getup srinu
-
వేణుమాధవ్ వాయిస్ ని అచ్చు.. గుద్దినట్లు దించేసిన గెటప్ శ్రీను
-
ఓటీటీలోకి వచ్చేసిన గెటప్ శ్రీను సినిమా
గెటప్ శీను, అంకికా కారత్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. మే 24న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దర్శకుడు కృష్ణమాచారి ఎంచుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. కథనం ఆసక్తికరంగా లేకపోవడంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మీదకు వచ్చేశాడు రాజు యాదవ్. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.రాజు యాదవ్ కథ విషయానికొస్తే.. రాజు యాదవ్ ముఖానికి క్రికెట్ బాల్ తగలడంతో ఆపరేషన్ చేస్తారు. అది ఫెయిలవుతుంది. దీంతో ఫేస్ నవ్వుతున్నట్లే ఉండిపోతుంది. కొన్నాళ్లకు స్వీటీ (అంకితా కారత్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమెకి హైదరాబాద్లో జాబ్ రావడంతో రాజు యాదవ్ కూడా అక్కడికెళ్లి క్యాబ్ డ్రైవర్గా మారతాడు. ఆ తర్వాత అమ్మాయి.. ఇతగాడికి కొన్ని షాకులిస్తుంది. చివరకు ఏమైందనేదే కథ.ప్రథమార్థం సినిమా అంతా కూడా కథానాయకుడు, అతని స్నేహితులు, మధ్య తరగతి జీవితం చుట్టూ సాగుతుంది. క్రికెట్ బాల్ తగిలాక కథనాయుకుడి ముఖ కవలికల్లో మార్పు రావడం, ఆ నేపథ్యంలో పండే హాస్యం కాస్త కాలక్షేపాన్ని పంచుతుంది. ధ్వితీయార్థం లోనే అసలు కథ ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం కథానాయకుడు హైదరాబాద్ కి వెళ్ళి ఆమెకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం వంటి సన్నివేశాలతో సినిమా సాగుతుంది. క్లైమాక్స్ లో భాగంగా వచ్చే చివరి 20 నిమిషాల సన్నివేశాలతో మధ్య తరగతి కుటుంబం తాలూకు తండ్రి కొడుకుల మధ్య ఉండే భావోద్వేగమైన ఎమోషన్ తో కంటతడి పెట్టిస్తుంది. -
ఓటీటీకి టాలీవుడ్ కమెడియన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కమెడియన్ గెటప్ శీను, అంకితా కారత్ జంటగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్. మే 24న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. రెండు నెలల్లోపే ఓటీటీల్లో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది.ఈనెల 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ట్వీట్ చేసింది. ఈ మేరకు గెటప్ శ్రీనుతో ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది.రాజు యాదవ్ కథేంటంటే..'రాజు యాదవ్' విషయానికొస్తే.. రాజు యాదవ్ ముఖానికి క్రికెట్ బాల్ తగలడంతో ఆపరేషన్ చేస్తారు. అది ఫెయిలవుతుంది. దీంతో ఫేస్ నవ్వుతున్నట్లే ఉండిపోతుంది. కొన్నాళ్లకు స్వీటీ (అంకితా కారత్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమెకి హైదరాబాద్లో జాబ్ రావడంతో రాజు యాదవ్ కూడా అక్కడికెళ్లి క్యాబ్ డ్రైవర్గా మారతాడు. ఆ తర్వాత అమ్మాయి.. ఇతగాడికి కొన్ని షాకులిస్తుంది. చివరకు ఏమైందనేదే కథ. థియేటర్లలో చూడని వారు.. ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.Raju yadav manodu, mee aha lo vasthunnadu!😎Yaadh maravakurri...ee month 24th na vasthundu🕺🏻The Crazy Entertainer #RajuYadav premieres July 24th only on aha!@getupsrinu3 @RocketRaghava @mirchihemant @iamankitakharat @actorchakrapani @PawonRamesh @PrashanthUttar1 pic.twitter.com/3ANM2lU4XF— ahavideoin (@ahavideoIN) July 18, 2024 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రాజు యాదవ్'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
'జబర్దస్త్' కమెడియన్గా కెరీర్ మొదలుపెట్టి గెటప్ శీను.. ఇప్పుడు హీరో అయ్యేంత వరకు వచ్చాడు. స్టార్ హీరోల సినిమాల్లో హాస్య నటుడిగా చేస్తూ పేరు తెచ్చుకున్న ఇతడు.. రీసెంట్గా 'రాజు యాదవ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రిలీజ్కి ముందు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత వాటిని అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో జనాలు పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్)గెటప్ శీను, అంకికా కారత్ హీరోహీరోయిన్లుగా నటించగా.. ఈ సినిమాకు కృష్ణమాచారి దర్శకుడు. మే 24న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు జూన్ 22 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై క్లారిటీ వస్తుంది.'రాజు యాదవ్' విషయానికొస్తే.. రాజు యాదవ్ ముఖానికి క్రికెట్ బాల్ తగలడంతో ఆపరేషన్ చేస్తారు. అది ఫెయిలవుతుంది. దీంతో ఫేస్ నవ్వుతున్నట్లే ఉండిపోతుంది. కొన్నాళ్లకు స్వీటీ (అంకితా కారత్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమెకి హైదరాబాద్లో జాబ్ రావడంతో రాజు యాదవ్ కూడా అక్కడికెళ్లి క్యాబ్ డ్రైవర్గా మారతాడు. ఆ తర్వాత అమ్మాయి.. ఇతగాడికి కొన్ని షాకులిస్తుంది. చివరకు ఏమైందనేదే కథ.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ట్రైలర్.. ఆ విషయంపై ట్రోల్స్) -
ఆర్టిస్ట్గా ఫెయిల్ అయిపోయానేమో అనుకున్నా: గెటప్ శ్రీను
‘రాజు యాదవ్’లో నేను పోషించిన పాత్ర చాలా కష్టమైనది. ఈ పాత్ర చేస్తున్నప్పుడు ఒకానొక దశలో ఆర్టిస్ట్ గా ఫెయిల్ అయిపోయానేమో అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. షూటింగ్ అప్పుడు చాలా కష్టంగా అనిపించింది. అయితే దర్శకుడు చాలా స్ఫూర్తిని ఇచ్చి ఈ పాత్ర చేయించారు’ అని అన్నాడు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం ‘రాజు యాదవ్’. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.మే 24న ఈ చిత్రం విడుదల కాబోతంది. ఈ నేపథ్యంలో తాజాగా గెటప్ శ్రీను మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ నేను హీరోగా చేయాలని ప్లాన్ చేసుకోలేదు. ఇప్పటివరకూ నటనకు ఎక్కువ స్కోప్ వున్న పాత్రలని చేయడానికి ప్రయత్నించాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గానే స్థిరపడాలని అనుకున్నాను. రాజు యాదవ్ కథ విన్నాక ఫుల్ లెంత్ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం కలుగుతుందనిపించింది. అందుకే ఈ సినిమా చేశాను. నా వరకూ ఇది నేను చేస్తున్న ఫుల్ లెంత్ క్యారెక్టర్ గానే భావిస్తాను.⇒ ఈ చిత్రంలో కామెడీతో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. తల్లితండ్రులు తమ కొడుకు నుంచి ఏం కోరుకుంటున్నారు ? అలాగే కొడుకు కోణంలో తల్లితండ్రులు ఎలా ఉండాలి? తల్లితండ్రుల కలని సాకారం చేయడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయకూడదనే అంశం ఈ కథకు మూలం.⇒ దర్శకుడు కృష్ణమాచారి నీది నాది ఒకే కథ, విరాట పర్వం, అలాగే ఒక స్పానిస్ సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆయన కథ చెప్పే విధానం చాలా నచ్చింది. చాలా సహజత్వంతో సినిమాని తీశారు. ఫన్ తో పాటు ఎమోషన్ ని చాలా అద్భుతంగా చూపించారు.⇒ ఇది రియల్ స్టొరీనే. కానీ క్యారెక్టరైజేషన్ ఫిక్షనల్. బౌలర్ లక్ష్మీ పతి బాలాజీ గారికి చిన్నపుడు ముఖానికి ఓ సర్జరీ జరిగితే సర్జరీలో ఎదో తేడా జరిగి స్మైల్ ఫేస్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. అక్కడ నుంచి మా దర్శకుడు స్ఫూర్తి పొంది ఈ పాత్రకు ఆ క్యారెక్టరైజేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ నవ్వుతూ వుండటం మామూలు విషయం కాదు. ఈ పాత్ర చేయడం చాలా కష్టం అనిపించింది⇒ టీవీ నాకు పేరు తీసుకొచ్చింది. ఆర్ధికంగా స్థిరత్వాన్ని ఇచ్చింది. అయితే టీవీకి ఎక్కువ డేట్లు కేటాయించడం వలన సినిమాల్లో చాలా మంచి పాత్రలని మిస్ వుతున్నానని తెలిసింది. ఇప్పుడు సినిమాలపైనే దృష్టి పెట్టాను. నా కెరీర్ పట్ల ఇంట్లో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. నేను ఎదో సాధించానని ఆనందం ఇంట్లో వారికి ఉంది. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. -
