లో అక్కడి ప్రభుత్వం 47 ఫ్రీ ట్రేడ్ జోన్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకునే విదేశీ సంస్థలకు భారీగా పన్ను రాయితీలు కూడా ఇస్తోంది. యూఏఈ ప్రభుత్వం తన పౌరుల్లో అర్హులకు ఉచితంగా ఇళ్లు ఇస్తోంది. అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు భృతి, ఉచిత వసతి, తక్కువ ఆదాయం ఉన్న పౌరులకు, వృద్ధులకు పలు సామాజిక భద్రత పథకాలను అమలు చేస్తోంది.పౌరుల్లో 45 ఏళ్ల వయసు పైబడిన నిరుద్యోగులకు ప్రతి నెలా 5 వేల దినార్లు (సుమారు రూ.1.18 లక్షలు), ఇంటి అలవెన్సు 2500 దినార్లు (సుమారు రూ.59 వేలు) చెల్లిస్తోంది. యూనివర్సిటీల్లో చదువుకునే మెరిట్ విద్యార్థులకు నెలకు 3200 దినార్లు (సుమారు రూ.75 వేలు) అలవెన్స్ చెల్లిస్తోంది.సౌదీ అరేబియా: గల్ఫ్లోని అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న దేశం కూడా ఇదే! సౌదీ ఆదాయంలో చమురు ఎగుమతులదే సింహభాగం అయినా, పర్యాటకం, విద్యుదుత్పాదన, టెలికం, పారిశ్రామిక విస్తరణల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. ముస్లింల పవిత్ర క్షేత్రాలైన మక్కా, మదీనాలు సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వీటిని దర్శించుకోవడానికి ఏటా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఇతర విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలోనే వస్తుంటారు.సౌదీ అరేబియా తన పౌరులకు భారీ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఉచితంగా మందులు సహా అన్ని స్థాయుల్లోనూ ఉచిత వైద్యసేవలను అందిస్తోంది. హైస్కూలు స్థాయి వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తోంది. ఉన్నత విద్య కోసం సౌదీలో ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. అవి ఫీజులు వసూలు చేస్తాయి. అయితే, పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడిచే యూనివర్సిటీల్లో మాత్రం ఉన్నత విద్య కూడా ఉచితమే! వీటిలో చదువుకునే మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్లు కూడా చెల్లిస్తోంది.సౌదీ ప్రభుత్వం పౌరులకు ఉచితంగా ఇళ్ల స్థలాలను, నిర్మించిన ఇళ్లను కూడా అందిస్తోంది. రానున్న ఐదేళ్లల్లో పౌరులందరికీ ఉచిత ఇళ్లు సమకూర్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, భారీస్థాయిలో గృహనిర్మాణాలను కొనసాగిస్తోంది. ఇంతే కాకుండా, వృద్ధులకు, నిరుద్యోగులకు కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.ఉత్తర కొరియా రూటే సెపరేటు!పౌరులపై కొన్ని దేశాలు ఆదాయపు పన్ను విధించకపోయినా, ఇతరేతర పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. ప్రపంచంలోని మిగిలిన దేశాలన్నీ ఒక ఎత్తయితే, ఉత్తర కొరియా రూటే సెపరేటు! ఉత్తర కొరియా ప్రభుత్వం ఆదాయపు పన్నునే కాదు, అన్ని రకాల పన్నులనూ 1974లోనే రద్దు చేసింది. నరకానికి నకలుగా పేరుమోసిన ఉత్తర కొరియాలో పౌరులకు ‘పన్ను’పోటు లేదు గాని, ప్రభుత్వం కోరుకున్నప్పుడు పౌరులు ఉచితంగా సేవలందించాల్సి ఉంటుంది. అణ్వాయుధాల తయారీలోను, క్షిపణి ప్రయోగాల్లోను తలమునకలుగా ఉంటూ తరచు వార్తలకెక్కే ఉత్తర కొరియాలో ప్రజాసంక్షేమం మృగ్యం.మన దేశంలో కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ఏటేటా బడ్జెట్ ప్రవేశపెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీల్లో బడ్జెట్ ప్రవేశపెడతాయి. బడ్జెట్ వెలువడటానికి కొన్నాళ్ల ముందు నుంచి ‘పన్ను’పోటుపై జనాల్లో భయాలు మొదలవుతాయి. బడ్జెట్ వెలువడిన కొన్నాళ్ల వరకు ‘పన్ను’పోటుకు గురైన వర్గాలకు సలపరింత తప్పదు. రకరకాల వస్తువుల కొనుగోళ్ల మీద, అమ్మకాల మీద, రకరకాల సేవల మీద, ఆస్తుల లావాదేవీల మీద ‘పన్ను’పోటు తప్పదు. వీటికి తోడు ఆదాయం మీద కూడా ‘పన్ను’ చెల్లించాల్సి రావడం చాలామందిని బాధించే విషయం. భారత్ సహా పలుదేశాలు జనాల నుంచి ‘పన్ను’లూడగొడుతుంటే, అసలు ఆదాయపు పన్ను లేని దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ‘పన్ను’పోటు బెడదలేని ఆ దేశాల గురించి తెలుసుకుందాం.‘పన్ను’పోటు గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి; చాలా వెటకారాలు ఉన్నాయి; ‘పన్ను’పోటు ఆవశ్యకతను బోధించే ఉపదేశాలు కూడా ఉన్నాయి. ‘ఈ ప్రపంచంలో నిశ్చయమైనవేవీ లేవు; పన్నులు, మరణం తప్ప’ అన్నాడు అమెరికన్ రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞశాలి బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఏటా బడ్జెట్ వచ్చేటప్పుడల్లా ఈ సంగతి జనాలకు బాగానే అర్థమవుతూ ఉంటుంది.‘రాజకీయ నాయకుల నిన్నటి వాగ్దానాలే నేటి పన్నులు’ అన్నాడు కెనడా మాజీ ప్రధాని విలియమ్ లైయన్ మెకంజీ కింగ్. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఊరించి, అరచేతిలో వైకుంఠాన్ని చూపించే నాయకులు అన్నిచోట్లా ఉంటారు. వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే, ‘పన్ను’లూడగొట్టి మరీ పరిపాలిస్తారు. ప్రపంచంలో ‘పన్ను’పోటుతో విలవిలలాడే దేశాలు ఎక్కువగానే ఉన్నా, అసలు ‘పన్ను’పోటు లేని దేశాలు ఈ ప్రపంచంలో ఉండటం విశేషం. వాటిలో కొన్ని దేశాలు ఆర్థికాభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుండటం ఇంకా విశేషం. ప్రజల ఆదాయం మీద కన్నేసి, దాని మీద పన్ను వేయకుండా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయంటే, ఎంత విడ్డూరం!ఆదాయపు పన్నులేని దేశాలుఆదాయపు పన్నులేని దేశాల్లో కొన్ని ప్రముఖ దేశాలు ఉన్నాయి. ఇంకొన్ని చిన్నా చితకా అనామక దేశాలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్నులేని దేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలను చెప్పుకోవాలి. గల్ఫ్లోని చాలా దేశాలు ప్రజల ఆదాయంపై పన్నులు విధించవు. వాటిలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతర్, ఒమన్, బహ్రెయిన్ దేశాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని కేమన్ ఐలండ్స్, బెర్ముడా, బహామాస్, ఆంగ్విలా, సెయింట్ కిట్స్ అండ్ నీవిస్, బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్, టర్క్స్ అండ్ కేకోస్, ఆంటిగ్వా అండ్ బార్బుడా, సెయింట్ బార్తెలమీ దేశాలు; ఆసియాలోని బ్రూనై, ఉత్తర కొరియా దేశాలు; యూరోప్లోని వాటికన్ సిటీ, మొనాకో దేశాలు; ఒషియానా ప్రాంతంలోని వాలిస్ అండ్ ఫుటునా, వనువాటు, నౌరు దేశాలలోని ప్రజలకు ఆదాయంపై ఎలాంటి పన్నుపోటూ ఉండదు.‘పన్ను’పోటు లేని సంక్షేమంప్రభుత్వ ఆదాయానికి పన్నులే కీలకమని; పన్నుల రాబడి లేకుండా దేశ ఆర్థిక పురోగతి సాధ్యం కాదని; అభివృద్ధి పనులు చేపట్టాలన్నా; సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా; ప్రజల నుంచి పన్నులు వసూలు చేయక తప్పదని చాలా ప్రభుత్వాలు చెబుతుంటాయి. ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకపోయినా, అభివృద్ధిలో ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్న దేశాల్లో గల్ఫ్ దేశాలే ముందు వరుసలో నిలుస్తాయి. ఈ దేశాలు ఖజానాకు పన్నుల రాబడి లేకున్నా, అవి ఎలా అభివృద్ధి సాధిస్తున్నాయో, భారీ స్థాయిలో సామాజిక సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తున్నాయో చూద్దాం.బహ్రెయిన్: గల్ఫ్ ప్రాంతంలో చమురు నిల్వలను గుర్తించిన తొలి దేశాల్లో బహ్రెయిన్ ఒకటి. చమురు ఎగుమతుల ఆదాయంతో ఈ దేశం సుసంపన్న దేశంగా మారింది. చమురు వ్యాపారాన్ని ఇక్కడి ప్రభుత్వమే పూర్తిగా నియంత్రిస్తుంది. ఇబ్బడి ముబ్బడిగా వచ్చే చమురు ఎగుమతుల ఆదాయాన్ని పౌరుల సంక్షేమం కోసం వినియోగిస్తుంది.బహ్రెయిన్ ప్రభుత్వం తన పౌరులకు, వారి పిల్లలకు విద్య, వైద్యం, గృహ వసతి, వృద్ధులకు సామాజిక భద్రత, అంగవైకల్యం లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి పునరావాసం వంటి సౌకర్యాలను పూర్తి ఉచితంగా కల్పిస్తోంది. ఇతర దేశాల వారు ఇక్కడకు ఉద్యోగాల కోసం వస్తుంటారు. విదేశీయులు ఎవరైనా ఇక్కడ శాశ్వత నివాస హక్కును పొందాలనుకుంటే, వారు ఇక్కడ స్థిరాస్తుల్లో 50 వేల దినార్లు (రూ.1.15 కోట్లు) లేదా వ్యాపారాల్లో లక్ష దినార్లు (రూ.2.30 కోట్లు) పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.కువైట్: కువైట్ ప్రభుత్వ ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. కువైట్లో వ్యాపారాలు సాగిస్తున్న విదేశీ కంపెనీల ద్వారా కూడా ఇక్కడి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకుండానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. కువైట్ ప్రభుత్వం తన పౌరులకు అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పిస్తోంది.విదేశాల్లో చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడితే, ప్రభుత్వమే ఆ ఖర్చులను భరిస్తుంది. తక్కువ ఆదాయం ఉన్నవారికి చౌక ధరలకు ఇళ్లు, సొంత వ్యాపారాలు చేసుకోవాలనుకునే వికలాంగులకు తక్కువ వడ్డీ రుణాలు, పేదలకు ఆర్థిక సహాయం సహా పలురకాల సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఒమన్: ఒమన్ ప్రభుత్వానికి కూడా చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే అత్యధికం. తీర ప్రాంతం ఉండటంతో మత్స్య సంపద ద్వారా కూడా కొద్దిపాటి ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుంది. పౌరులపై ఆదాయపు పన్ను విధించకపోయినా, ఒమన్ ప్రభుత్వం పలు సంక్షేమ, సామాజిక భద్రత కార్యక్రమాలను చేపట్టగలుగుతోంది. ఒమన్ ప్రభుత్వం తన పౌరులందరికీ ఉచిత వైద్యం కల్పిస్తోంది. కంటిచూపు సమస్యలు ఉన్నవారికి ఉచిత ప్రజారవాణా కల్పిస్తోంది.శారీరక వైకల్యాలు ఉన్నవారికి ఉచితంగా కృత్రిమ అవయవాలను అందిస్తోంది. ఉన్నత విద్య, పరిశోధనలు కొనసాగించే విద్యార్థులకు స్కాలర్షిప్లు సహా పౌరులకు పలు సౌకర్యాలను అందిస్తోంది. ఖతర్: మిగిలిన గల్ఫ్ దేశాల మాదిరిగానే ఖరత్ ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయంలో చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. ప్రజలపై ఆదాయపు పన్ను భారం మోపకున్నా, ఖతర్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గల దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఖతర్ ప్రభుత్వం అమ్మకపు పన్ను, విదేశీ కంపెనీల నుంచి ఇతర పన్నులు కూడా వసూలు చేయదు.అయినప్పటికీ పౌరులకు గరిష్ఠ స్థాయిలో సకల సౌకర్యాలను సమకూరుస్తోంది. ఖతర్ ప్రభుత్వం తన పౌరులకు విద్య, వైద్యం, సామాజిక భద్రత సేవలను ఉచితంగా కల్పిస్తోంది. వితంతువులకు, విడాకులు పొందిన మహిళలకు, పిల్లలకు పలు సేవలను ఉచితంగా అందిస్తోంది. యువకులు ఏర్పాటు చేసుకునే సాంస్కృతిక వినోద సంఘాలకు ప్రభుత్వం నిధులు చెల్లిస్తోంది. అలాగే పౌరుల గృహావసరాలకు ఉచిత విద్యుత్తు, ఇళ్లు కట్టుకోవడానికి ఉచితంగా స్థలాలను కూడా సమకూరుస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏడు ఎమిరేట్స్ ఉన్నాయి. చమురు ఎగుమతులు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయినా, పర్యాటకం, పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా కూడా భారీగానే ఆదాయం ఉంటుంది. అందువల్ల పౌరులపై ఆదాయపు పన్ను భారం మోపకపోయినా, అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగించగలుగుతోంది. యూఏఈ ప్రభుత్వం పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయదు గాని, కార్పొరేట్ సంస్థల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేస్తుంది.\యుఏఈలోని ఏడు ఎమిరేట్స్లో అక్కడి ప్రభుత్వం 47 ఫ్రీ ట్రేడ్ జోన్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకునే విదేశీ సంస్థలకు భారీగా పన్ను రాయితీలు కూడా ఇస్తోంది. యూఏఈ ప్రభుత్వం తన పౌరుల్లో అర్హులకు ఉచితంగా ఇళ్లు ఇస్తోంది. అన్ని స్థాయుల్లోను ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు భృతి, ఉచిత వసతి, తక్కువ ఆదాయం ఉన్న పౌరులకు, వృద్ధులకు పలు సామాజిక భద్రత పథకాలను అమలు చేస్తోంది.పౌరుల్లో 45 ఏళ్ల వయసు పైబడిన నిరుద్యోగులకు ప్రతి నెలా 5 వేల దినార్లు (సుమారు రూ.1.18 లక్షలు), ఇంటి అలవెన్సు 2500 దినార్లు (సుమారు రూ.59 వేలు) చెల్లిస్తోంది. యూనివర్సిటీల్లో చదువుకునే మెరిట్ విద్యార్థులకు నెలకు 3200 దినార్లు (సుమారు రూ.75 వేలు) అలవెన్స్ చెల్లిస్తోంది.సౌదీ అరేబియా: గల్ఫ్లోని అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న దేశం కూడా ఇదే! సౌదీ ఆదాయంలో చమురు ఎగుమతులదే సింహభాగం అయినా, పర్యాటకం, విద్యుదుత్పాదన, టెలికం, పారిశ్రామిక విస్తరణల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. ముస్లింల పవిత్ర క్షేత్రాలైన మక్కా, మదీనాలు సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వీటిని దర్శించుకోవడానికి ఏటా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఇతర విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలోనే వస్తుంటారు.సౌదీ అరేబియా తన పౌరులకు భారీ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఉచితంగా మందులు సహా అన్ని స్థాయుల్లోనూ ఉచిత వైద్యసేవలను అందిస్తోంది. హైస్కూలు స్థాయి వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తోంది. ఉన్నత విద్య కోసం సౌదీలో ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. అవి ఫీజులు వసూలు చేస్తాయి. అయితే, పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడిచే యూనివర్సిటీల్లో మాత్రం ఉన్నత విద్య కూడా ఉచితమే! వీటిలో చదువుకునే మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్లు కూడా చెల్లిస్తోంది.సౌదీ ప్రభుత్వం పౌరులకు ఉచితంగా ఇళ్ల స్థలాలను, నిర్మించిన ఇళ్లను కూడా అందిస్తోంది. రానున్న ఐదేళ్లల్లో పౌరులందరికీ ఉచిత ఇళ్లు సమకూర్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, భారీస్థాయిలో గృహనిర్మాణాలను కొనసాగిస్తోంది. ఇంతే కాకుండా, వృద్ధులకు, నిరుద్యోగులకు కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.‘పన్ను’పోటు లేని గల్ఫ్ దేశాలు⇒ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్⇒ ఖతర్⇒బహ్రెయిన్⇒సౌదీ అరేబియా⇒ కువైట్⇒ ఒమన్‘పన్ను’పోటు లేని చిన్న దేశాలుచమురు ఎగుమతుల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడే గల్ఫ్ దేశాలు పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. కాని, ప్రపంచంలోని అత్యంత చిన్న దేశాల్లోని మొదటి మూడు దేశాలైన వాటికన్ సిటీ, మొనాకో, నౌరు కూడా పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకుండానే మనుగడ సాగిస్తుండటం ఆశ్చర్యకరమైన విషయం. ఆదాయపు పన్ను ద్వారా ఖజానాకు రాబడి లేకపోయినా, ఈ దేశాలు ఎలా మనుగడ సాగిస్తున్నాయో చూద్దాం.వాటికన్ సిటీ: పోప్ పాలనలో ఉండే వాటికన్ సిటీ క్రైస్తవులకు ప్రధాన కేంద్రం. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇక్కడ పౌరులెవరూ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వాటికన్ సిటీకి ప్రపంచవ్యాప్తంగా ఉండే రోమన్ కేథలిక్ క్రైస్తవుల ద్వారా వచ్చే స్వచ్ఛంద విరాళాలు, నగరంలో ప్రవేశానికి విదేశీయులకు విక్రయించే టికెట్లు, స్టాంపులు, నాణేలు, జ్ఞాపికల విక్రయాలు, పెట్టుబడులపై వడ్డీల ద్వారా భారీగా ఈ దేశానికి ఆదాయం వస్తుంది. వాటికన్ బ్యాంకు ప్రపంచవ్యాప్తంగా జరిపే ఆర్థిక లావాదేవీల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం వస్తుంది.మొనాకో: ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో రెండోస్థానంలో నిలిచే దేశం మొనాకో. ఇక్కడి పౌరులు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పర్యాటకం, ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, శాస్త్ర సాంకేతిక కార్యకలాపాల ద్వారా మొనాకోకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తుంది. తమ తమ దేశాల్లోని ‘పన్ను’పోటు తప్పించుకోవడానికి చాలామంది విదేశీయులు ఇక్కడి బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటుంటారు.ఇక్కడి క్యాసినోలు భారీ స్థాయిలో విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. వివిధ మార్గాల్లో గణనీయంగా ఆదాయం వస్తుండటంతో ప్రజల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయకపోయినా, మొనాకో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించగలుగుతోంది. మొనాకో ప్రభుత్వం తన పౌరులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు మాతృత్వ, పితృత్వ భృతి, పనిచేయలేని స్థితిలో ఉన్నవారికి పింఛన్ల చెల్లింపు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది.నౌరు: ఓషియానా ప్రాంతంలోని నౌరు ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో మూడో స్థానంలో నిలుస్తుంది. నౌరు ప్రభుత్వం తన పౌరుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయదు. చుట్టూ సముద్రం తప్ప మరే సహజ వనరులు లేకపోయినా, నౌరు ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా ఆదాయం పొందుతోంది.చేపల వేటకు లైసెన్సులు, ఆశ్రయం కోరి వచ్చే శరణార్థుల నుంచి వీసా రుసుములు, కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు, విదేశాలలో నిర్వహించే బ్యాంకింగ్ కార్యకలాపాల ద్వారా నౌరుకు గణనీయంగా ఆదాయం లభిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి ఏటా ఆర్థిక సాయం కూడా లభిస్తుంది. నౌరు ప్రభుత్వం వార్ధక్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు, జనన మరణాల భృతి, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి స్కాలర్షిప్లు వంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది. పౌరులపై ఆదాయపు పన్ను విధించని పలు చిన్నా చితకా దేశాలు ప్రధానంగా పర్యాటక ఆదాయంపై ఆధారపడుతున్నాయి. పౌరసత్వం కోరుకునే విదేశీయుల నుంచి పెట్టుబడుల సేకరణ, రియల్ ఎస్టేట్, మత్స్యసంపద తదితర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. వివిధ మార్గాల ద్వారా సంపద సృష్టించుకుంటూ, ఇవి తమ పౌరులపై పన్నుభారం మోపకుండా మనుగడ సాగిస్తున్నాయి. -
స్టార్స్ లక్కీ చార్మ్
ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఎంత ముఖ్యమో, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవటం కూడా అంతే ముఖ్యం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, తానేంటో నిరూపించుకుంది లీపాక్షి ఎల్లవాడి. నేడు సెలబ్రిటీలకు ఫేవరెట్ స్టయిలిస్ట్గా మారిన ఆమె విశేషాలు..నిజం చెప్పాలంటే, పదహారేళ్ల నా ఈ కెరీర్లో ‘ఐ మేడ్ ఇట్’ అనే క్షణం ఇంకా రాలేదు. కేవలం, కొన్ని క్షణాలు మాత్రమే గర్వంగా అనిపించాయి. కాని, నేను సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి. – లీపాక్షి ఎల్లవాడి(Leepakshi Ellawadi)ఢిల్లీలో పుట్టిపెరిగిన లీపాక్షి ఎల్లవాడి. లండన్లో ఫ్యాషన్ కోర్సు చేసి, తిరిగి స్వదేశం వచ్చి, కెరీర్ స్టార్ చేసింది. తొలి అవకాశమే అమితాభ్ బచ్చన్ నటించిన ‘బుడ్ఢా హోగా తేరా బాప్’ సినిమాకు లీపాక్షి కాస్ట్యూమ్ డిజైనర్గా చేసింది. బ్లాక్ అండ్ వైట్తో పాటు, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో మ్యాజిక్ చేసి, అమితాభ్ను సూపర్ చార్మింగ్గా చూపించి, ప్రశంసలు అందుకుంది. ఇక అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు. వరుస సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తూ, బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరెట్ స్టయిలిస్ట్గా మారింది.ఇలా తను మారడానికి కారణం తను ఫాలో అయ్యే ఆ మూడు సూత్రాలేనట.. ‘ఒకటి: కొత్త డిజైనర్లు, స్టయిలిస్ట్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవటం. రెండు: చివరి నిమిషంలో కూడా మార్పులు చేయడానికి కావాల్సిన వనరులతో సిద్ధంగా ఉండటం. మూడు: ట్రెండ్ గేమ్ను ఫాలో అవటం’ అని తన సీక్రెట్ ఫార్ములాను వివరించింది లీపాక్షి.అందుకే, లీపాక్షితో స్టయిలింగ్ చేయించుకోవడానికి చాలామంది స్టార్స్ ఇష్టపడతారు. అమితాభ్తోపాటు షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కియారా ఆడ్వాణీ, కార్తిక్ ఆర్యన్, సిద్ధార్థ్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి బాలీవుడ్ స్టార్స్కు లీపాక్షీ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. -
చదువుకున్న మారాజు
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, చాలాచోట్ల ఇంకా రాచరికాలు లాంఛనప్రాయంగా మిగిలి ఉన్నాయి. పలుచోట్ల రాజ సంస్థానాల వారసులకు పట్టాభిషేకాల వంటి లాంఛనాలు కొనసాగుతుండటం మనకు తెలిసిన సంగతే! నాగరిక రాజ్యాలు, సంస్థానాల వ్యవహారాలు సరే, దక్షిణాదిన ఏకైక ఆదివాసీ రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు కూడా ఉన్నాడు.అదే కేరళలోని మన్నన్ రాజ్యం. పుష్కరం కిందట ఆ రాజ్యానికి కొత్త రాజు వచ్చాడు. ఆయన పట్టభద్రుడు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ప్రభుత్వ ఆహ్వానంపై హాజరైన ఈ చదువుకున్న మారాజు కథా కమామిషూ..కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్పన గ్రామానికి చేరువలో ఉంటుంది మన్నన్ రాజ్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దక్షిణాదిన మిగిలి ఉన్న ఏకైక ఆదివాసీ రాజ్యం ఇది. ఈ రాజ్యానికి 2012లో కొత్త రాజు వచ్చాడు. ‘రామన్ రాజమన్నన్(Raman Rajamannan)’గా పట్టాభిషిక్తు డయ్యాడు. అతడి అసలు పేరు బిను. అతడికి ముందున్న రాజు ‘అరియన్ రాజమన్నన్’. అతడు 29 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. అరియన్ రాజమన్నన్కు ముందున్న రాజు ‘దేవన్ రాజమన్నన్’ తన 54వ ఏట చనిపోయాడు. ఇప్పటి రాజు రామన్ రాజమన్నన్ అలియాస్ బిను మన్నన్ రాజ్యానికి పదిహేడో రాజు. అతడికి ముందున్న రాజులందరూ నిరక్షరాస్యులే! రామన్ రాజమన్నన్ ఎర్నాకుళం మహారాజా కాలేజీ నుంచి ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తిచేశాడు.మన్నన్ రాజ్యానికి ఎవరు రాజైనా, వారికి ‘రాజమన్నన్’ గౌరవ బిరుదనామం వస్తుంది. మన్నన్ తెగ ప్రజలది మాతృస్వామ్య సమాజం. దేశ పాలనా యంత్రాంగానికి లోబడే ఈ రాజ్యం నడుస్తోంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయి. ఇడుక్కి జిల్లావ్యాప్తంగా 62 చోట్ల విస్తరించి ఉన్న మూడువందలకు పైగా మన్నన్ తెగ కుటుంబాల మంచిచెడ్డలను ప్రస్తుత రాజు రామన్ రాజమన్నన్ చూసుకుంటారు. ఈ రాజుకు ఒక ఆస్థానం, ఆ ఆస్థానంలో తొమ్మిదిమంది మంత్రులు ఉంటారు. ప్రజల పెళ్లిళ్లు, విడాకులు సహా తెగకు సంబంధించిన అంతర్గత సమస్యలు, బయటి నుంచి తెగ ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం రాజు బాధ్యతే! రాజుకు హఠాత్తుగా అనారోగ్యం వాటిల్లినా, రాజు మరణించినా, కొత్తరాజు వచ్చేంత వరకు రాజ్యభారాన్ని మంత్రులు చూసుకుంటారు. మన్నన్ ప్రజలు రాజును తమ పాలకుడిగానే కాకుండా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా కూడా గౌరవిస్తారు. ఒక రాజు, అతడికి ఒక ఆస్థానం అంటే భారీగా ఊహించుకుంటారేమో! ఈ రాజుకు, ఆయన ఆస్థానానికి భారీ భవంతులు, రాజప్రాసాదాలూ ఉండవు. మామూలు పక్కా ఇల్లే ఆయన నివాసం, ఆస్థానం.రామన్ రాజమన్నన్ భార్య బినుమాల్ మన్నన్ తెగప్రజలకు రాణి. వీరి కూతురు అర్చన యువరాణి. మన్నన్ ప్రజల్లో ఎక్కువమంది వ్యవసాయ పనులు చేసుకుంటారు. వీరిలో కొందరు అటవీశాఖలో చిన్న చిన్న ఉద్యోగాల్లో కుదురుకున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు రామన్ రాజమన్నన్ సకుటుంబంగా హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్వయంగా కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేడుకలకు ఆహ్వానం అందుకున్న తొలి మన్నన్ రాజుగా ఆయన దేశ ప్రజలకు కనిపించారు. రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాక రాజదంపతులు ఢిల్లీలోని ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి జనవరి 31 వరకు అక్కడే ఉన్నారు. వారు ఫిబ్రవరి 2న తిరిగి తమ రాజ్యానికి చేరుకున్నారు. వీరి ప్రయాణ ఖర్చులను గిరిజనాభివృద్ధి శాఖ పెట్టుకుంది. మన్నన్ల చరిత్ర!ఏడు వందల ఏళ్ల క్రితం పాండ్య, చోళ రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో పాండ్యరాజు చిరై వర్మన్ ఓడిపోయాడు. కొద్దిమందిని వెంటబెట్టుకుని తన రాజ్యం నుంచి పారిపోయి, ఇప్పటి ఇడుక్కి జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చి, కొత్త రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. అదే ఈ మన్నన్ రాజ్యమని స్థానిక మన్నన్ తెగ ప్రజలు చెబుతారు.విద్యను అందించడమే లక్ష్యంరాజుగా నా ప్రజలందరికీ విద్యను అందించడమే నా ప్రధాన లక్ష్యం. విద్యతోనే ఆదివాసీల జీవితాలు మెరుగుపడతాయి. నేటితరానికి ఈ అవగాహనను కల్పించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించగలం – రామన్ రాజమన్నన్పిల్లల్ని చదివించటం అంటే వారికి రాయల్ లైఫ్ను ఇవ్వటమే. – రాజమన్నన్ -
డొల్ల విలాస్
పైన పటారం, లోన లొటారం అంటే అచ్చం ఇలాగే ఉంటుంది. 1987లో ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ది ర్యుంగ్యాంగ్ హోటల్(The Ryungyang Hotel)’ అత్యంత ఖరీదైన నిర్మాణాల్లో ఒకటి. ‘ది హోటల్ ఆఫ్ డూమ్’( The Hotel of Doom) అని పిలిచే ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు ఆరువందల మిలియన్ల పౌండ్లు (అంటే రూ.6,330 కోట్లు) ఖర్చు చేసింది.తాజాగా, ఈ హోటల్కెళ్లిన యూట్యూబర్ కాకెరల్, ‘వెయ్యి అడుగుల ఎత్తు, 105 అంతస్తులతో పిరమిడ్ ఆకారంలో, బయటకు అందంగా కనిపించే ఈ హోటల్ లోపల అంతా డొల్ల్ల. చుట్టూ సిమెంట్ గోడలతో, చేసింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి, అతిథుల కోసం లగ్జరియస్ సదుపాయాలు, మూడువేల గదులతో డిజైన్ చేసిన ఈ హోటల్ను ఇప్పటి వరకు తెరవలేదు.వనరుల లోపం కారణంగా మధ్యలోనే ఈ నిర్మాణాన్ని ఆపేశారు. అప్పటి నుంచి కేవలం చూడటానికి మాత్రమే అందంగా కనిపిస్తుంది కాని, ఇప్పటి వరకు ఈ హోటల్ ఒక్క అతిథికి కూడా ఆతిథ్యం ఇవ్వలేదు. ఇంకా నిర్మాణ దశలో ఉన్న హోటల్ ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే, మరికొందరు, కేవలం చూడటానికే ఈ హోటల్ను నిర్మించినట్లు ఉన్నారని సెటైర్లు వేస్తున్నారు. -
నేషనల్ క్రష్మికా
భాష ఏదైనా; ప్రాంతం ఏదైనా; తన ఎంట్రీతో రికార్డులన్నీ క్రాష్ చేసేస్తున్న నటి, సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే బ్యూటీ; నేషనల్ (National Crush) క్రష్ రష్మికా మందన్న(Rashmika Mandanna) గురించిన కొన్ని విషయాలు.⇒ రష్మిక పుట్టింది కర్ణాటకలోని కొడగు జిల్లా. బెంగళూరులోని ఎం.ఎస్.రామయ్య కళాశాలలో సైకాలజీ, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లో జరిగిన అందాల పోటీలు రష్మికను సినీ ప్రపంచంవైపు నడిచేలా చేశాయి.⇒ కన్నడ చిత్రం ‘కిరాక్ పార్టీ’తో సినీ ప్రయాణం మొదలుపెట్టింది. తెలుగులో ‘ఛలో’ సినిమాతో పలకరించి, ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’,‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాల్లో నటించి, వరుస విజయాలు అందుకుంది.⇒ ‘పుష్ప: దిరైజ్’.. రష్మికకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో శ్రీవల్లిగా తను కనబరచిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’, ‘యానిమల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. తాజాగా విక్కీ కౌశల్తో కలిసి ‘ఛావా’ అంటూ సందడి చేయనుంది.⇒ జపానీస్ వెబ్ సిరీస్ ‘నరుటో’కు రష్మిక వీరాభిమాని. అంతేకాదు, జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ‘ఒనిట్సుకా టైగర్’కు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించింది.⇒ రష్మికకు అన్నింటికంటే ఆనందాన్నిచ్చే ప్రదేశం తన ఇల్లు. సినీ స్టార్గా ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందినప్పటికీ ఒక కుమార్తె, సోదరి, భాగస్వామిగా తన జీవితాన్ని గౌరవిస్తుంది. ⇒ గోరువెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, తలకు పట్టించి చక్కగా మర్దన చేసుకోవటమే రష్మిక సౌందర్య రహస్యం. ఆరోగ్యకరమైన ఆమె జుట్టుకు, చర్మసౌందర్యానికి అదే కారణం.⇒ కళ్లు మన మనసుకు ప్రతిబింబాలు. కళ్లతో పలికించే హావభావాలను నేను నమ్ముతాను. నవ్వుతూ ఉండే వ్యక్తులు, ఎదుటివారిని గౌరవించే వారంటే నాకు ఇష్టం. – రష్మికా మందన్న. -
యువ కథ: మలిసంధ్య
అప్పుడప్పుడే పడమటి కొండల్లోకి అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ, నిట్టూర్పుతో మరుసటి రోజు కోసం ఎదురుచూద్దాం అనుకుంటూ అటువైపుగా చూస్తూ ఉంది పెద్దావిడ అన్నపూర్ణమ్మ. ఊళ్లో వాళ్లంతా ఆమెను పెద్దమ్మ అని ప్రేమతో పిలుస్తారు. అందరికీ ప్రేమను పంచుతూ, ఒకరికి కష్టం వస్తే, అది తనకే వచ్చిందనుకుని తపనపడే దొడ్డమనసు అన్నపూర్ణమ్మ సొంతం. ఊళ్లోని సాటి ఆడవాళ్లు ‘వదినగారు’ అని, పిల్లలందరూ ‘బామ్మ’ అని ఏదో ఒక వరుస కలుపుకొని ఆమెను పిలుస్తుంటారు. ఊరి మనుషులందరి అభిమానాన్ని సంపాదించుకున్న మహానుభావురాలు అన్నపూర్ణమ్మ.ఈ రోజు ఒంటరిగా మిగిలినా, ఒకప్పుడు ఆమె కుటుంబం చాలా పెద్దది. భర్త పరంధామయ్య శ్రీరాముడంతటి మనిషి. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయంలో లాభాలు గడిస్తూ, పదిమందికీ పెట్టే గుణం గల దయార్ద్ర హృదయుడు పరంధామయ్య. పేరుకు తగ్గట్లే అడగకుండానే కడుపు నింపే చల్లనితల్లి అన్నపూర్ణమ్మ. ఆ దంపతుల కొడుకులు సరస్వతీపుత్రులు, కూతుళ్లు చదువుల తల్లులు. ఊళ్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ముందుగా గుర్తొచ్చేది అన్నపూర్ణమ్మనే! సజావుగా సాగిపోతున్న ఆమె జీవితంలో అనుకోని కష్టం కెరటంలా ముంచుకొచ్చి, పరంధామయ్యగారిని తీసుకుపోయింది. ఆయన మరణంతోనే అన్నపూర్ణమ్మ సంతోషం దూరమైంది.చదువులు పూర్తయ్యాక పిల్లలకు పెళ్లిళ్లు చేసేసి, బాధ్యతలన్నీ పూర్తిగా నెరవేర్చుకుంది అన్నపూర్ణమ్మ. ఊళ్లోని పెద్దల సమక్షంలో ఆస్తిని సమ భాగాలు చేసి, పిల్లలందరికీ సమానంగా పంచింది. పంపకాల తర్వాత ఉద్యోగాల పేరిట ఎవరి దారి వారు చూసుకున్నారు. మిగిలింది వైభవంగా బతికిన ఇల్లు, దేవాలయంలాంటి ఆ ఇంట్లో దేవతలాంటి అన్నపూర్ణమ్మ. ఆ రోజు అన్నపూర్ణమ్మ పనిమనిషి రంగిని తోడుగా తీసుకుని, రామాలయానికి వెళ్లింది. అక్కడ భజనలో కూర్చుని, రామాయణాన్ని ఆలకిస్తూ, రామాయణ సారంలో తన సంసారాన్ని గుర్తు తెచ్చుకుని, ఆ శ్రీరామునికి నమస్కరించి, రంగితో కలిసి ఇంటికి బయలుదేరింది.మర్నాడు తెల్లారింది. రంగి కళ్లాపి చల్లి, ఇంటి ముందు ముగ్గు వేస్తున్న రంగి మెదడులో ఒకటే ఆలోచన– ఎప్పుడూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచే అన్నపూర్ణమ్మ ఇంకా నిద్రలేవలేదేంటా అనుకుంటూ, మధ్య మధ్యలో ఇంటి వసారాలోకి చూస్తూ, ముగ్గు ముగించింది.‘అమ్మగారూ!.. అమ్మగారూ!’ అని పిలుస్తూ, అన్నపూర్ణమ్మను లేపడానికి వెళ్లింది. రంగి పిలుపుతో అన్నపూర్ణమ్మ నెమ్మదిగా లేచింది. ‘ఏమైందమ్మా! ఇంతసేపు ఎప్పుడూ పడుకోలేదు’.. అంటూ రంగి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.‘ఏమీ లేదే! రాత్రంతా మగత నిద్ర. తెల్లవారుతుండగా నిద్రొచ్చి, రెప్పల మీద వాలింది’ అంటూ ‘కాఫీ తెమ్మ’ని పురమాయించింది అన్నపూర్ణమ్మ. రంగి తీసుకొచ్చిన కాఫీ తాగింది. మనసులో ఏదో ఆలోచన ఆమెను కుదురుగా ఉండనివ్వడట్లేదు.పని ముగించుకుని, రంగి ఇంటికి వెళుతుండగా, ‘రంగీ! ఒకసారి ఇలా రా!’ అని పిలిచింది. రంగి వాలుకుర్చీ పక్కనే కూర్చుని, ‘సెప్పండమ్మా!’ అంది. ‘ఏంలేదే, నీతో మాట్లాడాలి. కాసేపాగి వెళుదువుగాని’ అంది అన్నపూర్ణమ్మ. ‘అలాగే, అమ్మగారు’ అంటూ సర్దుకుని కూర్చుంది. ‘అసలు మీకేమైనాది? అంత పరాగ్గా ఉన్నారేటి అమ్మగారు? నేనే అడుగుదామను కుంటుండా. అందరికీ ఏం అక్కర ఉన్నా సాయం చేసేటోళ్లు, మనసులో బాధ కూడా సెప్పకనే తెలుసుకునేటోళ్లు– అట్టాంటిది, మీకేమైనాదమ్మా! నాతో సెప్పండమ్మా’ అని అడిగింది. ‘ఏమిటే, నీతో మాట్లాడదాం అని నిన్ను నేను పిలిస్తే, నాకు ఊరటనిస్తున్నావా?’ అంది అన్నపూర్ణమ్మ.‘సరేగాని, నీ బిడ్డడు పనిలో కుదురుకున్నాడా?’ అడిగింది.‘ఎక్కడమ్మా! ఆడికొచ్చిన అరకొర సదువుతో యాడ కుదురుకుంటాడు తల్లీ!’ నిట్టూర్చింది రంగి.‘సరేలే! అయితే, నువ్వూ నీ కొడుకు ఇద్దరే కదా, నాతో ఉంటారా?’ అడిగింది అన్నపూర్ణమ్మ.ఆ మాటకు రంగి బిగుసుకుపోయి, ‘అదేటమ్మా? మీతో మేమెలా?’ అంటూ తల గోక్కుంటూ ఇబ్బంది పడుతుంటే, ‘సామానంతా సర్దుకుని, తయారుగా ఉండండి. రేపు మొదటి బండికి మనం పట్నం బయలుదేరుతున్నాం’ అంటూ రంగి సమాధానం తెలిసినట్లుగా ఆజ్ఞాపించింది అన్నపూర్ణమ్మ. ఎందుకో, ఏమిటో అనుకుంటూ అయోమయంలో ఇంటికి బయల్దేరింది రంగి.మరుసటి రోజు పొద్దున్నే రంగి, ఆమె కొడుకు నాగ అన్నపూర్ణమ్మ ఇంటికి సామానుతో వచ్చారు. బండికి ఇంకాస్త సమయం ఉంది. ప్రయాణంలో తినడానికి కొన్ని తినుబండారాలను బ్యాగులో సర్దింది రంగి. ఈలోగా అన్నపూర్ణమ్మ తయారై, బండి తెమ్మని పురమాయించింది. ముగ్గురూ రైల్వేస్టేషన్కు చేరుకుని, రైలులో కూర్చున్నారు. కిటికీలో నుంచి బయటకు చూస్తున్న అన్నపూర్ణమ్మ కళ్లు ఒక్కసారిగా కన్నీళ్లతో నిండిపోయాయి. నీటి తెరల వెనుక జ్ఞాపకాల అలలు ఒక్కొక్కటిగా మెదిలాయి. ఆ రోజు అన్నపూర్ణమ్మ కూతురికి డెలివరీ టైమ్ దగ్గరపడుతుండటంతో కూతురి దగ్గరకు వెళ్లింది.అన్నీ సవ్యంగా జరిగాయి. మహాలక్ష్మి రూపంలో కవలలు పుట్టారు కాని, అతుక్కుని పుట్టారు. హాస్పటిల్లోనే చాలా రోజులు ఉన్నాక డిశ్చార్జ్ అయ్యారు.హారతితో ఎదురువెళ్లిన అన్నపూర్ణమ్మకు బిడ్డలు కనబడలేదు. కూతురు, అల్లుడు– అంతే! ‘ఏమైంద’ని అడిగితే, ఆధునికతను అణువణువూ నింపుకున్న వాళ్లకు బిడ్డలు బరువు అనిపించి, ఆశ్రమంలో వదిలేసి వచ్చామన్నారు, ఏ బాధ లేకుండా. అన్నపూర్ణమ్మ మనసు భారమైంది. మానవత్వం, తల్లిప్రేమ ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. మర్నాడు ఆశ్రమానికి వెళ్లింది. పిల్లలను తీసుకుని, ఆస్పత్రిలో పెద్ద డాక్టర్ను కలిసి, వారి ఆపరేషన్ కోసం ప్రయత్నం మొదలుపెట్టింది. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత ఆపరేషన్ మొదలైంది. వరుసగా ఐదు నుంచి ఏడుసార్లు ఆపరేషన్ చేయాలని, అంతవరకు తామే చూసుకుంటామని వారు చెప్పారు. ‘అలాగే’నని వారికి కావలసిన డబ్బును ఒకేసారి జమచేసింది అన్నపూర్ణమ్మ.ఇది జరిగి ఇప్పటికి మూడు సంవత్సరాలు. పిల్లలను తీసుకెళ్లమని డాక్టర్ ఫోన్ చేయడంతో అన్నపూర్ణమ్మ చూడటానికి వెళ్లింది. అక్కడ తన మనవరాళ్లలాగ ఉన్న చాలామంది నిస్సహాయులైన పిల్లలు కనిపించారు. ఒక నిర్ణయంతో ఆ ఊరికి బయలుదేరింది. ‘అమ్మగారు! మనం ఇక్కడేనా దిగాలి?’ అడిగింది రంగి. ఔనన్నట్లు లేచింది అన్నపూర్ణమ్మ.అందరూ బండి దిగారు. బయట వారికోసం కారు ఆగి ఉంది. అందరూ అందులో బయలుదేరారు. ఒక విశాలమైన పచ్చిక బయలులాంటి మైదానంలో చుట్టూ చెట్టు చేమలతో, పక్షుల కిలకిలరావాలతో ఆహ్లాదభరితంగా ఉన్న ప్రదేశంలో దేవాలయంలాంటి ఇంటి ముందు ఆగింది కారు.అన్నపూర్ణమ్మ రాగానే ‘బామ్మ! బామ్మ!’ అంటూ చేతికర్రల ఊతంతో ఉన్న పిల్లలు, చక్రాల బళ్లలో ఉన్న పిల్లలు ఆమె చుట్టూ చేరారు. వారిలో అన్నపూర్ణమ్మ మనవరాళ్లు కూడా ఉన్నారు. ఆపరేషన్ అయ్యాక పిల్లలు సరిగా నడవలేరు అనే నిజం తెలుసుకున్నాక, అన్నపూర్ణమ్మ అక్కడ ఉన్న పిల్లలందరికీ ఆపరేషన్ చేయించింది. వారందరికీ తానే భోజన, వసతి ఖర్చులను భరించింది. తనకు మిగిలిన ఆస్తినంతా ఆశ్రమానికి రాసేసింది. ఆ ఆశ్రమంలోనే ఉంటూ, పిల్లల బాగోగులను చూసుకుంటూ తన శేష జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకుంది అన్నపూర్ణమ్మ. అక్కడ అడుగుపెడుతూనే, పిల్లలందరూ అన్నపూర్ణమ్మ చుట్టూ చేరడం చూసి, రంగి, ఆమె కొడుకు నాగ ఆమెను దేవతను చూసినట్లుగా తన్మయం పొందారు. అన్నపూర్ణమ్మకు చేదోడు వాదోడుగా ఆ తల్లీకొడుకులు అక్కడే ఉండిపోయారు. అన్నపూర్ణమ్మ తీసుకున్న నిర్ణయం రేపటి తరపు సూర్యోదయం కోసం ఎదురుచూసే మలిసంధ్య. -
చెల్లింపుతో చిక్కాడు
రాచకొండ పోలీసుస్టేషన్ పరిధిలోని మీర్పేటలో వెలుగులోకి వచ్చిన ‘చంపేసి.. ఉడకబెట్టిన’ కేసు సంచలనం సృష్టించింది. ఇంత దారుణంగా కాకున్నా, హైదరాబాద్లో దాదాపు ఏడాదిన్నర క్రితం అనురాధ అనే నర్సు హత్యకు గురైంది. ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన నిందితుడు చంద్రమోహన్ ఫ్రిజ్లో దాచి పెట్టాడు. మూసీ నది సమీపంలో దొరికిన హతురాలి తలతో మొదలైన ఈ కేసు దర్యాప్తు కొలిక్కి రావడానికి ఓ యూపీఐ పేమెంట్ కీలక ఆధారమైంది. చైతన్యపురి ప్రాంతంలో నివసించే బి.చంద్రమోహన్ అవివాహితుడు. వడ్డీ వ్యాపారంతో పాటు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుండేవాడు. తల్లితో కలిసి సొంత ఇంటి మొదటి అంతస్తులో నివసించేవాడు. ఇతడి తండ్రికి 2007లో ఒక ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది. అప్పట్లో ఆస్పత్రి తరఫున సేవలు చేయడానికి హెడ్ నర్సు వై. అనురాధారెడ్డి ఇంటికి వచ్చేది. చంద్రమోహన్కు ఆమెతో పరిచయం ఏర్పడింది. తండ్రి 2009లో చనిపోయినప్పటికీ వీరి పరిచయం కొనసాగి, సన్నిహితంగా మారారు. చంద్రమోహన్ 2021లో అనురాధను తన ఇంటి కింద ఉన్న ఒక పోర్షన్లోకి తీసుకువచ్చాడు. అనురాధ, చంద్రమోహన్ 15 ఏళ్లు సన్నిహితంగా మెలిగారు. అతగాడు ఆమె నుంచి దాదాపు 20 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు తీసుకున్నాడు. కొన్నేళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకున్న అనురాధ రెండో వివాహం చేసుకోవాలని 2023లో భావించింది. దీంతో తన వద్ద తీసుకున్న బంగారం, నగదు తిరిగి ఇవ్వాల్సిందిగా చంద్ర మోహన్పై ఒత్తిడి చేసింది. ఆమె వివాహ ప్రయత్నాలు తెలుసుకున్న చంద్రమోహన్, అదే జరిగితే అనురాధ తనకు దూరం అవుతుందని, అప్పటికే ఆమె వద్ద తీసుకున్న నగదు, బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుందని భావించాడు. దీంతో అనురాధను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 2023 మే నెలలో వేసవి సెలవుల నేపథ్యంలో చంద్రమోహన్ ఇంటి కింది భాగంలో ఉన్న మరో పోర్షన్లో ఉండే కుటుంబం ఊరికి వెళ్లింది. అక్కడే ఉన్న మరో పోర్షన్లో నివసించే అనురాధను హత్య చేయడానికి అదే సరైన సమయమని చంద్రమోహన్ భావించాడు. ఆ నెల 12న మధ్యాహ్నం ఆమె వద్దకు వెళ్లి, గొడవకు దిగాడు. ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేసి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే ఉంచి, ఎలా మాయం చేయాలనే అంశంపై తన స్మార్ట్ఫోన్ ద్వారా యూట్యూబ్లో సెర్చ్ చేశాడు. మృతదేహం వాసన బయటకు రాకుండా ఏం చేయాలనేది వెతికాడు. అందులో చూపించిన వీడియోలను ఆధారంగా చేసుకుని, అప్పటికప్పుడు రెండు చిన్న సైజు స్టోన్ కట్టర్లు, నాలుగు మటన్ కత్తులు, దాదాపు 40 వరకు ఫినాయిల్, డెట్టాల్, వివిధ కెమికల్స్ బాటిళ్లు, అగరుబత్తీలు, అత్తర్లు, కర్పూరం తదితరాలు కొనుక్కుని వచ్చాడు. కట్టర్లతో మొండెం నుంచి తల, కాళ్లు, చేతులు వేరు చేస్తూ అనురాధ శరీరాన్ని ఆరు ముక్కలు చేశాడు. కాళ్లు, చేతులు, తల ఫ్రిజ్లో, మొండాన్ని ఓ పెట్టెలో పెట్టి మూడు రోజులు గదిలోనే ఉంచాడు. హతురాలి సెల్ఫోన్ను తన వద్దే ఉంచుకున్న చంద్రమోహన్ దాంతో ఆస్ట్రేలియాలో ఉండే ఆమె కుమార్తెతో అనురాధ మాదిరిగా చాటింగ్ చేస్తూ వచ్చాడు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తన ఇంటి నుంచి కింద ఉన్న అనురాధ పోర్షన్లోకి వస్తున్న చంద్రమోహన్ మృతదేహం ముక్కల మీద ఫినాయిల్, డెట్టాల్, కర్పూరం తదితరాలు చల్లి వెళ్లేవాడు. ఇంట్లో రక్తం వాసన తెలియకుండా అగరుబత్తీలు, అత్తర్లు వినియోగించాడు. ఇలా దాదాపు 13 రోజుల పాటు వాసన ఆ గది కూడా దాటకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ మృతదేహం విషయం పక్కింటి వాళ్లకు, పైనే ఉన్న చంద్రమోహన్ తల్లికీ తెలియలేదు. ఓ దశలో చంద్రమోహన్ దఫదఫాలుగా మృతదేహం భాగాలను బయట పారేయాలని భావించాడు. అనూరాధ తలను చెత్త కవర్లో పెట్టుకుని వెళ్లి, 2023 మే 15 రాత్రి మూసీ సమీపంలో పడేశాడు. పారిశుద్ధ్య కార్మికులు మే 17న ఉదయం దీనిని గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తల దొరికిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ ప్రాంతానికి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న దానిపై ఆధారపడ్డారు. 2023 మే 16వ తేదీ ఫీడ్ పరిశీలించినా ఎలాంటి ఆధారం లభించలేదు. దీంతో 15వ తేదీకి సంబంధించింది చూస్తుండగా, ఓ వ్యక్తి ఆటోలో వచ్చి కవర్ను ఆ ప్రాంతంలో పారేస్తున్నట్లు కనిపించింది. అక్కడ నుంచి ఒక్కో కెమెరాలో అతడి కదలికలు గమనిస్తూ పోయారు. తల దొరికిన ప్రాంతం నుంచి దాదాపు కిలోమీటరు ప్రయాణించిన చంద్రమోహన్ అక్కడి ఓ బేకరీ వద్ద ఆగాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పారేయడంతో రిలాక్స్ అయ్యాడు. అక్కడే ఓ వాటర్ బాటిల్ కొనుక్కుని తాగాడు. వాటర్ బాటిల్కు తన ఫోన్లోని యూపీఐ యాప్ ద్వారా డబ్బు చెల్లించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని చూసిన పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణం ఆ బేకరీ వద్దకు చేరుకుని ఆ రోజు జరిగిన యూపీఐ లావాదేవీల డేటా సేకరించారు. సీసీ కెమెరాల్లో ఉన్న టైమ్ ఆధారంగా వాటర్ బాటిల్ ఖరీదు చేసిన వ్యక్తి చెల్లించిన లావాదేవీని గుర్తించారు. ఆ యూపీఐ యాప్తో అనుసంధానించి ఉన్న ఫోన్ నంబర్ తెలుసుకున్న దర్యాప్తు అధికారులు దాని ఆధారంగా చంద్రమోహన్ను గుర్తించి 2023 మే 24న అరెస్టు చేశారు. ఆపై కేసును హత్య జరిగిన ప్రాంతం జ్యురీస్డిక్షన్ ఆధారంగా చైతన్యపురి ఠాణాకు బదిలీ చేశారు. -
నిర్మలాను ఎవరు చంపారు?
2018 జూలై 26, ఉదయం 11 గంటలు– ‘అమ్మా! చదువుకోవడానికి రోషనీ ఇంటికి వెళుతున్నాను’ తల్లితో చెప్పింది నిర్మలా. ‘సరే, సాయంత్రంలోగా వచ్చేసేయ్’ అని చెప్పి, కూతురిని సాగనంపింది తల్లి దుర్గాదేవి.సైకిల్ మీద బయలుదేరింది నిర్మలా. నేపాల్లోని కాంచన్పూర్ గర్ల్స్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోందామె. సాయంత్రం ఆమె తండ్రి యజ్ఞరాజ్ పంత్ ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడినా నిర్మలా ఇంటికి రాలేదు. ఆమె స్నేహితురాలు రోషనీ ఇంటికి వెళ్లి కనుక్కున్నాడు.‘నిర్మలా ఇక్కడకు వచ్చింది. ఇద్దరం చదువుకున్నాం. మధ్యాహ్నం మూడు గంటలకే బయలుదేరింది’ అని చెప్పింది రోషనీ.రాత్రి పదిగంటలకు యజ్ఞరాజ్, దుర్గాదేవి దంపతులు తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ‘రేప్పొద్దున్న రండి, ఫిర్యాదు తీసుకుంటాం’ అని పోలీసులు నిర్లక్ష్యంగా బదులిచ్చారు. చేయగలిగిందేమీ లేక యజ్ఞరాజ్, దుర్గాదేవి ఇంటికి వెళ్లిపోయారు.మర్నాడు ఉదయం నిర్మలా మృతదేహం ఒక చెరుకుతోటలో నగ్నంగా పడి ఉంది. ఆ చెరుకుతోట రోషనీ ఇంటికి అరకిలోమీటరు దూరంలో నిర్మలా ఇంటికి వెళ్లే తోవలో ఉంది. తోట బయట ఆమె సైకిలు పడేసినట్లుగా ఉంది. స్థానికులు సమాచారం తెలపడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎవరో ఆమెపై అత్యాచారం చేసి, చంపేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.ఈ సంఘటనపై నేపాల్లో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు జరిగాయి. కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన తల్లిదండ్రులను పోలీసులు మర్నాడు రమ్మని నిర్లక్ష్యంగా చెప్పడంపై మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.స్థానిక పోలీసులు నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో విఫలం కావడంతో సంఘటన జరిగిన నాలుగు రోజులకు నేపాల్ జాతీయ దర్యాప్తు సంస్థ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీఐబీ) రంగంలోకి దిగింది. అయినప్పటికీ నేపాల్లో ఈ సంఘటనపై ఆందోళనలు చల్లారలేదు. కాంచన్పూర్లో ఆగస్టు 24న జరిగిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు తూటా గాయానికి గురయ్యారు.పరిస్థితి నానాటికీ జటిలంగా మారుతుండటంతో సీఐబీ పోలీసులు దిలీప్సింగ్ బిస్తా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పంత్ కుటుంబం నివసించే వీథిలోనే బిస్తా నివాసం. నిర్మలా హత్యకు కొద్దిరోజుల ముందే అతడు హత్యకేసులో శిక్ష అనుభవించి, జైలు నుంచి విడుదలై వచ్చాడు. పలుమార్లు జరిపిన ఇంటరాగేషన్లో బిస్తా తానే ఈ నేరం చేసినట్లు అంగీకరించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే, ఫోరెన్సిక్ పరీక్షల్లో జరిగిన సంఘటనలో అతడి ప్రమేయం లేదని తేలింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యాన్ని నేపాల్ జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా అభిశంసించింది. కొన్నాళ్లకు పోలీసులు పంత్ కుటుంబానికి పొరుగునే ఉండే ప్రదీప్ రావల్ను, అతడి స్నేహితుడు బిశాల్ చౌధరిని ఈ కేసులో అరెస్టు చేశారు. వాళ్లను సీఐబీ ఐజీ సర్బేంద్ర ఖనాల్, డీఐజీ నీరజ్ బహదూర్ షాహీ స్వయంగా విచారించారు. వారిని ఇంకా కోర్టులో ప్రవేశపెట్టక ముందే నేపాల్ రక్షణమంత్రి ఈశ్వర్ పొఖ్రేల్ ఆదరబాదరగా ప్రెస్మీట్ పెట్టి, నిర్మలా పంత్ కేసులో దోషులు పట్టుబడ్డారు అని ప్రకటించారు.తర్వాత రావల్, చౌధరి రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మృతురాలి నుంచి సేకరించిన నమూనాలతో వారి నమూనాలు సరిపోలడం లేదని వైద్యులు తేల్చారు. కోర్టు వారిని విడుదల చేసింది. బయటకు వచ్చాక వారిద్దరూ పోలీసులు తమను చిత్రహింసలకు గురిచేసినట్లు మీడియాకు చెప్పారు. పోలీసులు వారిద్దరి నమూనాలతో పాటు, భీమ్దత్తా మునిసిపాలిటీ మేయర్ సురేందర్ బిస్తా సోదరుడి కొడుకు ఆయుష్ బిస్తా, సురేందర్ బిస్తా సోదరుడు ఎస్పీ బిస్తా, ఆయన కొడుకు కిరణ్ బిస్తాల నుంచి కూడా నమూనాలు సేకరించారు. వారి నమూనాలేవీ మృతురాలి నుంచి సేకరించిన నమూనాలతో సరిపోలేదు. ఈ కేసుపై దర్యాప్తును పోలీసులు ప్రహసనంగా మార్చడంతో కోపోద్రిక్తులైన జనాలు నేపాల్లో దేశవ్యాప్తంగా నెలల తరబడి ఆందోళనలు కొనసాగించారు. దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎనిమిదిమంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసినా, ఆందోళనలు సద్దుమణిగాక కొద్దినెలల్లోనే వాళ్లందరికీ తిరిగి పోస్టింగులు ఇచ్చారు. సంఘటన జరిగి ఆరున్నరేళ్లయినా, నిర్మలా పంత్ హత్యాచారానికి కారకులైన అసలు నేరస్థులు ఎవరనేది పోలీసులు కనుక్కోలేక పోయారు. నేపాల్ను అట్టుడికించిన ఈ సంఘటన మిస్టరీగానే మిగిలిపోయింది. -
నాన్సీ త్యాగీ
లైఫ్స్టయిల్ అండ్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. ఉత్తరప్రదేశ్కు చెందిన నాన్సీ వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)ప్రిపరేషన్ కోసం ఢిల్లీ చేరింది. అక్కడికి వెళ్లాక తెలిసింది తన ప్యాషన్ ఫ్యాషన్ అని. ‘కాల్ మి బే’ సిరీస్ కోసం నటి అనన్య పాండేకి అవుట్ ఫిట్స్ డిజైన్ చేసి బాలీవుడ్ని, కాన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వాక్ కోసం గౌన్ను డిజైన్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్ వరల్డ్లోని తన అనుభవాలను, లైఫ్స్టయిల్ థింగ్స్ని, ఫ్యాషన్ టిప్స్ను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ @nancytyagi లో షేర్ చేస్తూ సోషల్ మీడియా జర్నీనీ స్టార్ట్ చేసింది. ఆమె చెబుతున్న ఆ సంగతులు, టిప్స్కి దేశంలోని స్మాల్ టౌన్ అమ్మాయిలు, మహిళలు బాగా కనెక్ట్ అయ్యి తక్కువ టైమ్లోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. అందుకే ఆమెను ఫోర్బ్స్.. 2024కు గాను ఇండియా టాప్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా ప్రకటించింది. -
ట్రెండ్సెట్టర్
‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను’ అనే డైలాగ్ లాగే, ప్రయోగాత్మక డిజైన్స్తో పాపులర్ అయి, ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ట్రెండ్సెట్టర్ స్టయిలిస్ట్గా మారిన శ్రుతి మంజరి గురించి కొన్ని విషయాలు..ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు తిరుగుతూ, కొత్తగా ట్రై చేస్తుంటేనే మనలోని ఓల్డ్ వర్షన్ అంతా పోయి, అప్డేట్ అవుతాం. అచ్చం అలాగే ఫ్యాషన్లోనూ, కొత్తగా ట్రై చేస్తుంటూనే అప్డేట్ అవుతుంటాం. – శ్రుతి మంజరి.చెన్నైలో పుట్టిపెరిగిన శ్రుతికి చిన్నప్పటినుంచే ఫ్యాషన్ పట్ల మక్కువ ఎక్కువ. కాలేజీ రోజుల్లో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ మొత్తం ఫ్యాషన్ మ్యాగజైన్స్కే ఖర్చు చేసేది. తర్వాత ప్రముఖ డిజైనర్ల దగ్గర ఇంటర్న్గా చేరి, ఫ్యాషన్పై మరింత ప్రావీణ్యం సాధించింది. ఆ సమయంలోనే రకరకాల డ్రెస్సింగ్ స్టయిల్స్ను గమనించింది. డిజైనింగ్పై దృష్టిపెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే, తనకున్న ఫ్యాషన్ స్పృహ, సృజనే క్వాలిఫికేషన్గా, ఒక బొటిక్ ప్రారంభించింది. కొత్త కొత్త డిజైన్స్ రూపొందించి, తనకంటూ ఒక సిగ్నేచర్ స్టయిల్ను క్రియేట్ చేసుకుంది.ఫ్యాషన్ ఇండస్ట్రీలో సంపాదించిన అనుభవంతో స్టయిలింగ్ చేయటం కూడా స్టార్ట్ చేసింది. అదే ఆమెకు సినీ తారల లుక్స్, స్టయిల్ను తీర్చిదిద్దే చాన్స్నిచ్చింది. అలా శ్రుతి తొలిసారి ‘బ్యాడ్ గర్ల్’ అనే తమిళ చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్గా పనిచేసింది. అందులోని ఆమె పనితీరు ఆమెకు మరెన్నో సినిమాల్లోనూ స్టయిలింగ్ చేసే అవకాశాన్నిచ్చింది. అలా శ్రుతి తమిళ చిత్ర పరిశ్రమలో ఒక బిజీ స్టయిలిస్ట్గా మారింది. ‘భూమ్’, ‘మోడర్న్ లవ్ చెన్నై’, ‘రఘు తాత’, ‘సొర్గవాసల్’ వంటి ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా, స్టయిలిస్ట్గా పనిచేసింది. కీర్తి సురేష్, ఐశ్వర్య లక్ష్మీ, సానియా అయ్యప్పన్, కళ్యాణి ప్రియదర్శిని, ప్రియాంకా మోహన్, గౌరి జి.క్రిష్ణన్ వంటి స్టార్స్కి కొంతకాలం స్టయిలిస్ట్గా పనిచేసింది. -
శాస్త్రీయ శక్తి
శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలాకాలం పురుషాధిక్యమే కొనసాగింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేర్లు చెప్పమంటే, ఎవరైనా అల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్ వంటి పురుష శాస్త్రవేత్తల పేర్లే చెబుతారు కాని, ఎందరో మహిళా శాస్త్రవేత్తలు తమ తమ ఆవిష్కరణలో శాస్త్ర సాంకేతిక రంగాలను సుసంపన్నం చేసిన సంగతి మీకు తెలుసా? శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘన విజయాలను సాధించిన మహిళా శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఎందరో యువతులను ఈ రంగాలవైపు ఆకట్టుకుంటున్నాయి, పెద్ద కలలు కనేలా చేస్తున్నాయి. బాలికలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృథాగా పోతున్నాయి. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే, విభిన్నమైన ఆలోచనలతో నవీన సాంకేతికతలను సృష్టించడానికి, అభివృద్ధి చేయడానికి వీలవుతుందనేది నిపుణుల మాట.ఇందుకోసం విద్యారంగంలో బాలికలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని; శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో వారి శక్తి సామర్థ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రారంభమైన రోజే ఫిబ్రవరి 11 ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’.. ఈ సందర్భంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆదర్శప్రాయులుగా చెప్పుకునే మహిళా శాస్త్రవేత్తల విజయాలు, వారి గురించిన విశేషాలతో ఈ ప్రత్యేక కథనం..అలా మొదలైంది...ప్రపంచ ప్రఖ్యాత కి నివాళిగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం కోసం ‘ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో)’, ‘మహిళలకు సైన్స్ కావాలి.. సైన్సుకు మహిళలు కావాలి’ అని నినాదం ఇచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా 2015లో ప్రకటించింది. దశాబ్దాల ఎదురుచూపు తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం లభించింది. ఇందుకోసం, ‘యునెస్కో’ ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికీ రేడియేషన్.. నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ. రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఆమె. రేడియో ధార్మిక మూలకాలైన రేడియం, పోలోనియంలను క్యూరీ గుర్తించారు. ఆమె కనుగొన్న రేడియం పేరు మీదుగానే రేడియేషన్ పదం పుట్టింది. ఈ పరిశోధనకుగాను 1903లో ‘ఫిజిక్స్ నోబెల్’ అందుకున్నారు. తర్వాత కెమిస్ట్రీలో పరిశోధనకు 1911లో ’కెమిస్ట్రీ నోబెల్’ పొందారు. తన పరిశోధనల సమయంలో క్యూరీ ఎంతగా రేడియేషన్కు గురయ్యారంటే, ఆమె రాసిన నోటు పుస్తకాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది.నోబెల్ కుటుంబం ప్రపంచంలోనే అత్యధిక నోబెల్ బహుమతులు కూడా మేరీ క్యూరీ కుటుంబం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె భర్త పియరీ క్యూరీ, కుమార్తె ఐరీన్ జోలియట్ క్యూరీ, అల్లుడు ఫ్రెడరిక్ జోలియట్, మేరీ రెండుసార్లు గెలుపొందడంతో మొత్తం కుటుంబం ఐదు నోబెల్ బహుమతులను అందుకుంది.కంప్యూటరుకు భాష నేర్పిందితొలి ఎలక్ట్రానిక్–డిజిటల్ కంప్యూటర్ ‘యూనివాక్’ను రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించిన అమెరికన్ శాస్త్రవేత్త గ్రేస్ హెూపర్. ‘బైనరీ’ భాషలోకి మార్చే తొలి కంపైలర్ ప్రోగ్రామును ఆమె రూపొందించారు. ‘కోబాల్’ ప్రోగ్రామ్ రూపకల్పనలోనూ ఆమెది కీలకపాత్ర. అణుశక్తిచైనాలో పుట్టి, అమెరికాలో స్థిరపడి అణుశక్తి తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్త చీన్ షుంగ్ వు. అణుబాంబుల తయారీ కోసం ‘మాన్ హట్టన్ ప్రాజెక్టు’లో ఆమె కీలకపాత్ర పోషించారు. రసాయనిక ప్రక్రియల ద్వారా యురేనియం ఉత్పత్తి చేసే విధానాన్ని తొలిసారి ఆమె కనుగొన్నారు.తెలివైన సీతాకోక చిలుకమరియా సిబిల్లా కీటక శాస్త్రవేత్త. గొంగళి పురుగులు రూపాంతరం చెంది సీతాకోక చిలుకలుగా మారుతాయని నిరూపించింది. అంతేకాదు, కుళ్లిన పదార్థాలు వివిధ రకమైన పురుగులు, కీటకాలను ఉత్పత్తి చేస్తాయని కనుగొన్నది కూడా తనే! ఇలా కీటకాలపై తను చేసిన పరిశోధనలు ఎన్నో విషయాలను ప్రపంచానికి నేర్పించాయి.కోపిష్టి దేవుళ్లు కాదు వాంగ్ జెనీ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. అమ్మాయిలను సైన్స్ చదవడానికి అనుమతించని కాలంలోనే జెనీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడింది. అప్పటి వరకు చంద్రగ్రహణాన్ని కోపిష్టి దేవుడిగా భావించడాన్ని తను నమ్మలేదు. అందుకే, తాళ్లతో ఒక భూగోళం, అద్దం, దీపాన్ని పట్టుకొని, చంద్రుడు భూమి నీడలో అదృశ్యమవుతాడని నిరూపించింది. అదే ఎంతోమంది శాస్త్రవేత్తలు, సూర్య, చంద్రగ్రహణాలపై అధ్యయనాలు చేసేలా చేసింది.వైద్యరంగానికి చికిత్స అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళ ఎలిజబెత్ బ్లాక్వెల్. డాక్టర్గా వైద్యరంగంలో విశేషమైన కృషి చేసింది. ఒక ప్రమాదంలో తన కంటిచూపు కోల్పోయి, సర్జన్ను కావాలనే తన కలను వదులుకుంది. కాని, ఆశయాన్ని కాదు. తర్వాత ఒక వైద్య కళాశాల ప్రారంభించి, ఎంతోమంది బాలికలు వైద్యులుగా మారడానికి సహాయం చేసింది.జంపింగ్ జీన్స్వారసత్వ నిర్ధారణ కోసం చేసే డీఎన్ఏ పరీక్షకు మూలమైన జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్క్లింటాక్. జన్యువుల్లో ఉత్పరివర్తనలకు, డీఎన్ఏ పరిమాణంలో మార్పులకు కారణమయ్యే ‘జంపింగ్ జీన్స్’ను కనుగొన్నందుకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. సైన్స్ టీచర్ స్కూల్సైన్స్ టీచర్గా సాలీ రైడ్– ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సాహించారు. తర్వాత వ్యోమగామిగా మారి, అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను తర్వాతి కాలంలో చేపట్టిన అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించారు. సాలీ ముఖ్యంగా బాలికలు అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి దోహదపడే కార్యక్రమాలను రూపొందించారు.డైనోసార్ మేడంశిలాజ శాస్త్రవేత్త మేరీ అన్నింగ్. ఇంగ్లాండ్ సముద్రతీరంలో కొండలను అన్వేషించి, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ప్లెసియోసారస్ అస్థిపంజరం ‘డగ్ ది డైనోసార్’ను కనుగొన్నారు. డైనోసార్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది ఇతర శాస్త్రవేత్తలకు చాలా ఉపయోగపడింది.మరెందరో..సూర్యుడు సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువభాగం హైడ్రోజన్, హీలియంతోనే నిండి ఉన్నాయని తొలిసారిగా వెల్లడించిన అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పేన్ గాపోష్కిన్. అమెరికన్ అంతరిక్ష సంస్థ ‘నాసా’ కంప్యూటర్లను వినియోగించడానికి ముందు అంతరిక్ష ప్రయోగాల సమయాన్ని, కచ్చితంగా గణించి చెప్పిన ’హ్యూమన్ కంప్యూటర్’ కేథరిన్ జాన్సన్.. ఇన్సులిన్, పెన్సిలిన్, విటమిన్ బీ12 వంటి జీవరసాయనాల అణు నిర్మాణాన్ని ఎక్స్–రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని రూపొందించిన శాస్త్రవేత్త డొరోతీ హాడ్కిన్.. ఇలా మరెందరో మహిళా శాస్త్రవేత్తలు..భారతీయుల్లోనూ..అమ్మాయిలను ఇంటి గడప కూడా దాటనివ్వని రోజుల్లోనే చాలామంది మహిళలు ఈ రంగంలో ఎన్నో విజయాలను సాధించారు. అలా ఒకసారి వెనక్కి వెళితే, పాశ్చాత్య వైద్యవిద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళ ఆనందీ బాయి, 1883లో ‘భారతదేశంలోనే వైద్యశాస్త్రంలో తొలి పట్టభద్రురాలిగా కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి మహిళగా గగన్ దీప్ ఎంతోమంది యువతులకు స్ఫూర్తినిచ్చారు.అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా; ఇటీవలి కాలంలో కోవిడ్ వైరస్ ధాటిని ముందే గుర్తించి హెచ్చరించిన భారత శాస్త్రవేత్త, డబ్ల్యూహెచ్వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్; మొక్కల కణాల్లో శక్తి ఉత్పాదనకు కీలకమైన ‘సైటోక్రోమ్ సీ’ అనే ఎంజైమును గుర్తించిన కమలా సొహెూనీ; క్యాన్సర్ను నిరోధించే ‘వింకా ఆల్కలాయిడ్స్’, మలేరియా చికిత్స కోసం వాడే ఔషధాలపై పరిశోధన చేసిన రసాయన శాస్త్రవేత్త అసీమా ఛటర్జీ; మైక్రోవేవ్ పరికరాలపై పరిశోధన చేసి, మన దేశంలో తొలి మైక్రోవేవ్ రీసెర్చ్ ల్యాబ్ నెలకొల్పిన శాస్త్రవేత్త రాజేశ్వరీ ఛటర్జీ; పుణె వైరాలజీ ల్యాబ్లో కోవిడ్ వైరస్ను వేరు చేసి, ‘కోవాక్సిన్’ రూపకల్పనకు మార్గం వేసిన ల్యాబ్ డైరెక్టర్ ప్రియా అబ్రహాం; అగ్ని–4, 5 క్షిపణుల రూపకల్పన ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త టెస్సీ థామస్.. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ రంగంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.రోజువారీ ఆవిష్కరణలు..1 పేపర్ బ్యాగ్ యంత్రం మార్గరెట్ ఎలోయిస్ నైట్పర్యావరణ రక్షణలో భాగంగా ఉపయోగించే పేపర్ బ్యాగులను ఉత్పత్తి చేసే యంత్రాన్ని రూపొందించింది శాస్త్రవేత్త మార్గరెట్ ఎలోయిస్ నైట్ 1870లో ఈస్టర్న్ పేపర్ బ్యాగ్ కంపెనీని స్థాపించి, ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించారు.2 కాఫీ ఫిల్టర్ మెలిట్టా బెండ్జ్ఉదయాన్నే లేచి కాఫీ తాగితే వచ్చే ఆనందం కంటే, చివర్లో మిగిలిన పొడితో కాఫీ తాగడం ఇబ్బందికరమే! మొదటిసారి పలుచటి కాగితంతో మెలిట్టా బెండ్జ్ కాఫీ ఫిల్టర్ను తయారుచేశారు. ఇది మరెన్నో కాఫీ ఫిల్టర్స్ తయారీకి ఆధారంగా నిలిచింది.3 విండ్ షీల్డ్ వైపర్స్ మేరీ ఆండర్సన్దుమ్ము, ధూళి, మంచు, నీరు, ఇతర పదార్థాలను వెంటనే తొలగించి, ప్రయాణం సాఫీగా సాగించే విండ్ షీల్డ్ వైపర్స్ను 1903లో, మేరీ ఆండర్సన్ రూపొందించారు.4 జీపీఎస్ గ్లాడిస్ వెస్ట్తెలియని ప్రాంతాలకు వెళ్లాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఉపయోగపడే జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ప్రోగ్రామింగ్ రూపకల్పనలో గ్లాడిస్ వెస్ట్ కీలక పాత్ర పోషించారు.5 గ్యాస్ హీటర్ అలిస్ ఎ పార్కర్శీతకాలంలో ఇంట్లో వెచ్చదనాన్ని అందించే గ్యాస్ హీటర్ను అలిస్ ఏ పార్కర్ రూపొందించారు. ఈ గ్యాస్ హీటర్ మరెన్నో ఎలక్ట్రికల్ హీటర్స్కు స్ఫూర్తినిచ్చింది.6 డిష్ వాషింగ్ మెషిన్ జోసెఫిన్ కోక్రాన్వంట సామాన్లను శుభ్రం చేసే, మొదటి డిష్ వాషింగ్ మెషిన్ను 1839లో జోసెఫిన్ కోక్రాన్ రూపొందించారు.7 వీఐఓపీ టెక్నాలజీ (వీడియో కాల్స్) మెరియన్ క్రోక్ప్రస్తుతం వీడియో కాల్స్ మాట్లాడుకోగలుగుతున్నామంటే కారణం మెరియన్ క్రోక్ .. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కృషి చేశారు.8 ఫ్రీక్వెన్సీ హోపింగ్ హెడీ లామర్హెడీ లామర్ గొప్ప ఆమెరికన్ నటి మాత్రమే కాదు, ఫ్రీక్వెన్సీ హోపింగ్ టెక్నాలజీని 1941లో కనుగొన్నారు. ఈ టెక్నాలజీనీ వైఫై, బ్లూటూత్లలో ఉపయోగిస్తున్నారు.మీకు తెలుసా?(యునెస్కో గణాంకాల ప్రకారం.. )⇒ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలలో మహిళల శాతం 33.3%⇒ మహిళా శాస్త్రవేత్తలకు సమాన అవకాశాలిస్తున్న దేశాలు 30⇒ ‘స్టెమ్’ విభాగాల్లోని విద్యార్థుల్లో మహిళలు 35%⇒ ఇప్పటివరకు నోబెల్ పొందిన మహిళలు 22⇒ జాతీయ సైన్స్ అకాడమీలలో మహిళల శాతం 12%⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాలలో మహిళల శాతం 22%సైన్స్లో లింగ వివక్ష మహిళలను అభివృద్ధినే కాకుండా, దేశ అభివృద్ధిని కూడా నిరోధిస్తుంది. మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి గల కారణాలలో లింగ వివక్ష, సామాజిక ఒత్తిడి, ఆర్థిక పరిమితులు, పరిశోధనలకు నిధుల కొరత. గుర్తింపులో అసమానతలు వంటి సమస్యలను మహిళా శాస్త్రవేత్తలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళా శాస్త్రవేత్తలు చేపట్టే పరిశోధనలకు నామమాత్రంగా నిధులు మంజూరవుతుంటాయి.ఇలాంటి పరిస్థితుల్లోనూ శాస్త్ర సాంకేతిక పరిశోధకుల మొత్తం సంఖ్యలో మహిళలు 33.3% ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. అయితే, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న వేగంగా, ఈ రంగాల్లో మహిళలకు లభించాల్సిన ప్రోత్సాహంలో వేగం కనిపించడం లేదు. అందుకే, శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళలకు, బాలికలకు సమాన అవకాశాలను కల్పించి, లింగ వివక్షను, వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. -
బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్
స్పెషల్ అకేషన్ ఎవరిదైనా, అక్కడ మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మార్చేస్తుంది స్టయిలిస్ట్ కళ్యాణి. ఇక పెళ్లికూతుళ్ల డ్రెస్ షాపింగ్ నుంచి వాటి ఔట్లుక్స్ వరకు ప్రతిదీ సూపర్గా ప్రజెంట్ చేసి, బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్గా మారుతుంది. ఆ విషయాలే..హైదరాబాద్లో పుట్టి, పెరిగిన కళ్యాణి ఫ్యాషన్ జర్నీ, చిన్నప్పుడు అమ్మ కుట్టు మెషిన్తో మెదలైంది. పట్టు లంగా వోణీలతో ప్రయోగాలు చేయటం ఆమె అలవాటు. క్రమంగా ఆ అలవాటే ఆసక్తిగా మారి, హమ్స్టెచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి ఫ్యాషన్ కోర్సు చేసింది. తర్వాత ‘కళ్యాణి డిజైన్స్’ పేరుతో బొటిక్ ప్రారంభించి, ఫ్యాషన్ డిజైనర్గా కెరీర్ మొదలుపెట్టింది. కొద్దిరోజుల్లోనే, తన అద్భుతమైన పనితీరుతో అందరినీ మెప్పించింది. ఇక పెళ్లికూతుళ్ళు అయితే, తమ హల్దీ, మెహందీ, బారాత్ ఇలా ప్రతి స్పెషల్ అకేషన్ కోసం డ్రెస్ సెలక్షన్స్కు కళ్యాణిని వెంట తీసుకొని వెళ్లేవారు. అలా చాలామంది బ్రైడల్స్కు బెస్ట్ ఫ్రెండ్గా మారి, వారి ఫొటో షూట్స్కు స్టయిలింగ్ చేయటం మొదలు పెట్టింది. అలా స్టయిలింగ్పై పట్టు సాధించి, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్స్తో పాటు, ‘స్వామిరారా’, ‘కేరింత’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రాజా విక్రమార్క’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. ఆ స్టయిలింగ్కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అలా ఆమె స్టయిలింగ్తో గార్జియస్ అనిపించుకున్న వారిలో శ్రీదివ్య, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, హరితేజ ఉన్నారు. రానా, నిఖిల్, కార్తికేయలాంటి మేల్ యాక్టర్స్కూ కళ్యాణి స్టయిలింగ్ చేసింది. ∙దీపిక కొండి -
వాటి వల్ల ప్రమాదమా?
