gates
-
ఈజీగా ఇంటర్నేషనల్ జర్నీ
విమానం మిస్సవుతుందనే భయం లేదు. నిశ్చింతగా బయలుదేరవచ్చు. గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ – ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీఐ–టీటీపీ) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సత్ఫలితాలిస్తోంది.ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా విదేశాలకు క్రమం తప్పకుండా ప్రయాణించేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. సాధారణ ఇమిగ్రేషన్ క్యూలైన్లకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఫాస్ట్ట్రాక్ ఇమిగ్రేషన్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ, నిష్క్రమణ ఈ–గేట్లను ఏర్పాటు చేశారు. – సాక్షి, హైదరాబాద్నమ్మకమైన ప్రయాణికుల కోసమే..హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 70 వేల మందికి పైగా డొమెస్టిక్ (దేశీయ), ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో 10 వేల మందికి పైగా విదేశాలకు వెళ్లి వచ్చేవారు ఉన్నారు. వీరిలో తరచూ ప్రయాణించేవారికి ఈ ఫాస్ట్ట్రాక్ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంది. టూరిస్టులు, రెండుమూడేళ్లకోసారి విదేశీ ప్రయాణం చేసేవాళ్లు ఈ సేవలను వినియోగించుకోలేరని, తరచూ రాకపోకలు సాగించే నమ్మకమైన ప్రయాణికుల కోసమే దీనిని అందుబాటులోకి తెచ్చామని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు.‘ఇది భారతీయ పాస్ట్పోర్ట్లు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులు కలిగిన వాళ్ల కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థ. ఇమిగ్రేషన్ చెక్ కోసం క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియను ముగించి రాకపోకలు సాగించవచ్చు’అని ఆయన చెప్పారు.ఇప్పటివరకు 500 మందికి పైగా ఎఫ్టీఐ–టీటీపీలో వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. రోజూ 10 – 15 మంది వరకు ఈ సేవలను వినియోగించుకుంటున్నారని, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరికోసం ప్రత్యేకంగా 8 గేట్లను వినియోగిస్తున్నామని తెలిపారు.దరఖాస్తు ఇలా..ఫాస్ట్ట్రాక్ ఇమిగ్రేషన్ వ్యవస్థను ఉపయోగించుకోవాలంటే www.ftittp.mha.gov.in వెబ్సైట్లో ప్రయాణికులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. పాస్పోర్ట్ కనీసం 6 నెలల చెల్లుబాటును కలిగి ఉండాలి. దరఖాస్తు సమయంలోనే పాస్పోర్ట్ను అప్లోడ్ చేసి, ఇతర అన్ని వివరాలు నమోదు చేయాలి. భద్రతాపరమైన తనిఖీల అనంతరం ఎఫ్టీఐ–టీటీపీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ సమాచారాన్ని ఇమిగ్రేషన్ బ్యూరో పరిశీలించి ఆమోదిస్తే, ఆ సమాచారం ప్రయాణికుల మొబైల్ ఫోన్కు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది. ఈ మెయిల్కు కూడా సందేశం వస్తుంది. వేలిముద్రలు, ఫొటో వంటి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసేందుకు ఎయిర్పోర్టులోని ప్రత్యేక కౌంటర్లలో సంప్రదించవలసి ఉంటుందని అధికారులు తెలిపారు.సేవలు ఇలా.. ⇒ ఫాస్ట్ట్రాక్ ఇమిగ్రేషన్ సదుపాయం కలిగిన ప్రయాణికులు వీసా తనిఖీ పూర్తయిన తరువాత బోర్డింగ్ పాస్ కోసం రిజిస్టర్డ్ ప్యాసింజర్ చెక్–ఇన్ కౌంటర్లో సంప్రదించాలి. ⇒ బోర్డింగ్ పాస్ తీసుకున్న తరువాత ఇమిగ్రేషన్ కోసం వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ–గేట్ల వద్దకు వెళ్లాలి. ⇒ మొదటి గేట్ వద్ద పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ స్కానింగ్ పూర్తవుతుంది. దీంతో రెండో ఈ–గేట్కు అనుమతి లభిస్తుంది. ⇒ రెండో ఈ–గేట్ వద్ద ప్రయాణికుడి ముఖాన్ని స్కాన్ చేస్తారు. ధ్రువీకరణ అనంతరం ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రయోజనాలు ఇవీ.. ⇒ సాధారణ ఇమిగ్రేషన్ ప్రక్రియలో వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికులంతా ఒకే క్యూలైన్లో వెళ్లవలసి ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కోసారి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే గంటకు పైగా పడిగాపులు తప్పవు.⇒ అంతర్జాతీయ ప్రయాణికులు విమానం బయలుదేరడానికి 3 గంటల ముందే ఎయిర్పోర్టుకు చేరుకోవాలి. ఆ తరువాత సంబంధిత ఎయిర్లైన్స్లో క్యూలో వేచి ఉండి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. అదే సమయంలో లగేజ్ చెక్ –ఇన్ ఉంటుంది. ఆ తరువాత వరుసగా భద్రతా తనిఖీలు, ఇమిగ్రేషన్ లైన్లలోకి వెళ్లాలి. ఈ ప్రక్రియ పూర్తవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎఫ్టీఐ టీటీపీ వ్యవస్థలో ముందే వివరాలు నమోదు చేసుకోవడం వల్ల సాధారణ భద్రతా తనిఖీల అనంతరం నేరుగా ఈ–గేట్ ద్వారా ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని వెళ్లవచ్చు. డిజియాత్ర మొబైల్ యాప్ ఉన్న ప్రయాణికులు బోర్డింగ్పాస్ను ఆన్లైన్లోనే పొందవచ్చు. -
లోన్ కట్టలేదని ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు
కొడకండ్ల (జనగాం): తీసుకున్న రుణం చెల్లించాలని బ్యాంక్ అధికారులు(Bank Officials) ఓ కుటుంబాన్ని నిలదీసిన ఘటన బుధవారం ఏడునూతన గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఐదుగురు మహిళల చొప్పున మూడు గ్రూపులకు 2021సంవత్సరంలో విజయ డెయిరీ(Vijaya Dairy) ఆధ్వర్యంలో డీసీసీబీ స్టేషన్ఘన్పూర్ బ్రాంచ్ ద్వారా గేదెల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.87వేల చొప్పున రుణం అందించారు. ఈఎంఐ రూ.4వేల చొప్పున కొన్ని నెలల పాటు మహిళలు చెల్లించారు. అనంతరం గేదెలు పాలు ఇవ్వకపోవడంతో మహిళలకు ఆర్థిక ఇబ్బందులతో ఈఎంఐలు చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు డిఫాల్టర్లకు నోటీసు ఇచ్చి రికవరీ ప్రయత్నాలు చేయగా కొందరు రుణం చెల్లించారు. తాజాగా బుధవారం డీసీసీబీ స్టేషన్ఘన్పూర్, కొడకండ్ల బ్రాంచ్ మేనేజర్లు మహబూబీ, కల్యాణిలతో పాటు ఫీల్డ్ ఆఫీసర్లు మరోసారి రుణం బాకీ ఉన్న వారి ఇంటికి వెళ్లి నోటీసులిచ్చి రుణం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇందులో మద్దెబోయిన కళమ్మ, కుటుంబసభ్యులు రుణం కట్టడం ఇబ్బందిగా ఉందని తెలిపి ఇంటి గేట్లు తీసుకెళ్లమని బ్యాంక్ అధికారులు తీసుకొచ్చిన ట్రాక్టర్ డబ్బాలో వేయడంతో వారు తీసుకెళ్లారు. ఈ సంఘటన సామాజిక మాద్యమాల్లో వైరల్ కాగా బ్యాంక్ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని తెలుపుతున్నారు.లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు జనగామ - పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో బ్యాంక్ లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసి తీసుకుపోయిన డీసీసీబీ బ్యాంక్ అధికారులు pic.twitter.com/NA0yGAjSPq— Telugu Scribe (@TeluguScribe) February 12, 2025 -
తుంగభద్ర గేట్లన్నీ మార్చాల్సిందే
సాక్షి, అమరావతి/సాక్షి, బళ్లారి/హొసపేటె: తుంగభద్ర డ్యామ్ గేట్లన్నీ మార్చాల్సిందేనని సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలోని కమిటీ బోర్డుకు స్పష్టం చేసింది. ఏ డ్యాం గేట్లైనా 45 ఏళ్లు మాత్రమే సమర్థంగా పనిచేస్తాయని పేర్కొంది. తుంగభద్ర డ్యామ్ గేట్లు 70 ఏళ్లుగా పనిచేస్తున్నాయని.. తుప్పుపట్టినప్పుడు దాన్ని తొలగించి రంగులు వేస్తుండటం వల్ల వాటి మందం తగ్గిందని, బలహీనంగా మారాయని తెలిపింది. దీనివల్లే ఆగస్టు 10న డ్యాం 19వ గేటు కొట్టుకుపోయిందని తేల్చిచెప్పింది. డ్యామ్ భద్రత దృష్ట్యా 33 గేట్లనూ మార్చి.. వాటి స్థానంలో కొత్త గేట్లు అమర్చాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను బుధవారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ, సీడబ్ల్యూసీకి ఏకే బజాజ్ అందించనున్నారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు గేట్ల మార్పుపై తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకోనుంది. కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటుచేయడానికే రూ.5 కోట్లకుపైగా బోర్డు వ్యయం చేసింది. ఈలెక్కన పూర్తి స్థాయిలో ఒక్క గేటు ఏర్పాటుకు రూ.8 కోట్లపైగా వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 33 గేట్లు ఏర్పాటుచేయాలంటే రూ.264 కోట్లకుపైగా వ్యయం అవుతుందని చెబుతున్నారు. గేట్లు ఎత్తడానికి దించడానికి వీలుగా హైడ్రాలిక్ హాయిస్ట్ వంటి అధునాతన వ్యవస్థను ఏర్పాటుచేయాలంటే అదనంగా మరో రూ.వంద కోట్ల వరకూ వ్యయం అవుతుందని లెక్కలు వేస్తున్నారు. ఈ వ్యయాన్ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నీటి కేటాయింపులు, ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో భరించాల్సి ఉంటుంది. బజాజ్ కమిటీ సమగ్ర అధ్యయనంతుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో డ్యామ్ గేట్లు, భద్రతపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది. దాంతో తుంగభద్ర డ్యామ్ గేట్లపై అధ్యయానికి సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ అధ్యక్షతన గేట్ల నిపుణులు హర్కేశ్ కుమార్, తారాపురం సుధాకర్ సభ్యులుగా కేంద్రం త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఆదివారం, సోమవారం డ్యామ్ను సమగ్రంగా పరిశీలించి.. గేట్ల పనితీరుపై అధ్యయనం చేసింది. -
నూతన పార్లమెంట్: ఆరు దర్వాజలకు ఆరు జంతువులు కాపలా..