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
‘‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’లో అలీగారికి కోటి రూపాయిల లాటరీ తగులుతుంది. ఆ ఆనందంలో ఆయన నవ్వుతూనే చనిపోతారు. సినిమా అంతా నవ్వు ముఖంతోనే ఉంటారు. అలాగే క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీకి జరిగిన సర్జరీ వల్ల ఆయన ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్లే కనిపిస్తుంది. ఇలాంటి లోపంతో కథ రాస్తే బావుంటుందనిపించి ‘రాజు యాదవ్’ స్క్రిప్ట్ రాశాను’’ అని డైరెక్టర్ కృష్ణమాచారి అన్నారు. గెటప్ శ్రీను హీరోగా కె. ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మించిన చిత్రం ‘రాజు యాదవ్’. ఈ నెల 17న ఈ సినిమా రిలీజవుతున్న సందర్భంగా కృష్ణమాచారి మాట్లాడుతూ– ‘‘15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను. ‘నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం’ చిత్రాలకు దర్శకుడు వేణు ఊడుగులగారి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా చేశాను. దర్శకుడిగా ‘రాజు యాదవ్’ నా తొలి చిత్రం. నాకు సహజత్వంతో కూడకున్న సినిమాలంటే ఇష్టం. ‘రాజు యాదవ్’ రియలిస్టిక్గా ఉంటుంది. గెటప్ శ్రీను కెరీర్లో ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. చంద్రబోస్గారు మా సినిమా కోసం ఓ పాట రాసి, పాడటం సంతోషంగా ఉంది. సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు. -
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
జబర్దస్త్ కమెడియన్ రాజు యాదవ్, అంకిత కారత్ జంటగా నటించిన చిత్రం రాజు యాదవ్. యధార్థం సంఘటనల ఆధారంగా కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్పై ప్రశాంత్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. హనుమాన్ హీరో తేజ సజ్జా చేతుల మీదుగా ట్రైలర్ను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే గెటప్ శ్రీను తన నటన, కామెడీతో ఆకట్టుకున్నారు. ట్రైలర్ ప్రారంభంలోనే క్రికెట్ ఆడుతుండగా శ్రీనుకు బాల్ తగలడంతో ముఖచిత్రం మారిపోతుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండేలా ఫేస్ విచిత్రంగా తయారవుతుంది. దీంతో అతని నవ్వుతో పడే ఇబ్బందులను తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్గా గెటప్ శ్రీను కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. కాగా.. ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రంలో ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. -
ఓటీటీకి మా ఊరి పొలిమేర-2.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
సత్యం రాజేశ్, డా.కామాక్షీ భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గౌరు గణబాబు సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం అదేస్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్గా నిలిచిన మా ఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కించారు. (ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్లో లవ్ బర్డ్స్.. ఇక్కడే పెళ్లి చేసుకుందామన్న ప్రియాంక!) తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్పై సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆడియన్స్ ఊహించని విధంగా ఈ నెలాఖరులోనే ఓటీటీకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలా జరిగితే.. నవంబర్ 3న విడుదలైన ఈ సినిమా నెల కాకముందే ఓటీటీలోకి రానుంది. మరోవైపు డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మరో వార్త వైరలవుతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ తేదీపై కాస్తా సస్పెన్ష్ కొనసాగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ మూవీని డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మా ఊరి పొలిమేర పార్ట్-1 ఇందులోనే స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. పార్ట్-2 కూడా హాట్స్టార్లోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: 'నా జీవితంలో ఇలా మొదటిసారి చూశా'.. పుష్ప చిత్రంపై బిగ్ బీ కామెంట్స్ వైరల్!) -
'Maa Oori Polimera 2': ‘మా ఊరి పొలిమేర -2’ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)
-
పొలిమేర 3 ఉంటుంది
‘సత్యం’ రాజేశ్, డా. కామాక్షీ భాస్కర్ల, ‘గెటప్’ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరు గణబాబు సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ హక్కులను పంపిణీదారుడు వంశీ నందిపాటి సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం నవంబరు 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన వేడుకకు అతిథులుగా హాజరైన దర్శకుడు హరీష్ శంకర్, హీరో కార్తికేయ, నిర్మాత ‘బన్నీ’ వాసు ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఈ తరహా సినిమాలను థియేటర్స్లో చూస్తే ఆడియన్స్ కొత్త అనుభూతికి లోనవుతారు’’ అన్నారు. ‘‘పొలిమేర 1’ మాదిరి ‘పొలిమేర 2’ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు హరీష్ శంకర్. ‘‘ఫస్ట్ పార్ట్ చూడనివారికి కూడా ‘పొలిమేర 2’ స్క్రీన్ప్లే అర్థం అవుతుంది. ‘పొలిమేర 3’ కూడా ఉంటుంది’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘పొలిమేర’కు మించి ‘పొలిమేర 2’ ఉంటుంది. సినిమా విజయంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్, గౌరీకృష్ణ, అనిల్ విశ్వనాథ్. -
పెళ్లి చేసుకున్న కమెడియన్ కెవ్వు కార్తీక్
బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా పాపులర్ అయిన కమెడియన్ కెవ్వు కార్తీక్ ఓ ఇంటివాడు అయ్యాడు. కెవ్వు కార్తీక్, శ్రీలేఖల వివాహం గురువారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకకు బుల్లితెర నటులే కాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా హజరయ్యారు. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా తనకు అత్యంత ఆప్త మిత్రుడు అయిన గెటప్ శ్రీను సహా పలువురు కమెడియన్లు హాజరయ్యారు. వారందరూ కొత్త దపంతులను ఆశీర్వదించారు. (ఇదీ చదవండి: టక్కర్ సినిమా ట్విటర్ రివ్యూ, టాక్ ఎలా ఉందంటే?) ఈ మేరకు కొత్త దంపతులతో దిగిన ఫోటోలను గెటప్ శ్రీను షోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపాడు. అయితే, గతంలో తన భార్యను సిరి అని సంబోధించాడు కార్తీక్. కానీ, గెటప్ శ్రీను మాత్రం పెళ్లికుమార్తె పేరు శ్రీలేఖ అని పేర్కొన్నాడు. బహుశా సిరి అనేది ముద్దుపేరేమో. వరంగల్లో పుట్టిన కార్తీక్ ఇంజినీరింగ్ పూర్తి చేసి సినిమాలపై మక్కువతో హైదరాబాద్ వచ్చాడు. ఇప్పటికే టీవీ షోలతో పాటు పలు సినిమాల్లోనూ నటించాడు. గతేడాది విడుదలైన ‘ముఖచిత్రం’, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రాలతో ఆయన ప్రేక్షకులను మెప్పించాడు. (ఇదీ చదవండి: టాలీవుడ్లో ప్రేమ పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!) -
పొలిమేరలో...
సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో ఓ చిత్రం రూ΄పొందింది. ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. పల్లెటూరి నేపథ్యంలో, ఊరి పొలిమేర చుట్టూ సాగే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: గ్యాని, కెమెరా: ఖుషేందర్ రమేష్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ న్ .సి. సతీష్ కుమార్. -
‘మా ఊరి పొలిమేర` సీక్వెల్ వచ్చేస్తుంది!
సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా డా.అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం 2021 డిసెంబర్లో డైరెక్టర్గా ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. వాస్తవికతకు దగ్గరగా ఊహించని ట్వీస్టులతో సినిమా మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది. ‘ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశాం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం’అని చిత్ర యూనిట్ పేర్కొంది. గ్యాని సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో డా. కామాక్షి, రవివర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
నవ్వుల వెనుక పడ్డ బాధలెన్నో.. ‘గెటప్’ శ్రీను రియల్ లైఫ్ స్టోరీ
కళారంగంపై మక్కువ.. హాస్యంలో వినూత్న పంథా.. వైవిధ్య గెటప్లతో నటన.. అతడికి సినిమా అవకాశాలు తెచ్చి పెట్టింది.. చిన్నతనం నుంచి సరదాగా చేసిన కామెడీ నటుడిగా నిలబెట్టింది.. వలస కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్లిన యువకుడు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నాడు. అతడే శ్రీకాకుళం జిల్లా ఆకివీడు మండలం కొల్లేరు తీర గ్రామమైన కాళింగగూడెంకు చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్ ఉరఫ్ గెటప్ శ్రీను. బుల్లితెర నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ సినీ రంగంలో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. శ్రీకాకుళం నుంచి వలస కూలీలుగా కాళింగగూడెం వచ్చిన బొడ్డుపల్లి రామస్వామి, దాలమ్మ దంపతుల కుమారుడు గెటప్ శ్రీను. గ్రామంలోని పంట కాలువ పక్కన చిన్న పూరింట్లో అతడి బాల్యం గడిచింది. సిద్ధాపురం హైస్కూల్లో పదో తరగతి వరకు, దుంపగడప ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివాడు. తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్లేవాడు. చిన్నతనం నుంచి హాస్యధోరణితో ఉండే శ్రీను తోటి కూలీల మాటలను, నడకను అనుకరిస్తూ హాస్యం పండించేవాడు. తన హావభావాలతో నవ్విస్తూ అందరినీ ఆకట్టుకునేవాడు. పాఠశాలలో, కళాశాలలో, స్నేహితుల వద్ద అతడు సరదాగా చేసిన కామెడీ హాస్యనటుడిని చేసింది. చిన్నతనం నుంచి డ్యాన్స్లోనూ ప్రతిభ కనబర్చేవాడు. చిరంజీవిపై అభిమానంతో సినిమాల్లో రాణించాలని కలలుగన్నాడు. యాంకర్ నుంచి హీరో వరకూ.. ఇంటర్తో చదువుకు ఫుల్స్టాప్ పెట్టిన గెటప్ శ్రీను యాంకర్గా బుల్లితెరలోకి ప్రవేశించి జబర్దస్త్ అనంతరం పలు కార్యక్రమాలు, టీవీ షోలు, స్టేజ్ షోల్లో రాణించాడు. తరచూ హాస్యం, విభిన్న గెటప్లతో ఆకట్టుకుంటూ గెటప్ శ్రీనుగా, జూనియర్ కమల్హాసన్గా పేరు తెచ్చుకున్నాడు. సినీ హాస్యనటుడు వేణు సహకారంతో తెలుగబ్బాయి చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. ఇస్మార్ట్ శంకర్, రంగస్థలం, లైగర్, గాడ్ఫాదర్, జాంబిరెడ్డి, పొలిమేర తదితర 70 చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న భోళాశంకర్ తదితర చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే రాజు యాదవ్ చిత్రంలో హీరోగా నటనతో మెప్పించాడు. బోరు కొట్టించకుండా.. గెటప్ శ్రీను కళారంగంలో రాణిస్తూ ఆర్థికంగా స్థిరపడి హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. అందరూ నటిస్తారని, అందుకు భిన్నంగా, మనసును హత్తుకునేలా నటించాలన్నదే తన లక్ష్యమని గెటప్ శ్రీను చెబుతున్నాడు. బుల్లితెరపై బోరు కొట్టించకుండానే వెండి తెరపై ప్రేక్షకుల్ని రంజింపజేస్తున్నానని, సినిమాల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగడమే తన లక్ష్యమని అంటున్నాడు. తరచూ గెటప్ శ్రీను స్వగ్రామం కాళింగగూడెం వస్తుంటాడు. స్థానికంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. జిల్లాలో పలు కార్యక్రమాల్లో సత్కారాలు కూడా అందుకున్నాడు. -
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ వ్రాప్ అప్ పార్టీ
Most Eligible Bachelor Wrap Up Party: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. తాజాగా ఈ సినిమా వ్రాప్ అప్ పార్టీ జరిగింది. వినోదాత్మకంగా జరిగిన ఈ పార్టీకి హీరో అఖిల్ అక్కినేనితో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమెడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కడుపుబ్బా నవ్వించారు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రేమ, కెరీర్, పెళ్లి అన్ని అంశాలు ముడిపెడుతూ ఎమోషనల్ జర్నీగా తెరకెక్కించారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెప్తోంది చిత్ర యూనిట్. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్తో లవ్లీగా వుండేలా డిజైన్ చేస్తారు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్. -
ఆ కమెడియన్ను ఫాలో అవుతున్న బ్రహ్మీ!