నేను ఇప్పుడు మూడునెలల గర్భవతిని. ఇంట్లో చాలా సంవత్సరాలుగా పెంపుడు కుక్కలు, పిల్లులు ఉన్నాయి. వీటి వలన నాకు ఏదైనా ప్రమాదం ఉందా? – నైనిక, వరంగల్ప్రెగ్నెన్సీలో ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చినా, శిశువుకు వ్యాపిస్తుంది. దానితో కొన్ని ఆరోగ్య సమస్యలను చూస్తాం. జంతువుల ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఈ రోజుల్లో ఇంట్లో పెంపుడు జంతువులు ఉండటం చాలా సాధారణం. వాటికి వాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం వాక్సినేట్ చేయించాలి. పిల్లులు పెంచుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లుల మల విసర్జనలో టాక్సోప్లాస్మా అనే ఆర్గానిజమ్ ఉంటుంది. ఇది వ్యాపిస్తే, టోక్సోప్లాస్మోసిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది కడుపులోని బిడ్డకు హానికరం. అందుకే, మీరు పిల్లులకు సంబంధించిన కొన్ని పనులను చేయకూడదు. అంటే పిల్లి పరుపు, బొమ్మలను శుభ్రం చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే రబ్బర్ గ్లౌవ్స్ వేసుకొని చెయ్యాలి. జబ్బు పడిన పిల్లులకు దూరంగా ఉండాలి. తరచు చేతులు శుభ్రం చేసుకోవాలి. పిల్లులు మాత్రమే కాదు, గొర్రెలు, గొర్రె పిల్లలను పెంచుకునే వారు కూడా ఇదే జాగ్రత్త తీసుకోవాలి. అసలు జాగ్రత్త తీసుకోని వారికి ఈ పెంపుడు పిల్లుల బాధ్యత తీసుకోవటం వలన బేబీకి ఇన్ఫెక్షన్స్, పుట్టిన శిశువు తక్కువ బరువుతో ఉండటం, గర్భస్రావం, శిశువుకు గర్భస్థ వైకల్యాలు లాంటి సమస్యలు వస్తాయి. మొదటి మూడు నెలల్లో ఎక్కువ సమస్యలు వస్తాయి. బేబీ బ్రెయిన్ డామేజ్, బేబీ కళ్లు, ఇతర అవయవాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. రెండో త్రైమాసికంలో ఇన్ఫెక్షన్స్ వస్తే, పెంపుడు జంతువులకు చాలా వరకు వాక్సినేట్ చేస్తాం. కాని, కొంతమందికి రేబిస్ వ్యాపిస్తుంది. పెంపుడు కుక్కలు ఈ రేబిస్ వైరస్ని క్యారీ చేస్తాయి. వాటి గోళ్లను రోజూ శుభ్రం చేయాలి. ఈ జంతువుల టేబుల్వేర్, పెట్ నెట్స్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్గా వాక్సినేట్ చెయ్యాలి. పెట్స్ని దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు. కాని ఈ పై జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి పెట్స్తో ప్రెగ్నెన్సీలో అలెర్జీ, దురదలు వస్తాయి. వీటితో ఇనెఫెక్షన్స్ కావచ్చు. బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అందుకే, జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ పెంపుడు జంతువుల ద్వారా ఇన్ఫెక్షన్ రిస్క్ ఎంత ఉందని ప్రెగ్నెన్సీకి ముందు కొన్ని పరీక్షలు చేసి కనిపెట్టవచ్చు. మీకు ఇమ్యూనిటీ ఎంత ఉంది అని చెక్ చేసే టార్చ్ టెస్ట్ (ఖీౖఖఇఏ ఖీఉ ఖీ) ఉంది. మీకు యాంటీబాడీస్ లేకపోతే ఇన్ఫెక్షన్ చాన్స్ ఎక్కువ అని అర్థం. ఈ పెంపుడు జంతువుల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ని వాక్సిన్ ద్వారా అరికట్టలేం. కాబట్టి ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా చేతులు కడుక్కుంటూ, పరిశుభ్రత పాటిస్తున్నట్లయితే, చాలా వరకు ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించవచ్చు. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
శిల్పీ–గౌతమ్ హత్య
1999 జూలై 3 – ఆరోజు మధ్యాహ్నం వేళ. బిహార్ రాజధాని పట్నాలోని ఫ్రజేర్ రోడ్– నగరంలోని రాజకీయ ప్రముఖులు ఉండే ప్రదేశం. ఆ వీథి గల్లీల్లో పిల్లలు ఆటలాడుకుంటూ ఉన్నారు. దాగుడు మూతలు ఆడుకుంటూ ఒక చిన్నారి బుడతడు, ఒక చిన్నారి పాప వీథిలో నిలిపి ఉన్న కారు పక్కన దాగుందామని, కారు వద్దకు చేరుకున్నారు. తెరిచి ఉన్న కారు కిటికీలోంచి కనిపించిన దృశ్యం వాళ్లను భయభ్రాంతులను చేసింది. గుక్కపట్టి ఏడుస్తూ పరుగు తీశారు. దారినపోయే ఒక పెద్దమనిషి వాళ్లను ఆపి, ‘ఎందుకు ఏడుస్తున్నారు?’ అని అడిగాడు.‘మరేమో, ఆ కారులో ఒక అన్న, ఒక అక్క చచ్చిపోయి ఉన్నారు’ వెక్కిళ్లు పెడుతూ, ఆ కారుకేసి వేలితో చూపిస్తూ, బదులిచ్చాడు బుడతడు. ఆ కారు ఎమ్మెల్యే సాధు యాదవ్ క్వార్టర్కు చేరువలో నిలిపి ఉంది. సాధు యాదవ్ సాక్షాత్తు బిహార్ ముఖ్యమంత్రి రబ్డీదేవి సోదరుడు, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ బావమరిది. ఆర్జేడీ పార్టీలో పలుకుబడిగల నాయకుడు. బుడతడి సమాచారంతో ఆ పెద్దమనిషి కనిపించిన అందరికీ సంగతి చెబుతూ, దాదాపు పరుగు పెడుతున్నట్లే కారు వద్దకు చేరుకున్నాడు. కారులో ఒక యువతి, ఒక యువకుడు విగతజీవులై ఉన్నారు. యువతి శరీరంపై దుస్తులు సగం తొలగి ఉన్నాయి. కారు వద్ద గుమిగూడిన జనంలోంచి ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు. క్వార్టర్ సమీపంలో కలకలం గమనించిన ఎమ్మెల్యే అనుచరులు పోలీసుల కంటే ముందే కారు వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపట్లో పోలీసులు వచ్చారు. ఆర్జేడీ కార్యకర్తలు కూడా పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. మృతులను శిల్పీ జైన్, గౌతమ్ సింగ్గా గుర్తించారు. ముందురోజు ఇంటి నుంచి బయలుదేరిన వారిద్దరూ తిరిగి ఇంటికి చేరుకోలేదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శిల్పీ తండ్రి ఉజ్వల్కుమార్ జైన్. పట్నాలోని ప్రముఖ వస్త్రదుకాణం కమలా స్టోర్ యజమాని. గౌతమ్ తండ్రి డాక్టర్ బి.ఎన్.సింగ్. లండన్లో ఆయన సొంత క్లినిక్ నడుపుకుంటున్నాడు. శిల్పీ, గౌతమ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారిద్దరికీ త్వరలోనే పెళ్లి చేయాలని పెద్దలు కూడా అనుకున్నారు. శిల్పీ చదువు పూర్తయ్యాక పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకోవాలని ఇరువురి కుటుంబాలూ ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈలోగానే ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటనపై దర్యాప్తులో పట్నా పోలీసులు చేయరాని పొరపాట్లన్నీ చేశారు. రాజకీయ ఒత్తిడి వల్లనే వారు ఉద్దేశపూర్వకంగా అలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాల సేకరణ కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. పైగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒక కానిస్టేబుల్ ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకుపోయాడు. ఈ చర్యతో స్టీరింగ్పై వేలిముద్రలు సేకరించే అవకాశం లేకుండాపోయింది. కనీసం మృతదేహాలకు శవపంచనామా గాని, పోస్ట్మార్టం గాని జరగకముందే, కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ఈ సంఘటనను జంట ఆత్మహత్యలంటూ మీడియా ముందు ప్రకటించారు. ఆర్జేడీ కార్యకర్తలు మధ్యలో కలగజేసుకుని, మృతదేహాలకు పోస్ట్మార్టం జరిపించడానికి కూడా నిరాకరించారు. పోలీసులు ఎలాగోలా వాళ్లకు సర్దిచెప్పి, మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. అనుమానాస్పద పరిస్థితుల్లో మృతదేహాలు దొరికితే, పోస్ట్మార్టం రిపోర్టు రాకుండానే, పోలీసులు ఆత్మహత్యలంటూ ప్రకటించడంపై కొన్ని మీడియా సంస్థలు తీవ్రంగా విమర్శలు చేశాయి. తర్వాత పోస్ట్మార్టం రిపోర్టు వచ్చాక, విషం పుచ్చుకోవడం వల్లనే వారు మరణించారని పోలీసులు ప్రకటించారు. ఈలోగా వారు హడావుడిగా గౌతమ్ మృతదేహాన్ని దహనం చేసేశారు. శిల్పీ జైన్ పట్నా విమెన్స్ కాలేజీకి అందాలరాణి. కాలేజీ అందాల పోటీలో కిరీటాన్ని అందుకుంది. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఉండేది. కాలేజీలో ఆమె సన్నిహితులకు గౌతమ్ గురించి కూడా తెలుసు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరూ నమ్మలేకపోయారు. సంఘటన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన ఆరు రోజులకు శిల్పీ తల్లిదండ్రులు తమ కూతురిది, ఆమె సహచరుడిది ఆత్మహత్య కాదని, ఎవరో వారిని హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ, కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పట్నా పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా వారు అనుమానాలు వ్యక్తం చేశారు.కోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ కేసు పట్నా పోలీసుల నుంచి సీబీఐ చేతికి వెళ్లింది. సీబీఐ అధికారులు శిల్పీ మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను డీఎన్ఏ పరీక్షల కోసం హైదరాబాద్ లాబొరేటరీకి పంపారు. హైదరాబాద్ లాబొరేటరీ రిపోర్టులో దిగ్భ్రాంతికరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. మరణానికి ముందు శిల్పీపై పలువురు అత్యాచారం జరిపారని, ఆ హింస తట్టుకోలేకనే ఆమె మరణించి ఉండవచ్చని ఆ రిపోర్టు స్పష్టం చేసింది. ఆమె సహచరుడు గౌతమ్ మృతికి కారణాలు తెలుసుకుందామనుకుంటే, అప్పటికే అతడి మృతదేహాన్ని దహనం చేయడంతో కనీసమైన ఆధారాలు కూడా లేకుండాపోయాయి.ఈ సంఘటనలో సీబీఐ అధికారులు సాధు యాదవ్ను అనుమానితుడిగా గుర్తించారు. దర్యాప్తు కోసం రక్త నమూనాలు అడిగితే, ఆయన నిరాకరించాడు. నాలుగేళ్ల పాటు దర్యాప్తు సాగదీసిన సీబీఐ, ఈ కేసులో ఏమీ తేల్చలేకపోయింది. ఒక్క నిందితుడినైనా పట్టుకోలేకపోయింది. చివరకు ఏమీచేయలేక కేసు మూసేసింది. సీబీఐ ఎటూ తేల్చకుండా కేసును మూసివేయడంపై శిల్పీ జైన్ కుటుంబం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది జరిగిన కొద్దిరోజులకు శిల్పీ సోదరుడు ప్రశాంత్ జైన్ను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే, కొద్దిరోజుల తర్వాత అతడిని విడిచిపెట్టారు. అతడి కిడ్నాప్ కేసులో కూడా పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు. -
ప్రక్షాళన
‘ఆర్య బావ ఫోన్ చేశాడు నాన్నా, ఈవేళ మధ్యాహ్నం రెండుగంటల బస్సుకి వస్తున్నాడట!’బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా అంకిత్ చెప్పిన విషయం వినగానే మనసులో చెప్పలేనంత అలజడి మొదలైంది. మేనల్లుడిని చూడబోతున్నానన్న ఆనందం ఒకవైపూ, జరిగిపోయిన సంఘటనల తాలూకు చేదు అనుభవాలు మరోవైపూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, నా ప్రమేయం లేకుండానే నా మనసు గతాన్ని తవ్వడం మొదలెట్టింది.పుట్టింటికొచ్చిన అక్క కాన్పు సవ్యంగా జరిగి బంగారంలాంటి మేనల్లుడు పుట్టాడని ఇంటిల్లిపాదీ సంతోషిస్తున్నంతలోనే పిడుగులాంటి వార్త! పొలంలో పనిచేస్తున్న బావని ఏదో విషప్పురుగు కుట్టడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మధ్య దారిలోనే ప్రాణాలు పోయాయని! నాకు కాళ్ళూచేతులూ ఆడలేదు. అక్కైతే కబురు విన్న వెంటనే కట్టెలా బిగుసుకుపోయింది. అమ్మ శోకాలు మొదలెట్టింది. విషయం తెలిసి పరామర్శకి వచ్చిన చుట్టపక్కాలంతా ‘పుడుతూనే తండ్రి ప్రాణాలని మింగిన నష్టజాతకుడు’ అంటూ నా మేనల్లుడిని దూషిస్తుంటే వినలేకపోయాను. పసివాడిని హత్తుకుంటూ ‘ఆపండి! పసిపిల్లాడి మీద నిందవేయడానికి మనసెలా వస్తోంది’ అంటూ వాళ్ళందరి నోర్లూ మూయించింది నా భార్య సుజాత. ఆ తర్వాత నాతో ‘మీరు వెళ్లి ప్రయాణ ఏర్పాట్లు చూడండి’ అన్న సుజాత మాటలకు కర్తవ్యం తెలిసొచ్చి బయటకి కదిలేను. టాక్సీ మాట్లాడుకుని కుటుంబమంతా కలిసి బావ వాళ్ళ ఊరికి బయలుదేరాము.భర్త శవాన్ని చూసి గుమ్మంలోనే కుప్పకూలిపోయింది అక్క. తనతో పాటే అమ్మ కూడా! అది చూసి, వయసులో చిన్నదైనా తనకి తానే పెద్దరికాన్ని ఆపాదించుకుని, బాధ్యతనంతా నెత్తిన వేసుకుంది సుజాత. దహన సంస్కారాలు పూర్తయ్యాక అక్కని, బాబుని తీసుకొని తిరిగొచ్చేశాము.బావ చనిపోయిన ఆరుమాసాలకి ‘రామం, ఒక్కమారు ఊరికి వెళ్లి మీ బావగారి ఆస్తి వ్యవహారాలు చక్కదిద్దుకుని రావాలిరా! ఆస్తిలో మీ బావ వాటాని నీ మేనల్లుడి పేరున రిజిస్టర్ చేయించుకునిరా’ అన్న అమ్మ మాటలకు ఆశ్చర్యపోయా!‘అమ్మా! బావ వాళ్లకి ఆస్తిపాస్తులు ఏమున్నాయని మనం వాటాలు, పంపకాల గురించి మాట్లాడ్డానికి!’ అన్న నా మాటలకి, వెంటనే ‘అదేం మాటరా? ఇల్లూ, రెండెకరాల పొలమూ లేవూ! మా అత్తయ్యకి ఆయన ఒక్కడే మగసంతు కాబట్టి ఆ ఇంటి వారసుడిగా ఆ ఆస్తి మొత్తానికీ హక్కుదారు వీడేగా! మనం వెళ్లి అడగకపోతే మా అత్తగారు ఆస్తంతా మా ఆడపడుచులకి దోచిపెట్టేస్తుంది’ అంది అక్క.‘అది చెప్పేదీ నిజమేరా, దాని ఆడపడుచులిద్దరూ ఉంటున్నది ఆ ఇంట్లోనే కాబట్టి మాయమాటలతో తల్లిని బుట్టలో వేసుకుని ఆస్తి కాజేయగలరు. ఆలస్యం చేయకుండా రేపు ఉదయాన్నే బయలుదేరు’ ఆర్డర్ వేసింది అమ్మ. మరుసటి రోజే బావ వాళ్లూరికి ప్రయాణమయ్యాను.వాళ్ళింట్లో నన్ను సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ కూర్చున్న మూడుగంటల్లో నా మనసు ఆ కుటుంబ స్థితిగతులని అంచనా వేస్తూనే వుంది. పెచ్చులూడుతున్న గోడలూ, పై పెంకుల మధ్యనుండి తొంగి చూస్తున్న మబ్బుతునకలూ, వాటిగుండా కిందకి జారుతున్న వానచినుకులూ, ఇంకా ఆ అక్కాచెల్లెళ్ళ చిరుగుల బట్టలూ.. ఇవన్నీ చూస్తుంటే నా చిన్నతనంలో బాలమిత్ర కథలో చదువుకున్న కుచేలుని దైన్యస్థితి కళ్ళెదుట నిలిచినట్టనిపించింది. ఉన్న ఆ రెండు ఎకరాల్లో పండుతున్న కొద్దిపాటి పంట ఆ ఇంటి జరుగుబాటుకీ, ఇంకా మంచాన ఉన్న బావ తల్లి వైద్యానికే అరకొరగా సరిపోతోందేమో!భోజనాల అనంతరం ఆ పెద్దావిడ ‘కట్నం డబ్బులు పూర్తిగా ఇవ్వలేదని పెళ్ళైన ఏడాదిలోపే పెద్దల్లుడు నా కూతురిని పుట్టింటికి పంపించేస్తే, రెండు మాసాల్లో డబ్బులు సమకూర్చి అక్కని కాపురానికి పంపుతానమ్మా, నువ్వు నిశ్చింతగా వుండు’ అంటూ నాకు ధైర్యం చెప్పిన మీ బావ తొందరపడి వెళ్ళిపోయాడు. పాతికేళ్లు నిండిన చిన్నదాన్నేమో కట్నం ఇవ్వలేమన్న కారణంతో పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. నేను బతికుండగా దీని పెళ్లి చూస్తానో, లేనో’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఆ మాటలకి ‘అధైర్యపడకండి. మీరనుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి’ అంటూ ఓదార్చాను. బావ బాధ్యతలను పంచుకోని మాకు వాళ్ళ ఆస్తిలో హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదనిపించడంతో ఆ విషయం ఎత్తకుండానే సాయంత్రానికల్లా ఇంటికి తిరిగొచ్చేశాను. ఒట్టి చేతులతో నేనలా వెనక్కొచ్చేయడం అమ్మకి, అక్కకి బొత్తిగా నచ్చలేదు. సుజాత మాత్రం ‘మంచి పని చేశారు. ఏ దిక్కూలేని ఆ కుటుంబాన్ని బాధపెట్టడం మనకి శ్రేయస్కరం కాదు’ అంది.రెండేళ్ళ తర్వాత మాకూ బాబు పుట్టాడు. అంతదాకా ‘బాబూ’ అని పిలుస్తున్న నా మేనల్లుడికి ‘ఆర్య’ అనీ, నా కొడుక్కి ‘అంకిత్ ’ అనీ నామకరణం చేసి, ఇద్దరినీ రెండు కళ్ళలా చూసుకోసాగాం. వాళ్ళిద్దరూ బావామరుదులే అయినప్పటికీ రామలక్ష్మణుల్లా ఉండేవారు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ నా ఒక్కడి జీతంతో ఇల్లు గడవడం కష్టమవుతుండడంతో కుట్టుపనులు చేస్తూ, చిన్న క్లాసు పిల్లలకి ట్యూషన్లు చెప్తూ చేదోడు వాదోడుగా నిలిచింది సుజాత. ఆర్య పదవ తరగతి ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. ఇంటర్లో కామర్స్ తీసుకుంటానన్న రోజున, అక్కయ్య ‘లెక్కల సబ్జెక్టు తీసుకుని ఇంజినీరింగు చేస్తే లక్షల్లో సంపాదన వుంటుంది. జీవితంలో త్వరగా పైమెట్లు ఎక్కొచ్చు’ అంటూ వాడిపై ఒత్తిడి పెట్టింది. ‘పిల్లలకి ఆసక్తిలేని చదువులని వాళ్ళపై రుద్దడం మంచిది కాదు అక్కయ్యా! వాడికిష్టమైన కామర్సు చదివి, ఆపైన బ్యాంకు పరీక్షలు రాసి, పెద్ద ఉద్యోగంలోనే స్థిరపడతాడులెద్దూ’ అంటూ నచ్చజెప్పి వాడిని కామర్సు గ్రూపులో చేర్పించాను.ఆ తర్వాత రెండేళ్లకి అంకిత్ పదవ తరగతి పూర్తయింది. నాకు విజయవాడ దగ్గర ఓ చిన్న పల్లెటూర్లోని బడికి బదిలీ అయింది. పిల్లల చదువులూ, వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా కుటుంబాన్ని విజయవాడలోనే పెట్టి, నేనొక్కడినే వెళ్లాను. ఆర్యని డిగ్రీ కాలేజీతోపాటు బ్యాంకు పరీక్షల కోచింగ్ సెంటర్లోనూ చేర్చాను. అలాగే అంకిత్ని వాడి ఇష్టప్రకారం ఇంటర్ సైన్సు గ్రూపులో చేర్పించి, ఎంసెట్ కోచింగులో పెట్టాను. ఏడాదిన్నర కాలం ఏ సమస్యలూ లేకుండా గడిచిపోయింది. ఆ తర్వాత నేను తిరిగి విజయవాడకి బదిలీ చేయించుకునే ప్రయత్నాల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటుతో అమ్మ చనిపోవడం మా అందరికీ పెద్ద షాక్! దానికి మించిన దుర్వార్తని మరో ఆరునెలల్లో వినాల్సి వస్తుందని ఏ మాత్రం ఊహించలేదు.ఆ దుర్దినాన.. అల్మారా అంతా కిందా మీదా చేస్తున్న నన్ను చూసి ‘దేనికోసమండీ, అంతలా వెతుకుతున్నారు?’ అడిగింది సుజాత.‘అంకిత్ ఇంజినీరింగ్ అడ్మిషన్ ఫీజుకి డబ్బులు తక్కువ పడుతున్నాయి. అవసరాలకెప్పుడూ ఆదుకునే షావుకారు, ఈమారు పెద్దమొత్తంలో వ్యవహారం కాబట్టి హామీ కింద ఇంటి దస్తావేజులు కావాలంటున్నాడు. వాటి కోసం వెతుకుతున్నాను’ అన్నాను.‘ఆ మధ్యెప్పుడో అత్తయ్యగారు, వదినగారు ఆ పత్రాలని తీసుకున్నారండీ. మళ్లీ ఇక్కడ పెట్టారో, లేదో! ఉండండి, వదినగారిని అడుగుతాను’ అని సుజాత అంటుండగానే అక్కడికి వచ్చిన అక్కయ్య ‘ఏమిటిరా, ఎన్నడూ లేనిది దేని గురించో ఒకటే హైరానా పడుతున్నారు?’ అడిగింది.‘ఇంటిపత్రాల కోసం అక్కయ్యా ..’ అని చెబుతుండగానే ‘అవి నా పెట్టెలో భద్రంగా ఉన్నాయిలే గాని, వాటితో నీకేం పనిరా ఇప్పుడు?’ అక్కయ్య మాటలకి నా ప్రాణం లేచొచ్చింది.‘హమ్మయ్య, ఇంటి దస్తావేజులు ఎక్కడికీ పోలేదన్నమాట. అవి కనబడకపోయేసరికి కంగారేసింది అక్కా. నీ మేనల్లుడి ఇంజినీరింగ్ అడ్మిషన్ ఫీజు కోసం ఇంటిని షావుకారు వద్ద తాకట్టు పెట్టక తప్పడం లేదక్కా’ అన్నాను.నా మాటలకి అక్కయ్య కళ్ళలో తారసలాడిన కలవరపాటు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆపైన కొద్దిసేపు అక్కయ్య ఏమీ మాట్లాడకపోవడంతో నాలో ఆందోళన పెరిగింది. ఆ తర్వాత మెల్లగా ‘అది కాదురా తమ్ముడూ, అమ్మ చనిపోయే కొద్ది మాసాల ముందు ఈ ఇంటిని నీ మేనల్లుడి పేరిట రాసింది. తండ్రిలేని పిల్లాడికి ఏ క్షణాన ఏ అవసరమొస్తుందోనన్న జాగ్రత్తతో అమ్మ అలా చేసిందిరా’ అన్న అక్కయ్య మాటలకి నేను, సుజాత దిగ్భ్రాంతి చెందాము.‘అమ్మ అలా చేసిందా? ముందుగా నాతో ఒక్క మాటైనా చెప్పకుండా..’ నా మాట పూర్తి కాకుండానే ‘ఏమోరా, అవన్నీ నాకు తెలియదు’ అనేసి అక్కయ్య వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోతుంటే నేనూ, సుజాతా చేష్టలుడిగిపోయాము. ఇద్దరి మనసుల్లోనూ అగ్నిపర్వతాలు బద్దలవసాగాయి! నా మేనల్లుడిని నా కొడుకుతో సమానంగానే కదా చూశాను. వాడికి తండ్రి లేని లోటు రానిచ్చానా? నేను గానీ, సుజాతగానీ ఎన్నడైనా అక్కని, ఆర్యని పరాయివాళ్ళుగా చూశామా? నా జీతమంతా ఈ కుటుంబం కోసం, పిల్లల చదువుల కోసమే కదా వెచ్చించాను. అమ్మకివన్నీ తెలియవా? పోనీ అమ్మకు ఆలోచన లేకపోయింది అనుకున్నా.. అక్కయినా అమ్మని వారించి ఉండాల్సింది కదా! సర్లే , జరిగిందేదో జరిగిందనుకుని సర్దిచెప్పుకుందామనుకున్నా, కనీసం ఇప్పుడైనా ఇంటిపత్రాలని తెచ్చిచ్చి ‘ఇల్లు ఎవరి పేరున ఉంటే ఏమిట్రా, వెళ్లి కుదువ పెట్టి డబ్బులు తీసుకురా’ అనాలి కదా అక్కయ్య! మరిదేమిటి, అలా వెళ్ళిపోయింది? మనసంతా భారమవగా నిస్సత్తువగా మంచంపై కూర్చుండిపోయాను. నాకే ఇంత బాధగా ఉంటే, మెట్టినింట్లో ‘అందరూ నా వాళ్లే’ అనుకుంటూ నిస్వార్థంగా అందరితో కలిసిపోయిన సుజాతకు ఇంకెంత బాధగా ఉందో! ఆ ఆలోచనతో గభాల్న తలెత్తగా.. కళ్ళనీళ్ళతో కనిపించిన సుజాతని చూసి చలించిపోయాను. లేచి తన భుజం చుట్టూ చేతులు వేసి మంచంపై కూర్చోపెట్టాను. ‘బెంగపెట్టుకోవద్దు సుజా.. నా పీఎఫ్లో కొంత డబ్బుంది. అలాగే నా స్నేహితుడు మూర్తిని అడిగితే తప్పకుండా సాయం చేస్తాడు. నువ్వేం దిగులు పెట్టుకోకు’ అంటూ భరోసా ఇచ్చాను.నా మాటలు వింటూనే సుజాత భోరున ఏడ్చేసింది. ఏ పరిస్థితుల్లో అయినా చలించకుండా, దృఢంగా ఉండే సుజాత అలా ఏడుస్తుంటే మరింత దగ్గరకి పొదువుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను. దుఃఖభారం ఉపశమించే దాకా తనని అలాగే ఏడవనిచ్చాను. కొంతసేపటికి తేరుకున్న సుజాత ‘నేను బాధపడుతున్నది మనవాడి చదువు గురించి కాదండీ! అదేమంత పెద్దవిషయమని? నా నగలను కుదువపెట్టినా, లేదా వాటిని అమ్మేసినా ఆ అవసరం జరిగిపోతుంది. కాని, ఇన్నేళ్లుగా మనతోనే మసలుతున్న సొంత మనుషుల మనసుల్లో ఎటువంటి ఆలోచనలున్నాయో తెలుసుకోలేకపోయానే అని బాధేస్తోంది. మన అనుకున్నవాళ్ళే ఇంతలా మోసం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నానండీ! మనది కాని ఈ ఇంట్లో ఉండేందుకు నాకెంత మాత్రం మనస్కరించడం లేదు. మీతో పాటు వచ్చేస్తానండీ’ అంది దీనంగా.‘అలాగే సుజా, ఇంజనీరింగ్ అడ్మిషన్ పూర్తిచేసి వాడ్ని హాస్టల్లో చేర్పించిన తర్వాత మనిద్దరం కలిసి ఊరు వెళ్ళిపోదాం. కాకపోతే నాదొక విన్నపం.. ఈ విషయాలను పిల్లల చెవిన వేసి నిష్కల్మషమైన వారి మనసుల్ని పాడు చేయొద్దు. దీన్ని ఇక్కడితోనే మర్చిపోదాం, ప్లీజ్’ అన్నాను తన రెండుచేతులూ పట్టుకుని. సరే అన్నట్టుగా తలూపింది సుజాత. ఆ తర్వాత అక్కకీ, నాకూ మధ్య మాటలూ, రాకపోకలూ ఆగిపోయాయి. పిల్లలు మాత్రం ఎప్పటిలాగే ఫోనుల్లో మాట్లాడుకుంటున్నారు. మళ్లీ ఇన్నాళ్ళకి ఈ ఇంట్లో అడుగుపెట్టబోతున్న ఆర్యని చూసేందుకు నా మనసు ఉవ్విళ్లూరుతోంది.‘మావయ్యా..’ అంటూ పాదాలను తాకిన ఆర్య కరస్పర్శకి ఆలోచనల నుండి బైటకొచ్చి వాడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాను. ‘ఇన్నాళ్ళకి ఈ మావయ్యని చూడాలనిపించిందటరా’ అన్నాను కళ్ళు చెమ్మగిల్లుతుండగా.‘అదేం మాట మావయ్యా? ఎన్నోసార్లు నీ దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేయాలనిపించేది, కాని ఉద్యోగం తెచ్చుకునేదాకా నీ దగ్గరికి రావద్దని నువ్వు షరతు విధించావని అమ్మ గట్టిగా చెప్పింది. అందుకే నీ మాట దాటకూడదని చెప్పి ఇంతదాకా ఆగాను. బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకి నేను సెలెక్టయినట్టుగా తెలియగానే ఆ మాట నీకు చెప్పాలని వచ్చేశాను మావయ్యా. మరో నెలలో ట్రైనింగ్కి వెళ్ళాలి’ అంటూ నా నోట్లో మైసూరుపాకు కుక్కాడు ఆర్య.అదే ఊపులో వంటింట్లోకి వెళ్లి ‘అత్తయ్యా’ అంటూ సుజాతను రెండు చేతులతో చుట్టేశాడు. వాడి పట్ల సుజాతదీ మాతృవాత్సల్యమే కాబట్టి జరిగినవన్నీ మర్చిపోయి వాడిని దగ్గరికి తీసుకుంది.‘ట్రైనింగ్ పూర్తయాక పోస్టింగు విజయవాడలోనే ఇస్తారనుకుంటా. అప్పటికి మావయ్యక్కూడా విజయవాడకి బదిలీ అయిపోతే మళ్ళీ అందరం మునుపట్లాగే ఒక్కచోటే ఉండొచ్చు కదత్తయ్యా’కల్లాకపటం లేని వాడి మాటలకు మా కడుపు నిండిపోయింది.ఆ వేళ భోజనంలో అన్నీ తనకిష్టమైన ఆదరువులే ఉండడం చూసి ‘అత్తా, ఈ రుచి ఇంకెక్కడా దొరకదు’ అంటూ ఆవురావురని ఆరగించాడు. ఆ తర్వాత అంకిత్తో కలిసి ఊరు చూసేందుకు వెళ్తూ ‘మావయ్యా , ఇది మీకివ్వమని ఇచ్చింది అమ్మ’ అంటూ ఒక పెద్ద ప్లాస్టిక్ కవరుని నా చేతిలో పెట్టాడు. నేనూ, సుజాతా ఆశ్చర్యంతో ముఖముఖాలు చూసుకున్నాము. తెరిచి చూస్తే అందులో సీల్ చేసిన పెద్ద ఎన్వలప్, ఒక ఉత్తరం కనిపించాయి. ముందుగా ఉత్తరం తెరిచి చదవడం మొదలెట్టాను..‘తమ్ముడూ! ఎన్నడూ లేనిది అక్క నుండి ఉత్తరం ఏమిటాని ఆశ్చర్యపోతున్నావు కదూ! నీ ఎదుట నిలబడి మాట్లాడేందుకు ముఖం చెల్లకే ఈ లేఖ. తండ్రిలేని ఆర్యకి భవిష్యత్తులో ఏదైనా లోటు జరుగుతుందేమోనన్న అర్థంలేని శంకతో, అంతకు మించిన ధనాశతో అమ్మని ప్రేరేపించి, చేయకూడని తప్పే చేశాను. బావ చనిపోయిన నాటినుండి నన్నూ, నీ మేనల్లుడినీ ఇంట్లో పెట్టుకుని సొంత తల్లిదండ్రుల్లా ఆదరించిన నీకూ, సుజాతకూ ఆజన్మాంతం రుణపడి ఉండవలసింది పోయి విశ్వాసహీనంగా ప్రవర్తించాను. ఆ పాపమే ఈనాడు నన్ను క్యాన్సర్ రూపంలో దహించేస్తోంది.’‘క్యాన్సర్’ అన్న మాట చదువుతూనే కొయ్యబారిపోయాను. అది చూసి సుజాత గభాల్న నా చేతిలోని ఉత్తరం లాక్కుని పైకి చదివింది..‘నమ్మకద్రోహం చేసిన నన్ను, తోబుట్టువే కదాని మంచి మనసుతో నువ్వు క్షమించేసినా, పైనున్న ఆ భగవంతుడు శిక్షించక మానడుగా! బ్లడ్ క్యాన్సర్తో నాకు ఆ భగవంతుడు సరైన శిక్షే విధించాడు. అందుకు బాధ లేదు. కాని, నీ మేనల్లుడిని ఒంటరిని చేసి వెళ్తున్నానే దిగులు మాత్రం తొలిచేస్తోంది. ఇన్నాళ్ళూ తండ్రిలేని లోటు తెలీకుండా పెంచిన నువ్వూ , సుజాతా ఇకపై వాడికి తల్లి లేని లోటూ తీరుస్తారని ఈ జీవితానికి మిగిలిన ఊరట! ఈ ఉత్తరంతో పాటున్న మరో కవర్లో నీ పేరిట మార్పించిన ఇంటి దస్తావేజులున్నాయి. ఈ చివరి క్షణాల్లోనైనా నా తప్పుని సరిదిద్దుకునే అవకాశాన్నిచ్చిన ఆ భగవంతునికి సదా కృతజ్ఞురాలిని. చిన్న కోరిక తమ్ముడూ! నా చివరి రోజులని మీ సమక్షంలో సంతోషంగా గడపాలనుందిరా! నా తప్పుల్ని మన్నించి నన్ను ఆదరిస్తారన్న కొండంత నమ్మకంతో నీ మేనల్లుడి వెనకాలే మరో బస్సు పట్టుకుని బయల్దేరుతున్నాను. కానీ మీకు నా మొహాన్ని చూపించే ధైర్యం చాలక మన కులదైవమైన వేణుగోపాలస్వామి కోవెలకి వెళ్తున్నాను. మిమ్మల్ని చూడాలని, మీ నీడన చేరాలని మనసు ఆరాటపడుతోంది. నాకు క్షమాభిక్ష ప్రసాదిస్తారు కదూ! ఇట్లు మీ అక్కయ్య!’ ఉత్తరంలో చివరి అక్షరాలు వింటూనే ఒక్క ఉదుటున వేణుగోపాలస్వామి ఆలయం వైపు వెళ్ళాను, నాతోపాటే సుజాత కూడా! అక్కడ మాకోసం ఎదురు చూస్తూ ధ్వజస్తంభం వద్ద నిలబడ్డ అక్కను చూసి పోల్చుకోలేకపోయాను. చిక్కిశల్యమైంది. మాకు కన్నీళ్లాగలేదు. మమ్మల్ని చూసి భోరుమని ఏడుస్తున్న అక్కయ్యను దగ్గరకు తీసుకున్నాం. ‘మహాపరాధం చేశాను. ఫలితంగా ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోతున్నాను’ అంటున్న అక్కయ్య నోటికి తన చేతిని అడ్డు పెట్టింది సుజాత.‘మీకేం కాదు. సైన్సు చాలా అభివృద్ధి చెందింది. అన్ని జబ్బులనూ నయం చేయలేకపోయినా, తీవ్రతను తగ్గించి, ఆయుర్దాయాన్ని పొడిగించే మందులనైతే కనిపెడుతూనే వున్నారు. ధైర్యంగా వుండండి. పదండి ఇంటికి వెళ్దాం’ అంది సుజాత.‘అవును అక్కయ్యా! నీకేం కాదు’ అని నేనంటూండగానే అక్కయ్య సెల్ మోగింది. ఫోన్ తీసిన అక్కయ్య.. నిలబడే ఓపిక లేక అక్కడే మెట్లపై కూర్చుంది. ఫోన్ తెరపై‘డాక్టర్ సునీల్’ అన్న పేరు కనబడగానే ఆత్రంగా ఆ ఫోన్ అందుకుని ‘డాక్టర్ గారూ! మా అక్కయ్య ఆరోగ్యం ఎలా వుందో వివరంగా చెప్పండి ప్లీజ్, నాకు చాలా కంగారుగా వుంది’ అన్నాను.‘మీ అక్కయ్య టెస్టు రిపోర్టులని నిన్ననే మరో స్పెషలిస్ట్కి చూపించాం. ఆయన మీ అక్కయ్యకి వచ్చింది బ్లడ్ క్యాన్సర్ కాదనీ, కేవలం బ్లడ్ డిజార్డర్ మాత్రమేనని కచ్చితంగా చెబుతున్నారు. అయినా చివరి తీర్పు కోసం ఒక్కసారి మీ అక్కయ్యని ముంబై క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళి, మరోమారు బోన్ మ్యారో టెస్ట్ చేయిస్తే మంచిది’ చెప్పాడు డాక్టర్. ఆ మాట వింటూనే ‘మా చెవుల్లో్ల పాలు పోశారు డాక్టర్ గారూ! రేపే ముంబైకి తీసుకెళ్ళి పరీక్షలు చేయిస్తాను. థాంక్యూ’ అని ఫోన్ పెట్టేసి, ‘చూశావా అక్కయ్యా! నీకే జబ్బూ లేదు. అనవసరంగా భయపడిపోయి మమ్మల్నీ భయపెట్టావు’ అన్నాను హాయిగా నవ్వేస్తూ.‘పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. బహుశా, ఇదంతా నా మనసుని ప్రక్షాళనచేసి, నన్ను మీ వద్దకి చేర్చేందుకు ఆ జగన్నాటక సూత్రధారి ఆడించిన నాటకమేమో!’ అంటూ రెండు చేతులూ ఎత్తి భగవంతునికి మోకరిల్లింది అక్కయ్య. ఆమె మాటలకి బలం చేకూరుస్తున్నట్లుగా అప్పుడే గుళ్ళో గంట మోగింది. ‘శుభం! సాక్షాత్తూ ఆ వేణుగోపాలస్వామే అభయమిచ్చాడు, ఇంకేం భయం లేదు’ అన్న సుజాత మాటలకి అందరి మనసుల్లోని ఆందోళనా మటుమాయమవగా ఆనందంగా ఇంటికి బయల్దేరాం! -
బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్
స్పెషల్ అకేషన్ ఎవరిదైనా, అక్కడ మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మార్చేస్తుంది స్టయిలిస్ట్ కళ్యాణి. ఇక పెళ్లికూతుళ్ల డ్రెస్ షాపింగ్ నుంచి వాటి ఔట్లుక్స్ వరకు ప్రతిదీ సూపర్గా ప్రజెంట్ చేసి, బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్గా మారుతుంది. ఆ విషయాలే..హైదరాబాద్లో పుట్టి, పెరిగిన కళ్యాణి ఫ్యాషన్ జర్నీ, చిన్నప్పుడు అమ్మ కుట్టు మెషిన్తో మెదలైంది. పట్టు లంగా వోణీలతో ప్రయోగాలు చేయటం ఆమె అలవాటు. క్రమంగా ఆ అలవాటే ఆసక్తిగా మారి, హమ్స్టెచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి ఫ్యాషన్ కోర్సు చేసింది. తర్వాత ‘కళ్యాణి డిజైన్స్’ పేరుతో బొటిక్ ప్రారంభించి, ఫ్యాషన్ డిజైనర్గా కెరీర్ మొదలుపెట్టింది. కొద్దిరోజుల్లోనే, తన అద్భుతమైన పనితీరుతో అందరినీ మెప్పించింది. ఇక పెళ్లికూతుళ్ళు అయితే, తమ హల్దీ, మెహందీ, బారాత్ ఇలా ప్రతి స్పెషల్ అకేషన్ కోసం డ్రెస్ సెలక్షన్స్కు కళ్యాణిని వెంట తీసుకొని వెళ్లేవారు.అలా చాలామంది బ్రైడల్స్కు బెస్ట్ ఫ్రెండ్గా మారి, వారి ఫొటో షూట్స్కు స్టయిలింగ్ చేయటం మొదలు పెట్టింది. అలా స్టయిలింగ్పై పట్టు సాధించి, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్స్తో పాటు, ‘స్వామిరారా’, ‘కేరింత’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రాజా విక్రమార్క’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. ఆ స్టయిలింగ్కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అలా ఆమె స్టయిలింగ్తో గార్జియస్ అనిపించుకున్న వారిలో శ్రీదివ్య, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, హరితేజ ఉన్నారు. రానా, నిఖిల్, కార్తికేయలాంటి మేల్ యాక్టర్స్కూ కళ్యాణి స్టయిలింగ్ చేసింది. ∙దీపిక కొండిమంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుందనేది నా నమ్మకం. అందుకే, ఎన్ని కష్టాలు వచ్చినా భయపడను. బి పాజిటివ్.. బి హ్యాపీ ∙కళ్యాణి కె. -
పెద్దయ్య
మౌనంగా ఆయన నా వైపు చూశాడు కాని, నన్ను గుర్తుపట్టలేదు. ఆయన శరీరంలో చివరిగా మిగిలిన రెండు కన్నీటి చుక్కలు కళ్లకు అడ్డుపడి మసకబారినట్టున్నాయి. అందుకే నేను సరిగా కనపడక గుర్తురాకపోయి ఉండవచ్చు. ఎంతకాలమని మనిషి తన జ్ఞాపకాలను నిలుపుకోగలడు? ఏదో ఓ రోజు అన్నీ చెదిరి పోవాల్సిందేగా! పదిలంగా దాచుకున్న ఆయన జ్ఞాపకాలు చెదిరిపోయే సమయం వచ్చింది. అదంతా అర్థమవుతూనే ఉంది.అంతలో ఆయన కుడి కన్ను నుంచి ఓ నీటిబొట్టు జారి, నేల రాలటం నా కంట పడింది. కంటికి అడ్డుపడిన పొర తొలగిపోయి ఇప్పుడు నేను స్పష్టంగా కనిపిస్తూ ఉండవచ్చు. నాలో కాస్త ధైర్యం వచ్చింది. ఆశ మెరిసింది. ముందుకు వంగి ఆయన వైపు చూశా. ఆనంద విషాదాలు లేని శూన్యస్థితిలో ఉన్న ఆయన నా వైపు పరికించి చూశాడు. కాని, నన్ను గుర్తుపట్టలేదు. ఇంతకీ ఆయన గురించి చెప్పనే లేదు కదూ, ఆయన పెద్దయ్య. ఆయన పేరు ఇప్పటికీ నాకు తెలీదు. పెద్దయ్య కాబట్టి పేరుతో నాకేం పని? ఆయన గురించి చెప్పాలంటే ఓ కథ చెప్పినట్లే ఉంటుంది. ఇప్పటికి సరిగ్గా ముప్పై ఐదేళ్ల ఏళ్ళ క్రితం నాటి మాట. మొదటిసారి పెద్దయ్యని చూశాను. అప్పటికి నాకు పదేళ్ల వయసు. ఊహ తెలిసే వయసు కావడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ నాకు జ్ఞాపకమే!నేను పుట్టింది పెద్దయ్య ఊర్లోనే! కాని, మా చిన్నప్పుడే మా నాన్న ఉద్యోగరీత్యా పట్నం వలస వెళ్లిపోయాడు. చిన్నప్పుడు ఆ ఊరుతో ఉన్న జ్ఞాపకాలేవీ గుర్తులేవు. మా నాన్న, అమ్మతో కలిసి పెద్దయ్య ఇంటికి వెళ్ళింది ఆ ఊరుతో నాకున్న మొదటి జ్ఞాపకం. మొదటిసారి పట్నం నుంచి ఆ ఊరు వెళ్ళినప్పుడు ఇంటి ముందు కోడె దూడలకు సొద్ద బువ్వ తినిపిస్తూ పెద్దయ్య కనిపించాడు. ఎద్దులకు కడుపు నిండా తిండిపెట్టి, నీళ్లు తాగించి తీరిగ్గా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని పలకరించాడు. పెద్దయ్యకు మనుషులన్నా ఎద్దులన్నా ఒకటేనని కొన్నాళ్లకు తెలిసింది. ఇంటికి అల్లంత దూరంలో ఉన్న కొండపొలం అంటే ఆయనకు మరీ ఇష్టమని అర్థమైంది. ఆయన ఎద్దుల్ని ఇష్టపడ్డట్టే పిల్లలుగా ఉన్న మమ్మల్ని ఇష్టపడేవాడు. రాత్రి పూట మమ్మల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని, ఎన్నో కబుర్లు చెప్పేవాడు.ఆయన చెప్పే కబుర్లన్ని ఆ కొండపొలం గురించి, ఆయన ఎద్దుల గురించే! ఓ రోజు రాత్రి నులక మంచాల మీద పిల్లలందరం పడుకున్నాం. పెద్దయ్య కథలాంటి ఆయన అనుభవం చెప్పటం ప్రారంభించాడు. ఆ ఏడు జొన్న చేను ఇరగ్గాసింది. ఏడాది చివరి నెల కావడంతో చలి కూడా పెరిగింది. అసలే అది కొండపొలం. ఒంట్లో ఎముకల్లోకి చలి దూరి మెలిపెడుతోంది. అయినా చేనుకు కాపలా ఉండాలి. లేకపోతే అడవి పందులు గుల్ల చేస్తాయి. రాత్రంతా మంచె మీదే జాగారం చేయాలి. ఆరోజు అమావాస్య. ఎటు చూసినా చిమ్మ చీకటి. కాస్త కునుకు తీద్దామని పెద్దయ్య నడుంవాల్చాడు. కాసేపటికే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. పడమట చుక్క మూరెడు దిగింది. రెండు ఝాములు గడిస్తే పొద్దెక్కుతుంది. ఇక ఇబ్బంది లేదు. ఇంటికి పోవచ్చు అనుకుని చేతికర్ర పట్టుకుని ఇంటిదారి పట్టాడు పెద్దయ్య.చలిగాలి ఒంటికి తగులుతుంటే వడివడిగా నడుస్తున్నాడు. దారిలో కాలికేదో మెత్తగా తగిలింది. కళ్ళు ఇడమర్చి చూశాడు. అది పేద్ద కొండచిలువ. దూడల్ని ఒక్క ఉదుటున మింగే కొండ చిలువ. ఆ దరి నుంచి ఈ దరి వరకు పరుచుకొని పడుకుంది. పెద్దయ్యకు ఒళ్ళు జలదరించింది. మంచె కాడ వదిలిన ఇనుప గొడ్డలి గుర్తొచ్చింది. ఒక్క ఉదుటున మంచె కాడికి పరిగెత్తి, గొడ్డలితో తిరిగొచ్చాడు. తాటిచెట్టులా ఆ రాకాసి కొండ చిలువ మెదలకుండా దారికి అడ్డంగా పడుకునే ఉంది. ధైర్యం కూడగట్టుకొని గొడ్డలి ఆకాశానికెత్తి, ఒకే ఒక్క ఏటేశాడు. అంతే, రెండుగా తెగిన కొండచిలువ చచ్చూరుకుంది. పెద్దయ్య చెప్పే ముచ్చట్లన్నీ ఇలాగే కథల్లా ఉండేవి. ఊ కొడుతూ వినేవాళ్ళం. ఓ రోజు రాత్రి చీకట్లో పొలం పోతుంటే పెద్దయ్యకు చిన్న మేకపిల్ల దారిలో కనిపించిందట. పాపం ఎక్కడిదో ఎవరు వదిలేశారో అని బుజ్జి మేకను భుజానికెత్తుకొని నాలుగడుగులు ముందుకు వేశాడో లేదో ఆ మేక పిల్ల రెండింతలైందట! ‘ఏందబ్బా ఇది’ అని ఆలోచిస్తూ ఇంకాస్త ముందుకు కదిలాడో లేదో మేకపిల్ల కొమ్ములు తిరిగిన పోతుమేకైందట. వెంటనే పెద్దయ్యకు విషయం అర్థమై, పోతుమేక రెండు వెనక్కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడట. ‘ఓరి భడవా! తప్పిచ్చుకున్నావ్ ఫో!’ అంటూ దెయ్యం రూపంలో ఉన్న మేక మాయమైపోయిందట! పెద్దయ్యకు భలే ధైర్యం. పొలం పోవాలంటే ఊరి చివర చింతచెట్లు దాటి వెళ్ళాలి. అర్ధరాత్రి ఆ చెట్ల మీద ఎన్నిసార్లు కొరివి దెయ్యాలు కనిపించాయో లెక్క లేదట! కొరివి దెయ్యం కనపడ్డప్పుడు దాని కళ్ళలోకి చూడకూడదు, పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూడకూడదని మాకు సలహాలు చెప్పేవాడు. పిల్లలందరం ఒకరినొకరం పట్టుకొని దుప్పట్లు కప్పుకొని నిద్ర పోయేవాళ్ళం. తెల్లారి లేస్తే పెద్దయ్య కనపడడు. పొద్దు పొడవక ముందు ఆయన పొలం పోతే, మళ్ళీ తిరిగి వచ్చేది పొద్దుగూకాకే! పంట బాగా ఏపుగా ఉంటే పగలూ రాత్రీ పొలమే ఆయన ఇల్లు. ఆయనకు పొలం, ఇల్లు, ఆ ఊరు తప్ప మరో ఊరు తెలియదు. పెద్దయ్య ఇంటికి మేము వెళ్ళటమే కాని, ఒక్కసారి కూడా ఆయన మా ఇంటికి వచ్చినట్టు గుర్తులేదు.నాకు పెళ్లయి, పిల్లలు పుట్టినా పెద్దయ్య మా ఇంటికి రాలేదు. నాకు నలభై ఏళ్లు వచ్చాయి. ఇల్లు కట్టుకున్నా. ఒక్కసారి కూడా మా ఇంట్లో ఆయన చేయి కడగలేదు. ఓ రోజు నాకు బాగా గుర్తు. ఆ రోజు అందరం ఇంటి వద్దే ఉన్నాం. కాలింగ్ బెల్ మోగితే నేనే వెళ్ళి తలుపు తీశా. ఎదురుగా పెద్దయ్య. మల్లెపువ్వులా తెల్ల పంచె, తెల్ల చొక్కాలో మెరిసిపోతూ పెద్దయ్య. ఎప్పుడూ పొలం పనిమీద చొక్కా లేని పెద్దయ్యను అలా చూసేసరికి నన్ను నేనే నమ్మలేక పోయా. నేరుగా ఇంట్లోకి వచ్చి నాన్న కూర్చునే టేకు కుర్చీలో కూర్చున్నాడు. మా అందరికీ ఒకటే సంతోషం. పొలంలో ఉండాల్సిన పెద్దయ్య పట్నంలో మా ఇంట్లో తేలాడు. కొట్టంలో ఎద్దుల పేడ ఎత్తుతూ కనిపించే పెద్దయ్య ఇప్పుడు మల్లెపువ్వులా మెరిసిపోతూ నవ్వుతున్నాడు. ఆశ్చర్యంతో మాకు మాటలే రాలేదు. మౌనంగా మూగమొద్దుల్లా చూస్తూ ఉన్నాం. అందుకే ఆయనే మా వైపు చూసి నవ్వుతూ నోరు విప్పాడు. ‘అవునయ్యా! రావాలనిపించింది, వచ్చాను. ఏం.. పట్నం నాకు తెలీదనుకున్నారా? ఎక్కడికైనా వెళ్ళగలను. ఎద్దులు బేరం చేసేటప్పుడు ఎంతెంత దూరం వెళ్ళేవాళ్ళమో మీకేం తెలుసు? పట్నం నాకో లెక్క కాదు. మా అయ్య నాకు కొండవాలుగా అరెకరం పొలం ఇచ్చి పోయాడు.రెక్కలు ముక్కలు చేసుకుని ఇప్పుడు ఆరెకరాల పొలం చేశాను. ఇక చేసే ఓపిక లేదు. అందరూ పెద్దోళ్ళయ్యారు. పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళయ్యారు. ఇక ఎంతకాలం ఆ పొలం చుట్టూ తిరగాలి. నేనూ హాయిగా విశ్రాంతి తీసుకోవద్దూ. అందుకే అన్నీ ఎవరివి వాళ్ళకి ఒప్పచెప్పి ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు పనీ పాట లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతాను? అందరిళ్లకూ తిరుగుతున్నాను. మంచాన పడక ముందే తిరగాలి కదయ్యా!..’ పెద్దయ్య నవ్వుతూ చెబుతూనే ఉన్నాడు. టేకు కుర్చీలో కాలు మీద కాలేసుకుని, తలగుడ్డ చుట్టుకుని నవ్వుతూ మాట్లాడే పెద్దయ్యను చూస్తే ఆ రోజు మాకు ఓ హీరోలా కనిపించాడు. ఆ క్షణంలో పెద్దయ్యని చూస్తే నీషే కలగన్న సూపర్మేన్ ఇతనే కదా అనిపించాడు. ఇంకెక్కడో ఉండే స్వర్గంతో అవసరం లేకుండా ఇక్కడే ఈ భూమినే భూతలస్వర్గంగా భావించిన పెద్దయ్య సూపర్మేన్ కాక మరేంటి? పెద్దయ్యకు స్వర్గ నరకాలు తెలీవు. ఆయనకు కొండపొలమే భూతలస్వర్గం.‘శ్రమ ద్వారా జీవితాన్ని ప్రేమించడం అనేది నిగూఢ జీవిత రహస్యాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం’ అనే ఖలీల్ జిబ్రాన్ కవిత పెద్దయ్యకు అచ్చు గుద్దినట్టు సరిపోద్ది. పెద్దయ్య కూడా శ్రమించడం ద్వారానే జీవితాన్ని ప్రేమించాడు. జీవిత రహస్యాలను తెలుసుకున్నాడు. శ్రమ ఆయనకు ఆనందం. అక్షరజ్ఞానం లేని నిరక్షరాస్యుడు అయిన పెద్దయ్య ఇలా ఎలా జీవించాడు? ఇది నాకు ఎప్పుడూ అంతుచిక్కని ప్రశ్న!అక్షరజ్ఞానం లేని ఆయన, చదువు అవసరమే పడని ఆయన, చదువులేదని ఏ రోజూ బాధపడని ఆయన, ఎలా జీవించాలో థింకర్స్ భావించినట్లే జీవించాడు. ఆయన పనిని ప్రేమించాడు. పనిలోనే ఆనందం పొందాడు. పనే ఆయన దైవం. పని ఆయన స్వర్గం. ఇంతకన్నా సంపూర్ణమైన జీవితం ఏముంటుంది ? ఆందోళన లేకుండా, అనారోగ్యం బారిన పడకుండా, అత్యాశకు పోకుండా, జంతువులను మనుషులను సమంగా ప్రేమించే సుగుణాలు అందరిలోనూ ఉంటాయా? ఆ రోజంతా పెద్దయ్య మాతోనే గడిపాడు. మమ్మల్ని నవ్వించి, నవ్వుతూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.ఇప్పుడు నేను చెబుతున్న కథంతా ఆయన స్వచ్ఛంద పని విరమణ చేసిన ఇరవై సంవత్సరాల తర్వాత, పది రోజుల క్రితం జరిగింది. ఆ రోజు పెద్దయ్యకి ఒంట్లో బాగాలేదని కబురొచ్చింది. మందు బిళ్ళే మింగని ఆయనకు సుస్తీ చేయడమా? ఆలోచిస్తుంటే కాసేపటికి విషయం తెలిసింది. తెల్లవారుజామున మంచం మీద నుంచి కింద పడటంతో పెద్దయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టిందని డాక్టర్లు చెప్పారు. పచ్చటి ప్రకృతి మధ్య పక్షిలా ఎగిరే ఆయన మనసు ఆ రోగుల మధ్య ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. ఎంతో గొడవ చేస్తుంటే ఇక లాభం లేదని ఆయన్ను ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాల ప్రవాహాలకు రక్తం గడ్డలు అడ్డుతగులుతున్నాయి. పది రోజుల్లోనే అందర్నీ మర్చిపోయాడు. నన్ను గుర్తుపడతాడేమోనని ఆశపడ్డా. అదే ఆశతో ఆ రోజు ఇంటికి వెళ్లా. ఒంటరిగా ఓ గదిలో పెద్దయ్య గువ్వలా కూర్చున్నాడు. తలుపు తీసిన అలికిడికి మెల్లగా తల ఎత్తి నాకేసి చూశాడు. అంతే, మెల్లగా తలదించుకున్నాడు. ఆయన్ను అలా చూస్తానని ఎప్పుడూ ఊహించలేదు. పొలాలనన్నీ, హలాల దున్నీ, విరామ మెరుగక పరిశ్రమించిన పెద్దయ్య శాశ్వత విశ్రాంతికి సన్నద్ధమవుతున్నాడు. ఆ గదిలోని సీలింగ్ ఫ్యాన్ మెల్లగా తిరుగుతోంది. చల్లటి గాలి నా శరీరానికి తాకింది. అదే గాలి ఆయన శరీరానికీ తాకింది. ఆయన కప్పుకున్న దుప్పటి ఇంకాస్త బిగించి పట్టుకున్నాడు. ఆ దుప్పటి మాటున ఎముకల గూడు నా ఎక్స్రే కళ్లకు కనిపిస్తోంది. పది రోజుల నుంచి ముద్ద బువ్వ ముట్టని ఎనభై ఏళ్ల శరీరం ఎముకల గూడులా కాకుండా ఎలా ఉంటుంది. పట్టు విడిచే సమయం వచ్చిందని నాకు తెలుస్తూనే ఉంది.ఇవేమీ పెద్దయ్యకు తెలియదు. ఆయన ముఖంలో అలౌకిక ఆనందం కనిపిస్తోంది. కళ్ళు తడిగా ఉన్నాయి కాని, ముఖం చిరునవ్వుతో వెలిగిపోతూ ఉంది. శరీరంలోని అవయవాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు లేవు. లేకుంటే నవ్వే ముఖంలో కన్నీరు కార్చే కళ్ళు ఎలా ఉంటాయి? మౌనంగా అలానే నిలబడి ఉన్నా. ఆయన కూడా మౌనంగా అలానే కూర్చొని ఉన్నాడు. ఆ గదంతా ప్రశాంతమైన నిశ్శబ్దం. చిటుక్కుమన్నా చెవులు పగిలే నిశబ్దం.నా పక్కనే మరికొందరు నా వయసు వాళ్ళే నిలబడి ఉన్నారు. బయట కేరింతలు కొడుతూ పిల్లలు గోల చేస్తున్నారు. నేనూ, నా వయసు వాళ్లందరం పెద్దయ్యను చూస్తూ ఉన్నాం. ఎనభై ఏళ్లపాటు పోగేసిన జ్ఞాపకాలను భద్రంగా మా చేతుల్లో పెట్టి అలౌకిక ఆలోచనల్లో మునిగి పోయాడు పెద్దయ్య. -
మదరాసు మెరుపుతీగ
నటీనటుల రూపురేఖలు కూడా కొన్నిసార్లు కొంతమందికి ఫ్లస్ అవుతుంటాయి. చూడటానికి సమంత చెల్లిగా కనిపించి, జూనియర్ సమంతగా ఫేమస్ అయింది. ఆ ఫేమ్ను కాపాడుకుంటూనే, తన ప్రత్యేకతనూ ప్రపంచానికి పరిచయం చేస్తోంది నటి పవిత్ర లక్ష్మి.. ఆ విషయాలే.. ⇒ తమిళనాడులోని కోయంబత్తూరు పవిత్ర సొంతూరు. చిన్నప్పటి నుంచి అమ్మ చీరలతో డిజైనింగ్, స్టయిలింగ్ చేయటం చాలా ఇష్టం. ఆ ప్యాషన్తోనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది.⇒చదువు అయ్యాక, మోడల్గా మారి, కెరీర్ ప్రారంభించింది. 2015లో ‘మిస్ మద్రాస్’గా అందాల కిరీటాన్ని సాధించింది. తర్వాత ‘క్వీన్ ఆఫ్ ఇండియా 2016’ పోటీలోనూ పాల్గొని రన్నరప్గా నిలిచింది.⇒దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఓ కాదల్ కన్మణి’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసి, నటిగా మారింది. తర్వాత ‘కుక్ విత్ కోమలి’ రియాలిటీ షోలో కనిపించి పాపులారిటీతో పాటు, సినీ అవకాశాలను అందుకుంది.⇒ తొలిసారి ‘నాయిం శేఖర్’ చిత్రంతో హీరోయిన్గా మారింది. తర్వాత ‘టైమ్ ఎన్న బాస్!’ ‘ఉల్లాసం’, అదృశ్యం’ వంటి పలు చిత్రాల్లోనూ నటించింది.⇒ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే పవిత్ర, ఈ మధ్యనే సొంత యూట్యూబ్ చానెల్ ప్రారంభించి, ‘ఇన్నమ్ ఒరు మురాయ్’, ‘కనవు’ అనే తన పోయెటిక్ వ్యూ వీడియోస్లో నటించి వీక్షకుల ప్రశంసలు అందుకుంది.⇒ ప్రస్తుతం తను నటించిన ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్’ ఆహోలో స్ట్రీమ్ అవుతోంది.ఆరోగ్యంగా ఉంటే అందంగానూ కనిపిస్తాం. అందుకే, ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను. నా స్కిన్ కేర్ ప్రాడక్ట్స్, హెయిర్ ఆయిల్స్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను. – పవిత్ర లక్ష్మి. -
అతిచిన్న ఎయిర్పోర్ట్
విమానాశ్రయం అంటే సాధారణంగా, పొడవైన రన్వే, విశాలమైన ప్రదేశంలో చాలా పెద్దగా ఉంటుంది. కాని, కరీబియన్ దీవుల్లో నెదర్లాండ్స్ అధీనంలో ఉన్న సబా దీవిలో ‘జువాంకో ఇ. య్రాస్క్విన్’ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత చిన్న విమానాశ్రయంగా పేరొందింది. దీని రన్వే పొడవు కేవలం 400 మీటర్లు మాత్రమే! అంటే దాదాపు ఒక విమానం పొడవు కంటే కాస్త ఎక్కువ.చుట్టూ ఎత్తైన కొండలు, పక్కనే సముద్రంతో చూడటానికి అందంగా కనిపించే ఈ విమానాశ్రయం, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో ఒకటి. అందుకే, ఇక్కడ పెద్ద విమానాలను అనుమతించరు. కేవలం విమానయాన సంస్థ విండైర్కు చెందిన చిన్న విమానాలను మాత్రమే ఇక్కడ అనుమతిస్తారు. అయితే, 1959లో రెమీ డి హానెస్ ప్రారంభించిన ఈ విమానాశ్రయం, సరైన సదుపాయాలు లేకపోవడంతో చాలాకాలం నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం డచ్ ప్రభుత్వం దీనిని పునరుద్ధరించింది. అంతేకాదు, రోజువారీగా చిన్న విమానాలను నడుపుకునేందుకు కూడా అనుమతించింది. -
యువ కథ: సిల్లు పడ్డ సీర
‘వురెయ్ బామ్మర్ది ఇయ్యాలేటో వొల్లంత పచ్చి పుండు నాగుందిరా’ అప్పుడే నిద్రలేచొస్తూ అన్నాడు ఆదిబాబు. గుమ్మంలో తాపీగా చుట్ట కాల్చుకుంటున్న వీరయ్య ‘ఆ.. నిన్నంతా పనుల్తోటి అలిసిపోయినావు కద బావా. మరామాతరం సలుపులుంటాయినే’ అన్నాడు. ‘ఆ.. అంతేలాగుందిరా బాబూ. ఒలే! బూలచ్చిమి.. బూలచ్చిమీ..’ ఆమె పలికే వరకూ పిలుస్తూనే వున్నాడు ఆదిబాబు. ‘ఆ’ అరిచినట్టే పలికింది భూలక్ష్మి. ‘యేడి నీలెట్టే సానం సేత్తాను’ అని ఒక కేక పెట్టాడు. ‘నానంత కాలీగేటి నేను. నువ్వేల్లెట్టుకో’ లోపల నుంచి విసురుగా సమాధానం వచ్చింది. ‘ఆ.. యేటి దీని తల పొగరూ’అనుకుంటూ పక్కనే వున్న వీరయ్య వైపు చూసి ‘అదేట్రా మీయప్ప తెల్లారికే అలాగరత్తంది. లెగిసాకా కూడా సుసేను.. యేటో సెత్రువుని సూసినట్టు సూసింది. యేతంతావు కారనవు?’ అడిగాడు. వీరయ్య సన్నగా నవ్వుతూ ‘యేటి బావ నిన్న వొచ్చినోలు దెగ్గర యెతేన నాగేవేటి పేకాట్ల’ అని రహస్యంగా అడిగాడు. అడ్డంగా తలాడిస్తూ ‘మీయప్ప వల్ల సుకం నేదు నాకు. ఆగు ఇప్పుడే వత్తాను’ అంటూ లుంగీ ఎత్తి పట్టి నడుముకి చుట్టుకుంటూ పక్కనున్న సందు వైపు నడిచాడు ఆదిబాబు. అక్కడ ప్లాస్టిక్ బకెట్లోని నీళ్లని మొహం మీద జల్లుకుని, పుక్కిలించి ఉమ్మి, గూట్లో వున్న వేపపుల్లని నమిలి పిప్పిచేసి వదిలాడు. దండెం మీద తువ్వాలు కోసం వెదుకుతూ ఆ దండెం మీదే ఆరేసున్న చీరని పరిశీలనగా చూస్తూ నిలబడిపోయాడు. ‘బావా.. ఇగో తువ్వాలు’ పిల్చాడు వీరయ్య. ఆ పిలుపు వినబడనట్టే ఉండిపోయాడు ఆదిబాబు. అతని బుర్రలో వేల ప్రశ్నలు. ‘యేటలగ కొయ్యలాగ కదలడు’ అనుకుంటూ ఆదిబాబు దగ్గరకు వెళ్ళాడు వీరయ్య. ‘అలగ వుండిపోనవు యేటైంది బావ’ అడిగాడు. ‘యేటి నేదురా.. ఈ సీరేటి ఇక్కడుందని సూత్తన్ను. ఇది మాయమ్మ సిర.. దీన్ని ఇక్కడెవులు యేసేరూ?’ తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు అన్నాడు. వీరి అదో పెద్ద విషయమే కాదన్నట్టు మొహం పెట్టి ‘నిన్నే కదేటి బావా! మీయమ్మ సవస్రికవైంది. యేదో అవస్రానికి తీసుంతారు’ అన్నాడు. ‘ఎంత అవసరం వుంతే మాత్రం పెట్టెలున్న అడుగు సీరే తియ్యల? ఇగో సూడు ఈ సీరకి పెద్ద సిల్లు కూడా పడింది. ఒలే బూలచ్చిమీ.. బూలచ్చిమీ’ భార్యని ఏకధాటిగా పిలవడం మొదలుపెట్టాడు. వెంటనే వీరయ్య కంగారుగా ‘ఇప్పుడు దాన్నేల పిలత్తన్నవు బావా పల్లకో’ అన్నాడు. ‘మాయమ్మకి ఇట్టవైన సీరరా ఇది. దాని గేపకంగా దాసుకున్నాను. దాన్నిప్పుడు బైటకి నాగే అవసరం యేటొచ్చింది. దానిక్తోడు ఈ సిల్లోటి. ఇంత నిర్లక్సం యేటి దానికి’ అంటూనే కోపం ఆపుకోలేక మళ్ళీ పిలిచాడు ‘ఓలి బూలచ్చిమీ! ఇనబడట్నేదేటే’ ఈసారి అతని కఠం ఖంగుమంది.ఆ అరుపులని ఆదిబాబు గోలని గమనిస్తున్న భూలక్ష్మి నిదానంగా వచ్చి గుమ్మంలో నిలబడింది. ఆమె ఎప్పట్లా లేదనిపించింది అతనికి. బెదురు చూపులకి బదులు తెగింపు ఆమె కళ్ళలో. అలా తనని చూడగానే అడగడానికి లక్ష ప్రశ్నలున్నా వాటన్నింటినీ మర్చిపోయాడు ఆదిబాబు. భూలక్ష్మి కాసేపు అతన్నే తేరిపార చూసి, నిదానంగా అడిగింది ‘యేటి నీ కాకి గోల?’ ఆ మాటకి ఆదిబాబు కోపం నషాలానికెక్కింది.‘ఈ సీర బైటకెలగొచ్చింది?’ భూలక్ష్మి మొఖం చిట్లిస్తూ ‘ఏమో నాకేటి తెలుసు?’ అంది. ‘ఏటే ఆ సమాదానము.. ఈ ఇంట్ల యెంతమంది వున్నారు వచ్చి తీసీడానికి. వున్నదే మనిద్దరం. తీత్తే నువ్వు తియ్యాలి లేదంటే నాను తియ్యాలి. సక్కగ సెప్పు యెలా తీసేవో’‘ఏటి యకసెక్కాల గుందా? నాకు తెలీదని సెప్తున్ను కదా! నిన్న ఇల్లంతా సుట్టాలే! ఎవులు తీసేరో? యానికి తీసేరో?’ అంది. ‘యెంత నిర్లక్సమే నీకు. మాయమ్మ సీర, దానికి ఇట్టవైన సీర.. దాని గేపకార్దం నాను దాసుకుంటే దాన్ని బైటికి నాగిందే కాకంట దానికి సిల్లు కూడ యెట్టారు. ఇది ఎవులు ఎందుకోసం సేసేరో నాకు తెలిసీవరకు నేనొగ్గను’ తెగించినట్టే అన్నాడు ఆదిబాబు.భూలక్ష్మి చీర కొంగును బొడ్డులో దోపుకుంటూ ఇంటి గుమ్మం దాటి బైటకొచ్చింది. ‘యేటేటి.. మల్లి సెప్పు. ఈ సీరంటే నీకిట్టవా.. దీన్ని మీయమ్మ గేపకంగా దాసుకున్నవా.. ఓలమ్మొ ఓలమ్మో నాను ఎంత గుడ్డిదాన్ని.. నా మొగిడి గొప్ప హుదయం సూడలేకపోన్ను. ఎప్పుడూ తాగుబోతు నా కొడుకని తిట్టుకునీదాన్ని గానీ ఇంత గొప్పోడని తెలిత్తే దండేసి దండవెట్టీకపోనా’ అంది నాటకీయంగా చేతులు తిప్పుతూ. ఆమె ఉద్దేశం అర్థమైన ఆదిబాబు ‘నంగనాసిదానా నాటకాలాపే నీయమ్మ.. ఒల్లెలగుందే’ అన్నాడు ఆమె పైపై కెళ్తూ.‘నేకపోతే ఏట్రా సెత్తనాకొడకా... పెపంచకంలో నీదే గొప్ప పేమ అన్నట్టు హెచ్చులు పోతన్నవు. నువ్వడిగేవి దిక్కుమాలిన పెస్నలు. మల్లీ దానికో సమధానం కూడా సెప్పాలా..థూ’ ఆవేశంతో వూగిపోయింది. ‘అవునే సెప్పాలి. నువ్వు మగా ఇల్లాలివని నీ పీలింగ్ కదా.. ఇందల సూపించే నీ ఇల్లాలితనం. ఇంట్ల యేటి జరుగుతందో ఎవరేటి తీస్తన్రో తెలీకుండా బతకతంది.. ఇదొక ఇల్లాలు... దీనికో సపోర్టు’ఆ మాటకి భూలక్ష్మి నవ్వీ ‘పోనీ నానైతే మగా ఇల్లాలిని కానులే. నువ్వయితే గొప్ప ఈరుడివి కదా.. మరి నువ్వు కానుకోలేకపోనవా ఆ సీర ఎవులు తీసేరని. నీకు ఈ సీర మీదున్న ఇట్టానికి అలగ దాని ముందే కూకోలేకపోనవా? దాన్ని నీ బుర్రమీదెట్టుకొని వూరేగలేకపోనవా?’ అంది భూలక్ష్మి. ఆదిబాబుకి రోషం పొడుచుకొచ్చింది. ‘ఒలే నన్ను రెచ్చగొడితే మనిసిని కాను..’ చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. ‘నువ్వెలగు మనిసివి కాదన్న ఇసయం నాకు తెలుసులే ఇంక పల్లకో. మీయమ్మ బతికున్నప్పుడు సక్కగ సూసుకోడం సేతగానేదు గనీ ఇప్పుడేదో పేమ కారిపోతన్నట్టు గుండైపోతండు’ అందామె గుమ్మంలో వున్న అరగుపైన కూర్చుంటూ. ‘మగాడి పేమలన్నీ బైటికి అగుపిత్తాయేటే.. మనసులుంటయి గనీ’ ఆమెకు దగ్గరగా వెళ్తూ అన్నాడు ఆదిబాబు. ‘ఆ.. పేమొకటే దాసుకున్నవా.. యేరే రగస్యాలు కుడా దాసినావా ఆ మనసలా’ ఆమె గొంతులో వెటకారం ధ్వనించింది. ఆదిబాబూ ఆవేశంగా ముందుకు ఊరికాడు. ‘లక్స తొంబై దాసుకుంతానే నీకెందుకు? ముందీ సీర ఇసయం తేల్సు’ అంటూ ఆమె దగ్గరకి వెళ్ళబోతుంటే వీరి అడ్డుపడ్డాడు. ‘యేట్రా నీ గోల. ఆడోలు సీర్లు ఎందుకు తీత్తారు కట్టుకోడానికి తీత్తరు. అదెంత పాత సీరో కట్టుకోబోతే పుసుక్కున సిరిగుంటది. ఇంత సిన్న ఇసియానికా యానికలగ రంకె లేత్తన్నవు’ చిరాకుగా మొఖం పెడుతూ అంది.ఆమె చిరాకు అతడికి ధిక్కారంలా తోచింది. అవమానంతో గుండె భగ్గున మండింది. ఏం మాట్లాడాలో అర్థంకాక మౌనంగా వున్నాడు. కాసేపటి తర్వాత ‘యేవి ఈ ఆడోలికి సీర్లే కరువైపోనాయా. మాయమ్మ సీరే కావల్సొస్సిందా?’ అని అనగలిగాడు. అది కూడా వీరయ్య వైపు చూస్తూ. ‘యేటి రా నాయన. మీ యమ్మ సీరలోనున్న మగత్యవు. ఏటి దాసిస్సేవేటి ఈ సీరల ఇలగ గింజీసికుంతన్నవు’ భూలక్ష్మీ తగ్గలేదు. ఆదిబాబు నీళ్ళు నమిలాడు. అతనేం చెప్తాడా అన్నట్టు ఎదురు చూశాడు వీరయ్య. భూలక్ష్మి భర్తలో మారే రంగులను చూస్తూ ‘యేటాది బాబు.. పలకవు సెప్పు..’ రెట్టించింది.ఆదిబాబు తెగించాడు. ‘యేటి సెప్పాలే. నిజం తెలిసిపోనాక ఇంకేటి సెప్పాలి. నువ్వే ఆ సీర తీసేవ్. యానికో కూడా నాకు తెలుసు’ అని ఆగి, ‘దీనికి ఇసయం తెలుసని అరదమైపోనాది. మరి నేనెలా సెప్పాలి? దాన్నె ఇరకాటంల యెట్టి సెప్పిత్తాను’ అనుకుని, ‘మా యమ్మ మీద కోపంతో నువ్వే ఆ సీర సింపీసినావు. యేరు దాటాక తెప్ప తగలేసే రకవే నువ్వు. అది తెలక ఆ ముసిల్ది నీకు సపోర్టు సేసింది’ కసిగా అన్నాడు. అతను విషయాన్ని ఎలా నరుక్కొస్తున్నాడో అర్థమైంది భూలక్ష్మికి. అతని నోటి నుంచి నిజం రాదని గ్రహించి, తన వ్యూహాన్ని రచించింది. ‘మీయమ్మతో ఏ నాడైన పేమగ మాటాడేవా నువు? అదే సేసుంటే నాకెలా సపోర్టు సేస్తది మీ యమ్మ?’ ‘ఎదో మందెట్టుంటావు’ టక్కున అన్నాడు. ‘ఓలమ్మ నాను మందెట్టీసినానట. ఈలమ్మని పొట్టనెట్టుకుంది ఈడు.. సుట్టు తిరిగి నన్నంతండు’ అంది భూలక్ష్మి అతడి అహాన్ని దెబ్బకొడుతూ. అది చీర విషయంగా రేగిన గొడవలా ఇంకెంతమాత్రం అనిపించలేదు వీరయ్యకి. చుట్టూ జనం గుమిగూడారు. పొద్దున్నే భార్యభర్తల గొడవ భలే రంజుగా వుంది వాళ్ళకి. మాటలు కరువైన ఆదిబాబు ‘ఇదో బూలచ్చిమి.. పోన్లే కదని వూరుకంటంటే పెట్రేగిపోతనవు. మాయమ్మని నేను పొట్టనెట్టుకోడవేటే?’ అన్నాడు. ‘సిక్కింది సేప’ అనుకుంది భూలక్ష్మి. ‘నేనండవేటి వూరు వూరే అంతంతే.. కాలంటే ఇలందరి నుండి సాచ్చకం తీసుకొత్తాను’ అంది. ‘నీ సాచ్చకాలేటి నాకక్కర్నేదు. అది నా తల్లే. నేనేటైన సేసుకుంతాను నా ఇట్టం. నీకేటి మజ్జిల’ ఆవేశంతో అతని గొంతు వణికింది. ‘ఇంత తెగించీసినోడివి మరి నీకేల ఈ సీర ఇసయం. అది సిరిగిపోతే నీకేవి అరిగిపోతే నీకేవి’ మళ్ళీ తిరిగి విషయాన్ని అక్కడికే తీసుకొచ్చింది భూలక్ష్మి. ‘నీయమ్మ ఎంత పొగరే నీకు’ అంటూ పైపై కొచ్చాడు ఆదిబాబు. ‘యేటి కొడతావా? కొట్టు. నువ్వేనేటి నేనూ సెయ్యగలనా పని’ అంటూ భూలక్ష్మి ఓ మూలనున్న రోకలి తీసుకొని వచ్చింది. అదంతా చూస్తున్న వీరయ్య కంగారుగా వాళ్ళ మధ్యలో దూరి ‘సుకంగుండడం సేతకాదేటి మీకు? సిన్న సీరముక్క కోసం గొడవలు పడుతన్రు’ అన్నాడు. ఆదిబాబు కోపంతో బుసలు కొడుతున్నాడు. ‘ఇసయం సీర కాదురా ఈరీ.. ఆడి గొడవ సీర కోసం అంతకన్నా కాదు. ఆ సీరలో దాసిపెట్టిన ఆత్తి పత్రాలేవి అని అడగలేక ఈ బాద’ అంది భూలక్ష్మి. అందరూ ఆశ్చర్యపోయారు. ‘ఏటవుతుంది బావా ఇక్కడా.. ఆత్తి పత్రాలేటి దాన్ని దాసిపెడ్డం యేటి.. ఈ గోలేటి?’ అడిగాడు వీరి. దానికి సమాధానం ఎం చెప్పాలో తెలియక ఉక్రోషం ఆపుకోలేక భూలక్ష్మిని కొట్టడానికి వురికాడు ఆదిబాబు. ‘ఇద ఈ పాపిట్టిదాన్వల్లే నా బతుకిలగ అయ్యింది. నా ఆత్తి మీద నాకు అక్కు లేకుండ సేస్సేవు కదే దొంగ ముండా’ అంటూ ఆమె చెంపల మీద ఆపకుండా కొట్టాడు. చుట్టూ వున్న వాళ్ళు బలవంతంగా అతన్ని వెనక్కి లాగి ఆమె దగ్గరకు వెళ్ళకుండా శక్తి కొలది పట్టుకున్నారు. భూలక్ష్మి వాచిన చెంపలను తడుముకోకుండా రేగిన జుట్టును సర్దుకోకుండా అలాగే ఆదిబాబును చూస్తూ వుంది. ‘అప్ప ఇద.. ఈ నీలు తాగు’ అని నీళ్ళందించాడు వీరయ్య. వెంటనే అతడి చేతిలో వున్న గ్లాసుని విసురుగా తీసుకొని బలంగా నేలకేసి కొట్టింది. ‘నా మీద నీ పెతాపం సుపిత్తే యేడుసుకొని మూల కూకున్న రోజులు పోనాయి. నువ్వేటో వూడబొడుత్తవని లక్సలు పోసి కట్టబెట్టారు మాయమ్మోల్లు. నువ్వా పైసాకి పనికి రానోడివి. నా కట్టం తిని నన్నే తన్నెవోడివి. మీయమ్మ సచ్చిపోయాక కనీసం దాని సావుకి కారనం కూడ అడక్కండా డవిరెక్టుగ ఆత్తి ఇవరాలు అడిగినోడివి. తూ నీ బతుకు! ఇదో అందరినండి. యేదో ఆలమ్మ మీద పేమ కారిపోతున్నట్టు అంతెత్తున ఎగిరి పడతన్డు గనీ ఆయమ్మ బతికున్నపుడు ఒక్కరోజు కూడా ఈడు పేమగా సూసింది లేదు. దాని ఆస్పెత్రి కర్సులకి దాసుకున్న డబ్బులు కూడా తీస్కెలి తాగిన తాగుబోతోడీడు. దాని శవం కాడికి కూడ తాగేసొచ్చిన యదవ. ఇంత కాత్ర లేనోడికి ఆయమ్మ ఆత్తెలా రాత్తది? అందికే పోయే ముందే పెద్దోల్నెట్టి ఆయమ్మ కూతురు పేర్న నా పేర్న దానికున్నదంతా ఇచ్చీమని యీలునామా రాయింసింది. ఆ యీలునామాని సింపిసినాడీ బాడుకోవు. ఇప్పుడీ ఆత్తి పత్రాలు దాసీసి ఆత్తికి అక్కుదారుడైపోదమని ఈడి ఆలోసన. ఆడముండలం మాకు ఆత్తంత వచ్చీసినాదని ఈడీ యేడుపు. ఇప్పుడు సెప్పండర్రా ఆ పత్రాలని ఈడికి తెలకుండా తీసీడం తప్పా’ అంటూ బలంగా ఊపిరి పీల్చుకుంది భూలక్ష్మి. ఎటు పోయి ఎటొస్తుందోనని జనం మెల్లగా జారుకున్నారు. వీరయ్య ఆ మొగుడూ పెళ్లాలను చూస్తూ నిలుచున్నాడు. ఏవేవో ఆలోచనలు బుర్రలో సుడులు తిరుగుతుండగా ఆదిబాబు ‘మీకు సాచ్చకాలే లేవు. సింపీసిన ఈలునామ వొట్టుకొని యే కోరుటుకెల్తారు. ఒకేల యెల్లినా గెలిసేది నాయవేనే. అది నా కాడుంది గుర్తెట్టుకో’ అన్నాడు. ‘ఏటా నాయం.. తాగీసొచ్చి ఒల్లు పై తెలీకండా తల్లిని, ఆలిని సితకబాదడవా? ఆడోల కట్టం మీద తిని తొంగోడవా?’ సూటిగా చూస్తూ అడిగింది భూలక్ష్మి.‘ఇయ్యనిటి కన్న పెద్ద అర్గత.. నాను మగాడ్నవ్వడవేనే..’ ఆదిబాబు స్వరంలో గర్వం. అతడి వైపు అసహ్యంగా చూసి ‘తూ! మగాడివైపోతేటిరా ఆరతట్టాలా? నువ్వు మాలాటి మడిసివే గుర్తెట్టుకో. అయినా పుట్టకలో మగాడివైపోతే సరిపొద్దేటి. గునంలో నవ్వక్కర్నేదా?’ అందామె. బుసలు కొడుతూ ఆదిబాబు జారిపోతున్న లుంగీని బిగించి కట్టుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. ఏ అఘాయిత్యం చేస్తాడోనన్న భయంతో వీరయ్య అక్క దగ్గరకొచ్చి ‘ఓలే బావా యెలిపోతున్నాడే’ అన్నాడు కంగారుగా. ‘యెల్లని ఆడేటి సెయ్యినేడు.. తాగి తొంగుంటే ఆడి ముడ్డి, మూతి కడిగి పెతిరోజు జెబ్బలరిగిపోయినట్టు పనిసేసేది నానైతే యేటి సెయ్యనోడికి ఆత్తేటి. మల్లి ఇదే నాయవని ఆడు ఇర్రీగడవేటి. ఆడాలికి ఆత్తి ఎందుకొద్దు. అది ఆల్ల అక్కు కాదా? అక్కులు ఎవరియ్యరట. మావే పోరాడి లాక్కోలట. ఇప్పుడు అదే కదా సేశాను. ఇక పైన కూడ అదే సెయ్యాలి. సేత్తను..’ అంది భూలక్ష్మి స్థిరంగా. వింటున్న వీరయ్యకి ఏదో సత్యం బోధపడ్డట్టు కళ్ళు విశాలమయ్యాయి. -
రావణుడి పరాజయం