ఢిల్లీ: దేశంలో నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలయ్యాయి. రేపు కొత్త పార్లమెంట్లో చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే.. కొత్త పార్లమెంట్లోకి ఎంట్రీ ఇచ్చే గుమ్మాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. పార్లమెంట్ భవనంలో ఆరు దర్వాజలకు ఆరు పౌరాణిక ప్రాణుల పేర్లను పెట్టారు. ఈ ఆరు ప్రాణులు 140 కోట్ల భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేకతలను సూచిస్తున్నాయి. అవేంటంటే.. నూతన పార్లమెంట్లో ఆరు ద్వారాలు ఉన్నాయి. అవి.. గజ ద్వారం, అశ్వ ద్వారం, గరుడ ద్వారం, మకర ద్వారం, శార్దూల ద్వారం, హంస ద్వారం. ప్రతి ద్వారం దాని పేరుపై ఉన్న ప్రాణి శిల్పాన్ని కలిగి ఉంది. గజ ద్వారం.. బుద్ధి, జ్ఞాపకశక్తి, సంపద, జ్ఞానాన్ని సూచించేది ఏనుగు. దీని పేరు మీదుగా గజ ద్వారంగా ఓ గుమ్మానికి పేరు పెట్టారు. ఈ ద్వారం భవనానికి ఉత్తరం వైపు ఉంది. ఉత్తరం, వాస్తు శాస్త్రం ప్రకారం, బుధగ్రహంతో సంబంధం కలిగి ఉంది. ఇది తెలివికి మూలం అని విశ్వసిస్తారు. అశ్వ ద్వారం.. రెండవది అశ్వ ద్వారం. గుర్రం పేరు మీదుగా గుమ్మానికి ఈ పేరు పెట్టారు. గుర్రం శక్తి, బలం, ధైర్యాన్ని సూచిస్తుంది. పాలనలో కావాల్సిన లక్షణాలను ఈ గుమ్మం గుర్తుచేస్తుంది. గరుడ ద్వారం.. మూడవ ద్వారానికి గరుడ అనే పేరు పెట్టారు. పక్షుల రాజు గరుడ.. విష్ణువు వాహనంగా నమ్ముతారు. హిందూ త్రిమూర్తులలో సంరక్షకుడు అయిన విష్ణువుతో దానికి అనుబంధం ఉంది. గరుడను శక్తి, ధర్మం (కర్తవ్యం)నికి చిహ్నంగా భావిస్తారు. ఇది అనేక దేశాల చిహ్నాలపై ఎందుకు ఉపయోగించారో కూడా వివరణ ఉంటుంది. గరుడ ద్వారం కొత్త పార్లమెంటు భవనానికి తూర్పు ద్వారం. మకర ద్వారం.. నాలుగో ద్వారం మకర ద్వారం. మకరాన్ని సముద్ర చేపగా పిలుస్తారు. వివిధ జంతువుల కలయికగా దీన్ని గుర్తిస్తారు. దక్షిణ, ఆగ్నేయాసియాలో విస్తరించి ఉన్న హిందూ, బౌద్ధ స్మారక కట్టడాలలో మకరం సాధారణంగా కనిపిస్తాయి. మకరం వివిధ జీవుల కలయికగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. గుమ్మాల వద్ద మకర శిల్పాలు రక్షకులుగా కనిపిస్తాయి. మకర ద్వారం పాత పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వైపు ఉంది. శార్దూల ద్వారం.. ఐదవ ద్వారం శార్దూలం. ఇది సింహం శరీరం, కానీ గుర్రం, ఏనుగు లేదా చిలుక తల. కొత్త పార్లమెంట్ భవనం గేటుపై శార్దూల ఉండటం దేశ ప్రజల శక్తిని సూచిస్తుందని ప్రభుత్వ నోట్ పేర్కొంది. హంస ద్వారం పార్లమెంటు ఆరవ ద్వారానికి హంస ద్వారం అని పేరు పెట్టారు. హంస అనేది హిందూ జ్ఞాన దేవత అయిన సరస్వతి వాహనం. హంస మోక్షాన్ని సూచిస్తుంది. జనన, మరణ చక్రం నుంచి ఆత్మ విముక్తిని సూచిస్తుంది. పార్లమెంటు గేటుపై ఉన్న హంస శిల్పం స్వీయ-సాక్షాత్కారానికి, జ్ఞానానికి చిహ్నం. ఇదీ చదవండి: ఇండియా కూటమిని గొర్రెలు, మేకలతో పోల్చిన ఏక్నాథ్ షిండే -
గోదావరిలో మళ్లీ జలకళ!