నటుడు బ్రహ్మానందం కమెడియన్గా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. కామెడీ అంటే బ్రహ్మీ.. బ్రహ్మీ అంటే కామెడీ అనేంతగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ హాస్యాన్ని పండిస్తాడు. ఇలా హాస్యా బ్రహ్మగా పేరు తెచ్చుకున్న ఆయన తన తాజా చిత్రంలో జబర్తస్థ్ కమెడియన్ను ఫాలో అవుతున్నారట. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలు తగ్గించిన బ్రహ్మీ.. ప్రస్తుతం ‘రంగమార్తండ’లో నటిస్తున్నాడు. దీనితో పాటు ఆయన నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న ‘పెళ్లి సందడి’లో నటిస్తున్నాడు. ఈ పెళ్లి సందడిను కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో గేటప్ శ్రీనును బ్రహ్మీ కాపీ కొడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా జబర్థస్త్ కామెడీ స్టేజ్పై ఎన్నో రకాల పాత్రలు పోషించి నవ్వులు పూయించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు శ్రీను. అందులో అతడు వేసిన బిల్డప్ బాబాయి పాత్ర ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్రను అదే తరహాలో దర్శకుడు రాఘవేంద్రరావు ‘పెళ్లి సందD’లో పెట్టినట్లుగా సమాచారం. ఈ పాత్రకు బ్రహ్మీనే సంప్రదించడం.. ఆయన దీనికి ఒకే చెప్పడం విశేషం. అలా బ్రహ్మీ ఈ మూవీలో గెటప్ శ్రీనును అనునాయించనున్నాడట. ఏకంగా హాస్యా బ్రహ్మా.. గెటప్ శ్రీనును ఫాలో అవుతుండటంతో అతడి క్రేజ్ మరింత పెరగనుందని చెప్పుకొవచ్చు. కాగా ఈ సినిమాలో రోషన్కు జోడిగా శ్రీలీల హీరోయిన్గా పరిచయం కానుంది. చదవండి: టీజర్ హిట్.. రెమ్యునరేషన్ పెంచిన బాలయ్య వైరల్ అవుతోన్న జూ. ఎన్టీఆర్ అరుదైన వీడియో.. -
‘ఆహా’లో జాంబిరెడ్డి, ఎప్పటినుంచంటే..
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): జాంబిరెడ్డి సినిమా యూనిట్ ఆదివారం విశాఖలో సందడి చేసింది. ఈ సందర్భంగా డాబాగార్డెన్స్లోని ఓ హోటల్లో ఆదివారం హీరో తేజ, దర్శకుడు ప్రశాంత్ వర్మ విలేకరులతో మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించిన ఈ సినిమా లాక్డౌన్ సడలింపులు తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్నారు. అయితే అధిక శాతం మంది సినిమా చూడలేకపోయారని.. అలాంటి వారి కోసం ఈ నెల 26న ‘ఆహా’లో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమా చూసి నచ్చితే పది మందికి చెప్పాలని కోరారు. విశాఖ నుంచి ఆహా ప్రీ రిలీజ్ టూర్ ప్రారంభించామని, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ ప్రాంతాల్లో కొనసాగిస్తామన్నారు. త్వరలో జాంబిరెడ్డి–2 తీయనున్నట్టు చెప్పారు. గెటప్ శ్రీను మాట్లాడుతూ జాంబిరెడ్డిలో కశిరెడ్డి పాత్రలో నటించానన్నారు. ఆహాలో ఈ సినిమాను ఇంటిల్లిపాది చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో నటుడు హేమంత్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: సోషల్ హల్చల్: రాశి ఖన్నా అందాల విందు.. -
‘ఆచార్య’లో మంచి పాత్ర పోషిస్తున్నా..
ఆకివీడు: సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయని మండలంలోని కళింగగూడెంకు చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్ (గెటప్ శ్రీను) అన్నా రు. స్వగ్రామానికి వచ్చిన ఆయన సోమ వారం విలేకరులతో మాట్లాడారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హిందీ, తమిళం, కన్నడ, మళయాళం, తెలుగు భాషల్లో నిర్మితమవుతోన్న ‘లైగర్’ చిత్రంలో తాను నటిస్తున్నానని చెప్పారు. చిరంజీవి ఆచార్య చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నానని, రాజూ యాదవ్ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నానన్నారు. ఖైదీ నెం.150, జాంబీ రెడ్డి చిత్రాల్లో పాత్రలకు పేరువచ్చిందన్నారు. చదవండి: చిత్రం మూవీకి సీక్వెల్ "చిత్రం 1.1 చదవండి: చిరంజీవీ సరసన త్రిష -
నిజానికి దగ్గరగా...
‘గెటప్’ శీను, అంకితా కరత్ జంటగా కృష్ణమాచారి దర్శకత్వంలో ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రాజు యాదవ్’. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి సాగర్ కె. చంద్ర క్లాప్ ఇచ్చారు. వేణు ఉడుగుల, సుధాకర్ చెరుకూరి, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ స్క్రిప్ట్ను కృష్ణమాచారికి అందించారు. సూడో రియలిజమ్ జానర్లో ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ‘కమర్షియల్ హంగులకు దూరంగా, వాస్తవికకు దగ్గరగా మా సినిమా ఉంటుంది’ అన్నారు కృష్ణమాచారి. ‘డిసెంబర్ మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు ప్రశాంత్ రెడ్డి. -
నాగబాబు కొత్త షో : విజిల్ ప్రీ లోడెడ్
హైదరాబాద్ : ట్యాలెంట్ ఉన్న హ్యాస్యనటులను ప్రోత్సహించేందుకు నటుడు నాగబాబు డిజిటల్ మీడియా వేదికగా రెండు కొత్త షోలను ప్రారంభించనున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి స్టాండప్ కామెడీ షో, మరోకటి ‘అదిరింది’ మాదిరి కామెడీ స్కిట్స్ అని తెలిపారు. అందులో ఇప్పటికే స్టాండప్ కామెడీ షో.. ఖుషీ ఖుషీగా వివరాలను జబర్దస్త్ నటుడు బుల్లెట్ భాస్కర్ వెల్లడించారు. తాజాగా కామెడీ స్కిట్స్తో కూడిన షో వివరాలను జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను ఓ వీడియో ద్వారా వివరించారు.(రెండు రోజుల తర్వాత కరోనా అంటూ ఫోన్..!) షో పేరు విజిల్.. ప్రీలోడెడ్ అని తెలిపారు. ఈ డిజిటల్ షోలో అవకావం దక్కించుకోవడానికి ఏం చేయాలో కూడా వివరించారు. ఆ తర్వాత ఎంపిక ప్రకియ ఎలా కొనసాగుతుందో కూడా తెలిపారు. ఎంపికైనవారికి ప్రోత్సహకాలు ఉంటాయని చెప్పారు. నాగాబాబు ఆధ్వర్యంలోని జడ్జిమెంట్ ప్యానల్ చివరకు.. ఆరు టీమ్లను ఎంపిక చేసి వాటి మధ్య ఫైనల్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. వీరికి ఓటీటీ ప్లాట్ఫామ్లో అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. ఈ షోలో పాపులర్ కమెడియన్స్ కూడా పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. (హీరోయిన్ ఐశ్వర్య అర్జున్కు కరోనా) Here's a golden chance for all the Talented people. Don't miss this opportunity! Registration link - https://t.co/K2jXq5AfqW Watch Here: https://t.co/NEJVY6C86A#VijilPreloadedShow #NagaBabu #GetupSrinu #ManaChannelManaIshtam — Naga Babu Konidela (@NagaBabuOffl) July 20, 2020 -