కార్తవీర్యార్జునుడికి వెయ్యి చేతులు ఉండేవి. అందువల్ల అతడు సహస్రబాహు అర్జునుడిగా ప్రసిద్ధి పొందాడు. పదితలలు గల రావణుడు దశకంఠుడని ప్రసిద్ధి పొందాడు. అప్పటికే దేవతలను జయించిన విజయగర్వంతో ఉన్న రావణుడు కార్తవీర్యార్జునుణ్ణి జయించాలని తలచి, సైన్యాన్ని వెంటబెట్టుకుని, కార్తవీర్యార్జునుడి రాజధాని అయిన మహిష్మతీపురానికి బయలుదేరాడు.మహిష్మతీ నగరానికి చేరువలో, నర్మదా నది ఒడ్డున రావణుడి సైన్యం విడిది చేసింది. ఎదుట నర్మదా నది కనిపించడంతో నదీస్నానం చేసి, శివార్చన చేయడానికి రావణుడు సమాయత్తమయ్యాడు. నది ఒడ్డున ఇసుకలో బంగారు శివలింగాన్ని ఉంచి, స్తోత్రాలు పాడుతూ, నర్తిస్తూ శివార్చన చేయసాగాడు. ఇంతలో నర్మదా నది ఉప్పొంగి, నదీజలాలు ఎదుటికి ప్రవహించసాగాయి. నెమ్మదిగా శివలింగాన్ని ముంచెత్తడం ప్రారంభించాయి. ఈ పరిణామానికి రావణుడు చకితుడయ్యాడు.‘వానా వరదా లేకున్నా, నది ఉప్పొంగి నీరు ఎందుకు ఎదుటికి ప్రవహిస్తోంది? నదిలో ఏం జరుగుతోంది? చూసి, తెలుసుకుని రండి’ అంటూ రావణుడు తన భటులను పంపాడు.నదిలో కార్తవీర్యార్జునుడు తన భార్యలతో కలసి జలక్రీడలాడుతున్నాడు. అతడు తన వెయ్యి చేతులతో నది ప్రవాహాన్ని అడ్డుకోవడంతో నది ఉప్పొంగి ఎదుటికి ప్రవహిస్తోంది. రావణుడి అనుచరులు ఈ దృశ్యాన్ని చూసి, రావణుడికి చెప్పారు.రావణుడు సైన్యాన్ని సిద్ధం చేసుకుని, నర్మదా నది ఒడ్డుకు వెళ్లాడు. అక్కడ కాపలాగా కార్తవీర్యార్జునుడి మంత్రులు కనిపించారు. ‘రణరంగ శూరుడైన రావణుడు యుద్ధానికి వచ్చాడని మీ రాజుకు చెప్పండి’ అని వాళ్లతో అన్నాడు.‘యుద్ధానికి మంచి సమయాన్నే ఎంచుకున్నావే! రాజు జలక్రీడలాడుతుండగా, ఎవరైనా యుద్ధానికి పిలుస్తారా? నీ చేతులకు అంత తీటగా ఉంటే, రేపు యుద్ధానికి వచ్చి నీ ప్రతాపం చూపించు. ప్రస్తుతానికి దయచెయ్యి’ అని వాళ్లు ఎకసెక్కంగా బదులిచ్చారు.‘ధైర్యం ఉంటే మీ రాజును ఇప్పటికిప్పుడే యుద్ధానికి రమ్మనండి. లేకపోతే, పారిపోవడానికే రేపటి వరకు గడువు కోరుతున్నారనుకుంటా’ అన్నాడు.వీడు మరీ మొండిఘటంలా ఉన్నాడనుకున్న మంత్రులు, కార్యవీర్యార్జునుడికి రావణుడు యుద్ధానికి వచ్చిన సంగతి చెప్పారు. ఇప్పటికిప్పుడే యుద్ధం కావాలని మొండికేస్తున్నాడని కూడా చెప్పారు.కార్తవీర్యార్జునుడు జలక్రీడలను చాలించి, వెనువెంటనే యుద్ధానికి సమాయత్తమయ్యాడు. భయపడవద్దని భార్యలకు చెప్పి, యుద్ధానికి బయలుదేరాడు. తన ఐదువందల చేతులతో వివిధ ఆయుధాలను ధరించాడు. మిగిలిన ఐదువందల చేతులతో ఒక భారీ గదను పైకెత్తుకుని, దానిని గిరగిరా తిప్పుతూ రణరంగంలోకి అడుగుపెట్టాడు. రావణుడి సేనాధిపతి ప్రహస్తుడు అతడికి ఎదురు వెళ్లి, ఒక ముసలాన్ని విసిరాడు. కార్తవీర్యార్జునుడు తన గదతో ఆ ముసలాన్ని గాల్లో ఉండగానే తుక్కుకింద ముక్కలు చేసి, గదతో చాచిపెట్టి ప్రహస్తుణ్ణి కొట్టాడు. ప్రహస్తుడు ఆ దెబ్బకు మూర్ఛపోయాడు. ఇది చూసి పక్కనే ఉన్న రావణుడి మంత్రులు మారీచ సుబాహ ధూమ్రాక్షులు కాలికి బుద్ధి చెప్పి, వెనక్కు పరుగు తీశారు.ప్రహస్తుడు పడిపోవడం, మంత్రులు పలాయనం చిత్తగించడం గమనించిన రావణుడు తానే నేరుగా కార్తవీర్యార్జునుడి ఎదుటికి వచ్చాడు. ఒక భారీ గద పట్టుకుని అతడితో తలపడ్డాడు. ఇద్దరూ గదలతో ఒకరినొకరు మోదుకున్నారు. ఇద్దరిలోనూ ఒక్కరూ వెనక్కు తగ్గలేదు. గదాఘాతాలతో ఇద్దరి ఒళ్లూ రక్తసిక్తంగా మారినా, కొండల్లా చలించకుండా నిలిచి గంటల తరబడి పోరాటం సాగించారు. వాళ్ల గదా ఘాతాల ధ్వనులకు, వారి పదఘట్టనలకు చుట్టుపక్కల భూమి కంపించసాగింది. కార్తవీర్యార్జునుడు అదను చూసుకుని, రావణుడి ఛాతీపై గదతో బలంగా మోదాడు. ఆ దెబ్బకు రావణుడి గద చేతి నుంచి జారిపోయింది. రావణుడు నేల కూలిపోయాడు. కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి తాళ్లతో కట్టేసి, బందీగా తన నగరానికి తీసుకుపోయాడు.రావణుడు బందీగా పట్టుబడిపోవడంతో ధైర్యం సడలిన అతడి మంత్రులు, సేనానులు, సైనికులు అక్కడి నుంచి పారిపోయారు. వారు నేరుగా రావణుడి తాత పులస్త్యబ్రహ్మ వద్దకు వెళ్లి విషయం చెప్పారు.పులస్త్యుడు మహిష్మతీ నగరానికి వచ్చాడు. కార్తవీర్యార్జునుడు ఎదురేగి పులస్త్యుడికి ఘనస్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాదులతో అతిథి సత్కారాలు చేశాడు. ఉచితాసనంపై కూర్చుండబెట్టి, క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. తన మనవడైన రావణుడికి బుద్ధి చెప్పినందుకు కార్తవీర్యార్జునుణ్ణి మెచ్చుకున్నాడు పులస్త్యుడు. ‘నీ దెబ్బకు నా మనవడి గర్వం అడుగంటింది. ఇక వాడిని విడిచిపెట్టు’ అని కోరాడు. పులస్త్యుడి మీద గౌరవంతో కార్తవీర్యార్జునుడు రావణుడిని చెర నుంచి విడుదల చేశాడు. పులస్త్యుడు అక్కడికక్కడే అగ్నిసాక్షిగా వారిద్దరి మధ్య సంధి చేశాడు.∙సాంఖ్యాయన -
బంగ్లా హెర్క్యులస్ రేపిస్టుల పాలిటి యముడు
బంగ్లాదేశ్ ఆశూలియా జిల్లా 2019 జనవరి 7న జరిగిన అత్యాచార సంఘటనతో ఉలిక్కిపడింది. ఆశూలియాలోని ఒక దుస్తుల కర్మాగారంలో పనిచేసే పద్దెనిమిదేళ్ల యువతిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి తెగబడి, ఆమెను దారుణంగా హత్య చేశారు. ఇరుగు పొరుగులు ఇంట్లో ఆమె మృతదేహం పడి ఉండటం గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటనపై అశూలియా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. పోలీసులపై అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. మృతురాలితో పాటు అదే దుస్తుల కర్మాగారంలో పనిచేసే రిపొన్, అతడి ఇద్దరు సహచరులను పోలీసులు అనుమానితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్లో విచారణ జరిపారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో విడిచిపెట్టారు.ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. పైగా మరో మలుపు తీసుకుంది. జనవరి 17న అనుమానితుల్లో కీలక వ్యక్తి అయిన రిపొన్ దారుణంగా హత్యకు గురయ్యాడు. అశూలియాకు చేరువలోని ఒక పొలంలో అతడి మృతదేహం పడి ఉండటాన్ని గమనించి, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహం మెడకు తగిలించిన నోట్ను చూసి, దానిని బయటకు తీసి పరిశీలించారు. ఆ నోట్లో ఇలా ఉంది: ‘నా పేరు రిపొన్. నేను (బాధితురాలి పేరు)పై అత్యాచారం చేశాను. నేను రేపిస్టును. నా నేరానికి ఇదే తగిన శిక్ష. నాతో కలసి ఈ నేరానికి ఒడిగట్టిన నా సహచరులకు కూడా ఇదే గతి పడుతుంది. జాగ్రత్త!’– హెర్క్యులస్ అని బెంగాలీలో రాసి ఉంది. పోలీసులు ఆశ్చర్యపోయారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.పట్టుమని పదిరోజులైనా కాలేదు. మరో సంఘటన కలకలం రేపింది. జనవరి 26న అశూలియా జిల్లా బోల్తలా గ్రామంలోని వరి చేనులో ఒక మృతదేహం పడి ఉండటం చూసి, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామ పంచాయతీ చైర్మన్కు కూడా సంగతి చెప్పారు. అందరూ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి మెడలో నోట్ వేలాడదీసి ఉంది. ఇది కూడా హెర్క్యులస్ పేరుతోనే ఉంది. ఈ సంఘటనలో మృతుడి పేరు సాజల్, న్యాయశాస్త్ర విద్యార్థి. ఇతడు కూడా జనవరి 7న జరిగిన అత్యాచార సంఘటనలో పట్టుబడిన అనుమానితుల్లో ఒకడు. ఒకే హత్యాచారం కేసులో అనుమానితులైన ఇద్దరు వరుసగా హత్యకు గురికావడం, పైగా వారి మృతదేహాలపై ‘హెర్క్యులస్’ పేరుతో హెచ్చరిక నోట్ దొరకడం బంగ్లాదేశ్లో దేశవ్యాప్తంగా కలకలంగా మారింది. పోలీసులకు ఈ హత్యలు సవాలుగా మారాయి. పోలీసులు చేయలేని పనిని ఒక అజ్ఞాతవ్యక్తి చేయడం పట్ల జనాల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవడం తగదని కొందరు మర్యాదస్తులు అభిప్రాయపడితే, న్యాయం చేయడంలో పోలీసులు చేతగాని వాళ్లయినప్పుడు, అజ్ఞాత వ్యక్తి ఎవరో ఇలాంటి న్యాయం చేయడమే సరైన పని అని వ్యాఖ్యానించసాగారు. మరోవైపు పోలీసుల అసమర్థతను దుమ్మెత్తిపోస్తూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.అజ్ఞాత ‘హెర్క్యులస్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తుండగా, ఫిబ్రవరి 1న మరో సంఘటన జరిగింది. ఈసారి అశూలియా పొరుగు జిల్లా అయిన రాజాపూర్లోని జలాకఠి శివార్లలోని పొలాల్లో మరో మృతదేహం పడి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు, మృతదేహం మెడలో ‘హెర్క్యులస్’ పేరుతో ఉన్న హెచ్చరిక నోట్ దొరికింది. ఈ సంఘటనలో మృతుడి పేరు రకీబ్ ముల్లా. ‘ఈ హెర్క్యులస్. ఎవడోగాని, పోలీసుల కంటే వీడే నయంగా ఉన్నాడు. రేపిస్టులందరినీ ఏరి పారేస్తున్నాడు’ అని అక్కడ మూగిన జనాలు పోలీసుల ముందే అనుకోవడం మొదలుపెట్టారు. తమ సమక్షంలోనే జనాలు అలా మాట్లాడటంతో పోలీసులకు తలకొట్టేసినట్లయింది. వరుస సంఘటనలు జరిగినా, జిల్లా పోలీసులు ఎలాంటి ఆధారాలూ సేకరించలేకపోవడంతో చివరకు బంగ్లాదేశ్ జాతీయ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. దేశవ్యాప్తంగా హెర్క్యులస్ కోసం గాలింపు ప్రారంభించాయి. ఊహాచిత్రాలతో ఊరూరా పోస్టర్లు వేయించాయి. అయినా, ఎలాంటి ఫలితమూ దక్కలేదు. ఇప్పటికి ఆరేళ్లు గడచిపోయినా, బంగ్లా పోలీసులకు హెర్క్యులస్ ఆచూకీ దొరకలేదు. ఇదే విషయమై, హెర్క్యులస్ కేసుపై మొట్టమొదట దర్యాప్తు జరిపిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, అశూలియా పోలీస్స్టేషన్ ఇన్చార్జ్ జహీదుల్ ఇస్లామ్ను ప్రశ్నిస్తే, ‘మేం కేసును మొదటి నుంచి దర్యాప్తు చేశాం. సంఘటనలు జరిగిన ప్రతిచోటా అణువణువూ గాలించాం. మృతుల మెడల్లో హెచ్చరిక సందేశాలు తప్ప మాకు ఎక్కడా ఎలాంటి ఆధారాలూ దొరకలేదు’ అని చెప్పారు. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ షోహెల్ రాణా కూడా దాదాపు ఇలాగే చెప్పారు. ‘అప్పటి వరుస హత్యల వెనుక ఎవరు ఉన్నారో ఇప్పటి వరకు తేలలేదు. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. అయినా, హత్యలకు కారకులు ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం’ అని చెప్పారు. పోలీసులు ఇలాంటి పసలేని ప్రకటనలు చేస్తుంటే, బంగ్లా జనాల్లో చాలామంది హెర్క్యులస్ను హీరోగా పరిగణిస్తుండటం విశేషం. -
Automobile: భారత్లో ఆటోమొబైల్స్ పరుగులు
ఒకరికి బతుకు బండి.. మరొకరికి హోదా.. ఇంకొందరికి వ్యాపారం.. మరి కొద్దిమందికి విహారం.. టూవీలర్, ఆటో, కారు, ట్రాక్టర్, వ్యాన్ , ట్రక్, బస్.. పేరు ఏదైనా, వాడకం ఏదైనా బండి చక్రాలు పరుగెడుతూనే ఉండాలి. ఆ పరుగే అన్నం పెడుతోంది. ఆ పరుగే వృద్ధి ‘ఇంజన్ ’ అవతారంలో భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమై దూసుకెళుతోంది. ఆటోమొబైల్ రంగంలో అత్యంత కీలకమైన మార్కెట్గా రూ.22 లక్షల కోట్లతో మూడవ స్థానంలో నిలిచి ప్రపంచ దిగ్గజ సంస్థలను భారత్ ఊరిస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత గల భారతావనిలో ఎన్ని బండ్లు రోడ్డెక్కుతున్నాయో తెలుసా? నిమిషానికి 49.53 యూనిట్లు. 2024లో 2,61,07,679 యూనిట్ల వాహనాలు వినియోగదారుల చేతుల్లోకి వెళ్లాయి. 2023లో ఈ సంఖ్య 2,39,28,293 యూనిట్లు. గత ఏడాది కొత్త వాహనాల రాక 9.11 శాతం పెరిగిందని ‘వాహన్ ’ గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న అవసరాలు..ఉద్యోగం, వ్యాపారం, షాపింగ్, ప్రయాణాలు, విహార యాత్రలు, డెలివరీ సేవలు.. అవసరం ఏదైనా చేతిలో బండి ఉండాల్సిందే! గడియారంలోని సెకన్ల ముల్లుతో పోటీపడుతూ పరుగు తీయాలంటే బండి రోడ్డెక్కాల్సిందే! అంతలా దైనందిన జీవితంలో వాహనం భాగమైపోయింది. అందుకే వాహనాల అమ్మకాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఇక 2030 నాటికి మెగా సిటీల సంఖ్య 87కు చేరనుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఒక్కో మెగా సిటీలో జనాభా 10 లక్షల పైచిలుకు ఉంటుందన్నమాట! ఇంతమందికి సేవలు అందించడానికి ప్రజా రవాణా వ్యవస్థ సరిపోదు. వ్యక్తిగత వాహనాలపై ఆధారపడాల్సిందే! అలాగే ఆరేళ్లలో వర్కింగ్ ఏజ్ గ్రూప్లో 100 కోట్ల మంది చేరతారని అంచనా. అంటే ఆ సమయానికి మొత్తం జనాభాలో వీరి వాటా 60 శాతం ఉంటుంది. ఈ అంశం కూడా వాహన వినియోగం పెరిగేందుకు దోహదం చేయనుంది. మారుతున్న ధోరణులుభారత మార్కెట్లో ధర అత్యంత సున్నిత అంశం. డబ్బుకు తగ్గ విలువ చూసే కస్టమర్లే అధికం. మైలేజీ ఒక్కటే సరిపోదు. డిజైన్ సైతం ఆకట్టుకోవాలి. అటు భద్రతకు పెద్దపీట వేయాలి. ఎక్కువ ఫీచర్లు ఉండాలి. మారుతున్న వినియోగదార్ల అభిరుచులకు తగ్గట్టుగా మోడళ్లకు రూపకల్పన చేసేందుకు వందల కోట్ల పెట్టుబడులతో ఏళ్ల తరబడి కంపెనీలు కసరత్తు చేస్తుంటాయి. సరికొత్త మోడళ్లే కాదు సక్సెస్ అయిన మోడల్స్లో ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లను, అప్గ్రేడ్స్ను ప్రవేశపెట్టాల్సిందే. హైబ్రిడ్స్, ఈవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కొత్త ట్రెండ్ ఏమంటే ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ప్రస్తుతం ఎస్యూవీ, యూవీల హవా నడుస్తోంది. మొత్తం పీవీల విక్రయాల్లో వీటి వాటా 60 శాతం దాటిందంటే మారుతున్న ధోరణులకు అద్దం పడుతోంది. కార్ల అమ్మకాల్లో 2,02,031 యూనిట్లతో టాప్ సెల్లింగ్ మోడల్గా కాంపాక్ట్ ఎస్యూవీ టాటా పంచ్ నిలిచింది. మరోవైపు చిన్న కారు చిన్నబోతోంది. 3.6 మీటర్ల లోపు ఉండే ఎంట్రీ లెవెల్ చిన్న కార్ల వాటా 2 శాతం కంటే తక్కువగా ఉంది. అమ్ముడవుతున్న రెండు త్రిచక్ర వాహనాల్లో ఒకటి ఈ–త్రీవీలర్ ఉంటోంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) విభాగాన్ని ఏలుతున్న దిగ్గజ కంపెనీలే ఈవీ సెగ్మెంట్నూ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నాయి. 350 సీసీ, అంత కంటే అధిక సామర్థ్యంగల ఇంజన్ ్స విభాగంలో రాయల్ ఎన్ ఫీల్డ్ దూసుకెళుతోంది. ఈ కంపెనీ గత ఏడాది 4.26 శాతం వృద్ధితో 8,57,378 యూనిట్లను విక్రయించి రాయల్గా నిలిచింది. కొత్త వ్యాపారాల రాకతో..వ్యక్తిగత అవసరాలకే కాదు.. కొత్త వ్యాపారాల రాక కూడా వాహనాల అమ్మకాలకు ఆజ్యం పోస్తోంది. ఊబర్, ఓలా, రాపిడో వంటి అగ్రిగేటర్లు, అమెజాన్ , ఫ్లిప్కార్ట్ తదితర ఈ–కామర్స్ సంస్థలు, స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్, బిగ్బాస్కెట్, జెప్టో, బ్లింకిట్, డంజో తదితర క్విక్ కామర్స్ కంపెనీలు.. ఇలా ఒకటేమిటి. ఉత్పత్తుల తయారీ, డెలివరీ సేవల కంపెనీలు వాహన వినియోగం పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. అటు సులభ వాయిదాల్లో వాహనం కొనుగోలుకు రుణ లభ్యత పెరిగింది. ఇంకేముంది వాయిదాలు చెల్లించగలిగే స్తోమత ఉంటే చాలు, స్థాయికి మించిన విలువైన వాహనం కొనేందుకూ కస్టమర్లు వెనుకంజ వేయడం లేదు. లగ్జరీ.. తగ్గేదేలే!దేశంలో లగ్జరీ కార్ల దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. రూ.50 లక్షలకుపైగా ఖరీదు చేసే లగ్జరీ కార్లు 2024లో గంటకు దాదాపు ఆరు (5.83 యూనిట్లు) అమ్ముడయ్యాయి. అయిదేళ్ల క్రితం గంటకు రెండు లగ్జరీ కార్లే రోడ్డెక్కాయంటే ప్రస్తుత భారత మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. 2024లో మొత్తం 51,200 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 50 వేల మార్కును చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది రెండు డజన్లకుపైగా నూతన మోడళ్లు కొలువుదీరనున్నాయి. ఊరిస్తున్న కొత్త మోడళ్లు, సంపన్నులు పెరుగుతుండడంతో 2025లో ఈ సెగ్మెంట్లో 54,000లకుపైగా యూనిట్లు అమ్ముడవుతాయని పరిశ్రమ ధీమాగా ఉంది. 2030 నాటికి లగ్జరీ కార్ల అమ్మకాలు ఏటా 1,00,000 దాటుతుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో లగ్జరీ వాటా 1 శాతంపైగా ఉంది. 2020లో 20,500 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్లు్య, ఆడి, వోల్వో, మినీ, జేఎల్ఆర్, లెక్సస్ టాప్ బ్రాండ్స్గా ఉన్నాయి. సూపర్ ప్రీమియం లంబోర్గీని, పోర్ష్ కార్లకూ డిమాండ్ ఉంది. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2024 ప్రకారం దేశంలో అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్య 2028 నాటికి 19,908కి చేరనుంది. 2023లో ఈ సంఖ్య 13,263 ఉంది. ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్యలో భారత్ భారీ పెరుగుదలను నమోదు చేస్తుందని నివేదిక అంచనా వేసింది. ఈవీతో పోటీగా సీఎన్ జీ.. ఆశ్చర్యకర విషయం ఏమంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్ జీ) ఆధారిత వాహనాల డిమాండ్ ఊహకు అందడం లేదు. ఈ విభాగంలో గత ఏడాది 7,15,213 కార్లు అమ్ముడయ్యాయి. 2023తో పోలిస్తే వృద్ధి ఏకంగా 35 శాతం నమోదు కావడం విశేషం. మారుతీ సుజుకీ ఇండియా అత్యధికంగా 2024లో ఈ విభాగంలో 5,12,155 యూనిట్లతో 71.60 శాతం వాటా దక్కించుకుంది. సీఎన్జీ వాటా ప్యాసింజర్ వెహికిల్స్లో 18 శాతం, త్రీవీలర్స్ అమ్మకాల్లో 28 శాతం ఉంది. బజాజ్ ఆటో ఒక అడుగు ముందుకేసి దేశంలో తొలిసారిగా సీఎన్ జీ బైక్ ‘ఫ్రీడమ్’ను పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా 5,500లకు పైగా సీఎన్ జీ ఫిల్లింగ్ స్టేషన్ ్స ఉన్నాయి. 2026 నాటికి ఈ సంఖ్య 8,000 దాటనుంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్తో పోలిస్తే సీఎన్ జీ వ్యయం తక్కువ కావడంతో కస్టమర్లు వీటికి మళ్లుతున్నారు. వాహన విడిభాగాలు ఇలా..2023–24లో వాహన విడిభాగాల పరిశ్రమ 9.8 శాతం వృద్ధితో 74.1 బిలియన్ డాలర్ల వ్యాపారం నమోదు చేసింది. 2017–18లో ఇది 51 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ప్రపంచంలో తయారవుతున్న వాహన విడిభాగాల్లో భారత్ వాటా 3.5 శాతం. భారత జీడీపీలో ఈ రంగం వాటా 3.5 శాతం. తయారీ జీడీపీలో ఈ విభాగం 25 శాతం సమకూర్చింది. 50 లక్షల మందికిపైగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. విడిభాగాల ఎగుమతులతో అయిదేళ్లలో 88 బిలియన్ డాలర్ల విదేశీ మారకం సమకూరింది. ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) ప్రకారం భారత వాహన విడిభాగాల పరిశ్రమ 2030 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఎగుమతులు 21 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని ఏసీఎంఏ ధీమాగా ఉంది. ఐదేళ్లలో తొలి స్థానం..!భారత ఆటోమోటివ్ పరిశ్రమ విలువ రూ.22 లక్షల కోట్లు. దేశ జీడీపీకి ఈ రంగం 7 శాతం సమకూరుస్తోంది. మొత్తం వసూలు అవుతున్న జీఎస్టీలో 14–15 శాతం ఆటోమొబైల్ రంగం అందిస్తోందంటే ఆశ్చర్యం వేయకమానదు. వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలో తొలి స్థానానికి చేరుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. తాను అధికారం చేపట్టిన నాటి నుంచి భారతీయ వాహన పరిశ్రమ రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షల కోట్లకు దూసుకెళ్లిందని చెప్పారు. ‘రూ.78 లక్షల కోట్లతో తొలి స్థానంలో యూఎస్ఏ, రూ.47 లక్షల కోట్లతో రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా చైనా నిలిచింది. ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్–1గా మార్చాలనుకుంటున్నాం. ప్రఖ్యాత అంతర్జాతీయ ఆటోమొబైల్ బ్రాండ్స్ భారత్లో ఉండడం దేశ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది’ అని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఏం చేస్తోందంటే..సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) నుంచి ఈవీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి నూతన సాంకేతికతలవైపు వాహన పరిశ్రమ మళ్లేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్స్ రంగానికి వెన్నుదన్నుగా నిలిచేందుకు రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రకటించింది. అడ్వాన్ ్సడ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ రంగానికి రూ.18,100 కోట్లు, పీఎం ఈ–డ్రైవ్ స్కీమ్కు రూ.10,900 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈవీ రంగంలో విదేశీ సంస్థలను ఆకట్టుకోవడానికి ఆటోమేటిక్ రూట్లో 100 శాతం ఎఫ్డీఐలకు ప్రభుత్వం తివాచీ పరిచింది. కనీసం 50 కోట్ల డాలర్ల పెట్టుబడితో తయారీ కేంద్రాలు నెలకొల్పే సంస్థలు పూర్తిగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకుంటే పన్ను 70–100 శాతం నుంచి కొత్త ఈవీ పాలసీలో 15 శాతానికి కుదించారు. లిథియం అయాన్ బ్యాటరీలపై పన్నును 21 నుంచి 13 శాతానికి చేర్చారు. 2030 నాటికి ఈవీ, చార్జింగ్ మౌలిక వసతులు, బ్యాటరీస్ విభాగంలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే ఆరేళ్లలో ఈవీ పరిశ్రమ ప్రపంచంలో తొలి స్థానంలో నిలుస్తుందని అంచనా. పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు స్క్రాప్ పాలసీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల భద్రత, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యత, సేఫ్టీ ప్రమాణాలను నిర్దేశిస్తూ, తప్పనిసరి చేస్తోంది. గ్లోబల్ ఎన్ సీఏపీకి దీటుగా భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ సీఏపీ) పరిచయం చేసింది. 2030 నాటికి కొత్తగా అమ్ముడయ్యే వాహనాల్లో ఈవీల వాటా 30 శాతం ఉండాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది.మీకు తెలుసా? వాహనాల తయారీ, విక్రయాల పరంగా భారత్ పేరిట పలు ప్రపంచ రికార్డులు ఉన్నాయి. రూ.22 లక్షల కోట్లతో భారత మార్కెట్ ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచింది. 7 శాతం వార్షిక వృద్ధితో 2022–23లో 33.2 బిలియన్ డాలర్ల విలువైన 47.6 లక్షల యూనిట్ల వాహనాలు భారత్ నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 45 లక్షల యూనిట్లు దాటింది. రెండు దశాబ్దాల్లో 25 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వెల్లువెత్తాయి. ఒక్క ఈవీ రంగంలోనే 2022–23లో 3.6 బిలియన్ డాలర్ల ఫండింగ్ వచ్చి చేరింది. వోల్వో, దైమ్లర్ వంటి 60కిపైగా దిగ్గజాలు భారత్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) నెలకొల్పాయి. ట్రాక్టర్ల తయారీలో మహీంద్రా, త్రీవీలర్ల ఉత్పత్తిలో బజాజ్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచాయి.ఆటోమోటివ్ రంగం పరిశ్రమను కొత్తపుంతలు తొక్కించే దిశగా వెళుతోంది. వృద్ధిలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటూనే గ్రీన్ మొబిలిటీకి మారడం సవాలే. ఈవీలు, హైబ్రిడ్స్, హైడ్రోజన్ లేదా ఇతర ఇంధన విభాగాలైనా సరైన సాంకేతికతను అవలంబించడం కూడా సవాలుగానే ఉంటుంది. వృద్ధిని నిర్ధారిస్తూనే ఆటోమోటివ్ కంపెనీలు మారుతున్న పరివర్తనను ఎలా నిర్వహిస్తాయో అన్న అంశాన్ని ఈ రెండేళ్లు పరిశీలించాల్సి ఉంటుంది.∙వి.రిషి కుమార్, ఆటో ఎక్స్పర్ట్. ప్యాసింజర్ వాహన పరిశ్రమలో 60 శాతంపైగా వాటాతో ఎస్యూవీలు రూల్ చేస్తున్నాయి. రియల్ సూపర్ స్టార్గా సీఎన్ జీ నిలిచింది. 3.6 మీటర్ల లోపు ఉండే ఎంట్రీ లెవెల్ కార్ల వాటా ప్రస్తుతం 2 శాతంలోపు వచ్చి చేరింది. ∙అరుణ్ మల్హోత్రా, మాజీ ఎండీ, నిస్సాన్ ఇండియామార్కెట్ రికవరీ, తయారీ సంస్థల నుంచి వ్యూహాత్మక మద్దతు, విధాన స్థాయి స్పష్టత.. వెరసి ఆటోమోటివ్ రిటైల్ పరిశ్రమ 2025లో మెరుగ్గా ఉంటుంది. ఈ ఏడాది వృద్ధి ఉంటుందని 66.41 శాతం డీలర్లు అంచనా వేస్తున్నారు. స్థిరంగా ఉంటుందని 26.72 శాతం, తిరోగమన వృద్ధి నమోదవుతుందని 6.87 శాతం మంది డీలర్లు అభిప్రాయపడ్డారు.∙సి.ఎస్. విఘ్నేశ్వర్,,ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ్స (ఎఫ్ఏడీఏ) -
బాధ్యతల్లో బ్యాలెన్స్ లేకుంటే కాపురం కష్టమే!
రేఖది పల్లెటూరి నేపథ్యం. తండ్రిది వ్యవసాయం. తల్లి గృహిణి. పిల్లల పెంపకం బాధ్యత కూడా ఆమె మీదనే ఉండేది. అలాంటి వాతావరణంలో పుట్టి, పెరిగిన రేఖకు భార్యాభర్తలు ఎవరేం చేయాలనే విషయంపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. డిగ్రీ పూర్తయ్యాక ఆమెకు ఆనంద్తో పెళ్లయింది. ఆనంద్ ప్రభుత్వోద్యోగి. గృహిణిగా రేఖ సంతోషంగా బాధ్యతలను స్వీకరించింది. ఒక బిడ్డ పుట్టాక కూడా రేఖ తన పనులను హ్యాపీగా మేనేజ్ చేసుకునేది. రెండో బిడ్డ పుట్టాక కష్టమైంది. ఉదయాన్నే లేచి ఆనంద్కు బ్రేక్ఫస్ట్, లంచ్ సిద్ధం చేయడం, పిల్లల పనులు చూసుకోవడంతో చాలా అలసిపోయేది. ఆనంద్ తన పని ఒత్తిడిలో ఉండి ఇంటి పనుల్లో పెద్దగా సాయం చేసేవాడు కాదు. కనిపించని దూరం..భర్త, పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, సమయానికి అన్నీ సమకూర్చే క్రమంలో రేఖ తన అవసరాలను నిర్లక్ష్యం చేసేది. ఎప్పుడైనా తన అవసరాల గురించి ఆమె మాట్లాడగానే ఆనంద్ వాటిని పట్టించుకునేవాడు కాదు. లేదంటే తన ఆఫీసు ఒత్తిడి గురించి చెప్పుకునేవాడు. దీంతో తన కష్టాన్ని ఆనంద్ గుర్తించడం లేదని బాధపడేది. అది వారిద్దరి అనుబంధం, ఆప్యాయతలపై ప్రభావం చూపించసాగింది. క్రమేపీ వారిద్దరి మధ్య మానసికంగా దూరం పెరిగింది. ఇలాంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో కనిపిస్తుంది. బ్యాలెన్సింగ్ ప్రిన్సిపుల్స్..కుటుంబ జీవితం అనేది ఆటోమేటిక్గా సాఫీగా సాగిపోయే విషయం కాదు. క్రమం తప్పకుండా పరస్పర సహకారం, ఓపిక, కమ్యూనికేషన్ అవసరం. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా బలమైన బంధాన్ని కాపాడు కోవడం కోసం పాటించాల్సిన సూత్రాలివే. 1. స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం⇒ పరిస్థితి ఎంత క్లిష్టమైనదైనా, భావాలను వ్యక్తపరచడంలో ఓపెన్గా ఉండాలి⇒ ఐ–సెంటెన్సెస్ వాడకం అంటే ‘నాకు ఇలా అనిపిస్తోంది’, ‘నేను ఇలా ఫీలవుతున్నాను’ అని చెబుతూ, దూషణలకు లేదా నిందలకు తావు లేకుండా కమ్యూనికేషన్ చేయండి. మీ ఆలోచనలను ఈ విధంగా పంచుకోవడం ద్వారా సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.2.బాధ్యతలను పంచుకోండి⇒ గృహభారాలు ఒక్కరిపై మాత్రమే ఉండకూడదు. కుటుంబంలో ఎవరు ఏమి చేయాలో కూర్చుని మాట్లాడి నిర్ణయించు కోవాలి. చిన్న విషయాల్లో కూడా భాగస్వామ్యం ఉంటే, ఎదుటి వాళ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది⇒ వారానికి ఒకసారి ఆ వారం ఎవరేం పనులు చేయాలనేది చర్చించుకోవడం ద్వారా బ్యాలెన్స్ను సాధించవచ్చు.3.తమ శ్రమను గుర్తించండి⇒ కుటుంబంలో ఎవరి శ్రమకైనా విలువ ఇవ్వడం అవసరం ⇒ భర్త తన పని ఒత్తిడిని, భార్య తన ఇంటి పనుల కష్టాన్ని పంచుకుంటే పరస్పర అవగాహన పెరుగుతుంది.⇒ వారానికి ఒకసారి ఓపెన్గా అభినందనలు లేదా కృతజ్ఞత వ్యక్తం చేయడం బంధాన్ని బలపరుస్తుంది.4. ప్రత్యేక సమయాన్ని కేటాయించండి⇒ పనుల మధ్య ఎప్పుడు తనతో మాట్లాడతాడో అన్న నిరీక్షణ భార్య/భర్తల మధ్య దూరాన్ని పెంచుతుంది · వారానికి ఒకరోజు ప్రశాంతంగా కూర్చుని ఒకరి కష్టాన్ని మరొకరు వినండి · మనసు పంచుకునే ఈ చర్చలు బంధం బలపడటానికి దోహదపడతాయి. 5. ఒత్తిడి, ఆందోళనను మేనేజ్ చేయడం నేర్చుకోండి⇒ గృహిణిగా స్త్రీ, పనిలో పురుషుడు ఇద్దరూ ఒత్తిడితో ఉంటారు ⇒ దీర్ఘ శ్వాస, ధ్యానం, మైండ్ఫుల్నెస్ వంటి పద్ధతులు ఆందోళన తగ్గించడంలో సహాయపడతాయి ⇒ అవసరమైతే, మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.6. సామాజిక ప్రమాణాలను పునఃపరిశీలించండి⇒ భార్యాభర్తలు తప్పనిసరిగా వారి వారి పాత్రల్లోనే ఉండాలి అనే ఆలోచనను మార్చుకోండి ⇒ ఇంటి పనులు లేదా పిల్లల సంరక్షణ విషయంలో భర్త సహాయాన్ని సగర్వంగా కోరండి ⇒ గృహిణి కష్టం కూడా సమాన గౌరవానికి అర్హమైనది.7. సానుకూల దృక్పథం ఏర్పరచుకోండి⇒ ఇతరులను తప్పు పట్టడం కంటే, కలిసి పనిచేయడం ద్వారా సమస్యలపై దృష్టి పెట్టండి⇒ ఒకరి కొకరు సహాయం చేసుకోవడం, ప్రశంసలు అందించుకోవడమనేది ప్రేమానుబంధాన్ని పెంచుతుంది. 8. స్వీయపరామర్శ⇒ తన బాధ్యతల్ని సరైన పద్ధతిలో నిర్వర్తించలేకపోతున్నానని భావించడంలో తప్పు లేదు. కానీ ఆలోచనను సానుకూలంగా మలచుకోవాలి ⇒ ‘నేను కుటుంబం కోసం ఇలా చేయగలిగాను’ అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి⇒ అవసరమైతే విశ్రాంతి తీసుకోండి. దానివల్ల మానసిక శక్తి పెరుగుతుంది. -
ఇహలోక అద్భుతం మహానంది
దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన మహానంది ఒకటి. ఆరవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో అన్నీ ప్రత్యేకతలే! ఇక్కడ మహానందీశ్వరుడితో పాటు కోదండరాముల వారూ కొలువై ఉండటంతో ఇది శివకేశవుల నిలయంగానూ మారింది. ఇక్కడ మహానందీశ్వరుడు పుట్టలోంచి స్వయంభువుగా వెలిశాడు. శివలింగం పుట్ట ఆకారంలో కనిపిస్తుంది. అంతేకాకుండా స్వయంభువైన శ్రీ మహానందీశ్వరుడిని స్పృశిస్తూ వచ్చే జలం.. శైలధార, దివోదుని ధార, నరసింహధార, నంది తీర్థం, కైలాస తీర్థమనే ఐదు ధారలుగా ఇక్కడున్న రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లోకి పడుతూ ఎల్లప్పుడూ ఒకే నీటి మట్టాన్ని ఉంచుతోంది.చిన్న గుండు సూది వేసినా పైకి కనపడేంత స్వచ్ఛంగా ఉంటుందా జలం. మహానందీశ్వరస్వామి ఆలయానికి వస్తే.. గర్భగుడి చాళుక్యుల కాలంనాటి కళింగ ఆర్కిటెక్చర్ తరహాలో శిల్పాకళా వైభవాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మహానందీశ్వరస్వామే స్వయంగా రససిద్ధుడనే శిల్పితో నిర్మించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. గర్భగుడి గోపురం చుట్టూ ఉండే నంది విగ్రహాల్లో ఓ నందికి రెండు తలలు ఉండటం మరో ప్రత్యేకత. వేసవిలో చల్లగా.. శీతకాలంలో వెచ్చగా.. మహానంది కోనేటి నీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఈ నీటిలో తొమ్మిది రకాల ఖనిజాలు ఉన్నాయని సమాచారం. బోరుబావుల్లో లభించే నీటిలో పలు రకాల రసాయనాలు వేసి అధునాతన యంత్రపరికరాల ద్వారా వడపోస్తే కానీ సాధారణ పీహెచ్ స్థాయి రాదు. అలాంటిది మహానందీశ్వరుడి చెంత ప్రవహించే నీటిలో సహజంగానే పీహెచ్ స్థాయి 7.1 ఉండటం విశేషం. అంతేకాదు ఇక్కడి కోనేరుల్లోని నీరు వేసవిలో చల్లగా ఉంటుంది. శీతకాలంలో వెచ్చగా మారుతుంది. తెల్లవారుజామున చూస్తే కోనేరులు పొగలు గక్కుతున్నట్లు కనిపిస్తాయి. స్ఫటికమంత స్వచ్ఛంగా ఉన్న ఈ నీటిలో ఆలయ గోపురాలు ప్రతిబింబిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. వేలాది ఎకరాలకు సాగునీరుగా.. మహానందీశ్వరస్వామి దేవస్థానానికి చెందిన వందలాది ఎకరాలతో పాటు చుట్టుపక్కల ఉండే పొలాలకూ ఈ కోనేటి నీటినే వినియోగిస్తున్నారు. కోనేరుల్లోంచి నీరు రెండు పాయల ద్వారా బయటికి ప్రవహిస్తూ పొలాల మీదుగా వెళ్లి తెలుగుగంగ కాలువలో కలుస్తోంది. మహానంది ఆలయ పరిధిలోని 53.41 ఎకరాల్లో ఎక్కడైనా సరే రెండు అడుగుల లోతు గుంత తీస్తే చాలు నీరు ఉబికి వస్తుంది.ఓ అద్భుత దివ్యక్షేత్రంఏ ఆలయంలో అయినా ఒక విశేషం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం దేనికి అదే ఓ విశేషం. ఇక్కడి రుద్రగుండం కోనేరును నంది తీర్థంగా పురాణాల్లో వర్ణించారు. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా ఇక్కడ స్నానమాచరిస్తూ భక్తుల పాపాలను పోగొడుతుందని శివపురాణంలో వర్ణించారు. ఇక్కడ స్నానమాచరిస్తే శరీర రుగ్మతలు తొలగిపోతాయని ఎంతోమంది అనుభవపూర్వకంగా చెప్పడమే కాదు శాస్త్రీయంగానూ నిరూపితమైంది. – బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, మహానంది దేవస్థానం వేద పండితులు -
Clout అపూర్వ ముఖీజా
ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్. ద రెబల్ కిడ్గా పాపులర్. కామిక్ వీడియోస్, లైఫ్ స్టయిల్, ట్రావెల్ వ్లోగ్స్కి ప్రసిద్ధి. టిక్టాక్లో లిప్ సింక్ వీడియోస్తో సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేసింది. మన దేశంలో టిక్టాక్ బ్యాన్ అవడంతో ఇన్స్టాలో కామిక్ వీడియోస్కి స్విచ్ ఓవర్ అయింది. ముంబైలో పుట్టి పెరిగింది. మణిపాల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేసింది. కొన్నాళ్లు డెల్లో పని చేసింది. వెబ్స్టార్గా నేమ్ అండ్ ఫేమ్ రావడంతో వెబ్ దునియానే ఫుల్టైమ్ వర్క్ ప్లాట్ఫామ్గా మలచుకుంది. యాక్టింగ్ ఫీల్డ్లోకీ ఎంట్రీ ఇచ్చింది.. 'Who is your gynac' అనే సిరీస్తో! ‘నా చుట్టూ ఉన్నవాళ్లను నవ్వించడం నాకు సరదా! అదే నా స్కిల్ అని లేట్గా అర్థమైంది. దాన్నే కెరీర్గా మార్చుకున్నాను. నిజానికి నేనో స్టోరీ టెల్లర్ని’ అంటుంది అపూర్వ ముఖీజా. -
అమెరికాలోనూ కోడిపందేలు
సంక్రాంతి అంటేనే కోడిపందేలకు పెట్టింది పేరు. అందులోనూ గోదావరి జిల్లా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కోడిపందేల కోలాహలమే కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంబరాల పేరిట కోడిపందేలను ప్రభుత్వం నిషేధించినా, ‘తగ్గేదే లే’ అంటూ ఈ పందేలు ఏటా జరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు ఈ కోడిపందేల కోలాహలం అమెరికాకూ వ్యాపించింది. తాజాగా అమెరికాలో ఇద్దరు కోడిపందెం రాయుళ్లను కెంటకీ స్టేట్ పోలీసులు అరెస్టు చేశారు.వారి దగ్గర ఉన్న కోళ్లను స్వాధీనం చేసుకుని, రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఇప్పుడు ఇది వైరల్గా మారింది. మన దేశంలో జరిగే కోడిపందేల్లాగానే అమెరికాలోనూ కోడిపందేలు జరుగుతుంటాయి. బరిలోకి దించే పుంజులపై పందెం రాయుళ్లు, అలాగే పుంజుల పెంపకందారులు భారీగా పందేలు కాస్తుంటారు. పందేల కోసం పుంజులను సుమారు ఏడాది పాటు పుష్టిగా పెంచుతారు. పందెంకోళ్లకు పెట్టే ఆహారానికి, వాటి ఆరోగ్యానికి భారీగా ఖర్చు చేస్తుంటారు. ఏది ఏమైనా కత్తులతో కుత్తుకలు తెగేలా సాగే పుంజుల పోరాటాలు ఏ దేశంలో జరిగినా, చూడటానికి వచ్చే వారి సంఖ్య మాత్రం తగ్గటం లేదు. -
సిల్వర్ స్క్రీన్ శిల్పం
‘ఒక్క చాన్స్..ఒకే ఒక్క చాన్స్’ కొందరిని స్టార్గా నిలబెడుతుంది. మరికొందరిని అడ్రస్ లేకుండా చేస్తుంది. అలా ఒక్క చాన్స్తో మెరిసి.. అపజయాలతో తడబడి.. మళ్లీ ఫామ్లోకి వచ్చిన నటే శిల్పా మంజునాథ్. ఆ వివరాలే ఇక్కడ..⇒ శిల్పా మంజునాథ్.. బెంగళూరులో పుట్టిపెరిగింది. నటన మీదున్న ఆసక్తితో చదువు పూర్తయిన వెంటనే మోడల్గా కెరీర్ ప్రారంభించింది. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే, మరోవైపు ఆడిషన్స్ ఇచ్చేది.⇒ విజయ్ ఆంటోని నటించిన ‘కాళీ’ తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఇదే సినిమా అదే పేరుతో తెలుగులోనూ డబ్ అయింది. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడి, వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది. ఒకేసారి కన్నడ చిత్రం ‘మగ 2’, మలయాళ చిత్రం ‘రోసాపూ’లలో నటించింది.⇒ ఇలా ఒకే ఏడాది తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ సినీ ఇండస్ట్రీల్లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయింది. కాని, వరుస అపజయాలతో తడబడింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుంది.⇒ ‘హైడ్ అండ్ సీక్’ అనే థ్రిల్లర్ చిత్రంతో విజయం సాధించి, తిరిగి ఫామ్లోకి వచ్చింది శిల్పా. త్వరలోనే ఈ చిత్రం ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది.ఏ క్యారెక్టర్నైనా సులభంగా ఆకళింపు చేసుకోగలను. అదే నా బలం. పాత్రను డైరెక్టర్ నరేట్ చేస్తున్నప్పుడే, నేను ఆ క్యారెక్టర్ మూడ్లోకి వెళ్లిపోతా. అలా తీసుకెళ్లగలిగే స్క్రిప్ట్లనే సెలెక్ట్ చేసుకుంటా. – శిల్పా మంజునాథ్. -
బాల ఏసు పండుగ
ప్రపంచంలోని చాలా చోట్ల శిలువ మీద ఉన్న జీసస్ను ఆరాధిస్తారు. ఫిలిప్పీన్స్లో మాత్రం బాల ఏసును ఆరాధిస్తూ పండుగ జరుపుకొంటారు. ‘అతి అతిహన్’ పేరుతో ఈ పండుగ చేసుకుంటారు. దీన్నే ‘కలిబో శాంటో నినో ఫెస్టివల్’ అని కూడా పిలుస్తారు. ఇది ఫిలిప్పీన్స్ అక్లాన్ ప్రావిన్స్ లోని పలు పట్టణాలలో ఘనంగా జరుగుతుంది. ‘హోలీ చైల్డ్’ లేదా ‘బేబీ జీసస్’ను గౌరవించుకుంటూ మత పెద్దలు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ పండుగలో బాల ఏసును ప్రత్యేకంగా కొలుస్తారు.ప్రతి ఏడాది జనవరి నెలలోని మూడవ ఆదివారం రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ ఏడాది జనవరి 19న ఈ వేడుక జరుగుతోంది. ఫిలిప్పీన్స్ పండుగల్లో ప్రత్యేకంగా జరిగే ‘దినాగ్యాంగ్ ఆఫ్ ఇలోయిలో’, ‘సినలోగ్ ఆఫ్ సిబూ’ వంటి పండుగలకు కూడా ఈ ‘అతి అతిహన్’ పండుగే మూలమట! అందుకే ఈ పండుగను అక్కడివారు మదర్ ఫెస్టివల్ లేదా పెద్ద పండుగ అని పిలుచుకుంటారు. ఈ పండుగలో మతపరమైన ఊరేగింపులు, వీధి కవాతులు అద్భుతంగా జరుగుతాయి. రంగురంగుల దుస్తులు ధరించి నృత్యబృందాలు, కవాతు బ్యాండ్లు దుమ్ము లేపుతుంటాయి. ప్రజలంతా ముఖానికి, శరీరానికి రంగులు పూసుకుని, నృత్యం చేస్తూ ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈ ‘అతి అతిహన్’ వేడుక మూలాలు ఇప్పటివి కావు, క్రీస్తుశకం 1212 నాటివి. ఇండోనేషియా, మలేషియా, బ్రూనై దేశాల మధ్యనున్న బోర్నియో ద్వీపం నుంచి పారిపోయిన ‘డాటస్’ అనే పదిమంది మలయ్ అధిపతులు ఫిలిప్పీన్స్ లోని పనాయ్ ద్వీపంలో స్థిరపడ్డారు. ఆ పదిమంది బృందానికి పెద్ద అయిన ‘దాతు పుటి’ స్థానిక ‘అతి’ తెగ ప్రజలతో వ్యాపారం చేసేవాడు. ఒకసారి స్థానికంగా కరవు పీడిస్తుంటే, అక్కడి ప్రజలకు తినడానికి తిండి ఇచ్చి ఆదుకున్నాడు. దానికి కృతజ్ఞతగా ఆనాడే ఈ వేడుక మొదలైందని చెబుతారు. 1960ల నాటికి, ఫిలిప్పీన్స్ పర్యాటక శాఖ స్థానిక పండుగలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించడంతో ఈ పండుగ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. 1972 నాటికి ఈ పండుగలో వాడే వస్త్రాల్లో కూడా చాలా మార్పు మొదలైంది. ఆఫ్రికా, పాపువా న్యూ గినీ తదితర దేశాలతో పాటు భారతీయ గిరిజన సంప్రదాయ వస్త్రధారణ కూడా ఈ వేడుకలో ప్రత్యేకంగా నిలుస్తుంది. 2012 నాటికి ఈ పండుగ యునెస్కో సాంస్కృతిక వారసత్వ వేడుకల జాబితాలో చోటు పొందింది. ఈ వేడుకను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈ వేడుకలను చూడటానికి ఏడాది ముందు నుంచే ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకుంటారంటే, ఇది ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవాల్సిందే! -
యమ రావణ యుద్ధం
రావణుడు తన అన్న కుబేరుడిని తరిమికొట్టి, లంకను వశపరచుకున్నాడు. అతడి పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు సహా దిక్పాలకులను జయించాడు. నవగ్రహాలను తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకున్నాడు. తనకిక తిరుగులేదనే గర్వంతో లంకను పాలిస్తూ, నానా విలాసాలను అనుభవించసాగాడు.ఒకనాడు రావణుడి సభకు నారదుడు వచ్చాడు. రావణుడు నారదుడికి అతిథి మర్యాదలు చేసి, కుశల ప్రశ్నలు వేశాడు. నారదుడు రావణుడి ఘనతను ప్రశంసిస్తూ, ఇలా అన్నాడు: ‘రావణా! నువ్వు ఇంద్రాది దేవతలను జయించావు. భూలోకంలోని మానవమాత్రులెవరూ నీకు సాటిరారు. భూలోకవాసుల మీద నీ ప్రతాపం చూపించడం శోభస్కరం కాదు. నరకాధిపతి యముడిని కూడా జయించావంటే, నీకు ఇంకెక్కడా ఎదురుండదు, మృత్యుభయం కూడా ఉండదు’ అన్నాడు.రావణుడు నారదుడిని సాగనంపిన తర్వాత, మంత్రులతో చర్చించి, సైన్యాన్ని సిద్ధం చేసుకుని నరకంపై యుద్ధానికి బయలుదేరాడు. నరకానికి చేరుకున్న రావణుడు అక్కడ యమభటుల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్న పాపుల కష్టాలు చూశాడు. యమభటుల చేతిలో హింసలు అనుభవిస్తున్న పాపులు ఆ బాధలకు ఆర్తనాదాలు చేస్తున్నారు. వారు ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. రావణుడికి వారిపై జాలి కలిగింది. యమభటుల చెర నుంచి వారిని విడిపించడం ప్రారంభించాడు. రావణుడు చేస్తున్న పనిని గమనించిన యమభటులు అతడిపైకి ఆయుధాలతో దూసుకొచ్చారు.వారిని చూసి, రావణుడు వెంటనే పుష్పక విమానంలోకి చేరుకున్నాడు. పుష్పకవిమానం పైకెగిరింది. యమభటులు శూలాలు, గదలు, తోమరాలు, పరిఘలు వంటి నానా ఆయుధాలను పుష్పక విమానం మీదకు విసిరారు. ఆ ఆయుధాల తాకిడికి పుష్పక విమానంలోని ఆసనాలు, వేదికలు, స్తంభాలు ధ్వంసం అయిపోయినా, క్షణాల్లోనే మళ్లీ అవి యథాతథ స్థితికి వచ్చాయి. అక్షయమైన పుష్పక విమానం మహిమకు యమభటులు నివ్వెరపోయారు.రావణుడికి, యమభటులకు మధ్య ఈ రభస కొనసాగుతుండగా, నారదుడు నేరుగా యుముడి వద్దకు చేరుకున్నాడు. ‘యమధర్మరాజా! లంకాధిపతి రావణుడు నీ మీదకు యుద్ధానికి వస్తున్నాడు. నీ కాలదండం ఏం కానుందో!’ అన్నాడు. యుముడితో నారదుడు మాట్లాడుతుండగానే, దూరాన ఆకాశంలో ధగధగలాడుతూ ఎగురుతున్న పుష్పక విమానం కనిపించింది. యమభటులతో కొంతసేపు యుద్ధం సాగించిన రావణుడు, వారి ధాటి శ్రుతి మించుతుండటంతో వారిపై పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అగ్నిజ్వాలలను చిమ్ముతూ దూసుకొచ్చిన పాశుపతాస్త్రం యమభటులను మిడతల్లా మాడ్చేసింది. నరకంలోని చెట్లను, పొదలను బూడిద చేసింది. యమభటులు అంతం కావడంతో రావణుడు, అతడి మంత్రులు పెద్దపెట్టున సింహనాదాలు చేశారు. వాటిని విన్న యముడు యుద్ధంలో రావణుడు గెలిచాడని అర్థం చేసుకున్నాడు.ఇక తానే రంగంలోకి దూకాలని నిశ్చయించుకుని, తన సారథిని పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. క్షణాల్లో రథం సిద్ధమైంది. యముడు తన యమపాశాన్ని, కాలదండాన్ని, ముద్గరాన్ని తీసుకుని రథాన్ని అధిరోహించాడు. రథం పుష్పక విమానం దిశగా ముందుకు ఉరికింది. యముడు యుద్ధానికి స్వయంగా బయలుదేరడంతో ముల్లోకాలూ కంపించాయి. యముడి రథం వాయువేగ మనోవేగాలతో నేరుగా రావణుడి పుష్పక విమానం ఎదుట నిలిచింది. యముడి రథాన్ని చూడగానే రావణుడి మంత్రులు భయభ్రాంతులయ్యారు. యుద్ధరంగంలో నిలిచేందుకు ధైర్యం చాలక వారు తలో దిక్కు పారిపోయారు. రావణుడు మాత్రం భయపడకుండా, యముడికి ఎదురు నిలిచాడు. ఇద్దరికీ ఏడు పగళ్లు, ఏడు రాత్రులు ఏకధాటిగా యుద్ధం జరిగింది. యముడు అనేక దివ్యాస్త్రాలను ప్రయోగించి, రావణుడిని తీవ్రంగా గాయపరచాడు.రెచ్చిపోయిన రావణుడు కూడా యముడి మీదకు శరపరంపర కురిపించి, గాయపరచాడు. యముడి సారథిని కూడా తీవ్రంగా బాధించాడు. యమ రావణుల యుద్ధాన్ని గమనిస్తూ వచ్చిన మృత్యుదేవత యముడి ముందుకు వచ్చి నిలిచింది. ‘యమధర్మరాజా! నువ్వెందుకు శ్రమించడం? వీడితో యుద్ధానికి నన్ను ఆదేశించు! క్షణాల్లో వీడిని చంపేస్తాను’ అంది. ‘నువ్వు ఊరికే చూస్తూ ఉండు. వీణ్ణి నేనే చంపేస్తాను’ అంటూ యముడు తన కాలదండాన్ని పైకెత్తాడు. కాలదండం నిప్పులు చిమ్ముతూ భయంకరంగా ఉంది. యముడు కాలదండాన్ని రావణుడి మీదకు విసరబోతుండగా, బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ‘యమధర్మరాజా! కాలదండాన్ని ప్రయోగించకు. నీ కాలదండంతో వీడు మరణిస్తే, నేను వీడికిచ్చిన వరం వ్యర్థమవుతుంది’ అన్నాడు. బ్రహ్మదేవుడి మాట మన్నించిన యముడు తన కాలదండాన్ని ఉపసంహరించుకున్నాడు. రావణుణ్ణి చంపడానికి అవకాశం లేకపోవడంతో యుద్ధరంగంలో ఏం చేయాలో తోచక రథంతో సహా అదృశ్యమై, బ్రహ్మదేవుడి వెంట సత్యలోకానికి వెళ్లిపోయాడు.యముడు అదృశ్యం కావడంతో రావణుడు తాను నరకాన్ని జయించినట్లు ప్రకటించుకున్నాడు. అక్కడి నుంచి పుష్పక విమానంలో బయలుదేరి లంకకు చేరుకున్నాడు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: నల్లకోడి-తెల్లదెయ్యం
‘ఓబ్బీ! లేయ్ నాయన.. నా తండ్రివి గదూ! నా రత్నం గాదూ! మన ఇంటికి రాక రాక ఇన్ని దినాలకు అబ్బొచ్చినాడు. పాపం.. మనం బాగా మర్యాద జేసి పంపొల కదా? కోడ్ని అలల జేయించుకుని రావాల, మీ నాయన జూస్తే టైంకి ఊర్లో లేకపాయ. కిస్టపాడు పోవాలా.. లెయ్ నాయనా.’మాయమ్మ చెవిలో జోరీగ మాదిరి నస పెట్టేది వింటా తట్టుకోలేక దుప్పటి కాళ్ళ కిందునుంటి ఇరికిచ్చి తలవెనక్కి బిర్రుగా తోసి ముదరజుట్టుకుని పడుకున్నా.అహా! అసలుకి ఈ రగ్గు మా నాయన నెల్లూరు పోయినపుడు తెచ్చివుండాడు. నాతో అబద్ధం జెప్పి వుంటాడు. మా ఇటుకల బట్టి అంటించినాక ఆకాశంకేసి పై పైకి లేస్తాపోయే పొగతోబాటు గాల్లోకి ఎగిరి అట్టనేబోయ్ మబ్బులు తెంపి ఇట్టా తెచ్చినట్టు ఎంత హాయిగా, ఎంత మెత్తగా వుంటాదో ఈ దుప్పటి.దీన్ని తెచ్చిన పొద్దు జూడాల మాయమ్మ బేసిన భరతనాటికం, ఈ లేత నీలం రంగు చూసి మా నాయన మీదకి పూనకమొచ్చిన మాదిరి వూగింది. ఈ రంగు బేన్నే మాసిపోద్దనీ, ఇంత లావు రగ్గుని ఉతికేటాలకు నడుము, చేతులు పడి పోతాయని వాపసు ఇచ్చి రమ్మనింది. నేనే నాకు నచ్చిందని మాయమ్మని కాళ్ళా, వేళ్ళా పడి బతిమాలి వున్నించుకున్నా. ఉతికేతపుడు నేను సాయంగూడా జేస్తానన్నా. అట్టా దీన్ని దక్కించుకున్న.ఇది కప్పుకుంటే పానం గాల్లో తేలుతాపోతాన్నెట్టు ఉంటాది.కాకుంటే ఒకటే .. మా అమ్మ నా తాలాపు దిక్కున మంచంకోడుకు ఆనుకుని కుచ్చిని నన్ను లేపుతావుంటే సూసే అమ్మలక్కలు తోడై, రాగాలు పెడతారేమోనన్న ఆలోచన మనసులోకి రాంగానే భయమేసి గబుక్కుని లేస్తి.‘మా! ఏంది మా? సంకురాత్రి సెలవులిచ్చినాక, ఈ మాద్దిరి ఎండపొద్దు దాకా పొండుకోవాలని కలలుగంటి. తలాపున కుచ్చోని ఈమైన ‘ఓ..’ అని రాగాలు పెడతావుండావు. ఏం? కిట్టపాడు దాకా ఏంటికి? నాలుగీదులవుతలనే ‘ఈసోబు’ మామ వుండ్లా్య. ఎప్పుడూ ఆయనే సేసిస్తాడుగదా అలల’ అంటి విసుగ్గా. ‘ఏంటికి నాయన ఇంత చిరాకు నీకు? పొద్దున్నే పాలకోసం ఈసోబు మామ చిన్న బిడ్డవుండ్లా? అదే ఆయమ్మి గౌసియా వచ్చింటే నేను ముందే ఎచ్చరిస్తి. మీ నాయన వుండాడా అమ్ములు? కోడిని తెస్తా అలల జేపిచ్చాడేమో’ అని అడిగితి. దానికి ఆయమ్మి..‘లేడత్తోవ్! నిన్ననే మా మున్ని అక్కను అత్తగారింటి నుండి మనింటికి కాన్పు కోసమని తోడకరావాలని ఊరికి పోయినాడు’ అని చెప్పింది రా’ అంది మాయమ్మ.‘గౌసియా వచ్చిందా?’ అంటి టక్కున ఆత్రం ఆపుకోలేక. మళ్ళా మాయమ్మ ఏమనుకుంటుందో అని ఉత్తుత్తి ఆవలింతలు దీస్తా మెరిసిన ఆనందపు కళ్లను నులుపుకుంటానట్లు అరచేతులను అడ్డుబెట్టుకుని ‘చా! భలే ఛాన్సు పాయ’ అని మనసులో అనుకున్నా. ఆయమ్మి నాదిక్కు జూసినపుడు నవ్వే నవ్వంటే నాకు శానా శానా ఇష్టం. కానీ ఆయమ్మి ఇంత పొద్దన్నే వచ్చుద్దని అసలు అనుకోలా నేను.‘బిరాన పోయిరాపో నాయనా! నెను పప్పు నానబెట్టిన, నువ్వచ్చేలోపు గారెల పిండి రుబ్బేసి. తెల్లబాయలు వొలిసి మసాలా నూరి పెడతా! నువ్వొచ్చినాక కోడి కూర పులుసుజేసి వేడి వేడిగా నాలుగు గారెలు జేసిపెడతాను. మా నాయన కదూ! పోయ్రాపో బంగారూ’ అంటా మాటలతో ఊరిచ్చే మాయమ్మ.సరేని ఉదరాబదరా పండ్లు తోమి, మాయమ్మ ఇచ్చిన పెద్ద గలసానిండాకు ఉడుకుడుకు పాలు తాగినాక.. నేను, మాయమ్మ ఇద్దరం కలిసి కోళ్ల గూటిలో తారాడి తారాడీ గుడ్లకు వచ్చిన నల్ల కోడిని ఒకదాన్ని చూసి ఒడుపుగా పట్టుకుంటిమి. మాయమ్మ దాని కాళ్ళు రెండు పురికొసతో ముడేసిస్తే చెయ్ సంచిలో కుక్కి, జేబులో రూపాయి పెట్టుకొని దావ పట్టిన.మా ఊరికి కిస్టపాడు రెండు కిలోమీటర్ల దూరం. బస్సులు ఎపుడో ఒకటి తప్ప రావు. అందుకే అందరూ సైకిళ్ల మీదనో, నడుచుకునో పొయ్యేవాళ్లు. పొయ్యేటపుడు డబుల్స్ లేని సైకిల్ జూసి చెయ్ చాపి ఎక్కి, సరాసరి మా నాయన దగ్గర పనిజేసే మస్తానోళ్ళ ఇంటికి బోతి. ఈడకు ఎప్పుడు వచ్చినా యజమాని కొడుకు హోదా ఇస్తారు వీళ్లు. ఒకదిక్కు మస్తాన్ మామ కోడిని అలాల్ జేసేదానికి తీసుకొనిబోతే, నేను ఆయప్ప భార్య ఇచ్చిన కారం చుట్టలు తింటా కూసున్న.‘నాయన లేడు కదా అబ్బయ్యా! నేనే కోడిని కాల్చి కొట్టిస్తాగానీ రోసేపు అట్ట మంచంలోనే కూకో’ అనే. సరే అని కుచ్చుంటి నేను. అంతలోనే ఆయమ్మ లోటాతో బానలోని చల్లటి నీళ్లు తెచ్చిచ్చే. తాగి చొక్కాతో మూతి తుడుచుకుని లేచేతరికి, ముక్కలుగా కొట్టిన కోడి మాంసంను స్టీల్ టిఫను డబ్బాలో బెట్టిస్తా ‘టిపను డబ్బా రేప్పొద్దున వచ్చినప్పుడు తెచ్చుకుంటాలే గానీ నువ్ భద్రంగా పోయిరా చిన్నోడ’ అనే.నేను టిఫను డబ్బా పట్టుకుని ఊపుకుంటా, గారెల రుచి ఊహించుకుంటా పాటలు పాడుకుంటా, ఎవురన్న సైకిల్ మీద వస్తాండారేమో అని యనకమాలకి తిరిగి తిరిగి సూసుకుంటా నడుస్తావుండా. మా ఊరినింటి కిష్టపాడు మధ్యలో ఒక లోతువంక దారి ఉంటాది. వంకకు ఒక పక్క చింతమానుల కిందున్న సమాధులు నన్ను ఎప్పుడూ భయపెట్టేదానికే జూస్తాయి. పొయ్యేతపుడు సైకిల్ మీద ఆ దిక్కు తిరిగి కూర్చుని పోయినా కాబట్టి కనపడలేదేమో గాని ఈ మధ్య కొత్తగా కట్టినట్టువుండారు ఓ సమాధిని. కట్టింది చాలదని దాని మీద సిమెంట్తో ఒక మనిషి ఆకారం కూర్చున్నట్టుగా కూడా చెక్కినారు. ఎర్రంచు పంచా, తెల్లటి చొక్కా, నల్లంగా గుబురు మీసాలు, చేతికర్రా.. అచ్చం మనిషి కూర్చున్నట్టే వుంది. నాకు గుండె దడ దడ మనే. అంతలో ఎవరో నా పేరు పిలిచినట్టు అనిపించింది. ఇంగ నా భయం జూడాల. అప్పటిదంకా పాడిన శిరంజీవి పాట ఆపేసి ‘అనుమంతుడి’ దండకం ఎత్తుకుంటి నేను. అయినా కూడా గుండెలో దడకేమో ఎండ ఎక్కువ లేకున్నా చెమటపడతానే వుంది. పొద్దున తాగిన పాలు ఆవిరైపాయ, తిన్న కారం సుట్టలు అరిగిపాయ, గబ గబా నడిసి వంకపైకి వచ్చేసి ఊపిరి తీసుకున్నాను. ఎదురుమల్లె దూరంగా మా ఊరు కనపడి హమ్మయ్య అని ఇంగ ధైర్యం తెచ్చుకుంటి. రోన్ని నీళ్లు తాగితే బాగుండు అని నాలిక పిడసగట్టినట్టు అనిపిస్తంది.అంతలో ‘ఓఓ..బ్బీ’ అని ఎవరో పిలిసిన పిలుపు మళ్ళా వినపడి యనక్కి తిరిగి జూస్తి. వంక లోతట్టులో తెల్లగుడ్డ కదులుతున్నట్టు, నడుస్తాన్నట్టు కనపడి వెన్నులో పదురు లేసింది. ‘ఓఓబ్బీ.. నువ్ రత్నం గాదూ.. ఆడనే వుండు నే వస్తన్న’ అంటా మల్లోసారి కేకేసింది ఆ ఆకారం. ఆమెను ఇంతకు ముందు చూసిన గాపకం లేదు. అసలు తలంతా తెల్ల గుడ్డలాంటిది చుట్టుకుంది మొహం కానరాకుండా. దానికి తోడు తెల్ల చీర కట్టుకుంది.నాకు కాళ్ళల్లో వణుకు మొదలయ్యింది. ‘ఒరా! దయ్యాలకు మన గురించి తెలుసుకోవడం శానా వీజీ అంటరా. అవిగాన తలచుకుంటే మన పేరే గాదు, తరగతిలో మనం యా సెక్షనో గూడా తెలిసిపోతాయంటరా. వాటికీ.. తెల్లచీరలన్నా, నల్ల కోళ్లన్నా, చింత మానులన్నా శానా ఇష్టమంటా మా అబ్బ జెప్పినాడ’ని కళ్ళు గోళికాయలంత జేసుకుని చెప్పిన మా రమణగాడు గుర్తొచ్చాడు.అంతలో ఆ ఆకారం నవ్వుతా ‘ఏందో టిపన్ డబ్బాలో కొండబోతండవే. సియ్యలేనా? అయితే బువ్వదినేకి నేనూ వస్తా వుండు నీతోబాటు మీ ఇంటికి’ అని తుపుక్కున నేల మీద ఉమ్మింది తార్రోడ్డు మీద ఎర్రగా నెత్తురు మాదిరి.. ‘ఉండబ్బీ’ అంటా తలెత్తి నా దిక్కు జూస్తా ముందుకు నడుస్తా వస్తంది. నాకు ఏం జేయాలో తెలియక చేతులు, కాళ్ళు ఆడట్లేదు. ఆమె ఆగి నెత్తిమీద నుండి∙జారిపోతున్న తెల్లగుడ్డ సరి జేసుకుంటా ఉంటే, నేను ఇదే ఛాన్సని ఇంగ దొమ్మల నిండాకు ఊపిరి దీసుకొని పరుగు అందుకున్నా.అట్టా పరిగెత్తిన నాకు వాకిట్లో వాల్చిన నులకమంచంలో బడి మా యమ్మను వాటేసుకున్నది మాత్రమే గ్యాపకం. ఇంగ ఆ పడుకోడం పడుకోడమే పట్టుకుంది అల్లుజ్వరం. వారమయినా తగ్గలేదు.ఓనాడు నేను పొద్దున్నే పాలు, బన్ను తిని జొరం మాత్తరేసుకుని ముదరజుట్టుకుని ముడుసుకుని పడుకునివున్నా. మా అమ్మ నా ఎదురుగా కుచ్చుని రాగులు ఇసురుకుంటా వున్నపుడు వచ్చింది గౌసియా వాళ్ళమ్మ.‘వదినా సేమిరికి రొంత పెరుగు కావాలా’ అంటా అడుగుతా మంచంలో పొడుకున్న నన్ను జుసిందేమో ‘ఏం పిల్లకాయ వదినా! మీ రత్నమయ్య? ఆ మధ్య ఊరినింటి మా అమ్మ వస్తా వుంటే ఈ యబ్బి కనపడినాడంటా. ఎదో మాట్లాడతా తోడుగా పోవచ్చులే అని పిలిస్తే ఉలుకూపలుకూ లేదంటా, ఆకేసుకుంటా నిలబడి ‘ఏంది టిపనులో సియ్యలా నేనూ వస్తా’ అని నవ్వాతా అనిందో లేదో ఆ మయిన ఒకటే పరుగులెత్తి పోయినాడంట. నిజంగానే సియ్యలు లాక్కుంటాదనుకున్నాడా ఏమి?’ ఒకటేమయిన నవ్వుతా వుంది.మాయమ్మ నా దిక్కుజూస్తా ‘లేదులే వదినా! శానాళ్ళయ్యింది కదా మీ అమ్మ మనూరు రాక, అత్తని వాడు గుర్తుపట్టి వుండడులే, ల్యాకుంటే మర్యాదకైనా ఎచ్చరిచ్చే పిలకాయేగాదు మావాడు? వాడి గురించి నీకు తెలీదా!’ అంటా నన్ను ఎనకేసుకోస్తా వున్నింది. ఇద్దరూ అట్లా మాట్లాడతానే నిలబడుకోనుండారు.అన్నీ ఒక్కోటిగా గుర్తు తెచ్చుకుంటి. ఆమె దయ్యం కాదనీ, ఉమ్మింది రక్తం కాదనీ.. గౌసియా వాళ్ల అవ్వకోసం ఆకులు, వక్కలు కొనక్కపోయేదీ, ఆ జేజి ఎప్పుడూ ఆకొక్క నములతాంటాదని అప్పటికి జ్ఞాపకం వచ్చింది. తెల్ల గుడ్డ కప్పుకుంటే మట్టికీ అందరూ దయ్యం కాదని అర్థమై లోలోపల నవ్వుకుంటి నేను.గౌసియా వాళ్లమ్మ రోసేపు మాటాడి పోతా పోతా నా మనసులోని భయం కూడా తీసుకొని వెళ్ళిపోయింది. ఆ పొద్దు గట్టిగా అనుకుంటి. ఇంగెప్పుడూ భయం అన్న మాట లేకుండా తిరగాలని.మా కానుగచెట్టు నుండి చల్లని గాలి నా మొహాన్ని తాకుతా వుంది. మా అమ్మ నుదురు మీద అరచెయ్యేసి జూసి ‘హమ్మయ్య! చెమట పోస్తంది లే. ఇంగ జ్వరం ఇడిసినట్టే రత్నమా’ అంది ప్రేమగా నా నుదురు ముద్దాడి. -
బౌండరీ దాటితే ఔటే!
కవిత, కుమార్లకు మూడేళ్ల కిందట వివాహమైంది. మొదట్లో చిలకాగోరింకల్లా ఉండేవారు. కాలం గడిచేకొద్దీ వారి వైవాహిక బంధంలో ఉక్కపోత మొదలైంది. కవిత వస్త్రధారణ నుంచి ఆమె స్నేహితుల వరకు అంతా తనకు నచ్చినట్లే ఉండాలంటాడు కుమార్. అలా లేకుంటే ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇది కవితకు నచ్చడంలేదు. క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దాన్ని సరిచేసుకునేందుకు కుమార్ ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఏం చేయాలో అర్థంకాక కవిత కౌన్సెలింగ్కు వెళ్లింది. కాలంతో పాటు మారని మనుషులు..మన దేశంలో భర్తంటే భరించేవాడు. కుటుంబంలో భర్తదే ప్రధానపాత్ర. అతని మార్గాన్నే భార్య అనుసరించాలి. కాలం మారినా, పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా చాలామంది పురుషులు తమ ఆధిపత్యమే సాగాలనే భావజాలంలోనే ఉంటున్నారు. కుమార్దీ అదే బాట. అందుకే తన భార్య తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా కోరుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాడు. ఆ క్రమంలో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కవిత తన మనసులోని మాట చెప్పలేకపోతోంది. దాంతో మనసులో అసహనం, కోపం పెరిగిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్కు వెళ్లింది. ఆమె చెప్పినదాన్ని బట్టి వారికి ‘హెల్దీ బౌండరీస్’ గురించి అవగాహన లేదని తెలిసింది. సరిహద్దులు అవసరం..భార్య అయినంత మాత్రాన తన మాట తప్పక వినాలని, భర్త అయినంత మాత్రాన తాను చెప్పినట్లే నడుచుకోవాలని అనుకోవడమే జంటల మధ్య చాలా సమస్యలకు కారణం. ఏ బంధంలోనైనా బౌండరీస్ అవసరం. సరిహద్దులు అనేవి మన శారీరక, మానసిక వెల్ బీయింగ్ను కాపాడుకోవడానికి మన చుట్టూ గీసుకునే అదృశ్య రేఖలు. అవసరాలు, అంచనాలు, ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఏమిటో తెలియజేసే చర్యలు. ప్రతి జంటకూ హెల్దీ బౌండరీస్ గురించిన అవగాహన అవసరం. ⇒ ప్రతి వ్యక్తికీ తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు ఉంటాయి. వాటిని గుర్తించి, గౌరవించినప్పుడే బంధం బలపడుతుంది. అది సంప్రదాయాన్ని తిరస్కరించడం కాదు. బంధం మరింత బలపడటానికి మార్గం. ⇒ ‘నువ్వలా చేస్తున్నావు’, ‘నువ్విలా అంటున్నావు’ అని కాకుండా.. ‘నేనిలా అనుకుంటున్నాను’, ‘నేనిలా ఫీలవుతున్నాను’ అని మాట్లాడటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ⇒ ఒక వ్యక్తిని గౌరవించడమంటే వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం. భార్యకు లేదా భర్తకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటుందని గుర్తించడం. ⇒ సంప్రదాయానికి, స్వేచ్ఛకు మధ్య సమతౌల్యం సాధించాలి. అది ఒకరి పట్ల మరొకరికి అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది. ⇒సరిహద్దులను సెట్ చేయడం సవాలే. భాగస్వామి ఒప్పుకోకపోవచ్చు. అది మీ బాధ్యత కాదు. మీ అంచనాలకు అనుగుణంగా స్థిరంగా ఉండండి. ⇒హద్దులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో నిర్ణయించుకోండి. పరస్పర చర్చల ద్వారా హద్దులను సర్దుబాటు చేసుకోండి. వీటిని కవిత, కుమార్లకు మూడు సెషన్లలో వివరించి, వారి మధ్య ఉన్న అపోహలను తొలగించి, ఓపెన్ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేలా కొన్ని ఎక్సర్సైజ్లు చేయించారు. ఇప్పుడిద్దరూ చిలకాగోరింకల్లా ఉంటున్నారు. రకరకాల హద్దులు..శరీరానికి, గోప్యతకు సంబంధించినవి ఫిజికల్ బౌండరీస్. బహిరంగ స్థలాల్లో ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం ఇష్టం లేకపోతే ఆ నిర్ణయాన్ని భాగస్వామి గౌరవించాలి. మీ సమయాన్ని ఎలా నిర్వహించుకుంటారనేది మీ టైమ్ బౌండరీస్పై ఆధారపడి ఉంటుంది. గడపాల్సిన సమయానికి పరిమితులు పెట్టడం, మీకోసం సమయం కేటాయించుకోవడం అందులో భాగం. భావాలు, భావోద్వేగాలకు సంబంధించినవి ఎమోషనల్ బౌండరీస్. ఇతరుల భావోద్వేగాలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవడం ఇందులో భాగం. ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవి ఫైనాన్షియల్ బౌండరీస్. మీ ఆర్థిక స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం ఇందులో భాగం.శృంగారంలోనూ సరిహద్దులుండాలి. అసౌకర్యంగా అనిపించే వాటికి నో చెప్పాలి. మానసిక శక్తి తగ్గించే చర్చలు నిరాకరించే హక్కును, నెగటివిటీ లేదా గ్యాస్లైటింగ్ నుంచి మీ మనస్సును కాపాడుకోవడమే మానసిక సరిహద్దు.మీ ఆన్లైన్ వ్యవహారాలు ఎలా ఉండాలో నిర్ణయించేది డిజిటల్ బౌండరీసే! -
యువ కథ: చందమామ రావే!