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ/కడెం/కాళేశ్వరం: రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి నది మళ్లీ జలకళ సంతరించుకుంది. ఎగువన శ్రీరాంసాగర్ నుంచి నది పొడవునా ప్రవాహాలు పెరిగాయి. సోమవారం రాత్రికి ఎగువన శ్రీరాంసాగర్లోకి 50 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 16 గేట్లు ఎత్తి సుమారు అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిస్థాయిలో 90 టీఎంసీలకు చేరింది. ఇక కడెం ప్రాజెక్టుకు వరద 36,560 క్యూసెక్కులకు పెరిగింది. నాలుగు గేట్లను ఎత్తి 56,429 క్యూస్కెకుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 6.5 టీఎంసీలు నిల్వ ఉంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 35,300 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 46,221 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్షి్మ) బ్యారేజీ నుంచి 1,66,970 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీ నుంచి 1,32,480 క్యూసెక్కులు, దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్ బ్యారేజీ నుంచి 81,108 క్యూసెక్కులను వదులుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం సరస్వతి బ్యారేజీకి సోమవారం రాత్రి గోదావరి ఎగువనుంచి వరద పోటెత్తడంతో 66 గేట్లకు 45 గేట్లు ఎత్తారు. లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ఇంజనీరింగ్ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా కాళేశ్వరం వైపు తరలివస్తోంది. బేసిన్ పరిధిలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కృష్ణాలో కానరాని ప్రవాహాలు పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతుండటంతో కృష్ణా నదిలో ఎక్కడా పెద్దగా ప్రవాహాలు కానరావడం లేదు. సోమవారం ఆల్మట్టి డ్యామ్లోకి కేవలం 5,086 క్యూసెక్కుల ప్రవాహమే నమోదైంది. అక్కడ విద్యుదుత్పత్తి ద్వారా వదులుతున్న 14 వేల క్యూసెక్కులు దిగువన నారాయణపూర్లోకి చేరుతున్నాయి. రాష్ట్రంలోని జూరాలకు కేవలం 420 క్యూసెక్కులే వరద ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రకు కూడా కేవలం 559 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్కు ఎలాంటి వరద రావడం లేదు. స్థానిక వర్షాలతో నాగార్జునసాగర్కు 11,424 క్యూసెక్కులు, మూసీ ప్రవాహంతో పులిచింతలకు 5,546 క్యూసెక్కులు చేరుతున్నాయి. -
కడెం పరిస్థితిపై సీడబ్ల్యూసీ అధ్యయనం
కడెం: భారీగా వరదలు రావడం, గేట్లు సరిగా పనిచేయక ఆందోళన నెలకొనడం నేపథ్యంలో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్ భద్రత బృందం శుక్రవారం పరిశీలించింది. మొత్తం 24 మంది అధికారులు, సిబ్బంది డ్యామ్ ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేశారు. వరద గేట్ల పనితీరు, ఇన్ఫ్లో, ఔట్ఫ్లో సామర్థ్యం, ఎడమ కాల్వ వద్ద కోతకు గురైన రోడ్డు వంటి వాటిని పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులు గతేడాది ప్రాజెక్టుకు వచ్చిన భారీ వరదలతో దెబ్బతిన్న గేట్లు, ఆఫ్రాన్ (రక్షణ గోడ), స్పిల్వేలను సీడబ్ల్యూసీ బృందానికి చూపించారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్, డ్యాం భద్రత నిపుణుడు ఏబీ పాండ్య మాట్లాడారు. కడెం ప్రాజెక్టు భారీగా వస్తున్న ఇన్ఫ్లోతో ప్రమాదం నెలకొని ఉందని, డ్యాం భద్రతకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టును పరిశీలించిన బృందంలో హైడ్రాలజిస్ట్ చీఫ్ ఇంజనీర్ రామరాజు, డ్యాం భద్రత నిపుణుడు టి.దేశాయి, జియాలజిస్ట్ ఎం.రాజు, హైడ్రో మెకానికల్ నిపుణులు కె.సత్యనారయణ, యోగీందర్కుమార్శర్మ, సీఈ శ్రీనివాస్, ఎస్ఈ సుశీల్కుమార్, ఈఈ విఠల్, డీఈ భోజదాసు, ప్రాజెక్ట్ సిబ్బంది ఉన్నారు. శాంతించిన కడెం.. గేట్లకు మరమ్మతులు భారీ వరదతో ప్రాజెక్టును కోతకు గురిచేస్తుందా అన్న ఆందోళన రేపిన కడెం వాగు శాంతించింది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు శుక్రవారం ఉదయం 1,46,675 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. సాయంత్రానికి బాగా తగ్గిపోయింది. రాత్రికి 13,550 క్యూసెక్కు ల ఇన్ఫ్లో వస్తుండగా.. ఏడు గేట్ల ద్వారా 20,998 క్యూస్కెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులుకాగా.. ప్రస్తుతం 685.150 అడుగులుగా ఉంది. రెండు రోజుల కింద తెరుచుకోకుండా మొరాయించిన 3వ నంబర్ గేటుకు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. కాగా భారీ వరదతో ఎడమ కాల్వపై మైసమ్మ గుడివద్ద రోడ్డు కోతకు గురైంది. అక్కడ మరమ్మతులు పూర్తిచేసేదాకా సాగునీటిని విడుదల చేసే అవకాశం లేదు. దీనితో వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
తెరుచుకోని గేట్లు.. ప్రమాదంలో కడెం ప్రాజెక్టు
-
బొర్రా గుహలకు మెట్రో గేటు
అనంతగిరి: ప్రముఖ పర్యాటక కేంద్రం, సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలకు సరికొత్తగా సాంకేతిక సొబగులు అద్దుకుంటున్నాయి. ఇక్కడికి దేశ విదేశాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తుంటారు. వీరికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పర్యాటక శాఖ అధునాతన సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆన్లైన్ ఈ–పోస్ టికెట్ల ద్వారా గుహలు లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల రద్దీ పెరిగే కొద్దీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో గుహలు ముఖద్వారం వద్ద కొత్తగా మెట్రో గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. లోపలకు వెళ్లేందుకు మూడు, బయటకు వచ్చేటప్పుడు మూడు గేట్లు చొప్పున అమర్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం రూ. 12 లక్షల వరకు వెచ్చిస్తోంది. తాజాగా టెక్నీషియన్లు వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ప్లాట్ఫాం నిర్మించిన వెంటనే మెట్రో గేట్లను ఏర్పాటు చేస్తారు. గుహలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకుల్లో పెద్దలకు రూ. 70, చిన్నపిల్లలకు రూ. 50 చెల్లిస్తే మాగ్నెటిక్స్ కాయిన్స్ ఇస్తారు. వీటిని చూపించగానే గేటు తెరుచుకుంటుంది. గుహలను తిలకించి తిరిగి బయటకు వచ్చేందుకు మరోసారి చూపించాలి. త్వరలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పాత టికెట్ల ధరలు అమలులో ఉన్నట్లు పర్యాటక శాఖ సిబ్బంది తెలిపారు. (చదవండి: విశాఖ పోర్టుకు రికార్డు స్థాయిలో క్రూడాయిల్) -
శ్రీశైలం గేట్ల నిర్వహణ భేష్
సాక్షి, అమరావతి/శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నిర్వహణ చాలా సమర్ధవంతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్సారీ్ప) ప్రశంసించింది. ప్రాజెక్టు అధికారులు, రాష్ట్ర జలవనరుల శాఖను అభినందించింది. ప్రాజెక్టు ఆధునికీకరణకు డ్రిప్ (డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్) కింద రుణం మంజూరుకు కేంద్రానికి సిఫార్సు చేస్తామని ప్యానల్ చైర్మన్ ఏబీ పాండ్య తెలిపారు. సోమవారం శ్రీశైలం ప్రాజెక్టును తనిఖీ చేసిన పాండ్య నేతృత్వంలోని డీఎస్సార్పీ.. మంగళవారం కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు ఎస్ఈ, ఈఈ తదితరులతో సమావేశమైంది. ప్రాజెక్టు స్థితిగతులు, ఆధునికీకరణపై సమీక్షించింది. ప్రాజెక్టు ప్లంజ్ పూల్కు 2002 నుంచి 2004 మధ్య వేసిన కాంక్రీట్ ఆ తర్వాత వచ్చిన వరదల ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు డీఎస్సార్పీ గుర్తించింది. భారీ కాంక్రీట్ దిమ్మెలను ప్లంజ్ పూల్లో వేసి, వాటిపై అధిక ఒత్తిడితో కాంక్రీట్ మిశ్రమాన్ని పోయడం ద్వారా గొయ్యిని పూడుస్తామని సీఈ మురళీనాథ్రెడ్డి చెప్పారు. ఈ డిజైన్ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు పంపాలని ప్యానల్ చైర్మన్ సూచించారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారమే ప్లంజ్ పూల్కు మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. కొండ చరియలు విరిగి పడకుండా.. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వేకు ఎగువన, దిగువన కొండచరియలు విరిగి పడి ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతున్నట్లు అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కొండ చరియలు పడకుండా మెస్, షార్ట్ క్రీటింగ్ కాంక్రీట్తో అడ్డుకట్ట వేస్తున్న తరహాలోనే.. శ్రీశైలంలోనూ చేస్తామని అధికారులు చేసిన ప్రతిపాదనకు డీఎస్సార్పీ ఆమోదం తెలిపింది. గ్యాలరీలో సీపేజ్కు అడ్డుకట్ట వేయడానికి గ్రౌటింగ్ చేపట్టాలని ఆదేశించింది. రివర్ స్లూయిజ్ గేట్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని, ఆప్రాన్కు ప్రాధాన్యత క్రమంలో మరమ్మతులు చేయాలని సూచించింది. అధునాతన వరద పర్యవేక్షణ కార్యాలయం ప్రాజెక్టు వద్ద వరద పర్యవేక్షణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డీఎస్సార్పీ సూచించింది. ప్రాజెక్టు అధికారులకు 40 ఎకరాల్లో గతంలో నిర్మించిన క్వార్టర్స్ను (ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి) కూల్చివేసి, కొత్తవి నిర్మించడానికి అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు మరమ్మతులు, ఆధునికీకరణ, క్వార్టర్స్ నిర్మాణానికి డ్రిప్ కింద రుణమివ్వాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని డీఎస్సార్పీ తెలిపింది. ఈ పనులకు రూ.780 నుంచి రూ.1,000 కోట్ల మేర వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని పాండ్య తెలిపారు. -
గేట్ల ట్రయల్ రన్ విజయవంతం
-
పోలవరం ప్రాజెక్టు: మరో కీలక అంకం పూర్తి..