3 మంకీస్ టీమ్తో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ
-
త్రీ మంకీస్ సినిమా రివ్యూ
సినిమా : త్రీ మంకీస్ నటీనటులు: సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, కారుణ్య చౌదరి దర్శకత్వం: జి.అనిల్ కుమార్ నిర్మాత: నగేష్. జి సంగీతం: జి. అనిల్ కుమార్ బ్యానర్: ఓరుగల్లు సినీ క్రియేషన్స్ జానర్: హారర్ కామెడీ ‘సాఫ్ట్వేర్ సుధీర్’ చిత్రం అంతగా ఆడకపోయినా బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ మరోసారి హీరోగా ముందుకొచ్చాడు. పైగా ఈసారి తన జబర్దస్త్ టీం శ్రీను, రాంప్రసాద్తో కలిసి సినిమా చేయడం విశేషం. ఇక ట్రైలర్ బాగుందంటూ మెగాస్టార్ చిరంజీవి ‘త్రీ మంకీస్’ను అభినందించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. జబర్దస్త్ షో పాపులారిటీ సినిమాకు ఏమేరకు ప్లస్ అయ్యింది? బుల్లితెరపై కడుపు చెక్కలయ్యేలా నవ్వించే ఈ టీమ్ వెండితెరపై ఏమేరకు నవ్వులు పండించగలిగింది..? సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ హీరోలుగా ప్రేక్షకులను మెప్పించారా లేదా అనేది చూద్దాం.! కథ: సంతోష్ (సుధీర్) మార్కెటింగ్ శాఖలో పనిచేస్తుంటాడు. అతనికి ఫణి (గెటప్ శ్రీను), ఆనంద్ (ఆటో రాంప్రసాద్) ప్రాణ స్నేహితులు. ఈ ముగ్గురు కలిసి చేసే కోతిచేష్టలకు అంతే లేదు. సరదాగా సాగిపోతున్న వీరి జీవితంలోకి సన్నీలియోన్ ఎందుకు వచ్చింది? అసలు ఆమె ఎవరు.. ఎలా చనిపోయింది? ఆమె చావుకు ఈ ముగ్గురికి సంబంధమేంటి? ఇంతలో సుధీర్ ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుంటాడు. అతన్ని కాపాడేందుకు ఫణి, ఆనంద్ ఏం చేశారు? అసలే చిక్కుల్లో ఉన్న వీరిపై ఓ పాపను కాపాడాల్సిన బాధ్యత ఎలా పడింది. ఆమెను వీరు ఎలా కాపాడారు..? అని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..! (వీళ్లకి టీవీయే కరెక్ట్ అని మాత్రం అనుకోరు) విశ్లేషణ: సాయం అనే మందు లేక చాలామంది చనిపోతున్నారనే అంశాన్ని దర్శకుడు కథలో అంతర్లీనంగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమా తొలి అర్ధభాగం త్రీ మంకీస్ పంచ్లు, సరదా సన్నివేశాలతో పరవాలేదనిస్తుంది. వాళ్ల పంచ్లు పేలడంతో పెద్దగా బోర్ కొట్టదు. అయితే, సెకండాఫ్కు వచ్చేసరికి కథ అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. ముగ్గురు స్నేహితులను ఓ హత్య కేసులో ఇరికించి, ప్రేక్షకుడిని థ్రిల్ చేద్దామనుకున్న దర్శకుడు అందులో పూర్తిగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. కథ క్రైమ్ జానర్లోకి వెళ్లిన తర్వాత దర్శకుడు తేలిపోయాడు. అమ్మాయి హత్య కేసులో ముగ్గురు ఇరుక్కు పోయినప్పుడు.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు అంతగా పండలేదు. ఏది ఆశించి.. కథ రాసుకున్నాడో అది నిజం చేసేందుకు దర్శకుడి పనితనం సరిపోలేదు. తొలి అర్థభాగం జబర్దస్త్ పంచ్లతో ఫరావాలేదనిపంచిన దర్శకుడు.. రెండో అర్థభాగం థ్రిల్లర్ నేపథ్యంలో కథ నడపలేకపోయాడు. ఇక పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం లేవు. రెండు పాటలు ఫరవాలేదనిపించాయి. బుల్లితెరపై అల్లరి చేసే త్రీ మంకీస్లో.. ఎమోషన్స్ అనే కొత్త కోణం చూపించారు. షకలక శంకర్, కారుణ్య చౌదరి ఓకే అనిపిస్తారు. చిన్న సినిమా అయినా.. సాంకేతికంగా జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇక ముగ్గురు హాస్యనటుల్ని ఒకేసారి వెండితెరపై చూపడం.. సగటు అభిమానికి నచ్చుతుంది. అయితే, వాళ్లలోని ప్రతిభను పూర్తిస్థాయిలో ఆవిష్కరించే కథ మాత్రం కాదని చెప్పాలి. దర్శకుడు కేవలం కామెడీనే నమ్ముకుంటే బాగుండేంది. ప్లస్ పాయింట్స్: సుధీర్, శ్రీను, రాంప్రసాద్ నటన కామెడీ టైమింగ్ మైనస్ పాయింట్స్: కొత్తదనం లేకపోవడం భయపడేంత హారర్ సీన్లు లేకపోవడం -
ఇప్పుడే హీరో ట్యాగ్ వద్దు
‘‘ప్రేక్షకులకు వినోదం పంచాలని ఇండస్ట్రీకి వచ్చాను. టీవీ, సిల్వర్ స్క్రీన్, యూట్యాబ్ చానెల్ ఇలా ప్లాట్ఫామ్ ఏదైనా పర్లేదు’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘జబర్దస్త్’ ఫేమ్ ‘సుడిగాలి’ సుధీర్, ‘గెటప్’ శ్రీను, రాంప్రసాద్ ప్రధాన తారాగణంగా అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘3 మంకీస్’. నగేష్. జి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ‘సుడిగాలి’ సుధీర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పాత్ర చేశా. మా సినిమాకి ఊహించిన స్థాయిలో థియేటర్స్ రాకపోవడంతో కాస్త ఆందోళనగా ఉన్నాం. చిరంజీవిగారు మా ట్రైలర్ చూసి చాలా బాగుందన్నారు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తానన్నారు. నేను హీరోగా చేసిన ‘సాఫ్ట్వేర్ సుధీర్’కి మంచి వసూళ్లు వచ్చాయి. దానికి కారణం నేను ఫ్యామిలీలా భావించే నా ఫ్యాన్సే. హీరోగా ఓ సినిమా కమిట్ అయ్యాను. హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పుడే హీరో అనే ట్యాగ్ వద్దు’’ అన్నారు. -
ఇండస్ట్రీలోని త్రీ మంకీస్ మేమే