రోజులాగే ఆ రోజూ సెల్లో అలారం మోగింది, కాకపోతే గంట ముందుగా. ఠక్కున లేచి అలారం ఆఫ్ చేశాడు అనంత మూర్తి. ‘అప్పుడే తెల్లారిందా’ మెల్లగా కళ్ళు తెరవకుండానే అడిగింది భార్య నీరసంగా.‘ఈరోజు త్వరగా వెళ్లాలని చెప్పానుగా. రాత్రి టెంపరేచర్ ఏమీ లేదుగా నీకు’ అడిగాడు.‘ఊహూ’తాకి చూడాలనిపించింది. కాని టైమ్ లేదు. లైట్ వేసి ముందురోజే తీసి వుంచుకున్న టవల్, షేవింగ్ కిట్ తీసుకుని బాత్రూమ్లోకి వెళ్ళాడు. ఇంకా పేపర్ కూడా రాలేదు. ముందు రోజు సండే బుక్ తీసుకుని తిరగేస్తూ కూర్చున్నాడు. ‘ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇన్నాళ్లు పడిన కష్టానికి ఫలితం వచ్చే రోజు. వెళ్ళగానే ఆఫీస్ మొత్తం ఒక రౌండ్ వేయాలి. ఆ మహీధర్ని నమ్మలేం. ఏదీ సక్రమంగా చేయడు. ఎంట్రన్స్లో కుండీలన్నీ సరిగ్గా పెట్టించాడో లేదో. అసలే మబ్బు గాడు’ మనసులోనే అనుకుంటున్నాడు. చూపు పుస్తకం మీద ఉందే కానీ ఆలోచనలు మొత్తం ఆఫీస్లోనే ఉన్నాయి. టైమ్ అయిపోతోంది ఇంక లాభం లేదు అనుకుని కడుపు ఖాళీ అవ్వకపోయినా లేచి స్నానం ముగించుకుని బయటికి వచ్చాడు. అనంతమూర్తి మొదటి నుండి పని రాక్షసుడే. తన నిరంతర కృషే ఈరోజు తనకి జనరల్ మేనేజర్గా గుర్తింపు తెచ్చిందని పూర్తిగా నమ్ముతాడు. అందుకే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు దాని పూర్తి బాధ్యత మూర్తి చేతిలో పెట్టింది కంపెనీ. ఈరోజు అది అన్ని బ్రాంచీల్లో కెల్లా అతి తక్కువ కాలంలో ఉన్నతమైన ఫలితాలను సాధించింది. తనని అభినందించడానికి సాక్షాత్తు కంపెనీ íసీఈవో రాబోతున్నారు.డ్రైవాష్ నుండి తెప్పించుకున్న సూట్కి ఉన్న ట్యాగ్ కట్ చేస్తూ భార్యకి చెప్తున్నాడు– ‘సాయంత్రం నాకు రావడానికి లేట్ అవ్వచ్చు, ఆఫీస్ వాళ్ళతో బయటకి వెళ్తాను. డిన్నర్కి రాను. నువ్ మందులేసుకుని పడుకో. రఘు, సుమ లేచాక చెప్పు రేపు వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్తా అని!’ కార్ తీసుకుని ఆఫీస్ బ్యాగ్తో బయటకువెళ్తుంటే ఎదురైంది సుభద్ర.. ‘అమ్మగారు లేచారాండయ్య? జ్వరం తగ్గిందా?’‘ఆ..!’ అంటూ గడియారంలో టైమ్ చూసుకుంటూ కార్ ఎక్కి ఆఫీస్కి బయల్దేరాడు. దారిలోనే మహీధర్కి కాల్ చేశాడు. పూర్తిగా రింగ్ అయినా ఫోన్ ఎత్తలేదు. ‘ఇంత నిర్లక్ష్యం ఏంటో ఈ యువతకి. వీళ్ళు ఎలా పైకి వస్తారు. ఐదు రోజుల కష్టాన్ని రెండు రోజుల్లో తగలేస్తారు’ అనుకుంటూ అభిరామ్కి డయల్ చేశాడు. ‘హాలో.. ఆయన స్నానం చేస్తున్నారు. ఏదైనా ముఖ్యమైన విషయమాండి?’ అభిరామ్ భార్య ‘20 మినిట్స్లో ఆఫీస్లో ఉండాలని చెప్పండి’‘ఒక్కరిక్కూడా శ్రద్ధ లేదు. వాళ్ళ వయసులో నేను ఎంత పోటీ పడేవాడ్నో, ఏదో ఒక అవకాశం దొరకక పోతుందా ప్రూవ్ చేసుకోడానికని..’ పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఆఫీస్ చేరుకున్నాడు. మూర్తి లోపలికి వెళ్తుండగానే అటెండర్ రవి రావడం చూసి కొత్తగా తెప్పించిన కుండీలను ఎక్కడెక్కడ పెట్టాలో స్వయంగా చూపించాడు. అవన్నీ కూడా హరిశ్చంద్రగారు ఖాళీ సమయాల్లో గార్డెనింగ్ చేస్తానని ఇంటర్వ్యూలో చెప్పడం వల్లే.. విజిట్ గురించి తెలిశాక అప్పటికప్పుడు ఆర్డర్ చేసి రకరకాల బోన్సాయ్ మొక్కలు తెప్పించాడు. కార్పెట్ క్లీనింగ్ సరిగ్గా చేశారా లేదా అని చెక్ చేశాడు. కారిడార్ మొత్తం తిరిగి అన్ని విండోస్ ఓపెన్ చేసి చూశాడు. ఇంతలో అభిరామ్, మహీధర్ వచ్చారు. ‘పాత ఫైల్స్ అన్నీ సెపరేట్ షెల్ఫ్లోకి షిఫ్ట్ చేయించావా?’ ‘లాస్ట్ వర్కింగ్ డేనే చేశాం సర్’ మహీధర్ వెనకే నడుస్తూ చెప్పాడు. ‘అప్ కమింగ్ ప్రాజెక్ట్ డీటేల్స్?’ ‘డేటా రెడీగా ఉంది సర్’ అభిరామ్ వైపు ప్రశ్నార్థకంగా చూసి తలాడిస్తూ చెప్పాడు మహీ. స్టాఫ్ అందరూ ఒక్కొక్కరూ రావడం గమనించి మూర్తి వారినుద్దేశించి చెప్పసాగాడు. ‘ఈరోజు మనకు ముఖ్యమైన రోజు. ఇంత వరకు మీరందరూ నాకు సహకరించినందుకు ఫలితం కొద్దిసేపట్లో మనం చూడబోతున్నాం’మాటల మధ్యలో అభిరామ్ ఫోన్లో మాట్లాడుతూ బయటకి లోపలికి తిరుగుతూనే ఉన్నాడు. అది కనిపెట్టిన మహీధర్ ‘అభి, ఎందుకలా తిరుగుతున్నావ్, ఎవరి కోసం చూస్తున్నావ్?’ అడిగాడు. ‘ఈ రవిగాడు అనుకున్నంత పని చేశాడు’‘రవి బొకే తేవడానికి వెళ్ళాడుగా?’‘ఔను, అలాగే ప్లంబర్ని కూడా తీసుకు రమ్మని నేనే పంపాను’‘వార్నీ, నువ్వింకా ఆ ట్యాప్ ఫిక్స్ చేయించలేదా.. బాస్ ఇంకా చెక్ చేయాల్సింది వాష్రూమ్స్ మాత్రమే. ఆయన కంట పడిందో.. చిన్న పని కూడా చేతకాదు అని నెలంతా వాయించేస్తాడు. అయినా నీకు చెప్పాను చూడూ’ మహీధర్ తలపట్టుకున్నాడు. ‘నేను ఆరోజే రవికి చెప్పాను. వాడు చిన్న పనే అయిపోతుంది అన్నాడు. ఇందాకే నాతో చెప్పాడు ప్లంబర్ రాలేదని, ఏదేమైనా 10 నిమిషాల్లో తీసుకొస్తా అన్నాడు. అదే ఫోన్ చేస్తున్నా, తీయట్లేదు’ ఏం చేయాలో తెలీక నీళ్లు నములుతూ చెప్పాడు అభి.రవి వెళ్లి అరగంట దాటింది. టైమ్ 10 అయింది. సీఈవో గారు ఎప్పుడైనా రావచ్చు, ఇంకా ఈ ట్యాప్ ఫిక్సింగ్ ఇప్పుడు కాదు అనుకుని అభిరామ్.. మహీధర్ దగ్గరకి వచ్చి అదే చెప్పాడు. ‘నీకేం? నువ్ ఎన్నైనా చెప్తావ్, బాస్ చెప్పింది నీకు కాదు కదా. అసలు ఆరోజే నేను ఆ పని అయ్యాక వెళ్లాల్సింది. ఫ్రైడే ఈవెనింగ్ అని నీ హెల్ప్ అడిగాను చూడూ నా చెప్పుతో నేను కొట్టుకోవాలి’ కోపంగా మహీ లోపలికెళ్లి నెమ్మదిగా స్టాఫ్ వాష్రూమ్లోకి వెళ్లాడు.ఫ్రైడే రోజు–‘నేను మీ కంటికి పిచ్చి వెధవలా కనిపిస్తున్నానా?’ సడన్గా ఫ్లోర్ మీద ప్రత్యక్షమయ్యాడు మూర్తి. అప్పటి వరకూ గుసగుసగా మాట్లాడుకుంటున్న స్టాఫ్ మొత్తం ఆగి ఎవరికి మూడిందా అని చూస్తున్నారు.. ఫ్లోర్ మొత్తం గుండు సూది పడినా వినిపించేంత సైలెంట్గా ఉంది. ‘టప్..!’ ఒక శబ్దం ‘ఏదో ఒకటి పెరికేసి నా మొఖాన కొడితే తప్పులన్నీ వెతికి పట్టుకునే డ్యూటీ నేను చేయాలా?’ పూనకం వచ్చినట్టు ఊగి పోతున్నాడు మూర్తి మహీధర్ మీద. మహీధర్ టీమ్లోని సంజన రాసిన ప్రోగ్రామ్లో మిస్టేక్స్ రిపీట్ ఔతున్నాయి. ఆడపిల్లలను మందలించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ముందే వాళ్ళ టీమ్ లీడ్ మీద విరుచుకుపడటం మూర్తికి అలవాటే! ‘టప్! టప్!’ ‘ఏంటా శబ్దం?’ పక్కనే ఉన్న స్టాఫ్ వాష్రూమ్ వైపు అసహనంగా చూస్తూ అడిగాడు మూర్తి. వెంటనే తేరుకుని ‘వాష్రూమ్ నుండే వస్తున్నట్టుంది సర్’ మహీ నెమ్మదిగా చెప్పాడు. మూర్తి ఏదో అందుకునే లోపే ‘టప్..!’ మళ్లీ వచ్చింది. ‘అదేంటో చూడు..’ ఆదేశించాడు మూర్తి. వాష్ బేసిన్ అవుట్ లెట్ నుండి ఒక్కో చుక్క కారి సరిగ్గా కింద వాటర్ పోవడానికి ఉండే మెటల్ ప్లేట్ మీద పడుతున్నాయి. మెటల్ ప్లేట్ కింద ఖాళీ ఉండటం చేతనేమో ఆ శబ్దం స్పష్టంగా వినబడుతోంది. ‘వాటర్ లీక్ ఔతుంది సర్’ డోర్ తీసి మెల్లగా చెప్పాడు మహీధర్. అది చూస్తున్న మూర్తి ఇంకా ఏం మాట్లాడకముందే ‘రవికి చెప్పి క్లియర్ చేయిస్తాను సర్’ అన్నాడు మహీధర్. ఈ రకంగా అయినా ప్రోగ్రామింగ్ విషయం వదిలేస్తాడన్న ఆశతో. మూర్తి సూటిగా మహీధర్ కళ్ళలోకి చూసి, ‘ఒక్క చుక్కే కదా అని వదిలేస్తే నాలుగు రోజుల్లో ట్యాంక్ ఖాళీ ఔతుంది. చిన్న తప్పైనా వెంటనే కట్టడి చేయాలి’ అని సంజన గురించి కూడా మందలించినట్టు చెప్పి వెళ్ళిపోయాడు. ‘హమ్మయ్య.. ఈవాళ్టికి గండం గడిచింది’ అని మనసులోనే అనుకుంటూ సంజనకి వివరంగా చెప్పాడు. అటెండర్ రవి ఆరోజు కొన్ని అరెంజ్మెంట్స్కి బయటికి వెళ్లడంతో వచ్చాక ట్యాప్ విషయం చెప్పమని అభిరామ్కి చెప్పి వీకెండ్ పార్టీ ఉందని ఆఫీస్ టైమ్ అవ్వకముందే బాస్ వెళ్ళగానే బయల్దేరాడు మహీధర్. ఈరోజు– మూర్తి స్టాఫ్ అందరినీ ఎవరి పనులు వాళ్ళని చూసుకోమని మహీని మాత్రం తన రూమ్కి పిలిచాడు. వాష్రూమ్ వైపు చూస్తూ మూర్తి వెనకాలే నడుస్తున్నాడు. శబ్దం అయితే రావట్లేదు. ‘బహుశా నిన్నంతా సండే.. ఎవరూ వాడకపోవడం వలన వాటర్ లీక్ అవడం లేదేమో. ఏదైతే ఏం ఈ ఒక్క రోజూ గడిస్తే చాలు’ అనుకున్నాడు.సీఈవోగారు ఒప్పుకుంటే లంచ్కి తీసుకెళ్లడానికి ఎక్కడ బావుంటుందో చూడమని అడిగాడు మూర్తి. టార్గెట్ ప్రమోషన్. జోనల్ వైజ్గా బ్రాంచెస్ టేక్ కేర్ చేయాలని. అది చెప్పడానికే సీఈవో డైరెక్ట్గా వస్తున్నారని మూర్తి ఎక్స్పెక్టేషన్. తను అనుకున్నదే జరిగితే సాయంత్రం స్టాఫ్ అందరికీ డిన్నర్ ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకు ఒక ప్లేస్ కూడా సెలెక్ట్ చేయమన్నాడు. ఈలోగా ప్లంబర్ను వెంటపెట్టుకొచ్చిన రవిని అభి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి సైలెంట్గా వాష్రూమ్లోకి పంపించాడు. ప్లంబర్కి అక్కడ ఏం చేయాలో చూపించి.. బయటికి చప్పుడు రాకుండా త్వరగా చేయమని, తను చెప్పేవరకూ బయటికి రావద్దని జాగ్రత్తలు చెప్పి, బొకేలు ఇవ్వడానికి బాస్ రూమ్కి వెళ్ళాడు రవి. అతను వెళ్లేసరికి ఫోన్లో మాట్లాడుతున్నాడు మూర్తి. ఫోన్ పెట్టేసి, బొకే టేబుల్ మీద పెడుతున్న రవికి చెప్తున్నాడు– ‘అవసరంలేదు బయటకే తీసుకురా. సర్, ఆల్రెడీ ఆన్ ద వే. ప్రయర్గా ఫినిష్ చేసుకుని వెళ్లాలని ముందే బయల్దేరారట. ఎనీ మినిట్ రీచ్ ఔతారు. నువ్వెళ్ళి మన స్టాఫ్ అందరికీ ఇన్ఫార్మ్ చెయ్. మహీ, టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీతింగ్’ అంటూ రవితో పాటే బయటికి నడిచారు ఇద్దరూ. రవికి ఏం చేయాలో తెలీలేదు. అభి వంక బేలగా చూస్తూ వస్తున్నాడు. ఆల్రెడీ ఇందాక తిట్టిన తిట్లకే రవి మొఖం వాచిపోయింది. పెద్దసార్ వచ్చేస్తున్నారని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అందర్నీ చూస్తూ చెప్పి అభిని చూసి తల కిందకేసుకున్నాడు. నోరు తెరుద్దామనుకున్న అభి, వెనకే వస్తున్న మూర్తి, మహీధర్లను చూసి ఆగిపోయాడు. మూర్తి.. అభిని పిలిచి రిసీవ్ చేసుకోడానికి కొంతమంది స్టాఫ్తో బయటే ఉండమన్నాడు. చేసేదిలేక బయటికి నడిచాడు అభి. సీఈవో హరిశ్చంద్ర గారు వచ్చేశారు. కార్ దిగడంతోనే అందరూ దండలూ బొకేలతో విష్ చేసి లోపలికి తీసుకొచ్చారు. ప్రమిసెస్ చాలా బావుందని మెచ్చుకున్నారు. అందరూ ఆ క్రెడిట్ మూర్తిగారిదే అని ముక్తకంఠంతో చెప్పారు. మూర్తి చాలా పొంగిపోయాడు. సీఈవో ఒక్కొక్కరిని పలకరిస్తూ అభినందించారు. ఆ సంవత్సరం సంస్థ సాధించిన విజయాలు గర్వంగా చెప్తూ అందులో అధిక భాగం మీకే చెందుతుందని ఎంప్లాయీ‹స్ని ఉద్దేశించి చాలాసేపు మాట్లాడారు. అందరికీ బోనస్లు ప్రకటించారు. ‘అతితక్కువ కాలంలో మంచి ఫలితాలు తెచ్చినందుకు మీ అందరి కృషిని స్వయంగా అభినందించాలని వచ్చాను. ఈ విజయం వెనుక ఉన్న విజనరీ మైండ్ మూర్తి గారిని’ అని ముగించేలోపు ‘కెవ్వ్’ అనే కేక ఒకటి అప్పుడే వినిపించి అందరూ అవాక్కయ్యారు. అది వాష్రూమ్ నుండి వచ్చిందని తెలిసి రవి, అభి తర్వాత మహీ గతుక్కుమన్నారు. మూర్తికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏదో విందామనుకుంటే ఇంకేదో వినాల్సివచ్చింది. వాష్రూమ్ నుండి బయటకొచ్చిన స్టాఫ్ మెంబర్ అనురాధ ఏడ్వలేక నవ్వుతూ ‘సారీ సర్.. సడన్గా లోపల మనిషిని చూసేసరికి’‘మనిషా, ఎవరు?’ హరిశ్చంద్రగారే అడిగారు. భయపడేంతగా ఎవర్ని చూసి ఉంటుందా అని మూర్తి కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అభిరామ్కి విషయం అర్థమై ఏం జరగబోతోందో ఊహించలేకపోతున్నాడు. ఒకచేతిలో పెద్ద ఇనుప రెంచితో మరోచేతిలో నల్లటి బ్యాగ్తో సన్నగా ఉన్న ఒక మనిషి బయటకొచ్చాడు. చిన్న చెక్స్ ఉన్న వైట్ హాఫ్ హ్యాండ్స్ షర్ట్, కాస్త పొట్టి ప్యాంట్తో మనిషి నీట్గానే ఉన్నాడు. ‘ఎవరు నువ్వు.. లోపలేం చేస్తున్నావ్?’ సూటిగా అతన్నే చూస్తూ అడిగారు హరిశ్చంద్ర గారు. మూర్తికి సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు పడినట్టు అయింది. సమాధానం చెప్తే తెలుసుకుందామని మూర్తి కూడా ఎదురు చూస్తున్నాడు. ‘నా పేరు రాజు, ట్యాప్ రిపేర్ చేయనీకి ఒచ్చిన సార్‘‘రిపేర్ అయిందా?’‘అయింది సార్’‘ఎంతసేపటి నుండి చేస్తున్నావ్?’‘రొండు గంటలైంది’‘వాట్?’‘అది మొదటి 20 నిమిషాల్లోనే అయిపోయింది సార్’‘మరి లోపల ఎందుకున్నావ్ ?’రవి వంక చూసి మౌనంగా ఉండిపోయాడు రాజు. ‘రవీ, ఏంటిదంతా?’ మూర్తి కలగచేకున్నాడు. ‘సారీ సర్.. మీకు తెలియకుండా చేయించాలనుకోడం నా తప్పే’ రవి.. మూర్తికి దణ్ణంపెట్టి హరిశ్చంద్ర గారికి వివరించడం మొదలెట్టాడు. ‘సర్, నేను ఈపని శనివారమే చేయించాల్సింది. ఆరోజు నుండి ఎవరూ దొరక్కపోవడంతో నా స్నేహితుడ్ని బతిమాలి తీసుకొచ్చే సరికి ఉదయం లేట్ అయ్యింది. విషయం తెలిస్తే జీఎం సర్ కోప్పడతారని తెలియకుండా చేపించాలనుకున్నాను. ఇంతలో..’‘అంటే ఇతను ప్లంబర్ కాదా?’ ‘ఔనని చెప్పలేం సర్, కానీ ఇతనికి ప్లంబింగ్ పని బాగానే వచ్చు. ఇతను ఈ పని ఆ పని అని కాకుండా అన్ని పనులూ చేస్తుంటాడు సర్. ఒక ఆటో ఉంది. కానీ రోజూ తిప్పడు. ఇలాగే చిన్న చిన్న రిపేర్లు, కరెంటు పని మెకానిక్ పని అన్నీ వచ్చు’‘ఓహో! అల్రౌండర్ అన్నమాట. కానీ అరగంటలో అయ్యే పనికి రెండు గంటలు ఎందుకు లోపలే ఉన్నావ్?’ రాజునే గమనిస్తూ అడిగారు హరిశ్చంద్ర గారు. ‘ఈ సారు కంగారుగా నాకాడికొచ్చి చిన్న పనుందని వెంటపెట్టుకుని వచ్చే. ఏదో అవసరం మీద వచ్చిన. నావల్ల ఏ ఇబ్బంది అయినా ఆయన పని పాడు చేసినటై్టతదని లోపల్నే ఉన్న.’ ‘నువ్వేమో ఫ్రెండ్ అంటున్నావ్, అతను సారంటున్నాడు?’ రవిని ప్రశ్నించారు హరిశ్చంద్ర గారు. ‘సర్’ ఎలా చెప్పాలా అని మౌనంగానే ఉన్నాడు రవి. ‘ఇంకేదైనా దాస్తున్నారా మీ ఇద్దరూ కలిసి?’ అని హరిశ్చంద్ర అడగడంతో రవికి చెమటలు పట్టేశాయి. మూర్తికి చాలా ఇబ్బందిగా అనిపించింది. తన ముందే సీఈవో తన అటెండర్ని ప్రశ్నించడం ఒక ఫెయిల్యూర్లా ఫీలయ్యాడు. ‘అయ్యో సర్, ఇంతవరకు ఎలాంటి తప్పు జరగలేదు సర్. జీఎంగారు ఏ విషయంలో అయినా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు’ అని రాజుతో పరిచయం నుండి చెప్పడం మొదలుపెట్టాడు రవి. ‘నిజానికి ఇతన్ని నేను ఎప్పటి నుండో చూస్తున్నాను కానీ ఈరోజే కలిశాను. పోయిన వారం వినాయక నిమజ్జనానికి మా వీధిలో డాన్స్ వేస్తుంటే చూశా. ఆ రోజే మాట్లాడాలనుకున్నా కానీ హడావిడిలో కుదరలేదు. మళ్ళా ఒకరోజు తెల్లవారు ఝామున మా అత్తమ్మోళ్లని బస్టాండ్ నుండి తీస్కొస్తుంటే కాలవొడ్డు దగ్గర చిన్న పార్క్లో నలుగురు పిల్లలతో కలిసి యోగా చేస్తూ కనిపించాడు. ఆరోజు గుర్తు పట్టా. చిన్న పనికి ఆదివారం ఎవరూ రావట్లేదని నిన్నంతా ఫోన్లు చేస్తుంటే విని మా చంటోడు చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి పంపులు బిగించడం వచ్చు అని. ఈరోజు వేరే దారిలేక అనుమానంగానే ఇల్లు వెతుక్కుని వెళ్లాను. అడగ్గానే నాతో వచ్చాడు’మూర్తికి ఇదంతా అనవసరంగా తోచినా అనుమానించాల్సిన అవసరంలేదని మాత్రం ఇద్దరికీ స్పష్టమైంది. హరిశ్చంద్రగారికి రాజు ఓపిక నచ్చింది. ఇన్ని పనులొచ్చినా ఏ పనిలోనూ ఎందుకు కుదరలేదో తెలుసుకోవాలనిపించింది. ‘నువ్వు యోగా టీచరా?’ రాజునే అడిగారు హరిశ్చంద్ర గారు. ‘కాదు సార్. ఆయన చూసిన నలుగురు నా పిల్లలే. దాదాపు ప్రతిరోజూ పొద్దున్నే నా భార్యతో పార్క్కి పోయి కాసేపు ఆసనాలు ఏసి ఎండకి తిరిగి ఇంటికొస్తాము. అందుకే ఆటో కొన్నాను. మేం ఎక్కడికైనా అందులోనే ఎల్లేది. ఎప్పుడైనా పని లేకుంటే నాలుగు రౌండ్లు వేసొస్తా’‘ఈ రోజుల్లో నలుగురు పిల్లలను పెంచడం భారం అనిపించలేదా?’‘అదేంది సర్.. నేను పెంచేడిదేముంది? ప్రకృతిలో పుట్టింది ఏదైనా పెరిగేటిదే కదా. వాళ్ళకి ఇంతబుద్ధి నియ్యాలె. ఇంత ముద్ద పెట్టాలె. ఆకాడికి ఐతే కష్టం చేయగలను. నా ఇంటిది పోరు పెట్టేటిది కాదు. మా ఇంట్లనే కాయకూరలు కుండీల్లో పాదు పెట్టింది. మేం తినగా పక్కనోళ్లు కొంచపోయి తోచింది ఇస్తరు. పైసా పైసా దాపెట్టి అపదకొస్తదంటది. నా పెద్ద కూతురు పలుకు బంగారం. ఈ ఏడు ఆరో తరగతికొచ్చింది. హనుమంతుడి గుళ్లో శ్లోకాలు పాడతది. ఆడికొచ్చే ఒక ముసలావిడ గొంతు కలిపింది. ఇప్పుడు ఆమెతోని తోల్కపోయి స్టేజీల మీద పాడిస్తది. మన ప్రయత్నం సుబ్రంగుంటే దారి కూడా సుగమంగుంటది కదా సార్’ చెప్తూనే వాళ్ళమ్మాయి గొంతు విన్నట్టు మైమరచి పోతున్నాడు రాజు. హరిశ్చంద్రతో పాటు మూర్తి, మిగిలిన స్టాఫ్ అందరూ కూడా ప్రశాంతంగా వింటున్నారు. ‘మీ ఆవిడ సరే, మీ పిల్లలైనా అది కావాలి ఇది కావాలి అని అడుగుతారుగా?’ గురువు దగ్గర హితబోధ కోసం ఎదురుచూస్తున్నట్టు అడిగారు హరిశ్చంద్ర గారు. ‘అడుగుతారు సార్. చిన్నప్పుడు చందమామ కావాలని అడుగుతాము. అలాగని అడిగినోళ్ళని కొడతామా.. చందమామని కొంటామా! గిది అంతే. మొన్న మూడోవాడు పెద్ద టీవీ కావాలనీ, రోజూ ఎన్నో సినిమాలు చూడొచ్చని అడిగిండు. వాని కోరిక సమంగాదని ఎట్లా తెలియాలె. మర్నాడే బడి నుంచి వచ్చినాక ఆరుగురిమి శ్రీనివాస థియేటర్కి పోయి మహేష్ బాబు సినిమా చూపిచ్చి ఇంటర్వెల్లో అందరం కేకులు తిని మస్తు ఖుషీ అయి వచ్చినం. ఆ రేత్తిరి నా కొడుకును అడిగిన.. ఎట్లుంది నాయిన సినిమా? అని. ‘చానా బాగుంది నానోయ్.. మస్తుగుంది అన్నడు. నేనన్నా ‘మరి ఇంట్లో టీవీ కొని రోజూ చూస్తే ఆ మజా వస్తదా? నువ్ రోజూ బడి నించి వచ్చినాక చెల్లితోని ఆడుకోవాలే.. లెక్కలూ, పాఠాలు చదవాలే.. అమ్మతోని కథలు చెప్పించుకుంటా బువ్వ తినాలే.. డాబా మీద చుక్కలు చూస్తా పండుకోవాలే. మల్ల మనందరం థియేటర్కి పోయి సినిమా జూడాలే.. అని.’ అందరూ అప్రయత్నంగా చప్పట్లు కొట్టారు అభి, మహీతో సహా. హరిశ్చంద్ర గట్టిగా నవ్వుకున్నారు. మూర్తీ నవ్వక తప్పలేదు. అందర్నీ చూస్తూ రాజూ నవ్వడం మొదలుపెట్టాడు. హరిశ్చంద్రకి తన ప్రశ్నకి జవాబు దొరికిందనిపించింది. స్టాఫ్ అందరికీ సీఈవో స్పీచ్ కంటే రాజు స్పీచ్ బావుందనిపించింది. మూర్తికి ఎక్కడో కలుక్కుమనింది. గత వారం రోజులుగా జ్వరంతో నీరసపడిన భార్య, ఐదు నిమిషాలు కూడా తనతో నవ్వుతూ మాట్లాడలేని పిల్లలు జ్ఞాపకమొచ్చారు. ఆరోజు రాజుని కలవడం తనకెంతో ఆనందంగా ఉందని, తనని తీసుకొచ్చిన రవికి థాంక్స్ చెప్పి, ఆ అవకాశం మూర్తి వల్లనే వచ్చిందని అభినందించారు హరిశ్చంద్ర. మూర్తి ప్రమోషన్ గురించి చెప్పి, ఆయనే అందరినీ లంచ్కి తీసుకెళ్లాడు రాజుతో సహా! రాజు జీవితంలోనూ ఏదో ప్రమోషన్ ఉందనిపించింది. దాని కోసం ఇంట్లో కూడా కష్టపడాలని నిశ్చయించుకున్నాకే లంచ్లో అతడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు.మరిచిన రుచులను గుర్తుచేసే సందర్భాలు రావడమూ అదృష్టమే.ఆల్రెడీ ఇందాక తిట్టిన తిట్లకే రవి మొఖం వాచిపోయింది. పెద్దసార్ వచ్చేస్తున్నారని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అందర్నీ చూస్తూ చెప్పి అభిని చూసి తల కిందకేసుకున్నాడు. -
అవకాశానికే అవకాశం ఇచ్చింది
కొంతమంది గురించి చెప్పడానికి మాటలు అక్కర్లేదు. వాళ్ల పని చూస్తే చాలు! అలాంటి ప్రతిభావంతురాలే థెమిస్ వెనెస్సా! అవకాశాలను ఆమె వెదుక్కోలేదు.. అవకాశాలే థెమిస్ని వెదుక్కుంటూ వచ్చాయి. అలా వచ్చిన ప్రతి అవకాశంతో మరో చాన్స్ని క్రియేట్ చేసింది ఆమె విలక్షణమైన స్టయిలింగ్!థెమిస్ స్వస్థలం చెన్నై. చిన్నప్పుడే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్కి వెళ్లే వయసులోనే నిశ్చయించుకుంది పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని! అనుకున్నట్టుగానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక బెంగళూరులోని ఓ ఫ్యాషన్ మేగజీన్లో చేరింది. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్గా పాపులర్ అయిన అర్చా మెహతాను కలిసింది. ఆమె దగ్గర ఇంటర్న్గా చేరింది. తర్వాత తమిళ చిత్రం ‘రెమో’తో ఫ్రీలాన్స్ కాస్ట్యూమ్స్ డిజైనర్గా సినీ ప్రయాణం మొదలుపెట్టింది. ఆమె విలక్షణ శైలికి సినీ ఇండస్ట్రీ ముచ్చటపడి అవకాశాలను అందిచ్చింది. వాటిల్లో ‘ద రోడ్’, ‘మారా’, ‘వేలైక్కారన్’, ‘పొన్నియిన్ సెల్వన్ ’ వంటి సినిమాలున్నాయి. వాటికి ఆమె అసిస్టెంట్ స్టయిలిస్ట్గా చేసింది. ఎన్నో ఫొటో షూట్స్, యాడ్స్కూ పనిచేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ ప్రాజెక్ట్ వచ్చినా.. పర్సనాలిటీని హైలైట్ చేసే స్టయిలింగ్తో వారిని గ్లోబల్ స్టార్స్లా చూపింది. ఆ సిగ్నేచర్ స్టయిల్ ఎంతోమంది స్టార్స్కి నచ్చింది. శ్రీనిధి, త్రిష, శోభితా ధూళిపాళ, శ్రద్ధా శ్రీకాంత్, చిన్మయిలతో పాటు శివ కార్తికేయన్, విజయ్, జయం రవిలాంటి మేల్ సెలబ్రిటీలకూ స్టయిలింగ్ చేసింది థెమిస్. -
గాడిద పందేలు
పండుగలు, జాతరలు భక్తితోనే కాదు సరదా సంబరాలతోనూ మైమరపిస్తాయి!కోడి పందేలు, ఎడ్ల పందేలు వంటి వాటికి అవే వేదికలు! ఇప్పుడు గాడిదల పోటీలూ మొదలయ్యాయి.. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం, కడపజిల్లాల్లో! ఆ వివరాలు..మోటారు వాహనాలు పెరగడంతో రవాణా మొదలు చాలా విషయాల్లో పశువుల మీద ఆధారపడే పరిస్థితి దాదాపుగా కనుమరుగైందనే చెప్పొచ్చు. ఆ క్రమంలో రజకులకు గార్దభాల అవసరమూ లేకుండా పోయింది. కానీ కొన్ని కుటుంబాలు మాత్రం ఇంకా వాటి ఆధారంగానే జీవనం సాగిస్తున్నాయి. ఆ జంతువులను సంరక్షిస్తున్నాయి. పండుగల వేళ వీటితో కలసి సంబరాలు చేసుకునే ఆనవాయితీని కొనసాగిస్తున్నాయి. ఆయా పర్వదినాల్లో వాళ్లు వాటిని చక్కగా అలంకరించి, పూజలు చేసి, ఊరేగించి వాటి ప్రత్యేకతను చాటుతున్నారు. వాటి మధ్య పందేలు నిర్వహిస్తున్నారు. ఫలానా ప్రాంతంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు కరపత్రాలను ముద్రిస్తారు. ఆ సమాచారాన్ని ముందుగా అందుకున్నవారు మిగిలిన పోటీదారులందరికీ వాట్సాప్ చేస్తారు. ఈ పోటీలను కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లోనూ నిర్వహిస్తున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా కొన్ని మగ గార్దభాలను సిద్ధం చేస్తారు. ప్రతిరోజూ వీటిపై ఇసుక మూటలను వేసి నేల మీదే కాదు నీటిలోనూపరుగెత్తుతూ శిక్షణనిస్తారు. వీటికి మొక్కజొన్న పిండి, మినప పొట్టు, సజ్జలు తదితరాలను ఆహారంగా పెడతారు.పోటీ పదినిమిషాలే.. బరువును లాగే ఈ గాడిదల పోటీల వ్యవధి కేవలం పదినిమిషాలే! 80 పల్ల ఇసుక (రెండు క్వింటాళ్ల పది కిలోలు)తో పోటీలు నిర్వహిస్తారు. ఆ బరువుతో నిర్దేశించిన పది నిమిషాల్లో ఏ గాడిదైతే ఎక్కువ దూరం వెళ్తుందో దానినే విజేతగా నిర్ణయిస్తారు. విజేతకు నగదు, లేదా వెండిని బహుమతిగా అందిస్తారు. నగదు రూ. 5వేలు మొదలుకొని రూ. 20వేలకు పైనే ఉంటుంది. ఈ పోటీల కోసం అనంతపురం, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లి మరీ గాడిదలను కొంటున్నారు. బ్రీడ్ ఆధారంగా తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లోని గాడిదలను కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వీటి ధర రూ. 50వేలు మొదలుకొని రూ.లక్షకు పైనే ఉంటుంది. వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. అయితే పోటీల్లో పాల్గొనే గాడిదలకు వయసుతో సంబంధం ఉండదు. మోసే బరువే ప్రామాణికం. లీటరు పాలు రూ.7వేలకు పైనేగాడిద పాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. లీటరు పాల ధర రూ.7వేలకు పైగా పలుకుతోంది. అనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో డెయిరీలు సైతం ఏర్పాటయ్యాయి. రోజుకు ఓ గాడిద నుంచి 200 మి.లీ. పాలను సేకరిస్తారు. వీటిని పలు వ్యాధులను నయం చేసేందుకు వినియోగిస్తున్నారు. ఇతర జిల్లాల్లో గాడిద మాంసానికీ డిమాండ్ ఉంటోంది. అందుకే రాత్రివేళల్లో ఆయా ప్రాంతాల వాళ్లు వచ్చి వీటిని ఎత్తుకుపోతున్నట్లు యజమానులు ఆందోళన చెందుతున్నారు.బురదనీటిలో సంబరంఉగాది రోజున కర్నూలు పట్టణంలోని కల్లూరులో కొలువైన చౌడేశ్వరీ మాత దేవాలయ ప్రాంగణాన్ని బురదతో చిక్కగా అలికేస్తారు. గార్దభాలను ముస్తాబు చేసి బండ్లు కడతారు. ఆ బురదలో వీటికి పోటీ నిర్వహిస్తారు. దీన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. గుర్తింపు ఉంటోందిపండుగలు, జాతరల సమయంలో మా జీవితాల్లో భాగమైన గార్దభాలతో సరదాగా బరువులను లాగించే పోటీలను నిర్వహిస్తున్నాం. పోటీల్లో బహుమతి సాధిస్తే గ్రామంలో మంచి గుర్తింపు ఉంటోంది. ఎక్కడ పోటీలు నిర్వహించినా వీటిని తీసుకెళ్తున్నాం.– చాకలి నాగ మద్దిలేటి, ముక్కమల్లఓ సరదా ఆరు సంవత్సరాలుగా గాడిదను పోటీలకు తీసుకెళ్తున్నా. అది ఇప్పటి వరకు 60 పందేల్లో పాల్గొంది. పోయిన ప్రతిచోటా మొదటి లేదా రెండోస్థానాన్ని గెలుచుకుంటోంది. అలా వచ్చిన డబ్బు రాకపోకలకే సరిపోతోంది. అయినా పోటీల్లో పాల్గొనడం ఓ సరదా. ఆ గెలుపుతో మాకు, మా ఊరికి పేరొస్తే చాలు! – చాకలి సుబ్బరాయుడు, వేల్పనూరు · పి.ఎస్.శ్రీనివాసులు నాయుడు, కర్నూలు -
నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చినట్లు ఉంటా!
సానియా అయ్యప్పన్.. నర్తకిగా అడుగుపెట్టి నటిగా స్థిరపడింది. తన అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. అవార్డులనూ అందుకుంది. ఆమె గురించి కొన్ని విషయాలు..⇒చిన్న వయసులోనే బుల్లితెరపై మెరిసింది.. సూపర్ డాన్సర్ అనే రియాలిటీ షో విన్నర్గా! తర్వాత ఢీ2, ఢీ4 షోల్లోనూ పాల్గొని పాపులారిటీతోపాటు సినీ అవకాశాన్నీ అందుకుంది.⇒సానియా అయ్యప్పన్ సొంతూరు కేరళలోని కోచ్చి. నలంద పబ్లిక్ స్కూల్లో చదువుకుంది.⇒‘బాల్యకాలసఖి’ మలయాళ చిత్రంతో బాలనటిగా ఎంటరై, ‘క్వీన్’తో హీరోయిన్గా మారింది. ఈ చిత్రం ఆమెకు బెస్ట్ డెబ్యూ ఆర్టిస్ట్గా ‘ఫిల్మ్ఫేర్’, ‘వనిత ఫిల్మ్ అవార్డ్స్’ ను తెచ్చిపెట్టింది. తర్వాత మోహన్లాల్ నటించిన ‘లూసిఫర్’లో నటించి, ఉత్తమ సహాయ నటిగా ‘సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్’ను గెలుచుకుంది. అటుపై వచ్చిన ‘ద ప్రీస్ట్’, ‘ప్రేతమ్ 2’, ‘సెల్యూట్’, ‘సాటర్డే నైట్’ వంటి పలు సినిమాల్లో మాత్రం అతిథి పాత్రకే పరిమితమైంది.స్క్రిప్ట్ను నమ్మి చేసిన ‘కృష్ణన్కుట్టి పని తుడంగి’ హారర్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ‘ఇరుగప్పట్రు’, ‘సొర్గవాసల్’లు కూడా ఫీల్గుడ్ మూవీస్గా మంచి ఆదరణ పొందాయి. ప్రస్తుతం ఈ రెండూ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నాయి.⇒ చేతినిండా అవకాశాల కంటే గుర్తుండిపోయే పాత్రలతోనే మెప్పించాలని కొంత గ్యాప్ తీసుకుంది. ఆ గ్యాప్లో వెబ్ దునియాలోకి అడుగుపెట్టి, కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్, ‘బిలవ్డ్’ ‘స్ట్రింగ్స్’ అనే షార్ట్ ఫిల్మ్స్లో నటించింది.⇒ నెగటివ్ కామెంట్స్ను పట్టించుకోను. అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోను. కొడతాను కూడా. నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చిన ట్లు ఉంటా!– సానియా అయ్యప్పన్ -
కృత్రిమ దీవిలో అతిపెద్ద విమానాశ్రయం!
చైనా ప్రభుత్వం సముద్రంలో అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. కృత్రిమ దీవిలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. లియోనింగ్ ప్రావిన్స్లోని డాలియన్ నగరాన్ని ఆనుకుని ఉన్న సముద్రాన్ని పూడ్చి ఏకంగా ఓ సరికొత్త దీవిని నిర్మిస్తోంది. ఇక్కడే మొత్తం 20.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘డాలియన్ జి¯Œ జౌవాన్’ పేరుతో అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి, ఏటా 5 లక్షలకు పైగా విమానాలు, 8 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో పనిచేయనుంది. ఇందులో నాలుగు అతిపెద్ద రన్ వేలు, 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాసెంజర్ టెర్మినల్స్ కూడా ఏర్పాటవుతున్నాయి. వీటి ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతుందని అంచనా. ఈ నిర్మాణం పూర్తయితే, ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా కొనసాగుతున్న హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (12.48 చ.కి.మీ) రెండో స్థానానికి పడిపోతుంది. అయితే, ఈ రెండు విమానాశ్రయాలు కూడా కృత్రిమ దీవుల్లో ఏర్పాటైనవే కావడం విశేషం. ఈ విమానాశ్రయాన్ని 2035 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. -
ఎం.ఎం.ఎం మర్డర్స్.. మగ్గు.. మరణశిక్ష!
నేరాల నిరోధం (ప్రివెన్షన్), కేసులు కొలిక్కి తీసుకురావడం (డిటెక్షన్), నిందితుల్ని దోషులుగా నిరూపించడం (కన్విక్షన్).. ఇవి పోలీసుల ప్రాథమిక విధులు. మొదటి రెండింటి మాట అటుంచితే అనివార్య కారణాల నేపథ్యంలో మూడోది మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. కోర్టులో నేర నిరూపణే కష్టసాధ్యంగా మారిన తరుణంలో ఇక నిందితుడికి ఉరి శిక్ష అనేది దుర్లభమే. గత ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు కేసుల్లోనే ఈ శిక్షపడగా.. వాటిలో ఒకటి హైదరాబాద్లోని నారాయణగూడ పరిధిలో జరిగిన ఓ కుటుంబ హత్యకు సంబంధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడికి ఉరి శిక్ష పడటంతో ఓ హోటల్ మగ్గు కీలకమైన భౌతిక సాక్ష్యంగా నిలిచింది.హైదరాబాద్, అంబర్పేటలోని గోల్నాకకు చెందిన రావుల సాయి అలియాస్ నాగుల సాయి.. శుభకార్యాలకు బ్యాండ్ వాయించే పని చేస్తుండేవాడు. ఆ పనిలేనప్పుడు చిత్తుకాగితాలు ఏరుకుని బతుకీడ్చేవాడు. అతనికి స్నేహితుడి ద్వారా హైదరాబాద్లోని చిక్కడపల్లి వాసి ఆర్తితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2014లో ఇరువురూ ఒక్కటి కాగా.. ఏడాదికి కూతురు పుట్టింది. ఆ ఇద్దరి మధ్యా ఉన్న చిన్న చిన్న స్పర్థలు చినికి చినికి గాలివానగా మారడంతో ఆర్తి 2021లో భర్తను వదిలేసింది. కూతురిని తీసుకుని చిక్కడపల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయి తల్లి లక్ష్మీబాయి, సోదరుడు జితేందర్లతో కలిసి ఉండసాగింది. సాయి తరచు ఆర్తి పుట్టింటికి వెళ్తూ ఆమె కుటుంబీకులతో ఘర్షణ పడేవాడు. ఓ సందర్భంలో జితేందర్పై దాడి చేసి, మరోసారి కోర్టు ధిక్కరణ నేరంపై జైలుకూ వెళ్లాడు. ఆర్తికి మగతోడు అవసరమని తలచిన జితేందర్ భార్య అనువైన సంబంధం కోసం వెదకసాగింది. ఆమె ద్వారా పరిచయమైన నాగరాజు మీద ఆర్తి కుటుంబానికి సదభిప్రాయం కలగడంతో 2021లో వీరిద్దరికీ వివాహం చేశారు. తన భార్యను వివాహం చేసుకుని తనకు పూర్తిగా దూరం చేశాడనే ఉద్దేశంతో నాగరాజుపై ద్వేషం పెంచుకున్నాడు సాయి. హైదరాబాద్, నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ఉన్న మార్కెట్లో నాగరాజు పూల వ్యాపారం చేసేవాడు. అతనికి ఆర్తి చేదోడువాదోడుగా ఉండేది. తరచు తమ దుకాణం వద్దకు వచ్చి ఘర్షణ పడుతున్న, తన భార్యతో వాగ్వాదానికి దిగుతున్న సాయిని నాగరాజు అనేకసార్లు మందలించాడు. వీరికి కొడుకు (విష్ణు) పుట్టడంతో సాయిలో ద్వేషంతో పాటు ఈర్ష్య కూడా పెరిగింది. దాంతో అతని ప్రవర్తన విపరీతంగా మారడమే కాదు ఆర్తి కుటుంబాన్ని నాశనం చేస్తానంటూ పలుమార్లు బహిరంగంగానే బెదిరించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన నాగరాజు.. తన భార్యను వేధిస్తున్న సాయిని బెదిరించాలని భావించాడు. 2022 నవంబర్ 7న నారాయణ గూడ మెట్రో స్టేషన్ వద్ద నాగరాజుకు సాయి కనిపించాడు. అతడిని అడ్డగించి.. మరోసారి ఆర్తితో మాట్లాడినా, ఫోన్ చేసి బెదిరించినా ఊరుకునేది లేదంటూ బెదిరించిన నాగరాజు.. ఇకపై ఆమెను సోదరిగా భావిస్తూ చెల్లి అని పిలవాలంటూ హెచ్చరించాడు. ఈ పరిణామంతో విచక్షణ కోల్పోయిన సాయి.. చిక్కడపల్లికే చెందిన తన స్నేహితుడు రాహుల్తో కలిసి నాగరాజు, ఆర్తిల హత్యకు కుట్రపన్నాడు. అదేరోజు రాత్రి హైదరాబాద్, నల్లకుంటలోని పెట్రోల్ బంక్ నుంచి ఖాళీ వాటర్ బాటిల్లో పెట్రోల్ తీసుకు వచ్చాడు. ఆర్తి, నాగరాజు తమ దుకాణంలో ఉన్నారని గుర్తించిన అతగాడు.. ఇద్దరిపైనా పెట్రోల్ చల్లడం ఇబ్బందికరమని భావించాడు. తన స్నేహితుడు రాహుల్తో కలిసి నారాయణ గూడ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న లక్కీ కేఫ్లోకి వెళ్లాడు. అక్కడ మంచి నీళ్లు తాగుతూ అదును చూసుకుని ఓ మగ్గు తస్కరించాడు. నాగరాజు దుకాణానికి సమీపంలో ఆగి బాటిల్లోని పెట్రోల్ను మగ్గులో పోసుకున్నాడు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఓ చేతిలో అగ్గిపెట్టెను సిద్ధంగా ఉంచుకుని నాగరాజు దుకాణం వద్దకు వెళ్లాడు. ఆర్తి, నాగరాజు తేరుకునేలోపే వారిపై మగ్గులోని పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఆ దాడిలో వీరిద్దరితో పాటు ఆర్తి ఒడిలో ఉన్న ఎనిమిది నెలల విష్ణు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ నుంచి రాహుల్తో కలిసి బర్కత్పుర వైపు పారిపోయిన సాయి నల్లగొండకు చేరి తలదాచుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్తి, విష్ణు, నాగరాజు చనిపోయారు. పోస్టుమార్టంలో ఆర్తి గర్భవతని తేలింది. దీంతో సాయి చేతిలో చనిపోయింది నలుగురుగా తేల్చారు. నారాయణగూడ పోలీసులు సాయి, రాహుల్ను అదే నెల 16న అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన అధికారులు ఘటనాస్థలి నుంచి కాలిన స్థితిలో ఉన్న మగ్గును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఇన్వెస్టిగేషన్ అనంతరం 48 మందిని సాక్షులుగా చేరుస్తూ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. కోర్టు విచారణ సందర్భంగా కొందరు సాక్షులు విముఖత చూపినా.. పెట్రోల్ చల్లేందుకు వాడిన, సగం కాలిన మగ్గు కీలకమైన భౌతిక సాక్ష్యంగా మారింది. దీన్ని తస్కరించినట్లు సాయి అంగీకరించగా.. అది తమ మగ్గే అంటూ లక్కీ కేఫ్ యజమాని సాక్ష్యం చెప్పాడు. దీన్ని సైతం ఓ కీలక ఆధారంగా పరిగణించిన న్యాయస్థానం సాయి, రాహుల్ను దోషులుగా తేల్చింది. గత నెల 20న (20.12.2024) సాయికి ఉరి శిక్ష, రాహుల్కు జీవితఖైదు విధించింది. ఈ కేసు విచారణలో నారాయణగూడ ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారు. -
Pregnancy: సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
నాకు ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయింది. రెండు నెలలు. కొంచెం బ్లీడింగ్ అవుతోంది. హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఏమైనా వాడాలా? వాటికి సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయా? – పి. హారిక, గన్నవరంప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో బ్లీడింగ్ అనేది సర్వసాధారణం. అయితే బ్లీడింగ్ అవటంతోటే గర్భస్రావం అవుతుందేమోననే భయం ఉంటుంది చాలామందిలో. ప్రతి ముప్పైమందిలో ఒకరికి మాత్రమే గర్భస్రావమయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకానీ ప్రతి గర్భిణికీ అలాగే అవుతుందేమోనని హైడోస్ హార్మోన్స్, సపోర్ట్ మెడిసిన్స్ ఇవ్వటం సరికాదు. కేస్ను బట్టే నిర్ణయించాలి. ప్రెగ్నెన్సీలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ చాలా కీలకం. ఇది గర్భసంచి పొర పెరగటానికి తోడ్పడి, గర్భస్రావం కాకుండా ఉండటానికి సాయపడుతుంది. అయితే వజైనల్ బ్లీడింగ్ అవుతున్నవారికి ఈ హార్మోన్ సప్లిమెంటేషన్ వల్ల ఉపయోగం ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. అలాగని అందరికీ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈ హార్మోన్.. టాబ్లెట్స్, పెసరీస్, ఇంజెక్షన్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. దీన్ని రోజుకి రెండుసార్లు, నాలుగవ నెల అంటే 16 వారాల వరకు ఇస్తే సరిపోతుంది. కొన్ని సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని నివారించడానికి భోజనం చేసిన వెంటనే వేసుకోవాలి. పొట్టలో నొప్పి, వాంతులు, బ్రెస్ట్ పెయిన్, నీరసం, మలబద్ధకం లాంటివి ఉండవచ్చు. ఎక్కువ ఇబ్బంది ఉన్న వారికి వజైనల్ లేదా రెక్టల్ రూట్లో యూజ్ చెయ్యమని సూచిస్తారు.నాకిప్పుడు మూడోనెల. తొలి చూలు. ఎలాంటి సమస్యలు రావద్దనుకుంటున్నాను. ఎమోషనల్గా బేబీకి దగ్గరవటానికి, ప్రెగ్నెన్సీ నుంచే కొన్ని చెయ్యాలంటుంటారు. అవేంటో సజెస్ట్ చేయగలరా? – సి. సత్య, కదిరితొలిసారి తల్లి కాబోతున్నప్పుడు చాలా సందేహాలు, ఇంకెన్నో భయాలుంటాయి. ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో కొంత అవగాహన పెరిగింది. అయితే భయాలు కూడా పెరిగాయి. గర్భస్థ శిశువుకు భావోద్వేగాలు, చొరవ తీసుకునే సామర్థ్యాలు, తల్లిదండ్రుల ప్రేమ వంటివి అర్థమవుతాయని పరిశోధనల్లో రుజువైంది. హెల్దీ అటాచ్మెంట్ ఉంటే బయటి వాతావరణం సురక్షితంగా, భద్రంగా ఉందని గర్భస్థ శిశువు భావిస్తుంది. అయిదవ నెల నుంచి గర్భస్థ శిశువు శబ్దాలను వినే చాన్స్ ఉంది. అందుకే పొట్టలో బిడ్డతో తల్లి కమ్యూనికేట్ చేయొచ్చు. ఇది పుట్టిన తరువాత బిడ్డ మీ వాయిస్ని గుర్తుపట్టేందుకు సాయపడుతుంది. పాజిటివ్ థింకింగ్ అండ్ థాట్స్ ఉంటే లోపల బిడ్డ గ్రోత్ బాగుంటుంది. పొట్టలో బిడ్డ గురించి ఆలోచించటం, మాట్లాడటం 5వ నెల నుంచి మొదలు పెట్టవచ్చు. దీని వలన మంచి బాండింగ్ డెవలప్ అవుతుంది. 5 నుంచి 6వ నెల మధ్య బిడ్డ కదలికలు తెలుస్తుంటాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తూండాలి. ఈ కదలికల తీరు అందరికీ ఒకేలా ఉండదు. ఒక వారం గమనిస్తే ఎప్పుడు, ఎలా కదులుతోందనేది తెలుస్తుంది. అకస్మాత్తుగా కదలికలు నెమ్మదిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మంచి బుక్స్ చదవటం, హెల్దీ డైట్ తీసుకోవటం చాలా అవసరం.నాకు ఏడాది కిందట అబార్షన్ అయింది. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్ని. మూడోనెల. రొటీన్ బ్లడ్ టెస్ట్లో హెపటైటిస్ – బి పాజిటివ్ అని చెప్పారు డాక్టర్. దీని వలన నాకు, నావల్ల బేబీకి ఎలాంటి రిస్క్ ఉండొచ్చు?– రుక్మిణి, మహబూబ్నగర్హెపటైటిస్ – బి అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది చాలామందిలో ఏ సింప్టమ్స్ లేకుండా సైలెంట్గా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో అందరికీ రొటీన్గా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ని చెక్ చెస్తారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు వచ్చిన వారికి ముందే చెక్ చేసి, అవసరమైన వాళ్లకి ప్రివెంటివ్ వాక్సినేషన్ ఇస్తారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్లో ముఖ్యంగా లివర్కి వాపు ఉంటుంది. ఇది చాలావరకు కలుషిత ఇంజెక్షన్స్, రక్తం, వీర్యం, ఉమ్మి ద్వారా వ్యాపిస్తుంది. ఒకసారి మీ భర్త కూడా హెపటైటిస్–బి టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరిస్థితుల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్ చూసే డాక్టర్ని సంప్రదించాలి. డెలివరీ తరువాత బేబీకి కూడా స్పెషలిస్ట్ కేర్, వాక్సినేషన్స్ అవసరం. ప్రెగ్నెన్సీలో మీకు లివర్ సమస్య ఎక్కువవకుండా కొన్ని మందులను సూచిస్తారు. వైరల్ లోడ్ తగ్గిందా లేదా అని తరచు బ్లడ్ టెస్ట్స్ చెయ్యవలసి ఉంటుంది. లివర్ స్కాన్ చెయ్యాలి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా నార్మల్ డెలివరీ అవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చెయ్యవచ్చు. బేబీకి హెపటైటిస్–బి రాకుండా ప్రాపర్ టెస్ట్స్, వాక్సిన్స్ చేయించాలి. పుట్టిన వెంటనే నాలుగు వారాలకు, ఏడాదికి వాక్సిన్స్ ఇవ్వాలి. మీకు వైరల్ లోడ్ ఎక్కువుంటే, బేబీకి ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అందరికీ ఇచ్చే రొటీన్ వాక్సిన్స్ కూడా ఇవ్వాలి. బేబీకి ఏడాది వయసు వచ్చే వరకు క్లోజ్గా ఫాలో అప్ చెయ్యాలి. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
మిస్టరీగానే నాదిరా హత్య కేసు
అది 6 ఆగస్టు 1995, సమయం దాదాపు అర్ధరాత్రి. శివార్లలోని గుల్బర్గ్ ప్రాంతం నుంచి లాహోర్ వైపు వెళ్లే మార్గం నిర్మానుష్యంగా ఉంది. వీథి దీపాలు కూడా వెలగకపోవడంతో దారంతా చీకటిగా ఉంది.రెస్టరెంట్లో భోజనం ముగించుకుని, నాదిరా దంపతులు ఇంటికి వెళుతున్నారు.తోవలో కొందరు దుండగులు తుపాకులు చూపించి, కారును అడ్డగించారు. కారు నుంచి దిగమని డ్రైవ్ చేస్తున్న నాదిరా భర్త మాలిక్ ఇజాజ్ హుస్సేన్ను గద్దించారు.దుండగుల చేతిలో తుపాకులు చూసి భయపడిన నాదిరా, ఆమె భర్త ఇజాజ్ కారు నుంచి కిందకు దిగారు.దుండగులు వాళ్లను పక్కకు నెట్టేసి, కారు తాళాలను గుంజుకోవడానికి ప్రయత్నించారు. ఇజాజ్ వారిని ప్రతిఘటించాడు. దుండగులకు, ఇజాజ్కు మధ్య కొంత ఘర్షణ జరిగింది. దుండగుల్లో ఒకడు రివాల్వర్ కాల్చాడు. పక్కనే ఉన్న నాదిరా మెడలోంచి తూటా దూసుకుపోయింది. నాదిరా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నాదిరా భర్త ఇజాజ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దుండగుల కోసం గాలింపు ప్రారంభించారు.ఈ సంఘటన పాకిస్తాన్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నాదిరా మాజీ సినీతార కావడంతో ఆమె హత్యవార్త పత్రికల్లోని పతాక శీర్షికలకెక్కింది. పోలీసులు దుండగుల కోసం గాలించినా, ఎలాంటి ఆచూకీ దొరకలేదు. దుండగులు ఎవరో తెలుసుకునేందుకు తగిన ఆధారాలు కూడా దొరకలేదు. మీడియా ఒత్తిడి పెరగడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.నాదిరా తన పద్దెనిమిదేళ్ల వయసులో 1986లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. అనేక సూపర్హిట్ సినిమాల్లో నటించింది. తన అందచందాలతో ప్రేక్షకులకు మతులు పోగొట్టిన ఆమెను అభిమానులు ‘వైట్ రోజ్’గా పిలుచుకునేవారు. సినీరంగంలో ఒకవైపు వెలుగుతుండగానే, సంపన్నుల ఇళ్లల్లో జరిగే వేడుకల్లో ముజ్రా కార్యక్రమాల్లో నాట్యం చేసేది. ముజ్రాలో నాట్యానికి ఆమె అప్పట్లోనే రూ.52 లక్షలు పారితోషికంగా తీసుకునేది.సినీరంగంలోకి అడుగుపెట్టిన రెండేళ్లలోనే ఆమె అనూహ్యంగా ఎదిగింది. అప్పట్లోనే ఆమె షూటింగ్ కోసం స్టూడియోలకు అత్యంత ఖరీదైన కార్లలో వచ్చేది. అదేకాలంలో ఆమెతో పాటు సినిమాల్లోకి అడుగుపెట్టిన నటీనటులు కొందరు సాధారణమైన కార్లలోను, ఇతరుల వాహనాల్లోను, ఇంకొందరు రిక్షాల్లోను స్టూడియోలకు వచ్చేవారు. అతి తక్కువ కాలంలోనే పంజాబీ, ఉర్దూ, పాష్తో భాషల్లో 52 సినిమాల్లో నటించింది. వాటిలో పాతిక సినిమాలు సిల్వర్జూబ్లీలు చేసుకున్నాయి. సినీరంగంలో వైభవం కొడిగట్టక ముందే పెళ్లి చేసుకుని, కెరీర్కు స్వస్తి పలికింది.సినీరంగంలో నాదిరా పట్టుమని పదేళ్లు కూడా కొనసాగలేదు. అనతికాలంలోనే ఇబ్బడిముబ్బడిగా సంపాదించుకుంది. లాహోర్లోని బంగారు వర్తకుడు మాలిక్ ఇజాజ్ హుస్సేన్తో పెద్దలు పెళ్లి కుదర్చడంతో 1993లో అతణ్ణి పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం మానుకుంది. ఆ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు కలిగారు.పెళ్లయిన కొన్నాళ్లకు భర్త ఇజాజ్తో కలసి నాదిరా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది. నాదిరా సినిమాల్లో సంపాదించినదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది. కొద్ది కాలంలోనే ఆ వ్యాపారం బాగా పుంజుకుంది. స్థిరాస్తుల కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారాల్లో భర్త ఇజాజ్ అవకతవకలకు పాల్పడుతూ, తన వ్యక్తిగత విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయసాగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. నాదిరా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమె ఇంటి ఇరుగు పొరుగువారిని విచారించారు. నాదిరాకు, ఆమె భర్తకు తరచు కీచులాటలు జరుగుతూ ఉండేవని, తన డబ్బును అతడు విచ్చలవిడిగా తగలేస్తున్నాడని ఆమె వాపోతుండేదని వాళ్లు చెప్పారు.ఇరుగు పొరుగులు చెప్పిన సమాచారం ప్రకారం నాదిరా ఆస్తి కోసం ఆమె భర్తే ఈ హత్య చేయించి ఉంటాడని పోలీసులు అనుమానించారు. వెంటనే అతణ్ణి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే, నేరంలో అతడికి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలనూ కనుక్కోలేకపోయారు. దీంతో అతణ్ణి విడిచిపెట్టారు. పోలీసులు నాదిరా భర్తను అదుపులోకి తీసుకోగానే, ఆమెను భర్తే హత్య చేయించాడంటూ కథనాలు వచ్చాయి. అతణ్ణి పోలీసులు విడిచిపెట్టిన తర్వాత కూడా నాదిరా హత్యపై ఊహాగానాలతో కూడిన పలు కథనాలు వెలువడ్డాయి. ఏళ్లు గడిచినా పోలీసులు ఈ కేసును ఛేదించలేకపోయారు. కొన్నాళ్లకు మీడియా కూడా ఈ ఉదంతాన్ని పట్టించుకోవడం మానేసింది. నాదిరా హత్య ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. -
టేస్ట్ అట్లాస్ రుచుల పండుగ.. టాప్ 100లో 4మనవే..!
‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా.. వేడి వేడన్నంలో వేడి వేడన్నంలో నెయ్యికారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో ఆరురుచులు ఉండగా బతుకు పండుగ చెయ్యరా’ అంటూ పాడే పాటలాగే, ప్రపంచంలోని కొన్ని ప్రశస్తమైన వంటకాలను గుర్తు చేసుకుంటేనే నోరూరుతుంది. ప్రపంచంలోని వందఅత్యుత్తమ వంటకాలు..వంద అత్యుత్తమ రుచుల నగరాలు.. వంద అత్యుత్తమ వంటల పుస్తకాలు..ఇవన్నీ ఒకేచోట పొందుపరిస్తే భోజనప్రియులకు అంతకు మించిన పండుగ ఏముంటుంది! మిమ్మల్ని మరోసారి వంటింటి వైపు చంటోడిలా చూసే వంటకాల్లో వంద ఉత్తమ వంటకాలను ప్రకటించింది ప్రముఖ ట్రావెల్ గైడ్ సైట్ ‘టేస్ట్ అట్లాస్’. వాటిలో మన భారతీయ వంటకాలు కూడా ఉండటం విశేషం.భోజనప్రియుల్లో చాలామంది ఫలానా ఆహార పదార్థం ఎక్కడ రుచిగా ఉంటుందని తెలిస్తే అక్కడకు ఎంత దూరమైన సరే, కేవలం ఆ వంటకం రుచి చూడటానికే వెళ్తుంటారు. మరికొందరు కొత్త ప్రాంతాలు, ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ముందే నిర్ణయించుకుంటారు. అక్కడ ఏం వంటకం లభిస్తుంది, ఏది బాగుంటుంది అని ఇలా వంటకాలకు సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంటుంటారు. అలాంటి వారందరికీ ఉపయోగపడేదే ఈ ‘టేస్ట్ అట్లాస్’. ఇదొక రుచుల ఎన్ సైక్లోపీడియా. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ చుట్టివచ్చి, అక్కడ లభించే వంటకాలకు రేటింగ్ ఇస్తుంటారు.ఆ రేటింగ్ ఇచ్చేవారు మామూలు వారు కాదు. ఎక్స్పీరియన్స్డ్ ట్రావెల్ గైడ్స్, గ్యాస్ట్రోనమీ ఎక్స్పర్ట్స్, ఫేమస్ ఫుడ్ రివ్యూయర్స్ సాయంతో ఈ మధ్యనే సుమారు పదివేల కంటే ఎక్కువ ఆహార పదార్థాలను పరిశీలించి, ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల పేర్లను ప్రకటించింది ‘టేస్ట్ అట్లాస్’. ఇవన్నీ అత్యంత జనాదరణ పొందినవి, అలాగే ప్రపంచంలోని ప్రతి నగరం, ప్రాంతం, గ్రామాల వారీగా మరచిపోయిన రుచులను, సుగంధద్రవ్యాలను అన్వేషించి ఇతర జాబితాలను కూడా ప్రకటించింది. 2024–2025 ఏడాదికి విడుదల చేసిన ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల జాబితాలో మన భారతీయ వంటకాలు నాలుగు ర్యాంకులు దక్కించుకున్నాయి. వీటితోపాటు మన దేశంలోని ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు తమ తమ ప్రాంతీయ వంటకాలతో అదరగొట్టి, ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చేరాయి. వరల్డ్టాప్ 10అలా మొదలైంది..‘టేస్ట్ అట్లాస్’ ఒక ట్రావెల్ గైడ్ వెబ్సైట్. దీనిని క్రొయేషియన్ జర్నలిస్ట్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో, వ్యాపారవేత్త మతిజా బాబిక్ 2015లో ప్రారంభించారు. దాదాపు ఐదువేల వంటకాలు, వందల ట్రావెల్ గైడ్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా మొదటిసారి 2018లో ప్రపంచంలోని వంద ఉత్తమ వంటకాలతో తొలి నివేదిక విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది వారు పరిశీలించే వంటకాల సంఖ్య పెరుగుతూనే పోతోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 11,258 వంటకాలను, 3,67,847 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా వంద ఉత్తమ వంటకాల జాబితాతో పాటు వంద ఉత్తమ ఆహార నగరాలు, వంద ఉత్తమ రెస్టరెంట్లు, ఉత్తమ వంటల పుస్తకాలు వంటి ఇతర జాబితాలను కూడా ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసింది.ఉత్తమ వంటకాలు ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల్లో మొదటి స్థానాన్ని కొలంబియా దక్కించుకుంది. మాంసాహార వంటకం అయిన ‘లేచోనా’ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకంగా ‘టేస్ట్ అట్లాస్’ ప్రకటించింది. గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన ఇటలీ ఈసారి రెండో స్థానంలో నిలిచింది. ఇటలీలోని ‘పిజ్జా నెపోలిటానా’ రెండవ రుచికరమైన వంటకంగా నిలిచింది. ఇక మూడో స్థానంలో బ్రెజిలియన్ బీఫ్ కట్ అయిన ‘పికాన్యా’ వంటకం నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో అల్జీరియా (రెచ్తా), థాయిలాండ్ (ఫానీంగ్ కర్రీ), అర్జెంటీనా (అసడో)లు, ఇతర దేశాలు ఉండగా, 99వ స్థానంలో ‘వాలాస్కీ ఫ్రగల్ కేక్’తో చెక్ రిపబ్లిక్ ఉంది. మన దేశం విషయానికి వస్తే, ఈ వంద ఉత్తమ వంటకాల్లో భారతదేశం నాలుగు ర్యాంకులు సాధించింది. మొదటగా 29వ ర్యాంకుతో ‘ముర్గ్ మఖానీ’ (బటర్ చికెన్) ఉండగా, 100వ ఉత్తమ వంటకంగా ‘కీమా’ నిలిచింది. ఇక ప్రపంచంలోని వంద ఉత్తమ ఆహార నగరాల్లో మన దేశం టాప్ టెన్లోనే ఉంది. స్ట్రీట్ ఫుడ్, ట్రెడిషనల్ వంటకాల్లో ముంబై ఐదవ ర్యాంకు సాధించింది. ముఖ్యంగా భారత్లో తప్పనిసరిగా తినాల్సిన వంటకాల్లో బటర్ చికెన్, అమృత్సర్ కుల్చా, హైదరాబాద్ బిరియానీ, బటర్ గార్లిక్ నాన్ ఉన్నాయి. అంతేకాదు, భారతదేశంలో లభించే గరమ్ మాసాలాలను కూడా తప్పనిసరిగా ట్రై చేయాలని ఈ రిపోర్ట్ సూచిస్తోంది. వీటితో పాటు గ్రీస్ దేశానికి చెందిన చాలా వంటకాలు ఉన్నాయి. వాటిలో ముసాకా, స్టిఫాడీ, సౌలాకీ, డోల్మడోస్, గౌరోస్, గ్రీక్ సలాడ్ ఇవన్నీ తప్పనిసరిగా రుచి చూడాల్సిన వంటకాలని, ముఖ్యంగా మెక్సికోలో మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ ‘టాకోస్’ చాలా ప్రజాదరణ పొందిన వంటకమని ‘టేస్ట్ అట్లాస్’ తెలిపింది. ప్రపంచంలోనే 100 అత్యంత పురాతన వంటల పుస్తకాలు లెక్కలేనన్ని కొత్త వంట పుస్తకాలు ప్రతిరోజూ ప్రచురిస్తున్నప్పటికీ, ఈ 100 వంట పుస్తకాలు కలకాలం జాతి సంపదగా నిలుస్తాయి. ఈ పుస్తకాలు పాక సంప్రదాయాలలో ప్రపంచంలోని పలువురు గొప్ప షెఫ్లకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకంగా మొదటి స్థానంలో అగస్టీ ఎస్కఫియా రచించిన ‘ది ఎస్కఫియా’ ఉండగా, రెండో స్థానంలో ‘ది జాయ్ ఆఫ్ కుకింగ్’ ఉంది. ఈ అత్యుత్తమ వంటల పుస్తకాల్లో నాలుగు భారతీయ పుస్తకాలు ఉన్నాయి. యాన్ ఇన్విటేషన్ టు ఇండియన్ కుకింగ్ (ర్యాంక్–09)మధుర్ జాఫ్రీ రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. ఇది పాశ్చాత్య పాఠకులకు భారతీయ వంటకాలను పరిచయం చేస్తుంది. వివిధ రకాల ప్రాంతీయ వంటకాలతో దేశ పాక సంప్రదాయాలను వివరిస్తుంది.మేడ్ ఇన్ ఇండియా (ర్యాంక్–25)మీరా సోదా రచించిన ఈ పుస్తకాన్ని 2014లో ప్రచురించారు. ప్రతిరోజూ చేసుకునే వంటకాలతో ఈ పుస్తకం కనిపిస్తుంది. అందుకే దీనికి పాఠకాదరణ ఎక్కువ. ది ఇండియన్ కుకింగ్ కోర్స్ (ర్యాంక్–33) మోనిషా భరద్వాజ్ రచించిన ఈ పుస్తకాన్ని 2018లో ప్రచురించారు. ఇది భారతీయ వంటకాలకు ఒక విస్తృతమైన మార్గదర్శి. సంప్రదాయ భారతీయ వంటకాలపై అవగాహనను పెంచుకోవాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.ఇండియన్ వెజిటేరియన్ కుకరీ (ర్యాంక్–69)జాక్ శాంటా మారియా రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. భారతీయ శాకాహార వంటకాల వైవిధ్యాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. వంటలలో రకరకాల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను పరిచయం చేస్తూ, ఆరోగ్యకరమైన వంటకాల తయారీ ప్రక్రియను చెబుతుంది.టాప్ 100 ఉత్తమ ఆహార నగరాలు‘టేస్ట్ అట్లాస్’ 15,478 వంటకాలకు 4,77,287 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా, విడుదల చేసిన ఉత్తమ ఆహార నగరాల జాబితాలో జాతీయ, ప్రాంతీయ వంటకాలన్నీ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన ఆహారం అందించే నగరాల జాబితాలో మొదటి నాలుగు స్థానాలను ఇటలీ దక్కించుకుంది. మొదటగా నిలిచిన నేపుల్స్ నగరంలోని పిజ్జా, మిలాన్లోని రిసోట్టాలను తప్పకుండా రుచి చూడాలంటూ ఈ రిపోర్టు తెలిపింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో బొలొగ్నా, ఫ్లోరెన్స్ నగరాలు ఉండగా, టాప్ 5వ స్థానాన్ని ముంబై దక్కించుకుంది. మరికొన్ని భారతీయ నగరాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మన నగరాలు, వాటి ర్యాంకుల వివరాలు.ముంబై : వడాపావ్, భేల్పూరి, పావ్ భాజీ, దహీ పూరి, బాంబే శాండ్విచ్, బాంబే బిరియానీ, రగడా పట్టిచీ, ఐస్ చావ్లా, అంబా, బొంబిలీ ఫ్రై.అమృత్సర్ : అమృత్సరీ కుల్చా, పనీర్ కుల్చా, అమృత్సరీ ఫిష్ , చూర్ చూర్ నాన్.న్యూఢిల్లీ : బటర్ చికెన్, కుల్చా, రాజ్మా, ఖీర్, దాల్ మఖానీ, ఛోలే భటూరే, ఉల్లి పకోడీ, గులాబ్ జామూన్.హైదరాబాద్ : హైదరాబాదీ బిరియానీ, పెసరట్టు, చికెన్ 65, రూమాలీ రోటీ, మలీదా, కరాచీ బిస్కట్స్, బోటీ కూర, మిర్చీ కా సాలాన్, షికాంపురీ కబాబ్, కుబానీ కా మీఠా.కోల్కత్తా : కఠీ రోల్, గోబీ మంచూరియా, పనీర్ కఠీరోల్, రసగుల్లా, పొంగల్, చక్కర్ పొంగల్చెన్నై : మద్రాస్ కర్రీ, ఇడ్లీ, సాంబార్, దోశ, కొబ్బరి చట్నీ, మురుకులు, బోండా, కాజూ కత్లీ, చెట్టినాడ్ మసాలా. ఏది ఏమైనా ఈ ‘టేస్ట్ అట్లాస్’ రిపోర్ట్ ఒక సమీక్ష మాత్రమే! ‘లోకో భిన్న రుచి’ అని నానుడి. కొంతమందికి కొన్ని వంటకాలు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. చాలామంది బయటి ఆహారం కంటే ఇంట్లో వండుకునే వంటకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ‘టేస్ట్ అట్లాస్’లో ఎక్కువగా యూరోపియన్స్ వంటకాలే టాప్లో నిలిచాయి. ఏ దేశ ప్రజలకు వారి దేశీయ వంటకాలే ఎక్కువగా నచ్చుతాయి. కాబట్టి ఈ ర్యాంకులన్నీ కూడా కేవలం చెప్పుకోవాడానికే కాని, వీటికి కచ్చితమైన ప్రామాణికత అంటూ నిర్ణయించలేం. -
సృజనకు పెన్నిధి
క్రియేటివ్ జీల్కి నిలువెత్తు నిదర్శనం స్టయిలిస్ట్ నిధి జెస్వానీ! అవుట్ డేటెడ్ అనే మాటను దరిదాపుల్లోకి కూడా రానీయదు. డిజైన్స్లో కానీ.. స్టయిలింగ్లో కానీ కాలమే ఆమెతో పోటీ పడాలి!నిధి జెస్వానీ.. పుట్టి, పెరిగింది ముంబైలో! మాస్ మీడియాలో డిగ్రీ, అడ్వర్టయిజింగ్లో మాస్టర్స్ చేసింది. చదువైపోయాక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్ తాన్యా ఘావ్రీ దగ్గర ఇంటర్న్గా చేరింది. ఎన్నో ఫ్యాషన్ షోలకు అసిస్టెంట్ స్టయిలిస్ట్గా పనిచేసింది. వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ ఆల్బమ్స్తో పాటు సెలబ్రిటీల వివాహాది శుభకార్యాల్లో వారి కుటుంబ సభ్యులకు స్టయిలింగ్ చేసింది. తను స్టయిల్ చేసే ప్రతివ్యక్తి ఇష్టాయిష్టాలకు అనుగుణంగానే లేటెస్ట్ ఫ్యాషన్ను అనుసరిస్తూ వాళ్లను అందంగా, ఎలిగెంట్గా ప్రెజెంట్ చేసి, అతిథుల ఫేవరిట్ స్టయిలిస్ట్గా మారింది. క్రియేటివిటీ హై లెవెల్లో ఉండే తన డిజైన్స్తో బాలీవుడ్ అటెన్షన్ను గ్రాబ్ చేసింది. చాలామంది డైరెక్టర్స్ తమ సినిమాలకు ఆమెను కాస్ట్యూమ్ డిజైనర్గా పెట్టుకున్నారు. ఆధునిక డిజైన్స్కు సంప్రదాయ టచ్నిచ్చి, చాలా త్వరగా నిధి బాలీవుడ్లో తన ప్రత్యేకతను చాటింది. అది సెలబ్రిటీలే ఆమెను సంప్రదించేలా చేసింది. మీరా కపూర్, నుస్రత్ భరూచా, శ్రద్ధా శ్రీకాంత్, భూమి పెడ్నేకర్, కృతి శెట్టి, రకుల్ప్రీత్ సింగ్, మృణాల్ ఠాకూర్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, కృతి సనన్లకు స్టయిలిస్ట్గా పనిచేసింది. -
పాజిటివ్ ఎనర్జీనిచ్చే డెకరేషన్
శ్రావ్యమైన సవ్వడి.. గాలి వీచినప్పుడల్లా అలవోకగా మోగే హ్యాంగింగ్ బెల్స్ ఇంటికి పాజిటివ్ పవనాలను మోసుకొస్తాయి. ప్రధాన ద్వారం ముందు గానీ, బాల్కనీల్లో గానీ వీటిని వేలాడదీసినప్పుడు ఆ సన్నని శ్రావ్యమైన సవ్వడి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. సువాసనల కాంతిడెకరేటివ్ వస్తువుల్లో క్యాండిల్స్కున్న ప్రత్యేకతే వేరు! రాత్రి వేళల్లో కాఫీ టేబుల్, డైనింగ్ టేబుల్పై సుగంధాల కొవ్వొత్తులను వెలిగించడం వల్ల ఆ సువాసన మదిని ఉల్లాసçపరుస్తుంది. లావెండర్, లైమ్ గ్రాస్, వెనీలా, జాస్మిన్, దాల్చినచెక్క పరిమళాలు కాంతితో కలిసి ప్రయాణం చేస్తూ ఉత్తేజాన్నిస్తాయి.ధూపం కూడా..ధూపం వేయడమూ పాజిటివ్ ఎనర్జీ హోమ్ డెకర్లో భాగమైందిప్పుడు. ధూపానికి వైద్యం చేసే శక్తి ఉంటుందనేది ఓ విశ్వాసం. సాంబ్రాణి, గంధపు చెక్క, బంతి, జాస్మిన్, రోజ్, లావెండర్, లెమన్ గ్రాస్ వంటి పరిమళాల ధూప్ స్టిక్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. శ్రేయస్సుకు..శాంతి, సానుకూలతలో బుద్ధ విగ్రహానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది జ్ఞానం, బాధ్యత, కరుణ, విశ్వాసానికి సూచిక. లాఫింగ్ బుద్ధ సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ హోమ్ డెకర్లో బుద్ధుడి విగ్రహాలు ట్రెండింగ్లో ఉన్నాయి. నెమలి ఈకలునెమలి ఈకలు ప్రతికూలతను దూరం చేసి, సానుకూలతను పెంచే చక్కటి అలంకరణ. నెమలి ఈకలను గాజు సీసాలో లేదా జార్లో ఉంచవచ్చు. లేదంటే గోడకు అలంకరించవచ్చు. గదిలో ఎక్కడ పెట్టినా అందంగా కనిపించడమే కాదు మానసిక ప్రశాంతతనూ కలిగిస్తాయివి. – ఎన్.ఆర్ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలన్నదే నా లక్ష్యం. అందుకే, స్క్రిప్ట్ కంటే ముందు నా పాత్రపైనే ఎక్కువ దృష్టి పెడతా! – బనితా సంధూ. -
దోస్తీకి దొన్ను చెక్కీ