సాక్షి, పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వైఎస్ జగన్ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పోలవరం ప్రాజెక్టులో మరో కీలక అంకం పూర్తయ్యింది. గేట్ల ట్రయన్ రన్ విజయవంతమైంది. మొత్తం 48 గేట్లకు గానూ 34గేట్ల అమరిక పనులు, మొత్తం 96 సిలిండర్లకు గానూ 56 సిలిండర్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. 24 పవర్ ప్యాక్ లకు గానూ 5పవర్ ప్యాక్లు బిగింపు పూర్తయ్యింది. ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో రెండు గేట్లను ఎత్తవచ్చు. 10 రివర్ స్లూయిజ్ గేట్లకు గానూ 10గేట్ల అమరిక, 3 రివర్ స్లూయిజ్ గేట్లకు సిలిండర్ల అమర్చడం పూర్తి అయింది. ఇప్పటికే 44,43వ గేట్లకు కిందకి పైకి ఎత్తడంతో ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదటిగా 44వ గేటును 6 మీటర్లు పైకి ఎత్తి మరలా 3 మీటర్లు కిందకి అధికారులు దించారు. హైడ్రాలిక్ సిలిండర్ సాయంతో గేటును నిమిషానికి 1.5మీటర్లు ఎత్తే విధంగా రూపొందించారు. 2400 టన్నుల వత్తిడిని సైతం తట్టుకునేలా గేట్ల డిజైన్ చేశారు.ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మిగతా గేట్లను ఎత్తేందుకు చురుగ్గా పనులు సాగుతున్నాయి. గేట్ల ట్రయల్ రన్ పనులను పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ జీఎంలు సతీష్ బాబు, మిశ్రా,బెకెం ఇంజనీరింగ్ సంస్థ ప్రాజెక్ట్ ఇంచార్జి ఎ.నాగేంద్ర పరిశీలించారు. చదవండి: ట్రాకింగ్ మెకానిజం పటిష్టంగా ఉండాలి: సీఎం జగన్ ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది..’ -
విరిగిపోయిన మూసీ గేటు..
-
విరిగిపోయిన మూసీ గేటు..
సాక్షి, సూర్యాపేట: భారీ వరద ప్రవాహం తట్టుకోలేక మూసీ ప్రాజెక్టు గేటు విరిగిపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసీ జలాశయంలోకి భారీగా వరద చేరింది. అయితే ప్రవాహం ఉధృతంగా ఉండటంతో శనివారం సాయంత్రం ఆరో నంబర్ గేటు ఊడిపోయింది. దీంతో వరద నీరు వృథాగా దిగువ ప్రాంతానికి పోతోంది. మూసీ జలాశయంలో మొత్తం 32 క్రస్ట్ గేట్లు ఉండగా.. వివిధ కారణాలతో 7 గేట్లను పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 25 గేట్లు ఉన్నాయి.. గత రెండు రోజులుగా భారీగా నీరు చేరడంలో రెండు గేట్లను ఎత్తి 1350 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నిన్న రాత్రి కూడా భారీగా వరద రావడంతో పోటు ఎక్కువై గేటు ఊడిపోయింది. దీంతో దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నీరంతా వృథాగా పోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నీళ్లే లేవు.. బాబ్లీ గేట్లు ఎత్తివేత
బాసర (నిర్మల్): గోదావరిలో నీళ్లే లేవు.. కానీ మూడు రాష్ట్రాల అధికారులు సోమవారం ఉదయం బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించిన 14 గేట్లను ఎత్తివేశారు. అయితే.. దిగువకు చుక్కనీరు పారలేదు. వివరాలు.. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై రూ.200 కోట్ల వ్యయంతో బాబ్లీ ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. దీంతో దిగువకు వచ్చే నీటికి అడ్డుకట్ట పడినట్లయింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్ర జలవనరుల సంఘంతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫలితంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆంధ్రప్రదేశ్కు చెందిన మరికొన్ని ప్రాజెక్టులకు నీరు చేరేందుకు రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఏటా జూలై 01 నుంచి అక్టోబర్ 29 వరకు బాబ్లీ గేట్లను తెరిచి ఉంచాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఎప్పటిలాగే ఈ ఏడాది జూలై ఒకటిన బాబ్లీ గేట్లను తెరిచారు. అయితే ఇప్పటి వరకు వర్షాలు కురవకపోవడంతో గోదారి నది నీరు లేక వెలలబోయింది. ఈ కార్యక్రమంలో (సీడబ్ల్యూసీ) కేంద్ర జల వనరుల శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఈఈలు గంగాధర్, రామారావు, నారాయణ్రెడ్డి, గావనే తదితరులు పాల్గొన్నారు. -
గేట్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
అట్లాంటా : గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సోసైటీ(గేట్స్) ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జూన్ 23న ఆదివారం నాడు కుమ్మింగ్లోని లేనియర్ టెక్నికల్ కాలేజీలో ఈ వేడుకలు జరిగాయి. దాదాపు 1000 మందిపైగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. స్థానిక నేతలతో పాటు పలువరు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గేట్స్ బోర్డు ఛైర్మన్ అనిల్ బోధిరెడ్డి, ప్రెసిడెంట్ తిరుమల రెడ్డి పిట్ట సారథ్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నృత్యాలు, బుర్రకథలు, కాకతీయ చరిత్రను వివరిస్తూ నృత్య ప్రదర్శన, పేరిణీ తాండవం, బోనాలు, బతుకమ్మ, గుస్సాది, లంబాడీ, గిరిజన నృత్యాలు, తెలంగాణ సమరయోధుల నాట్య రూపకం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భువనేష్ బుజాల(ఆటా), ఆల రామక్రిష్ణారెడ్డి(ఆటా,బోట్), అంజయ్య చౌదరి లావు (తానా), భరత్ మాదాది(టాటా), డా.శ్రీని గంగసాని, సునీల్ సావిలి, శ్రీనివాసరెడ్డి పెద్ది( ఐఎఫ్ఏ), సత్యనారాయణరెడ్డి తంగిరాల(గాటా), వెంకీ గద్దె, వినయ్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో ఛైర్మన్ బోధిరెడ్డి, ప్రెసిడెంట్ తిరుమలరెడ్డి పిట్ట, వైఎస్ ప్రెసిడెంట్ రాహుల్ చిక్యాల, జనరల్ సెక్రటరీ కిషన్ తాళ్లపల్లి, ట్రెజరర్ అనితా నెల్లుట్ల, జనార్థన్ పన్నెల(యూత్ అండ్ స్పోర్ట్స్), సునీల్ గోతూర్( ఈవెంట్ సెక్రటరీ), శ్రీనివాస్ పర్సా (కల్చరల్ సెక్రటరీ), శ్రీధర్ నెల్వల్లి, రఘు బండ, చిట్టారి ప్రభా, రమాచారి, గణేశ్ కాశం, వెన్నెమనేని చలపతి, సతీష్ నందాల, గేట్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులు కరుణ్ ఆశిరెడ్డి, గౌతమ్గోలి, ప్రభాకర్ బోయపల్లి, శ్రీధర్ జూలపల్లి, సతీష్ చెటిల కృషి అమోఘమని పలువురు కొనియాడారు. -
ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విత్తనాలపై అమెరికాకు చెందిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఆసక్తి కనబరిచింది. ఇక్కడి విత్తనాలు ఆఫ్రికా దేశాలకు అనుకూలంగా ఉంటాయని ఫౌండేషన్ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగ అభివృద్ధికి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అనే సంస్థ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ లారెన్గుడ్ సహా ఆఫ్రికన్ దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లారెన్గుడ్ మాట్లాడుతూ.. తెలంగాణ విత్తనాలు ఆఫ్రికా దేశాలకు ఎంతో అనుకూలమైనవని అన్నారు. విత్తనోత్పత్తిలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ఆఫ్రికా దేశాల్లో విత్తనోత్పత్తి తక్కువగా ఉంటుందని, ఆయా దేశాల అవసరాలకు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి వరి, పొద్దుతిరుగుడు విత్తనాలు దిగుమతి చేసుకుంటామని వెల్లడించారు. అలాగే తెలంగాణ వరి విత్తన పద్ధతులను ఆఫ్రికా దేశాల్లో అమలుపరుస్తామని పేర్కొన్నారు. పార్థసారథి మాట్లాడుతూ.. వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, సోయాబీన్ పంటల విత్తనోత్పత్తి తెలంగాణలో చేపడుతున్నామని చెప్పారు. దాదాపు 90 శాతం హైబ్రిడ్ విత్తనోత్పత్తి తెలంగాణలోనే జరుగుతుందని తెలిపారు. 400 విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు హైదరాబాద్ చుట్టుపక్కల నెలకొని ఉన్నాయన్నారు. గతేడాది సూడాన్, రష్యా, టాంజానియా తదితర దేశాలకు వరి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు విత్తనాలను ఎగుమతి చేశామన్నారు. ఈ ఏడాది ఆఫ్రికా దేశాలకు విత్తనాల ఎగుమతికి సిద్ధంగా ఉన్నామని, వెయ్యి టన్నుల విత్తనాలను ఎగుమతి చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
సుంకేసుల డ్యాం గేట్లకు మరమ్మతులు