‘‘ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్ద వాళ్లున్నా నన్ను, మంచు లక్ష్మి, అలీని ఎందుకు పిలిచారు? మేం ముగ్గురం చేసే పిచ్చి చేష్టలు ఉహించుకొని, ఇండస్ట్రీలో ఉన్న త్రీ మంకీస్ మేమే అని మమ్మల్ని పిలిచినట్టున్నారు’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు అన్నారు. ‘జబర్దస్త్’ ఫేమ్ ‘సుడిగాలి’ సుధీర్, ‘గెటప్’ శ్రీను, రాంప్రసాద్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘3 మంకీస్’. కారుణ్య చౌదరి హీరోయి¯Œ గా నటించారు. అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ .జి నిర్మించిన ఈ సినిమా రేపువిడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘సరిలేరు నీకెవ్వరు, శ్రీమంతుడు, ఘరానా బుల్లోడు’ లాంటి టైటిల్స్ ఏ హీరోకి పెట్టినా సరిపోతాయి. ‘3 మంకీస్’ టైటిల్ మాత్రం వీరికి తప్పితే మరెవరికీ పనికిరాదు’’ అన్నారు. ‘‘సినిమాలో నటించడం కంటే ‘జబర్దస్త్’ లో చేయడమే కష్టం’’ అన్నారు మంచు లక్ష్మి. ‘‘చిన్న సినిమాలను బతికిస్తే ఇండస్ట్రీతో పాటు చిన్న దర్శకులు బాగుంటారు’’అన్నారు నటుడు అలీ. ‘‘మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు నగేష్. ‘‘ఇలాంటి పాత్ర చేస్తానని జీవితంలో అనుకోలేదు’’ అన్నారు రాంప్రసాద్. ‘‘మా ముగ్గురికీ ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్ రాదు’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘‘ఈ ప్రపంచంలో సాయం అనే మందు లేక చాలా మంది చనిపోతున్నారని మా చిత్రంలో చెప్పాం’’ అన్నారు అనిల్. హీరో ఆకాష్ పూరి, కారుణ్య చౌదరి, రచయిత అరుణ్, కెమెరామేన్ సన్నీ మాట్లాడారు. -
వీళ్లకి టీవీయే కరెక్ట్ అని మాత్రం అనుకోరు
‘‘త్రీ మంకీస్’ సినిమా టైటిల్కి తగ్గట్టే ఈ సినిమాలో నేను, సుధీర్, గెటప్ శ్రీను కోతి చేష్టలు చేస్తుంటాము’’ అన్నారు రాంప్రసాద్. ‘జబర్దస్త్’ ఫేమ్ సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించిన∙చిత్రం ‘త్రీ మంకీస్’. జి. అనిల్ కుమార్ దర్శకత్వంలో జి. నగేశ్ నిర్మించారు. ఈ నెల 7న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీకి రావాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. గలగల మాట్లాడుతూ, పంచ్లు వేస్తుంటే చుట్టుపక్కల వాళ్లు ‘నువ్వు ఇండస్ట్రీలో ఉండాల్సినవాడివి’ అనేవారు. దాంతో లగేజ్ సర్దుకుని హైదరాబాద్ వచ్చేశాను (నవ్వుతూ). కానీ ఇక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఎంతో స్ట్రగులయ్యాక ‘జబర్దస్త్’ టీవీ షో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ షో ద్వారా ‘ఆటో రాంప్రసాద్’గా పాపులరయ్యాను. ‘త్రీ మంకీస్’ కథ నచ్చి మేం సినిమా చేయాలనుకున్నాం. సరదాగా సాగిపోయే ముగ్గురు స్నేహితులకు ఒక సమస్య ఎదురవుతుంది. అందులో నుంచి ఎలా బయటపడ్డారు అన్నది కథాంశం. థియేటర్కి వచ్చిన ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం. ‘త్రీ మంకీస్’ చూసి వీళ్లకి టీవీయే కరెక్ట్ అని మాత్రం అనుకోరని చెప్పగలను. టీవీని, సినిమాను బ్యాలెన్స్ చేస్తూ పని చేయాలనుకుంటున్నాను. దర్శకత్వం చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి’’ అన్నారు. -
త్రీ మంకీస్ పైసా వసూల్ చిత్రం
‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘త్రీ మంకీస్’. జి. అనిల్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను జి. నగేష్ నిర్మించారు. కారుణ్య చౌదరి కథానాయిక. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ – ‘‘కామెడీతో పాటు అన్ని అంశాలుంటాయి. పక్కా పైసా వసూల్ చిత్రమిది’’ అన్నారు. ‘‘త్రీ మంకీస్’ చిత్రం మా బ్యానర్కి మంచి పేరు తీసుకొస్తుందనుకుంటున్నాను’’ అన్నారు నగేష్. ‘‘మేం ముగ్గురం కలసి సరదాగా నటించాం. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తారనుకుంటున్నాను’’ అన్నారు సుధీర్. ‘‘రిలీజ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు గెటప్ శ్రీను. ‘‘సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను’’ అన్నారు రాంప్రసాద్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి బాబు వాసిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ సాయి. -
డబ్స్మాష్ వల్ల ఏం జరిగింది?
పవన్కృష్ణ. సుప్రజ హీరో హీరోయిన్లుగా ‘జబర్ధస్త్’ ఫేమ్ గెటప్ శ్రీను ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘డబ్స్మాష్’. సుబ్రమణ్యం మలసాని సమర్పణలో ఓంకార లక్ష్మీ నిర్మించారు. కేశవ్ దేపూర్ దర్శకుడు. నేడు ‘డబ్స్మాష్’ విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నటి స్పందన మాట్లాడుతూ– ‘‘నేను చేసిన టిక్ టాక్ వీడియో చూసి ఈ చిత్రంలో చాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. సుబ్రమణ్యం మాట్లాడుతూ– ‘‘మా దర్శకునికి సినిమాపై ఉన్న తపన చూసి నమ్మకంతో ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘బెస్ట్ టెక్నీషియన్స్తో ఈ సినిమా చేశాను. దాదాపు 20 నిమిషాలపాటు వీ.ఎఫ్.ఎక్స్ వర్క్ ఉంటుంది. స్టూడెంట్స్ చేసే డబ్స్మాష్ వల్ల ఏం జరిగింది? అనేది మా సినిమా కథ’’ అన్నారు కేశవ్. గెటప్ శ్రీను, పవన్కృష్ణ సహనిర్మాత గజేంద్ర దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘డబ్శ్మాష్’ ట్రైలర్ విడుదల
పవన్ క్రిష్ణ, సుప్రజ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘డబ్శ్మాష్’. గెటప్ శ్రీను ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కేశవ్ డేపుర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఓంకార లక్ష్మీ, గజేంద్ర తిరకాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, పాటలకు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ ట్రైలర్ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ఈ ట్రైలర్ యూత్కు బాగా కనెక్ట్ అవడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ప్రస్తుతం యువత డబ్శ్మాష్ల కోసం ఏదైనా చేయడం, వారి అలవాట్లు, వారు చేసే తుంటరి పనులకు చివర్లో ఎదుర్కొనే కష్టాలు వంటివి ట్రైలర్లో చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఇక కొన్ని డైలాగ్లు యూత్ను బాగా ఆకట్టుకుంటున్నాయి. వంశిష్ సంగీతమందిస్తున్నాడు. -