భేదభావాలు చూపనిది, షరతులు లేనిది ఈ సృష్టిలో స్నేహం ఒక్కటే! దీన్ని మించిన మాధుర్యం లేదు ఈ లోకంలో! అలాంటి దోస్తీని దొన్ను చెక్కీతో మరింత తీపి చేసుకుంటారు ఉత్కళాంధ్రులు! ఆ మిఠాయి ధనుర్మాసానికి ప్రత్యేకం! శతాబ్దాలనాటిదీ సంప్రదాయం!ఆ స్వీట్ స్టోరీ ..మద్దిలి కేశవరావు, ఇచ్ఛాపురం రూరల్ సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన రోజున ఉత్కళాంధ్రులు నెలగంటును వేస్తారు. ధనుర్మాసం తొలిరోజు నుంచి మకర సంక్రాంతి వరకు పేలాలు, బెల్లం, చక్కెర, నెయ్యి, జీడి పప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు ద్రాక్ష, బాదంపప్పు, ఖర్జూరం వేసి వివిధ ఆకృతుల్లో తయారుచేసిన ‘దొన్ను చెక్కీ’ని ప్రతిరోజూ వైష్ణవాలయాల్లో దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ధనుర్మాసంలోనే ప్రత్యేకంగా తయారుచేసే ఈ మిఠాయిని ‘ధనుర్మువ్వా’ అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదన్నది ఇక్కడి ఆచారం. ప్రాణప్రదంగా ప్రేమించే వ్యక్తుల మధ్య ఉన్న చెలిమిని ఇక్కడ దోస్తీ, నేస్తాలు, మోఖర, సొంగాతి, మిత్తరికం వంటి పేర్లతో పిలుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు పరస్పరం సొంత పేర్లతో పిలుచుకునే అవకాశం ఉండదు. అలాంటి అనుబంధాలకు గుర్తుగా ఈ మువ్వా చెక్కీలను బహుమతిగా ఇచ్చిపుచ్చుకుంటారు. వీటితో పాటు చాలా ప్రాంతాల్లో దుస్తులు, కాయగూరలనూ ఇస్తుంటారు. అంతేకాదు ఈ చెక్కీతోనే సంక్రాంతికి కొత్త అల్లుడిని అత్తారింటికి ఆహ్వానిస్తారు. అమ్మాయి తల్లిదండ్రులు, సోదరులు ఈ స్వీట్తో మర్యాదపూర్వకంగా అల్లుడిని, కూతురిని తమ ఇంటికి తీసుకొస్తారు. ఈ ఆచార సంప్రదాయాలన్నీ ముఖ్యంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కనిపిస్తాయి. నెలల తరబడి పాడవకుండా ఉండే ఈ మువ్వా చెక్కీలను ఎక్కువగా బరంపురంలో తయారుచేస్తుంటారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, పర్లాకిమిడి వంటి ప్రాంతాల్లోనూ తయారు చేస్తున్నప్పటికి బరంపురం చెక్కీకున్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఇక్కడ తయారయ్యే చెక్కీలను అటు బెంగళూరు, ఇటు కోల్కత్తా వరకు ఎగుమతి చేస్తుంటారు. విదేశాల్లో ఉన్న మనవారికీ పంపిస్తుంటారు. డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే దొరికే ఈ దొన్ను చెక్కీలు కేజీ, అరకేజీ, పావు కేజీల్లో రూ.40 నుంచి రూ.350 వరకు దొరుకుతాయి. ప్రత్యేకంగా తయారు చేసిన చెక్కీ రూ.450 వరకు ధర పలుకుతోంది.ధనుర్మాసంలో మువ్వా చెక్కీని విష్ణుమూర్తికి ఆరగింపునివ్వడం ఇక్కడి సంప్రదాయం. బెల్లం, పంచదారలో పేలాలతో పాటు పలురకాల పదార్థాలను కలిపి తయారు చేసిన ఈ చెక్కీని శీతాకాలంలో తింటే ఆరోగ్యం!∙ నారాయణ పాఢీ, పురోహితుడు, ఇచ్ఛాపురం -
ఈవారం కథ: సుధీరన్న
నిద్రరాని ఈ రాత్రి పూట, ఈ నగరంలో, ఆకాశహర్మ్యంలో నా వెడల్పాటి కిటికీలో కనిపిస్తున్న చంద్రుడిని, ఆ పక్కనే వున్న దీటైన చుక్కను చూస్తూ ఉంటే హఠాత్తుగా సుధీరన్న జ్ఞాపకం వచ్చాడు. ఎన్నిరోజులై ఉంటుంది అన్న చనిపోయి, కాదు ఆత్మహత్య చేసుకుని? అసలు మనల్ని మనం చంపుకోవడాన్ని స్వంత హత్యా అనో మరొకటనో అనకుండా ఆత్మహత్య అని ఎందుకు పేరు పెట్టారు. ఎవరు ఆ పేరు పెట్టారో కానీ విషయాలు చాలా లోతుగా తెలిసిన వాళ్ళే పెట్టి వుంటారు.ఆత్మహత్యకి ఒక నెల ముందు ఫోన్ చేసి ‘అన్నా! నీ కథ రాయాలనుకుంటున్నా, చెప్తావా?’ అంటే ‘ఎందుకు చెప్పను బుజ్జమ్మా? ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుండ్ల నీకు’ అన్నాడు.నేను ‘చెప్పేవులే గానీ, చాలా సంవత్సరాలు అయిపోలా, ఇంకా గుర్తుంటదా అన్నా? మళ్లీ మొదటనుండి చెప్పాల్సిందే’ అన్నాను. అందుకు బదులుగా ‘చెప్తా గాని బుజ్జమ్మ, నేనే నీకు ఫోన్ చెయ్యాలనుకుంటా ఉండా, నువ్వే చేశావు! ఈ సంగతి చెప్పు, పాప, అదే నా బిడ్డ నన్ను కలవాలనుకుంటా ఉందంట, ఏం చేయమంటావు చెప్పమ్మా’ అన్నాడు.నేను అది విని ఆశ్చర్యపడి, ఎప్పుడో నాలుగు సంవత్సరాల బిడ్డని కదా అన్న వదిలొచ్చేవు ఇప్పుడేం చదవతావుంది’ అంటే, ‘ఇంజినీరింగ్ బుజ్జమ్మ’ అన్నాడు. ఆరోజే చివరి మాటలు, ఆ తరవాత మాట్లాడింది లేదు, సుధీరన్న ఆయన కథ చెప్పకుండానే తన ఆత్మను తానే హత్య చేసేసి, తన శరీరాన్ని ప్రపంచం మొహాన పారేసి వెళ్లిపోయాడు.సుధీరన్న అందగాడు. నల్లగా ఉంటాడు, కళ్ళు పెద్దవిగా దేవుడికి పెట్టిన కళ్ళలాగా తెల్లగా వెడల్పుగా ఉంటాయి. ఆరడుగుల ఒక్క అంగుళం ఎత్తుతో, వెడల్పయిన భుజాలతో, చెక్కినట్లు వుండే ముక్కుతో పోత పోసిన విగ్రహంలా ఉంటాడు. ఎంతమందిలో వున్నా అందరికంటే భిన్నంగా, తిరిగి చూసేట్టు ఉంటాడు. ఆయన బలమైన శరీరం మనల్ని ఒక వైపు భయపెడుతుంటే, ఆయన పసికందులాటి నవ్వు మనల్ని దగ్గరకి పిలుస్తుంది. ఆయన శరీరము, నవ్వు.. రెండూ ఒకదానికి ఇంకోటి విరోధాభాసం. కానీ వూర్లో ఏమన్నా గొడవలు జరిగితే ఆయనొక్కడే పదిమందిని ఒంటి చేత్తో కొట్టేవాడని అందరూ అంటారు.సుధీరన్న తల్లి, మా పెద్దమ్మ, ఆమె బావను ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఆమె అయినింటి ఆడపడచు. ఆమె బావ, ఆమె మాటల్లో చెప్పాలంటే ‘రంగు నలుపే కానీ అన్నిందాల ఆమెకి సరయిన జోడీ’. ఆస్తీ పాస్తీ దండిగానే ఉండేవి.అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు సుధీరన్న తల్లి దేవసేనకు ఒక అలవాటు వుండేది, అదేమిటంటే అతిగా ఖర్చు పెట్టడం. ఎంత డబ్బునయినాసులువుగా ఖర్చు పెట్టగల మార్గాలు ఆమెకు అనేకం తెలుసు. అలాగే సుధీరన్న తండ్రికి కూడా ఒక బలహీనత ఉండేది, అదేంటంటే భార్య తానా అంటే తందానా అనడం.దేవసేనకు బంధు మిత్రులంటే తగని ప్రీతి. మనుషులతో ఇల్లు కళకళలాడుతూ ఉంటే ఆమెకు మహా ఇష్టం. అందుకు అనువయిన ప్రతి సందర్భాన్ని ఆమె వాడుకునేది. అదృష్టవశాత్తు ఆమెకు సుధీరన్న ఒక్కడితోనే సంతాన సౌభాగ్యం అడుగంటి పోయింది. అందుకని సుధీరన్నని ఆమె అల్లారు ముద్దుగా పెంచింది. సుధీరన్న ఆడుకోవడానికి పది బొమ్మలు అవసరమయిన చోట ముప్పయ్యారు బొమ్మలు కొనేది.వాటిని కొద్ది రోజులకే వాళ్ళకీ వీళ్లకీ దానం చేసేసి తిరిగి కొత్త బొమ్మలు కొనేది. తన చీరలయినా అంతే, పెళ్ళికో పబ్బానికో ఒకసారి కట్టిన చీర ఇంకోసారి కట్టుకునేది కాదు. అది వాళ్ళ కులంలో, పెట్టి పుట్టిన వాళ్ళు ఎవరూ చేయరని ఆమె నిశ్చితాభిప్రాయం. అంచేత ఆమె ప్రతినిత్యం చీరలు కొంటూ ఉండేది. ఆమె చీరలు కొనడానికి వాళ్ళ వూరు, వాళ్ళ పట్టణం, వాళ్ళ నగరం, చివరికి వాళ్ళ రాష్ట్రం కూడా దాటి, పక్క రాష్ట్రానికి చీరలు కొనడానికి వెళ్ళేది. ఆ రాష్ట్రంలో ఒకపెద్ద వస్త్ర దుకాణం చెట్టియారు, తెల్లటి ఛాయతో, రింగుల రింగుల తలతో దర్జాగా వచ్చే ఆమె కోసం గావురు గావురుమని ఎదురుచూస్తూ ఉండేవాడు. ఆ చెట్టియారు ఆమెకి ఏమేమి చెప్పాలో అన్నీ చెప్పి, ఒక చీర కొనాల్సిన చోట పది కొనిపించేవాడు. ఆమె అలా కొన్నవాటిని బంధు మిత్రులకు ప్రీతిగా పంచి బంధువులు ‘దేవసేన మనసు వెన్న’ అంటే మురిసి కరిగి పోయేది.కొడుకు సుధీర్కి సరిగ్గా పదేళ్లు వచ్చేసరికి దేవసేన వాళ్ళ యాబయ్ ఎకరాల మాగాణి ఏడెకరాలయింది. కారణం నువ్వని నోరు తెరిచి ఏనాడు అనని భర్తను పట్టుకుని చేతకాని వాడని, అతని వల్లే తాను, తన బిడ్డ పడరాని కష్టాలు పడుతున్నామని వేధించడం మొదలు పెట్టింది దేవసేన. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె భర్త ఒకరోజు చుక్క పొద్దుకాడ లేచి కట్టు బట్టలతో ఇల్లు విడిచివెళ్ళిపోయాడు. భర్త కొడుకుని, తనను అనాథలను చేసి వెళ్లి పోయాక వున్న ఏడెకరాలను, అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెమని అమ్ముకుంటూ కొడుకును పెంచి పెద్ద చేసింది దేవసేన.సుధీరు ఇరవైలలో పడ్డాక అందగాడైన తన కొడుకుకి అయినింటి సంబంధాలు ఎదురు కట్నమిచ్చి చేసుకోవడానికి వెదుక్కుంటూ వస్తాయని దేవసేన కలలు కనడం మొదలు పెట్టింది. కలలు నిజం కాకుండా సుధీరన్న ఇరవైతొమ్మిదేళ్ళ వాడయ్యాడు.ఒక్క సంబంధం కూడా వారి గడప తొక్కలేదు. దేవసేనకు అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. ఈ మహిళా ప్రపంచం ఆస్తికి ఇచ్చిన విలువ మనిషికి అతని సౌందర్యానికి ఇవ్వదని గుర్తించింది. కానీ ఆమెకు ఇప్పుడున్న ఆస్తి కేవలం కొడుకు మాత్రమే. ఆ కొడుకును ఎరవేసి ఆమె తిరిగి తన మునుపటి వైభవానికి చేరుకోవాలి. అందుకే ఆమె పెళ్లిళ్ల బ్రోకరుకు ఈసారి సిగ్గు విడిచి గట్టిగా, ఎవరైనా పర్వాలేదు కానీ కాస్త గట్టిగా ఆస్తిపాస్తులు వుండేవాళ్ళను చూడమని చెప్పింది.సుధీరన్నది అతని తండ్రి లాటి స్వభావమే, పదేళ్ల బిడ్డగా తండ్రి వదిలేసి వెళితే తనని పెంచి ఇంత వాడిని చేసిందని తల్లి అంటే అతనికి అపారమైన ప్రేమ, గౌరవమూ. అందుకే తన పెళ్లి విషయంలో తల్లి ఏవేవో ఎత్తుగడలు వేస్తున్నా తనతో చదివిన వనజ తనను ఇష్టపడుతోందని, కులం వేరయినా చక్కగా చదువుకుని టీచరుగా పనిచేస్తుందని తల్లికి చెప్పే సాహసం అతను చేయలేదు.సుధీరన్నకు, మాధురికి ఒక మాఘమాసంలో పెళ్లి జరిగింది. మాధురి ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్ నర్సు. ఒక్కటే కూతురు, ఆస్తిపాస్తులు దండిగా వున్నాయి. సుధీరన్నకంటే కొంచెం పెద్దది. మొదటి భర్త అవమానించి, అనుమానంతో హింసించి విడాకులిచ్చేశాడు. వయసు వచ్చేస్తుంది, ఒకవైపు సమాజం పనీపాటా లేకుండా కూర్చుని ఏదోకటి అంటూ ఉంది. అందుకని మాధురి పెళ్లి చేసుకోవాలనుకుంది. దేవసేనకి కావలసింది మాధురి దగ్గర, మాధురికి కావాల్సింది దేవసేన దగ్గర ఉండడంతో పెళ్లి ఘనంగా జరిగి పోయింది.దేవసేన ప్రపంచమంతా తన భర్త, కొడుకు లాగా తన కనుసన్నలలో మెసులుతుందనే భ్రమలో హాయిగా బతుకుతూ వస్తుంది ఇన్ని రోజులు. మాధురి వచ్చీరావడంతోనే ఆ భ్రమను కాళ్లతో కసపిసా తొక్కి వేసింది. అత్తగారి ఇంటికి దగ్గరగా ఉద్యోగాన్ని బదిలీ చేయించుకోమని అత్త అంటే, నువ్వు నీ ఇంటిలో వుండు నా భర్త నా దగ్గర ఉంటాడని కోడలు అంది. ఆస్తి మొత్తం తన కొడుకు పేరు మీద రిజిస్టరు చేయించాలని అత్త అంటే, తన ఆస్తి తను కనబోయే పిల్లలకి చెందుతుందని ఇంకెవరికీ దాని మీద హక్కు లేదని కోడలు అంది. కోడలి మగరాయుడి తనానికి, జమాజెట్టి మాటలకు, కయ్యానికి కాలు దువ్వే తరహాకు దేవసేనకు మూర్ఛ వచ్చినంత పని అయింది. కోడలు తనకు అలివయ్యే ఘటం కాదని తెలుసుకున్నాక, అటునుండి నరుక్కు రావాలని కొడుకును సాధించడం మొదలు పెట్టింది దేవసేన.స్వతహాగా మృదుస్వభావి అయిన సుధీర్కి, తల్లి ప్రణాళిక.. ఆశ మొదటి నుండి అర్థం చేసుకున్న సుధీర్కి.. మాధురి తరహా ఏమాత్రం నచ్చలేదు. ఆస్తి కోసమే కదా అమ్మ తనని రెండో పెళ్లి అమ్మాయికి ఇచ్చింది.. మరి ఇదేమిటని అతని ధర్మబుద్ధికి తోచింది. అదే అతను భార్యను అడిగాడు. దేవసేనకంటే పదహారాకులు ఎక్కువ చదివిన మాధురికి సుధీర్ ‘చూపుల గుర్రమ’ని, బాగా మెతక అని తెలిసిపోయింది. అందుకే గొడవ చిలికి చిలికి గాలీ వానా అవుతుండగా‘నువ్వు పైన పటారం లోన లొటారం గాడివి’ అనేసింది. అమ్మ కొంగు పట్టుకుని తిరగక నీకు పెళ్ళెందుకు కావాల్సి వచ్చిందని సుధీర్ ముఖాన ఉమ్మింది. ఆ మాట విని, చీమ పైన కూడా చెయ్యి ఎత్తని సుధీర్.. మాధురిపై చెయ్యెత్తాడు. చెయ్యెత్తాడే కానీ చెయ్యి చేసుకోలేదు. కానీ ఆ రాత్రి గడిచి, వేకువయ్యీ అవగానే మాధురి తల్లి, మేనత్త,పెద్దమ్మ మూకుమ్మడిగా బస్సు దిగారు. అలా దిగిన వాళ్ళకి, దేవసేనకి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తల్లికి వత్తాసుగా వెళ్లిన సుధీరును భార్య ఆమె తరపున ఆడవాళ్లు అందరూ కలిపి చితక కొట్టారు. సుధీర్ తల్లి ముందరే మాధురి అతనిని పడదోసి, అతని మీద కూర్చుని అతని వృషణాలని గట్టిగా వత్తేసింది. సుధీర్ ఆ నొప్పితో విలవిలలాడుతూండగా, దేవసేన నిర్ఘాంతపోయి చూస్తూండగా.. మాధురిని తీసుకుని ఆమె బంధుబలగం వెళ్లి పోయింది. వెళ్లిన మాధురి వెళ్లినట్లు వుండలేదు. సుధీర్పై, దేవసేనపై వరకట్నం కోసం తనను వేధించారని కేసు పెట్టింది.ఒకరోజు ఉదయం పదిగంటలకి దేవసేన, సుధీర్.. వాళ్లకున్న చిన్న జామతోటలో పని చేసుకుంటూ వున్నారు. హఠాత్తుగా చెమటలు కక్కుకుంటూ ఇద్దరు కానిస్టేబుళ్లు తోటలోకి వచ్చారు ‘సుధీరంటే ఎవరూ?’ అంటూ.సుధీర్.. పోలీసులని చూసి నిర్ఘాంతపోయాడు. కొద్దోగొప్పో చదువుకున్నా అతనికి ఈ పోలీసులు, కేసులు వంటి వాటి గురించి అవగాహన లేదు. తనని వెదుక్కుంటూ పోలీసులు రావడమేమిటో అతనికి అర్థం కాలేదు. పోలీసులను చూడగానే పైకెత్తి కట్టుకున్న పంచె కిందికి దించి నమస్కారం చేసి రెండు కుర్చీలు తెచ్చి వేసి, రెండు నీళ్ల టెంకాయలు కొట్టి వాళ్లకి ఇచ్చి వివరం అడిగాడు. అతని భారీ శరీరాన్ని అతని మృదువయిన గొంతును చూసి వాళ్ళు కొంచెం వివరం బోధపడినట్టు దేవసేన వైపుకి తిరిగి ‘నువ్వేనా దేవసేన అంటే’అని ప్రశ్నించారు. అలా వాళ్ళు తనని బొడ్డుకోసి పేరు పెట్టినట్టు అడగడం నచ్చలేదు దేవసేనకు. అయినా పోలీసులతో మనకెందుకు అని తల ఊపి వూరుకున్నది. వచ్చిన వాళ్ళు టెంకాయ నీళ్లు తాగి తెరిపిన పడ్డాక నిదానంగా మాధురి పెట్టిన కేసు వివరం చెప్పి.. తల్లీ కోడుకులిద్దరూ ఇప్పుడు తమతో రావాల్సి ఉంటుందని అన్నారు. ఆ మాట విని దేవసేన దడుచుకుని ఏడవడం మొదలుపెట్టింది.సుధీర్కి నెమ్మదిగా బుర్ర పనిచేయడం మొదలుపెట్టింది. వచ్చిన కానిస్టేబుళ్ళతో చాలా దీనంగా తన తల్లిని వదిలేయమని, తాను వాళ్ళతో వస్తానని, వాళ్ళేం చేయమంటే అది చేస్తానని అన్నాడు. వచ్చిన కానిస్టేబుళ్లలో ఒకావిడకి సుధీర్ని చూసి మనసు కరిగిపోయింది. తోటి కానిస్టేబుల్ని పక్కకి తీసుకుని వెళ్లి ‘సరేలే ఈ పిల్లాడు ముఖ్యం కదా మనకి, ఆవిడ కథ తరవాత చూద్దాంలే! ఎక్కడికి పోతుంది!’ అని చెప్పింది. అలా వాళ్ళు సుధీర్ని వున్నపళంగా తీసుకెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ ‘తెలిసిన వాళ్ళని పిలిచి సహాయం తీసుకో అమ్మ, రేపో మాపో మేము కాకపోతే ఇంకో పోలీసులు నీ కోసం వస్తారు. ఏం చేద్దాం పాపం చెట్టంత కొడుకుకి కష్టం వచ్చింది. చూస్తే బిడ్డ మంచివాడిలా వున్నాడు’ అని మరో నీళ్ల టెంకాయ తాగి, దేవసేన ఇచ్చిన కవర్లనిండా జామకాయలు కోసుకుని వెళ్లిపోయారు.సినిమాలు చాలా తక్కువ చూసే సుధీర్కి పోలీసులు పట్టుకెళుతున్నపుడు జైలు ఎలా ఉంటుందో అనే ఆలోచన చప్పున మనసులోకి వచ్చింది. జైలు జీవితాన్ని చూపించిన సినిమా తాను ఒక్కటి కూడా చూడలేదని అప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది. భద్రంగా, తల్లిచాటు బిడ్డగా పెరిగిన అతనికి జైలులో వున్న కొన్ని నెలలలో డిప్రెషన్ తారస్థాయికి చేరుకున్నది. పడుకున్నా లేచినా మాధురిని తాను ఎంత ప్రేమగా చూసుకున్నాడో అతనికి జ్ఞాపకం వస్తూ ఉండేది. తన ఛాతీ మీద పడుకుని ‘ఇక్కడ తల పెట్టుకుని పడుకుని చచ్చిపోతే చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు’ అన్న ఆమె మాటలు జ్ఞాపకం వచ్చేవి. తనని ఒకరోజు సాయంత్రం స్నానాల గదిలో వున్నప్పుడు బయట నుండి మాధురి గడియ పెట్టెయ్యడం జ్ఞాపకం వచ్చేది. ఆ రోజు తాను తలుపు కొట్టి, కొట్టి అలిసిపోయి ఒక లక్ష దోమలు తన మీద దాడి చేసి రక్తం పీక్కుతినేయడం జ్ఞాపకం వచ్చేది. ఎందుకలా చేశావని అడిగితే మాధురి చాలా అనాయాసంగా తమాషాకి గడి పెట్టానని, స్నేహితురాలితో మాట్లాడుతూ ఆ విషయం మరచిపోయానని చెప్పడం జ్ఞాపకం వచ్చేది. తను కొట్టే వాడో తిట్టే వాడో అయితే ఆ రోజు మాధురిని ఏదో ఒకటి అనేవాడు కదా? తనసలు నోరు తెరిచి ఒకమాట అనలేదు. మాధురికి ఇవన్నీ గుర్తు లేవా? తన తల్లి ఆస్తి అడిగిందే అనుకో దాన్ని తన పేరు మీదే కదా రాయమంది. రాస్తే ఏంపోయింది? తానే మాధురి సొంతం కదా? ఇంత చిన్న విషయం ఆమెకెందుకు అర్థం కాలేదు?.. ఇలా సుధీర్ ఆలోచనలు సాగిపోయేవి. ఏవేవో తలచుకుని, ఏవేవో గుర్తొచ్చి అతనికి ధారాపాతంగా కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతూ ఉండేవి. మొదట అతని శరీరం చూసి భయపడ్డ జైలు సహచరులు అతని కళ్ళ నీళ్లు చూసి అతనికి ఆత్మీయులయ్యారు. అలా అనువుగాని చోట కూడా సుధీరన్న బోలెడు స్నేహితులను మూటకట్టుకున్నాడు కానీ, ఏడడుగులు నడిచి గుండెల మీద పడుకోబెట్టుకున్న భార్యకి మాత్రం అతను ఆత్మీయుడు, నమ్మకస్థుడు కాలేకపోయాడు. సుధీరన్న జీవితమనే బుల్లెట్టు బండి అక్కడ సడన్ బ్రేక్ వేసి లెఫ్ట్ టర్న్ తీసుకుంది. ఆయన జైలు నుండి బయటకి వచ్చినా ఆయన జీవితం విషాదమనే కాలబిలం నుండి బయటకు రాలేదు. మొదటి నుండి తండ్రిలేని బిడ్డగా బాగా బతికి చెడిన తల్లి కొడుకుగా అతని చుట్టూ విషాదం గూడు కట్టుకుని ఉండేది. దానిని మోసుకుంటూ ఆయన జీవితాన్ని లాక్కొచ్చేవాడు. నిజానికి తాను ఒక విషాద వలయంలో బతుకుతున్నానని అతనికి గుర్తింపు కూడా లేదు. చాలా ఉత్సాహంగా ఉరుకులు పెట్టే పదేళ్ల అబ్బాయి, తండ్రి అదృశ్యం తరువాత ఎందుకు ముభావం అయిపోయాడో తనలోకి తాను తరచి చూసుకునే శక్తి, జ్ఞానము అతనికి లేకపోయింది. అలా అతను మోసుకుంటూ, పెంచి పెద్దచేసుకుంటూ వచ్చిన విషాదం ఈసారి మాధురి ఘట్టంతో అతనిని పూర్తిగా లోబరుచుకుంది. సుధీరన్న అప్పుడు మొదలుపెట్టాడు తాగడం. మొదట బాధ మరచిపోవడానికి తాగేవాడు. ఆ తరువాత తాగకుండా ఉండలేక తాగేవాడు.కాలక్రమంలో అతనికి విడాకులు వచ్చాయి. మాధురి పిల్లని కూడా అతను చూడకుండా జీవితాన్ని కట్టుదిట్టం చేసుకుంది. తన కొడుకు జీవితం తన కళ్ళ ముందే చిందరవందరగా మారడం చూసిన దేవసేన వైరాగ్యం పేరుతో సుధీర్ని ఒంటరిగా వదిలేసి ఎప్పటిలాగే తన స్వార్థం తాను చూసుకుని పుట్టపర్తి సత్యసాయి ఆశ్రమంలో చేరిపోయింది.మరి విడాకులు తీసుకున్న ఇన్నేళ్ల తరువాత ఏం జరిగిందని సుధీరన్న ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఎవరూ చెప్పలేక పోయారు.సుధీరన్న చనిపోవడానికి కొంతకాలం ముందు కళ్ళకి ఆపరేషన్ చేయించుకోవాలని కొడుకు దగ్గరకి వచ్చిందట దేవసేన. తల్లి వచ్చినప్పటి నుండి కనిపించిన బంధువులకి ‘మా అమ్మ నస భరించలేకుండా ఉండాన’ని చెప్పుకునేవాడట. మళ్ళీ తనే ‘మా అమ్మ నన్ను సాకినట్టు ప్రపంచంలో ఏ తల్లి ఏ బిడ్డను సాకి ఉండదు’ అనే వాడట. ఏమయిందో ఎవరికీ తెలీదు, ఏం జరిగిందో దేవసేన ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు తల్లి పక్కగదిలో ఉండగానే తల్లికి అన్నము, కూర అన్నీ వండి గిన్నెలో వేసి చేతికిచ్చి పక్క గదిలోకి వెళ్లి వురి వేసుకున్నాడు. దగ్గరి బంధువుతో అంతకు కొన్నిరోజుల ముందు ‘మావా, సస్తే పోతది అనిపిస్తా వుంది. నావల్ల ఎవరికేమి ప్రయోజనం? సస్తే నాకన్నా శాంతి దొరకతది కదా?’ అన్నాడట. ఆ మాటలు విని బంధువు ‘అబ్బయ్య! బలవంతంగా సస్తే నరకానికి పోతామంట. అక్కడ కూడా నీకు మనశ్శాంతి దొరకదు’ అన్నాడట. ఆ మాట విని ‘అంతేనంటావా? అయితే సరేలే!’ అన్నాడట.శవం దగ్గర పొర్లి పొర్లి ఏడుస్తున్న దేవసేనను చూసి ఎవరూ జాలిపడలేదు.మొదటి నుండి దేవసేన తన స్వార్థాన్ని మాత్రమే చూసుకునేదని అందరూ చెప్పుకున్నారు. బిడ్డ.. తల్లి మాట జవదాటేవాడు కాదని, అందుకే అతని జీవితం ఇట్లా నాశనమైందని అనుకున్నారు. పెళ్లయిన తరువాత భార్యాభర్తల మధ్యకి ఎవరూ పోగూడదని, ఈ దేవసేన.. సుధీర్ కాపురంలో చొరబడి నిప్పులు పోసిందని వచ్చిన వాళ్లలో విజ్ఞులు అన్నారు. కానీ శవానికి ఒకవైపు నిలబడి చేతులు కట్టుకుని ఇదంతా వింటున్న సుధీర్ స్నేహితుడు మాత్రం ‘ఏదంటే అది మాట్లాడబాకండి.. వాడికి అమ్మంటే ప్రాణం. ఇప్పుడు లేపి అడిగినా మా అమ్మ దేవత అంటాడు’ అన్నాడు.చంద్రుడిని చూస్తుంటే సుధీరన్న ఎందుకు జ్ఞాపకం వచ్చాడో చెప్పాలి. మేము చిన్న పిల్లలుగా వున్నప్పటి సంగతి.. ఒక రోజు అందరం వెన్నెట్లో ఆటలాడుతూ వున్నాం సుధీరన్న హఠాత్తుగా ఆకాశంలోకి చూసి పక్కనున్న నాతో ‘బుజ్జమ్మ! ఆ చంద్రుడు, దాని పక్కనే వున్న ఆ చుక్కను చూశావా.. వాటిని చూస్తే నాకు మా అమ్మ, నాయన అనిపిస్తారు. చంద్రుడేమో మా అమ్మ. ఆ చుక్కేమో మా నాన్న. మా అమ్మని వదిలేసి నడుచుకుంటూ, నడుచుకుంటూ ఎలా వెళిపోతున్నాడో చూడు మా నాయన, అందుకే అలా మసక మసకగా వున్నాడు’ అన్నాడు. -
యువ కథ: అడవి
వసంతం తెచ్చిన చివురులతో అడవిలోని చెట్లు రకరకాల వర్ణాలతో పురుడు పోసుకుని వున్నాయి. పూలు పరిమళాలతో తేనెలూరుతూ వున్నాయి. ఆ అడవి మీదుగా ఆకాశంలో విహరిస్తూ వెళ్తూ వున్న మేఘనా«థుడు తన ప్రేయసి వనదేవతను చూసి మదిలో శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞపకాలను మోసుకొనిపోతూ వున్నాడు. ఊరును దాటి ఆ అడవిలోనే పండు వెన్నెలంత వర్ణంలో ఉన్న ఒక ఆవు ఒంటరిగా గడ్డి మేస్తూ వుంది. అలా ఒంటరిగా గడ్డి మేస్తూ ఆ ఆవు అడవిలో చాలా దూరమే ప్రయాణించింది. ఇంతలో బాగా ఆకలిగా వున్న ఓ పెద్దపులి వేట కోసం వెదుకుతూ అటుగా వచ్చి ఆవును చూసింది. పులి అలికిడి విన్న ఆవు పులి కళ్లలోని ఆకలిని చూసి వెనువెంటనే ‘ఆగు పులిరాజా ఆగు.. ఒక్కమారు నా మాట ఆలకించు’ అంది. ‘నీ మాటలు ఆలకించే స్థితిలో లేను. ఈరోజు నిన్ను తిని నా ఆకలి బాధ తీర్చుకుంటాను’ అంటూ పులి తన పంజా విసిరింది. పులి పంజా నుండి తప్పించుకున్న ఆవు ‘అయితే తినే ముందు నా చివరి కోరిక తీర్చు’ అంది. ‘ఏమిటా కోరిక?’ ‘ఓ పులిరాజా.. నాకు ఓ యజమాని ఉన్నాడు. అతడు లోకం తెలియని వట్టి అమాయకుడు. కడు బీదవాడు. అతనికి నేనే జీవనాధారం. ఒకవేళ నేను ఇంటికి తిరిగిపోని యెడల అతడు నాపై దిగులుతో దుఃఖిస్తూ మరణిస్తాడు. కావున నేను ఇంటికి వెళ్లి నా యజమానికి ౖధైర్యం చెప్పి మరోవిధంగా జీవనాన్ని వెతుక్కోమని చెప్పి తిరిగి వస్తాను.’ ఆవు మాటలు విన్న పులి ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ‘నేనేమన్నా వెర్రిదాన్ననుకున్నావా.. నీ కల్లబొల్లి మాటలు విని దొరికిన ఆహారాన్ని విడిచిపెట్టడానికి?’ అంది. ‘అయ్యో రాజా.. ఇవి మాటలు కావు.. పరమ సత్యాలు. పరుల కొరకు జీవించని జన్మ దాహార్తికి పనికి రాని కడలి వంటిది. నీ ఆకలిని తీర్చబోయే నా దేహం నా జన్మకు కలిగిన గొప్ప వరమే. కాని ఈలోపు ఈ విషయం నా యజమానికి చెప్పడం నా బాధ్యత’ అంది.ఆవు పలికిన మాటలకు పులి ఒక్క క్షణం మౌనంగా ఆలోచించి ‘శిశిరం చేసిన గాయాలకు ఓర్చి వసంతం కోసం ఎదురు చూసే వనంలా నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. వెళ్ళి త్వరగా తిరిగి రా’ అంటూ ఆవుకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. పులి మాటలకు సంతోషించిన ఆవు దానికి కృతజ్ఞతలు చెప్పి తన యజమాని వద్దకు బయలుదేరింది.ఇంటి వద్ద గుడిసె ముందు ఒంటిపైన చొక్కా లేకుండా మొలకు చిన్న గుడ్డతో ఒంటరిగా కూర్చొని నులకతాడు పేనుకుంటూ వున్న యజమాని వేళకాని వేళలో దూరంగా వస్తూవున్న ఆవును చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆవు అడవిలో జరిగినదంతా చెప్పాక ఒక్క క్షణం మౌనంగా వుంటూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా తలను నెమ్మదిగా ఊపి ‘నువ్వు వెళ్ళి రా నీకు ఏమీ కాదు!’ అంటూ ఆవుకు ధైర్యం చెప్పాడు. ఆవు తన యజమాని సంయమనానికి సంతోషించి తిరిగి అడవికి బయలుదేరింది.ఇంటి బయట జరుగుతున్నదంతా ఇంటి లోపల నుండి గమనిస్తూ వున్న యజమాని భార్య వేగంగా భర్త వద్దకు వచ్చి ‘నీకేమన్నా మతిగాని పోయిందా? ఎవరైనా ఆవును పులి వద్దకు పంపుతారా సావడానికి! అసలే దానికి పుట్టిన లేగదూడ సచ్చిపోయె. ఇపుడు దాని పాలే మనకు జీవనాధారం’ అంటూ భర్తను కోప్పడింది. ‘ఓసి పిచ్చిదానా! నేనేమన్నా వెర్రివాడిననుకున్నావా? వెనకటికి మా తాతకి కూడా ఇదే విధంగా ఓ ఆవు ఉండేది. అయితే దానికి లేగదూడ కూడా ఉండేది. ఒకరోజు ఆ ఆవు మేత కోసం అడవికి వెళ్ళి పులికి చిక్కింది. అయితే ఆ ఆవు తనకు ఓ బిడ్డ ఉందని, అది మరీ పసిదని దానికి చివరిసారి పాలు ఇచ్చి తిరిగి వస్తానని పులిని బతిమిలాడి తన బిడ్డకు పాలు ఇవ్వడానికి ఇంటికి వచ్చింది. అయితే వేళకాని వేళలో ఇంటికి వచ్చిన ఆవును చూసిన మా తాత ‘ఏమయి ఉంటుందా?’ అని ఆలోచిస్తూ ఆవు వెనకాలే వెళ్ళాడు. అక్కడ ఆ ఆవు నిజాయితీకి మెచ్చి తినకుండా వదిలేసిన పులిని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ ఆవుకు జరిగింది ఇప్పుడు తన మనవరాలుకు జరుగుతుంది. అదే తిరిగి వచ్చేస్తుందిలే’ అంటూ నులక తాడు పేనే పనిలో నిమగ్నమయ్యాడు. యజమాని నుండి శాశ్వతంగా సెలవు తీసుకుని తనకు తానుగా పులికి ఆహారంగా మారడానికి అడవిలోకి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ వుంది ఆవు. ఆ అడవిలోనే ఓ కోయిల అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశిస్తూ తన్మయత్వంలో మధురమైన రాగాలను ఆలపిస్తూ కొమ్మ నుండి కొమ్మకు దూకుతూ విహరిస్తూ ఆవును చూసింది. ‘ఓ అందగాడా.. నడిజాములో ఆ దివి నుండి ఈ భువిపై దిగిన జాబిల్లిలా ఉన్నావు. నన్ను ప్రేమించవూ?!’ అంటూ పలికింది. కోయిల మాటలు విన్న ఆవు మౌనంగా పక్కకు తప్పుకొని ఒంటరిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ వుంది.కోయిల ఎగరకుండా ఆవుతో పాటుగా నడుస్తూ వెళ్తూ వుంది. అలా అడవిలో చాలా దూరం ప్రయాణం చేశాయి. అప్పుడే ఓ నిండైన కారుమబ్బు ఆకాశంలో వెళ్తూ వుండటాన్ని చూసిన కోయిల రివ్వున ఎగురుకుంటూ వెళ్ళి అ మేఘాన్ని తన ఒంటికంతా పులుముకుని వేగంగా వచ్చి ఆవుపై వాలి తన రెండు రెక్కలను వింజామరలను విసిరినట్టు ఆవు మొహం మీద ఊపుతూ వుండగా కోయిల ఒంటికి పులుముకున్న మేఘం ముత్యపు చినుకులుగా ఆవు పై పడుతూ వుండగా ‘నింగీ నేలా సాక్షి.. నన్ను ప్రేమించవూ?!’ అంది కోయిల. ఆవు మారుమాటలాడక కోయిల వంక కనురెప్పయినా వేయకుండా మౌనంగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ వుంది. కోయిల ఎగరటం మరచి ఆవుతోపాటు పక్కనే నడుస్తూ వుంది. ఆ అడవిలో అవి రెండూ వేటికవే ఆలోచనల ప్రవాహంలో ఒంటరిగా సాగిపోతూ వున్నాయి. ఆ అడవిలోనే ఓ సెలయేరు గలగలలతో అడవి గుండె చప్పుడును లయబద్ధం చేస్తూ ప్రవహిస్తూ వుంది. దాని గట్టున ఆవు ఆగి ప్రవహిస్తూ వున్న ఆ సెలయేటిలో ప్రకృతిలోని నిత్య నూతనత్వాన్ని చూస్తూ వుంది. అలా ఆ ఆవును చూసిన కోయిల అలలు అలలుగా కదలిపోతూ వున్న యేటి వయ్యారాన్నంతా ఒంపుగా చేసుకొని నడుస్తూ ‘అలలనేం చూస్తావోయీ.. అలల మాటున దాగిన మనసు ఊసును చూడు. ఆకాశమంతా చినుకయి పోయి అవనిని ముద్దాడిన ప్రేమను చూడు. నా ప్రేమను చూసి నన్ను ప్రేమించవూ!?’ అంది కోయిల.సూర్యుడు పడమటి కొండలను ముద్దాడుతూ దోబూచులాడే పనిలో వున్నాడు. ఇంతలో ఓ పచ్చని చిలుక అటుగా ఎగురుకుంటూ వచ్చి ఓ చెట్టు పై వాలి చుట్టూ చూస్తూ ఉంది. కొంత దూరంలో ఆవుతో పాటు పక్కనే నడుస్తూ వెళ్తూ వున్న కోయిలను చూసి దానికి ఆశ్చర్యం వేసింది ‘ఏమయి ఉంటుంది?!’ అని ఆవు కోయిలకు తెలియకుండా వాటి వెనకాలే ఎగురుకుంటూ వాటిని వెంబడించసాగింది.రాత్రవుతూ ఉండగా పైన చెట్ల కొమ్మల మాటున నల్లని ఆకాశంలో పండు వెన్నెల, మిరుమిట్లు గొలిపే నక్షత్రాలు.. వాటి నుండి వస్తున్న కాంతిలో అడవిలో ముందుకు సాగిపోతూ వున్నాయి ఆవూ కోయిలా. చివరకు కోయిల ఆవుకు ఎదురుగా వచ్చి నిలబడి ‘నేను నల్లగా వున్నాననా నన్ను ప్రేమించడంలేదు!?’అంది.‘లంగరు లేని ఒంటరి పడవ పయనం నా జీవితం. తీరం లేని ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాను. తిరిగి రాలేను. నీవు అందమైన దానవు. కాలం చేసిన గాయాలు మాన్పి కొత్త చిగురులను పూయిస్తావు. ప్రపంచంలోని దుఃఖాన్నంతటినీ ఒంటికి పులుముకొని నూతన రాగాలతో కొత్త ఉషస్సును వెలిగిస్తావు’ అంటూ ఆవు అదే తొలిసారిగా అదే చివరిసారిగా కోయిలపై తనకున్న భావాన్ని చెప్పి, కోయిల నుండి సెలవు తీసుకుని ఒంటరిగా ముందుకు పయనమైంది. కోయిల ఒంటరిగా ఆవుని అలా చూస్తూ ఉండిపోయింది. ఇదంతా చెట్టు పై నుండి గమనిస్తూ వున్న చిలుక ఎగురుకుంటూ కోయిల ముందుకు వచ్చి వాలి ఎక్కడో దూరాన కనుమరుగౌతూ వున్న ఆవును చూస్తూ ‘ప్రేమ అందంగా ఉంటుంది కదూ’ అంటూ పలికింది. కోయిల చిలుక వైపు చూసి ‘ప్రేమ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. కాని ప్రేమ కోసం చేసే నిరీక్షణలో ఆ ప్రేమ మరింత అందంగా ఉంటుంది’ అంది. తన గమ్యానికి చేరే దారిలో అడ్డుపడే బంధాలు, మోహించే కోరికలను దాటుకుని ఆవు.. పులి ఉండే చోటుకు దగ్గరగా వెళ్తూ వుంది. ఇంతలో హఠాత్తుగా ఆకాశంలో పక్షులు భయంతో అరుచుకుంటూ ఎగురుతూ ఆవును దాటుకుని ముందుకు పరుగులు తీయసాగాయి. ఆవు వెళ్ళే దారిలో అడవి అంతా అలజడిగా మారింది. అడవిలోని జంతువులన్నీ ప్రాణభయంతో పరుగులు తీస్తూ, ఆవును దాటుకొని వేగంగా ముందుకు వెళ్తూ వున్నాయి. అక్కడి వాతావరణం వెచ్చగానూ దట్టమైన పొగతోనూ నిండి ఉంది. ఏమి జరుగుతున్నదో ఆవుకు ఏమీ అర్థం కాలేదు. అడవిలోని క్రూర జంతువులన్నీ తమకన్నా బలహీనమైన జంతువులతో ఉండే వైరాన్ని మరచి వాటిపై జాలి చూపుతూ అడవిని దహించి వేస్తూ తరుముకొస్తూ వున్న అగ్నిని చూపుతూ ‘తప్పించుకొని పారిపోండి... తప్పించుకొని పారిపోండి’ అంటూ అరుస్తూ ఉన్నాయి.సరిగ్గా ఆ సమయంలో ఆవు పులికి ఎదురుగా వచ్చి నిల్చుంది. పులి ఆశ్చర్యపోయి ఆవును చూస్తూ ఉంది. ‘పులిరాజా! ఇక వచ్చి నన్ను తిని నీ ఆకలి తీర్చుకో’ అంది ఆవు.‘ఇచ్చిన మాటకు, చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండే నీలాంటి మిత్రుడిని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా వుంది. నీలాంటి వారిని చంపి ఆకలి బాధ తీర్చుకునే కన్నా పస్తులతో మరణించడం మంచిది. మిత్రమా ఇక నువ్వు సంతోషంగా నీ యజమాని వద్దకు వెళ్ళి హాయిగా జీవించు’ చెప్పింది పులి. అప్పటికే మంటలు అడవినంతటినీ చుట్టుముట్టాయి. పులికి కొన్ని అడుగుల దూరంలో మంటలు నాలుకలు చాచి తరుముకుంటూ రావడం చూసిన ఆవు ‘రాజా ఏమిటిది? ఎవరు చేశారు ఇదంతా?’ అడిగింది.‘మిత్రమా.. మనిషి! మనిషి చేశాడిదంతా! ఈ అడవిలో నగరాన్ని నిర్మిస్తాడట. అందుకే అగ్గి రాజేశాడు. ఈ అందమైన అడవి.. మన అడవి... ఆకలికి తప్ప అత్యాశకు చోటులేని అడవి.. ప్రేమను కోరే అడవి.. పరవశాల అడవి.. ఈ అడవిలో మనిషికి భాగం ఉండొచ్చుగాని పెత్తనం ఉంటుందా? అడవికి రాజైనా నేను పెత్తనం చేయనే! ఈ మనిషెంత పతనశీలి? మనల్ని ఖాళీ చేయించడానికి నిప్పు పెట్టాడు. త్వరపడు మిత్రమా త్వరపడు! ఇక్కడి నుండి బయటపడు’ అంటూ ఆవును త్వరపెడుతూ చుట్టూతా చూసింది పులి.మంటలు కమ్ముకున్నాయి. ‘అయ్యో.. మంటలు మనల్ని చుట్టుముట్టాయి. ఇక మనం తప్పించుకొని పోలేం. క్షమించు మిత్రమా.. నీ దుస్థితికి కారణం అయినందుకు!’ అంటూ ఆవుని క్షమాపణలు కోరింది పులి. తనకు దగ్గర పడుతున్న మంటలను చూసి ‘నీలాంటి మంచి మిత్రుడిని కలుసుకున్నందుకు సంతోషంగా వుంది’ అంది ఆవు పులితో. ‘నీలాంటి మిత్రుడితో కలసి ఈ క్షణాన్ని పంచుకుంటున్నందుకు గొప్ప సంతోషంగా ఉంది!’ అంది పులి ఆవుతో. మనిషి రాజేసిన అగ్ని అడవిని, అడవిలోని జంతువులతోపాటు ఆ ఇరువురినీ బూడిద చేసింది.ఆకాశంలోని సూర్యుడు దట్టంగా వ్యాపించి వున్న నల్లని పొగ మాటున చావు దుప్పటి కప్పుకుని తెల్లగా పాలిపోయి నిశ్చలంగా వేలాడుతూ ఉన్నాడు. -
ధౌమ్యుడు అతడి శిష్యులు
ధౌమ్యుడు పాండవులకు పురోహితుడు. ఆయన మహర్షి. ఆయన వద్ద ఉపమన్యుడు, ఆరుణి, బైదుడు అనే ముగ్గురు శిష్యులు విద్యాభ్యాసం చేస్తుండేవారు. ముగ్గురూ చాలా తెలివైన వారు. అంతకు మించి అమిత గురుభక్తి తత్పరులు. ఒకనాడు ధౌమ్యుడు తన శిష్యులలో ఆరుణిని పిలిచాడు. ‘మన పొలం దగ్గర కాలువ గట్టు తెగి, వరిచేనును ముంచేస్తోంది. నువ్వు వెళ్లి, ఆ కాలువకు అడ్డుకట్ట వేసి రా’ అని ఆజ్ఞాపించాడు. ఆరుణి పొలానికి వెళ్లి, గట్టు తెగిన కాలువకు అడ్డుకట్ట వేయడానికి రకరకాలుగా ప్రయత్నించాడు. కుప్పలు కుప్పలుగా మట్టి తెచ్చి, గట్టుకు అడ్డుగా వేశాడు. అయినా అది నిలువలేదు. ఇక ఏం చేయాలో తోచక కాలువ గట్టుకు అడ్డుగా తానే పడుకున్నాడు. అప్పుడు నీరు చేనులోకి చేరడం ఆగిపోయింది. రాత్రి అయినా ఆరుణి ఆశ్రమానికి రాలేదు. ధౌమ్యుడు మిగిలిన ఇద్దరు శిష్యులను వెంటబెట్టుకుని పొలానికి వెళ్లాడు. పొలంలో వెదుకుంతుండగా, కాలువ గట్టుకు అడ్డంగా పడుకుని ఉన్న ఆరుణి కనిపించాడు. ధౌమ్యుడు అతడిని లేవనెత్తి, ‘వత్సా! నీ గురుభక్తికి సంతోషించాను. నువ్వు త్వరలోనే విద్వాంసుడివి కాగలవు’ అని దీవించాడు. అతడికి అన్ని విద్యలూ నేర్పించి, విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు.కొన్నాళ్లకు ధౌమ్యుడు తన శిష్యులలో ఉపమన్యుడిని పిలిచి, ‘పాఠాలు చదువుకోవడం పూర్తయ్యాక రోజూ ఆవులను మేపి వస్తూండు’ అని ఆజ్ఞాపించాడు. ఉపమన్యుడు గురువు చెప్పినట్లే చేయసాగాడు.ఒకవైపు ఆశ్రమంలో పనులు చేస్తూ, చదువుకుంటూ, మరోవైపు గోవులు కాసే పని చేస్తున్నా ఉపమన్యుడు పుష్టిగా ఉండేవాడు. ఒకరోజు ధౌమ్యుడు ఉపమన్యుడిని చూసి, ‘ఇన్ని పనులు చేస్తున్నా నువ్వు ఇంత పుష్టిగా ఎలా ఉన్నావు? ఇంట్లో కూర్చుని తింటున్నా నేను నీ అంత పుష్టిగా లేను సుమా’ అన్నాడు.‘ఆచార్యా! నేను భిక్షాటన చేసుకుని జీవిస్తున్నాను. నాకు రోజూ ఎన్నో వంటకాలు దొరుకుతుంటాయి. వాటిని ఆరగిస్తుండటం వల్లనే పుష్టిగా ఉన్నాను’ అని చెప్పాడు ఉపమన్యుడు.‘అలాగైతే, నువ్వు రోజూ సంపాదించే భిక్షను తీసుకొచ్చి నాకు ఇస్తూండు’ ఆదేశించాడు ధౌమ్యుడు.ఉపమన్యుడు ప్రతిరోజూ తాను సంపాదించే భిక్షను గురువుకు ఇస్తుండేవాడు. ఇలా రోజులు గడుస్తున్నా, ఉపమన్యుడు ఎప్పటిలాగానే పుష్టిగా ఉండేవాడు.కొన్నాళ్లకు ధౌమ్యుడు, ‘నువ్వు తెచ్చినదంతా నాకే ఇచ్చేస్తున్నావు కదా, అయినా పుష్టిగానే ఉంటున్నావు. అదెలా సాధ్యమవుతోంది?’ అని అడిగాడు. ‘ఆచార్యా! పగలు సంపాదించిన భిక్ష అంతా తమకు ఇచ్చి, రాత్రివేళ దొరికిన భిక్షను నేను తింటున్నాను’ బదులిచ్చాడు ఉపమన్యుడు. ‘ఇక నుంచి రాత్రివేళ భిక్ష కూడా నాకే ఇస్తూండు’ ఆజ్ఞాపించాడు ధౌమ్యుడు. ఉపమన్యుడు అలాగే చేయసాగాడు. ఇలా కొన్నాళ్లు గడిచినా, ఉపమన్యుడు యథాప్రకారమే కనిపించసాగాడు. ‘రెండు పూటల భిక్ష నాకే తెచ్చి ఇచ్చేస్తున్నావు కదా, అయినా నువ్వు ఇంకా పుష్టిగానే ఎలా ఉంటున్నావు?’ అడిగాడు ధౌమ్యుడు.‘ఆవుల పాలు తాగుతున్నాను ఆచార్యా!’ అని బదులిచ్చాడు ఉపమన్యుడు.‘పాలు లేక లేగదూడలు బక్కచిక్కిపోతున్నాయి. ఇకపై నువ్వు ఆవుపాలు తాగడం మనుకో’ ఆదేశించాడు ధౌమ్యుడు. ఉపమన్యుడు ఆవుపాలు తాగడం కూడా మానేశాడు. ఇలా రోజులు గడిచేకొద్ది కృశించసాగాడు.ఒకనాడు ఆవులను మేతకు తీసుకుపోతున్నప్పుడు ఆకలికి తాళలేకపోయాడు. దారిలో కనిపించిన జిల్లేడు మొక్కల ఆకులను తిన్నాడు. ఆకలి తీరిందో లేదో గాని, జిల్లేడు ఆకులు తిన్నందుకు ఉపమన్యుడికి గుడ్డితనం వచ్చింది. ఆవులను తిరిగి ఆశ్రమానికి తోలుకు వస్తుండగా, దారి గుర్తించలేక ఒక పాడుబడిన బావిలో పడిపోయాడు. ఆవులు అలవాటు కొద్ది ఆశ్రమానికి చేరుకున్నాయి గాని, వాటితో పాటు ఉపమన్యుడు రాలేదు.రాత్రి ఎంతసేపటికీ ఉపమన్యుడు రాకపోవడంతో ఆందోళన చెందిన ధౌమ్యుడు అతడిని వెదుకుతూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్లాక, బావిలోంచి ఆర్తనాదాలు వినిపించాయి. ధౌమ్యుడు బావి వద్దకు వెళ్లి చూడగా, ఉపమన్యుడు కనిపించాడు. ధౌమ్యుడు అతడికి ధైర్యం చెప్పి, ఆశ్వనీ దేవతల మంత్రం ఉపదేశించాడు. మంత్ర ప్రభావంతో ఉపమన్యుడికి చూపు వచ్చింది. గురువు చేయి అందించడంతో సురక్షితంగా బావి నుంచి బయటపడ్డాడు. ధౌమ్యుడు అతడికి అన్ని విద్యలనూ నేర్పించి, తనంతటి విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు. తర్వాత శిష్యులలో మూడోవాడైన బైదుడికి కూడా ఇలాగే కఠిన పరీక్షలు పెట్టి, వాటిని నెగ్గిన తర్వాత అతడికి కూడా అన్ని విద్యలనూ ఉపదేశించాడు.‘వత్సా! నీ గురుభక్తికి సంతోషించాను. నువ్వు త్వరలోనే విద్వాంసుడివి కాగలవు’ అని దీవించాడు. అతడికి అన్ని విద్యలూ నేర్పించి, విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు. ∙సాంఖ్యాయన -
ఎడారి ఓడల వేడుక
ఒంటెలు ఎడారి ఓడలు. ప్రపంచంలో ఎడారులు ఉన్న ప్రతిచోటా ఒంటెలు కనిపిస్తాయి గాని, వాటి రాజసం చూడాలంటే మాత్రం రాజస్థాన్లోని బికనీర్లో జరిగే కేమెల్ ఫెస్టివల్కు వెళ్లాల్సిందే!బికనీర్ నగరంలో ప్రతి ఏటా జనవరి రెండో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఈ ఎడారి ఓడల వేడుక జరుగుతుంది. ఈసారి జనవరి 11, 12 తేదీల్లో జరుగుతున్న కేమెల్ ఫెస్టివల్ కోసం బికనీర్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. రాజస్థాన్ పర్యాటక శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ వేడుక కోసం రాష్ట్రంలోని ఒంటెల యజమానులు పెద్దసంఖ్యలో తమ తమ ఒంటెలతో ఇక్కడకు చేరుకున్నారు. బికనీర్ నగర వ్యవస్థాపకుడు రావు బికా హయాంలో పదిహేనో శతాబ్దంలో ఇక్కడ ఒంటెల వేడుకలు నిర్వహించడం మొదలైంది. ఇక్కడి ఒంటెలు సైనిక దళాలకు సేవలందించాయి. మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో ఇక్కడి ఒంటెలతో ఏర్పడిన సైనికదళం ‘గంగా రిసాలా’ కీలక పాత్ర పోషించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, 1965లో జరిగిన ఇండో–పాక్ యుద్ధంలో ఇక్కడి ‘గంగా జైసల్మేర్ రిసాలా’ సైనిక దళంలో పనిచేసిన ఒంటెలు సైన్యానికి కీలకమైన సేవలందించాయి. ఇక్కడి ఒంటెల చారిత్రక ఘనతను చాటేందుకు, ఈ వేడుకను పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు కొన్నేళ్లుగా రాజస్థాన్ పర్యాటక శాఖ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ఒంటెల వేడుకలో పాల్గొనే ఒంటెలకు, వాటి యజమానులకు రకరకాల పోటీలు జరుగుతాయి. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయి. ఒంటెల పరుగు పందేలు, ఒంటెల నాట్యం, ఒంటెల పాలు పితకడం, ఒంటెల విన్యాసాలు, ఒంటెల అందాల పోటీలు వంటివి జరుగుతాయి. పురుషులకు కుస్తీ పోటీలు, మీసాల పోటీలు, స్త్రీ పురుషులకు వేర్వేరుగా టగ్ ఆఫ్ వార్ పోటీలు, మహిళలకు తలపై కుండలు మోస్తూ త్వరగా నడవడంలో పోటీలు జరుగుతాయి. సాయంత్రం వేళల్లో బహిరంగ వేదికలపై రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. -
Mystery: నేరాన్ని దాచే నేరం!
అది అమెరికా, మిషిగన్ రాష్ట్రంలోని సీడర్ స్ప్రింగ్స్ ప్రాంతం. 1996 ఆగస్ట్ 7, అర్ధరాత్రి 12 దాటింది. రేచల్ టిమెర్మన్ (18) అనే అమ్మాయి, మార్విన్ గేబ్రియల్ (43) అనే ఫ్యామిలీ ఫ్రెండ్ కారులో బర్త్డే పార్టీ నుంచి ఇంటికి బయలుదేరింది. ఆ కారులో మరో ఇద్దరు సుపరిచితులున్నారు. అయితే మార్విన్ ఉన్నట్టుండి కారు ఆపి, మిగిలిన ఇద్దరితో గొడవపడి, కారు దింపేశాడు. రేచల్ను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, తీవ్రంగా హింసించి, అత్యాచారం చేశాడు. ‘ఎవరికైనా చెబితే నిన్నూ నీ కూతుర్నీ చంపేస్తాను’ అని ఆమెను బెదిరించి వదిలిపెట్టాడు. రేచల్కి రెండేళ్ల షానన్ అనే కూతురుంది. ఓ రెస్టరెంట్లో పని చేసుకుంటూ, తల్లిదండ్రులైన వెల్డా, టిమ్లకు సమీపంలోనే నివాసముండేది. టిమ్ దంపతులకు తమ కూతురు, మనవరాలంటే ప్రాణం.మార్విన్ చేసిన పనికి రేచల్ మానసికంగా కుంగిపోయింది. ఎవరినీ నమ్మలేని స్థితికి చేరుకుంది. తెలిసినవారిని చూసినా భయపడేది. కొన్ని వారాలు గడిచాయి. ఆమె తీరు గమనించి ఆరా తీస్తూ వస్తున్న తల్లి వెల్డాకు– ఒకరోజు తట్టుకోలేక ఏడ్చుకుంటూ జరిగిందంతా చెప్పింది రేచల్. వెంటనే వెల్డా ధైర్యం చెప్పింది. టిమ్ను తోడుగా పంపించి, రేచల్తో మార్విన్ పై పోలీసులకు ఫిర్యాదు ఇప్పించింది. వెంటనే పోలీసులు మార్విన్ ను అదుపులోకి తీసుకుని, విచారణ మొదలుపెట్టారు. తిరిగి రేచల్ను మామూలు మనిషిని చేయడానికి టిమ్, వెల్డాలు తీవ్రంగా శ్రమించారు. ‘వాడికి శిక్షపడేలా చేద్దాం. నువ్వు భయపడొద్దు. మనుషులంతా ఒకేలా ఉండరు’ అని ధైర్యం చెబుతూ, సాధారణ జీవితానికి అలవాటు చేశారు.అయితే, విచారణ తేదీ వచ్చిన ప్రతిసారీ మార్విన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని భయపడేది. సుమారు ఆరు నెలల విచారణ తర్వాత మార్విన్ ను జైలుకు పంపారు. తర్వాత రెండు వారాలకే బెయిల్పై బయటికి వచ్చిన మార్విన్ – ‘కేసు వెనక్కి తీసుకోకపోతే నిన్నూ నీ కూతుర్నీ చంపేస్తాను’ అని రేచల్ను బెదిరించాడు. అయినా భయపడొద్దని టిమ్ ఆమెకు ధైర్యం చెప్పాడు. మరో ఐదు నెలలు గడిచేసరికి రేచల్ పూర్తిగా మామూలు మనిషయింది. ఒకరోజు సంబరంగా తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. నాతో డేటింగ్కి ఇష్టపడుతున్నాడు. నా కూతురు షానన్ ని కూడా నాతోనే తీసుకుని రమ్మన్నాడు. నేను వెళ్తున్నాను’ అని కూతుర్ని తీసుకుని వెళ్లింది.మరుసటి రోజు రేచల్ నుంచి టిమ్కు ఒక ఉత్తరం వచ్చింది. దానిలో ‘నేను సెలవుపై వెళ్తున్నాను’ అని రాసింది. కొన్ని రోజుల ముందే కొత్త ఉద్యోగంలో చేరిన రేచల్ సెలవు పెట్టడం ఏంటనే అనుమానంతో పాటు మార్విన్ కోర్టు వాయిదా దగ్గర పడుతుండటంతో టిమ్కు భయం మొదలైంది. వాయిదా రోజుకు కూడా రేచల్ రాలేదు. షానన్ ఏమైందో తెలియలేదు. వాయిదా రోజున రేచల్ రాకపోయేసరికి మరో 11 రోజులకు కేసు వాయిదాపడింది. ఆ 11 రోజులు గడిచాక, వాయిదా నాటికి రేచల్ నుంచి మరో లేఖ కోర్టుకు వచ్చింది. ‘నా అంతట నేనే మార్విన్ తో సంబంధాన్ని కోరుకున్నాను. అతడు నిరాకరించేసరికి ఆ కోపంతోనే అతడిపై అత్యాచారం కేసు పెట్టాను’ అని అందులో రాసింది. దాంతో టిమ్తో పాటు అధికారులకు రేచల్ కిడ్నాప్ అయ్యి ఉంటుందనే అనుమానం మొదలైంది. దాంతో ఆమె కోసం గాలింపు మొదలైంది. సరిగ్గా రెండు వారాలకు సమీపంలోనే ఆక్స్ఫర్డ్ సరస్సులో రేచల్ శవమై తేలింది. నోటికి, కళ్లకు పెద్దపెద్ద ప్లాస్టర్స్ చుట్టి, చేతులు, కాళ్లకు రెండు సిమెంట్ దిమ్మలు కట్టి సరస్సులో ముంచేశారు. అంటే ఆ లేఖలు బలవంతంగా రాయించారని అధికారులు నమ్మారు. వెంటనే మార్విన్ ఇంటిని తనిఖీ చేయగా పసిపిల్లల పాలసీసా దొరికింది. అది షానన్ ది కావచ్చని నమ్మారు. పైగా రేచల్ కాళ్లు, చేతులకు కట్టిన సిమెంట్ దిమ్మల్లాంటి దిమ్మలు మార్విన్ ఇంటి ముందున్నాయి. అయితే, అప్పటికే మార్విన్ తప్పించుకున్నాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఈ కేసుకు సంబంధించి మార్విన్, షానన్ తో పాటుగా మరో ఇద్దరు కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు. మొదటి వ్యక్తి వేన్ డేవిస్. అతడు మార్విన్ స్నేహితుడు. అలాగే రేచల్పై అత్యాచారం జరిగిన రాత్రి కారులో ఉన్న ఇద్దరిలో ఒకడైన రెండవ వ్యక్తి జాన్ వీక్స్. అతడు మార్విన్కు పరిచయస్థుడు, రేచల్కు స్నేహితుడు. ఆమెను డేట్కి పిలిచింది అతడేనని తర్వాత విచారణలో తేలింది. రేచల్ అతడ్ని నమ్మే షానన్ తో పాటు అతడితో వెళ్లిందట! వీళ్లందరినీ మార్విన్నే మాయం చేసి ఉంటాడనే క్లారిటీకి వచ్చారు పోలీసులు.కొన్ని నెలలకు న్యూయార్క్ పోలీసులు– రాబర్ట్ అలెన్ అని చెప్పుకుని తిరిగే వ్యక్తిని అరెస్ట్ చేశారు. రాబర్ట్ అలెన్ అనే వ్యక్తి అప్పటికే కనిపించడం లేదని అతడి ఫ్యామిలీ కంప్లైంట్ ఇచ్చిందట! అయితే అతడి కార్డ్స్ అన్నీ వాడుకలో ఉన్నాయని గుర్తించిన పోలీసులు రాబర్ట్ కోసం నిఘా పెట్టారు. చివరికి న్యూయార్క్లో పట్టుకున్నారు. అయితే, అతడు రాబర్ట్ అలెన్ పేరుతో చలామణీ అవుతున్న మార్విన్ అని గుర్తించి, పోలీసులు షాక్ అయ్యారు. ‘రాబర్ట్ ఎక్కడ?’ అని మార్విన్ ని నిలదీస్తే తెలియదన్నాడు. ఇక అరెస్ట్ చేసి, తీసుకొచ్చి రాబర్ట్ మిస్సింగ్ కేసుతో పాటు రేచల్ మర్డర్ కేసులో కూడా మార్విన్ ను విచారించడం మొదలుపెట్టారు. రేచల్ హత్యకు తనకు సంబంధం లేదని మార్విన్ వాదించాడు. రాబర్ట్ మిస్సింగ్ కేసులో కొన్ని కీలక ఆధారాలతో కేసు బిగుసుకుంది. మార్విన్ కు మరణశిక్ష పడింది. తర్వాత మార్విన్ అప్పీలు చేసుకోవడంతో మరణశిక్ష రద్దయి, విచారణ మళ్లీ మొదలైంది. ఆ క్రమంలోనే మార్విన్ తన పక్క ఖైదీకి ఆక్స్ఫర్డ్ సరస్సు మ్యాప్ ఇవ్వగా దానిపై ఒక క్లూ ఉంది. ‘3+ 1, ఒక మృతదేహం దొరికింది’ అని రాసుకున్నాడు మార్విన్ . అతడి దృష్టిలో 3 అంటే పాప షానన్, జాన్ వీక్స్, వేన్ డేవిస్ కాగా, 1 అంటే రేచల్ కావచ్చు అని అధికారులు అంచనా వేశారు. సరిగ్గా రేచల్ మృతదేహం దొరికిన ఐదేళ్లకు అదే సరస్సులో వేన్ డేవిస్ మృతదేహం దొరికింది. రేచల్ చనిపోయినట్లే డేవిస్ కూడా చనిపోయాడని రిపోర్ట్స్ తేల్చాయి. డేవిస్ని కూడా రేచల్ను కట్టినట్లే సిమెంట్ దిమ్మలతో కట్టి, కళ్లకు, నోటికి ప్లాస్టర్స్ వేసి సరస్సులో పడేశారు. మరోవైపు మార్విన్ తన తోటి ఖైదీలతో బిడ్డ (షానన్ )ను ఎక్కడ దాచాలో తెలియక చంపేశాను’ అని చెప్పాడట! అయితే, ఈ కేసులో మిస్ అయిన పాప షానన్, జాన్ వీక్స్, రాబర్ట్ అలెన్ వీరంతా ఏమయ్యారో తేలలేదు. దాంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన -
దొంగలను పట్టించిన డాగ్ వాక్
2024 డిసెంబర్ 12 తెల్లవారుజాము దాదాపు 4 గంటల సమయం– హైదరాబాద్, దోమలగూడ అర్వింద్నగర్లోని ఘొరాయ్ కుటుంబీకుల ఇంట్లోకి ఆరుగురు ముసుగు దొంగలు చొరబడి, మారణాయుధాలతో బెదిరించి, రెండు కేజీల బంగారం సహా దాదాపు రూ.2 కోట్ల విలువైన సొత్తు దోచుకున్నారు. 2024 డిసెంబర్ 22 మధ్యాహ్నం దాదాపు 2 గంటల మధ్య సమయం–బంజారాహిల్స్లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఘొరాయ్ కుటుంబీకుడు సహా 12 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆధారాలు దొరక్కుండా, పక్కా పథకం ప్రకారం చేసిన ఈ బందిపోటు దొంగతనం ఒక పెంపుడు జాగిలం ద్వారా కొలిక్కి వచ్చింది. పశ్చిమ బెంగాల్కు చెందిన అన్నదమ్ములు రంజిత్ ఘొరాయ్, ఇంద్రజిత్ ఘొరాయ్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్కు వలసవచ్చారు. తమ కుటుంబాలతో దోమలగూడ అర్వింద్నగర్లో స్థిరపడ్డారు. ఇద్దరూ వేర్వేరుగా నగల తయారీ వ్యాపారం ప్రారంభించారు. రంజిత్ యాభైమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అతడి తమ్ముడు ఇంద్రజిత్ వ్యసనాలకు బానిసై, ఆర్థికంగా చితికిపోయాడు. తమ్ముడి పరిస్థితి చూసిన అన్న రంజిత్ తనతో కలిసి ఒకే ఇంట్లో వేరే పోర్షన్లో ఉండే ఏర్పాటు చేశాడు. రంజిత్ వ్యాపారం బాగా సాగుతుండటంతో ఇంద్రజిత్ కొన్నాళ్లుగా ఈర్ష్యతో రగిలిపోతున్నాడు. ఇటీవల రంజిత్ తన భార్య పేరుతో దోమలగూడలో రెండు ఇళ్లు కొన్నాడు. ఈ విషయం తెలిశాక ఇంద్రజిత్ మరింతగా రగిలిపోయాడు. రంజిత్ వద్ద ఉండే బంగారం వివరాలను గమనిస్తూ వచ్చిన ఇంద్రజిత్– నకిలీ ఆదాయపు పన్ను దాడి చేయించడానికి ఆరు నెలల కిందట కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేయించినా, ఆ పథకం పారలేదు. దీంతో అన్న వద్ద ఉండే బంగారం దోచుకోవాలని ఇంద్రజిత్ భావించాడు. ప్రతి రోజూ తనతో కలిసి మార్నింగ్ వాక్ చేసే అల్తాఫ్ మహ్మద్ ఖాన్, సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్లతో ఇంద్రజిత్కు స్నేహం ఏర్పడింది. రంజిత్ ఇంట్లో భారీగా బంగారం ఉండే సమయం చెప్తానని, అప్పుడు దోపిడీ చేయిస్తే, అందరం వాటాలు పంచుకుందామని చెప్పాడు. దీనికి అంగీకరించిన అల్తాఫ్, ఇర్ఫాన్, ఈ విషయాన్ని బాలాపూర్కు చెందిన రౌడీషీటర్ హబీబ్ హుస్సేన్ ద్వారా మైలార్దేవ్పల్లికి చెందిన షేక్ షబ్బీర్కు చెప్పారు. ఈ దోపిడీకి తనకంటే మైలార్దేవ్పల్లి రౌడీషీటర్ మహ్మద్ అర్బాజ్ సమర్థుడని చెప్పిన షబ్బీర్, అతడిని పరిచయం చేశాడు. వీరంతా పలుమార్లు వివిధ హోటళ్లలో కూర్చుని, దోపిడీకి పథకం వేశారు. అర్బాజ్ తన అనుచరులతో కలిసి బందిపోటు దొంగతనానికి రంగంలోకి దిగాడు. ఇంద్రజిత్తో చర్చించి, ఒక వాహనాన్ని కూడా కొన్నాడు. తన అనుచరులతో రంజిత్ ఇంటి వద్ద రెక్కీ చేయించాడు. ఇంట్లో పెంపుడు శునకం, చుట్టూ ప్రహరీ, భారీ గేటు, గ్రిల్స్తో కట్టుదిట్టంగా ఉండటంతో బయటి వాళ్లు ప్రవేశించడం దుస్సాధ్యమని గుర్తించి, ఇంద్రజిత్కు చెప్పాడు. దీంతో అంతా కలిసి బహదూర్పురాకు చెందిన న్యాయవాది మహ్మద్ నూరుల్లా సహాయం కోరారు. ఘొరాయ్ ఇంట్లోని పెంపుడు శునకాన్ని ఇంద్రజిత్ రోజూ ఉదయం బయటకు తీసుకువెళుతుంటాడు. దాని కాలకృత్యాలు పూర్తయ్యాక తీసుకువచ్చి, ఇంటి ఆవరణలో వదిలేస్తాడు. దొంగతనం చేసే రోజు మాత్రం తెల్లవారుజామున పెంపుడు శునకాన్ని కాస్త తొందరగా బయటకు తీసుకుని వెళ్లాలని, తిరిగి వస్తూ ప్రధాన గేటుకు గడియపెట్టకుండా వదిలేయాలని నూరుల్లా సలహా ఇచ్చాడు. దీంతో అర్బాజ్ 2024 డిసెంబర్ 12 రాత్రి తన గ్యాంగ్తో రంగంలోకి దిగాడు. అర్బాజ్ నేతృత్వంలో అతడి అనుచరులు షబ్బీర్ ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడ నుంచి షబ్బీర్ మినహా మిగిలిన వాళ్లు బయలుదేరి, రంజిత్ ఇంటికి చేరారు. తన అన్న కుటుంబీకులను కేవలం బెదిరించాలని ఇంద్రజిత్ పదేపదే చెప్పినా అర్బాజ్ పట్టించుకోలేదు. రంజిత్ కుటుంబాన్ని బంధించి, తన అనుచరులతో వారి పిల్లల మెడపై కత్తులు పెట్టించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన రంజిత్ చేతిని కత్తితో నరికించాడు. తర్వాత ఇంట్లోని రెండు కేజీల బంగారం, 616 గ్రాముల వెండి, పూజ గదిలోని రెండు కేజీల ఇత్తడి సామాను దోచుకుని పారిపోయారు. పోలీసులకు ఆధారాలు దొరక్కుండా, రహదారుల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా జాగ్రత్తపడ్డారు. కాసేపటికి రంజిత్ షాక్ నుంచి తేరుకున్నాడు. ఇంద్రజిత్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు అక్కడకు చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా నేతృత్వంలో ఎస్సైలు నవీన్కుమార్, నాగేష్, శ్రీకాంత్ తమ బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఘొరాయ్ కుటుంబం దినచర్యపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే నేరం జరిగిన రోజు ఇంద్రజిత్ తెల్లవారుజామున 3.00 గంటలకే పెంపుడు శునకాన్ని మార్నింగ్ వాక్కు తీసుకువెళ్లినట్లు గుర్తించారు. అతడిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అతడు నోరు విప్పాడు. ఆరు నెలల కిందటి ‘ఐటీ స్కెచ్’ నుంచి తాజా బందిపోటు దొంగతనంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న పదిహేను మంది వివరాలను బయటపెట్టాడు. దీంతో అధికారులు షహబాజ్, నజీర్, జహీర్ మినహా మిగిలిన పన్నెండు మందిని పట్టుకుని, వీరి నుంచి రూ.2.9 లక్షల నగదు, కారు, ఆయుధాలతో పాటు 1228 గ్రాముల బంగారం, 616 గ్రాముల వెండి, రెండు కేజీల ఇత్తడి వస్తువులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
సందళ్ల సంక్రాంతి
మనకు ఎన్ని పండుగలు ఉన్నా, సంక్రాంతి పండుగ ప్రత్యేకమైనది. సంక్రాంతి అంటేనే సందడి అనేంతగా తెలుగునాట సంక్రాంతి సంబరాలు ప్రసిద్ధి పొందాయి. సూర్యుడు మకరరాశిలోకి అడుగుపెట్టే సందర్భంగా మకర సంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయనం మొదలవుతుంది. ఉత్తరాయనాన్ని పుణ్యకాలంగా భావిస్తారు. అందువల్ల మకర సంక్రాంతిని తెలుగునాటనే కాకుండా, దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. సంక్రాంతి వేడుకలు జరుపుకోవడంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో పద్ధతి. సంక్రాంతికి ముందురోజున భోగి మంటలు వేయడం, సంక్రాంతి రోజుల్లో ముంగిళ్లలో ముగ్గులు వేయడం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. మకర సంక్రాంతి సందర్భంగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కనిపించే సంక్రాంతి సందళ్ల గురించి తెలుసుకుందాం.సంక్రాంతి రోజుల్లో తెలుగునాట ఊరూరా ముంగిళ్లు గొబ్బెమ్మలను తీర్చిదిద్దిన ముగ్గులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. గంగిరెద్దుల గంటల సవ్వడులు, బుడబుక్కల వాయిద్యాల ధ్వనులు, హరిదాసుల హరినామ సంకీర్తనలు వినిపిస్తాయి. కొన్నిచోట్ల కోడిపందేల కోలాహలాలు, ఇంకొన్ని చోట్ల నింగిని తాకే పతంగుల రంగులు కనువిందు చేస్తాయి. కొన్నిచోట్ల ఆడపడుచులు సంక్రాంతి సందర్భంగా ఇళ్లల్లో బొమ్మల కొలువులు కూడా పెడతారు. మకర సంక్రాంతి వేడుకలను సాధారణంగా మూడు రోజులు, ఒక్కోచోట నాలుగు రోజులు కూడా జరుపుకొంటారు. మకర సంక్రాంతికి ముందురోజు భోగి పండుగ, సంక్రాంతి మరునాడు కనుమ పండుగ, కనుమ మరునాడు ముక్కనుమ జరుపుకొంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోనూ సంక్రాంతి వేడుకలను దాదాపు ఒకేరీతిలో అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు. సంక్రాంతి ప్రధానంగా వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ. పంటల కోతలు పూర్తయ్యాక వచ్చే పండుగ ఇది. సంక్రాంతి నాటికి రైతుల ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడుతుంటాయి. మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. ఇంటికి ధాన్యలక్ష్మి చేరుకునే రోజుల్లో వస్తుంది కాబట్టి, సంక్రాంతి లక్ష్మి అని, పౌష్యలక్ష్మి అని అంటారు. ‘వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి’ అంటూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతారు. నెల్లాళ్లు రంగవల్లుల వేడుకమకర సంక్రాంతికి నెల్లాళ్లు ముందు వచ్చే ధనుస్సంక్రాంతి నుంచి ముంగిళ్లలో నెల్లాళ్ల పాటు రంగవల్లుల వేడుక సాగుతుంది. ఇళ్ల ముందు రకరకాల రంగవల్లులను తీర్చిదిద్ది వాటిని గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. అష్టదళ పద్మం, నాగబంధం, మారేడు దళాలు, శివుడి త్రినేత్రాలు, పెళ్లిపీటల ముగ్గు వంటి సంప్రదాయ ముగ్గులతో పాటు రకరకాల ముగ్గులను తీర్చిదిద్దుతారు. ధనుస్సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు సాగే నెల్లాళ్లను సౌరమానం ప్రకారం ధనుర్మాసం అంటారు. ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో తిరుప్పావై పాశురాలను పఠిస్తూ, ప్రత్యేక పూజలు చేస్తారు. కట్టుపొంగలి, చక్కెరపొంగలి వంటి వంటకాలను నైవేద్యంగా పెడతారు. భోగి పండుగ రోజున ఆలయాల్లో గోదా కల్యాణం వేడుకలను నిర్వహిస్తారు. చివరి రోజున రథం ముగ్గు వేస్తారు. దీనిని దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి పయనం సాగించిన సూర్యుని రథంగా భావిస్తారు.భోగ భాగ్యాల భోగిపూర్వం విష్ణుచిత్తుడు అనే విష్ణుభక్తుడు ఉండేవాడు. విష్ణుచిత్తుడికి ఒకనాడు తులసివనంలో ఒక పసిబిడ్డ దొరికింది. విష్ణుచిత్తుడు ఆమెను కుమార్తెగా స్వీకరించి పెంచాడు. ఆమె గోదాదేవి. చిన్ననాటి నుంచి శ్రీరంగనాథుడిని ఆరాధించేది. శ్రీరంగనాథుడు ఆమెను మకర సంక్రాంతికి ముందు ధనుర్మాసం చివరి రోజున పెళ్లాడాడు. ఆమెను భోగభాగ్యాలతో ముంచెత్తాడు. రంగనాథుని పెళ్లాడటంతో గోదాదేవి కైవల్య భోగాన్ని పొందిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. గోదా రంగనాథుల పరిణయానికి, భోగభాగ్యాలకు ప్రతీకగా భోగి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. భోగి రోజున ఇంట్లోని చిన్నపిల్లలకు రేగుపండ్లు, చెరకు ముక్కలతో భోగిపండ్లు పోసి, పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. హేమంత రుతువులో చలితీవ్రత ఎక్కువగా ఉండేరోజుల్లో ఈ పండుగ వస్తుంది కాబట్టి, భోగిపండుగ రోజున వేకువ జామున ఇళ్ల ముంగిట గాని, వీథి చివరన గాని పెద్దపెద్ద భోగిమంటలు వేస్తారు. భోగిమంటల్లో పిడకల దండలు, ఎండిపోయిన తాటాకులు, పెద్దపెద్ద కర్రదుంగలు, పాత వస్తువులు వేస్తారు. రైతులు భోగిరోజున కోతలు పూర్తయిన తమ పొలాలను కొంత నీటితో తడుపుతారు. దీనిని ‘భోగి పులక’ అంటారు. భోగి రోజు నుంచి గాలిపటాల సందడి కూడా మొదలవుతుంది. సిరుల వేడుక సంక్రాంతి«రైతుల ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడే రోజుల్లో వచ్చే సిరుల పండుగ మకర సంక్రాంతి. ఈ రోజు పాలు పొంగించి, కొత్తబియ్యంతో పాయసం వండుతారు. పితృదేవతలను పూజించి, పితృతర్పణాలు విడుస్తారు. శ్రీకృష్ణుడు ఇదేరోజున గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి, ఇంద్రుడు కురిపించిన రాళ్లవాన నుంచి యాదవులను కాపాడాడని, ఇంద్రునికి గర్వభంగం చేశాడని పురాణాల కథనం. ఈరోజున ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడిని పూజిస్తారు. సంక్రాంతి రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు ఫలితం ఉంటుందనే నమ్మకం ఉండటంతో ఈరోజున విరివిగా దాన ధర్మాలు చేస్తారు. ఇళ్లకు వచ్చే హరిదాసులకు, బుడబుక్కల వాళ్లకు, గంగిరెద్దులను ఆడించేవాళ్లకు యథాశక్తి ధన ధాన్యాలను దానం చేస్తారు. సంక్రాంతి రోజున డబ్బు, ధాన్యం మాత్రమే కాకుండా, విసనకర్రలు, వస్త్రాలు, నువ్వులు, చెరకు, పండ్లు, కూరగాయలు వంటివి కూడా దానం చేస్తారు. సంక్రాంతి రోజున చేసే గోదానం విశేష ఫలితం ఇస్తుందని చెబుతారు. అందువల్ల సంపన్న గృహస్థులు సంక్రాంతి రోజున గోదానాలు కూడా చేస్తారు. పశువుల పండుగ కనుమమకర సంక్రాంతి మరునాడు కనుమ పండుగ జరుపుకొంటారు. పొలం పనుల్లో ఏడాది పొడవునా చేదోడు వాదోడుగా నిలిచిన పశువులను అలంకరించి, వాటికి ఇష్టమైన మేతను పుష్టిగా పెడతారు. కనుమ రోజున మాంసాహారులు రకరకాల మాంసాహార వంటకాలతో విందుభోజనాలు చేస్తారు. మనకు కనుమ నాడు మినుము తినాలని సామెత ఉంది. మాంసాహారం తినని శాకాహారులు మాంసకృత్తులు పుష్కలంగా ఉండే మినుములతో తయారుచేసే గారెలు, ఆవడలు వంటి వంటకాలను ఆరగిస్తారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం సంప్రదాయంగా వస్తోంది.ముగింపు ముక్కనుమసంక్రాంతి వేడుకల్లో మొదటి మూడు రోజుల్లోనూ నిర్దిష్టంగా పాటించవలసిన సంప్రదాయ నియమాలు ఉన్నాయి గాని, నాలుగో రోజైన ముక్కనుమకు ప్రత్యేక నియమాలేవీ లేవు. కొందరు మాంసాహారులు కనుమనాడు మాంసాహారం తినరు. వారు ముక్కనుమ రోజున మాంసాహార విందులు చేసుకుంటారు. ముక్కనుమ రోజున నవవధువులు సావిత్రి గౌరీవ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని బొమ్మల నోము అంటారు. నోము పూర్తయ్యాక, పూజలో ఉంచిన బొమ్మలను నిమజ్జనం చేస్తారు. ముమ్మతాల పండుగమకర సంక్రాంతి హిందువుల పండుగ మాత్రమే కాదు, ఇది ముమ్మతాల పండుగ. హిందువులతో పాటు జైనులు, సిక్కులు కూడా మకర సంక్రాంతి పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. జైన ఆగమం ప్రకారం ఈ దేశాన్ని పాలించిన భరత చక్రవర్తి మకర సంక్రాంతి రోజున అయోధ్యలో సూర్యుడిని చూసినప్పుడు, ఆయనకు సూర్యుడిలో ‘జిన’ దర్శనం లభించింది. వెంటనే ఆయన జినాలయాన్ని దర్శించుకున్నప్పుడు, ఆ ఆలయ ద్వారం అయోధ్య నగరానికి అభిముఖంగా ఉందట! జైన మతం ప్రకారం ఇంద్రియాలను జయించిన ఆధ్యాత్మిక విజేతను ‘జిన’ అంటారు. మకర సంక్రాంతిని పర్వదినంగా జరుపుకొనే జైనులు, ఆరోజున జైన ఆలయాలను దర్శించుకుని, ప్రార్థనలు జరుపుతారు. ఆలయాల వద్ద, తమ తమ నివాసాల వద్ద విరివిగా దానాలు చేస్తారు.సిక్కులు మకర సంక్రాంతిని ‘మాఘి’ పేరుతో జరుపుకొంటారు. సిక్కుల గురువైన గురు గోబింద్సింగ్ అనుచరుల్లో నలభైమంది 1705లో సంక్రాంతి రోజున జరిగిన ముక్తసర్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల సిక్కులు సంక్రాంతిని ఆ నలభై మంది అమరవీరుల స్మారకదినంగా పాటిస్తారు. ముక్తసర్లోని గురుద్వారాలో ఉన్న తటాక జలాల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. పంజాబ్, హరియాణా, జమ్ము, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతి ముందు రోజును ‘లోహ్రీ’ పండుగగా జరుపుకొంటారు. లోహ్రీ సందర్భంగా వీథుల్లో భోగిమంటల మాదిరిగానే భారీగా చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో ఆనందం పంచుకుంటారు. హిమాచల్ ప్రజలు సంక్రాంతి వేడుకల్లో అగ్నిదేవుడికి ప్రత్యేకంగా పూజలు జరుపుతారు.పతంగుల పండుగసంక్రాంతి సందర్భంగా పతంగులను ఎగురవేసే సంప్రదాయం మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉంది. గుజరాత్లో పతంగుల సందడి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. గుజరాతీలు ధనుర్మాసం నెల్లాళ్లూ గాలిపటాలను ఎగురవేస్తారు. పలుచోట్ల గాలిపటాల పోటీలు కూడా నిర్వహిస్తారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ సంక్రాంతి రోజుల్లో గాలిపటాల సందడి కనిపిస్తుంది. కర్ణాటక పర్యాటక శాఖ గోకర్ణ, కార్వార్ తదితర బీచ్లలో గాలిపటాల వేడుకలను కొన్నేళ్లుగా నిర్వహిస్తోంది. సూర్యభగవానుడికి కృతజ్ఞత తెలుపుకోవడానికే గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం పుట్టిందని చెబుతారు. చారిత్రకంగా చూసుకుంటే, మొఘల్ల కాలం నుంచి మన దేశంలో గాలిపటాలను ఎగురవేయడం వినోదక్రీడగా మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి.కోడి పందేలుకోడి పందేలు మన దేశంలో పురాతన వినోద క్రీడ. చట్టపరమైన నిషేధాలు ఉన్నా, నేటికీ ఏటా సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు విరివిగా జరుగుతూనే ఉన్నాయి. కోడి పందేల కారణంగానే పలనాటి యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే! దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోనూ కోడి పందేల ఆచారం ఉన్నా, తెలుగునాట కోడి పందేలు మరింత ఎక్కువగా జరుగుతాయి. కోడి పందేల్లో గెలుపు సాధించడం కోసం పూర్వీకులు ఏకంగా ‘కుక్కుట శాస్త్రం’ రాశారంటే, కోడిపందేల పట్ల జనాల మక్కువ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో కోడి పందేలు ఎక్కువగా జరిగేవి. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో కోడిపందేలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని కోళ్ల పెంపకందారులు పెందేల కోసం మేలిరకం కోడిపుంజులను పెంచుతుంటారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్లోని భీమవరం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, తణుకు తదితర పట్టణాలు పందెంకోళ్లకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై ఏళ్ల కిందట ఆయిల్ పామ్ సాగు మొదలైనప్పటి నుంచి ఇక్కడ కూడా పందెం కోళ్ల పెంపకం మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలోనే పందెంకోళ్లు చౌకగా లభిస్తుండటంతో ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పందెంరాయుళ్లు పుంజులను కొనేందుకు అశ్వారావుపేట, దమ్మపేట వంటి చోట్ల బారులు తీరుతుండటం విశేషం. పందెం కోళ్ల పెంపకం, వాటి శిక్షణ కోసం కోళ్ల పెంపకందారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. సంక్రాంతికి ఏటా కోట్లాది రూపాయల్లో కోడి పందేలు జరుగుతాయి. పందెం కొళ్లకు లక్షల్లో ధరలు పలుకుతాయి. పొరుగు దేశాల్లో సంక్రాంతిమన పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లోనూ మకర సంక్రాంతి వేడుకలను జరుపుకొంటారు. బంగ్లాదేశ్లోని బెంగాలీ హిందువులు సంక్రాంతి ముందురోజు భోగిమంటలు వేసి, బాణసంచా కాలుస్తారు. సంక్రాంతి రోజున పితృదేవతలకు పూజలు చేస్తారు. పండుగ రోజుల్లో ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు. ఈ సందర్భంగా బంధుమిత్రులతో కలసి వినోదంగా పాచికలాట ఆడతారు. ఈ రోజుల్లో సమీపంలోని చెరువులకు, నదులకు వెళ్లి చేపలను వేటాడతారు. పండుగ రోజుల్లో ఎవరికి పెద్దచేపలు చిక్కుతాయో వారికి ఏడాదంతా అదృష్టం బాగుంటుందని నమ్ముతారు. నేపాల్ ప్రజలు మకర సంక్రాంతిని ‘మాఘే సంక్రాంతి’గా జరుపుకొంటారు. థారు, మగర్ సహా వివిధ స్థానిక తెగల ప్రజలు తమ తమ సంప్రదాయ రీతుల్లో ఘనంగా వేడుకలు జరుపుకొంటారు. దేవాలయాల వద్దకు చేరుకుని, సంప్రదాయ నృత్యగానాలను ప్రదర్శిస్తారు. పాకిస్తాన్లోని సింధీ ప్రజలు మకర సంక్రాంతిని ‘తిర్మూరి’ పేరుతో జరుపుకొంటారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు పుట్టింటి నుంచి నువ్వులతో తయారు చేసిన పిండివంటలను పంపుతారు. శ్రీలంక ప్రజలు తమిళనాడులో మాదిరిగానే ‘పొంగల్’ వేడుకలు జరుపుకొంటారు. ఇన్పుట్స్: దాళా రమేష్బాబు, గుంటూరు తాండ్ర కృష్ణగోవింద్, కొత్తగూడెం ఫొటోలు: షేక్ రియాజ్ -