జలమండలి ఎస్ఈ చంద్రశేఖరరావు సుంకేసుల(గూడూరు రూరల్): ప్రస్తుతం సుంకేసుల డ్యాంలో నీరు లేకపోవడంతో గేట్లను మరమ్మతులు చేయించనున్నట్లు జలమండలి ఎస్ఈ చంద్రశేఖర్రావు చెప్పారు. శనివారం ఆయన రిజర్వాయర్ను పరిశీలించారు. డ్యాం గేట్లు, కరకట్టల పటిష్టతను పరీక్షించారు. ఎగువ నుంచి డా్యంకు నీరు వచ్చేలోపు గేట్లకు మరమ్మతులు, పేయింటింగ్ వేయించడం, తులుపులకు గ్రీసు తదితర పనులు చేపట్టేందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. కర్నూలు ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా జీడీపీ నీరు సరఫరా చేస్తామన్నారు. ఆయన వెంట జేఈ శ్రీనివాసులు, వర్క్ఇన్స్పెక్టర్ మునిస్వామి ఉన్నారు. -
అట్లాంటాలో బిజినెస్ సెమినార్కు విశేష స్పందన
అట్లాంటా : గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ(జీఏటీఈఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్ సెమినార్, తెలంగాణ సాంస్కృతికోత్సవానికి విశేష స్పందన వచ్చింది. అట్లాంటాలో కుమ్మింగ్లోని ఫోర్సిత్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ, అట్లాంటాలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించారు. భారతదేశం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం, అట్లాంటా వ్యాపారవేత్తల మధ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమానికి 250మందికి పైగా ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటూ పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. సతీష్ చేటి (జీఏటీఈఎస్ చైర్మన్) అతిథులను ఆహ్వానించగా, ప్రశాంతి అసిరెడ్డి ( జీఏటీఈఎస్ ప్రెసిడెంట్) ముఖ్య అతిథులను సెమినార్కు వచ్చిన వారికి పరిచయం చేశారు. ఆర్ శ్రీనివాసన్(కాన్సుల్ ఆఫ్ ఇండియన్ కాన్సులేట్) , ప్రొఫెసర్ వి.వెంకట రమణ (హెచ్సీయూ), కార్టర్ పాట్టర్సన్లు భారతదేశం, తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార అవకాశాలు అనే అంశంపై ప్రసంగించారు. ఎన్ఆర్ఐలు భారత్లో పెట్టుబడి పెట్టడానికి భారత ప్రభుత్వ పాలసీలు అనూకూలంగా ఉన్నాయని ఆర్ శ్రీనివాసన్ తెలిపారు. ఇలాంటి సెమినార్లు నిర్వహించి ఎన్ఆర్ఐలలో చైతన్యం చేస్తున్నందుకుగానూ జీఏటీఈఎస్ను ఆయన అభినందించారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా పార్క్, టెక్స్టైల్ పార్క్, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, వేస్ట్ మేనేజ్మెంట్వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, వనరుల గురించి ప్రొఫెసర్ వి.వెంకట రమణ వివరించారు. అట్లాంటాలో పెట్టుబడి పెట్టడానికి ఉన్న అవకాశాలను కార్టర్ తెలిపారు. అమెరికా ఎకానమీ పటిష్టం చేయడంలో ఇండో-అమెరికన్ల కృషిని ఆయన కొనియాడారు. అట్లాంటాలో వ్యాపారరంగంలో విజయవంతంగా దూసుకుపోతున్న తెలంగాణకు చెందిన కిరణ్ పాశం, మిగతా వ్యాపారవేత్తలు తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రజాప్రతినిధులు డన్కన్, బ్రాండన్లను జీఏటీఈఎస్ సత్కరించింది. రమేష్ తన మిమిక్రీతో అతిథులను అలరించారు. బుర్రకథ, ఒగ్గుకథ, సమ్మక్క సారక్క నృత్యరూపకం, పేరిణి డ్యాన్స్, లంబాడీ డ్యాన్స్, జానపద నృత్యాలు ఇలా ఎన్నో కార్యక్రమాలను ఇందులో ప్రదర్శించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించినందుకుగానూఈవెంట్ స్పాన్సర్స్ ఇన్ఫోస్మార్ట్, ఈఐఎస్ టెక్నాలజీస్లను జీఏటీఈఎస్ ఈసీ, బోర్డు అభినందించింది. సతీష్ చేటి, శ్రీనివాస్ గంగసాని, నందా చాట్ల, అనితా నేలుట్ల, కిషన్ తాల్లపల్లి, అనిల్ బోడిరెడ్డి, శ్రీనివాస్ ఆవుల, సునిల్ రెడ్డి కూటూరు, రాహుల్ చిక్యాల, రఘురెడ్డి, వేణు పిసికె, శ్రీధర్ నెలవెల్లి, సునిల్ గూటూరు, సురేష్, కే. వేలమ్, తిరుమల్ పిట్టల సమిష్టి సహకారంతో జీఏటీఈఎస్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. -
గేట్లెత్తితేనే కల సాకారమైనట్లా?
- ప్రాజెక్టులకు ఆద్యుడు వైఎస్ఆర్ - పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి హితవు కర్నూలు(ఓల్డ్సిటీ): గేట్లెత్తినంత మాఽత్రాన కల సాకారమైనట్లు చంద్రబాబు భావించడం విడ్డూరంగా ఉందని.. ప్రాజెక్టులకు ఆద్యుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి అనే విషయం ప్రజలకు తెలియంది కాదని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు శాసనసభ్యుడు ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, కోడుమూరు మాజీ శాసనసభ్యుడు మురళీకృష్ణలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించి కల నిజమైందనడంలో అర్థం లేదన్నారు. ఐటీ రంగానికి సంబంధించి ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉండేదని, చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన తర్వాత రాష్ట్రానికి ఐదో స్థానం లభించిందన్నారు. అయితే చంద్రబాబు మాత్రం హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మిగతా పార్టీలను బ్రేక్చేసి, మీ పార్టీని మేక్ చేస్తున్నారా, అవినీతి పునాదిపై రాజధాని కడుతున్నారా అంటూ ‘ఇండియాటుడే’ ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేత అనే గౌరవం కూడా లేకుండా ‘హూ ఈజ్ దట్ ఫెలో’ అనడం చంద్రబాబు సంస్కారానికి నిదర్శనమన్నారు. పట్టుదల, దూరదృష్టికి అర్థం చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కులమతాలకు తావులేదన్నారు. రైతులతోనే దేశం సుభిక్షం.. ఎక్కడైతే రైతులు సుభిక్షంగా ఉంటారో ఆ దేశం సిరిసంపదలతో తులతూగుతుందని నమ్మి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు జిల్లాపై చిన్నచూపు చూస్తున్నారని, ఏ పనులూ ముందుకు వెళ్లడం లేదన్నారు. 2019లోనూ అధికార దాహం తీర్చుకునేందుకే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రెడ్డి సామాజిక వర్గంలో చిచ్చుపెట్టేందుకే జేసీ దివాకర్రెడ్డి చేత రెచ్చగొట్టే ప్రసంగాలు చేయిస్తున్నారన్నారు. ఇలాంటి కుయుక్తులపై ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. ప్రాజెక్టులన్నీ వైఎస్ హయాంలోనివే.. ఒక్క ప్రాజెక్టుకూ శంకుస్థాపన చేయకపోగా వైఎస్ రాజశేఖరరెడ్డి 80, 90 శాతం పూర్తిచేసిన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందని నందికొట్కూరు శాసనసభ్యుడు ఐజయ్య అన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతలకు వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.120 కోట్లు మంజూరు చేశారని.. ఇందులో 4 పంపుల ద్వారా కేసీకి నీరు అందించాల్సి ఉండగా, చంద్రబాబు రెండింటినే ప్రారంభించారన్నారు. ఈ కారణంగా సాగునీరు 1000 క్యూసెక్కులు అందాల్సిన చోట 500లకే పరిమితమైందన్నారు. ముఖ్యమంత్రికి నిజంగా రాయలసీమపై, జిల్లాపై ప్రేమే ఉంటే సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని సవాల్ చేశారు. మాటలతో మభ్యపెడుతున్నారు టీడీపీ పాలనలో మాటలతో మభ్యపెట్టడమే తప్పిస్తే అభివృద్ధి లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య అన్నారు. తమ నేత వైఎస్ జగన్కు లభిస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబుకు దిక్కుతోచడం లేదన్నారు. రౌడీ ఎంపీని దగ్గర పెట్టుకొని సంస్కారం లేకుండా మాట్లాడించడం సీఎం హోదాకు తగదన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెర్నేకల్ సురేందర్రెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, లీగల్సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం యాదవ్, మహిళా, మైనారిటీ విభాగాల జిల్లా అధ్యక్షులు శౌరి విజయకుమారి, ఫిరోజ్, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు గోపినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాంపస్ ఇంటర్వూ్యల్లో 13 మంది ఎంపిక
గుత్తి : పట్టణంలోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో లక్నోకు చెందిన సీ – కోర్ ఇండియా టెక్నో సొల్యూష¯Œ్స సాఫ్ట్వేర్ కంపెనీ శుక్రవారం ఎంబీఏ, బీటెక్ ఫైనలియర్ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహించింది. 13 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఇందులో ఎంబీఏ విద్యార్థులు ముగ్గురు, బీటెక్ విద్యార్థులు 10 మంది ఉన్నారు. ఈ సందర్భంగా కంపెనీ హెచ్ఆర్ ప్రదీప్వర్మ మాట్లాడుతూ ఉద్యోగాలకు ఎంపిౖకెన ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి రూ.2.4 లక్షల వేతనం ఇస్తామన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను గేట్స్ కరస్పాండెంట్ వీకే సుధీర్రెడ్డి, డైరెక్టర్లు వీకే పద్మావతి, వీకే వాణి, ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమల్లేశ్వరరావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రతాప్రెడ్డి, పీడీ జోయెల్ అభినందించారు. -