పొట్టకూటి కోసం పొగడ్తలు
‘‘ప్యారాషూట్ లేకుండా మనిషిని గాల్లో తేలగలిగేలా చేసేది పొగడ్త. దానికి పడని వాళ్లు ఉండరు. అలాంటి పొగడ్తనే ప్రవృత్తిగా పెట్టుకున్న ఒక కుటుంబానికి సంబంధించిన కథే మా ‘భజన బ్యాచ్’ సిరీస్. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది’’ అన్నారు దర్శకుడు చిన్నికృష్ణ. దర్శకుడు మారుతి ఇచ్చిన కాన్సెప్ట్ ఆధారంగా చిన్నికృష్ణ రూపొందించిన వెబ్సిరీస్ ‘భజన బ్యాచ్’. పోసాని కృష్ణమురళి, గెటప్ శ్రీను, జెమిని సురేశ్ ముఖ్య పాత్రల్లో నటించారు. చిన్నా వాసుదేవ రెడ్డి నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం సోనీ లైవ్లో ప్రసారం అవుతోంది. ఈ సందర్భంగా చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ సిరీస్ను 12 ఎపిసోడ్లుగా, ఒక్కో ఎపిసోడ్ 20 నిమిషాల నిడివితో రూపొందించాం. పొగడ్తల ద్వారా జీవితం సాగిస్తారు పోసాని. వాళ్ల పిల్లలను కూడా ఇదే వృత్తిని కొనసాగించమనడంతో తన పిల్లలు కూడా భజన చేయడం మొదలుపెడతారు. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కొక్కరి చుట్టూ చేరి భజన చేస్తారు. ఈ మధ్య సోషల్ మీడియాలో పాపులారిటీ పొందిన వాళ్లను స్ఫూప్ చేశాం. విషం తీసుకుంటాను కానీ పొగడ్తలను తీసుకోను అనే మనస్తత్వం ఉన్న అజయ్ ఘోష్ వీళ్ల ఆటలు కట్టించాలనుకుంటాడు. ముందుగా సినిమాలా చేసి వెబ్ సిరీస్ స్టయిల్లో కట్ చేశాం. నాకు జంధ్యాలగారు, ఈవీవీగారు అంటే చాలా అభిమానం. వాళ్ల స్టయిల్ కామెడీ ఇందులో ఉంటుంది. నాటకరంగంలో నటుడిగా నాలుగు స్టేట్ అవార్డులు అందుకున్నాను. వినాయక్గారిని నటుడిగా అవకాశం అడిగితే రైటింగ్ టీమ్లోకి తీసుకున్నారు. ఆయన వద్ద ‘కృష్ణ, అదుర్స్’ సినిమాలకు వర్క్ చేశాను. ‘వీడు తేడా, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, లండన్ బాబులు’ సినిమాలకు దర్శకత్వం వహించాను. ‘కొత్తబంగారు లోకం, ఖైదీ నంబర్ 150’ వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించాను. దర్శకులకు సినిమా సినిమాకు చిన్న గ్యాప్ రావడం సహజం. ఇకపై ఆ గ్యాప్లో వెబ్ సిరీస్లు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను తెరకెక్కించిన ‘అక్షర’ సినిమాని ఈ నెలాఖరులో విడుదల చేయానున్నాం’’ అన్నారు. -
నవ్వించి ఏడిపిస్తాం
‘‘ఆ ముగ్గురి కామెడీ చూస్తే నాకు ఎనర్జీ వస్తుంది. నా ఐప్యాడ్లో ఎప్పుడూ వీళ్లు చేసిన స్కిట్స్ ఉంటాయి’’ అన్నారు ప్రముఖ నిర్మాత శ్యామ్ప్రసాద్ రెడ్డి. ‘జబర్దస్త్’ ఫేమ్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ప్రసాద్ హీరోలుగా నటించిన చిత్రం ‘త్రీ మంకీస్’. కారుణ్య చౌదరి కథానాయిక. ఓరుగుల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్కుమార్ జి. దర్శకత్వంలో నగేశ్ జి. నిర్మించారు. ఈ చిత్రం లోగో, ఫస్ట్ లుక్ను శ్యామ్ప్రసాద్రెడ్డి, నటుడు, నిర్మాత నాగబాబు ఆవిష్కరించారు. శ్యామ్ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆవకాయ, పప్పు, నెయ్యి కలిస్తే ఎంత టేస్ట్ ఉంటుందో వీరి కామెడీ అలా ఉంటుంది. టెన్షలో ఉన్నప్పుడు, ట్రాఫిక్లో ఉన్నప్పుడు వీరి స్కిట్స్ చూస్తాను. ‘చిత్రం భళారే విచిత్రం’, ‘అహ నా పెళ్లంట’, ‘ప్రేమకథా చిత్రం’లా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నాగబాబు మాట్లాడుతూ– ‘‘రిస్క్ అనుకోకుండా ఈ ముగ్గురిపై ఫోకస్ పెట్టి సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు నా అభినందన లు. గెటప్ శ్రీను వజ్రం లాంటి ఆర్టిస్ట్. 90 రకాల గెటప్లతో రకరకాల బాడీ లాంగ్వేజెస్తో అతను అలరిస్తాడు’’ అన్నారు. ‘‘అందరినీ పక్కాగా నవ్విస్తాం’’ అని గెటప్ శ్రీను, రామ్ప్రసాద్ అన్నారు. ‘‘ఫస్టాఫ్లో నవ్విస్తాం, సెకండాఫ్లో ఏడిపిస్తాం’ అని సుడిగాలి సుధీర్ అన్నారు. ‘‘స్క్రిప్ట్ను నమ్మి చేసిన చిత్రం ఇది’’ అన్నారు అనిల్ కుమార్. ‘‘స్క్రిప్ట్ వినగానే ఆ ముగ్గురితోనే సినిమా చేయాలని పట్టుబట్టి ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు నిర్మాత నగేశ్. -
చిన్నతిరుపతిలో గెటప్ శ్రీను సందడి
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: నటుడు గెటప్ శ్రీను కుటుంబ సమేతంగా మంగళవారం చినవెంకన్న ఆలయాన్ని సందర్శించారు. శ్రీవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మాట్లాడుతూ.. టీవీ కామెడీ షోలతో పాటు ఇంత వరకు దాదాపు 50 సినిమాల్లో నటించానని చెప్పారు. ఇటీవల రంగస్థలం చిత్రంతో మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. ప్రస్తుతం మహేష్బాబు హీరోగా నటిస్తున్న మహర్షి సినిమాలోను, సుమంత్ హీరోగా నటిస్తున్న సుబ్రహ్మణ్యం చిత్రంతో పాటు, మరో రెండు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. -
చిరు చిత్రంలో నటించడం అదృష్టం