సెంచరీకి చేరువలో సైన్స్ ప్రయోగం
సైన్స్ ప్రయోగం ఒకటి ఒకసారి విఫలమైతే రెండోసారి చేస్తారు. అది విఫలమైతే మరోసారి.. ఇలా ఎన్నోసార్లు ఎన్నో పద్ధతుల్లో ప్రయోగాలు చేస్తుంటారు. కాని, ఒకే ప్రయోగాన్ని దాదాపు వందేళ్లుగా చేయటాన్ని చూశారా? ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయంలో, ప్రొఫెసర్ థామస్ పార్నెల్ 1927లో ప్రారంభించిన ‘పిచ్ డ్రాప్’ ప్రయోగం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇటీవల దీనిని ప్రపంచంలో అత్యంత నెమ్మదిగా సాగుతున్న ప్రయోగశాల ప్రయోగంగా గిన్నిస్ బుక్లో చేర్చారు. ప్రొఫెసర్ పార్నెల్, విద్యార్థులకు ఘనపదార్థాలుగా కనిపించేవన్నీ, నిజానికి ఘన పదార్థాలు కావని నిరూపించడానికి ఈ ప్రయోగాన్ని క్వీన్స్ లాండ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం, పడవల్లో సీల్ చేయడానికి ఉపయోగించే మందపాటి తారు ద్రవాన్ని ఎంచుకున్నాడు. ముందుగా తారు పదార్థాన్ని వేడి చేసి, ఒక గాజు గరాటులో పోసి, సుమారు మూడు సంవత్సరాలపాటు అలాగే ఉంచాడు. గరాటులో ఆ ద్రవం ఘన స్థితికి వచ్చిన తర్వాత, 1930లో, గరాటు కింద గొట్టాన్ని కత్తిరించాడు. అప్పటి నుంచి పిచ్ పదార్థం దశాబ్దానికి ఒక చుక్క కిందకు పడుతోంది. ఇప్పటివరకు, ప్రయోగం ప్రారంభించిన ఇన్నేళ్లలోనూ కేవలం తొమ్మిది చుక్కలే కిందకు పడ్డాయి. చివరిగా ఏప్రిల్ 2014లో పడింది. అయితే, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ ప్రకారం, ఈ ప్రయోగం కేవలం ప్రదర్శనకు మాత్రమే ఏర్పాటు చేశారు. తారును ఉంచడానికి నిర్దిష్ట పరిస్థితులేవీ లేవు. వేర్వేరు సమయాల్లో వచ్చే ఉష్ణోగ్రత మార్పులే దీనిని ప్రభావితం చేస్తూన్నాయని కొంతమంది వాదన. ప్రస్తుతం మళ్లీ మరో దశాబ్దం ముగుస్తుండటంతో ఈ ప్రయోగంపై మరోసారి ఆసక్తి చెలరేగింది. చూడాలి మరి మరో చుక్క గరాటు నుంచి కిందకు ఎప్పుడు పడుతుందో! -
Mystery: రక్తబంధం
‘జీవితంలో ఎన్ని అబద్ధాలైనా ఆడవచ్చు. ఎన్ని నిజాలైనా దాచవచ్చు. ఏ తప్పయినా చేయవచ్చు, కానీ ఏదో ఒక రోజు కాలానికి సమాధానం చెప్పాల్సిందే!’ అన్నమాటకు ‘ఫాదర్ ఆఫ్ కాథలీన్ బెల్చర్’ గాథ అద్దం పడుతుంది. సాధారణంగా పుట్టుక తర్వాత కన్నవారి పరిచయంతోనే నమ్మకమనే జీవనప్రయాణం మొదలవుతుంది. కానీ, కాథలీన్ అనే అమ్మాయి జీవితంలో 30 ఏళ్ల తర్వాత ఆ నమ్మకం ముక్కలైపోయింది. నాన్న ఒక అబద్ధమయ్యాడు. అమ్మ ఆ నిజానికి సాక్ష్యమైంది. చివరికి, రక్తపాశం కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చింది. కాథలీన్ ఆనాడే గెలిచి ఉంటే, ఈ కథను ఈనాడు మనం చెప్పుకునే వాళ్లమే కాదు. ఇరవయ్యో శతాబ్దంలో ఫ్లోరిడా ప్రజల మానవసంబంధాలపై ఆలోచింపజేసిన వాస్తవ గాథ ఇది. కాథలీన్ బెల్చర్ డ్యూటీలో ఉండగా, ఒకరోజు తన తల్లి మిరియం టెర్రీ నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ నాన్న, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆసుపత్రిలో చేర్పించాను. డాక్టర్స్ వెంటనే రక్తం ఎక్కించాలంటున్నారు. నువ్వూ, అక్క మియా కలిసి వస్తారా?’ అంది మిరియం.‘సరే అమ్మా! నాన్నది ఏ బ్లడ్ గ్రూప్?’ అడిగింది కాథలీన్ . ‘ఓ’ అని చెప్పింది మిరియం. ‘నాది ‘‘ఏ’’ బ్లడ్ గ్రూప్ కదా?’ అని మనసులో అనుకుంటూ, ‘అవును నీ బ్లడ్ గ్రూప్ ఏంటమ్మా?’ అని తల్లిని అడిగింది అనుమానంగా. ‘బీ’ అంది మిరియం. నిజానికి ఓ, బీ బ్లడ్ గ్రూప్లు కలిగిన తల్లిదండ్రులకు, ఆ రెండు గ్రూప్స్లో ఏదో ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న పిల్లలు మాత్రమే పుడతారు. కాథలీన్ వృత్తిపరంగా నర్స్ కావడంతో తన బ్లడ్ గ్రూప్ పేరెంట్స్తో కలవడం లేదంటే, తన పుట్టుక వెనుక ఏదో రహస్యం దాగి ఉందని వెంటనే గుర్తించింది. ఆ ఊహించని చేదు నిజం తెలుసుకోవడానికి తల్లిని నేరుగా కలిసింది. సూటిగా ఆమె కళ్లలోకి చూస్తూ ‘నేను ఎవరి బిడ్డని?’ అంటూ నిలదీసింది. ఇన్నేళ్లుగా ఏ నిజాన్ని అయితే దాచాలని మిరియం తపిస్తోందో అదే ప్రశ్న కూతురు కాథలీన్ నోటి నుంచి రావడంతో ఆమె నిర్ఘాంతపోయింది. తప్పించుకోలేని స్థితిలో నోరువిప్పింది. ‘35 ఏళ్లక్రితం ఆలివర్ బడ్తో నా జీవితం ముడిపడింది. అప్పట్లో బడ్ సిన్సియర్ సోల్జర్. రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్లోరిడా తరపున పోరాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాతి నుంచి తాగుడికి బానిసై, ఆర్మీకి దూరమయ్యాడు. ఆర్మీలో ఉంటేనైనా దారిలో పడతాడని భావించిన బడ్ పేరెంట్స్, అతణ్ణి ఒప్పించి, తిరిగి ఆర్మీకి పంపించారు. కానీ అతడిలో పెద్దగా మార్పు రాలేదు. నన్నూ, మీ అక్క మియాను కొన్నిరోజులు బాగా చూసుకునేవాడు, మరికొన్ని రోజులు పట్టించుకునేవాడే కాదు. మధ్యమధ్యలో వచ్చి తనకు నచ్చినంత కాలం ఉండి వెళ్లిపోయేవాడు. నా జీవితం గురించి ఆలోచించిన బడ్ పేరెంట్స్ నన్ను మరో జీవితం చూసుకోమని నచ్చజెప్పారు. అమెరికా, కోవింగ్టన్ లోని బార్టెండర్ చెట్ నోరిస్ని నాకు పరిచయం చేశారు. అతడు బాక్సర్. అతడితో స్నేహం తర్వాత బడ్తో విడిపోవాలనే ఆలోచన మొదలైంది. చెట్తో చనువు పెరిగింది. అతడి కారణంగా తల్లినయ్యాను. అప్పుడే నువ్వు నా కడుపులో పడ్డావు. నీ తండ్రి చెట్ అని నాకు తెలియగానే, ఆ శుభవార్తను అతడితో పంచుకున్నాను. అయితే విడాకుల కోసం బడ్ను కలవడానికి ప్రయత్నించినప్పుడు అతడు జైల్లో ఉన్నాడని తెలిసింది. సైన్యంలో ఉంటూ అక్రమ చర్యలకు పాల్పడటంతో అతణ్ణి జైల్లో పెట్టారు. మొత్తానికి జైల్లోనే అతణ్ణి కలసి విడాకులు కావాలని కోరాను. బడ్ అందుకు మొదట ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకున్నాడు కాని, మియాను తనకే పూర్తిగా ఇచ్చెయ్యాలని రూల్ పెట్టాడు. అందుకు నేను సిద్ధంగా లేను. దాంతో మీ నాన్న చెట్ను దూరం పెట్టాను. అతడికి నేను గర్భవతిని కాదని, ఏదో పొరబడ్డానని అబద్ధం చెప్పాను. అయినా ఫర్వాలేదు మనం కలిసి జీవిద్దాం అన్నాడు. అతడితో జీవితం కంటే మియాతో అనుబంధమే ముఖ్యమనిపించింది. అందుకే చెట్కి నిర్దాక్షిణ్యంగా బ్రేకప్ చెప్పేశాను. ఆ తర్వాత చెట్ ఏమయ్యాడో ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు, బడ్ జైలు నుంచి విడుదలైన కొన్ని నెలలకు నువ్వు పుట్టావు. నిన్ను తన బిడ్డే అనుకున్నాడు బడ్’ అని జరిగిందంతా చెప్పుకొచ్చింది మిరియం. అంతా విని అక్కడే కూలబడింది కాథలీన్ . కన్నతండ్రి కోసం ఆమె ఏడవడం మిరియం మనసును మెలిపెట్టింది. నీ అసలు తండ్రిని వెతకడానికి నేను సాయం చేస్తానని మాటిచ్చింది.కాథలీన్ పుట్టాక బడ్ కొన్నాళ్లు భార్యాపిల్లలతో ప్రేమగానే ఉన్నాడు. తాగుడు, చెడు వ్యసనాలు అతణ్ణి ఎక్కువ కాలం మంచివాడిగా ఉండనివ్వలేదు. దాంతో కాథలీన్కి 19 ఏళ్లు వచ్చేనాటికి మిరియం అతడికి విడాకులిచ్చింది. కానీ బడ్ ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆసుపత్రిలో చేర్పించి, ట్రీట్మెంట్ చేయించడంలో మిరియం బాధ్యతగా వ్యవహరించింది. ఏది ఏమైనా కాథలీన్ కన్నతండ్రి చెట్ అని చెప్పడంతో పాటు, గతంలో చెట్తో తాను దిగిన ఒక ఫొటోని కాథలీన్ చేతికి అందించింది మిరియం. పుట్టాక ఒక్కసారి కూడా కన్నతండ్రిని చూడలేకపోయానన్న అసంతృప్తి కాథలీన్ ని తీవ్రంగా వేధించింది. అతడి వివరాలతో ఎన్నో క్లాసిఫైడ్ ప్రకటనలు ఇప్పించింది. మీడియా సమక్షంలో పలు రివార్డులను ప్రకటించింది. తల్లి ఇచ్చిన ఏకైక ఫొటోను ఎన్నో ప్రింట్స్ వేయించి, విస్తృత ప్రచారం చేయించింది.1988లో ఈ నిజం కాథలీన్ కి తెలిసినప్పటి నుంచి, నేటికీ ఆమె తన తండ్రి సమాచారం కోసం వెతుకుతూనే ఉంది. ‘నీ గుర్తుగా నేను ఈ లోకంలో పుట్టాను నాన్నా!’ అని చెప్పడానికి తపించింది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, కాథలీన్ అనే కూతురుందన్న నిజం కూడా చెట్కి తెలియదు. ప్రస్తుతం చెట్కి 80 ఏళ్లు దాటి ఉంటాయని అంచనా. చెట్ 1940లో గోల్డెన్ గ్లోవ్స్ బాక్సర్ అనే సమాచారాన్ని కూడా కాథలీన్ వాడుకుంది. కానీ ఫలితం లేదు. మొత్తానికి ఒక తొందరపాటు, ఒక నిస్సహాయత, ఒక పేగుబంధం కలగలసి సృష్టించిన ఈ కథనంలో ఒక కూతురు తండ్రి కోసం పడిన రుణానుబంధం అంతవరకే కాబోలు. అందుకే చెట్ ఏమయ్యాడో నేటికీ మిస్టరీగానే మిగిలింది! ∙సంహిత నిమ్మన -
స్టయిలింగ్ క్వీన్ మాలినీ కార్తికేయన్
సినిమా కథల్లోని పాత్రలకు జీవం పోసేది నటీనటులే! అయితే ఆహార్యం, తీరుతెన్నులతో ఆ ప్రాతకు ఒక గ్రామర్, గ్లామర్ను క్రియేట్ చేసి, నటీనటుల పనిని తేలిక చేసేది మాత్రం స్టయిలిస్ట్లే! అలా తెర వెనుక ఆ పాత్రను అద్భుతంగా పోషిస్తున్న స్టయిలిస్ట్.. మాలినీ కార్తికేయన్.మాలినీ కార్తికేయన్కు సినిమాలంటే ఇష్టం. చిన్నప్పుడు తనే సినిమా చూసినా.. అందులోని క్యారెక్టర్స్ని ఫలానా పాత్ర ఇలా ఉంటే బాగుండు.. అలా ఉంటే బాగుండు.. అంటూ విశ్లేషించేది. ఆ అలవాటే ఆమెకు ఫ్యాషన్పై మక్కువ కలిగేలా చేసింది. 2018లో ఎన్ఐఎఫ్టీ చెన్నైలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, ఫ్యాషన్ డిజైనర్ ఏకా లఖానీ దగ్గర అసిస్టెంట్గా చేరింది. మొదట ‘చెక్క చీవంద వానం’ సినిమాకు పనిచేసింది. కాని టైటిల్ కార్డ్ పడింది మాత్రం ‘వానం కొండాడట్టుం’ చిత్రంతో! నటీనటులను అందంగా తీర్చిదిద్దే మాలిని నైపుణ్యాన్ని మెచ్చిన సినీ ఇండస్ట్రీ అనతికాలంలోనే ఆమె చేతినిండా ప్రాజెక్ట్స్ను పెట్టింది. ‘ఆదిత్య వర్మ’, ‘99 సాంగ్స్’, ‘డిమోంటి కాలని 2’ సినిమాలకు, ‘క్వీన్’, ‘జెస్టినేషన్ అన్నోన్’ సిరీస్లకు కాస్ట్యూమ్ డిజైనర్గా చేసింది. ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ కావటమే కాదు, అతిచిన్న వయసులోనే పెద్దపెద్ద స్టార్స్తో పనిచేసే అవకాశాన్ని దక్కించుకుంది. అదే ‘పొన్నియిన్ సెల్వన్ ’ సినిమా. దానికి ఆమె వార్డ్రోబ్ సూపర్వైజర్గా పనిచేసింది. ఆ సినిమా సెట్స్ మీదున్నప్పుడే కరోనా వ్యాపించింది. సంప్రదింపులు, నటీనటుల లుక్ టెస్ట్లు.. ఇలా ప్రతిదీ జూమ్లోనే! తన అసైన్మెంట్స్ అన్నిటినీ అలాగే షెడ్యూల్ చేసుకుంది మాలిని. కావలసిన కాస్ట్యూమ్స్ని కొరియర్ చేసింది. షూటింగ్ స్పాట్లోకి కొంతమందినే అనుమతించడంతో ఆ పనిభారాన్నీ మోసింది. అయితే దాన్నో కష్టంగా కాక.. ఒక అనుభవ జ్ఞానంగా మలచుకున్నానంటుంది మాలిని. ఆ సినిమాకు పనిచేయడం వల్లే ఆమెకు త్రిష, శోభితా ధూళిపాళకు స్టయిలింగ్ చేసే చాన్స్ దొరికింది. అంతేకాదు రమ్యకృష్ణ, ఐశ్వర్యా అర్జున్, ప్రియా భవానీ శంకర్ లాంటి సెలబ్రిటీలు కూడా ఆమెను స్టయిలిస్ట్గా అపాయింట్ చేసుకునే స్థాయికి వెళ్లింది. విజయ్, విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, సిద్ధార్థ్ వంటి మేల్ సెలబ్రిటీ స్ కూడా మాలిని స్టయిలింగ్లో మ్యాన్లీ లుక్తో అభిమానులను అలరించారు. ‘లావుగా ఉన్నా.. సన్నగా ఉన్నా.. వేసుకున్న కాస్ట్యూమ్స్ కంఫర్ట్గా ఉంటేనే అందం.. ఆత్మవిశ్వాసం! – మాలినీ కార్తికేయన్. -
బభ్రువాహన ప్రేత సంవాదం
పూర్వకాలం బభ్రువాహనుడు అనే రాజు ఉండేవాడు. మహోదయం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని, అతడు జనరంజక పాలన కొనసాగించేవాడు. ఒకనాడు ఆయన పరివారంతో కలసి వేట కోసం కీకారణ్యానికి వెళ్లాడు. అడవిలో ఒక లేడి కనిపించింది. బభ్రువాహనుడు ఆ లేడిని వేటాడాలనుకుని, దానిపై బాణం వేశాడు. అది బాణం నుంచి తప్పించుకుని, పరుగు తీసింది. దాన్ని ఎలాగైనా వేటాడి తీరాలనుకుని, బభ్రువాహనుడు ఆ లేడిని వెంటాడుతూ, తన పరివారానికి దూరంగా సాగిపోయి, ప్రేతాలు సంచరించే తావుకు చేరుకున్నాడు.అదే సమయానికి అక్కడ ఉండే ఒక ప్రేతం బభ్రువాహనుడి ముందు ప్రత్యక్షమైంది.‘మహారాజా! చాలా ఏళ్లుగా నేను ప్రేతరూపంలో ఉన్నాను. ఇన్నాళ్లకు రాజువైన నిన్ను చూడటంతో నా పాపాన్ని కొంత పోగొట్టుకున్నాను. నేను మరణించాక, నాకు ఉత్తరక్రియలు జరిపేవారు ఎవరూ లేక నేనిలా ప్రేతంగా మారాను. నువ్వు రాజువు. రాజు అంటే ప్రజలను రంజింపజేసేవాడు. కాబట్టి, నువ్వు నగరానికి వెళ్లిన తర్వాత నాకు ఉత్తరక్రియలు జరిపించు. బాగా బతికిన వాణ్ణి. అనాథలా ఇతరుల సొమ్ముతో ఉత్తరక్రియలు జరిపించుకోలేను. నా దగ్గర ఒక అతిలోకమణి ఉంది. ఇదిగో! ఆ మణి. దీనిని తీసుకో! ఇది చాలా విలువైనది. ఖర్చు నిమిత్తం ఇచ్చాననుకున్నా సరే, లేదా ఈ మణికి నువ్వు వారసుడివి అనుకున్నా సరే, నాకు అభ్యంతరం లేదు. ఇది తీసుకుని, నాకు ఉత్తరక్రియలు జరిపించడం మాత్రం మరువకు’ అని వేడుకుంది.తన ఎదుట ప్రేతం ప్రత్యక్షమవడంతోనే బభ్రువాహనుడు ఆశ్చర్యపోయాడు. ఆ ప్రేతం కోరిన కోరిక విన్న తర్వాత మరింతగా విస్మయం చెందాడు. రాజు కాబట్టి తన భావోద్వేగాలను బయటపడనివ్వకుండా, తొణకకుండా ఇలా అడిగాడు:‘ఓ ప్రేతమా! నువ్వు కోరిన కోరిక సబబుగానే ఉంది. నువ్వెవరివో నాకు తెలియదు. నీ పేరు, గోత్ర ప్రవరలు తెలియకుండా ఉత్తరక్రియలు జరిపించడం, కర్మకాండలు ఆచరించడం సాధ్యం కాదు కదా! అందువల్ల నువ్వు పార్థివదేహంతో జీవించి ఉన్ననాటి వివరాలు చెప్పు!’ అన్నాడు.బభ్రువాహనుడు అడిగిన దానికి ప్రేతం బదులిస్తూ, ‘మహారాజా! పార్థివదేహంతో నేను జీవించిన నాటి వివరాలు చెబుతాను, శ్రద్ధగా విను! వైదేశమనే నగరంలో వైశ్యుడిగా జన్మించాను నేను. నా పేరు దేవగుప్తుడు. జ్ఞానం తెలిసినది మొదలు నేను ఎన్నడూ ధర్మం తప్పలేదు. జీవించిన కాలమంతా నిత్య దేవతారాధనలు చేశాను. పేదసాదలకు దాన ధర్మాలు చేశాను. ఎన్నో శిథిలాలయాలకు జీర్ణోద్ధరణ చేశాను. నిర్మితాలైన శూన్యాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనలు చేసి, వాటిలో పూజాదికాలకు అన్ని ఏర్పాట్లు చేశాను. విప్రులకు అగ్రహారాలు ఇచ్చాను. సత్యాన్ని గౌరవించాను, ధర్మాన్ని ఆచరించాను. అయినా ఏంలాభం? మరణానంతరం ఇదిగో! ఇలా ప్రేతంలా మారిపోయాను’ అని చెప్పింది. ‘జీవించినంత కాలం ధర్మాచార పరాయణుడివైనా, ఎందుకిలా ప్రేతంగా మారిపోయావు?’ ఆశ్చర్యంగా అడిగాడు బభ్రువాహనుడు. ‘ఎందుకంటే, ఏం చెప్పను మహారాజా! నేను కన్నుమూసే వేళకు చెవిలో నారాయణ నామాన్ని పలికేవారు ఎవరూ లేరు. అవసాన క్షణాల్లో గొంతులో ఉద్ధరిణెడు తులసితీర్థం పోసేవారు లేరు. ప్రాణాలు విడిచిన తర్వాత నా దేహాన్ని దహనం చేసే వారసులు లేరు. కనీసం కన్నీరు కార్చే సోదరులు, దాయాదులు లేరు. ఉత్తరక్రియలకు నోచుకోని కారణంగానే నేనిలా ప్రేతంగా మిగిలిపోయాను. ఇదిగో! ఈ మణిని తీసుకో! నాకు ఉత్తరక్రియలు ఆచరించు’ అంటూ మణిని బభ్రువాహనుడి చేతిలో ఉంచిందా ప్రేతం.‘తప్పకుండా నీకు ఉత్తరక్రియలు ఆచరిస్తాను’ మాట ఇచ్చాడు బభ్రువాహనుడు.‘అయితే, నాదొక సందేహం. ఉత్తరక్రియలకు నోచుకోనివారికేనా, ఇతరులు ఎవరికైనా కూడా ఇలా ప్రేతత్వం సిద్ధిస్తుందా?’ అని అడిగాడు.‘ఇతరులకు కూడా సిద్ధిస్తుంది’ అని చెప్పసాగింది ప్రేతం.‘దేవతలు, బ్రాహ్మణులు, స్త్రీలు, బాల బాలికలు, వికలాంగులకు చెందిన ద్రవ్యాన్ని అపహరించిన వారికి ప్రేతత్వం సిద్ధిస్తుంది. పరస్త్రీలను బలవంతంగా చెరబట్టిన వారికి, బంగారాన్ని, నవరత్నాలను, తామర పువ్వులను దొంగిలించిన వారికి, యుద్ధంలో శత్రువుకు వెన్నుచూపి పారిపోయిన వారికి, తమకు ఉపకారం చేసిన వారికి అపకారం తలపెట్టిన వారికి తప్పనిసరిగా ప్రేతత్వం సిద్ధిస్తుంది’‘ప్రేతత్వ విముక్తి మార్గమేమిటో చెప్పు’ అడిగాడు బభ్రువాహనుడు.‘నియమబద్ధంగా ఉత్తరక్రియలు జరిపించడం, నారాయణ నామ పారాయణం, పూజ జరిపించడం ద్వారా ప్రేతత్వ విముక్తి కలుగుతుంది. ఉత్తరక్రియలలో బ్రాహ్మణులకు షడ్రసోపేతంగా సంతర్పణ చేయాలి. షోడశ దానాలు చేయాలి. ప్రేతత్వం పొందిన వారి విముక్తి కోసం ఎవరైనా పూనుకొని ఉత్తరక్రియలను నియమబద్ధంగా ఆచరించినట్లయితే, తక్షణమే ప్రేతత్వం తొలగిపోతుంది’ అని చెప్పింది ప్రేతం.ఈలోగా బభ్రువాహనుడి భటులు ఆయనను వెదుకుతూ అక్కడకు చేరుకున్నారు. వారి అలికిడికి ప్రేతం అదృశ్యమైపోయింది. నగరానికి చేరుకున్నాక, బభ్రువాహనుడు ఆ ప్రేతానికి ఉత్తరక్రియలు జరిపించాడు. ప్రేతత్వం నుంచి విడుదల పొందిన దేవగుప్తుడు ఊర్ధ్వలోకాలకు చేరుకున్నాడు.∙సాంఖ్యాయన -
యువ కథ : పారిజాతం
తెల్లవారుజాము పావు తక్కువ నాలుగవుతోంది. ఎంతసేపు పక్క మీద దొర్లినా నిద్ర పట్టడం లేదు. చోటు మారడం వల్లనేమో. పుట్టి, పెరిగి, పాతికేళ్లు గడిపిన ఇల్లే అయినా ఎందుకో నిద్ర పట్టడం లేదు. వీథి చివర టీ కొట్టు వరకు నడిచి వెళ్లొస్తే బావుండనిపించి బయటకొచ్చేశాను.ధనుర్మాసం.. చలి.. పారిజాతాలు!దారి మొత్తాన్ని ఆక్రమించేసిన పారిజాతాల్ని చూసి ఎన్నేళ్లు గడిచిపోయాయో సరిగ్గా గుర్తు లేదు. లెక్కపెట్టుకోవడం మానేసి కూడా చాలా సంవత్సరాలయ్యింది. ఈ మధ్య అసలేం గుర్తుండటం లేదు. నిమిషం క్రితం తీసి పెట్టిన కళ్లజోడు, నోట్లోనే నానుతూ ఉండే ఫోన్ నంబర్లు, అలవాటుపడిన దారులు కూడా మర్చిపోతున్నా. డాక్టర్ దగ్గరకు వెళితే ‘రోజుకు పదిమంది వస్తున్నారు సార్ మీవంటి పెద్దలు. అందరికీ అలై్జమర్స్ ఛాయలే.. ఎక్కువో తక్కువో! వృద్ధాప్య దశలో ఇవన్నీ మాములే’ అని డాక్టర్ కూడా సులువుగా చెప్పేశాడు. కాని జీర్ణించుకోవడం కష్టంగా మారింది.ఏవో రోజువారి పనులు, ఏటీఎమ్ పిన్ నంబర్లు లాంటివి మర్చిపోతే దిగుల్లేదు.. అవి మర్చిపోతున్నానన్న బాధ కంటే ఎక్కడ జ్ఞాపకాలన్నీ చెదిరిపోతాయోనన్న భయమే ఎక్కువౌతూ ఉంది. ఈ వయసులో అందరూ వాళ్ల జీవితాల్లో నచ్చిన కొన్ని క్షణాల్ని జ్ఞాపకాలుగా పదిలంగా దాచుకుని, గతాన్ని నెమరు వేసుకోవడం వల్ల సాంత్వన పొందుతారు. పెరుగుతూ వచ్చిన వయస్సుతో పాటే ఎన్నో జ్ఞాపకాలు నా లోపలే జీవిస్తూ ఉన్నాయి. అవి నా నుంచి జారిపోతే? అందుకే గతాన్ని తవ్వుకుంటూ ఊరికొచ్చాను. జీవం ఉన్నంత వరకు నాలోని జ్ఞాపకాలు నాతోనే ఉంటే బావుండనిపించి పెనుగులాడుతున్నాను. లేకుంటే ఇంత చలిలో లేవచ్చా? ఇలా మంచుకురిసే వీథుల్లో నడవొచ్చా? ఇదీ మంచికేనేమో. ఈ రాలి పడిన పారిజాత పూలు నన్ను చుట్టేసి వెనక్కి లాక్కెళ్తున్నాయి. జ్ఞాపకాలను తట్టి లేపుతున్నాయి.ఆ రోజు గుర్తుంది..‘ముంబై మెయిలొచ్చే టైమ్ అయ్యిందిరా.. మీ నాన్న దిగిపోయి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడ్రా’ అని దుప్పటి లాగేస్తూనే చెప్తూ ఉంది అమ్మ. వారాంతాల్లో నాన్న మద్రాసు నుండి వస్తే ఆయన్ని తీసుకురావడానికి సైకిల్ వేసుకుని వెళ్లాలి.. అది నా డ్యూటీ. ఎప్పుడూ సరే.. కాని ఈ చలికాలంలో కూడా! ముడుక్కుని పడుకుని గాఢ నిద్రలో ఉన్నాను. అమ్మకు కనికరం లేదు. ఆయన రాలేడా?గడియారం వైపు చూస్తే నాలుగవుతోంది. చెడ్డ కోపం వచ్చింది. విసురుగా లేచి గోడకి ఆన్చి పెట్టిన సైకిల్ని బయటకి తోస్తూ ఉంటే ‘మొహమైనా కడుక్కుని వెళ్లరా’ అంది అమ్మ మళ్లీ.‘ఈ చలికి జనాలు సస్తుంటే’ అని కసురుకుంటూ వచ్చేశాను.చలికి గడ్డకట్టుకుపోయినట్టుంది సైకిల్. ఎక్కి తొక్కగానే కిర్రుమని ఆగిపోయింది. చలికి కాళ్ల మీదున్న వెంట్రుకలన్నీ నిక్కబొడుచు కున్నాయి. నోట్లోంచి ముక్కులోంచి సన్నటి పొగ గాల్లో కలిసిపోయింది. జనసంచారం లేక వీథి మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడ పసిడి వర్ణంలో వెలుగుతున్న వీథి దీపాలు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి.‘ఈ టైమ్లో మనుషులందరూ హాయిగా ఎంత బాగా నిద్ర పోతుంటారు. నాకేంటి ఈ బాధ’ అని గొణుక్కుంటూ వెళ్తూంటే ఎవరో దూరంగా నేల మీద ఉన్న వాటిని ఏరుకుంటూ బుట్టలో వేసుకుంటున్నారు. కొరుక్కుతినే చలిలో నేల మీద ఏరుకోడానికి ఏముంటాయి? పైగా అక్కడ చింతచెట్లు కూడా లేవు అనుకున్నాను మనస్సులో. దగ్గరికి వెళ్లే కొద్ది ఏదో సువాసన ఎటు వైపు నుండి వస్తుందో అర్థం కాలేదు. దగ్గరగా వెళ్లా. ఎవరో అమ్మాయి బుట్ట చేత్తో పట్టుకుని కిందపడిన పారిజాత పువ్వుల్ని ఏరి అందులో వేసుకుంటూ ఉంది. పారిజాతాలకి పరిమళం ఉంటుందా? అది పూలదా.. అమ్మాయి ఒంటిదా? ఇంకాస్త దగ్గరగా వెళ్లా. ఆ అమ్మాయి ముడివేసిన జుట్టులోంచి నీటి బొట్లు పరికిణీ మీదుగా జారిపోతున్నాయి. మొహం సరిగ్గా గమనించలేదు కాని ఎర్రటి ముక్కుపుడక మాత్రం స్పష్టంగా కనిపించింది. అచ్చం పారిజాత పువ్వుకాడ లాగా.ఆ ఇల్లు దాటగానే సైకిల్ ఎక్కి తొక్కడం మొదలు పెట్టి రైల్వేస్టేషన్ దగ్గర ఆగి నిలబడ్డాను. నాన్న అప్పటికే ఎప్పటిలాగే బ్రౌన్ కలర్ షోల్డర్ బ్యాగ్తో నిలబడి ఉన్నారు. చలికి మఫ్లర్ బిగించి ఉన్నారు. తిరిగొచ్చేటప్పుడు ఎప్పటిలానే నాన్న సైకిల్ తొక్కుతుంటే వెనుక క్యారేజ్ మీద చలిగాలికి ముడుచుకుని కూర్చున్నాను బ్యాగ్తో. ఆ పువ్వులున్న చెట్టు దాటుకుని వెళ్తుంటే ఆ అమ్మాయి గుర్తొచ్చింది. ఎప్పుడూ చూడలేదు కాని చూడాలనిపించింది ఎందుకో మరి!ఆ రోజు తర్వాత అటు వైపుగా ఎప్పుడు వెళ్లినా నా కళ్లు ఆమె కోసం వెతికేవి. ఒకటి కాదు రెండు కాదు వారం రోజులు తిరిగా.. కనిపించనే లేదు. మళ్లీ తెల్లవారుజాము నాన్నని తీసుకుని రావడానికి సైకిల్ని తోసుకుంటూ వెళ్తూ ఉంటే పువ్వులు ఏరుకుంటూ కనిపించింది. తల్చుకుంటే ఇప్పటికీ కళ్లలో మెదులుతుంది తన రూపం. ఎరుపు రంగు వోణీ బంగారపు అంచు, తడి ఆరని జుట్టులో చిక్కుకున్న కుంకుడు పలుకులతో మెడ దగ్గర వరకూ వేలాడుతున్న కురులు. కళ్ల దగ్గర చెదిరిన కాటుక. కనుబొమ్మల మధ్య ఎర్రటి సింధూరం.మళ్లీ ఆ తర్వాత కనిపించలేదు ఎప్పటిలాగానే !పరమ బద్ధకస్తుడిని నేను. కాని ఆ రోజు నుండి అమ్మాయిని చూడ్డం కోసమే గంట కొట్టినట్టు పొద్దున్నే నాల్గింటికి లేవడం నా దినచర్యలో భాగమైంది. అటు వైపుగా చూస్తూ వెళ్లి వీథి చివర టీ కొట్టు దగ్గర కూర్చోవడం. ఆ అమ్మాయి నన్ను చూసిందో లేదో నా గురించి తెలుసో లేదో కూడా నాకిప్పటికీ తెలీదు. కాని నేనైతే రోజూ చూసేవాడ్ని. ఏ పరిచయం లేని ఆ అమ్మాయి సొంత మనిషిలా అనిపించేది. ఆ అనుభూతి నచ్చింది. అది ప్రేమో కాదో కూడా తెలీదు. ఆ అమ్మాయి గురించిన తలపులతో మనస్సంతా హాయిగా ఉండేది.పొద్దున్నే గుడిలో తిరుప్పావై మొదలయ్యేది. గోదాదేవి శ్రీరంగనాథుణ్ణే భర్తగా తలచి పెంచుకున్న అపారమైన భక్తి ప్రేమ అందరికీ తెలిసిందే. సాక్షాత్తు శ్రీరంగనాథుడే గోదాదేవి ప్రేమకి లొంగిపోయాడు. సాధారణ మానవులం మనమెంత! కొత్తగా ప్రేమ పుట్టుకు రావడంతో రెక్కలు మొలిచినట్టు అనిపించింది.ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నా లేకున్నా ఆ ఇంటిని చూసినా చాలనిపించి వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి గురించి తెలుసుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కాని అప్పుడు ఉన్న పరిస్థితులకి కనీసం పేరు కూడా తెలుసుకోలేకపోయా. నా వరకు మాత్రం తన పేరు పారిజాతం అనుకున్నా. పారిజాతం.. ఎంత బాగుంది! అసలు పేరు ఏమైనాగానీ ఆ తర్వాత మేము కలిస్తే ప్రేమ ఫలిస్తే ఒక్కటిగా బతికితే ఆజన్మాంతం పారిజాతం అనే పిలుద్దామనుకున్నా. ఈ ఊహలు ఇంకా ఎన్ని సాగేవోకాని ఆ సమయంలో నాన్న మరణం ఒక్కసారిగా కుదిపేసింది. ఇల్లంతా చీకటితో నిండుకుంది. నాన్న భుజాల వరకు ఉండేవాణ్ణి.. ఆ వయస్సులోనే బాధ్యతలన్నీ మోయాల్సి వచ్చింది. నా ప్రేమ చెప్పే అవకాశం లేక నాలోనే దాచేశాను. ఊరొదిలి వచ్చేసి పై చదువులు, ఉద్యోగాలు పూర్తయ్యేసరికి ఆ అమ్మాయికిపెళ్లై పోయిందని తెలిసింది. ఒంటరితనం దరి చేరింది. కొన్నాళ్లకి నేనూ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.ఆడవాళ్లు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఏం చేయడానికైనా సిద్ధపడతారని నా భార్యని చూశాకే అర్థమయ్యింది. సుఖదుఃఖాల్లో నాతోనే ఉంటూ ముందుకు నడిపించింది. కాని నా తొలిరోజుల పారిజాతాన్ని మాత్రం మర్చిపోలేదు. నా ప్రేమ ఒక జ్ఞాపకంలా మిగిలిపోయింది. పిల్లలు, వాళ్ల చదువులు పెళ్లిళ్లు ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. వాటితో పాటే భార్య మరణం కూడా. భార్య మరణానంతరం కోలుకోడానికి చాలా సమయం పట్టింది.మళ్లీ ఏదో తెలియని ఒంటరితనం.. దాంతో పాటుగా చెదిరిపోతున్న జ్ఞాపకాలు.. ఎన్ని జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోయినా పారిజాతం జ్ఞాపకం పోకూడదు. జివ్వుమని మరో వరుస చల్లగాలి వీచింది. వర్తమానంలోకి వచ్చిపడ్డాను. అప్పటిలాగే ఇప్పుడూ టీకొట్టు తెరిచి ఉంది.టీ కొట్టు దగ్గరకి వెళ్లాను. పెద్ద బెంచీ ఉండాల్సిన చోట కుర్చీలున్నాయి. పెద్దాయన మనవడు కాబోలు టీ కొట్టు నడిపిస్తున్నాడు. టీతో పాటు ఊరి విషయాలన్నీ చెప్పాడు. దూరంగా గుడిలోంచి తిరుప్పావై పఠనం వినిపిస్తూ ఉంది.‘ఈ వీథిలో అన్నీ మారిపోయాయి, ఆ పారిజాత చెట్టు’ తప్ప అన్నాను టీకొట్టు అతని వైపు చూస్తూ.‘ఆ ఇంట్లో ఉన్న ముసలావిడ చెట్టుని ఎన్నో ఏళ్లుగా కాపాడుతూ వస్తుంది సార్’ అన్నాడు నవ్వుతూ.మాటల్లోనే ఆ ఇంటి గేట్ తెరుచుకుని ఆమె బయటకి వచ్చింది. నెరిసిన జుట్టు, వంగిన శరీరంతో మెల్లగా వచ్చింది. నేల మీద రాలిన పువ్వుల్ని ఏరుకుంటూ ఉంటే నా గుండె గడగడ అదిరిపోయింది. అదే మనిషి. అదే చెట్టు. అవే పూలు. చెదిరిపోతున్న జ్ఞాపకం రివ్వున తిరిగి వచ్చి బలపడి పూర్తిగా స్పష్టమైనట్టు ఉంది నా స్థితి. ఎంతగా అంటే ఇక అలై్జమర్స్ నన్ను ఎంత మింగినా ఈ జ్ఞాపకం మాత్రం పోదు.‘పాపం.. భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. పిల్లలు రమ్మన్నా ఈవిడ ఇల్లు విడిచి వెళ్లదు. ఎవరో పని మనిషి తోడుంది అంతే’ అన్నాడు టీ కొట్టతను.‘ఆవిడ పేరు?’ అడిగాను పూలు ఏరుతున్న ఆమెను చూస్తూ ఉద్వేగంగా.టీకొట్టు అతను కొంచెం సిగ్గు పడుతున్నట్టు తల గోక్కున్నాడు.‘అరే.. ఎప్పుడూ తెలుసుకోలేదు సార్’ అన్నాడు.‘పర్లేదు.. నేను కనుక్కుంటాను’ అన్నాను, ఆమెను పలకరించడానికి నిశ్చయించుకుని లేస్తూ. ‘లాభం లేదు సార్’ అన్నాడు టీ అతను.‘ఏం?’‘ఆమెకేం గుర్తు లేవు.. ఆ పారిజాతం చెట్టు పారిజాత పూలు తప్ప’అలాగే కుర్చీలో కూచున్నాను.రాలిన పారిజాతాలను ఒక్కొక్కటిగా ఏరుకుని ఆమె మెల్లగా గేటు వేసుకొని లోపలికి వెళ్లిపోయింది. -
ఈవారం కథ: గుండ్లకమ్మ నీడలు
మేం నలుగురం ఊరి చివర నల్లవాగు మీద కట్టిన ఆ పాత కల్వర్టు దగ్గరకు చేరుకునేసరికి దూరంగా శ్మశానంలో అరగంట ముందు మాకు సెంటరులో కనపడిన శవయాత్ర తాలూకు మనుషుల గుంపు కనపడింది. కల్వర్టుకి, శ్మశానానికి సుమారు కిలోమీటరు దూరం. అప్పటివరకు లీలగా మా చెవుల్లో వినిపించిన చావు డప్పు అక్కడితో ఆగిపోయింది. శ్మశానంలో మనుషులని చూడగానే మామధ్య నిశ్శబ్దం అలముకుంది. అప్పటికి పడమటి సూర్యుడు పూర్తిగా వాలిపోయాడు. అందరం పాతకాలంనాటి పెచ్చులూడిపోయిన కల్వర్టు సిమెంటు గట్టుమీద కూర్చున్నాం. మా మధ్యలో రామబ్రహ్మం మేష్టారు.అసలీ సాయంత్రపు నడక ఎవరు మొదలుపెట్టారో తెలీదు. రామబ్రహ్మంగారే మొదలుపెట్టారంటారు. తరవాత చాలామంది సరదాగా వచ్చి మధ్యలో వెళ్ళిపోయారు. నేనొచ్చి సంవత్సరమైంది. ప్రతిరోజూ సాయంత్రంకల్లా సెంటరుకు చేరుకుంటాం. ఒక్కోసారి బ్రహ్మంగారు మాకంటే ముందే వెళ్ళిపోతారు. అందరం స్కూలు టీచర్లమే. దూరంగా కనపడుతున్న మనుషుల్ని చూస్తూ ‘మీరెప్పుడైనా శ్మశానానికి వెళ్ళారా?’ అడిగేరు బ్రహ్మంగారు.‘వెళ్ళకపోవడమేంటి.. చాలాసార్లు వెళ్ళాం. చుట్టాలెవరో చనిపోతే’ అన్నాడు రామప్ప. అతను మా స్కూల్లో కొత్తగా వచ్చిన సైన్సు టీచరు. పత్రికలలో కథలు, కవిత్వం రాస్తూంటాడు.అవును.. చూడబోతే అక్కడ మనిషిని కాల్చడమో, పూడ్చిపెట్టడమో జరగబోతావుంది! అదివరకెన్నడూ చూడనిది! చిన్నప్పుడు మా అమ్మమ్మ శవాన్ని చూశాను కానీ ఆరోజు మావాళ్ళు నన్ను శ్మశానానికి రానీయలేదు. ‘మీవాళ్ళెవరో చనిపోతేనో కాదు రామప్ప. చిన్నప్పుడు స్నేహితులతోనో.. ఒంటరిగానో..’మాలో ఎవరూ మాట్లాడలేదు.‘మీరు రచయితలు కదా.. ఆ వయసులో మీకెప్పుడూ శ్మశానం చూడాలని కుతూహలం కలగలేదా?’ అన్నారు మేష్టారు మళ్లీ రామప్పని ఉద్దేశించి.‘రచయితలైతే మాత్రం.. శ్మశానం చూడాలని ఎందుకుంటుంది చెప్పండి?’ అన్నాడు లెక్కల టీచరు కృష్ణారెడ్డి.‘ఎందుకుండదు? జీవితానికి అర్థం తెలుసుకోవాలనే ఆలోచన అక్కడే మొదలవచ్చు. చావుపుట్టుకలకి అర్థం ఏమిటి? చనిపోయాక మనిషి ఎక్కడికి వెళతాడు? బాల్యం, యవ్వనం, ప్రేమ, ముసలితనం అలా అనేక ఆలోచనలు అక్కడే పుడతాయి. మీరు అలా అంటున్నారు గానీ గోర్కీ చాలా చిన్నవయసులో తోటి స్నేహితులతో పందెంకట్టి ఒక రూబుల్ కోసం రాత్రంతా శ్మశానంలో గడిపాడు. ఆ శ్మశానంలో అతడి తల్లి సమాధి కూడా ఉంది.’ ‘ఆయన రూబుల్ కోసం శ్మశానంలో కూర్చున్నాడు సార్, కుతూహలంతో కాదేమో’ అన్నాను నేను.‘అయితేమాత్రం.. అది ఆయనకు గుర్తుండిపోయే అనుభవంగా మిగిలిపోయింది కదా!’బ్రహ్మం మేష్టారు తెల్లచొక్కా, పంచెతో చూట్టానికి తెలుగు పంతుల్లా కనపడతారు గాని ఆయన స్కూల్లో ఇంగ్లీషు టీచరుగా పనిచేసి రిటైరయ్యారు. ఆ ఇంగ్లీషు టీచరు కూడా తీరికవేళల్లో బొమ్మలు గీస్తుంటారు. ఆయన చెప్పుకుపోయారు.‘శరత్ రాసిన శ్రీకాంత్ నవలలో కూడా శ్రీకాంత్ తన స్నేహితులతో పందెం కట్టి ఒక రాత్రంతా శ్మశానంలో గడుపుతాడు. అక్కడ అతనికి భయంగొలిపే అనుభవాలు ఎదురౌతాయి. విచిత్రం ఏమంటే మర్నాడు మళ్ళీ ఎవరో పిలుచుకెళ్ళినట్లు తనకు తెలీకుండానే ఆ శ్మశానంలోకి నడుచుకుంటూ వెళ్తాడు శ్రీకాంత్. ఇది ఇంకోరకమైన అనుభవం.’‘మనలో ఎవరికైనా చిన్నతనంలో దయ్యాలు, భూతాలు మంత్రాలని భయం ఉంటుంది. ఆ భయం మనలోకి ఎలా వస్తుందో తెలీదు. అది ఎప్పుడు పోతుందో కూడా తెలీదు. వయసుతోపాటు పెరిగే ఎరుక చాలా భయాల్ని పోగొడుతుంది. లేదా ఇంకేదైనా కారణంచేత కూడా మనలో ఆ భయం పోవచ్చు. ఏదైనా సంఘటన జరిగి..’చుట్టూ చీకట్లు ముసురుకుంటుండగా శ్మశానంలో ఎర్రటి మంట వెలిగి తెల్లటి పొగ చెట్ల మధ్య నుంచి పైకి లేచింది. బ్రహ్మంగారు మననం చేసుకున్నట్టుగా ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ నిదానంగా చెప్పడం ప్రారంభించారు. ‘నేనూ చిన్నతనంలో అంటే పదిహేనేళ్ళ వయసులో మా ఊరి శ్మశానంలో అడుగుపెట్టాను. చాలా సంవత్సరాల పాటు ప్రతిరోజూ సాయంత్రం దాని పక్కనుంచే గుండ్లకమ్మ నదికి నడిచివెళ్ళేవాడిని. ఆ వయసులో నాకూ అందరిలానే దయ్యాలు, భూతాల భయాలుండేవి. కానీ ఒకరోజు శ్మశానంలో జరిగిన సంఘటనతో అవన్నీ పక్కకి జరిగిపోయాయి. నేను వయసుతో పాటు వచ్చే ఎరుక సంగతి చెప్పడం లేదు.’ఆడమనిషి మమ్మల్ని చూసి ‘నాయనలారా.. మీరు అల్లంత దూరం నుంచి పరిగెత్తుకు రావడం చూస్తా వుండాను. నీళ్ళలో నిండా తడిసిపోయారు. నా బిడ్డంటే మీకెంత ప్రేమ.. మీరూ నా బిడ్డల్లాంటి వాళ్ళే.. దూరంగా శ్మశానంలోని చెట్ల నుండి నల్లటి చుక్కలు ఎగిరినట్లు కాకుల గుంపు పైకి లేచింది. ఆయన చెప్పడం మొదలెడితే ఎవరైనాసరే చెవులొగ్గి వినాల్సిందే! ఏది చెప్పినా కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు.‘నేను హైస్కూలు చదివేరోజుల్లో శ్రీనివాసరావు అనే స్నేహితుడు ఉండేవాడు. వాడిని ‘శీనాయ్’ అని పిలిచేవాడిని. చదువులో మేమంత తోపులం కాదుగాని మిగతా పిల్లలకీ మాకు మధ్య కొంత తేడా ఉండేది. తేడా అంటే అది చందమామ, బాలమిత్రలాంటి పుస్తకాలు చదవడం వలన వచ్చింది. ఈ పుస్తకాలు చదవడానికి తోడు మేము ఖాళీ దొరికినప్పుడల్లా అటు శింగరకొండకో, ఇటు మేదరమెట్లవైపో ఈత పండ్లనీ రేక్కాయలకనీ ఊరవతల పోరంబోకు భూముల్లో తిరుగుతా ఉండేవాళ్ళం. ఇక ప్రతిరోజూ పొద్దుగూకే టయానికి గుండ్లకమ్మ ఒడ్డుకి పోతావుండేవాళ్ళం. వచ్చేటప్పుడు శీనాయి మంచినీళ్ళ కోసరమని ఖాళీ ఇత్తడి బిందె తీసుకొచ్చేవాడు. అద్దంకి నుంచి గుండ్లకమ్మ వెళ్ళడానికి మూడుదారులు ఉన్నాయి. మొదటిది ఊరి బయట చిన్న కాలవ ఒకటి దాటాక పొలాల మధ్య వేసిన రోడ్డు దాటుకుని ఎర్రమట్టి డొంకలోంచి గుండ్లకమ్మకి నడుచుకుంటూ పోవడం. అటువైపు పొరుగూర్ల నుంచి ఎవరైనా ఇటువైపు అద్దంకి రావాలంటే ఇది తప్ప మరో దారి లేదు. రావాలంటే నీళ్ళలోంచి నడుచుకుంటూ రావాల్సిందే. దాటేటప్పుడు మధ్యలో మెడలోతు నీళ్ళు. నీళ్ళలో నడవకూడదనుకుంటే ఏదైనా ఎడ్లబండి వచ్చేదాకా ఆగాలి. ఆడవాళ్ళు ఎడ్లబండి వచ్చేదాకా ఒడ్డునే కూర్చునేవారు. ఆదారి కాక, చాలా కాలానికి ఊరు దాటాక అద్దంకి నుంచి దర్శి వైపు వెళ్ళే రోడ్డుమీద వంతెన కట్టారు. ఈ రెండూ కాక మూడో దారి ఒకటి ఉంది. ఊరికి దక్షిణం వైపున దూరంగా ఉంటుందది. ఆ కాలిబాట గుండ్లకమ్మ దగ్గర కలిసేచోట నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ పక్కనే శ్మశానం. ఎప్పుడన్నా అక్కడ శవాలని పూడ్చిపెట్టడమో, కాల్చడమో చేస్తారుగాని మేమెప్పుడూ చూసింది లేదు. చీకటి పడ్డాక ఆ దారిలో ఎవరూ పోరు. లోపలవైపు చిల్లచెట్ల మధ్య సున్నం వెలిసిపోయిన పాతకాలంనాటి సమాధులు కనపడతాయి. గుండ్లకమ్మ వెళ్ళేటప్పుడు మేమెప్పుడైనా ఆ శ్మశానంలోకి నడిచేవాళ్ళం. ముళ్ళ కంపలు, జిల్లేడు చెట్లు, పగిలిపోయిన కుండ పెంకులూ, ఎముకలూ కనిపించేవి. వాటిని చూసి మాకు అనేక ఆలోచనలు కలిగేవి. చందమామ కథల్లాంటి రకరకాల దయ్యాల కథలు, మాంత్రికుల గురించి మాట్లాడుకునేవాళ్ళం. మాకు భయమైతే లేదుగాని దయ్యాలూ మా్రంతికులూ ఉంటారని నమ్మేవాళ్ళం. మేము ఒడ్డున కూర్చుని చూస్తావుండగానే మనుషులు పంచెలు పైకి ఎగలాక్కుని నది దాటి అవతలవైపు పడమట దిక్కున ఉండే తిమ్మాయిపాలెం వెళ్ళేవాళ్ళు. కొన్నిసార్లు రైతుల ఎడ్లబండ్లు నీళ్ళలోంచి అవతలికి వెళ్ళేవి. మధ్యలో లోతు దాటేటప్పుడు ఎద్దుల తలలు, బండి ముందువైపు కూర్చున్న మనిషి మాత్రం కనిపించేవాడు. మేము ‘తిమ్మాయిపాలెం’ పేరు వినడమేగాని గుండ్లకమ్మ అవతలి ఒడ్డుకు ఐదారు మైళ్ళుండే ఆ ఊరికి ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఇటువైపు నిలబడి అవతలికి చూస్తే ఒడ్డు నుండి ఒక అరమైలుదాకా అంతా ఒండ్రుమట్టి, ఇసక. ఆ పైన రెల్లు దుబ్బు, చిల్లచెట్లు ఆపైనంతా ఎటుచూసినా పోరంబోకు భూమి. రకరకాల వరుసల్లో దట్టంగా సరివిచెట్లు కనపడేవి. ఎక్కడపడితే అక్కడ పొడవాటి తాటిచెట్లు. ఆ తరవాత దూ..రం..గా.. భూమీ ఆకాశం కలిసే ఆకుపచ్చ అడవి మధ్య ఒకచోట గుండ్రంగా ఎవరో నిలబెట్టినట్లుగా నల్లగా ఎత్తైన తాటిచెట్లు. ఆ తాటి చెట్ల తలల మధ్య ఆకుపచ్చ, నీలం కలగలిసి బూదరబూదరగా కనపడేది. అక్కడేముందో తెలిసేదికాదు. శీనాయికీ నాకూ ఒక్కసారన్నా అవతలి ఒడ్డుకు వెళ్ళి ఏముందో చూడాలని అనిపించేది. మేం ఎప్పుడు వెళ్ళినా ఈతపండ్ల కోసం అద్దంకికి ఉత్తరాన ఉండే శింగరకొండకో, దక్షిణంవైపు మేదరమెట్లకో నడిచి వెళ్ళేవాళ్ళమే కానీ గుండ్లకమ్మ దాటుకుని అవతలి ఒడ్డుకు ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఎప్పుడన్నా పారే నీళ్ళలో మునకలేస్తున్నప్పుడు శీనాయ్గాడితో ‘ఒరేయ్.. తిమ్మాయిపాలెం దాకా కాకపోయినా కనీసం ఆ తాటితోపు వరకయినా వెళ్ళొద్దాంరా’ అనేవాడిని.ఒక అదివారంనాడు గుండ్లకమ్మ ఒడ్డుకెళ్ళి ఒక్కణ్ణే కూర్చున్నాను. అప్పటికి సూర్యుడు ఏటవాలుకి దిగినా ఎండ ఇంకా నులివెచ్చగా ఒంటికి గుచ్చుకుంటూ ఉంది. నేను చూస్తుండగానే ఎద్దులబండి ఒకటి నీళ్ళలోకి దిగింది. రైతు ఎవరో అద్దంకిలో పని ముగించుకుని తిమ్మాయిపాలెం వెళుతున్నాడు. బండి కాస్తంత ముందుకు పోగానే వెనకవైపు కూర్చున్న మనిషిని చూసి అదిరిపడ్డాను. వెనకాల చెక్కమీద కాళ్ళు కిందకేసి కూర్చున్న శీనాయి! వాడు నన్ను చూడగానే ‘రేయ్.. రారా.. బండెక్కు’ అన్నాడు.అప్పటిదాకా తీరుబాటుగా కూర్చున్న నేను వాడి పిలుపు వినగానే ఉలిక్కిపడి ఒక్కసారిగా నీళ్ళలోకి పరుగెత్తి ఎద్దులబండి వెనకాల ఎగిరి కూర్చున్నాను. బండి కుదుపుకి రైతు వెనక్కితిరిగి చూశాడు. బళ్ళు నీళ్ళలోంచి వెళ్ళేటప్పుడు మనుషులు వెనకాల ఎక్కడం వాళ్ళకి అలవాటే. శీనాయి వచ్చే దారిలోనే ఎక్కడో ఎక్కి కూర్చున్నట్లున్నాడు. బండి లోతుకు దిగేకొద్దీ మా అరికాళ్ళకు చల్లగా నీళ్ళు తగలసాగాయి. మొదట పాదాలు.. ఆ తరవాత నిదానంగా నీటిమట్టం పెరుగుతూ మోకాళ్ళు.. చివరికి నేను కూర్చున్న చెక్కమీదికి నీళ్ళు వచ్చి నా నిక్కరు కిందవైపు తడిసిపోయింది. మందువైపు చూస్తే ఎద్దుల మూతుల దాకా వచ్చాయి నీళ్ళు. పంచె తడవకుండా రైతు ముందువైపు నిటారుగా నిలబడి ఉన్నాడు. కొంచెం దూరంపోయాక నీటిమట్టం మళ్ళీ తగ్గసాగింది. ఒడ్డు దగ్గర పడ్డాక బండి నీళ్ళలో ఉండగానే ఇద్దరం కిందకి దూకేశాం. అక్కడ ఒడ్డున నిలబడి చూస్తే ఇరువైపులా తాటిచెట్లున్న ఎత్తైన రోడ్డు కనపడింది. అక్కడికి దగ్గరలోనే ఉంటుందనుకున్న ఊరు పొలిమేర కనుచూపులో కూడా లేదు. ఆ కనపడే రోడ్డువైపు కాకుండా మరోవైపు నడవడం మొదలుపెట్టాం. అది దుక్కిదున్ని సేద్యం చేసే నేల కాదు. ఎటుచూసినా అడ్డదిడ్డంగా పెరిగిన చిల్ల చెట్లు, పల్లేరు కాయలతో ముళ్ళ పొదలు, మట్టిదిబ్బలతో ఎగుడుదిగుడు నేల. దారిపొడుగునా పచ్చగా పెరిగిన పసిరిక గడ్డిలో రాలి ఎండిపోయిన తాటి ఆకులు, జిల్లేడు మొక్కలు, కొన్నిచోట్ల మనిషెత్తు పెరిగిన జపా¯Œ తుమ్మచెట్లు తప్పితే మరింకేంలేదు. చివరికి తాటివనంలా కనిపిస్తున్న చోటు చేరేసరికి అదంతా పోరంబోకు భూమిలో చెదురుమదురుగా పెరిగిన తాటిచెట్లు. విసుగుపుట్టి ఒకచోట మొదలు నరికి ఒరిగిపోయిన తాటిచెట్టు మీద కూర్చున్నాం.తలెత్తి చూస్తే మళ్ళీ మా చుట్టూ తలలెత్తుకుని నిలబడిన తాటిచెట్లు. మా వెనక ఏటవాలుకు దిగిన సూర్యుడి పసుపురంగు ఎండ. అప్పటిదాకా ఎండలో ఆవిర్లు గక్కిన గాలి నెమ్మదిగా చల్లబడుతూ ఉంది. మాముందు నల్లటి పికిలిపిట్ట కొత్తవారిని చూసి ఆ కొమ్మకూ ఈ కొమ్మకూ ఊరికూరికే హైరానా పడతావుంది. మాకు కొద్ది దూరంలో మందనుంచి తప్పిపోయిన గేదె మోర వంచి తదేకంగా గడ్డి పెరుక్కుంటావుంది. శీనాయి దిగ్గున లేచి ‘ఒరేయ్ అక్కడ ఎవరో మనుషులు కనిపిస్తున్నార్రా’ అన్నాడు.లేచి నిలబడి చూశాను. అక్కడినుండి చూస్తే దూరంగా అద్దంకివైపు గుండ్లకమ్మ అవతలి ఒడ్డు కనబడతావుంది. ఎండ పొడకు మెరుస్తున్న నీటి ప్రవాహం .. ఆ తరువాత తీరపుగట్టు, ఆపైన ఎత్తుగా ఎర్రటి మట్టి.. అక్కడ ఆకుపచ్చచెట్లలో లీలగా అక్కడక్కడా పైకి లేచిన తెల్లటి గోరీలు.. వాటి మధ్య నలకల్లా మనుషులు కనబడ్డారు. కొన్ని క్షణాలు అక్కడే నిలబడి వాళ్ళని చూస్తుండిపోయాం. ఉన్నట్టుండి శీనాయి..‘ఒరే.. ఎవరో చనిపోయార్రా.. అందుకే ఆ జనం’ అన్నాడు.అవును.. చూడబోతే అక్కడ మనిషిని కాల్చడమో, పూడ్చిపెట్టడమో జరగబోతావుంది! అదివరకెన్నడూ చూడనిది! చిన్నప్పుడు మా అమ్మమ్మ శవాన్ని చూశాను కానీ ఆరోజు మావాళ్ళు నన్ను శ్మశానానికి రానీయలేదు. అవతల వాళ్ళని చూడగానే ఎలాగైనా అక్కడ జరిగేది చూడాలని అక్కడనుంచి లేచి గబగబా నడవడం మొదలుపెట్టాం. పరుగులాంటి నడక. నేలపై పిచ్చి మొక్కలు కాళ్ళకి గీరుకుంటున్నాయి. అడుగులు చిన్నపాటి గుంతలు, రాళ్ళురప్పలు, తుమ్మ ముళ్ళు ఎదురైనప్పుడల్లా తడబడుతున్నాయి. వేటినీ లెక్క చేయకుండా పరుగులాంటి నడక.. తాటివనం నుంచి గుండ్లకమ్మ ఒడ్డుకు వచ్చేసరికి ఒళ్ళంతా చెమటలు. నీళ్ళలోకి దిగి గబగబ అడుగులు వేస్తుంటే తపతపమని నీళ్ళు పైకి చిమ్మి మొహాల మీద పడ్డాయి. మోకాళ్ళదాకా వచ్చాక నీళ్ళు కాళ్ళకి ఎదురీదుతున్నాయి. ఇంకాస్త లోపలికి నీళ్ళలో సంకలదాకా వచ్చాక అడుగులు ముందుకు వెళుతుంటే ప్రవాహం పక్కకి నెడతావుంది. మరింత ముందుకు వెళ్ళాక నీటిమట్టం తగ్గినచోట గబగబా అడుగులు వేస్తుంటే అడుగున పాచిపట్టిన రాళ్ళు పాదాలకు తగులుతున్నాయి. బొటనవేళ్ళు రాళ్ళల్లో గుదిగుచ్చి ఒక్కొక్క అడుగు బలంగా వేసుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళాం. అప్పటికి బట్టలు పైదాకా పూర్తిగా తడిసిపోయాయి.ఒక్క ఉదుటున శ్మశానంలో వచ్చిపడ్డాం. ఒక గోతి చుట్టూ నిలబడిన నల్లటి మనుషులు కనపడ్డారు. అస్తమించే సూర్యుడి లేత పసుపురంగు ఎండ ఆచ్ఛాదనలేని నల్లటి మనుషుల శరీరాల మీద పడతావుంది. వాళ్ళకి కొంత దూరంలో నేల మీద చాపలో చుట్టిన శవం. తల బయటికి కనిపిస్తా ఉంది. ఎవరో యువకుడు. పాతికేళ్ళుండొచ్చు. జుట్టంతా చెదిరి, తల ఒక పక్కకి ఒరిగి ఉంది. ఉండీ లేనట్లు మొలిచిన లేలేత గడ్డం వెంట్రుకలు. ఆ మసిబారిన గాజు కళ్ళు కలలు కంటున్నట్లుగా సగం తెరుచుకుని నిశ్చలంగా ఉన్నాయి. శవానికి రెండడుగుల దూరంలో ఒంటికి చుట్టుకున్న ముతక చీర కొంగునే భుజాల చుట్టూ శాలువాలాగా చుట్టుకుని ఒక నడివయసు ఆడ మనిషి నిలబడి ఉంది.మరోపక్క భూమిలో గసగసమని మనుషులు గొయ్యి తవ్వుతున్న చప్పుడు. లోపలనుంచి దోకుడు పారతో పైకి ఎగదోసిన మెత్తటి మట్టి గోతి చుట్టూ పేరుకుంటోంది. గొయ్యి తవ్వడం పూర్తయ్యాక ఇద్దరు మనుషులు గోతిలోంచి పైకి వచ్చారు.చివరికి అందరూ చూస్తుండగా చాపలో శవాన్ని బయటికి తీశారు. తల, కాళ్ళు ఏ దిక్కులో ఉండాలనే మంతనాలయ్యాక తలవైపు ఇద్దరు పాదాల వైపు ఇద్దరు పట్టుకుని శవాన్ని గోతిలో బోర్లా పడేశారు. లోపల నేల మీద దబ్బున శబ్దం వచ్చింది. నేను రెండడుగులు ముందుకు వెళ్ళి గోతిలోకి చూశాను. ఉత్త నేల మీద, బొక్క బోర్లా పడిన శవం, ఒక పక్కకి తిరిగిన తల.. అవే గాజుకళ్ళు. అక్కడ నిలబడిన వాళ్ళలో ఒక మనిషి ‘ఏంది గుడ్డతో కప్పెడతావా? అట్టా కుదర్దు. ఆ లుంగీ తీయాలి’ అన్నాడు. పొడవాటి కర్ర పట్టుకున్న మనిషి గోతిలోకి కర్రని పోనిచ్చి ఆ శరీరం మీద ఉన్న మాసిన లుంగీని పక్కకి జరిపాడు. అలా జరపడంతోటి నల్లటి అతడి వీపు కింద, సరిగ్గా నడుము మీద ఎర్రగా ఉన్న అరచేతి మందం ఎర్రటి పుండు కనిపించింది. పైనుండి పడిన అదురుపాటుకి నడుముకి కట్టిన గాజుగుడ్డ రక్తపు మరకల దూదితోపాటు చెదిరి నల్లటి ఒంటి మీద ఎర్రటి పుండు బయటపడింది. ‘ఎన్నాళ్ళబట్టి ఓర్చుకున్నాడో నా బిడ్డ. యియ్యాల్టికి నెల దినాలు. సివరికి ఈ మాయదారి పుండు పొట్టనబెట్టుకుంది’ అన్నది అక్కడ నుంచున్న ముసలమ్మ.‘ప్రార్థన చేసే వాళ్ళెవురూ లేరా ఇక్కడ?’ అన్నాడు అక్కడున్న నడివయసు మనిషి.‘ఊరుగాని ఊళ్ళో పేస్టరుని ఎక్కడనుంచి తెచ్చేది’ అన్నది ఆ ముసలి తల్లి.‘అయితే కడసారి కొడుకుని చూసుకో’ అన్నారెవరో ఆ గుంపులో వెనక నుంచి.ఆ ముసలామె ఒకడుగు ముందుకు వేసి గోతిలో బోర్లా పడిన శవాన్ని తేరిపార చూసింది. అలా చూడటంతోటే ఆమె కళ్ళనుంచి నీళ్ళు బొటబొటా కారాయి. ఆమె కొంగుతో చెంపల మీద నీళ్ళను తుడుచుకుంటూ వెనక్కి జరిగింది. అక్కడ నిలబడ్డ నలుగురు మనుషులు దోకుడు పారతో మట్టిని గోతిలోకి ఎగదోయసాగారు. నేను చూస్తుండగానే ఆ మనిషి మీద కాస్తకాస్త మట్టి పడుతూ చివరికి కనుమరుగయింది.అలా పైనుంచి మట్టి పడుతున్నంతసేపూ ఆ మనిషికి ఊపిరి ఆడటం ఎలా? అతడు ఎలా లేవగలుగుతాడు. అయ్యో కాళ్ళు చేతులు కదిలించలేడు కదా. చనిపోయిన తరవాత మనుషులు చివరికి ఎక్కడికి వెళతారు? చివరికి ఏమవుతుంది? కొంత కాలానికి ఆ శరీరం అస్థిపంజరంలా మారిపోతుందేమో అన్న ప్రశ్నలు చుట్టుముట్టాయి. పక్కన జిల్లేడు పొదలో కపాలం దవడలు విప్పి నావైపే తదేకంగా చూస్తావుంది.గొయ్యిని పూర్తిగా మట్టితో పూడ్చాక ఇద్దరు మనుషులు మట్టిని దట్టంగా ఎగదొక్కి చివరికి గుర్తుగా ఎత్తైన నిలువుపాటి గుట్టను గోరీలాగా పారలతో చదును చేశారు. వాళ్ళంతా తమ పనిలో నిమగ్నమయి ఉండగా ఆ ఆడామె ఉన్నచోటునే నిలబడి శూన్యంలోకి చూస్తావుంది. ఆమె చెంపల మీద చారికలు ఇంకా తడారి పోలేదు.చివరికి అందరూ అక్కడ్నుంచి కదలబోతున్నంతలో ఆ ఆడమనిషి మమ్మల్ని చూసి ‘నాయనలారా.. మీరు అల్లంత దూరం నుంచి పరిగెత్తుకు రావడం చూస్తా వుండాను. నీళ్ళలో నిండా తడిసిపోయారు. నా బిడ్డంటే మీకెంత ప్రేమ.. మీరూ నా బిడ్డల్లాంటి వాళ్ళే.. వాడ్ని సూడ్డానికి ఎంత దూరం నుంచి వచ్చుండారు. మా మీద ఎంత ప్రేమ మీకు’ అని అంటా ముందుకు నడిచింది.ఆవిడ మాటలు మొదట నాకు అర్థం కాలేదు. ఆవిడ కొడుకు మీద మాకు ప్రేమ ఏమిటి? వాళ్ళెవురో మాకు తెలీదు. మేము ఆవిడ కొడుకుని చూట్టానికి రాలేదనీ, ఆ శ్మశానంలో కర్మకాండలు చూట్టానికి మాత్రమే వచ్చామనీ, అంతకు మించి మరేమీ కాదని ఆవిడ దగ్గరకెళ్ళి చెప్పాలనిపించింది. కానీ ఏమీ మాట్లాడలేక నిలబడిపోయాను. ఎందుకో సిగ్గనిపించింది. అది కూడా చెప్పడానికి మనసురాక ‘ఆవిడ ఎలాగనుకుంటే అలాగ అనుకోనిమ్మని.. ఆవిడ అలా అనుకుంటేనే బాగుందనుకున్నాను.మేమంతా శ్మశానం నుంచి బయటకు వస్తావుంటే ఆమె మాత్రం కొంచెం ఇవతలికి వచ్చాక ఒక జిల్లేడు చెట్టు మొదల్లో కూలబడింది. ఒక మేస్త్రీలాంటి మనిషెవరో కూలీలకు డబ్బు లెక్కచేసి వెళ్ళబోతా ‘ఇంకేవిటికి ఇక్కడ పెద్దమ్మా.. కొడుకు లేచొస్తాడని కూకుండావా? దబ్బునెళ్ళి మీవూరి బొస్సు పట్టుకో. చీకటి పడిపోతావుంది’ అని కాలిబాట పట్టాడు. ఆవిడ ఆయన చెప్పిన మాటలు వినిపించుకోకుండా అక్కడే కూర్చుని గుడ్ల నీరు కుక్కుకుంటా కుళ్ళికుళ్ళి ఏడుస్తావుంది. మేమిద్దరం ఆమెను దూరం నుంచి చూస్తా, అటు ఇటు తారట్లాడతా ఏం చేయలేక ఊరకుండిపోయాం. చీకటి పడ్డాక ఎవురి దారిన వాళ్ళు ఇళ్ళకు పోయాక ఆ రాత్రి నిద్ర పడితే ఒట్టు. కండ్లు మూసుకుంటే ‘నాయనలారా నా బిడ్డ మీద మీకెంత ప్రేమ..’ అంటూ చింకిచీర కట్టుకుని ఆ శ్మశానంలో గోరీల మధ్య నిలబడిన ఆ నల్లటి ఆడమనిషి మాటలే చెవుల్లో వినిపించాయి. చాలాకాలం ఆమెని మర్చిపోలేకపోయాను. ఆ తరవాత ఎప్పుడు గుండ్లకమ్మ వెళ్ళినా ఆ పక్కనే ఉండే ఆ శ్మశానంలోకి అడుగుపెట్టలేదు. అంతకుముందు భయపెట్టే శ్మశానం ఆ రోజు నుంచి మామూలుగా కనపడసాగింది. నా మనసులో ఏదో మాయపొర తొలగినట్లైంది. ఒక అనుభవం అలా అనేక ఆలోచనలని చెరిపేసింది.ఈడు పెరిగేకొద్దీ చావంటే దుఖమనీ అంతులేనివిషాదమనీ తెలిసొచ్చింది.బ్రహ్మం మేష్టారు చెప్పడం ముగించి మౌనంగా ఉండిపోయారు. మేము ఎన్నో సంవత్సరాల కిత్రం గుండ్లకమ్మ ఒడ్డున ఒక సాయంత్రంలోంచి ఇప్పటి దట్టమైన ఈ చీకటి లోకంలోకి వచ్చి పడ్డాం. మేష్టారి తెల్లటి జుట్టు చీకట్లో వెండి జరీలా మెరుస్తా ఉంది. మీసం లేని ఆయన నల్లటి మొహంలోని గీతలు అస్పష్టంగా కనబడుతున్నాయి.‘అయితే మేష్టారూ, మరణం అనేది ఒక రహస్యం కాదంటారా?’ అన్నారు కృష్ణారెడ్డిగారు ఉన్నట్లుండి తన మౌనంలోంచి బయటపడి.‘కాదని ఎవరన్నారు.. అది ఎవరూ తెలుసుకోలేని ఎప్పటికీ అంతుచిక్కని రహస్యమే..’ ‘అదిసరే.. ఆరోజు నుంచి మీకు దేవుడంటే నమ్మకం పోయిందన్నమాట’ అన్నాడు రామప్ప మధ్యలో కల్పించుకుని. ‘ఆ మాట నేను అనలేదే? దయ్యాలూ, భూతాలు అంటే భయం పోయిందని అన్నాను. దేవుడి మీద నమ్మకం పోయిందని చెప్పానా?’‘మరయితే అది కూడా మూఢనమ్మకమేగా మేష్టారూ?’ఆ మాటకి ఆయన గట్టిగా నవ్వి ‘నాది మూఢ నమ్మకమే. దాన్నలాగే ఉండనీ..’ అని కొంచెం సేపు ఆగి ‘మనిషి లోపల దయ్యం ఉంటుందన్నది నిజం. పాపాలు అందరిలోనూ ఉన్నాయి. అసలు ఉన్నదల్లా సైతానే. దానిని పోగొట్టడానికి మనం చేయాల్సిందల్లా దేవుడిని కనుక్కోవడమే. అంటాడు దోస్తయేవ్స్కీ’ అని ఇక చెప్పాల్సింది ఏదీ లేదన్నట్లు మేష్టారు లేచి నిలబడి పంచెకు అంటుకున్న దుమ్ము దులుపుకున్నారు.అందరం లేచి ఇంటిదారి పట్టాం. దూరంగా నల్లటి చీకటి మధ్య ఎర్రటి కాష్ఠంలో రగులుతున్న మంటలు చీకట్లోకి నాలుకలు చాపుతున్నాయి. -
భారత హాకీ హీరో
హాకీలో.. జట్టు విజయంలో డ్రాగ్ఫ్లికర్ పాత్ర ఎంతో కీలకం. పెనాల్టీలను గోల్స్గా మలచడానికి ఉండాల్సిన అసాధారణ నైపుణ్యం వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. సుదీర్ఘ కాలం హాకీని శాసించిన యూరోపియన్ టీమ్లు అత్యుత్తమ డ్రాగ్ఫ్లికర్లతో ఫలితాలు సాధించాయి. మన జట్టు కూడా ఒక దశలో జుగ్రాజ్ సింగ్, సందీప్ సింగ్లాంటి ఆటగాళ్లతో దూసుకుపోయింది. అయితే వీరిద్దరూ నిష్క్రమించిన తర్వాత మన టీమ్లో ఒకరకమైన స్తబ్దత ఆవరించింది. కొందరు ఆటగాళ్లతో చేసిన ప్రయోగాలు విఫలం కావడంతో.. భారత్ విజయాల్లో వెనుకబడిపోయింది. ఇలాంటి సమయంలో దూసుకొచ్చిన ఆటగాడు హర్మన్ప్రీత్ సింగ్. జూనియర్ స్థాయి పోటీల్లో సత్తా చాటి తన ప్రతిభను ప్రపంచానికి ప్రదర్శించిన అతను ఆ తర్వాత సీనియర్ టీమ్లోకి వచ్చి డ్రాగ్ఫ్లికర్గా తన బాధ్యతను సమర్థంగా నెరవేరుస్తున్నాడు. గత కొన్నేళ్లలో హర్మన్ ఆటతోనే భారత్ పలు కీలక విజయాలు సాధించింది. ఇందులో రెండు ఒలింపిక్స్ పతకాలు కూడా ఉండటం విశేషం. ఆటగాడిగానే కాదు గత రెండేళ్లుగా భారత జట్టు కెప్టెన్గా కూడా హర్మన్ తనదైన ముద్రతో జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. కెప్టెన్గా మిశ్రమ ఫలితాలతో..రెండేళ్ల క్రితం హర్మన్ప్రీత్ సింగ్ భారత హాకీ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో హర్మన్ప్రీత్ జట్టును సమర్థంగా నడిపించాడు. ఆ మెగా ఈవెంట్లో భారత్ స్వర్ణపతకం గెలుచుకోవడంతో పాటు పారిస్ ఒలింపిక్స్కూ అర్హత సాధించింది. దాంతో హర్మన్కు మంచి ప్రశంసలు లభించాయి. అయితే కొద్ది రోజులకే వరల్డ్ కప్ రూపంలో మరో సవాలు వచ్చిపడింది. పరిస్థితి ఒక్కసారిగా ప్రతికూలంగా మారిపోయింది. సొంతగడ్డపై పేలవ ప్రదర్శనతో జట్టు క్వార్టర్ ఫైనల్కు ముందే నిష్క్రమించింది. 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో హర్మన్ నాయకత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ఒలింపిక్స్ పతకాన్ని అందించి..వరల్డ్ కప్లో జట్టు ఓడినా నిజానికి ఆ ఏడాదంతా హర్మన్ ప్రదర్శన చాలా బాగుంది. 33 మ్యాచ్లలో అతను 42 గోల్స్తో సత్తా చాటాడు. ఇదే ప్రేరణగా అతను పారిస్ ఒలింపిక్స్కు సిద్ధమయ్యాడు. వరల్డ్ కప్ ఓటమి తర్వాత.. ఒక పెద్ద విజయం సాధిస్తేనే జట్టు స్థాయి నిలబడుతుందని, అందుకు కెప్టెన్గా తన వంతు పాత్ర పోషించాల్సి ఉందని హర్మన్ గట్టిగా నమ్మాడు. అతని కెప్టెన్సీలో భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఆ ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో అతను చెలరేగాడు. సహచరులూ హర్మన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. దాంతో పారిస్ క్రీడల్లో భారత్ కాంస్య పతకాన్ని అందుకొని సగర్వంగా నిలిచింది. 10 గోల్స్తో హర్మన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. వాటిల్లో ఆస్ట్రేలియాపై 1972 తర్వాత ఒలింపిక్స్లో గెలిచేందుకు ఉపకరించిన రెండు గోల్స్తో పాటు కాంస్య పతక పోరులో స్పెయిన్పై అతను సాధించిన రెండు కీలక గోల్స్ కూడా ఉండటం విశేషం. ఇదే ఫామ్ను ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో కూడా కొనసాగించి భారత్ను విజేతగా నిలిపాడు. అప్పుడు కూడా 7 గోల్స్తో అతను టాప్స్కోరర్గా నిలవడం విశేషం. సంగీతం నుంచి హాకీ వైపు..హర్మన్ప్రీత్ స్వస్థలం అమృత్సర్ సమీపంలోని టిమ్మోవాల్. వ్యవసాయ కుటుంబం. హర్మన్కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే బాగా ఇష్టం. ఊర్లో జాతర మొదలు ఎక్కడికి వెళ్లినా హార్మోనియం లేదా మరేదైనా సంగీత పరికరాన్ని కొనిపెట్టమని పోరు పెట్టేవాడట. హర్మన్ వాళ్ల నాన్న సరబ్జిత్ సింగ్ కూడా కొడుకు కోరికను ఎప్పుడూ కాదనలేదు. ఆ సంగీతపరికరాలను వాయిస్తూ తనకు నచ్చిన పాటలు పాడుకుంటూ మైమరచిపోయేవాడు. అయితే స్కూల్లో పీఈటీ టీచర్ హర్మన్ను మార్చాడు. పాటలు గీటలు జీవితంలో పనికొచ్చేవి కావు.. ఏదైనా ఆటలోకి ప్రవేశించు, భవిష్యత్తు బాగుంటుందంటూ సూచించాడు. అంతేకాదు అప్పటికే భారత హాకీలో దిగ్గజాలుగా నిలిచిపోయిన పలువురు పంజాబ్ ఆటగాళ్ల గురించి వివరించి అతనిలో స్ఫూర్తి నింపాడు. దాంతో పదేళ్ల వయసులో హర్మన్ చేతిలోంచి హార్మోనియం పెట్టె పోయి హాకీ స్టిక్ వచ్చింది. స్కూల్లో సాధనతోనే సరిపెట్టకుండా హర్మన్ను పూర్తిస్థాయి ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు తండ్రీ సిద్ధమైపోయాడు. ఫలితంగా పంజాబ్లోని ప్రముఖ శిక్షణా కేంద్రం సుర్జీత్ సింగ్ అకాడమీలో అతడిని చేర్పించాడు. అక్కడే హర్మన్ ఆటగాడిగా రాటుదేలాడు. హర్మన్ డ్రాగ్ఫ్లికర్గా రాణించడం వెనుక ఆసక్తికర నేపథ్యం ఉంది. చిన్న వయసులోనే పొలాల్లో అతను ట్రాక్టర్తో వ్యవసాయం చేస్తున్నప్పుడు బలమైన గేర్ రాడ్ను పదేపదే వాడాల్సి వచ్చేది. దాంతో అతని భుజాలు మరింత బలంగా మారాయి. అదే డ్రాగ్ఫ్లికింగ్లో ఉపయోగపడిందని కోచ్లు చెబుతారు. సాధన సమయంలోనూ సాధారణ బంతి కంటే బరువైన బంతులతో హర్మన్ ప్రాక్టీస్ చేయడం కూడా అతని సాఫల్యానికి మరో కారణం. తిరుగులేని కెరీర్..భారత జూనియర్ జట్టులో 15 ఏళ్ల వయసులో మొదటిసారి స్థానం దక్కిన తర్వాత హర్మన్ప్రీత్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. యూత్ టోర్నీ సుల్తాన్ జౌహర్ కప్లోనే 2014లో 9 గోల్స్ కొట్టి భారత్ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత భారత జూనియర్ జట్టు ఆసియా కప్ను, వరల్డ్ కప్ను గెలుచుకోవడంలో కూడా హర్మన్ కీలక పాత్ర పోషించాడు. సహజంగానే ఈ ప్రదర్శనలు అతడిని సీనియర్ టీమ్లోకి ఎంపికయ్యేలా చేశాయి. 2015లో 19 ఏళ్ల వయసులో హర్మన్ మొదటిసారి జపాన్పై భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గత తొమ్మిదేళ్లుగా ఇంతింతై వటుడింతై అంటూ తన ఆటకు మెరుగులు దిద్దుకుంటూ ఇప్పుడు టీమ్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. సుదీర్ఘ కెరీర్లో హర్మన్ ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించాడు. టీమ్ సభ్యుడిగా అతను 2 ఒలింపిక్స్ పతకాలు, 2 చాంపియన్స్ ట్రోఫీ పతకాలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఆసియా కప్, ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, జూనియర్ వరల్డ్ కప్లలో అతను భాగస్వామి కావడం విశేషం. మూడుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా అంతర్జాతీయ హాకీ సమాఖ్య అవార్డునూ అందుకున్నాడు. -
తరతరాల చరిత్రకు ఆలవాలం
టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ తరతరాల చరిత్రకు ఆలవాలం. కేవలం ఇది టాటా కుటుంబ వ్యాపార చరిత్రకు మాత్రమే కాదు, దేశ స్వాతంత్య్రపూర్వ ఆర్థిక, రాజకీయ చరిత్రకు, స్వాతంత్య్రానంతర అభివృద్ధి చరిత్రకు కూడా ఆలవాలం. చారిత్రక ఆనవాళ్లను భద్రపరచి, తర్వాతి తరాలకు అందించడంలో మన భారతీయులకు శ్రద్ధ కొంత తక్కువ. మన దేశంలోని పెద్దపెద్ద వ్యాపార సంస్థలు ఇందుకు మినహాయింపు కాదు. దేశంలోని తొలి వ్యాపార ఆర్కైవ్స్ను టాటా సంస్థ ప్రారంభించింది. టాటా గ్రూప్ సంస్థలకు దాదాపు ఒకటిన్నర శతాబ్దాలకు పైబడిన చరిత్ర ఉంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి, డెబ్బయి ఏడేళ్లు గడిచాయి. టాటా గ్రూప్ చరిత్ర స్వాతంత్య్ర భారత చరిత్రకు దాదాపు రెట్టింపు. ఆనాటి బ్రిటిష్ కాలంలో జెమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా తొలుత తండ్రి చేసే వ్యాపారానికి సçహాయంగా ఉంటూ వచ్చారు. తర్వాత 1868లో ఈ వ్యాపార సామ్రాజ్యానికి పునాది వేశారు. అప్పట్లో ఆయన రూ.21 వేల పెట్టుబడితో ఒక ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించారు. ఆ తర్వాత ఒక కాటన్ మిల్లును ప్రారంభించి, వ్యాపారాలను క్రమంగా విస్తరించుకుంటూ, 1874లో నాగపూర్లో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీని నెలకొల్పారు. బ్రిటిష్ రాజ్యంలో స్థానిక భారతీయుడు ఒకరు ప్రారంభించిన తొలి జాయింట్ స్టాక్ కంపెనీ ఇది. ఆనాటి నుంచి టాటా గ్రూప్ వ్యాపార ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. టాటా కుటుంబ వారసుల్లో మూడో తరానికి చెందిన జె.ఆర్.డి. టాటా ఈ చరిత్రను ఒక తరం నుంచి మరో తరానికి అందించడానికి, దేశ పౌరులకు అందుబాటులో ఉంచడానికి వీలుగా టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తొలుత 1991 జనవరిలో బాంబేలో దీనిని ఏర్పాటు చేశారు. తర్వాత 2001లో పుణేలోని సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన భవనంలోకి దీనిని తరలించారు. ఎంప్రస్ మిల్స్ నుంచి ఎయిర్ ఇండియా వరకుటాటా గ్రూప్ ప్రస్థానం ఎంప్రస్ మిల్స్ నుంచి ఎయిర్ ఇండియా వరకు రకరకాల రంగాల్లో కొనసాగింది. టాటా గ్రూప్ ప్రారంభించిన కొన్ని వ్యాపారాలు కారణాంతరాల వల్ల నిలిచిపోయాయి. ఇంకొన్ని చేతులు మారాయి. అయినా, టాటా గ్రూప్ వ్యాపార ప్రస్థానం దేశ పారిశ్రామిక రంగంలో తన ఉనికిని నేటికీ నిలుపుకుంటూ వస్తోంది. టాటా గ్రూప్ వ్యాపారాలకు సంబంధించి టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లో భద్రపరచిన ఎన్నో అరుదైన విశేషాలు నేటి తరానికి తెలియవు. స్వాతంత్య్రోద్యమ కాలంలో టాటాలు పోషించిన పాత్ర, స్వాతంత్య్రానంతరం దేశ ఆర్థికాభివృద్ధిలో పోషించిన పాత్ర నిరుపమానమైనవి. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడైన జెమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా నాగపూర్లో 1874లో ప్రారంభించిన సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో విక్టోరియా మిల్లును నెలకొల్పారు. బ్రిటిష్ రాణిగా విక్టోరియా 1877 జనవరి 1న భారత సామ్రాజ్ఞిగా పట్టాభిషిక్తురాలు కావడంతో ఈ మిల్లు పేరును ఎంప్రెస్ మిల్స్గా మార్చారు. కాలక్రమంలో ఈ కంపెనీ పరిధిలోకి మరో మూడు మిల్లులు చేరాయి. అవన్నీ కలిపి టాటా టెక్స్టైల్ మిల్స్గా పేరుపొందాయి. టాటా టెక్స్టైల్ మిల్స్ వ్యాపారం 1997లో నిలిచిపోయింది. జె.ఆర్.డి.టాటా హయాంలో టాటా గ్రూప్ 1932లో విమానయాన రంగంలోకి ‘టాటా ఎయిర్లైన్స్’ పేరుతో అడుగుపెట్టింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1953లో భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసి, దీని పేరును ‘ఎయిర్ ఇండియా’గా మార్చింది. ప్రభుత్వం 2000–01 కాలంలో ఎయిర్ ఇండియాను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. చివరకు 2022లో ఈ కంపెనీని తిరిగి టాటా గ్రూప్ కైవసం చేసుకోగలిగింది. ఈ చరిత్రకు సంబంధించిన ఆధారాలన్నీ టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లో భద్రంగా అందుబాటులో ఉంచడం విశేషం.మహాత్మాగాంధీకి తొలి విరాళంటాటా గ్రూప్ వారసులు నేరుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనకపోయినా, భారత స్వాతంత్య్రోద్యమానికి బాసటగా నిలిచారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా కొనసాగుతూ, భారత స్వాత్రంత్య్రోమానికి సన్నాహాలు చేస్తున్న కాలంలోనే 1909లో జెమ్షెడ్జీ టాటా చిన్న కొడుకు సర్ రతన్జీ టాటా ఆయనకు తొలి విరాళంగా రూ.25 వేలు పంపారు. అప్పట్లో అది చాలా పెద్దమొత్తం. టాటాల తొలి కంపెనీ పెట్టుబడి కంటే కూడా నాలుగువేల రూపాయలు ఎక్కువ. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమానికి సర్ రతన్జీ టాటా బాసటగా ఉండేవారు. గాంధీజీకి ఆయన 1910లో మరో రూ.25 వేలు, 1912లో మూడో విరాళం పంపారు. ఈ సంగతిని గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమ ప్రచార పత్రిక అయిన ‘ఇండియన్ ఒపీనియన్’లో రాసిన ఒక వ్యాసంలో ప్రస్తావించారు. గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చి, స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం చేపట్టారు. అనతికాలంలోనే దేశ ప్రజలు ఆయనను ‘మహాత్మా’ అని పిలువసాగారు. గాంధీజీ 1925లో జెమ్షెడ్పూర్ వచ్చారు. అక్కడి టాటా ఉక్కు కర్మాగారం కార్మికులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో దేశం పట్ల, దేశ ప్రజల పట్ల టాటాలు కనబరుస్తున్న నిబద్ధతపై ఆయన ప్రశంసలు కురిపించారు. గాంధీజీ చేపట్టిన స్వదేశీ ఉద్యమానికి జెమ్షెడ్జీ టాటా పెద్ద కొడుకు సర్ దొరాబ్జీ టాటా భార్య లేడీ మెహర్బాయి టాటా కూడా మద్దతు తెలిపారు. ఇందుకోసం 1919లో ఆమె స్వయంగా రాట్నంపై నూలు వడకడం నేర్చుకున్నారు. జె.ఆర్.డి.టాటా తండ్రి ఆర్.డి.టాటా కూడా గాంధీజీ నేతృత్వంలోని స్వాతంత్య్రోద్యమానికి మద్దతు పలికారు. స్వదేశీ ఉద్యమం కోసం ఆయన టాటా సంస్థ తరఫున లక్ష రాట్నం కుదురులను, ఇతర చేనేత సామగ్రిని పంపారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీ, నెహ్రూ, సరోజినీ నాయుడు, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, మహమ్మద్ అలీ జిన్నా తదితర జాతీయ నేతలు బాంబేలో టాటాలకు చెందిన తాజ్మహల్ పాలెస్ హోటల్లో తరచుగా సమావేశాలు జరుపుకొనేవారు.నెహ్రూ కోరికపై లాక్మే ప్రారంభంమన దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో సౌందర్య సాధనాలను తయారు చేసే కంపెనీలు లేవు. సబ్బులు, పౌడర్లు తప్ప మిగిలిన సౌందర్య సాధనాలు కావాలంటే విదేశీ ఉత్పత్తులపై ఆధారపడే పరిస్థితులు ఉండేవి. ఫలితంగా భారీ ఎత్తున విదేశీ మారకద్రవ్యం వీటి కోసం ఇతర దేశాలకు తరలిపోయే పరిస్థితి ఉండేది. విదేశీ మారకద్రవ్యం సౌందర్య ఉత్పత్తుల కోసం విదేశాలకు తరలిపోకుండా ఉండాలంటే, దేశంలో సౌందర్య సా«ధనాల తయారీ సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలని తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో జె.ఆర్.డి.టాటాను కోరారు. నెహ్రూ కోరిక మేరకు జె.ఆర్.డి.టాటా 1952లో తొలి స్వదేశీ సౌందర్య సాధనాల సంస్థగా ‘లాక్మే’ను ప్రారంభించారు. అప్పట్లో ‘లాక్మే’ అనే ఫ్రెంచ్ ఒపేరా ప్రపంచ ప్రసిద్ధి పొందడంతో జె.ఆర్.డి.టాటా తమ సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్కు ఆ పేరు పెట్టారు. లక్ష్మీదేవిని ఫ్రెంచ్లో ‘లాక్మే’ అంటారు. చాలాకాలం టాటా గ్రూప్లో ఉన్న ఈ బ్రాండ్ 1998లో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ చేతుల్లోకి చేరింది.విద్యా పరిశోధన సేవా రంగాల్లోనూ ముద్రజె.ఆర్.డి.టాటా దాదాపు అర్ధశతాబ్ద కాలం టాటా గ్రూప్ సంస్థలకు నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్ వ్యాపారాలకు వెలుపలి సేవలకు కూడా విస్తరించాయి. జె.ఆర్.డి.టాటా హయాంలోనే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా మెమోరియల్ హాస్పిటల్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్, నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫర్మింగ్ ఆర్ట్స్ వంటి సంస్థలు ప్రారంభమయ్యాయి. విద్యా పరిశోధన రంగాల్లో ఇవి నేటికీ ప్రతిష్ఠాత్మక సంస్థలుగా తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాయి. ఈ సంస్థల ఏర్పాటు కోసం జె.ఆర్.డి.టాటా చేసిన కృషికి సంబంధించిన వివరాలన్నింటినీ టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లో భావితరాల కోసం భద్రపరచారు. వీటిని పరిశీలిస్తే, ఒక్కో సంస్థ వెనుక ఉన్న సంకల్పం, వాటి ఏర్పాటు కోసం పడిన తపన అర్థమవుతాయి. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ పేరుతో ఇటీవలి కాలంలో కార్పొరేట్ సంస్థలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీపై ఎలాంటి నిర్బంధం, నిబంధనలు లేనికాలంలోనే టాటాలు సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించారు. స్వాతంత్య్రానికి మూడేళ్ల ముందే, 1944లో సేవా కార్యక్రమాల కోసం జె.ఆర్.డి.టాటా తన సొంత డబ్బుతో జె.ఆర్.డి.టాటా ట్రస్టును ఏర్పాటు చేశారు. తర్వాత కొంతకాలానికి కంపెనీలోని తన షేర్లు కొన్నింటిని, బాంబేలోని ఒక అపార్ట్మెంట్ను అమ్మేసి, ఆ డబ్బుతో పేద మహిళల స్వావలంబన కోసం తన పేరిట, తన భార్య పేరిట జె.ఆర్.డి.టాటా అండ్ థెల్మా టాటా ట్రస్టును ఏర్పాటు చేశారు. టాటా సంస్థల సుదీర్ఘ చరిత్రను నిక్షిప్తం చేసుకున్న టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లోని అరుదైన విశేషాలను ఎవరైనా సందర్శించవచ్చు. ఇది ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ను సందర్శించడమంటే, దేశ ఆర్థిక స్వావలంబన చరిత్రను సింహావలోకనం చేయడమే! -
కృత్రిమ మేధాజాలం వంటింట్లో మయాజాలం
‘రేపటికి పాల ప్యాకెట్ వేయించుకోవాలి రాత్రికి ఇడ్లీ పిండి నానబెట్టుకోవాలి రెండు రోజుల్లో జామకాయలు పాడైపోతాయి నాలుగు రోజుల్లో బియ్యం అయిపోతాయి’ఇవన్నీ మన అమ్మో, అమ్మమ్మో గుర్తుచేసే మాటలు కావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కిచెన్ అలర్ట్స్. ఇవే కాదు, ఏం తినాలి? ఏం తింటే మంచిది?తింటున్న ఆహారం ఎంతవరకు ఆరోగ్యకరం? ఇంట్లో ఏమేం కూరగాయలు మిగిలి ఉన్నాయి?వాటితో రేపు ఏం కూర చేసుకోవచ్చు? ఇలా ఎన్నో సలహా సూచనలు వినొచ్చు. మనం ఆఫీస్కి వెళ్లినా, ఔటింగ్కి వెళ్లినా, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నా, వినోదాల్లో మునిగి తేలుతున్నా వంటింటిని భద్రంగా చూసుకునే బాధ్యత ఇకపై ఏఐదేనట!∙సంహిత నిమ్మనప్రతి ఇంటికి వంట తప్పనిసరి పని. కట్టెల పొయ్యిలు, బొగ్గుల కుంపట్ల నుంచి గ్యాస్స్టవ్ల వరకు సాగిన వంటింటి ప్రస్థానం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. వంటిళ్లు ‘స్మార్ట్’గా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్లు, ఇండక్షన్ స్టవ్లకు కూడా తొందర్లోనే కాలం చెల్లిపోయే రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో (ఏఐ) పనిచేసే స్మార్ట్ పరికరాలు వంటిళ్లలోకి చేరుతున్నాయి. వీటిలో స్మార్ట్ స్టవ్లు, ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు సహా నానా రకాలు ఉంటున్నాయి. వంటింటి పనిని ఇవి మరింత సునాయాసం చేయనున్నాయి.రోజూ ఉదయాన్నే కిచెన్లోకి వెళ్లేసరికి, ‘హాలో మేడమ్/సర్! మీ వంటశాలకు స్వాగతం. ఈరోజు మీకు ఏం టిఫిన్ కావాలి? భోజనంలో ఏం స్పెషల్ కావాలి? డిన్నర్ ఏం ప్లాన్ చేయమంటారు?’ అంటూ అడిగి తెలుసుకుని మరీ వండిచ్చే సౌలభ్యం ఉంటే ఎంత బాగుంటుందో కదా? ఈ ఊహ అదిరింది కదా? కానీ ఫ్యూచర్లో దీన్నే నిజం చేయబోతుంది ఏఐ. అందుకు ఇప్పటికే రొబోటిక్ కిచెన్ మెషిన్స్ సాయంతో తొలి అడుగులు ప్రారంభమయ్యాయి.అంచెలంచెలుగా మనిషి సాధించిన ఆధునిక సాంకేతికతకు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తోడైంది. ఏఐతో ప్రపంచ ఊహాచిత్రమే పూర్తిగా మారబోతుంది. ఈ కృత్రిమ మే«ధ, మానవ మేధను తలదన్నే స్థాయికి ఎదుగుతోంది. ఇప్పటికే వైద్యరంగం నుంచి వాణిజ్యరంగం వరకూ ప్రతి రంగమూ ఏఐ అధీనంలోకి వచ్చేసింది. ఇక భవిష్యత్తులో ఏఐనే మీ వంటింటి మహారాణి కాబోతుందంటే నమ్ముతారా? నమ్మితీరాలి!అహో, అద్భుతం! అనుకున్న 3జీ, 5జీల కాలాన్ని మించిందే ఈ ఏఐ కాలం. ఏ విషయంలోనైనా తొందరపడి, ఆత్రం కనబరిస్తే, ‘తినకముందే రుచి దేనికి?’ అంటుంటారు పెద్దలు. కానీ తినబోయే ముందే రుచి చూపిస్తాననడం ఏఐ స్పెషాలిటీ. మనిషి ఊహలకు రూపాన్నిస్తూ, నిమిషాల్లోనే కళ్లప్పగించేలా మాయాజాలం చేయగలదు ఏఐ. త్వరలో ఏఐ రోబోలు ఇంటి మనుషులుగా మారి వండి వారుస్తాయి. షెఫ్గా, సర్వెంట్గా ఇలా రకరకాల పాత్రల్లో సేవలను అందిస్తాయి. ఆ సేవలు ఎలా ఉండబోతున్నాయి? కిచెన్ను ఏ దిశగా ఏఐ తీసుకెళ్తుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.సాధారణంగా వంటగదిలో కావాల్సిన ముఖ్యమైన యంత్రాలు నాలుగే నాలుగు రకాలు. ఒకటి: వండి వార్చేవి. రెండు: వంటకు కావాల్సిన పొడులను, గుజ్జులను సిద్ధం చేసేవి. మూడు: వండిన వాటిని నిల్వ చేసేవి. నాలుగు: వండిన పాత్రలను శుభ్రం చేసేవి. అయితే వండివార్చే వాటిలో ఓవెన్స్, కుకర్స్, స్టవ్స్, గ్రిల్స్, బ్రెడ్ అండ్ పిజ్జా మేకర్స్, కాఫీ అండ్ టీ మేకర్స్ ఇవన్నీ ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాగే వంటకు కావాల్సిన పదార్థాలను తయారు చేసేవాటిలో మిక్సీలు, చాపర్స్, గ్రైండర్స్, బ్లెండర్స్, జ్యూసర్స్ ఇవన్నీ లెక్కకొస్తాయి. ఇక వండిన వాటిని, వండని వాటినీ నిల్వ చేసేందుకు రిఫ్రిజిరేటర్, వంటపాత్రలను శుభ్రం చేయడానికి డిష్వాషర్ ఇవన్నీ లగ్జరీ కిచెన్కి అవసరమయ్యే యంత్రాలే! ఈ యంత్రాలన్నిటినీ ఏఐకి అనుసంధానం చేయగలిగితే, వంటింటిని రోబోటిక్ కిచెన్లా మార్చేయవచ్చు. అందుకు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సాధించిన విజయాలకు ఈ ఏఐ గాడ్జెట్స్ మచ్చుతునకలు. రానున్న రోజుల్లో ప్రపంచమంతా ప్రతి రంగాన్నీ ఏఐతో కలిపి చూడటం అనివార్యం కానుంది. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు తమ యూజర్స్కి ఏఐ సేవలను మిళితం చేసి, అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ను అందించడానికి ముందుకొస్తున్నాయి. అందులో భాగంగానే ‘థింక్యూ కేర్’ అనే యాప్తో ఎల్జీ స్మార్ట్ వర్షన్స్కి ఏఐను అనుసంధానం చేస్తోంది ఎల్జీ కంపెనీ. ఇక స్మార్ట్ ఎల్జీ గాడ్జెట్స్ వేటిని కొన్నా యాప్ సాయంతో ఏఐ సేవలను పొందవచ్చు. గాడ్జెట్ సేవల్లో అంతరాయాలను అంచనా వేయడానికి, నిర్వహణను మెరుగుపరచడానికి ఏఐ సహకరిస్తుంది. సాంకేతికతతో కూడిన అధునాతన జీవనశైలిని అలవాటు చేస్తుంది. వంటగదిని ఏఐ సాంకేతికతతో అమర్చుకుంటే, మొత్తం ఇల్లే ‘స్మార్ట్ హోమ్’లా మారిపోతుంది. హైటెక్ కిచెన్ గాడ్జెట్స్తో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ఏఐ మరింత బలోపేతం చేస్తుంది. ఇలానే చాలా కంపెనీలు తమ సొంత యాప్స్ను పరిచయం చేస్తూ, లేటెస్ట్ టెక్నాలజీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడిస్తున్నాయి.పాకశాస్త్రంలో ఏఐ ప్రవేశం కొత్త సవాళ్లకు నాంది అంటున్నారు కొందరు నిపుణులు. భవిష్యత్తులో వంటశాలలన్నీ ఏఐ వశమైతే.. డేటా గోప్యతకు భంగం వాటిల్లడం, ఉద్యోగ భద్రతకు భరోసా లేకపోవడం, వంటల తయారీలో మానవ ప్రాధాన్యం తగ్గడం, మనుషుల మధ్య ఆర్థిక, సామాజిక అంతరాలు పెరగడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తవచ్చని సామాజికవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆ సవాళ్లను ఏఐ అధిగమిస్తుందని కూడా చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నారు.సిగ్నేచర్ కిచెన్ సూట్స్ ట్రాన్సిషనల్ సిరీస్ ఓవెన్ ఈ ఓవెన్ లో కెమెరాలు అమర్చి ఉంటాయి. ఇది ఏఐ సాంకేతికతను ఏకం చేస్తూ, పని చేస్తుంది. వంట ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి అబ్జర్వేషనల్ అసిస్టెంట్గా పని చేయడంతో పాటు స్వయంగా వివిధ పదార్థాలను గుర్తిస్తుంది. వంటకాలను సూచిస్తుంది. ఇంట్లో వంట చేసేవారు వంటగదిలో కొత్త వంటకాలు, పదార్థాలు, పద్ధతులను ప్రయత్నించడానికి ఈ ఓవెన్ నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది. ఇది రోజువారీ వంట ప్రక్రియలను మెరుగుపరుస్తుంది. అలాగే జూన్ ఇంటెలిజెంట్ ఓవెన్ అనే మరో ఏఐ కిచెన్ గాడ్జెట్కి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ నడుస్తోంది. దానిలో 85 రకాల వంటకాలను గుర్తించే అంతర్నిర్మిత వ్యవస్థ ఉంది. ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేసుకోవడంతో దానిలో వంట చేసుకోవచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్తో అనుసంధానం చేసుకోవచ్చు.కుకింగ్ రోబోవంటను వేగవంతం చేయడం, రకరకాల రెసిపీలతో వండిపెట్టడమే లక్ష్యంగా చేసుకుని రూపొందిన ‘కోడీ 29’ కుకింగ్ రోబో ఆప్షన్ ్సని బట్టి 1500 వంటకాలను అందిస్తుంది. ఇది 21 రకాల మోడ్స్తో పని చేస్తుంది. అంతర్నిర్మితంగా ఉన్న డిస్ప్లేతో కృత్రిమ మేధస్సు సాయంతో ఇది చక్కగా యూజ్ అవుతుంది. ఫంక్షన్ ్స, పార్టీస్ ఉన్నప్పుడు ఈ రోబో భలే చక్కగా సహకరిస్తుంది. మల్టీఫంక్షనల్, స్మార్ట్ ఆప్షన్ ్సతో ఇది ఉపయోగపడుతుంది. హ్యాండ్స్–ఫ్రీ యూజర్లా ఆకట్టుకుంటుంది. వాయిస్ కమాండింగ్స్తో యూజర్ ఫ్రెండ్లీగా పనిచేస్తుంది.హెస్టన్ క్యూ స్మార్ట్ కుకింగ్ సిస్టమ్ఇది ఏఐతో అనుసంధానమైన పవర్డ్ పాన్. లేదా ఇండక్షన్ బర్నర్. ఇది ‘స్మార్ట్’ సాంకేతికతతో వంట ప్రక్రియను మెరుగుపరుస్తుంది. వంట ఎలా చేసుకోవాలో, ఏ పదార్థం ఎప్పుడు వేయాలో చెబుతూ, మనతోనే మరింత మహత్తరంగా వంట చేయిస్తుంది. వంట రానివారికి ఇది బెస్ట్ గైడ్గా నిలుస్తుంది. టెంపరేచర్, టైమ్ అడ్జస్ట్మెంట్లతో ఇది చక్కగా శ్రమ తెలియనీయకుండా పనిచేస్తుంది. వంటకాల కోసం ఇంటరాక్టివ్ వీడియోలను కూడా అందిస్తుంది. కొత్త పద్ధతులను నేర్చుకోవాలనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్ఇది స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ కోసం ఏఐ ఫీచర్లతో కూడిన స్మార్ట్ సామ్సంగ్ రిఫ్రిజిరేటర్. దీనిలో కెమెరాలు ఉంటాయి. అవి ఫుడ్ ఇన్వెంటరీని ట్రాక్ చేసి ఏవి ఎన్ని ఉన్నాయి? ఏవి నిల్వ ఉంటాయో, ఏవి ఉండవో కనిపెడుతుంటాయి. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్లతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాంతో ఈ రిఫ్రిజిరేటర్ కారణంగా చాలా ప్రయోజనాలుంటాయి. ఇది ఇంటి కిరాణా అవసరాలపై ఓ అవగాహన కల్పిస్తుంది.న్యూట్రిబుల్లెట్ బ్యాలెన్ ్స స్మార్ట్ బ్లెండర్ఈ డివైస్తో ఆరోగ్యకరమైన స్మూతీస్ను సులభంగా చేసుకోవచ్చు. వినియోగదారులకు సులభంగా సహాయపడటానికి ఏఐ పవర్డ్ న్యూట్రిషనల్ ట్రాకింగ్తో కూడిన బ్లెండర్ ఇది. దీనికి అంతర్నిర్మిత బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇందులో జ్యూస్ ఐటమ్స్ లేదా చట్నీలకు కావాల్సిన ఆహార పదార్థాలను జోడించేటప్పుడు, వాటికి సంబంధించిన పోషకాహారాల వివరాలను తెలియజేస్తుంది. ఫిట్నెస్ లక్ష్యంగా ఆహార ప్రాధాన్యాన్ని చెబుతుంది. తమ ఆరోగ్యానికి తగిన కేలరీలను తీసుకునే వారికి ఈ బ్లెండర్ చక్కగా ఉపయోగపడుతుంది.సీర్ పర్ఫెక్టా గ్రిల్ బార్బెక్యూ ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో పనిచేసే గ్రిల్ ఇది. ఆటోమేటెడ్ పద్ధతిలో చాలా రకాల రెసిపీలను సిద్ధం చేయగలదు. వంట ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి ఆన్ బోర్డ్ సెన్సర్లను, ప్రత్యేక సాంకేతికతను వినియోగిస్తుంది. ఆహారాలను మారినేట్ చేసి సిస్టమ్కి అందిస్తే సరిపోతుంది. గ్రిల్ రెండు వైపుల నుంచి అధిక ఉష్ణోగ్రతలను అందిస్తూ ఇన్ ఫ్రారెడ్ కుకింగ్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. స్వయంచాలక పద్ధతిలో ఆహారాన్ని వండడానికి అధునాతన సాంకేతికతను ఉపయోగించే ఈ గ్రిల్ ఏఐ ఆదేశాలతో చక్కగా పని చేస్తుంది.స్టెయిన్లెస్ స్టీల్ ఏఐ స్లో జ్యూసర్హురోమ్ ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్తో రూపొందిన ఈ ఏఐ స్లో జ్యూసర్.. చాలా అప్డేటెడ్ వర్షన్ లో పని చేస్తుంది. 200 వాట్ల శక్తిమంతమైన ఏఐ మోటార్తో సుదీర్ఘమైన వారంటీతో ఆకట్టుకుంటున్న ఈ గాడ్జెట్.. పల్ప్ కంట్రోల్ ఆప్షన్స్తో వినూత్నంగా ఉపయోగపడుతుంది. స్క్వీజింగ్ స్క్రూ 60 రిజల్యూషన్ తో, స్పిన్నింగ్ బ్రష్ నిమిషానికి 23 సార్లు తిరుగుతూ జ్యూస్ను అందిస్తుంది. కాస్త వంపు కలిగిన దీని ట్యాప్ నుంచి జ్యూస్ను గ్లాసులోకి లేదా పాత్రలోకి తీసుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్లో డిప్స్, చట్నీస్, స్మూతీస్, మిల్క్షేక్స్తో పాటు డ్రై మసాలాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ డివైస్లో జ్యూసర్ యూనిట్తో పాటు రెండు రకాల ఫిల్టర్స్, జ్యూస్ కంటైనర్, పల్ప్ కంటైనర్, క్లీనింగ్ బ్రష్లు, రెసిపీ బుక్ ఇలా చాలానే లభిస్తాయి.ఫుడ్ స్కానర్ఈ గాడ్జెట్, ఆహారాన్ని స్కాన్ చేసి ఏది తినడానికి పనికొచ్చేది, ఏది పనికిరానిది, ఏది పాడైపోయినది? ఏది ఇంకా నిల్వ ఉండే పరిస్థితుల్లోనే ఉంది? లాంటి ఎన్నో వివరాలను అందిస్తుంది. ఈ నువిలాబ్ ఏఐ ఫుడ్ స్కానర్ 3.0 వర్షన్ ఆహార వ్యర్థాలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు తగిన సూచనలను జారీ చేస్తుంది. ఈ స్కానర్ వినియోగించే యూజర్స్కి పోషకాహారానికి సంబంధించిన సలహాలను అందిస్తుంది. న్యూట్రిషనల్ హెల్త్కేర్కి ఏ ఆహారం సరైనదో తెలియజేస్తుంది.త్వరలోనే ఏఐ రోబో షెఫ్!మనిషి శ్రమను ప్రతి స్థాయిలోనూ తగ్గించడానికి రోబోల తయారీలో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పాఠాలు చెప్పే టీచర్ల దగ్గర నుంచి యుద్ధం చేసే సైనికుల వరకు ప్రతి రంగంలోనూ మనిషి కష్టానికి రీప్లేస్మెంట్ కావాలంటే, అది రోబోతోనే సాధ్యమన్నట్లుగా దూసుకునిపోతోంది టెక్నాలజీ. నిజానికి ఒక బరువైన వస్తువును ఒక చోట నుంచి మరోచోటకి తరలించడం ఒక పని. ఆమ్లెట్ లేక దోసెను పెనంపై వేసి, కాల్చడమూ ఒక పనే! పాలలో కాఫీ పొడి వేసి, కలిపి కాఫీ పెట్టడమూ ఒక పనే! అయితే మనిషి సామాన్యంగా చేయగలిగే ఈ పనులన్నింటినీ ఒక మరబొమ్మ నేర్చుకోవడమంటే మాటలు కాదు. అందుకోసమే శాస్త్రవేత్తలు.. మనిషికి, మెషిన్కి అనుసంధానంగా ఏఐని ఎంచుకున్నారు. సాధారణ పనులను ఏవిధంగా చెయ్యాలో ఇప్పుడు రోబోలు ఏఐ సాయంతో సులభంగా నేర్చుకోగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోబోలకు శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే ఓపెన్ స్టోర్ సిస్టమ్ని రూపొందించారు. మనిషి చేయగల సాధారణ పనులను ఓ డేటాలా మార్చి, దాన్ని వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రోబోలకు తెలియజేస్తూ వస్తున్నారు. దాంతో రోబోలకు దాదాపు ఇంటి పనులపై కనీస అవగాహన ఉందని, వీటికి చాలా అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని, ఆ శిక్షణతో ఏమాత్రం పరిచయంలేని వంటింట్లో కూడా రోబోలు అలవోకగా పనిచేసే స్థాయికి రూపాంతరం చెందుతున్నాయని అంటున్నారు. ఇక భవిష్యత్తులో ఏఐ రోబో వంటింటికి వస్తే, మనం వంటగదిలోకి అడుగుపెట్టాల్సిన పనే ఉండదు. హోటల్స్లో ఆర్డర్ ఇచ్చినట్లు మెనూ చూసుకుని, ఆర్డర్ ఇచ్చుకోవడమే! ఏఐనా మజాకా! -
మేకలకు కటకటాలు!
చట్టం ముందు మనుషులైనా, మేకలైనా సమానమే అనుకున్నారు అమెరికన్ పోలీసులు. పాదచారులను వెంబడించే ఆకతాయిల మాదిరి వాషింగ్టన్ నగర వీధుల్లో ఓ రెండు మేకలు హల్చల్ చేశాయి. స్థానికుల ఇళ్ల ముంగిళ్లలో పెంచుకున్న తోటల్లోకి చొరబడి చెట్ల ఆకులు, గడ్డి తినటం, పాదచారులను వెంబడించటమే కాకుండా, అడ్డు వచ్చిన వారిని కుమ్మేస్తూ నానా బీభత్సం సృష్టించాయి. ఈ మేకల ధాటికి బెంబేలెత్తిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న కారణంగా పోలీసులు ఆ రెండు మేకలనూ అదుపులోకి తీసుకుని, కటకటాల్లోకి నెట్టారు. అధికారులు వాటిని కింగ్ కౌంటీ యానిమల్ షెల్టర్కు తీసుకెళ్లి, వాటి యజమానిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. వాటి యజమాని ఎవరో తెలియలేదు కాని, ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మేకల అరెస్టు వార్తపై ఎంతోమంది ఫన్నీ కామెంట్స్ పెడుతుంటే, మరెంతోమంది జంతుప్రేమికులు మాత్రం ‘ఎవరైనా మూగ జీవులను జైల్లో పెడతారా?’ అంటూ మండిపడుతున్నారు. చెరలో ఉన్న ఆ రెండు మేకలనూ విడిపించుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ మేకలకు ఏం జరుగుతుందో చూడాలి మరి! ఆ రెండు మేకలకు చేసిన తప్పుకు జైలు శిక్ష పడుతుందో? లేక పోలీసులు సానుకూలంగా స్పందించి మేకలను విడుదల చేస్తారో? -
Social Media Star: మీథికా ద్వివేది
సింగర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. మీథికా పుట్టింది, పెరిగింది లక్నోలో. సంగీతం, భరతనాట్యంలో శిక్షణ పొందింది. స్కూల్ స్థాయి నుంచి పాటల పోటీల్లో పాల్గొని ప్రైజులు, అవార్డులు గెలుచుకుంది. 2021లో The Sound Blaze పేరుతో యూట్యూబ్ చానల్ను స్టార్ట్ చేసింది. ఆ ఏడే ఆమె పాడిన ‘కహో నా కహో’ ఎక్స్టెండెడ్ వర్షన్ వీడియో సాంగ్ 1.76 లక్షల వ్యూస్తో పెద్ద హిట్ అయింది. ఆ టాలెంట్ని మెచ్చిన అమెజాన్ ప్రైమ్ వీడియో మీథికాతో షార్ట్ వీడియోస్ చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. వాటిని ఇన్స్టాలో, యూట్యూబ్లో అమెజానే పోస్ట్ చేస్తుంటుంది. తన కళ్ల ముందు జరుగుతున్న విషయాలను వ్యంగ్య ధోరణిలో రీల్స్గా, షాట్స్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూపిస్తుంటుంది మీథికా. ఆమె ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ అకౌంట్స్కి పెద్దవాళ్ల నుంచి జెనరేషన్ ఆల్ఫా వరకు అందరూ అభిమానులే! అర్బాజ్ఖాన్, అనురాగ్ కశ్యప్, ప్రియంకా చోప్రా లాంటి సెలబ్రిటీలూ ఫాలోవర్సే! -
కంకాళాల కలకలం
అది 2009 ఫిబ్రవరి 2, ఉదయం 7 దాటింది. అమెరికా, న్యూ మెక్సికో రాష్ట్రంలోని, వెస్ట్ మేసాలో అల్బుకర్కీ ప్రాంతమంతా సందడిగా ఉంది. సమీపంలో నివాసముండే క్రిస్టీన్ రాస్ అనే అమ్మాయి ఎప్పటిలానే ఆరోజు ఉదయం తన పెంపుడు కుక్క రుకాను తీసుకుని వాకింగ్కి బయలుదేరింది. తిరిగి వచ్చేటప్పుడు రుకా నోట్లో మనిషి ఎముక చూసి క్రిస్టీన్ హతాశురాలై, వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది.వెస్ట్ మేసా అనే ప్రాంతం గురించి అప్పటి వరకూ ఆ దేశానికే కాదు, ఆ రాష్ట్రానికి కూడా పెద్దగా తెలియదు. ఆరోజు తర్వాత ప్రపంచమే ఉలిక్కిపడి వెస్ట్ మేసా వైపు చూడటం మొదలుపెట్టింది.రుసా తెచ్చిన ఎముక ఎక్కడిది? ఎవరిది? అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. అధికారుల దృష్టి సమీపంలోని విస్తారమైన మెట్ట ప్రాంతం మీద పడింది. న్యూ మెక్సికో, సౌత్ వ్యాలీలో బెర్నెలీయో కౌంటీకి ఉత్తరాన ఉన్న అరోయో అనే నదీ పరివాహక ప్రాంతమది. అయితే ఆ నది కొన్నేళ్ల క్రితమే ఎండిపోయింది. అలాంటి చోట ఎముక దొరకడంతో తవ్వకాలు మొదలయ్యాయి. తవ్వగా తవ్వగా ఓ అస్థిపంజరం దొరికింది. ఇంతలో ఆ పక్కనే మరో అనుమానాస్పదమైన గుంత దర్శనమిచ్చింది. వెంటనే క్రైమ్ టేప్స్ వేలాడదీసిన అధికారులు, తమ బలగాలను దించారు. ఇంతలో మరో అస్థిపంజరం దొరికింది. దాంతో చుట్టూ విస్తృతంగా తవ్వకాలు జరిపించారు. ఈలోపు మీడియా చుట్టుముట్టింది. అలా ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 11 అస్థిపంజరాలు దొరికాయి. అన్నీ ఆడవారివే! బాధితుల్లో 15 ఏళ్ల బాలిక దగ్గర నుంచి 32 ఏళ్ల మహిళ వరకూ చాలా వయసులవారు ఉన్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మృతులలో నాలుగు నెలల గర్భవతి కూడా ఉంది. వీరంతా 2001 నుంచి 2005 మధ్య అదృశ్యమైనవారేనని తేలింది. దీని వెనుక సీరియల్ కిల్లర్ ఉన్నాడని కొందరు, సెక్స్ రాకెట్ ఉందని మరికొందరు ఊహించడం మొదలుపెట్టారు. సీరియల్ కిల్లర్ అని భావించిన వారంతా ‘ది బోన్ కలెక్టర్’ అని పేరుపెట్టారు. మీడియా ఎక్కువ శాతం ఆ వాదనకే ఓటేసింది.ఇడా లోపెజ్ అనే మహిళా డిటెక్టివ్ అప్పటికే అల్బుకర్కీకి చెందిన సుమారు 19 మంది మహిళలు కనిపించడం లేదని లిస్ట్ తయారు చేసింది. వారంతా సెక్స్వర్కర్స్, డ్రగ్స్ వంటి వ్యసనాలు కలిగినవారే కావడంతో పోలీసులు పెద్దగా దృష్టిపెట్టలేదు. అయితే వెస్ట్ మేసా తవ్వకాల్లో బయటపడిన పదకొండు మందిలో, పదిమంది ఆ లిస్ట్లోని వారే కావడంతో ఈ కేసు ఉత్కంఠగా మారింది. ఇడా లిస్ట్లో మరో తొమ్మిది మంది ఏమయ్యరో తెలియకపోవడంతో, లిస్ట్లో లేని అభాగ్యులు చాలామందే ఇలా ఖననమై ఉంటారని అంచనాకొచ్చారు. ఇక పదకొండో అమ్మాయి, ఓక్లహోమాకి చెందిన 15 ఏళ్ల సిలానియా టెరెన్ (ఆఫ్రికన్ అమెరికన్) అని తేలింది. ఆమె 2003లో ఇంటి నుంచి పారిపోయింది. దొరికిన అస్థిపంజరాలు ఎవరివో తేల్చారు కాని, ఇంతటి ఘాతుకానికి పాల్పడిందెవరో గుర్తించలేకపోయారు.ఈ కేసులో అనుమానితులు చాలామందే ఉన్నా లోరెంజో మోంటోయా, జోసెఫ్ బ్లీ అనే నేరగాళ్లు ప్రధాన అనుమానితులుగా నిలిచారు. లోరెంజో అనే వ్యక్తి పదకొండు మందిని ఖననం చేసిన ప్రదేశానికి చాలా సమీపంగా నివసించేవాడు. సెక్స్ వర్కర్లపై హింసాత్మక దాడులకు తెగబడి రెండుసార్లు అరెస్టయ్యాడు. అతడు 2006లో 19 ఏళ్ల సెక్స్ వర్కర్ షెరికా హిల్ను చంపి, ఆమె శవాన్ని కారు డిక్కీలో పెట్టి తీసుకెళ్లబోతుంటే, షెరికా ప్రియుడు ఫ్రెడరిక్.. లోరెంజోను తుపాకీతో కాల్చి చంపాడు. అతడు షెరికాను చంపిన తీరు చూస్తే అది, అతడి మొదటì హత్య అయి ఉండదని అప్పట్లోనే చాలామంది డిటెక్టివ్స్ భావించారు. అయితే 2009లో వెస్ట్ మేసా తవ్వకాల తర్వాత ఆ రోజు షెరికా బాడీని లోరెంజో వెస్ట్ మేసాలో కప్పెట్టడానికే తీసుకెళ్లబోయాడేమో? అనే అనుమానం కలిగింది. నిజానికి లోరెంజో మరణం తర్వాతే వెస్ట్ మేసా హత్యలు ఆగిపోయి ఉంటాయని అధికారులు నమ్మారు.2010 డిసెంబర్ 9న అల్బుకర్కీ పోలీసులు.. గుర్తుతెలియని ఆరుగురు మహిళల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. వారిలో కొందరు అపస్మారక స్థితిలో (ఎవరో కిల్లర్కి చిక్కినట్లుగా) ఉన్నారు. అయితే ఆ ఫొటోలు ఏ నేరగాడి కెమెరా నుంచి సేకరించారో అధికారులు చెప్పలేదు కాని, ఇదంతా వెస్ట్ మేసా కేసు దర్యాప్తులో భాగమని వివరించారు. ఆ ఆరుగురిలో ఇద్దరు అమ్మాయిలు సజీవంగా ఉన్నట్లు సమాచారం ఉందని, వారు దొరికితే కిల్లర్ వివరాలు తెలిసే అవకాశం ఉందని వారు చెప్పారు. అయితే ఆ ఇద్దరమ్మాయిలూ దొరకలేదు. ఆ ఆరుగురిలో ఆ ఇద్దరూ ఎవరో కూడా తెలియలేదు.2015 నాటికి జోసెఫ్ బ్లీ అనే రేపిస్ట్ కూడా వెస్ట్ మేసా కేసులో అనుమానితుడిగా మారాడు. 1980–82 మధ్యకాలంలో అల్బుకర్కీ సమీపంలోని ఇళ్లలోకి దూరి, 13 నుంచి 15 ఏళ్ల బాలికలపై అత్యాచారాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న బ్లీ.. 2015లో ఓ సెక్స్ వర్కర్ హత్యకేసులో అరెస్ట్ అయ్యాడు. డీఎన్ఏ నమూనాతో నేరం నిరూపితమైంది. గత నేరాలను కూడా కలిపి బ్లీకి 36 ఏళ్లు జైలు శిక్ష పడింది. పైగా ఈ పదకొండు అస్థిపంజరాలు దొరికిన చోట, క్లూ మాదిరి ఒక నర్సరీ ట్యాగ్ లభించింది. ఆ నర్సరీని గుర్తించిన అధికారులు.. బ్లీ రెగ్యులర్గా అక్కడే మొక్కలు కొనేవాడని తెలుసుకున్నారు. అయితే ఒకసారి బ్లీ.. తన సెల్మేట్ ముందు వెస్ట్ మేసా బాధితులను ‘నేను వాడి పడేసిన చెత్త’ అని సంబోధించాడట. కానీ విచారణలో బ్లీ నోరువిప్పకపోవడంతో, కేసు తేలలేదు. మొత్తానికీ ఈ హత్యలన్నీ ఒక్కడే చేశాడా? లేక ఈ ఉదంతం వెనుక ఏదైనా మాఫియా ఉందా? అనేది నేటికీ మిస్టరీనే!∙సంహిత నిమ్మన -
Christmas 2024 ముల్లంగి సంబరం
ప్రపంచంలోనే ఇదొక అరుదైన సంబరం. మెక్సికోలోని వాహాకా నగరంలో జరిగే వేడుక ఇది. ఈ సంబరం జరిగే రోజున వాహాకా నగర వీథుల్లో ఎటు చూసినా ముల్లంగి దుంపలే కనిపిస్తాయి. స్థానిక కళాకారులు ముల్లంగి దుంపలను శిల్పాలుగా తీర్చిదిద్ది ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ సంబరం ఏటా డిసెంబర్ 23న జరుగుతుంది. ఇది ప్రధానంగా రాత్రివేళ జరిగే వేడుకే అయినా, ఉదయం నుంచి వాహాకా నగర వీథుల్లో సందడి కనిపిస్తుంది. స్పానిష్ వలసదారులు అడుగుపెట్టే వరకు మెక్సికన్ ప్రజలకు, ఇతర లాటిన్ అమెరికా దేశాల ప్రజలకు ముల్లంగి తెలీదు. స్పానిష్ వర్తకులు చైనా నుంచి ముల్లంగిని తీసుకువచ్చి, దక్షిణ అమెరికాలోని తమ వలస రాజ్యాల్లో సాగు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ముల్లంగి లాటిన్ అమెరికన్ ప్రజల అభిమాన కూరగాయల్లో ఒకటిగా మారింది. ముల్లంగి సంబరం ఆచారం మొదలవడానికి ముందు వాక్సాకా నగరంలోని క్రిస్మస్ బజారులో కలపతో శిల్పాలు మలచే పోటీలు జరిగేవి. కొందరు ఔత్సాహిక రైతులు 1897 డిసెంబర్ 23న ముల్లంగి దుంపలతో చిత్రవిచిత్రమైన శిల్పాలను మలచి, ప్రదర్శనకు పెట్టారు. దాదాపు వందమంది రైతులు ఆనాటి ప్రదర్శనలో ముల్లంగి శిల్పాలను ప్రదర్శించారు. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు వీటిని ఎగబడి కొనుక్కున్నారు. అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 23న ‘నోషే డి రబానోస్’ (నైట్ ఆఫ్ రాడిషెస్) సంబరం జరుపుకోవడం ప్రారంభించారు. (కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది! )మొదట్లో ఈ వ్యవహారం కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికే మొదలైనా, తర్వాత ఇది వాహాకా నగరంలో ఒక పెద్ద సాంస్కృతిక వేడుకలా మారింది. ఈ ముల్లంగి సంబరంలో ముల్లంగి శిల్పాల పోటీలు జరుగుతాయి. విజేతలకు వాహాకా నగర పాలక సంస్థ బహుమతులు అందించి, ఘనంగా సత్కరిస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనే శిల్పులు క్రీస్తు జననం, శిలువ, చర్చి వంటి ఆకృతులతో పాటు పక్షులు, జంతువులు, మనుషుల బొమ్మలను కూడా ముల్లంగి దుంపలపై మలచి, తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ వేడుకకు విదేశీ పర్యాటకులు వస్తుండటం వల్ల మెక్సికోకు పర్యాటక ఆదాయం కూడా బాగా లభిస్తోంది. -
లెక్కల్లో మనం తమిళులకు వదిలేసిన... మన తెలుగు సినిమా
సాధారణంగా తొలి తెలుగు టాకీ అనగానే అందరి నోటా వచ్చే మాట ‘భక్త ప్రహ్లాద’ (1932). కానీ, అంతకన్నా ముందే తెరపై తెలుగు మాటలు, పాటలు వినిపించాయని తెలుసా? పది రీళ్ళ పూర్తి నిడివి ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే రిలీజైన సదరు నాలుగు రీళ్ళ సినిమా గురించి విన్నారా? తెరపై తెలుగు వారి ఘన వారసత్వానికి గుర్తుగా నిలిచే ఆ సినిమాను అశ్రద్ధతో మనం మన లెక్కల్లో చేర్చుకోకుండా వదిలేశామంటే నమ్ముతారా? తమిళులు మాత్రం అది తమదిగా గొప్పగా చెప్పుకుంటున్నట్టు గమనించారా? సుదీర్ఘ పరిశోధనలో తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ (1931)పై అనేక కొత్త సత్యాలు బయటపడ్డాయి.భారతీయ చలనచిత్ర పరిశ్రమలో... మూగ సినిమాలను వెనక్కి నెడుతూ, మాట్లాడే చిత్రాలు వచ్చింది 1931లో! హిందీ–ఉర్దూల మిశ్రమ భాష హిందుస్తానీలో తయారై, 1931 మార్చి 14న విడుదలైన ‘ఆలమ్ ఆరా’ తొలి భారతీయ టాకీ చిత్రం. బొంబాయిలోని ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ అధినేత అర్దేశిర్ ఎం. ఇరానీ ఆ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. ‘ఆలమ్ ఆరా’ రిలీజై, ఘనవిజయం సాధించిన తర్వాత మరో ఏడు నెలలకు వచ్చిన ‘ఫస్ట్ ఇండియన్ తమిళ్ అండ్ తెలుగు టాకీ’ ఈ ‘కాళిదాస్’. అక్కడే... ఆ సెట్స్లోనే!‘ఆలమ్ ఆరా’ విజయంతోనే దక్షిణాది భాషల్లోనూ టాకీలు నిర్మించాలని ఇరానీకి ఆలోచన వచ్చింది. అలా అనుకున్నప్పుడు ఆయన తన వద్ద ఉన్న అనుభవజ్ఞుడైన దక్షిణాదీయుడు హెచ్.ఎం.రెడ్డి వైపు మొగ్గారు. హెచ్.ఎం.రెడ్డి ‘కాళిదాస్’కి నిర్దేశకుడై, తరువాతి కాలంలో ‘దక్షిణ భారత టాకీ పితామహుడి’గా పేరొందారు. గమ్మత్తేమిటంటే – బొంబాయిలోనే, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ కోసం వేసిన సెట్స్లోనే ఈ ‘‘తొలి తమిళ – తెలుగు టాకీ ‘కాళిదాస్’నూ’’ చిత్రీకరించారు. రంగస్థల నటి, అప్పటికే దక్షిణాదిన కొన్ని మూకీ చిత్రాల్లో నటించిన టి.పి. రాజలక్ష్మి చిత్ర హీరోయిన్. మూకీల రోజుల నుంచి సినిమాల్లో ఉన్న మన తెలుగు వెలుగు ఎల్వీ ప్రసాద్ ‘ఆలమ్ ఆరా’లో లానే, ఈ ‘కాళిదాస్’లోనూ ఒక చిన్న వేషం వేశారు. మరి, ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన నటుడెవరు? అసలు హీరో తెలుగువాడే!కాళిదాస్ పాత్రధారి ఎవరనే అంశంపై చరిత్రలో నరసింహారావు, హరికథా భాగవతార్ పి. శ్రీనివాసరావు, తమిళ నటుడు పి.జి. వెంకటేశన్... ఇలా రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవానికి, ఆ పాత్ర ధరించినది పైన పేర్కొన్న వారెవరూ కారు! ఆ నటుడి పేరు– వి.ఆర్. గంగాధర్. ఆ రోజుల్లోనే ‘‘బి.ఏ. చదివిన’’ ఉన్నత విద్యావంతుడు. అప్పట్లో ‘‘ప్రసిద్ధ క్యారెక్టర్ ఆర్టిస్ట్.’’ ఆయన, రాజలక్ష్మి జంటగా ‘కాళిదాస్’లో నటించారని తాజాగా బయటపడ్డ నాటి ప్రకటనలతో తేలిపోయింది. ఇంకో విశేషం ఉంది. అదేమిటంటే, ఆ ‘కాళిదాసు’ పాత్ర వేసిన సదరు గంగాధర్/ గంగాధరరావు అచ్చ తెలుగువాడు! అవును... ఇది ఇంతవరకు ఎవరూ పట్టించుకోని అంశం. మన సినీచరిత్రలో నమోదు కాని మరుగునపడిన సత్యం! ‘‘...ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన ఒకరిని కాళిదాసుగా నటింపజేశారు’’ అని సాక్షాత్తూ హీరోయిన్ రాజలక్షే్మ చెప్పారు. (ఆధారం: ‘గుండూసి’ పత్రికకు 1950లలో ఆమె ఇచ్చిన భేటీ).ఎల్వీ ప్రసాద్ సైతం అందులో హీరో తెలుగువాడని తేల్చిచెప్పారు. ‘‘...‘కాళిదాస్’కి హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించగా, శ్రీమతి టి.పి. రాజలక్ష్మి, మరో తెలుగు నటుడు పాత్రలు పోషించారు’’ అని తన యాభై అయిదేళ్ళ జీవితానుభవాల ఆత్మకథనంలో పేర్కొన్నారు.అది... ఒకటి కాదు! మూడు చిత్రాలు!!‘కాళిదాస్’ తర్వాత రూపొంది, రిలీజైన ‘భక్త ప్రహ్లాద’ పూర్తి తెలుగు టాకీ. ఆ చిత్ర ప్రదర్శనలో తెలుగు మినహా మరో భాషే వినిపించదు. కానీ, ‘కాళిదాస్’ అలా కాదు! అసలు ఆ చిత్ర ప్రదర్శనే... ఒకటి కాదు... ఒకటికి మూడు చిన్న చిన్న చిత్రాల కదంబ ప్రదర్శన! ఆ మూడింటిలో ప్రధానమైనది– ‘కాళిదాస్’. ఈ రచయిత పరిశోధనలో తాజాగా తేలిందేమంటే... ఆ ఫిల్ము వరకు మొత్తం తెలుగు డైలాగుల్లోనే నడిచింది. ‘కాళిదాస్’తో పాటు కలిపి ఒకటే ‘ప్రోగ్రామ్’గా ప్రదర్శించిన మిగతా రెండు లఘు చిత్రాలు మాత్రం తమిళం. అవి... తమిళ దేశభక్తి గీతాలు, తమిళ కురత్తి పాటలు – డ్యాన్సు ఉన్న చిత్రాలు.కొన్నేళ్ళ క్రితమే అన్వేషణలో అందుబాటులోకి వచ్చిన ‘కాళిదాస్’ పాటల పుస్తకం ఆ ‘ప్రోగ్రామ్’ వివరాలను స్పష్టంగా పేర్కొంది. దాని ప్రకారం ఆ ‘‘ప్రోగ్రామ్’’ వివరాలు ఏమిటంటే... 1). దేశభక్తి నిండిన జాతీయవాద గీతాలు (తమిళంలోవి), కీర్తనలు (తెలుగులోని త్యాగరాయ కీర్తనలు), ప్రణయ గీతాలు (తమిళంలోవి), డ్యాన్స్ చూపిన 3 రీళ్ళ చిత్రం. 2). ‘కాళిదాస్’. ఇందులో కాళిదాస్ హాస్యఘట్టాల్లో ఒకటి, అలాగే అతని జీవితంలోని ప్రేమఘట్టం మరొకటి చూపారు. ఇది 4 రీళ్ళ చిత్రం. (ఇది పూర్తిగా తెలుగు డైలాగులతోనే తీసిన తెలుగు కథాచిత్రం). 3). హీరోయిన్ మిస్. టి.పి. రాజలక్ష్మి రంగస్థలంపై విజయవంతంగా అభినయిస్తూ, అప్పటికే ఎంతో పేరు సంపాదించుకున్న ‘కురత్తి’ డ్యాన్స్. ఇది 2 రీళ్ళ చిత్రం. కురత్తి డ్యాన్స్ అంటే పూసల దండలు, దారాలు విక్రయించేవారు వీథుల్లో చేసే నృత్యాలన్నమాట. మొత్తం ఈ 3 తక్కువ నిడివి చిత్రాల సమాహారమే ‘కాళిదాస్’ అన్నమాట. అన్నీ కలిపితే మొత్తం 9 రీళ్ళు. విడివిడిగా నిడివి తక్కువ గల ఈ మూడు లఘు చిత్రాలనూ కలిపి, ఒకే టాకీ ప్రదర్శనగా రిలీజ్ చేశారు. మూడూ కలిపి ఒకే షోగా వేశారు. అలా ఆ సినిమా ప్రదర్శన అటు తెలుగు డైలాగుల ‘కాళిదాస్’తో పాటు, తెలుగు త్యాగరాయ కీర్తనలు, తమిళ దేశభక్తి గీతాలు, కురత్తి డ్యాన్సుల కదంబ కార్యక్రమంగా జనం ముందుకు వచ్చింది. అన్ని భాషల వారినీ ఆకర్షించేందుకు వీలుగా ‘కాళిదాస్’ను ‘‘తొలి భారతీయ తమిళ, తెలుగు టాకీ చిత్రం’’గా పబ్లిసిటీ చేశారు. అదీ జరిగిన కథ. ‘కాళిదాస్’లో... అన్నీ తెలుగు డైలాగులే! తమిళం, హిందీ లేవు!!అయితే, ఇవాళ తమిళ సినీ చరిత్రకారులు ‘కాళిదాస్’ను వట్టి తమిళ టాకీగానే పేర్కొంటున్నారు. తమ భాష సినిమాగా లెక్కల్లో కలిపేసుకుంటున్నారు. కానీ, ‘కాళిదాస్’లో అసలు తమిళ డైలాగులే లేవు! హీరో తెలుగులో మాట్లాడితే, హీరోయిన్ తమిళంలో బదులు ఇచ్చిందనీ, పూజారి పాత్ర ధరించిన ఎల్వీ ప్రసాద్ లాంటి వారు హిందీలో సంభాషణలు పలికారనే ప్రచారంలోనూ వాస్తవం లేదు. ‘కాళిదాస్’ కథాచిత్రం మొత్తం తెలుగు డైలాగులతోనే తయారైంది. ఆ చిత్ర హీరోయిన్ అప్పట్లోనే చెప్పిన మాటలు, పత్రికల్లోని ఆనాటి సమీక్షలే అందుకు నిలువెత్తు సాక్ష్యం. ఆ ‘కాళిదాస్’ చిత్రంలో ‘‘నేను తమిళ, తెలుగు పాటలు పాడాను. తెలుగులో డైలాగులు చెప్పాను’’ అని ఆ సినిమా రిలీజు వేళలోనే హీరోయిన్ రాజలక్ష్మి పేర్కొనడం గమనార్హం. రాజలక్ష్మి ‘‘జన్మస్థలం (తమిళనాడులోని) తంజావూరు సమీప గ్రామం. తమిళం తప్ప, వేరొక భాషా పరిచయం లేదు.’’ అందుకే, ‘కాళిదాస్’ టాకీలో నటిగా మొత్తం తెలుగు డైలాగులే చెప్పాల్సి వచ్చినప్పుడు, ‘‘తెలుగు మాటలను ద్రావిడ లిపిలో (అంటే తమిళ లిపిలో అన్నమాట) రాసుకొని వల్లించాను’’ అని ఆమె వివరించారు.రాజ్యలక్ష్మి వేరొక సందర్భంలో మాట్లా డుతూ, ‘‘ఒకరోజు (దర్శకుడు) హెచ్.ఎం.రెడ్డి గారు నాతో మాట్లాడుతున్నారు. నాకు ఏవేమి వచ్చని ఆయన అడిగారు. కురత్తి పాటలు, నృత్యం తెలుసని చెప్పాను. అంతే... (అవి చేయించి) అది చిత్రీకరించారు. ఆ తర్వాత ‘కాళిదాస్’ అనే చిత్రాన్ని తెలుగులో తీశారు. అందులో రాకుమారిగా నటిస్తూ, ఆయన తెలుగులో చెప్పింది తమిళంలో రాసుకొని, చదువుకొని ఆ సంభాషణలు పలికే అవకాశం నాకు దక్కింది. అలా మొదటి టాకీయే (వివిధ అంశాల, లఘు చిత్రాల) ఒక కదంబ టాకీగా తమిళనాడుకొచ్చింది’’ అని తేటతెల్లం చేశారు. ‘కాళిదాస్’ తెలుగు ఫిల్మ్ అని చెప్పకనే చెప్పారు.మనం వదిలేసుకున్నాం! .. వాళ్ళు కలిపేసుకున్నారు!! ‘కాళిదాస్’లో ఒక్క హీరోయినే కాదు... హీరో సహా అందరూ తెలుగు లోనే మాట్లాడారు. తమిళం ఒక్క ముక్క కూడా లేదు. తమిళ మ్యాగజైన్ ‘ఆనంద వికటన్’ సైతం ‘‘...అందులో తమిళ మాటలు లేవు. కనుక్కుంటే, అది తెలుగు భాష అని తెలిసింది. (సినిమా ప్రదర్శన) మొదట్లో, మధ్యలో, చివరలో మాత్రం కొన్ని తమిళ పాటలు వచ్చాయి’’ అని అప్పటి తన సమీక్షలో తేల్చే సింది. (ఆధారం: ‘ఆనంద వికటన్’ 1931 నవంబర్ 16). అంటే, 10 రీళ్ళ పూర్తి నిడివి, పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే తొలిసారిగా తెలుగు మాటలు, పాటలతో వచ్చిన 4 రీళ్ళ లఘు కథాచిత్రం ‘కాళిదాస్’. ఆ ‘కాళిదాస్’లోనే మన తెలుగు మాట, పాట తొలిసారిగా వెండితెరపై వినిపించాయి. తెలుగు టాకీకి శ్రీకారం చుట్టాయి. తెలుగు భాషకు అంతటి ఘనత కట్టబెట్టింది ‘కాళిదాస్’ అయినా, అది మొత్తం తెలుగు డైలాగులే ఉన్న సినిమాయే అయినా... తెలుగువాళ్ళమైన మనం ఉదాసీనంగా ఆ సినిమాను లెక్కల్లో వదిలేసుకున్నాం. అతి శ్రద్ధ గల తమిళులేమో దాన్ని తమ తమిళ టాకీగా చరిత్రలో కలిపేసుకున్నారు. మరి, కేవలం తెలుగు డైలాగులతోనే తీసినప్పటికీ, ‘కాళిదాస్’ను అప్పట్లో తమిళ – తెలుగు సినిమాగా ఎందుకు చెప్పినట్టు? నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ... తెలుగు, తమిళ, తదితర భాషల సమాహారం. అందరినీ ఆకర్షించాలన్నది సహజంగానే దర్శక, నిర్మాతల భావం. ఈ మూడు లఘు చిత్రాల కదంబ సినీ ప్రదర్శనతోనే... తెలుగు, తమిళ భాషలు రెండూ తెరపై తొలిసారిగా వినిపించాయి. ఆ చిత్రం మొట్టమొదట మద్రాసులో రిలీజవుతున్నప్పుడు ‘‘తమిళ – తెలుగు భాషల్లో తొలి వాక్చిత్రం’’ అంటూనే ప్రకటనలిచ్చారు. అంతేతప్ప, కేవలం తమిళ టాకీ అని చెప్పలేదు. అది గమనించాలి! ఆ రకంగా ‘కాళిదాస్’ ప్రోగ్రామ్లో తెర మీద తమిళంతో పాటు తెలుగు కూడా ఒకేసారి వినిపించింది కాబట్టి, తమిళంతో సమానంగా దీటుగా తెలుగూ నిలిచిందని గ్రహించాలి!! పూర్తి నిడివి టాకీల విషయంలో మాత్రం తమిళ ‘హరిశ్చంద్ర’ (రిలీజ్ 1932 ఏప్రిల్ 9) కన్నా ముందే తయారై, రిలీజైన తెలుగు ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6)తో మనమే ముందున్నామని గుర్తించాలి!! దక్షిణాదిలో తొలి సినిమా పాటల పుస్తకంమూడు లఘు చిత్రాల కదంబ ప్రదర్శన ‘కాళిదాస్’లోని తమిళ, తెలుగు పాటలన్నీ హీరోయిన్ రాజలక్షే్మ పాడారు. అప్పట్లో ఈ సినిమా పాటల పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రచురించారు. దక్షిణాదిలో వచ్చిన తొలి సినిమా పాటల పుస్తకమిదే! పాటల పుస్తకంలో ‘కాళిదాస్’ చిత్ర కథా సంగ్రహం వివరాలను తెలుగు, తమిళం, ఇంగ్లీషు మూడు భాషల్లోనూ ప్రచురించడం విశేషం. పాటల పుస్తకం ముఖచిత్రంపై ‘కాళిదాస్’లో రాజలక్ష్మి నృత్యభంగిమ ఫొటో, మద్రాసు కినిమా సెంట్రల్లో సినిమా రిలీజ్ తేదీ తదితర వివరాలు ఇంగ్లీషులో వేశారు. ఇవాళ ఇంటర్నెట్ అంతటా కనిపించే ‘కాళిదాస్’ పోస్టర్ అదే! తెరపై తొలి తెలుగు పాట... త్యాగరాయ కీర్తన! అప్పటికే సుప్రసిద్ధురాలైన టి.పి. రాజలక్ష్మి రంగస్థలంపై పాడుతున్న పాపులర్ త్యాగరాయ కీర్తనలనే ఈ ‘కాళిదాస్’లోనూ ఆమెతో పాడించారు. పాటల పుస్తకంలోని ‘ఎంత రానీ...’ (హరికాంభోజి రాగం, దేశాది తాళం), ‘స్వరరాగ సుధారస...’ (శంకరాభరణ రాగం, ఆది తాళం) రెండు కీర్తనలే కాక ‘రామా నీయెడ ప్రేమ రహితులకు...’ (ఖరహరప్రియ రాగం, ఆది తాళం) అనే మూడో తెలుగు కీర్తన పాడిన సంగతి రాజలక్ష్మి అప్పట్లోనే చెప్పారు. వెండితెరపై వినిపించిన తొలి తెలుగు పాటలు ఇవే! అలా పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932) కన్నా ముందే తెరపై తెలుగు మాటలు, పాటలు వినిపించాయన్నది సత్యం.రీలు బాక్సుకు పూజలు, హారతులు‘కాళిదాస్’ 1931 అక్టోబర్ 31న మద్రాసులోని ‘కినిమా సెంట్రల్’లో రిలీజైంది. బొంబాయిలో తయారైన ఈ ‘కాళిదాస్’ ఫిల్ము రీళ్ళను తెచ్చినప్పుడు మద్రాస్ సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి సినిమా హాలు దాకా వాల్ట్యాక్స్ రోడ్డులో జనం రీలు బాక్సు వెంట ఊరేగింపుగా నడిచారు. పూలు వెదజల్లారు. కొబ్బరికాయలు కొట్టారు. అగరువత్తులు, కర్పూరం వెలిగించారు. దాన్నిబట్టి, తెరపై స్థానిక భాషను వినిపించే టాకీ పట్ల ప్రజల్లో పెల్లుబికిన ఉత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు. సాంకేతికంగా సవాలక్ష లోపాలున్నా బొమ్మ బాక్సాఫీస్ హిట్. ‘కాళిదాస్’ తమిళులు అధికమైన సింగపూర్, మలేసియాలకూ వెళ్ళింది. స్థానిక తమిళుల్ని ఆకర్షించడం కోసం అక్కడ ‘కాళిదాస్’ను తమిళ సినిమాగానే పబ్లిసిటీ చేయడం గమనార్హం. తెలుగు తర్వాతే తమిళం! తొలి పూర్తి తమిళ టాకీ... ‘హరిశ్చంద్ర’! తెలుగు కథాచిత్రానికి... తమిళ పాటలు, కురత్తి డ్యాన్సులు పక్కన చేర్చి రిలీజ్ చేసిన ‘కాళిదాస్’ కదంబమాలిక విజయం దక్షిణాది సినీ చరిత్రలో కీలక పరిణామం. ఆ వెంటనే తెలుగులోనే పూర్తి నిడివి కథాకథన చిత్రమైన ‘భక్త ప్రహ్లాద’ టాకీ నిర్మాణానికి అది పురిగొల్పింది. ‘కాళిదాస్’ తీసిన హెచ్.ఎం. రెడ్డే దానికీ దర్శకుడు. పూర్తిగా తెలుగు మాటలు, పాటల ‘ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న దేశంలోనే తొలిసారిగా రిలీజై, విజయవంతమైంది. ఈ పరిణామాలన్నీ అటుపైన పూర్తి నిడివి తమిళ టాకీ ‘హరిశ్చంద్ర’ (1932) రూపకల్పనకు దారితీశాయి. 1932 ఏప్రిల్ 9న పూర్తిగా తమిళ డైలాగులు, తమిళ పాటలతోనే రిలీజైన ‘హరిశ్చంద్ర’నే ఆ నాటి పత్రికలు ‘‘మొట్టమొదటి తమిళ టాకీ’’ అని పేర్కొన్నాయి (ఆధారం: ‘హిందూ’ డైలీ, 1932 ఏప్రిల్ 8). నిర్మాతలూ ‘హరిశ్చంద్ర’నే ‘‘తొలి పూర్తి నిడివి 100 శాతం తమిళ టాకీ’’ అని ప్రకటనల్లో అభివర్ణించారు. అలా ‘కాళిదాస్’ చిత్ర విజయాన్ని ప్రేరణగా తీసుకొనే... పూర్తి స్థాయి తెలుగు సినిమా, పూర్తి తమిళ సినిమా వచ్చాయి. తెరపై తొలిసారిగా పూర్తిగా తెలుగు డైలాగులతో, మన త్యాగరాయ కీర్తనలతో, తెలుగు హీరో, తెలుగు దర్శకుడితో తయారైన ‘కాళిదాస్’ను ఇప్పటికైనా మన సినిమాగా తెలుగు సినీచరిత్రలో తప్పనిసరిగా గుర్తించాలి. అది అవసరం. మనం చేతులారా వదిలేసుకుంటున్న మన తెలుగు వారి ఘన వారసత్వాన్ని మనమే నిలుపుకోవడం ముఖ్యం.(త్వరలో రానున్న దక్షిణాది సినీ చరిత్ర ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం ఆధారంగా)-రెంటాల జయదేవrjayadev@yahoo.com -
బంధాలను ప్రభావితం చేసే బాల్యానుభవాలు
రాహుల్, పూజ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఇద్దరికీ ఆఫీసులో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లపాటు వాళ్ల కాపురం అందంగా, ఆనందంగా సాగింది. ఆ తర్వాత అవగాహనలో సమస్యలు ఏర్పడ్డాయి, విభేదాలు పెరిగాయి. రాహుల్ తనకు తగినంత సమయం ఇవ్వడం లేదని పూజ భావిస్తోంది. ఆమె అవసరాలు తీర్చడాన్ని ఒత్తిడిగా రాహుల్ భావిస్తున్నాడు. ఈ విషయమై తరచూ గొడవలు పడుతున్నారు. ఆ గొడవలను వారికి వారు పరిష్కరించుకోలేక కౌన్సెలింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.మూలాలు బాల్యానుభవాల్లో..మొదటి సెషన్లో విడివిడిగా రాహుల్, పూజలు తమ చిన్ననాటి అనుభవాలను వివరించారు. రాహుల్ చిన్నప్పుడు తన తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా ఎమోషనల్ సపోర్ట్ పొందలేకపోయాడు. ఫలితంగా అతనిలో అవాయిడెంట్ అటాచ్మెంట్ ఏర్పడింది. దీంతో బంధాలలో సాన్నిహిత్యం కంటే స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటున్నాడు. పూజ బాల్యంలో తల్లిదండ్రుల నుంచి అనిశ్చితమైన ప్రేమను పొందింది. పూజ తల్లిదండ్రులు ఆమె ఎమోషనల్ అవసరాలను కొన్నిసార్లు తీర్చేవారు, మరికొన్నిసార్లు విస్మరించేవారు. ఫలితంగా ఆమెలో యాంగ్షియస్ అటాచ్మెంట్ ఏర్పడింది. తన భాగస్వామి కాస్త దూరంగా ఉంటే చాలు అభద్రతను, భయాన్ని అనుభవిస్తోంది. దాంతో నిత్యం తనతోనే ఉండాలని రాహుల్ పై ఒత్తిడి పెంచుతోంది. ఈ వ్యత్యాసాల కారణంగా చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారాయి. ఒకరినొకరు తీవ్రంగా ప్రేమిస్తున్నప్పటికీ అపార్థాలకు దారితీశాయి.రెండు నెలల్లో సమస్యలు దూరం.. ఇద్దరితో మాట్లాడి, వారి అటాచ్మెంట్ స్టయిల్స్ గురించి, వాటివల్ల ఏర్పడుతున్న సమస్యల గురించి అర్థం చేసుకున్నాక, వాటిని బ్యాలెన్స్ చేయడానికి వారికి సూచించిన వ్యూహాలు కొన్ని..1. రాహుల్ తన స్వేచ్ఛ కోసం చేసే పనులు ప్రేమను తిరస్కరించడం కాదని పూజ గుర్తించాలి. అలాగే తన నిరంతర ధ్రువీకరణ అవసరాన్ని పరిమితం చేసుకోవాలి. 2. ఇద్దరూ తమ భావోద్వేగాలను, అవసరాలను స్పష్టంగా, నిర్మాణాత్మకంగా కమ్యూనికేట్ చేయడం ప్రారంభించారు. ఉదాహరణకు, పూజకు ధ్రువీకరణ అవసరం ఉన్నప్పుడు, ఆమె ప్రశ్నల ద్వారా కాకుండా తన భావాలను చెప్పడం నేర్చుకుంది.3. పూజకు ఇవ్వాల్సిన ఎమోషనల్ సపోర్ట్ ప్రాధాన్యాన్ని గుర్తించి రాహుల్.. ఆమెకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు. అదే సమయంలో పూజ కూడా రాహుల్ స్వేచ్ఛకు గౌరవం ఇవ్వడం తెలుసుకుంది.4. ఇరువురూ తమ రోజువారీ జీవనంలో పరస్పర సహకారం, చిన్నచిన్న ఆనందాలను ఆస్వాదించేందుకు సమయం కేటాయించటం మొదలుపెట్టారు. ఉదాహరణకు, వారాంతాల్లో కలిసి వాకింగ్ చేయడం లేదా ఒక కొత్త హాబీని ఆరంభించడం లాంటివి.రెండు నెలల కౌన్సెలింగ్ తర్వాత వారి సంబంధంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. దాంతో, వారి మధ్య గొడవలు తగ్గి, ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ పెరిగాయి.అటాచ్మెంట్ థియరీ మన చిన్ననాటి అనుభవాలు, పెంపకం విధానాలు మన ప్రస్తుత సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరించే సిద్ధాంతమే అటాచ్మెంట్ థియరీ. బాల్యంలో తల్లిదండ్రులతో ఏర్పడే అనుబంధం, మన వ్యక్తిత్వానికి, భావోద్వేగ వ్యవహారానికి, ముఖ్యంగా ప్రేమ సంబంధాలకు మూలస్తంభం అవుతుంది. అయితే, ఈ అటాచ్మెంట్ శైలులు స్థిరమైనవి కావు, వాటిని మార్చుకోవచ్చు. ఇందులో మూడు రకాలున్నాయి. సెక్యూర్ అటాచ్మెంట్సెక్యూర్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు ప్రేమ, నమ్మకం, అనుబంధానికి ప్రాధాన్యమిస్తారు. ఇతరులతో సంబంధాలను బలంగా, స్వతంత్రంగా, అనురాగపూర్వకంగా నిర్వహించగలుగుతారు. ఉదాహరణకు ఒక సెక్యూర్ వ్యక్తి తన భాగస్వామి కొంత సమయం స్వతంత్రంగా గడపాలని కోరితే, దాన్ని సానుకూలంగా అర్థం చేసుకుంటాడు.యాంగ్షియస్ అటాచ్మెంట్యాంగ్షియస్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు సంబంధాల్లో ఎక్కువ భయాన్ని, అస్థిరతను అనుభవిస్తారు. వీరు ఎక్కువగా భావోద్వేగ ధ్రువీకరణ కోసం భాగస్వామిపై ఆధారపడతారు. ఉదాహరణకు భాగస్వామి తక్షణమే ఫోన్ కాల్కి ప్రతిస్పందించకపోతే, తనపై ప్రేమ లేదా శ్రద్ధ తగ్గిందని అనుమానపడతారు.అవాయిడెంట్ అటాచ్మెంట్అవాయిడెంట్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యమిస్తారు. అనుబంధం, సాన్నిహిత్యాన్ని నివారించడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు ఈ అటాచ్మెంట్ శైలి ఉన్న వ్యక్తి.. భాగస్వామి తనతో ఎక్కువ సమయం గడపాలని కోరితే.. తన స్వేచ్ఛను లాగేసుకుంటున్నట్లు భావిస్తాడు, ప్రతిఘటిస్తాడు. -
బందరు బంగారు తీగ
అసలు కన్నా వడ్డీ ముద్దు.. ఒరిజినల్ కన్నా ఇమిటేషన్ ఇంపు! అందుకే.. బంగారం మిన్నుకేసి మిడిసిపడుతుంటే.. మార్కెట్లో మెరుస్తూ రోల్డ్గోల్డ్ ఆభరణప్రియులను ఆకట్టుకుంటోంది! గోల్డ్ స్థానాన్ని ఆక్రమిస్తూ తన వన్నె పెంచుకుంటోంది! అలాంటి గిల్టునగలకు మేలిమి చిరునామా ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం!! సామాన్యులతోపాటు ధనికులనూ ఆకర్షిస్తున్న మచిలీపట్నం రోల్డ్గోల్డ్ జ్యూల్రీపై ప్రత్యేక కథనం..ఎస్.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం. మచిలీపట్నంలోని ఇమిటేషన్ జ్యూల్రీకి సారేపల్లి సాంబయ్య పోతపోశారు. రోజురోజుకు బంగారం ధర పెరిగిపోతున్న కారణంగా ప్రత్యామ్నాయం వైపు దృష్టిసారించారాయన. బంగారం, రాగి లోహాలతో ‘కట్టు’ పద్ధతి ద్వారా నగల తయారీని ప్రారంభించారు. తక్కువ ధరకే లభించడం, వన్నె తగ్గకుండా ఏళ్లపాటు మన్నడంతో నాడు అది లకలపూడి బంగారంగా పేరుపొందింది. తర్వాతర్వాత బంగారం, రాగితో కాకుండా వేరే మెటల్తో ముక్కు పుడక దగ్గర్నుంచి ఒడ్డాణం దాకా పలు రకాల నగలను పలు రకాల డిజైన్స్లో తయారుచేసి, బంగారు వర్ణం రేకుతో తాపడం పెట్టసాగారు. రోజువారీ ఉపయోగం నుంచి శుభకార్యాలు, ప్రత్యేక వేడుకల వరకు అన్ని సందర్భాలకు అవసరమయ్యే నగలను తయారుచేస్తారు. ట్రెండ్కి తగ్గ డిజైన్స్తో మెరుపులో అసలు బంగారానికే మాత్రం తీసిపోని ఈ గిల్టు నగలకు మార్కెట్లో డిమాండ్ కూడా పెరుగుతూ వస్తోంది. జీవం పోసిన వైఎస్సాఆర్వైఎస్ రాజశేఖర రెడ్డి సీమ్ అయ్యాక ఈ పరిశ్రమకు జీవం పోశారు. ఎమ్మెస్సెమ్ఈలో దీన్నో క్లస్టర్గా గుర్తించి, ఏపీఐఐసీ ద్వారా అభివృద్ధి చర్యలు చేపట్టారు. ఈ నగల పరిశ్రమల కోసం మచిలీపట్నంలో 48 ఎకరాల భూమిని కేటాయించి, జ్యూల్రీ పార్క్గా మలచారు. ప్రస్తుతం ఇక్కడ 236 పరిశ్రమలు న్నాయి. ప్రత్యక్షంగా మూడువేల మంది ఉపాధి పొందుతు న్నారు.ఈ జ్యూల్రీ తయారీ మచిలీ పట్నంతో పాటు పెడన, పామర్రు, అవనిగడ్డ వంటి 40కి పైగా గ్రామాల్లో విస్తరించడంతో సుమారు 30వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రంగాన్ని ఆదుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ సబ్సిడీపై విద్యుత్ను అందించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎమ్ అయ్యాక .. ఏడు రూపాయలున్న యూనిట్ ధరను రూ.3.25 పైసలకే ఇచ్చారు.దేశవిదేశాలకు బందరు బంగారు తీగమామూలు నగలే కాకుండా ఆలయాల్లోని విగ్రహాల కిరీటాలు తదితర సామాగ్రి, భరతనాట్యం, కూచిపూడి నాట్య ప్రదర్శనలకు అవసరమైన ఆహార్యంలోని హారాలు, ఒడ్డాణాలు, డ్రామా కంపెనీల ఆభరణాల సెట్లనూ తయారుచేస్తారిక్కడ. 2007లో రూ. 30 కోట్లున్న ఈ పరిశ్రమ టర్నోవర్ జ్యూల్రీ పార్క్ ఏర్పాటు తర్వాత పుంజుకుని, ఐఎస్ఓనూ పొందింది. ప్రస్తుతం దీని టర్నోవర్ రూ. 100 కోట్లకు పైమాటే! బందరు రోల్డ్గోల్డ్ నగలకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా మొదలైన రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంది. అంతేకాదు శ్రీలంక, మాల్దీవ్స్, , బంగ్లాదేశ్, మయన్మార్, అరబ్ కంట్రీస్కూ ఎగుమతి అవుతున్నాయి. ఈ ఇమిటేషన్ జ్యూల్రీలో కొన్నింటికి ఆరునెలల గ్యారంటీ ఇస్తారు. రంగుపోతే వాటిని మార్చుకోవచ్చు. స్కిల్ హబ్ కింద ఈ నగల తయారీలో ఉత్సాహవంతులకు మూడు నెలల ఉచిత శిక్షణను అందిస్తున్నారు.నాణ్యతకూ మారుపేరుమచిలీపట్నానికి చెందిన సారేపల్లి సాంబయ్య ఆలోచన ఇప్పుడు వేలాది మందికి ఉపాధిగా మారింది. బందరు బంగారు తీగ డిజైన్స్కే కాదు నాణ్యతకూ మారుపేరుగా నిలిచింది.∙పెద్దేటి వెంకటసుబ్బారావు, అధ్యక్షుడు, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ పార్కు సంఘంవారసత్వాన్ని కాపాడ్డానికి..ఎంతో చరిత్ర ఉన్న మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ తయారీని తర్వాత తరాలకూ అందించడానికి ఆసక్తి ఉన్నవాళ్లకు ఉచితంగానే శిక్షణనిస్తున్నాం. దీనివల్ల ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. ∙అంకెం జితేంద్రకుమార్, కార్యదర్శి, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ పార్కు సభ్యుల సంఘం. -
ఫ్రెండ్లీ స్టయిలిస్ట్ శరణ్యారావు
ఫ్యాషన్ వరల్డ్లో తెలుగువాళ్లు తక్కువగా కనిపిస్తారు.కానీ క్రియేటివ్ స్కిల్స్తో గట్టిగా నిలబడతారు!వాళ్లలో శరణ్యారావు పేరును చెప్పుకోవచ్చు గొప్పగా!శరణ్య స్వస్థలం విశాఖపట్నం. ముస్తాబు చేయడంలో ముందుండేది చిన్నప్పటి నుంచీ! శరణ్య అలంకరణ, స్టయిలింగ్కి తొలి మోడల్ ఆమె చెల్లెలే! ఇంటి పనుల్లో అమ్మ బిజీగా ఉండి, చెల్లిని రెడీ చేయలేకపోతే ఆ బాధ్యత తను తీసుకునేది! అది క్రమంగా అభిరుచిగా మారింది. తన పాకెట్ మనీతో మేకప్ వస్తువులు కొనేది. ఏ చిన్న ఫంక్షన్ అయినా చెల్లిని చక్కగా ముస్తాబు చేసి మురిసిపోయేది. ఆ అలంకరణను కొన్నిసార్లు అందరూ మెచ్చుకున్నా, చెల్లికి నచ్చేది కాదు. మరికొన్నిసార్లు ఎవ్వరికీ నచ్చకపోయినా, చెల్లికి మాత్రం తెగ నచ్చేది. ఇష్టాయిష్టాల్లో ఒకొక్కరిదీ ఒక్కో టేస్ట్ అని అర్థంచేసుకుంది శరణ్య. వాటిని బ్యాలెన్స్ చేస్తూ అందరూ మెచ్చే స్టయిలింగ్ని చూపించొచ్చు అని తెలుసుకుంది. రానురాను అదే ఆమె సిగ్నేచర్ స్టయిలింగ్ అయింది. ఫ్యాషన్ మీదున్న మక్కువతో బెంగళూరులో ఫ్యాషన్ కోర్సుచేసి, పేరున్న డిజైనర్ దగ్గర కొంతకాలం పనిచేసింది. తర్వాత హైదరాబాద్ వచ్చి స్టయిలింగ్ స్టార్ట్ చేసింది. పర్ఫెక్ట్ బాడీ, బ్రాండెడ్ దుస్తులతోనే స్టయిలింగ్ అనే ప్రాక్టీస్ని మార్చేసింది. పర్సనాలిటీ, బాడీ టైప్, బాడీ టోన్, కంఫర్ట్ వంటివాటిని దృష్టిలో పెట్టుకుని స్ట్రీట్ షాపింగ్ దుస్తులతో స్టయిలింVŠ చేస్తూ పర్ఫెక్ట్ అనిపించుకోవడం మొదలుపెట్టింది. అలా శరణ్య స్టయిలింగ్కి ఫిదా అయ్యి, ఆమె స్టయిలింగ్తో గార్జస్ అనిపించుకున్న వారిలో శ్రీలీల, ఐశ్వర్యా మీనన్, కావ్యా థాపర్, దక్షా నాగర్కర్, అదితీ గౌతమి, మాళవికా నాయర్, మిర్నా మీనన్ ఉన్నారు. రామ్ పోతినేని, సుశాంత్, సత్యదేవ్ లాంటి మేల్ యాక్టర్స్కూ శరణ్య స్టయిలింగ్ చేసింది. ‘తిమ్మరుసు’, ‘స్కంద’, ‘భోళా శంకర్’ వంటి సినిమాలకు స్టయిలిస్ట్గా పనిచేసింది. సినిమా కలర్ పాలెట్ను ఫాలో అవుతూ.. లెవెన్త్ అవర్లో కూడా కూల్గా స్టయిలింగ్ అందించే డైరెక్టర్స్ ఫ్రెండ్లీ స్టయిలిస్ట్గా శరణ్యకు మంచి పేరుంది. అలా బోయపాటి, మెహర్ రమేశ్ వంటి డైరెక్టర్లకు ఆమె ఫేవరిట్ స్టయిలిస్ట్ అయింది. -
ఈవారం కథ: కుట్ట
‘అలివర్! రేపు పార్టీ.. గుర్తుంది కదా? ఈవినింగ్ త్వరగా వచ్చేయ్. పార్టీకి ఒక్కణ్ణే అన్ని ఏర్పాట్లు చెయ్యలేను’ అన్నాడు ఆస్కార్. ‘గాబరాపడకు.. అన్ని ఏర్పాట్లూ చేసేశాను..’ అంటూ కారెక్కి వెళ్ళిపోయాడు అలివర్.కారు వెళ్ళిపోతుంటే అలా చూస్తుండిపోయాడు ఆస్కార్. అంతా తను అనుకున్నట్లే జరిగితే అలివర్ని ప్రాణాలతో చూడటం ఇదే ఆఖరు అనుకున్నాడు ఆస్కార్. ఆ ఆలోచన రాగానే అతని కాళ్ళు చేతులు వణకసాగాయి.ఆరేళ్ళ క్రితం ఆస్కార్కి అలివర్ ఒక బస్సులో పరిచయం అయ్యాడు. అప్పటికే అలివర్ ఒక కంపెనీలో మేనేజర్గా ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఆస్కార్ మాత్రం ఓ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు. అప్పటికే అతను ఐదు ఉద్యోగాలు మారాడు. ఏ కంపెనీలోనూ స్థిరంగా ఉండేవాడు కాదు. కారణం ఆస్కార్ సోమరిపోతు. కష్టపడే మనస్తత్వం కాదు. దాంతో ఏ కంపెనీలోనూ ఆరునెలల కన్నా ఉండేవాడు కాదు. ఎప్పుడైతే అలివర్ పరిచయమయ్యాడో ఆస్కార్ జాతకం మారిపోయింది. అతను ఆస్కార్ని చేరదీసి తన ఇంట్లో స్థానమిచ్చాడు. స్వంత తమ్ముడిలా ఆదరించాడు. అతని బాగోగులన్నీ అలివరే చూసుకోవడంతో ఆస్కార్ ఉద్యోగం మానేసి ఇంటి పనులు చేసుకుంటూ కాలక్షేపం చేయసాగాడు.అలివర్ తల్లితండ్రులు ఒక కారు ప్రమాదంలో మరణించడంతో అమ్మమ్మ ఎస్టెల్లానే అలివర్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించింది. వృద్ధాప్యం వల్ల ఆమె ఏడాది కిందట చనిపోయింది. దాంతో ఆమెకున్న ఐదుకోట్ల ఆస్తి ఇటీవలే అలివర్ పేరు మీదకు బదిలీ అయింది. ఆ వార్తను ఆస్కార్కి చెప్పి, అతన్ని తన ఆస్తికి నామినీగా పెట్టాడు అలివర్. అంటే తన తదనంతరం ఆ ఆస్తి ఆస్కార్దే అన్నమాట. దాంతో ఆస్కార్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. అలివర్కి ఇదివరకే మార్గరెట్ అనే అమ్మాయితో పెళ్ళైనా, ఆమెతో పొసగక విడాకులు తీసుకున్నాడు. అయితే అలివర్ మళ్ళీ పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ ఆస్తి అతని భార్యకు చెందుతుంది.ఈమధ్యనే అలివర్ మేరీ అనే అమ్మాయితో డేటింగ్ చేస్తూ పెళ్ళి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఆస్కార్కి తెలిసింది. ఆ విషయమే ఆస్కార్కి నిద్రలేకుండా చేస్తోంది.ఒక ఆదివారం మద్యం తాగుతున్న సమయంలో మేరీతో తన పెళ్ళి విషయాన్ని అలివర్.. ఆస్కార్కి చెప్పడంతో అతని గుండెలో పిడుగు పడ్డట్లయింది. అలివర్ పెళ్ళి చేసుకుంటే ఐదుకోట్ల ఆస్తికి మేరీ వారసురాలౌతుంది. తన బతుకు అధోగతే! ఆస్తి దక్కకుండా పోతుండటంతో అతనికి బాధగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు.పెళ్ళికి ముందే అలివర్ను చంపేస్తే..? అవును! అలివర్ ఈ లోకం నుంచి నిష్క్రమిస్తే ఆ ఐదుకోట్ల ఆస్తికి తను వారసుడవుతాడు. ఆ తరువాత జీవితమంతా హాయిగా గడిపెయ్యవచ్చు. ఎలా చంపడం? ఏ మాత్రం అనుమానం వచ్చినా జీవితాంతం జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిందే! కాబట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా చంపాలి. కానీ అదంత సులభం కాదు. అసలే స్కాట్లండ్ పోలీసులు.. ఆవలిస్తే పేగులు లెక్కపెడతారు.ఆ సమయంలో అతనికి కీత్ గుర్తుకొచ్చాడు. కీత్.. అలివర్ ఇంట్లో తోటపనివాడు. పాతికేళ్ళ పొడవైన యువకుడు. ఏవో చిన్న చిన్న గొడవల్లో రెండుసార్లు జైలుక్కూడా వెళ్ళొచ్చాడు.కీత్ గుర్తుకురాగానే ఆస్కార్ మెదడులో ఒక పథకం రూపుదిద్దుకుంది. వెంటనే కీత్ని పిలిచి విషయం చెప్పాడు. వినగానే కీత్ ఆశ్చర్యపోయాడు. కానీ ఆ పని చేస్తే కోటి రూపాయలు ఇస్తానని ఆస్కార్ చెప్పడంతో కీత్ మెత్తబడ్డాడు. ‘ఎలా ఇవ్వగలవ్?’ సందేహం వెలిబుచ్చాడు కీత్.‘అలివర్ చనిపోతే నాకు ఐదుకోట్ల ఆస్తి వస్తుంది. అందులోంచి నీకు కోటిస్తాను’ చెప్పాడు ఆస్కార్. ఒప్పుకున్నాడు కీత్. పథకాన్ని ఎలా అమలు చెయ్యాలో వివరించాడు ఆస్కార్. అలివర్ రోజూ ఉదయం ఏడు గంటలకు ఆఫీస్కి బయలుదేరుతాడు. అతను వెళ్ళే దార్లో అడవి ఉంటుంది. విగ్గు, మీసాలు పెట్టుకొని కీత్ అడవిలో అలివర్ని లిఫ్ట్ అడగాలి. ఎవరు లిఫ్ట్ అడిగినా అలివర్ కాదనడు. అతనలా కారు ఆపగానే కీత్ అందులోకి ఎక్కుతాడు. కొంతదూరం వెళ్ళాక బహిర్భూమి కోసమని కారు ఆపమంటాడు కీత్. అప్పుడు కీత్ తన వెంట తెచ్చుకున్న సుత్తితో అలివర్ తల మీద కొట్టి చంపేసి, అతని శవాన్ని దగ్గర్లోని ఒక లోతైన చెరువులో పడేసి, ఆ కారునేమో కొద్ది దూరంలో ఉన్న లోయలోకి తోసేస్తాడు. తరువాత తను ఆస్కార్ దగ్గరికి వచ్చి ‘ఆపరేషన్ సక్సెస్’ అని చెబుతాడు. ఇదీ ప్లాన్. అందుకే ఈరోజు అలివర్ కార్లో బయలుదేరగానే అతన్ని సజీవంగా చూడటం అదే ఆఖరుసారి అనుకున్నాడు ఆస్కార్. ∙∙ అలివర్ వెళ్ళి అప్పుడే నాలుగు గంటలయింది. ఈపాటికి అలివర్ని చంపేసి, కీత్ ఇంటి ముఖం పట్టుండాలి. అలా అనుకోగానే ఆస్కార్లో వణుకు మొదలైంది. అతని మస్తిష్కం మొద్దుబారిపోసాగింది. వెంటనే సిగరెట్ తీసి వెలిగించాడు. కీత్ కోసం వాకిలి కాస్తున్నాడు.టైమ్ పదయింది.. కీత్ ఇంకా రాలేదు. టీ తాగి వరండాలో కూర్చున్నాడు ఆస్కార్. ఏమైంది? కీత్ ఇంకా రాలేదు ఎందుకు? కాలం గడుస్తున్నా కొద్ది అతనిలో ఆందోళన పెరగసాగింది. సిగరెట్ మీద సిగరెట్తో వరండా అంతా పొగ వ్యాపించింది. టైమ్ పదకొండు అయింది. కీత్ జాడ లేదు. గడియారం ముల్లు శబ్దం మినహా వరండా అంతా నిశ్శబ్దంగా ఉంది. వెంటనే లేచి అలివర్ ఆఫీసుకి ఫోన్ చేశాడు ఆస్కార్. ఆ సమయంలో అలివర్ అక్కడ ఉండడని అతనికి తెలుసు. ఆ ఫోన్ ద్వారా అతను ఆఫీసుకి చేరలేదన్న విషయం తెలుస్తుంది. అంతేకాదు ఫోన్ చెయ్యడం వల్ల తన ఆందోళన ఆఫీసు వాళ్ళకి తెలిసి, అది రేప్పొద్దున పోలీసు ఎంక్వైరీలో ఎలిబీగా ఉపయోగపడుతుందని అతని ఆలోచన.అవతలి వైపు నుంచి అలివర్ సెక్రటరీ రూత్ ‘హలో! ఎవరు కావాలి?’ అడిగింది.‘రూత్! నేను ఆస్కార్ని. అర్జెంట్గా అలివర్తో మాట్లాడాలి’ చెప్పాడు. ‘అలివర్ ఆఫీసులో లేరు సార్’ అంది రూత్. ఆ మాట వినగానే ఆస్కార్ ముఖంలో చిన్నగా నవ్వు మెరిసింది. ‘ఓకే! ట్రాఫిక్లో ఇరుక్కొని ఉంటాడు. రాగానే ఫోన్ చెయ్యమను’ చెప్పాడు ఆస్కార్.. తనకేమీ తెలియనట్లు నటిస్తూ. ‘క్రితం మంగళవారం నుంచి అతను ఆఫీసుకి రావటం లేదు. వచ్చే సోమవారం వరకూ రాడు’ చెప్పింది రూత్.ఆ మాటలు వినగానే ఆస్కార్ మెదడు కొద్ది క్షణాలు మొద్దుబారిపోయింది. ఏమీ అర్థంకాక కుర్చీలో కూలబడిపోయాడు.క్రితం మంగళవారం నుంచి అలివర్ ఆఫీసుకి వెళ్ళటం లేదా? ఉదయం 7 గంటలకి ఆఫీసుకి బయలుదేరి సాయంత్రం ఇంటికి రావడం అతని దినచర్య. అలాగే ప్రతిరోజూ ఇంటి నుంచి ఏడు గంటలకు ఆఫీసుకి అని చెప్పి బయలుదేరుతున్నాడు. మరి మంగళవారం నుంచి ఆఫీసుకి రావటం లేదని చెబుతోందేంటి రూత్? వారం నుంచి అతనెక్కడికి వెళుతున్నట్లు? రూత్ చెప్పిందే నిజమైతే అడవిలో కీత్కి అలివర్ కారు ఎదురుపడి ఉండదు. మరి కీత్ అక్కడ ఏం చేస్తున్నట్లు? ఇంకా అలివర్ వస్తాడని ఎదురు చూస్తున్నాడా? ఇప్పటి వరకూ అలివర్ రాకపోతే కీత్ తనకి ఫోన్చేసి ఆ విషయం చెప్పి ఉండేవాడు. ఏం జరిగింది? కొంపదీసి తన ప్లాన్ అలివర్కి తెలిసిపోయిందా? కీత్ ఏమైనా చెప్పి ఉంటాడా? అందుకే అలివర్ ఆఫీసుకి వెళ్ళటం లేదా? రకరకాల ఆలోచనలు ఆస్కార్లో. ఆందోళనతో సిగరెట్లు ఊదేస్తున్నాడు. మళ్ళీ రూత్కి ఫోన్ చెయ్యాలనుకున్నాడు. కానీ దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదని, కీత్ వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయించుకున్నాడు.సమయం రెండయింది. కీత్ రాలేదు. ఆలోచనలు మళ్ళీ ఆస్కార్ని చుట్టుముట్టాయి. ఒకవేళ అలివరే కీత్ని చంపేసుంటే? ఆస్కార్ ముఖం నిండా చెమటలు. ఇంతలో కారు హారన్ వినిపించింది. ఆస్కార్ ముఖంలో ఒక వెలుగు. పరుగున వెళ్ళి తలుపు తీశాడు. అప్పుడే కారు దిగుతూ కనిపించాడు కీత్. ‘అన్నీ సవ్యంగా జరిగాయా?’ కంగారుగా ఆస్కార్.‘అంతా సవ్యమే’ అన్నట్లు బొటనవేలిని ఎత్తి చూపాడు కీత్.‘మరింత ఆలస్యం అయిందేంటి?’ ఇంకా ఆందోళన తగ్గలేదు ఆస్కార్లో. ‘అన్నీ పూర్తిచేసుకొని వచ్చేసరికి ఈ టైమ్ అయింది’ కీత్.‘మనం అనుకున్నట్లే అతను కారు ఆపి నీకు లిఫ్ట్ ఇచ్చాడా?’ అడిగాడు ఆస్కార్.‘నేను చెయ్యెత్తగానే కారు ఆపాడు. ఎక్కడ నుంచి వస్తున్నావ్? ఎక్కడికెళ్ళాలి అని అడిగాడు. చెప్పాను. ప్లాన్ ప్రకారమే కొంత దూరం వెళ్ళాక చిటికెన వేలు చూపించి, కారు ఆపమన్నాను..’ అని ఆగాడు కీత్.‘ఆ తరువాత?’ ఆస్కార్లో కుతూహలం. ‘సుత్తితో తల మీద కొట్టి, చంపేసి, శవాన్ని చెరువులో పడేసి, కారుని లోయలోకి తోసేశాను’ చెప్పాడు కీత్. ప్రశ్నల వర్షం ఆగిపోవడంతో కాఫీ తాగి వెళ్ళిపోయాడు కీత్. అప్పుడు రూత్కి ఫోన్చేసి ‘అలివర్ గురించి ఆందోళనగా ఉంది. అతను వారం నుంచీ ఆఫీసుకి వెళుతున్నాడు. ఈరోజు కూడా వెళ్ళాడు’ చెప్పాడు ఆస్కార్. ‘లేదు సార్. రావట్లేదు..ఈరోజు కూడా రాలేదు.. మంగళవారం వరకు రాననే చెప్పాడు. కాబట్టి నేనేమీ గాబరా పడట్లేదు’ స్పష్టం చేసింది రూత్.‘మరి ఎక్కడికి వెళుతున్నాడో చెప్పాడా?’ ఆస్కార్. ‘లేదు సర్.. ఏదో పనుందంటూ వారం సెలవు మాత్రం తీసుకున్నాడు’ రూత్.‘రేపు మేము ఓ పార్టీ ఇస్తున్నాం. చాలామంది స్నేహితులను పిలిచాం. అతనికేదో జరిగి ఉంటుందనిపిస్తోంది నాకు. అతని స్నేహితుల్ని కనుక్కొని ఏం జరిగిందో చెప్పు’ అంటూ ఫోన్ పెట్టేశాడు ఆస్కార్. అరగంట తరువాత రూత్ ఫోన్ చేసి ‘సార్! అతని స్నేహితులు పార్కర్, మిస్ సాషెల్తో మాట్లాడేను. అతను వాళ్ళకు తనెక్కడికి వెళుతున్నాడో చెప్పలేదుట. ఒకరోజు వేచి చూసి పోలీసులకు ఫిర్యాదు చెయ్యమని చెప్పారు. మీరేం గాబరా పడకండి. అంతా మంచే జరుగుతుంది’ అని చెప్పింది.ఆరోజు సాయంత్రం.. అలివర్ కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆస్కార్. వాళ్ళు అలివర్ కారు నంబరు, మిగతా వివరాలు అడిగి అతని ఆచూకీ కనుక్కుంటామని చెప్పారు. ∙∙ పోలీస్ డిటెక్టివ్ సార్జెంట్ క్లేమోర్ నుంచి ఆస్కార్కి ఫోన్ వచ్చింది. అలివర్ ఆచూకీ గురించి వాకబు చేశాడు ఆస్కార్. ఇంకా తెలియలేదు, ఆ పనిలోనే ఉన్నామని చెప్పాడు క్లేమోర్. ‘అలివర్కి ఏదో జరిగుంటుందనిపిస్తోంది. ఏదో అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని నా అనుమానం’ అన్నాడు ఆస్కార్.‘అంటే ఆత్మహత్య చేసుకున్నాడనా?’ క్లేమోర్. ‘కావొచ్చని భయడుతున్నాను’ ఆస్కార్. ‘ఆత్మహత్యకు పాస్పోర్ట్ ఎందుకతనికి?’ అన్నాడు క్లేమోర్.‘పాస్పోర్టా?’ అర్థంకాలేదు ఆస్కార్కి. ‘వారం క్రితం ఆఫీసుకి వెళ్ళినప్పుడు అలివర్ అక్కడున్న పాస్పోర్టును తీసుకెళ్ళాడని వాళ్ళ డైరెక్టర్ చెప్పాడు నాతో. ఎటైనా టూర్కెళ్ళి ఉంటాడు. మీరేం గాబరా పడకండి. అతను ప్రాణాలతోనే ఉండుంటాడు. నిన్న అతని లాయర్తో మాట్లాడేను. అలివర్ ఈమధ్య తన ఆస్తి విల్లును మార్చి రాశాడని చెప్పాడతను. ఆత్మహత్య చేసుకోబోయేవాడు అవన్నీ చెయ్యడు కదా! బహుశా ఇవేమీ తెలియక మీరు కంగారుపడుతున్నారు’ అన్నాడు క్లేమోర్.‘నాకవేమీ తెలియవు’ ఆస్కార్. మర్నాడు ఉదయమే 9 గంటల వేళ ఆస్కార్ ఇంటికి వచ్చాడు క్లేమోర్. పెద్ద పెద్ద మీసాలతో పొడవుగా తెల్లగా సన్నగా ఉన్నాడతను. వస్తూనే ‘మిస్టర్ ఆస్కార్! అలివర్ చనిపోయాడని ఎందుకనుకుంటున్నారు మీరు?’ అడిగాడు.‘ఆరేళ్లుగా అతని దగ్గరే ఉంటున్నాను. నాకు చెప్పకుండా అతనెప్పుడూ ఎక్కడికీ వెళ్ళడు. అందుకే అనుమానం’ చెప్పాడు ఆస్కార్.‘అతని అదృశ్యం వెనక మీ పాత్ర ఉందనుకోవచ్చా?’ సందేహపడ్డాడు క్లేమోర్. అతని మాటలకు ఆశ్చర్యపోతూ ఆస్కార్ ‘ఏం మాట్లాడుతున్నారు?’ అన్నాడు. ‘అతన్ని చంపడానికి మీరు ప్రయత్నించి ఉంటారని నా అనుమానం’ సార్జెంట్ క్లేమోర్.‘చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అలివర్ నా ప్రాణస్నేహితుడు. నేనెందుకు అతన్ని చంపాలనుకుంటాను?’ బాధను ఒలికిస్తూ ఆస్కార్.‘మీ ప్రాణస్నేహితుడు చనిపోయుంటాడని నిన్నట్నుంచి మీరే అంటున్నారు పదేపదే!’ అన్నాడు క్లేమోర్.‘నాకెందుకో అలా అనిపించిందన్నాను తప్ప, అదే నా భావన కాదు’ ఆస్కార్.‘మీ ఇద్దరిలో అతనే ఆస్తిపరుడు. అందుకే మీ మీద నాకు అనుమానం’ క్లేమోర్.‘అలివర్ భార్య మార్గరెట్తో విడాకులు తీసుకున్న దగ్గర్నుంచీ నిస్పృహకు లోనయ్యాడు. నాతో ఆ బాధను పంచుకుంటూ చనిపోవాలనుందన్నాడు ఎన్నోసార్లు. అందుకే అతను ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చన్న అనుమానం వచ్చింది. కానీ దీన్ని పోలీసులు సీరియస్గా తీసుకోలేదనిపిస్తోంది’ ఆస్కార్. ‘అలివర్ కేసుని సీరియస్గానే తీసుకున్నాం ఆస్కార్! ఒకవేళ ఆత్మహత్య చేసుకోకపోతే ఇంకేమి జరిగుండొచ్చని మీ అనుమానం?’ అడిగాడు క్లేమోర్.‘అతన్నెవరైనా హత్య చేసి ఉండొచ్చు’ ఆస్కార్.‘అదెలా సాధ్యం?’ అడిగాడు క్లేమోర్.‘అలివర్ అడిగిన వాళ్ళందరికీ కారులో లిఫ్ట్ ఇస్తూంటాడు. అలా ఇవ్వొద్దని ఎన్నోసార్లు చెప్పినా వినేవాడు కాదు. అలా లిఫ్ట్ అడిగిన వ్యక్తెవరైనా అలివర్ని హత్య చేసుండొచ్చని నాకనిపిస్తోంది’ ఆస్కార్.‘అంటే అతన్ని ఎవరో ఆగంతుకుడు హత్య చేసి ఉండొచ్చంటున్నారు?’ ఆశ్చర్యంగా క్లేమోర్.‘అనే నమ్ముతున్నాను..’‘అంటే ఆత్మహత్య కన్నా హత్యే జరిగుండొచ్చనా?’ ‘బహుశా’ ఆస్కార్. ‘అంటే ఆగంతుకుడెవరో అలివర్ని లిఫ్ట్ అడిగి, అతని కారెక్కి, అతన్ని చంపి.. శవాన్ని ఎందులోనైనా పడేసి, అతని దగ్గరున్న డబ్బుతో పరారైపోయుంటాడని మీ అనుమానం.. అంతేనా?’ క్లేమోర్.‘అదే జరిగుండొచ్చు. ఎందుకంటే అలివర్ దగ్గర పదిలక్షలకు తక్కువ కాకుండా డబ్బుంటుంది ఎప్పుడూ! బహుశా ఆ డబ్బు కోసమే అలివర్ని చంపేసి ఉండొచ్చు’ అన్నాడు ఆస్కార్. ‘మీరు చెప్పింది కాకుండా ఇంకోటి జరిగి ఉండొచ్చనిపిస్తోంది నాకు’ క్లేమోర్. ‘ఏమిటది?’ ఆశ్చర్యంగా ఆస్కార్.‘అతని అదృశ్యంలో మీ హస్తం ఉండొచ్చని, హత్యలో మీరూ భాగస్వాములవొచ్చని నా అనుమానం’ క్లేమోర్. అతని మాటలకు నిశ్చేష్టుడయ్యాడు ఆస్కార్. ఏం చెప్పాలో అర్థంకాక క్లేమోర్ వైపు కోపంగా చూశాడు. ‘మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా?’ అన్నాడు. ‘మిస్టర్ ఆస్కార్.. మీరేం చెబితే అది నమ్మడానికి మేమంత అమాయకులం కాము. అంతా పరిశోధించే ఒక నిర్ణయానికి వస్తాం’ అన్నాడు క్లేమోర్.‘అలివర్ని చంపేటంతటి అవసరం నాకేం ఉంది చెప్పండి?’ అమాయకత్వం ధ్వనింపజేస్తూ ఆస్కార్.‘అతని ఆస్తి.. అలివర్ చనిపోతే అతని ఐదుకోట్ల ఆస్తి మీకు చెందుతుంది. ఎందుకంటే ఆ ఆస్తికి మీరే నామినీ కాబట్టి’ క్లేమోర్.‘నిన్నంతా ఈ ఇంట్లోనే ఉన్నాను. అతన్ని నేనెలా చంపగలను?’ ఆస్కార్.‘మీరే హత్య చేశారని అనటం లేదు. చేయించారు అంటున్నాను. అతని హత్యకు కుట్ర పన్నారు’ ఆస్కార్ ముఖంలోకి చూస్తూ క్లేమోర్.‘కుట్రా! నేనా?’ ఆస్కార్ ఆశ్చర్యం నటిస్తూ!‘నిన్న కీత్ని పట్టుకొని విచారిస్తే జరిగినదంతా చెప్పాడు’ క్లేమోర్.‘అతను మీకన్నీ అబద్ధాలు చెప్పి ఉంటాడు. అతని మాటలు నమ్మవద్దు’ ఆస్కార్.‘నువ్వు అలివర్ని చంపడానికి పన్నిన కుట్రనంతా కళ్ళకు కట్టినట్లు కీత్ చెప్పాడు. రూఢి చేసుకున్న తరువాతే ఇక్కడికి వచ్చాను. మీరేం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పండి’ అంటూ ఆస్కార్ని అరెస్ట్ చేశాడు క్లేమోర్. ఓ వారం తరువాత ఆస్కార్ పేరు మీద ఒక ఉత్తరం వచ్చింది. జైల్లో ఉన్న అతనికి ఆ ఉత్తరాన్నిచ్చారు పోలీసులు. ‘డియర్ ఆస్కార్!నీ పథకం ప్రకారం కీత్ నన్ను చంపాలని ఆ రోజు నన్ను లిఫ్ట్ అడిగాడు. తీరా కారులోకి ఎక్కిన తరువాత ఆ పని చెయ్యలేక భయపడిపోయి నిజం చెప్పేశాడు. అప్పుడు నేను కొన్నాళ్ళు అదృశ్యం అవుతాననీ, నీకు మాత్రం నన్ను హత్యచేసినట్లే చెప్పమనడంతో కీత్ నీకలా చెప్పాడు. నువ్వు దాన్ని నమ్మావు. నా చేతికి ఐదుకోట్ల ఆస్తి వచ్చిన దగ్గర నుంచి నీ ప్రవర్తనలో మార్పు గమనించాను. అందుకే రెండు నెలల క్రితం లండన్లో మేరీని పెళ్ళి చేసుకొని, ఆస్తికి ఆమెను నామినీగా పెట్టి విల్లు మార్చాను. ఆస్కార్! నువ్వు నీ గమ్యాన్ని చేరుకోవడానికి తప్పుడు దారిని ఎంచుకున్నావ్. ఇప్పుడు నేను, మేరీ లండన్ లో హనీమూన్లో ఉన్నాం. కోర్టులో నీ కేసు వాదనలు మొదలయ్యేలోపే స్కాట్లండ్ వస్తాను.ఇంకా బతికే ఉన్న నీ స్నేహితుడు..అలివర్!’ఆ ఉత్తరం చదివి చేష్టలుడిగిపోయాడు ఆస్కార్. ∙గన్నవరపు నరసింహ మూర్తి(మైఖేల్ అండర్వుడ్ ఓకే ఫర్ మర్డర్ కథ ఆధారంగా) -
రుక్మాంగద చరిత్ర
సూర్యవంశానికి చెందిన ఋతధ్వజుడు విదిశా మహారాజు. ఆయన కొడుకు రుక్మాంగదుడు. ఋతధ్వజుడి తదనంతరం రుక్మాంగదుడు రాజ్యభారాన్ని చేపట్టాడు. రుక్మాంగదుడి భార్య సంధ్యావళి. విష్ణుభక్తుడైన రుక్మాంగదుడికి సంధ్యావళి అన్ని విధాలా అనుకూలమైన భార్య. వారికి కొడుకు పుట్టాడు. అతడికి ధర్మాంగదుడు అని నామకరణం చేసి, అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. విష్ణుభక్తి తత్పరులైన తల్లిదండ్రుల పెంపకంలో ధర్మాంగదుడు కూడా బాల్యం నుంచి విష్ణుభక్తుడయ్యాడు.విష్ణుభక్తులలో అగ్రగణ్యుడైన అంబరీషుని ద్వాదశీ నియమం మాదిరిగానే, రుక్మాంగదుడికి ఏకాదశి నియమం ఉండేది. దశమి, ద్వాదశి తిథులలో ఏకభుక్తం పాటిస్తూ, ఏకాదశి తిథినాడు ఉపవాసం చేసేవాడు. తాను మాత్రమే కాకుండా, తన రాజ్యంలోని ప్రజలందరూ ఈ వ్రత నియమాన్ని పాటించాలని చాటింపు వేయించాడు. రాజభక్తులైన ప్రజలు తు.చ. తప్పకుండా ఏకాదశి వ్రత నియమాన్ని నియమం తప్పకుండా పాటించేవారు. రుక్మాంగదుడి పాలనలోని ప్రజలందరూ ఏకాదశీ వ్రత పరాయణులు కావడంతో వారందరూ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్లసాగారు. రుక్మాంగదుడి విదిశా రాజ్యంలో యమదూతలకు అడుగుపెట్టే అవకాశం లేకుండాపోయింది. యముడికి పనిలేకుండా పోయింది. ఈ పరిస్థితికి యముడు కలత చెందాడు. వెంటనే బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు. ‘కమలసంభవా! విదిశారాజ్యంలో నాకు పనిలేకుండా పోయింది. ఆ రాజ్యంలో నేను శిక్షించదగిన వారెవరూ లేరు. ఎలాగైనా, వారి ఏకాదశీ వ్రతానికి భంగం కలిగించు’ అని కోరాడు.యముడి ద్వారా రుక్మాంగదుడి వ్రతదీక్షను, అతడి ప్రజల భక్తితత్పరతలను తెలుసుకున్న బ్రహ్మదేవుడు వారి వ్రతదీక్షను పరీక్షించదలచాడు. అప్పటికప్పుడే తన సంకల్పంతో మోహిని అనే అప్సరసను సృష్టించాడు. ‘మోహినీ! నువ్వు భూలోకానికి వెళ్లు. అక్కడ రుక్మాంగదుడి ఏకాదశి వ్రతానికి భంగం కలిగించు’ అని ఆదేశించాడు.బ్రహ్మదేవుడి ఆదేశం మేరకు మోహిని భూలోకానికి చేరుకుంది.విదిశా రాజధాని వెలుపల అరణ్యప్రాంతంలో ఉన్న శివాలయంలో కూర్చుని, వీణ వాయించసాగింది.అదే సమయానికి రుక్మాంగదుడు మృగయా వినోదం కోసం అరణ్యానికి వచ్చాడు.కీకారణ్యంలో సంచరిస్తూ, ఎన్నో క్రూరమృగాలను వేటాడాడు. వేట ముగించుకుని, రాజధాని వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. కొంత దూరం వచ్చాక, శ్రావ్యమైన వీణానాదం వినిపించింది. అరణ్యంలో వీణానాదం ఎక్కడిదని రుక్మాంగదుడు ఆశ్చర్యపోయాడు. వీణానాదం వస్తున్న దిశగా ముందుకు సాగుతూ, శివాలయం వద్దకు వెళ్లాడు. ఆలయంలోకి అడుగు పెడుతూనే, ఆలయ మండపంలో వీణ వాయిస్తూ ఉన్న ముగ్ధమోహన సుందరాంగి మోహిని కనిపించింది. ఆమె రూపలావణ్యాలను చూడగానే రుక్మాంగదుడు మోహపరవశుడయ్యాడు.‘సుందరాంగీ! నిన్ను చూడగానే వలచాను. నీకు సమ్మతమైతే క్షత్రియోచితంగా గాంధర్వ వివాహం చేసుకుంటాను’ అన్నాడు.‘రాజా! అనుదిన సుఖభోగాలను అందించగలవంటే, నేను నీకు భార్యను కాగలను’ అందామె.ఆమెను ఆ ఆలయంలోనే గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుని, ఆమెను వెంటపెట్టుకుని రాజధానికి చేరుకున్నాడు రుక్మాంగదుడు.కొన్నాళ్లకు యథావిధిగా ఏకాదశి వచ్చింది. రుక్మాంగదుడు నియమానుసారం దశమినాడు ఏకభుక్తుడై, ఏకాదశి రోజున ఉపవాసం ప్రారంభించాడు.‘నన్ను అనుదినం సుఖభోగాలలో ముంచెత్తుతానని చెప్పి, ఉపవాసాలు, వ్రతాలు అంటూ నన్ను ఉపేక్షించడం తగునా? ఉపవాసం చాలించి, నాతో విహరించు, పద’ అంది మోహిని. ‘సూర్యుడు పడమరన ఉదయించినా, మేరు మంధర పర్వతాలు భూమిలోకి కుంగిపోయినా, అగ్నిహోత్రం చల్లబడిపోయినా నా వ్రత నియమాన్ని మాత్రం నేను తప్పను’ అని బదులిచ్చాడు రుక్మాంగదుడు.అతడి సమాధానానికి ఆగ్రహించిన మోహిని, అతడిని నానా దుర్భాషలాడింది. ‘ఏకాదశి వ్రత నియమాన్ని విడిచిపెట్టడం తప్ప నీకు ఇష్టమయినది ఇంకేం చేయమన్నా చేస్తాను, చెప్పు’ అనునయంగా అన్నాడు రుక్మాంగదుడు.‘అలాగైతే, నీ కొడుకు తల నరికి ఇవ్వు’ అందామె.రుక్మాంగదుడి కొడుకు ధర్మాంగదుడు ఆ మాట విన్నాడు. తన తండ్రి వ్రతనియమానికి భంగం కలగకుండా ఉండటమే ముఖ్యమని తలచాడు. వెంటనే ఖడ్గం తీసుకుని, మోహిని ఎదుట నిలిచి, తన కంఠాన్ని తానే నరికేసుకున్నాడు.ఇది చూసి మోహిని భయభ్రాంతురాలైంది.బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమయ్యారు.‘రుక్మాంగదా! నీ వ్రతనియమం సాటిలేనిది. ఇహపరాలలో అనంత సౌఖ్యాలను అనుభవించు. ఇప్పుడే నీ కొడుకును బతికిస్తున్నాం’ అని పలికి, ధర్మాంగదుడిని బతికించి, అంతర్ధానమయ్యారు. మోహిని సత్యలోకానికి వెళ్లిపోయింది. ∙సాంఖ్యాయన -
Christmas 2024: జగద్రక్షకుని జన్మదినం
చీకటిని చీల్చుకుంటూ వస్తున్న సూర్యుడు తన లేత వెచ్చని కిరణాలతో ఆ గ్రామాన్ని నిద్ర లేపాడు. పక్షుల కిలకిలరావాలతో, పట్టణానికి బయలుదేరుతున్న ఎడ్లబండ్ల చప్పుళ్ళతో, గేదెలను తోలుకుంటూ వెళ్తున్న పల్లె పిల్లగాళ్ళ అరుపులతో, నీళ్ళ కోసం బయలుదేరిన అమ్మలక్కల బిందెల చప్పుళ్ళతో దినచర్య ప్రారంభించే ఆ అందమైన గ్రామం ఆరోజు మరింత సందడిగా మారింది.రాత్రంతా తాగుబోతు నాన్న కొట్టిన దెబ్బలకు అల్లాడిపోయి జ్వరంతో మత్తుగా నిద్ర పట్టేసిన సూరి ఈ హడావిడికి ఒక్కసారిగా లేచాడు. ‘అమ్మో! చాలా ఆలస్యమైందే! పండుగ రోజులు కదా, చాలా తొందరగా రావాలి అని నిన్న అమ్మగారు చెప్పారు. ఈరోజు నా పని అయిపోయిందిలే’ అని అనుకుంటూ, కళ్ళు నులుముకుంటూ ‘ఒరేయ్ చద్దన్నమన్నా తిని వెళ్ళరా!’ అని అరుస్తున్న అమ్మ కేకలు కూడా పట్టించుకోకుండా పరుగు పరుగున బయలుదేరాడు. అప్పటికే కారాలు మిరియాలు నూరుతోంది ఆ ఇంటి యజమానురాలు. భయం భయంగా లోపలికి వస్తుండగా, ‘ఆగు!’ అనే మాట విని నిలబడిపోయాడు. అమ్మగారి వంకే చూస్తున్నాడు. ‘అమ్మగారూ! రాత్రంతా జ్వరం..’ అని పరిస్థితిని చెబుదామనే లోపులో దబదబమని బాదింది. ‘పండుగ రోజులు కదా, త్వరగా రావాలి అని చెప్తే లేటుగా వస్తావా?’ అని నోటికొచ్చినట్టు తిట్టింది. అసలే రాత్రి వాళ్ళ నాన్న కొట్టిన దెబ్బల మీద ఈ దెబ్బలు తగలడంతో మరింత బాధపడుతూ పని దగ్గరకు పరుగెత్తాడు. దుఃఖాన్ని ఆపుకోలేక భోరున ఏడ్చాడు. ఓదార్చేవారెవ్వరూ లేరక్కడ.సూరి వాళ్ళ నాన్న రిక్షా తొక్కుతాడు. సాయంత్రం తాగివచ్చి వాళ్ళమ్మను, చెల్లెళ్ళను, సూరిని చితకబాదుతాడు. ప్రతిరాత్రి పస్తే! వాళ్ళమ్మ జబ్బు చేసి నీరసంగా ఉంటుంది. అందుకని సూరిని ఆ ఊళ్ళో డబ్బున్న కాంతారావు ఇంట్లో పనికి పెట్టింది. సూరి ఉదయం నుంచి రాత్రి వరకు ఆ ఇంట్లో పని చేస్తాడు. వాళ్ళు పెట్టే మిగిలిపోయిన అన్నం, కూరలు తింటూ జీవిస్తున్నాడు. చాకిరి చెయ్యడమే కాకుండా ప్రతిరోజు ఏదో ఒక వంకతో ఆ యజమానురాలు కొట్టే దెబ్బలు, తిట్లు భరిస్తున్నాడు. ఇవన్నీ తలచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఇల్లు చక్కబెడుతున్నాడు. ‘ఒరేయ్ సూరీ ఎంతసేపురా! ఇటురా!’ అనే కేకతో ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకొని వెళ్లాడు. కంటకురాలైన యజమానురాలి హెచ్చరికతో బండెడు గిన్నెలు తోమడం మొదలు పెట్టాడు.అవి క్రిస్మస్ పండుగ రోజులు. కాంతారావుగారి ఇల్లంతా సందడే సందడి. ఇల్లంతా పువ్వులతో, కరెంటు దీపాలతో అలంకరించారు. అమ్మగారు, వాళ్ళ పిల్లలు ఖరీదైన బట్టలు, నగలు ధరించారు. పిండివంటల ఘుమఘుమలతో, ఇంటికొచ్చిన బంధువులు, స్నేహితులతో, పిల్లల కేరింతలతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. సూరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. క్షణం తీరిక లేకుండా పని చేస్తూనే ఉన్నాడు. మధ్యమధ్యలో ఈ సందడంతా గమనిస్తూనే ఉన్నాడు. భోజనాల సమయమైంది. అందరూ భోంచేశారు. సూరి ఒక్కడే మిగిలి పోయాడు.పెరట్లో కూర్చుని అమ్మగారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అమ్మగారి కేక వినిపించింది. ‘రారా సూరీ అన్నం తిందువు గాని’.. వెంటనే ఆత్రంగా వెళ్ళాడు. రాత్రి భోజనం లేదు. ఉదయం లేదు గదా ఇప్పుడు పెట్టే పిండి వంటలు ఆరగిద్దామంటూ తనకు పెట్టిన భోజనం వైపు చూశాడు. ఎంత ఆశతో వెళ్లాడో అంత నిరుత్సాహానికి గురయ్యాడు. మాడు అన్నం, వూడ్చి వూడ్చి వేసిన కూర చూసి తినలేక దుఃఖం పొంగుకు వచ్చింది. ఆకలంతా చచ్చిపోయింది. మంచినీళ్ళు తాగి వెళ్ళి, వారంతా తిన్న గిన్నెలన్నీ తోమి, మిగతా పనులన్నీ చక్కబెట్టి ఇంటికి బయలుదేరాడు. ఒళ్ళంతా హూనమైపోయింది. కళ్ళు తిరుగుతున్నాయి. చడీచప్పుడు లేకుండా ఇంటిలోకి అడుగు పెట్టాడు. అప్పటికే వాళ్ళ నాన్న బీభత్సం సృష్టించాడేమో! చెల్లెళ్ళంతా ఏడుస్తూ చలికి దుప్పట్లు లేక కాళ్ళు ముడుచుకొని వణుకుతూ పడుకున్నారు. తల్లి మంచం మీద మూలుగుతోంది. గుడిసె అంతా చిందరవందర. సర్దిపెట్టే ఓపిక లేక తల్లి వద్ద తాను చిన్న గుడ్డ ముక్క పరచుకుని పడుకున్నాడు. పండగపూట కదా! కొడుకు ఏదైనా తెస్తాడని ఆశించిన తల్లి కుమారుని పరిస్థితి చూసి తల్లడిల్లిపోయింది. సూరి పడుకున్నాడు గాని నిద్ర పట్టడం లేదు. ఏడుపొస్తోంది. అమ్మకు కనబడకుండా ఏడ్వాలనుకున్నాడు కాని, అదిమి పట్టేకొద్ది ఎక్కువైపోయింది. ఒక్కసారిగా సూరి తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తున్నాడు. ‘ఏంట్రా? నీ బాధేమిటో చెప్పమ్మా’ అమ్మ అడుగుతోంది. ఆ రోజు జరిగినదంతా అమ్మకు చెప్పాడు. తల్లి నచ్చచెప్ప ప్రయత్నించింది. తన్ను తాను తమాయించుకొని, ‘అమ్మా! క్రిస్మస్ అంటే ఏంటమ్మా?’ అని అడిగాడు. వాళ్ళమ్మ చెప్పింది. ‘మానవులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు పుట్టినరోజురా’.. ‘అమ్మా! ఆయన గొప్పోళ్ళకేనా దేవుడు? మనలాంటి పేదోళ్ళకు దేవుడు కాదా?’.. ‘లేదు నాయనా! దేవుడు అందరికీ దేవుడే! ఈ లోకంలోని ప్రజలందరి కోసం ఆయన పుట్టాడు. మనలాంటి పేదోళ్ళ బతుకులు బాగుపరచడానికి, చెడ్డవాళ్ళను మంచివాళ్ళుగా చేసి తన రాజ్యానికి చేర్చడానికి వచ్చాడు!’.. ‘అలా అయితే మనకేంటి ఈ పేద బతుకు?’ దుఃఖంతో అన్నాడు సూరి. ‘లేదు నాయనా! అసలైన పేదరికం భౌతికమైనది కాదు. మనలోని ఆత్మకు సంబంధించినది. పాపంలో బందీయైన ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా దరిద్రుడే! ప్రేమ హీనత, క్షమించలేకపోవడం, అహంభావం, ఇతరులను అవమానించడం లాంటివి ఆధ్యాత్మిక పేదరికానికి నిదర్శనాలు. అలాంటి స్థితిలో ఉన్నవారిని ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేర్చడానికి యేసయ్య కూడా అందరికీ దగ్గరవ్వడానికి పేదవానిగానే వచ్చాడు. బెత్లేహేము గ్రామంలో పశువుల తొట్టెలో పుట్టాడు. ‘అయ్యో! పశువుల తొట్టా? దేవుడు పశువుల తొట్టెలో పుట్టడమేంటమ్మా?’.. ‘ఆయన పశులతొట్టెలో పుట్టాడు కాబట్టే, సామాన్యులైన గొర్రెల కాపరులు ఆయనను మొదట దర్శించుకున్నారు. దేవుడు వారికి ఇంత దగ్గరగా వచ్చినందుకు వారి ఆనందానికి అవధులు లేవు. యేసుక్రీస్తు నజరేతులో పెరిగి పెద్దవాడయ్యాక అనేకమంది రోగులను బాగుచేశాడు, బీదవాళ్ళను, కుష్ఠు రోగులను అక్కున చేర్చుకున్నాడు. కన్నీరు తుడిచి, తన బిడ్డలుగా చేసుకున్నాడు. అంతేకాదు! మనందరి కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. తలలో ముళ్ళు, చేతుల్లో, కాళ్ళల్లో మేకులు, ఒళ్ళంతా కొరడా దెబ్బలు. కడుపులో బల్లెపు పోట్లు, శరీరమంతా మాంసపు ముద్దగా మారి రక్తాన్ని చిందించాడు. దుర్మార్గులు పొందాల్సినవన్నీ ఆ ప్రేమమయుడు తనపై వేసుకున్నాడు. ఈ ప్రాణత్యాగం చేయడానికి పరలోకాన్ని వీడి ఈ లోకానికి వచ్చాడు. మరో గొప్ప సంగతి. చనిపోయి మూడవరోజు తిరిగి లేచాడు’ అని తల్లి అనేక విషయాలు సూరికి తెలిపింది. ‘అయితే ఇకనుండి నేను ఏడ్వను. మా అమ్మగారిని తిట్టను, నాన్నమీద కోపపడను. వీళ్ళందరినీ ప్రేమిస్తాను. ఎన్ని కష్టాలొచ్చినా ఫర్వాలేదు. యేసయ్య నాతో ఉన్నారుగా’ అంటూ ఆ చిన్ని హృదయంలోకి ప్రభువును చేర్చుకున్నాడు. తిట్లకు, తన్నులకు, పస్తులకు సూరి భయపడట్లేదు, ఏడ్వట్లేదు. కొన్ని రోజులు గడిచాయి. తాను పనిచేసే ఇంటి అమ్మగారికి జబ్బు చేసింది. ఆమె పిల్లలంతా ఆమెకు సేవ చేయలేక వెళ్ళిపోయారు. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆ సమయంలో సూరి ఆమెకు ఎంతో శ్రద్ధతో çసపర్యలు చేయడం మొదలుపెట్టాడు. చావు బతుకుల్లో ఉన్న ఆమెను బతికించాడు. ఆమె కోసం నిద్రాహారాలు లేకుండా ప్రార్థించాడు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేలా ఆమె కోలుకుంది. ఆమె మనస్సంతా కృతజ్ఞతతో నిండిపోయింది. సూరిని దగ్గరకు పిలిపించింది. గట్టిగా కౌగిలించుకొని కన్నీరు కార్చింది. ‘ఒరేయ్ సూరీ! నేనంటే నీకు ఎందుకురా ఇంత ప్రేమ? నిన్ను ఇంతగా బాధలు పెట్టిన నన్ను ఎంత ఆదరించావురా! నా పిల్లలు కూడా నా పరిస్థితిని చూసి నన్ను విడిచి వెళ్ళిపోయారే! నువ్వు మాత్రం నన్ను కంటికి రెప్పలా కాచి మనిషిని చేశావురా’ అని మెచ్చుకుంటుంటే సూరి ‘మా అమ్మగారేనా ఇలా మాట్లాడుతోంది? దేవుడెంత గొప్పవాడు’ అనుకుంటూ దేవున్ని స్తుతించాడు. ‘క్రీస్తు ప్రభువు నాలోకి వచ్చి ఉండకపోతే నేను మిమ్మల్ని ప్రేమించి ఉండేవాణ్ణి కాదు. ఆ యేసయ్య ప్రేమతో పోల్చుకుంటే నేను చూపిన ప్రేమ సముద్రంలో నీటి చుక్క.. మంచినీళ్ళు తెమ్మంటారా?’ అని పైకి లేచాడు. సూరి మాటలకు నిశ్చేష్టురాలైంది. ఔను! బుద్ధిహీనులకు తెలివి కలిగించేది దేవుని వాక్యం. ఎన్ని క్రిస్మస్ పండుగలు వెళ్ళిపోయాయి. దేవుని ప్రేమను ఎంతగా దుర్వినియోగపరచాను. కొంచెం కూడా దేవుని ధ్యాస లేకుండా ఆడంబరాల మీదే మనసు పెట్టి, అసలు ఆశీర్వాదాన్ని కోల్పోయానే! ఈ చిన్న పిల్లవాని ద్వారా దేవుడు నిజంగా నా కన్నులు తెరిచాడు అని దేవునికి తనను తాను అర్పించుకున్నది. ఇంటికి వెళ్ళిన సూరి అమ్మగారిలో వచ్చిన మార్పును తన కుటుంబంతో పంచుకున్నాడు. తెల్లారింది. అమ్మగారింటికి బయలుదేరాడు. ఆమె సాదరంగా సూరిని ఆహ్వానించి కేకు కోయించి, కొత్త బట్టలు ధరింపజేసి, ప్రార్థన చేసింది. ‘అమ్మగారూ! క్రిస్మస్ పండుగ అయిపోయింది కదండీ. మళ్ళీ ఇవన్నీ ఏంటండీ’ అడిగాడు. ‘లేదురా సూరీ! అసలు పండుగ నా జీవితంలో ఇదే! నేను నమ్మిన వారంతా నన్ను మోసం చేశారు. నేను ద్వేషించిన వారు నాకు సహాయం చేసి నిజమైన ప్రేమంటే ఏమిటో చూపించారు’.. ఈ మాటలకు సూరి ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తన బంధువులు, స్నేహితులు అందరిముందు ‘సూరిని నా కొడుకుగా చేసుకొంటున్నాను. నా తదనంతరం ఈ యావదాస్తికి అతడే వారసుడు. క్రిస్మస్ బహుమానంగా దేవుడు సూరిని నాకు అనుగ్రహించాడు’ అని చెమ్మగిల్లిన కళ్ళతో సూరిని వాటేసుకుంది. ఒక మనిషికి కనువిప్పు కలగడమే నిజమైన పండుగ. క్రైస్ట్, మాస్ అనే రెండు పదాల కలయిక క్రిస్మస్. దీని అర్థం క్రీస్తును ఆరాధించడం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది క్రైస్తవులు క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మన్ జరుపుకుంటారు. క్రీస్తు జననం చరిత్రాత్మకమైనది. సుప్రసిద్ధ చరిత్రకారులు క్రీస్తు చరిత్రను అద్భుతంగా వివరించారు. వారిలో రోమా చరిత్రకారుడు గాయిస్ ప్లినియస్ ఒకడు. ఇతడు రోమా చక్రవర్తి ట్రాజన్ దగ్గర మేజిస్ట్రేట్గా క్రీ.శ 98 నుండి 117 వరకు పనిచేశాడు. చక్రవర్తియైన ట్రాజన్కు ఇతనికి జరిగిన ఓ సంభాషణ ఆ కాలంలోని క్రైస్తవుల నిబద్ధతలను వెల్లడిచేసింది. ‘క్రైస్తవులు చీకటి పడకముందే ఒక నియమిత సమయానికి కలుసుకొనేవారు. క్రీస్తును దేవునిగా సంబోధిస్తూ పాటలు పాడేవారు. తాము ఎప్పుడూ ఏ దోషము, దొంగతనమును చేయమని, తాము కట్టుబడియున్న పవిత్ర ప్రమాణమును గౌరవిస్తామని తీర్మానించుకున్నారు. తమ మాటను ఎన్నడు అబద్ధముగా మార్చమని, తప్పుడు ప్రమాణము చేయమని చెప్పుకొనేవారు’. పైమాటలను గమనిస్తే యేసుక్రీస్తును అంగీకరించి మారుమనస్సు పొందిన పిదప వారు నమ్మిన వాక్యమునకు దేవుని బిడ్డలు ఏవిధంగా కట్టుబడియున్నారో విశదమవుతుంది.అపొస్తలుడైన పౌలు తన సువార్త యాత్రలో ఒకసారి గ్రీసు దేశమునకు వెళ్ళాడు. గ్రీసు రాజధాని ఏథెన్సు మహానగరం. విశ్వ విజేతగా పేరుపొందిన అలెగ్జాండరు గ్రీకు సామ్రాజ్యాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. ప్రపంచ ప్రఖ్యాత తత్త్వజ్ఞానులు సోక్రటీసు, అరిస్టాటిల్, ప్లేటో ఈ దేశానికి చెందినవారే! అక్కడి ప్రజలు తత్త్వజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ‘గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెదకుచున్నారు’ అని పౌలు ప్రస్తావించుటలో ఆశ్చర్యమేమీ లేదు. ఏథెన్సులో అరీయొపెగు అనే ప్రాంతం ఉన్నది. దానిని అరీసు కొండయని పిలుస్తారు. ఏథెన్సు మహాసభ వారు అక్కడ కూర్చుండేవారు. ఆ పట్టణంలోని ఘనులు, ధనికులు, అధికారులలోని ముఖ్యులు దీనిలో సభ్యులుగా ఉండేవారు. మొదట్లో దేశంలో జరిగే నేరములను ఈ ప్రాంతంలోనే విచారించి, నేరస్థులకు శిక్షలు విధించేవారు. తరువాతి కాలంలో దేశపాలన విషయాలను, రాజనీతి విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను కూడా తర్కిస్తుండేవారు. ఎవరైనా ఒక కొత్త విషయాన్ని చెప్పాలనుకుంటే, ఆ సభకు వెళ్ళి చెప్పాలి. వారు చెప్పిన వాటిలో సత్యం లేకపోతే, తేలు విషాన్ని వారికిచ్చి అక్కడే వారిని చంపేస్తారు. అక్కడ పలికే ప్రతి మాట చాలా జాగ్రత్తగా పలకాలి. అపొస్తలుడైన పౌలు క్రీస్తును గూర్చిన సత్యాన్ని చెప్పడానికి అరీయొపెగు మధ్యన నిలిచి, నిర్భయంగా ప్రకటించాడు. అనేకమందిని ఆలోచింపచేసిన ప్రసంగమది: ‘‘ఏథెన్సు వారలారా! మీరు సమస్త విషయములలో విశేష భక్తి గలవారై ఉన్నట్లు కనబడుచున్నది. నేను మీ పట్టణములో సంచరించుచుండగా నాకొక బలిపీఠము కనబడింది. దానిమీద ‘మాకు తెలియబడని దేవుడు’ అని వ్రాసియుంది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి గలిగి యున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను’’.. తెలియబడని దేవునికి నిర్మించిన బలిపీఠాన్ని గ్రీకు భాషలో ‘అగ్నోస్టిక్ థియోస్’ అంటారు. క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏథెన్సులో ఒక తెగులు వ్యాపించింది. భయంకరమైన తెగులు ద్వారా ప్రజలు చనిపోతున్నారు. ఎన్నో పూజలు, ప్రయత్నాలు చేసినా, పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆ సమయంలో అక్కడ ప్రజాదరణ పొందిన ఎపిమెనిడెస్, అరాటస్ అను ఇద్దరు తత్త్వజ్ఞానులు ఉండేవారు. ప్రజలు వారి యొద్దకు వెళ్ళి తమ గోడు వెళ్ళగక్కారు. వచ్చిన తెగులు తొలగిపోవడానికి పరిష్కార మార్గాన్ని చూపాలని అడిగారు.అప్పుడు వారు ఈ విచిత్రమైన సలహాను ఇచ్చారు: ‘మీ శక్తి కొలది కొంతమంది దేవుళ్ళను ఆరాధించుచున్నారు. మీకు తెలియని దేవుళ్ళు కూడా ఉండవచ్చు. బహుశా వారు మీ మీద ఆగ్రహించి ఈ తెగులును పంపియుండవచ్చు. ఈ తెగులు అరికట్టాలంటే మీరు ఒక బలిపీఠమును కట్టి దానికి తెలియబడని దేవుడు అని పేరు పెట్టండి. ఆ దేవుడు శాంతించి తెగులును నిలిపివేయవచ్చు’.. ఆ మాటలను లక్ష్యపెట్టిన ప్రజలు తెలియబడని దేవునికి బలిపీఠం కట్టారు. అక్కడ వారు చేసే ప్రార్థనలు తెలియబడని దేవుని దగ్గరకు వెళ్తున్నాయని భ్రమపడేవారు. సరిగ్గా ఆ ప్రజల ప్రశ్నలకు పౌలు చక్కని సమాధానాలను ఇచ్చాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు విశిష్ట లక్షణాలను కలిగియుంటాడు. వాటిలో మొదటిది: ‘ఆయన సృష్టికర్త’. తన మహిమ కోసం సమస్తాన్ని సృష్టించిన దేవుడు మానవుని తన పోలికలో సృష్టించాడు. మనిషి పరమార్థం సృష్టికర్తను తెలుసుకొని తన గమ్యాన్ని అర్థం చేసుకోవడమే! రెండవది: దేవుడు మనలో ఏ ఒక్కరికీ దూరంగా ఉండువాడు కాదు. గ్రీకులలో కొందరు జ్ఞానులు దేవుడున్నాడు గాని, ఆయన మనుషులను పట్టించుకోడు అని బోధించేవారు. ఆ ఆలోచనను పౌలు ఖండించాడు. దేవుడు మానవుని పట్ల శ్రద్ధ కలిగియుంటాడు. మనిషికి దగ్గరగా ఉండాలనే మనుష్య రూపంలో ఈ లోకానికి ఏతెంచాడు. మూడవది: దేవుడు మనిషి నుండి మార్పును ఆంకాక్షిస్తున్నాడు. ఆ మార్పు హృదయానికి సంబంధించినది. ఇత్యాది విషయాలను తెలియచేయడం ద్వారా పౌలు అనేకులను సత్యం వైపు నడిపించాడు. క్రీస్తు రాక పుడమిని పులకింపచేసింది. తరతరాల నిరీక్షణ ఫలితమే యేసుక్రీస్తు పుట్టుక. క్రీస్తుకు పూర్వం ఎందరో ప్రవక్తలు ఆయన రాకను కాంక్షిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనాలు పలికారు. వారి ప్రవచనాలు తనలో నెరువేర్చుకుంటూ క్రీస్తు మానవ చరిత్రలో ప్రవేశించారు. ఆయన పుట్టినప్పుడు ఇశ్రాయేలు రాజ్యము రోమా పాలనలో ఉంది. దాస్యం, అన్యాయం, అవినీతి ముమ్మరంగా ఉన్నాయి. వాటి నుండి విముక్తి కోసం మెస్సీయా రావాలని ఆశించారు. అయితే క్రీస్తు రాజకీయ స్వాతంత్య్రాన్ని ఇవ్వడానికి రాలేదు. అందరికీ ఆధ్యాత్మిక స్వాతంత్య్రం అనుగ్రహించడానికి వచ్చాడు. ఆ కాలంలోని సుంకపు గుత్తదారుడైన మత్తయి యేసుక్రీస్తు చరిత్రను వ్రాసే భాగ్యాన్ని పొందుకున్నాడు. మత్తయి సువార్త ప్రారంభంలో ఇలా ఉంటుంది. పాతనిబంధన గ్రంథంలో అబ్రాహాముకు దావీదుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. అబ్రాహామును యూదులకు తండ్రిగా పిలిచారు. అతడు విశ్వాసులకు తండ్రి అని పేరు పొందాడు. కల్దీయ దేశాన్ని విడిచి దేవుని పిలుపును బట్టి కనాను దేశానికి వచ్చి దైవ సంకల్పంలో పాలిభాగస్తుడయ్యాడు. అతని కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. ఈ ముగ్గురినీ మూలపురుషులు అని పిలుస్తారు. వీరి సంతానమే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది నలభై సంవత్సరాల అరణ్యయాత్ర తదుపరి యెషువా నాయకత్వంలో కనాను దేశాన్ని చేరుకున్నారు. నాలుగు శతాబ్దాలు న్యాయాధిపతుల పాలనలో ఉన్న ఆ ప్రజలు రాజు పాలన కోసం పట్టుబట్టారు. మొదటి రాజుగా సౌలు, తర్వాత దావీదు వారిని పరిపాలించారు. యేసుక్రీస్తు దావీదు వంశంలోను జన్మించి పాతనిబంధన లేఖనాలను నెరవేర్చారు. యేసుక్రీస్తు పుట్టుక అకస్మాత్తుగా జరిగింది కాదు. అది ప్రవచనానుసారం. క్రీస్తు కన్యకకు జన్మిస్తాడని, కన్య గర్భాన ఈ లోకంలోనికి రావడం ద్వారా ఆయన పరిశుద్ధుడుగా జీవిస్తాడని ఎన్నో యేండ్ల క్రితం ఝెషయా అనే ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. పశువుల తొట్టెలో జన్మిస్తాడని యోబు గ్రంథంలోను, బెత్లేహేములో ఉదయిస్తాడని మీకా గ్రంథంలోను, నీతి చిగురుగా వస్తాడని జెకర్యా గ్రంథంలోను స్పష్టంగా ప్రవచించబడ్డాయి. క్రీస్తు జన్మించినప్పుడు నక్షత్రం కనిపిస్తుందని, జ్ఞానులు ఆయన్ను దర్శించుకుంటారని, ఆయనకు ముందుగా యోహాను అనే భక్తుడు వస్తాడనే ప్రవచనాలు చాలా సంవత్సరాలకు ముందే ప్రవచించబడ్డాయి. యేసుక్రీస్తు జన్మించినప్పుడు మొదటిగా సామాన్యమైన గొర్రెల కాపరులు ఆయన్ను దర్శించుకున్నారు. ‘మీరు భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు’ అని దూత ద్వారా గొర్రెల కాపరులకు వర్తమానం అందింది. ఆనాడు క్రీస్తు పుట్టిన చోట ఇప్పుడు ఓ గొప్ప దేవాలయాన్ని చూస్తాం. బెత్లేహేము సందర్శించే ప్రతి ఒక్కరూ ఆ దేవాలయంలో క్రీస్తు పుట్టినచోట ఉన్న నక్షత్రాన్ని చూసి వస్తారు. దానిని చర్చ్ ఆఫ్ నేటివిటీ అని పిలుస్తారు. బేత్లెహేము అనగా రొట్టెల గృహం. ఇది ప్రపంచ నగరాలతో పోలిస్తే చాలా చిన్నది. కాని, జగద్రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించడం ద్వారా దీనిని గురించి తెలియని వారు లేరు. జస్టిన్ మార్టర్ అనే చరిత్రకారుడు క్రీ.శ 160లో వ్రాసిన పుస్తకాల ఆధారంగా, 3వ శతాబ్దికి చెందిన చరిత్రకారులు ఆరిజన్, యుసేబియస్లు తెలిపిన వివరాల ప్రకారం బేత్లెహేములో ఉన్న ఈ స్థలం క్రీస్తు జన్మస్థలంగా నిర్ధారించబడింది. కాన్స్టెంటెయిన్ తల్లియైన సెయింట్ హెలీనా ఆధ్వర్యంలో క్రీ.శ 339 మే 31న ఈ నిర్మాణం పూర్తయింది. బైబిల్ను లాటిన్ బాషలోనికి అనువదించిన చరిత్రకారుడు సెయింట్ జెరోమ్ కూడా క్రీ.శ 384 సంవత్సరంలో ఇక్కడే సమాధి చేయబడ్డాడు. క్రీస్తు ప్రభువు జన్మించిన పవిత్రస్థలాన్ని అందరూ దర్శించాలనే ఉద్దేశంతో దీనిని నిర్మించారు. క్రీ.శ 614లో పర్షియా దేశస్థులు, ఇశ్రాయేలును ఆక్రమించుకుని ప్రతి దేవాలయాన్ని నేలకూల్చారు. వారు ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీని మాత్రం కూల్చలేదు. కారణమేమిటంటే, ఆ చర్చ్లో యేసుక్రీస్తు పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసిన జ్ఞానులలో ఒకరు పర్షియా దేశస్థుడు కావటమే! 6వ శతాబ్దానికి చెందిన జస్టీవియస్ అనే చక్రవర్తి ఈ చర్చిని మరింత అందంగా రూపొందించాడు. ఈ చర్చిలో మరింత ప్రాముఖ్యమైనది స్టార్ ఆఫ్ బేత్లెహేము. ఆ ప్రాంతంలోనే సర్వాధికారియైన యేసుక్రీస్తు సమస్త మానవాళిని రక్షించడానికి నరావతారి అయ్యాడు. బేత్లెహేము నక్షత్రం ప్రక్కనే యేసుక్రీస్తు పవళించిన పశువుల తొట్టె నమూనా కూడా ఉంది. అక్కడ కన్యయైన మరియ యేసుకు జన్మనిచ్చిన స్థలం అనే అక్షరాలు చెక్కబడియున్నవి. యేసుక్రీస్తు జన్మించిన తదుపరి ఆయన్ను వెదకుచూ తూర్పు దేశపు జ్ఞానులు ఇశ్రాయేలుకు వచ్చారు. యూదుల రాజు అంతఃపురంలో జన్మిస్తాడని భావించి హేరోదు రాజునొద్దకు వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆరాధించడానికి వచ్చామని తెలియచేశారు. వారి మాటలు హేరోదు రాజును కలవరపరచాయి. శాస్త్రులను పిలిచి క్రీస్తు జన్మించే స్థలం ఏమిటని ప్రశ్నించాడు. వారు లేఖనాలను పరిశీలించి ఆయన బ్లెత్లేహేములో జన్మిస్తాడని తెలియచేశారు. మీరు వెళ్ళి ఆయన్ను ఆరాధించి తిరిగి నా యొద్దకు రండి అని హేరోదు జ్ఞానులను పంపివేశాడు. వారు వెళ్ళి బాలుడైన యేసును కనుగొని, ఆయన ముందు సాగిలపడి బంగారాన్ని, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించారు. వారు దేవుని చేత బోధించబడినవారై మరియొక మార్గమున తమ దేశములకు వెళ్ళారు. బంగారము క్రీస్తు దైవత్వమునకు, రాజరికమునకు, సాంబ్రాణి ఆయన ఆరాధనీయుడని, బోళము ఆయన మానవుల నిమిత్తం పొందబోయే శ్రమలకు సాదృశ్యమని బైబిల్ పండితులు వివరించారు. క్రిస్మస్ ప్రేమ పండుగ. నిజమైన ప్రేమ విశిష్టతను తెలిపే పండుగ. ప్రేమ అంటే తీసుకోవడం కాదు, ఇవ్వడం అనే ధన్య సత్యాన్ని అర్థం చేసుకొనే ప్రతి ఒక్కరూ క్రిస్మస్ను ఆత్మానుసారంగా పాటిస్తారు. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’– (యోహాను 3:16). నిత్యజీవితంలో ప్రతి మనిషిలోనూ కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. వీటన్నింటిలోనూ మనకు ఎక్కువగా వినిపించేది ‘ప్రేమ’. పవిత్రమైన ఈ పదం ఈ రోజులలో చాలా ప్రమాదకరముగా మారిపోయింది. శాశ్వత ప్రేమ, నిజమైన ప్రేమ మానవ ఊహలకు మించినది. ఆ ప్రేమ ‘ప్రేమాస్వరూపియైన’ దేవుని నుంచి మాత్రమే రావాలి. క్రీస్తు ప్రభువు కేవలం ప్రేమిస్తున్నానని చెప్పడమే కాదు ఆ ప్రేమను సిలువలో మరణించుట ద్వారా ఋజువుపరచాడని పౌలు రోమాలో సంఘానికి వ్రాసిన ఉత్తరంలో తెలియచేశాడు. మనమింకను పాపులమై ఉండగానే, శత్రువులమై యుండగానే, బలహీనులమై యుండగానే క్రీస్తు యుక్తకాలమున మనకొరకు మరణించెను. దేవుడు తన ప్రేమను మానవుల పట్ల వ్యక్తపరచి సమసమాజ నిర్మాణానికి చక్కని మార్గాన్ని ఉపదేశించారు. ‘నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు’ అనే జీవనసూత్రాన్ని క్రీస్తు ఉపదేశించారు. ప్రతియేటా డిసెంబర్ 26వ తేదీని ‘బాక్సింగ్ డే’ అని పిలుస్తారు. క్రిస్మస్ తర్వాతి రోజున అవసరతలో ఉన్నవారికి బహుమతులు పంచుతారు. ఎవరి స్థాయిని బట్టి వారు వారికి తెలిసిన వారికి ఇబ్బందుల్లో ఉన్నవారికి కానుకలు పంపి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ‘నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను వచ్చాను’ అని క్రీస్తు పలికిన మాటను క్రైస్తవులు అత్యధికంగా విశ్వసిస్తారు. పాపపు అంధకారంలో చిక్కి, నిత్యశిక్షను మూటకట్టుకున్న మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసు అనుమాటకు రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనుక ఆయన రక్షకుడు అని బైబిల్ తెలియచేస్తున్న విషయం. మానవాళి ఎదుర్కొంటున్న ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానమై యుంటాడు. ‘ఓ దేవా! నన్ను అసత్యము నుండి సత్యములోనికి, చీకటి నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి, పాపము నుండి పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపించు’ అని మానవుడు ప్రార్థిస్తే.. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు సత్యమై, వెలుగై, జీవమై, పరిశుద్ధుడుగా తన ఉనికిని వెల్లడిచేశాడు. వెలిగింపబడిన హృదయం నుండి జాలువారిన ఓ మధురమైన పాట ఇది. ‘కొనియాడ తరమే నిను.. కోమల హృదయ.. కొనియాడ తరమే నిను. తనరారు దినకరు బెను తారలను మించు... ఘన తేజమున నొప్పు కాంతిమంతుడ నీవు’.. సర్వలోకంబుల బర్వు దేవుడువయ్యు.. నుర్వి స్త్రీగర్భాన నుద్భవించితి నీవు.. కొనియాడ తరమే నిను’సాక్షి పాఠకులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ‘మానవులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన రోజురా’.. ‘అమ్మా! ఆయన గొప్పోళ్ళకేనా దేవుడు? మనలాంటి పేదోళ్ళకు దేవుడు కాదా?’‘ఆయన సృష్టికర్త’. తన మహిమకోసం సమస్తాన్ని సృష్టించిన దేవుడు మానవుని తన పోలికలో సృష్టించాడు. మనిషి పరమార్థం సృష్టికర్తను తెలుసుకొని తన గమ్యాన్ని అర్థం చేసుకోవడమే!సర్వాధికారియైన యేసుక్రీస్తు సమస్త మానవాళిని రక్షించడానికి నరావతారి అయ్యాడు. బేత్లెహేము నక్షత్రం ప్రక్కనే యేసుక్రీస్తు పవళించిన పశువుల తొట్టె నమూనా కూడా ఉంది. -
మారడోనా టు పారషూట్
ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెదుక్కోవాలి అన్నట్టు.. నటి శరణ్య రామచంద్రన్ నాయర్ కూడా ఎక్కడైతే తన నటనపై విమర్శలను ఎదుర్కొందో అక్కడే ప్రశంసలను అందుకోవాలని నిశ్చయించుకుంది. సినిమాలు, సిరీస్లలో అభినయిస్తూ ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె గురించి కొన్ని విషయాలు..శరణ్య పుట్టి, పెరిగిందంతా కేరళలోని తిరువనంతపురంలో. ఎమ్బీఏ చేస్తున్నప్పుడు పాకెట్ మనీ కోసం మోడలింగ్లోకి అడుగుపెట్టింది. యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎమ్బీఏ పూర్తయిన తర్వాత సొంత బిజినెస్ మొదలుపెట్టాలనుకుంది. వరుస మోడలింగ్ అవకాశాలతో ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. మరెన్నో ఫొటో షూట్స్తో బిజీగా మారింది. అలా ఓ యాడ్ ఫిల్మ్ చేస్తున్నప్పుడే సినిమా చాన్స్ వచ్చింది.ఒక్క సినిమా చేసి వెళ్లిపోదాం అనుకుంది. కానీ, ఆ చిత్రం ‘మారడోనా’ పెద్దగా ఆడలేదు. శరణ్య యాక్టింగ్పై కూడా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. దాంతో, నటిగా తనేంటో నిరూపించుకోవాలని నిశ్చయించుకుంది.తను నటించిన ‘టూ స్టేట్స్’, ‘మై నేమ్ ఈజ్ అళగన్’, ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా పరవాలేదు అనిపించాయి. ‘ఝాన్సీ’ సిరీస్తో వెబ్ దునియాలోకీ అడుగు పెట్టి తెలుగు వీక్షకులకూ పరిచయమైంది.ప్రస్తుతం తను నటించిన ‘పారషూట్ ’ సిరీస్ తెలుగు, తమిళ, మలయాళంతో పాటు పలు భాషల్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. వీక్షకాదరణ పొందుతోంది.ఆనందం అనేది ఎవరో ఇస్తే రాదు. మనలోనే ఉంటుంది. అందుకే నేనెప్పుడూ నా మనసు చెప్పిందే వింటాను.– శరణ్య రామచంద్రన్ నాయర్. -
చిట్టి గుండెకు గట్టి భరోసా
చిట్టి గుండె కూడా లయ తప్పుతోంది.. గట్టిపడేలోపే గండాల్లో చిక్కుకుంటోంది!గట్టెక్కించి ఆ బుజ్జి గుండెకు నూరేళ్ల భరోసానిస్తోందిశ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్!ఎక్కడో కాదు.. తెలంగాణ, సిద్దిపేటలో!ఇక్కడ అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు మందులు సహా చికిత్స అంతా ఉచితమే! చిన్నారితో పాటు తల్లితండ్రులకూ ఉచిత భోజన, వసతి సౌకర్యాలున్నాయి.∙గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేటఏటా ప్రపంచవ్యాప్తంగా 13. 5 లక్షల మంది పిల్లలు గుండె లోపాలతో పుడుతున్నట్లు అంచనా. ఇందులో మన దేశంలోనే 2.4 లక్షల మంది ఉండగా.. వాళ్లలో 60వేల మందికి హార్ట్ సర్జరీ అనివార్యమవుతోంది. కానీ 10వేల మంది చిన్నారులకు మాత్రమే ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఫలితంగా చాలామంది మృత్యువాత పడుతున్నారు. కొందరు పిల్లలు అనారోగ్య సమస్యలతోనే జీవనపోరాటం చేయాల్సి వస్తోంది. ఇలాంటి చిన్ని హృదయాలకు ఆరోగ్య భరోసా కల్పించేందుకు శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. 2012లో శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్స్ని ప్రారంభించింది. అందులో భాగంగా రాయ్పూర్ (ఛత్తీస్గఢ్), పల్వాల్ (హరియాణ), ముంబై (మహారాష్ట్ర), ముద్దహళ్లి(కర్ణాటక)లో చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేసింది. ఆ వరుసలోనిదే సిద్దిపేటలోని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్ కూడా! ఇవికాకుండా మరో అయిదు ప్రాంతాల్లో మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లనూ ఏర్పాటుచేసి వైద్యసేవలతో పేదలకు అండగా నిలుస్తోందీ ట్రస్ట్. ఐదు చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్లలో ఇప్పటి వరకు 5,86,366 మంది చిన్నారులకు ఓపీ సేవలను అందించారు. అందులో 33,772 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేశారు. విదేశాల నుంచి వస్తున్న పిల్లలకూ అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. సిద్దిపేటలో..శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ రీసెర్చ్.. ఐదెకరాల విస్తీర్ణంలోని వంద పడకల ఆసుపత్రి. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ హార్ట్ సర్జన్ల బృందం సేవలను అందిస్తోంది. మాజీ క్రికెటర్, శ్రీ సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు సునీల్ గావస్కర్ కూడా ఈ సెంటర్ను సందర్శించారు.ఫొటోలుః కె సతీష్ఓన్లీ దిల్ .. నో బిల్ శ్రీ సత్యసాయి సంజీవని చిన్న పిల్లల ఆసుపత్రిలో కేవలం దిల్ మాత్రమే ఉంటుంది. బిల్ ఉండదు. ఇక్కడ ట్రీట్మెంట్ పొందిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒక భరోసా కనిపిస్తోంది. ∙సునీల్ గావస్కర్, ఇండియన్ మాజీ క్రికెటర్, సత్యసాయి ట్రస్ట్ సభ్యుడున్యాయం చేస్తున్నాం.. మేము చదివిన చదువుకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా న్యాయం చేస్తున్నాం. ఇప్పటి వరకు రెండువేలకు పైగా హార్ట్ సర్జరీలు చేశాం. హార్ట్కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను వెంటనే డాక్టర్స్కి చూపించాలి.∙డాక్టర్ అమితా శర్మ, అనఘా తులసి, భూషణ్ఫ్రీగా చేస్తారని తెలిసి..మా పాపకు తరచు అనారోగ్యం చేస్తుండటంతో హాస్పిటల్లో చూపిస్తే గుండెలో రంధ్రం ఉందని గుర్తించారు. సర్జరీ చేయాలన్నారు. సత్యసాయి చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్లో ఫ్రీగా చేస్తారని తెలిసి ఇక్కడికి వచ్చాం. పాపకు సర్జరీ అయింది.∙శాలిని యాదవ్, ఉత్తర్ప్రదేశ్ బరువు పెరగట్లేదని.. మా బాబు బరువు పెరగట్లేదని డాక్టర్కి చూపిస్తే హార్ట్లో హోల్ ఉందని తేల్చారు. తెలిసినవాళ్ల ద్వారా సత్యసాయి హాస్పిటల్కి వచ్చాం. పైసా తీసుకోకుండా బాబుకు సర్జరీ చేశారు. ∙బోలేశ్వర్, రాయ్పూర్, ఛత్తీస్గఢ్సేవే లక్ష్యంగా.. శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆసుపత్రులన్నిట్లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సేవే లక్ష్యంగా కొనసాగుతున్నాం.∙సి. శ్రీనివాస్, చైర్మన్, శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ -
ప్రేమకూ భాషలున్నాయి!
రాధ, రవికి పెళ్లయి ఏడాదవుతోంది. రవికి రాధ అంటే చాలా ప్రేమ. తన ప్రేమను వ్యక్తం చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాచీలు, ఆభరణాలు, దుస్తులు ఇచ్చి ఆశ్చర్యపరచేందుకు ప్రయత్నిస్తుంటాడు. కొత్త ఐఫోన్ మార్కెట్లోకి రాగానే తెచ్చి ఇచ్చాడు. ఆమె పుట్టినరోజునాడు డైమండ్ రింగ్ బహుమతిగా ఇచ్చాడు. అయినా రాధకు అసంతృప్తిగానే ఉంది. కారణం రవికి అర్థం కావడంలేదు. ఒకరోజు రాధనే అడిగాడు. ‘నువ్వు నాకు టైమ్ ఇవ్వడం లేదు’ అని సమాధానం వచ్చింది. ఏం చెయ్యాలో అర్థంకాక రవి తల పట్టుకున్నాడు. అభి, స్వాతిది మరో రకమైన సమస్య. ఆఫీస్ పనితో ఎంత బిజీగా ఉన్నా సరే అభికి ఇష్టమైంది చేసి పెట్టేందుకు స్వాతి ప్రయత్నిస్తుంది. వీలైనంత వరకు అతనితో గడిపేందుకే ప్రాధాన్యమిస్తుంది. అయినా అభికి సంతృప్తి లేదు. ఎందుకని అడిగితే.. ‘ఎప్పుడూ నేను హగ్ చేసుకోవడమే తప్ప, ఒక్కరోజైనా నీకు నువ్వుగా హగ్ ఇచ్చావా?’ అని అడిగాడు. ‘అదేంటీ.. మనం బానే ఉన్నాం కదా?’ అని అడిగింది. ‘సంసారమంటే అదొక్కటే కాదు, మామూలప్పుడు కూడా హగ్ చేసుకోవచ్చు’ అని చెప్పాడు. ఇలాంటి సమస్య మీకూ ఎదురైందా? ఏం చేస్తే భాగస్వామి సంతోషపడతారో తెలియక తలపట్టుకుంటున్నారా? డోంట్ వర్రీ. మీకోసమే ఈ వ్యాసం. ప్రేమభాషను గుర్తించండి..మీరు ప్రేమిస్తే సరిపోదు, మీ ప్రేమను వ్యక్తపరచే విధానం మీ భాగస్వామి అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అంటే మీ భాగస్వామి ప్రేమభాష మీకు తెలిసి ఉండాలి. ప్రేమభాషలను నేర్చుకోవడం వల్ల.. 1 జంటలు ఒకరి భావాలను ఒకరు మరింతగా అర్థం చేసుకుంటారు. భావోద్వేగాలను అందంగా వ్యక్తపరచడం ద్వారా అనుబంధం బలపడుతుంది. 2. వైవాహిక జీవితంలో అనేక సందర్భాలలో అపార్థాలు తలెత్తవచ్చు. ప్రేమభాషలను అవగాహన చేసుకుంటే, మీ భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. అపార్థాలు దూరమవుతాయి. 3. ప్రేమభాషలను పట్టించుకోవడం, పాటించడం జంటల మధ్య సాన్నిహిత్యాన్ని, సంతృప్తిని పెంచుతుంది. ఐదు ప్రేమభాషలుగ్యారీ చాప్మన్ ప్రేమ భాషల సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషి ప్రేమను అనుభవించే, వ్యక్తపరచే విధానం భిన్నంగా ఉంటుంది. అందులో ప్రధానంగా ఐదు రకాలున్నాయి. అవి మాటలు, సేవలు, బహుమతులు, సమయం, స్పర్శ. జంటలు ఒకరి ప్రేమ భాషను ఒకరు అర్థం చేసుకోకపోతే అది అపార్థాలకు, విభేదాలకు దారితీస్తుంది. అందుకే ప్రేమభాషల గురించి తెలుసుకుందాం, ప్రేమను సరైన రీతిలో పంచుకుందాం, భాగస్వామి ప్రేమను గెలుచుకుందాం.ప్రశంసలుకొందరికి ప్రేమంటే ప్రశంసలే. లక్ష రూపాయల డైమండ్ రింగ్ కంటే కూడా ‘ఐ లవ్ యూ’ అనే మూడు పదాలే వారికి ముఖ్యం. ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు’, ‘నీతో ఉంటే నాకు టైమ్ తెలియదబ్బా’, ‘నీకంటే ముఖ్యమైనది మరేదీ లేదు’ అనే మాటలు వారి మనసును కట్టిపడేస్తాయి.సేవ ద్వారా ప్రేమమరికొందరికి మాటల కన్నా చేతలు, సేవలు ముఖ్యం. ‘ఐ లవ్ యూ’ అని కబుర్లు చెప్తే సంతోషించరు. ఇంటిపనిలో సహాయం చేయడం, తలనొప్పి వచ్చినప్పుడు మర్దన చేయడం, తన పనులు చేసిపెట్టడం లాంటివి చేస్తేనే ప్రేమ ఉన్నట్లు భావిస్తారు.బహుమతులు అందించడంకొన్ని జంటలు ప్రేమను బహుమతుల ద్వారా వ్యక్తీకరిస్తారు. ఇక్కడ మాటలు, చేతల కన్నా కూడా బహుమతులే ముఖ్యం. రెండ్రూపాయల గులాబీ పువ్వు కావచ్చు, ఒక మంచి డ్రెస్ కావచ్చు, బంగారపు ఉంగరం కావచ్చు.. ఏదో ఒక బహుమతి ఇవ్వడమే ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు.సమయం గడపడంమరికొందరికి ప్రేమంటే ఇద్దరూ కలిసి కూర్చుని సమయం గడపడమే. రాధా రవిల సమస్య ఇదే. ఖరీదైన బహుమతులివ్వడమే ప్రేమను ప్రదర్శించడమని రవి అనుకుంటుంటే, తనతో సమయాన్ని గడపాలని రాధ కోరుకుంటోంది. స్పర్శఈ భాషలో ఉన్నవారు ప్రేమను ముద్దు, కౌగిలి, అందమైన స్పర్శల ద్వారా వ్యక్తం చేస్తారు. అలా చేయడమే ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు. భాగస్వామి అలా చేయనప్పుడు తనపై ప్రేమ లేదని బాధపడుతుంటారు. అభి సమస్య ఇదే.