కొనసాగుతున్న పడవ వెలికితీత పనులు
నిడదవోలు : విజ్జేశ్వరం వద్ద గోదావరి స్కవర్‡ స్లూయిజ్ గేటులో చిక్కుకుపోయిన పాత ఇనుప పడవ వెలికితీసేందుకు ఆదివారం కూడా శ్రమించారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఏటా గోదావరి వరదల సమయంలో పేరుకుపోయిన మట్టి, పూడికను తొలగించేందుకు ధవళేశ్వరం హెడ్ వర్క్స్ అధికారులు ఈ నెల 4న స్కవర్ ఆపరేషన్లో భాగంగా స్కవర్ స్లూయిజ్ నాలుగు గేట్లను ఎత్తారు. ఈ సమయంలో గోదావరిలో నీరు సముద్రం వైపునకు వదులుతారు. ఆ ప్రవాహనికి బ్యారేజీ వెనుక వైపు మట్టిలో కూరుకుపోయిన పాత ఇనుప పడవ ఒకటి కొట్టుకొచ్చి ఒక గేటులో చిక్కుకుపోయింది. ఇనుప పడవ కావడంతో గేటుకు కొక్కానికి పడవ పట్టేసింది. దీంతో ఎంత నీటి ప్రవాహం ఉన్నా అది కొట్టుకురాకుండా ఉండిపోయింది. దీంతో దానిని తీయడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ధవళేశ్వరం హెడ్వర్క్స్ ఎస్ఈ బి.రాంబాబు, ఈఈ ఎన్.కృష్ణారావులు దగ్గరుండి పడవ తీసే పనిలో నిమగ్నమయ్యారు. ముందుగా స్టాప్లాగ్ గేట్లును మూసివేసి నీటి ప్రవాహాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్టాప్లాగ్ గేట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి తుప్పుపట్టి కిందకు దిగడం లేదు. స్టాప్లాగ్ గేట్లను కిందకు దించితే తప్ప నీటి ప్రవాహం అడ్డుకట్ట వేయలేరు. పడవ తీసేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
42 వరద గేట్ల ఎత్తివేత
బాల్కొండ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు పోటెత్తడంతో ఆదివారం సాయంత్రం 42 వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి 3 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 3 లక్షల 24 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి ఎస్కెప్ గేట్ల ద్వార 3 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వార వెయ్యి క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వార 300 క్యూసెక్కుల, కాకతీయ కాలువ ద్వార 5 వేల క్యూసెక్కుల నీటి విడుదల అవుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 (90 టీఎంసీల)తో నిండుకుండలా ఉంది. -
జూరాల క్రస్టుగేట్ల మూసివేత
-కొనసాగుతున్న విద్యుదుత్పత్తి జూరాల : కష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు ఇన్ఫ్లోపై ప్రభావం పడింది. సోమవారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్కు కేవలం 52వేల క్యూసెక్కులు వస్తుండటంతో క్రస్టుగేట్లన్నింటినీ మూసివేశారు. జలవిద్యుత్ కేంద్రంలోని ఆరు టర్బైన్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ 44వేల క్యూసెక్కులను పవర్హౌస్ ద్వారా దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65టీఎంసీలు కాగా 9.29టీఎంసీలను నిల్వ ఉంచారు. జూరాల రిజర్వాయర్ ద్వారా కోయిల్సాగర్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకాలకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్కు ఇన్ఫ్లో కేవలం 84,688 క్యూసెక్కులు వస్తుండటంతో అన్ని క్రస్టుగేట్లను మూసివేశారు. విద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72టీఎంసీలు కాగా 117టీఎంసీలను నిల్వ ఉంచారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64టీఎంసీలు. ప్రస్తుతం 32టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి రిజర్వాయర్కు 59,371 క్యూసెక్కుల ఇన్ఫ్లో వరద వస్తుండగా నాలుగు క్రస్టుగేట్లు తెరవడంతోపాటు విద్యుదుత్పత్తి ద్వారా జూరాల రిజర్వాయర్కు 22,072 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. -
ఎల్లంపల్లికి జలకళ
నాలుగు గేట్లు ఎత్తివేత ముంపు బాధితుల తరలింపు రామగుండం/వెల్గటూరు : ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తొలిసారిగా జలకళ వచ్చింది. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 18 టీఎంసీలకు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉండటంతో అధికారులు బుధవారం సాయంత్రం నాలుగు గేట్లను ఎత్తారు. 40వేలు క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో 21, 22, 23, 24 గేట్ల ద్వారా 10,800 క్యూసెక్కుల నీటిని గోదారినదిలోకి వదులుతున్నట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ అనిల్కుమార్, ప్రాజెక్టు సూపరింటెండెంట్ విజయ్భాస్కర్ తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లోని 25వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రాజెక్టులో గరిష్ట సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేస్తున్న క్రమంలో బ్యాక్వాటర్ ముంపు గ్రామాలను ముంచుతోంది. ఇప్పటికే రామగుండం మండలం కుక్కలగూడూర్లోకి నీళ్లు వచ్చాయి. వెల్గటూరు మండలం కోటిలింగాల అలుగు ఒర్రె నీటమునిగి రాకపోకలు స్తంభించాయి. గ్రామంలోకి నీళ్లు చేరుతున్నాయి. చెగ్యాం గ్రామంలోకి నీళ్లు వస్తుండటంతో రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం గ్రామస్తులను ఇళ్లు ఖాళీ చేయించారు. నిర్వాసితులను పునరావాస కాలనీకి తరలించారు. సదరు కుటుంబాలకు తాత్కాలికంగా పునరావాస కాలనీలోని జెడ్పీ హైస్కూల్, ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్తోపాటు తాళ్ల కొత్తపేట ప్రాథమిక పాఠశాలలో వసతి కల్పించారు. వీటిలో సుమారు 30 గదులు ఉండగా గదికి ఐదు కుటుంబాల చొప్పున వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఒక గదిలో ఐదు కుటంబాలు సామాన్లు పెట్టకునే సరికి పూర్తిగా నిండిపోతోంది. ఈ కుటుంబాలకు పది రోజుల వరకు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని, ఆ తర్వాత వారే తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. -
గరిష్ట స్థాయికి జీడీపీ నీటిమట్టం
– హంద్రీకి నీటి విడుదలకు అవకాశం – తీర గ్రామాల్లో ప్రమాద హెచ్చరికలపై దండోరా గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్ట్కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఎప్పుడైనా క్రస్ట్గేట్లు ఎత్తి హంద్రీలోకి నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్ట్ అధికారులు సోమవారం సాయంత్రం ప్రకటించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం అందించి జిల్లా కలెక్టర్ విజయ్మోహన్, జలవనరుల శాఖ ఎస్ఈ చంద్రశేఖర్రావు నుంచి ఉత్తర్వులు పొందారు. దీంతో హంద్రీ తీర ప్రాంతాలైన హెచ్.కైరవాడి, గాజులదిన్నె తదితర గ్రామాల్లో రెవెన్యూ అధికారులు దండోరా వేయించారు. అలాగే పోలీసులు కూడా గ్రామీణులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్లో 377 మీటర్ల నీటిని నిలువ చేసే సామర్థ్యం ఉండగా సోమవారం సాయంత్రానికి 376.77 మీటర్ల నీటిమట్టం నమోదైంది. 376.80 మీటర్లకు పైగా నీటి మట్టం నమోదైతే అదనంగా వచ్చిన నీటిని హంద్రీలో వదులుతామని జీడీపీ డీఈ లక్ష్మణ్కుమార్ తెలిపారు. ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో ఏమాత్రం వర్షం వచ్చినా అవి ప్రాజెక్ట్లో చేరి ప్రమాదస్థాయి దాట వచ్చని పేర్కొన్నారు. హంద్రీ పరీవాహక ప్రాంత వాసులు హంద్రీవైపు వెళ్ల వద్దని ఆయన హెచ్చరించారు. -
తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
చర్ల : ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా చేరుతోంది. చత్తీస్గడ్ రాష్ట్రం సరిహద్దు ప్రాంతంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదనీరు ఎక్కువగా వస్తోంది. దాంతో గురువారం 17 గేట్లు ఎత్తివేసి 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 74 మీటర్లు కాగా వరద పోటును దృష్టిలో పెట్టుకుని 73.60 మీటర్ల నీటిని నిల్వ ఉంచి మిగిలిన నీటిని కిందికి వదిలివేస్తున్నారు. ప్రాజెక్టు ఇంజనీర్ వెంకటేశ్వరరావు సిబ్బందితో ప్రాజెక్టు వద్దే ఉండి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. -
విమానమొచ్చింది.. గేటేయండి..!