మిమిక్రీ లో మూడు బంగారు పతకాలు సాధించా బొబ్బిలి: నవ్వించగలిగే నైపుణ్యముండే ప్రతి ఒక్కరినీ చిత్ర పరిశ్రమ గుర్తిస్తుందని ప్రముఖ హస్య నటుడు అద్దంకి శేషుకుమార్ ( షేకింగు శేషు) అన్నారు. బొబ్బిలిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. 20 ఏళ్లుగా తాను మిమిక్రీ, వెంట్రి లాక్విజం చేశానన్నారు. రాజమండ్రిలో రాజ్యలక్ష్మి కళాసమితి ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే అఖిల భారత స్థాయి మిమిక్రీ పోటీల్లో తనకు వరుసగా మూడేళ్లు బంగారు పతకాలు వచ్చాయని చెప్పారు.మిమిక్రీలో ఎవరికీ గురువు ఉండరని, ఏకలవ్య విద్యేనన్నారు. తాను మిమిక్రీలో 2500 ప్రదర్శనలు ఇచ్చానన్నారు. ఇప్పటివరకూ సినిమా చూపిస్తామామ, కుమారి 21ఎఫ్, సుప్రీం, సెల్ఫీరాజా, బాబు బంగారం, లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాల్లో నటించానని చెప్పారు. ఇంకా 8 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం వైశాఖం, హైపర్, మిస్టర్ సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. మంచి కమెడియన్గా గుర్తింపు తెచ్చుకోవాలి బొబ్బిలి: సినీ పరిశ్రమలో మంచి కమెడియన్గా నిలదొక్కుకొని గుర్తింపు తెచ్చుకోవాలన్నదే లక్ష్యమని హాస్యనటుడు రాకెట్ రాఘవన్నారు.. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా బుధవారం ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. పూర్వనటులు అల్లు రామలింగయ్య, రేలంగి, బ్రహ్మానందంలు ప్రజలకు ఎలా గుర్తుండి పోయారో ఆ విధంగా హాస్యనటుడిగా మిగిలిపోవాలన్నదే తన ఆశయమని చెప్పారు. తాను మొదట్లో ఆలిండియా రేడియాలో పనిచేశానని చెప్పారు. సండే సినిమా ద్వారా చలనచిత్రానికి పరిచయమయ్యానన్నారు. ఇప్పటివరకూ 150 సినిమాలు వరకూ చేశానని, బాద్షా, డార్లింగ్, అత్తారింటికి దారేది, కందిరీగ వంటి పెద్ద సినిమాల ద్వారా తనకు గుర్తింపు వచ్చిందన్నారు. కళాశాల రోజుల్లో తాను మిమిక్రీ ఆర్టిస్టుగా చేశానన్నారు. సీనియర్ కళాకారుల సలహాలు తీసకొని నటనను మరింత మెరుగు పరుచుకుంటానని చెప్పారు. చిరు చిత్రంలో నటించడం ధన్యం బొబ్బిలి: తాను ఏ హీరోకైతే అభిమానిగా ఉన్నానో, ఆయన 150వ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని నటుడు బొడ్డపల్లి శ్రీను ( గెటప్ శ్రీను) అన్నారు.. చిరంజీవి 150వ సినిమా అయిన ఖైదీ నెంబరు 150లో కోల్కత్తా పోలీసుగా నటించే అవకాశం వచ్చిందన్నారు.. బొబ్బిలిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను నటించే హాస్య సన్నివేశాలను చిరంజీవి సతీమణి సురేఖ చూసి, వాటిని చిరంజీవికి చూపించారని చెప్పారు. తన నటన బాగుందని చిరంజీవి మెచ్చుకోవడం తన లైఫ్ టైం అచీవ్మెంట్ వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురంలో తాతలు ఉండేవారని, వ్యవసాయం కోసం తండ్రితో పాటు భీమవరం వద్ద ఆకివీడు వెళ్లిపోయామన్నారు. తాను ఇంటర్ వరకూ ఆకివీడులో చదివి, హైదరాబాద్లో బీఏ చదవడానికి వెళ్లానన్నారు. అయిదో తరగతి నుంచి నటుడిగా చిన్న చిన్న వేషాలు వేసేవాడినన్నారు. తెలుగబ్బాయ్, మనసడిగాక, ప్రేమ నిజం సినిమాలకు అసిస్టెంటు డెరైక్టరుగా చేశానని చెప్పారు. అక్కడ కొంత మంది స్నేహితులు నటన వైపు వెళ్లాలని సూచించడంతో సినిమా రంగం వైపు వచ్చానన్నారు. చుట్టాలబ్బాయ్, తుంగభద్ర వంటి సినిమాల్లో నటించానని చెప్పారు. బొబ్బిలి గురించి సినిమాల్లో చూడడం తప్ప ఇప్పటివరకూ చూడలేదని, ఇప్పుడు ఇక్కడకు రావడం, చూడడం ఆనందంగా ఉందన్నారు.. -
జబర్దస్త్గా జీవించండి
బుల్లితెర హాస్యనటుడు గెటప్ శ్రీను ఆకివీడు : జీవితాన్ని జబర్దస్త్గా మలుచుకోవడం కూడా కళేనని బుల్లితెర హాస్యనటుడు గెటప్ శ్రీను అన్నారు. ఆకివీడులో జరుగుతున్న డీవైఎఫ్ఐ రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలను ఆదివారం ఆయన తిలకించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం మాట్లాడారు. కొల్లేరు తీరంలో చిన్న గ్రామంలో తాను జన్మించానని, పండగ రోజుల్లో ఇక్కడికి వచ్చి ఆనందంతో తిరిగి వెళుతుంటానన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకుడుగా పనిచేశానని చెప్పారు. మండలంలోని కాళింగపేటలో శనివారం రాత్రి గ్రామీణ క్రీడల ముగింపు సభలో మాట్లాడారు. యువత చెడు వ్యసనాల వైపు మరల కుండా గ్రామీణ క్రీడలు దోహదపడతాయన్నారు. క్రీడల వల్ల అందరితో కలిసి మెలిసి జీవించే అవకాశం లభిస్తుందని చెప్పారు. గ్రామీణ క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. విజేతలకు బహుమతులు అందించారు. -
'మెగాస్టార్ చిరంజీవి నాకు ఆదర్శం'
గెటప్ శ్రీను ఆకివీడు: చిన్నప్పటి నుంచి చిలిపి చేష్టలతో నలుగుర్ని నవ్వించి, కవ్వించి, అలరించడం వల్లే హాస్యాన్ని పండించగల్గుతున్నానని జబర్దస్త్ శ్రీనుగా పిలవబడుతూ గెటప్ శ్రీను అవతారంలో రాణించిన బుల్లితెర హాస్యనటుడు బొడ్డుపల్లి శ్రీను అన్నారు. ఆదివారం స్థానికంగా నిర్వహించిన సరిగమ సంగీత పరిషత్ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన్ని ‘సాక్షి’ పలకరించగా పలు విషయాలు తెలిపారు. అవన్నీ ఆయన మాటల్లోనే.. ‘కొల్లేరు తీరంలోని చినమిల్లిపాడు శివారు కాళింగపేటలో నేను జన్మించాను. చిన్నప్పటి నుంచి నా చిలిపిచేష్టలతో అందర్నీ నవ్వించేవాడ్ని. అప్పుడే అందరూ యాక్టర్ అవ్వరా.. అని దీవించారు. ఆ దీవెనలే నన్ను నేడు ఇంతటి వాడ్ని చేశాయి. కడుపునిండా భోజనం లేని రోజుల్లో మల్లెమాల సంస్థ కడుపు నింపింది. శ్యాంప్రసాద్ రెడ్డికి రుణపడి ఉంటాను. జబర్దస్త్ శ్రీనుగా 10 ఏపిసోడ్లతోనే బుల్లితెర హాస్యనటుడిగా ఎంతో గుర్తింపు వచ్చింది. నేను ఇల్లు నిర్మించుకుంటే దానికి ‘మల్లెమాల’ నిలయంగా పేరుపెట్టుకుంటాను. ఎన్నడూ కామెడీ నటుడ్ని అవుదామనుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామనుకున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఆదర్శం. ఆయన సినిమాలు చూసి, ఆయనలా హావభావాలతో అందర్ని అలరించేవాడ్ని. నటులు కమలహాసన్, కోటా శ్రీనివాసరావు, ఎస్వీ రంగారావు, ప్రకాష్రాజ్లవలే డిఫరెంట్ గెటప్లలో నటించాలనే ఆకాంక్ష ఉంది. ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉన్నాను. వెండితెరపై 6 సినిమాల్లో నటించాను. ఇంకా అవకాశాలు వస్తున్నాయి. ఆకివీడు ప్రాంత భాష, యాసలతో బుల్లితెరపై హాస్యాన్ని పండిస్తున్నాను. నటులుగా రావాలనుకునే వారు ముందుగా బాగా చదువుకోండి. సినీ ఇండస్ట్రీలో రాజకీయాల గురించి నాకు తెలీదు.’ శ్రీనును వినియోగదారుల సమాక్య జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి బంగారయ్య అభినందించారు.