మన వద్ద రైలు రాగానే రెండు వైపులా వాహనాలు రాకుండా గేట్లు వేసేస్తారు. ఈ రైల్వే గేట్లు మనకు కామనే. ఇదే సీన్ విమానానికి ఎదురైతే.. విమానమొస్తుందంటూ వాహనాలు రాకుండా రెండు వైపులా గేట్లు వేస్తే ఎలాగుంటుంది. ఇలాంటి చిత్రమైన సన్నివేశం చూడాలంటే జిబ్రాల్టర్కు వెళ్లాల్సిందే. ఇక్కడ ఎయిర్పోర్టు రన్వే.. నాలుగు లేన్ల ప్రధాన రహదారికి మధ్యలో ఉంటుంది. దీంతో విమానం వచ్చినప్పుడు లేదా వెళ్లినప్పుడల్లా రెండు వైపులా గేట్లు వేసేసి.. వాహనాలను నిలిపేస్తారు. విమానం వెళ్లగానే.. మళ్లీ వాహనాలు యధావిధిగా వెళ్లిపోతాయి. ఈ ఎయిర్పోర్టుకు స్థలం తక్కువగా ఉండటం.. సమతలంగా ఉన్న భూమి లేకపోవడంతో చివరికి ఇలా రోడ్డు మధ్యలో రన్వేను నిర్మించాల్సి వచ్చింది. -
జూరాలకు మళ్లీ వరద
వరద ఉధృతి తగ్గడంతో రెండు రోజుల క్రితం మూసివేసిన జూరాల ప్రాజెక్టు గేట్లను డ్యాం అధికారులు సోమవారం మళ్లీ ఎత్తారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాలకు ఇన్ఫ్లో పెరిగింది. దీంతో జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తారు. ధరూరు: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద ఉధృతి పెరిగింది. గత రెండురోజులుగా ప్రాజెక్టుకు స్వల్ప ఇన్ఫ్లో ఉండడంతో క్రస్టుగేట్లను మూసివేసిన విషయం తెలిసిందే. సోమవారం పెరిగిన వరద ఆధారంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని పీజేపీ అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి 7.30గంటల వరకు జూరాల నీటిమట్టం 1044 అడుగులు ఉంది. ప్రాజెక్టు 12 క్రస్టుగేట్ల ద్వారా 1.24 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 1613 అడుగులు ఉంది. ఈ ప్రాజెక్టుకు 1.20లక్షల ఇన్ఫ్లో ఉండగా, 20 క్రస్టుగేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 1704 అడుగులు ఉంది. 85,375 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 5 క్రస్టుగేట్ల ద్వారా 1.15లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జెన్కో జలవిద్యుత్ కేంద్రంలోని ఆరుయూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. -
ఒక్కసారే గేట్లెత్తిమొనగాళ్లమనుకుంటే ఎలా?
ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ రూరల్ : జిల్లాలోని ప్రాజెక్టుల గేట్లెత్తి తమకు చేతులు నొప్పి పుట్టాయని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నేతలు ఒక్కసారి గేట్లెత్తి మొనగాళ్లమనుకుంటే ఎలా అని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సాగర్లో డెడ్ స్టోరేజీ లెవల్లో నీరున్నప్పటికీ తాము ఏఎమ్మార్పీకి, సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల చేశామన్నారు. శ్రీశైలం సొరంగ మార్గం పూర్తయితే 6వేల కూసెక్కుల నీరు జిల్లాకు వస్తుందని, ఇందులో 4వేల క్యూసెక్కులు గ్రావిటీ ద్వారా, మరో 2వేల క్యూసెక్కులు డిండి దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించవచ్చన్నారు. సొరంగమార్గం విషయమై దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ జెడ్పీ సమావేశంలో ప్రశ్నిస్తే పనికిమాలిన ప్రాజెక్టు అని..పక్కకు పెట్టేస్తామని చెప్పడం మంత్రి జగదీష్రెడ్డికి ఉన్న అవగాహన అర్థమవుతుందని పేర్కొన్నారు. సొరంగ మార్గాన్ని పూర్తిచేసేందుకు దృష్టి సారించాలన్నారు. తాము అనేకసార్లు నీటివిడుదల చేసేందుకు గేట్లు తిప్పి అలసిపోయామన్నారు. కాంగ్రెస్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన మంత్రి పదవిని త్యాగం చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయకపోతే ప్రజలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. 1983 నుంచి 2000 వరకు కేసీఆర్ ఆంధ్రాపార్టీ కింద పనిచేయలేదా, 2004లో కేసీఆర్లో మంత్రిగా ఉండలేదా, ఇప్పుడున్న కొందరు నేతలు వైఎస్ఆర్ కింద మంత్రులుగా కొనసాగలేదా అని ప్రశ్నించారు. తానుగ్రామస్థాయి నుంచే నాయకుడిగా ఎదిగినప్పటికీ అనేక విషయాలను ఇప్పటికీ తెలుసుకునేందుకే ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జేఏసీ పుట్టింది జానారెడ్డి ఇంట్లోనని, తెలంగాణ ఉద్యమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలకపోరాటం చేశారన్నారు. ఇటీవల గెలిసిన టీఆర్ఎస్ నాయకులు ఉద్యమంలో వెనుకనుంచి నాలుగు రాళ్లు వేశారో లేదో వారికే తెలియాలన్నారు. అలాంటి వారికి తమను విమర్శించేస్థాయి లేదన్నారు. టీఆర్ఎస్లో ఎందుకు చేరుతున్నారో.. వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో ఎందుకు చేరుతున్నారో అర్థం కావడం లేదని, ఆ పార్టీలో మొదటినుంచి పనిచేసిన వారే బాధపడుతున్నారని గుత్తా అన్నారు. టీఆర్ఎస్ అంటే ఒక హిస్టీరియా లాగా వ్యాపించిందన్నారు. ఆదరించి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత లభించడం లేదని, మీరెందుకు వస్తున్నారంటూ ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎమ్మెల్యే భాస్కర్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్ తదితరులు వున్నారు. -
శ్రీశైలం గేట్ల ఎత్తివేత
శ్రీశైలం ప్రాజెక్టు: ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం జలాశయం దాదాపు పూర్తిస్థారుు నీటిమట్టానికి (885 అడుగులు) చేరుకుంది. సోమవారం ఉదయం 7.10 గంటలకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణమ్మకు పూజలు నిర్వహించి, వాయనం సమర్పించారు. అనంతరం నాలుగు రేడియల్ క్రస్ట్ గేట్లను తెరచి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్కు 1,97,100 క్యూసెక్కుల నీరు వస్తుండగా 1,96,627 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా జూరాల జలాశయం 16 క్రస్టుగేట్ల ద్వారా 1.53 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ద్వారా 1,12,312 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన ద్వారా 75,563 క్యూసెక్కులు నాగార్జునసాగర్కు వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 8,052 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 700 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో గరిష్ట స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలుగా ఉంది. కార్యక్రమంలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, అచ్చంపేట, బనగానపల్లె, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇన్ఫ్లో పెరిగితే మరికొన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ప్రాజెక్టులకు జలకళ
-
రూల్స్కు గేట్లేవి?
-
రూల్స్కు గేట్లేవీ?
సాక్షి, హైదరాబాద్: పదమూడు లక్షల మందికి పైగా ఉద్యోగులు.. వేల కిలోమీటర్ల మార్గాలు.. లక్షల కోట్లలో బడ్జెట్.. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థలో ఒకటిగా గుర్తింపు.. ఇది భారత రైల్వే ఘనత.. కానీ అదే రైల్వే నిత్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.. లెవెల్ క్రాసింగ్ల వద్ద కనీస రక్షణ ఏర్పాట్లు చేయలేక ఏటా వందలాది మందిని బలిగొంటోంది.. దీనికితోడు ప్రభుత్వ అడ్డగోలు ని‘బంధ’నాలతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది.. ప్రభుత్వం, రైల్వేశాఖల నిర్లక్ష్యం, నిర్లిప్తత, అసమర్థత, అడ్డగోలు నిబంధనలు.. వెరసి తప్పెవరిదైనా చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అమాయకులు మాత్రం బలవుతున్నారు. అసలు దక్షిణ మధ్య రైల్వేకు ఏడాదిన్నర క్రితమే గేట్ల వద్ద ఉండే సిబ్బందికి సంబంధించి 62 పోస్టులు మంజూరయ్యాయి. కానీ అంత మేర వేరే విభాగంలో సిబ్బంది సంఖ్యను కుదిస్తేగాని ఆ పోస్టుల భర్తీ సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పటంతో.. ఆ ఫైల్ ఢిల్లీలో దుమ్ముకొట్టుకుపోతోంది. దానికి ఇదివరకే మోక్షం లభించి ఉంటే మాసాయిపేట లెవెల్ క్రాసింగ్ వద్ద జరిగిన ప్రమాదంలో 14 మంది చిన్నారులు మరణించి ఉండేవారు కారేమో! వ్యయం.. భయం! ఒక చోట రైల్వే గేటు ఏర్పాటు చేయాలంటే... గేటు, కాపలాదారులు కూర్చునే గది, ఇతర సామగ్రికి కలిపి రూ. 25 లక్షల నుంచి 35 ల క్షల వరకు ఖర్చవుతుంది. ఇక్కడ మూడు షిఫ్టు (8గంటల చొప్పున)ల్లో ముగ్గురు కాపలా సిబ్బంది అవసరం. ఆరో వేతన సంఘం నిబంధనల ప్రకారం కాపలా సిబ్బంది ఒక్కొక్కరికి రూ. 15వేల నుంచి 20 వేల వరకు వేతనం (డీఏ సహా) చెల్లించాలి. అంటే ముగ్గురికి కలిపి నెలకు రూ. 60 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క గేటుకు ఇంత ఖర్చు చేయాల్సి వస్తే.. దేశంలోని అన్ని లెవెల్ క్రాసింగ్ల వద్ద గేట్లు ఏర్పాటుకు ఒక సంవత్సరం మొత్తం రైల్వే బడ్జెట్ కూడా సరిపోదు. అందుకే దీన్ని రైల్వే శాఖ భారంగా భావిస్తోంది. ఒక చోట తొలగిస్తేనే.. ప్రస్తుతం రైల్వేశాఖకు మానవ వనరుల(సిబ్బంది) కేటాయింపు అధికారం లేదు. 2003లో ఆ అధికారాన్ని ఆర్థిక శాఖ పరిధిలోకి మార్చారు. రైల్వే శాఖ గేట్ల వద్ద సిబ్బంది అవసరం ఉందంటూ ఆర్థిక శాఖను కోరితే... అంతే సంఖ్యలో సిబ్బందిని ఎక్కడైనా తగ్గిస్తే కేటాయిస్తామని ఆర్థిక శాఖ పేర్కొంటోంది. అంటే ఒకచోట సిబ్బందిని నియమించాలంటే మరోచోట తొలగించాలన్న మాట. ఉదాహరణకు దక్షిణ మధ్య రైల్వేకు ఏడాదిన్నర కింద 62 గేటు సిబ్బంది పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించింది. కానీ ఆ 62 పోస్టులను ఎక్కడ తగ్గించాలో రైల్వేశాఖ తేల్చుకోలేకపోవడంతో ఏడాదిన్నరగా ఫైల్ పెండింగులో పడిపోయింది. నిబంధనలే అసలు సమస్య కనీసం నెలలో 20 వేల వాహనాలు తిరిగే రోడ్డు ఉన్న చోట మాత్రమే గేటు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రైల్వేశాఖ నిబంధన పెట్టుకుంది. ఇందుకోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రత్యేక సెన్సెస్ నిర్వహిస్తుంది. నిర్ధారిత సంఖ్య కంటే తక్కువగా వాహనాల ట్రాఫిక్ ఉన్న చోట్ల గేట్లు ఏర్పాటు చేయాలంటే.. అందుకయ్యే వ్యయాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే శాఖ గేట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు-రైల్వే శాఖకు మధ్య సయోధ్య కుదరటం లేదు. ఇక నెలలో 50 వేల వరకు వాహనాలు తిరిగే రోడ్లున్న చోట రైల్వే సిగ్నల్తో అనుసంధానమయ్యే సిగ్నల్ ఇంటర్ లాకింగ్ గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు రూ. కోటిన్నర వరకు ఖర్చవుతుంది. దీంతో ఖర్చుకు భయపడుతున్న రైల్వే శాఖ అతి ముఖ్యమైన మార్గాల్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తోంది. రెండు లైన్లు ఉండి, గంటకు 80 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్లే రైళ్లు, గణనీయ సంఖ్యలో రైళ్లు తిరిగే మార్గాలను ఏ క్లాస్ రూట్లుగా రైల్వే శాఖ పేర్కొంటోంది. ఈ మార్గాల్లో మాత్రమే గేట్ల ఏర్పాటుపై శ్రద్ధ చూపుతోంది. కానీ దక్షిణ మధ్య రైల్వేలో ఇలాంటి మార్గాలు కొన్నే. మిగతా కేటగిరీ మార్గాలే ఎక్కువ. వాటిని గాలికొదిలేయడంతో... తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మాసాయిపేట క్రాసింగ్ కూడా ఇలాంటి జాబితాలోనే ఉండిపోయింది. కకోద్కర్ కమిటీ నివేదిక బుట్టదాఖలు రైల్వేల్లో భద్రతా వ్యవస్థను పటిష్టం చేసేందుకు 2011 సెప్టెంబర్లో కేంద్రం ఏర్పాటు చేసిన అనిల్ కకోద్కర్ కమిటీ 2012లో నివేదిక అందజేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 14,896 కాపలా లేని లెవెల్ క్రాసింగ్ల వద్ద పరిస్థితిని సరిదిద్దాలంటే రూ. 50 వేల కోట్లు ఖర్చవుతుందని తేల్చింది. రైలు ప్రమాదాల్లో 40 శాతం వరకూ కాపలాలేని క్రాసింగ్ల వద్దే జరుగుతున్నాయని స్పష్టం చేసింది. -
తెరుచుకున్న బాబ్లీగేట్లు
నిజామాబాద్: సుమారు ఎనిమిది నెల ల పాటు గోదావరి ప్రవాహానికి అడ్డుకట్ట వేసిన మహా రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మంగళవారం వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. మంగళవారం మధ్యాహ్నం రెండు రాష్ట్రాల అధికారుల సమక్షంలో బాబ్లీకి ఉన్న 14 గేట్లను ఎత్తారు. బాబ్లీ ప్రాజెక్టు అధికారి ఎస్వీ సాల్వి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మీడియాను సైతం ప్రాజెక్టు వద్దకు అనుమతించలేదు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు విజయ్ చోబే, ఇంజనీర్ జీఎస్ లోఖండే, బాబ్లీ గ్రామ సర్పంచ్ గంగాబాయి, నాందేడ్ సీఐ పంకజ్ దేశ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు తీర్పు ప్రకారం రానున్న అక్టోబర్ 28 వరకు గేట్లు ఎత్తి ఉంచనున్నారు.మన రాష్ట్రానికి, మహారాష్ట్రకు గతం లో బాబ్లీ వివాదం నెలకొన్న నేపథ్యంలో మన ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు ఏటా అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లను మూసి ఉంచాలని, జూలై 1న తెరిచి అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం కలగకుండా గేట్లు ఎత్తి ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు.