Greta Thunberg
-
పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్కు చేదు అనుభవం
కోపెన్హాగన్: పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్బర్గ్కు చేదు అనుభవం ఎదురైంది. అమస్టర్డ్యామ్లో పర్యావరణానికి సంబంధించిన ర్యాలీలో ఆమె మైక్ను ఓ వ్యక్తి బలవంతంగా లాక్కున్నాడు. థన్బర్గ్ పాలస్తీనా అనుకూల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. #GretaThunberg gets interrupted at a climate rally after she speaks up about #Palestine the crowd begins to chant " let her speak" pic.twitter.com/XdrdPD4qyW — Arthur Morgan (@ArthurM40330824) November 13, 2023 అణిచివేతకు గురవుతున్నారు.. స్వతంత్య్రం కోసం పోరాడుతున్నారు.. ప్రపంచ శాంతి లేకుండా పర్యావరణ సమతుల్యాన్ని సాధించలేం అని థన్బర్గ్ అన్నారు. పాలస్తీనీయులు ధరించినట్లు తలకొప్పు ధరించి.. ఆక్రమిత ప్రాంతాల్లో పర్యావరణం కాపాడలేం అంటూ నినదించారు. ఈ సమయంలోనే ర్యాలీలో ఓ గుంపు పాలస్తీనాకు స్వాతంత్య్రం రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణానికి సంబంధించిన ర్యాలీని థన్బర్గ్ రాజకీయ కార్యక్రమంగా మార్చివేశారని సదరు వ్యక్తి ఆరోపించాడు. రాజకీయ విషయాలు మాట్లాడవద్దంటూ ర్యాలీలో ముందుకు వచ్చి థన్బర్గ్ వద్ద ఉన్న మైక్ను లాక్కున్నాడు. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తోంది. హమాస్ అంతమే ధ్యేయంగా గాజాలో కొంతభాగాన్ని ఇజ్రాయెల్ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కొంతమంది పాలస్తీనాకు అండగా నినదిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ చేసేదే సరైనదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: బ్రిటన్ హోం మంత్రి బ్రేవర్మన్ను తొలగించిన రిషి సునాక్ -
మూడు బంగారాల కథ
ఏడేళ్లు నిండి ఎనిమిదో పుట్టిన రోజు జరుపుకొనే పిల్లలు ఏం చేస్తారు? అమ్మా నాన్నలు తెచ్చిన కేకు కోసి తోటి పిల్లలతో పంచుకుని సంతోషిస్తారు. ఆ వయసులో అంతకు మించిన ఆనందం ఏముంటుంది? కానీ సిరిసిల్లకు చెందిన తెలుగమ్మాయి బ్లెస్సీ అలా చేయలేదు. తన ఎనిమిదో పుట్టిన రోజున అడవిలో ఆకుపచ్చ బంగారాలకు ప్రాణం పోసేందుకు విత్తనాలు వెదజల్లేందుకు వెళ్లి మురిసిపోయి మెరిసిపోయింది. పుట్టిన రోజుకు బ్లెస్సీ చేసిన సన్నాహం ఏంటో తెలుసా? బంకమన్ను తెచ్చి దాంతో విత్తన బంతులు తయారు చేస్తూ కూర్చుంది. రెండేళ్ల క్రితమే ఇలా విత్తన బంతులు తయారు చేయడం మొదలు పెట్టిన బ్లెస్సీ ఇప్పటివరకూ ఏకంగా అరవై అయిదు వేల విత్తన బంతులు తయారు చేసింది. తోటి పిల్లలంతా సరదాగా ఆడుకుంటూ ఉంటే బ్లెస్సీ మాత్రం ఎక్కడికెళ్లినా... చెట్ల కింద విత్తనాలు ఏరుకుంటూ ఉండేది. వాటిని ఇంటికి పట్టుకెళ్లి విత్తన బ్యాంకులో ఉంచేది. ఆ తర్వాత దగ్గర్లోని అడవిలో వాటిని వెదజల్లుతూ వచ్చేది. మొదట్లో స్నేహితులు బ్లెస్సీని చూసి నవ్వుకున్నా, రానురానూ ఆమె మనసులోని ఆకుపచ్చ సంకల్పం గురించి తెలుసుకొని మెచ్చుకోవడం మొదలు పెట్టారు. పర్యావరణవేత్త కావడంతో నాన్నను చూసి ప్రకృతిపైనా, పర్యావరణం పైనా ప్రేమ పెంచుకున్న బ్లెస్సీ ఇప్పుడు కోట్లాది మందికి ఓ ఆకుపచ్చ బాట వేసిన స్ఫూర్తి. తమిళనాడుకు చెందిన తిరువణ్ణామలై పట్టణానికి చెందిన పదో తరగతి చదివే వినీశా ఉమాశంకర్ది మరో స్ఫూర్తి గాథ. అమ్మతో కలిసి ఇంట్లో ఉతికిన బట్టలను ఇస్త్రీ చేయించుకునేందుకు సంచార ఇస్త్రీ బండి వద్దకు వెళ్లేది. బట్టలు ఎలా ఇస్త్రీ చేస్తున్నారో గమనించేంది. చింత నిప్పుల్లా భగ భగ మండే బొగ్గులు వేసిన ఇస్త్రీ పెట్టెతో ఇస్త్రీ చేస్తూ ముచ్చెమటలు పోసుకొనే ఆ రజక దంపతులను గమనించింది. వినీశ మనసు కలుక్కుమంది. మెదడులో ఓ ఆలోచన తళుక్కుమంది. బొగ్గుల మంటతో పర్యావరణం పాడవుతుంది. అదే సమయంలో ఇస్త్రీ చేసేవాళ్లు నరకయాతన పడుతున్నారు. ఆ రెంటినీ దృష్టిలో పెట్టుకుంది. సౌర విద్యుత్తుతో పనిచేసే ఓ ఇస్త్రీ పెట్టెను తయారు చేసింది. అప్పటికి వినీశ వయస్సు పట్టుమని పన్నెండేళ్ళే. కానీ, ఆ ఆవిష్కరణ వినీశకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. స్వీడన్కు చెందిన చిల్డ్రన్స్ క్లై్లమేట్ ఫౌండేషన్ వినీశకు అంతర్జాతీయ అవార్డును అందించి భుజం తట్టింది. ఈ విషయం తెలిసిన వెంటనే బ్రిటిష్ ప్రిన్స్ విలియమ్స్ గతేడాది జరిగిన ‘కాప్–26’ సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించారు. ‘‘మాటలు వద్దు, చేతలు కావాలి. శిలాజ ఇంధనాలు, కాలుష్యంపై ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవద్దు. పాత పద్ధతులు ఆపేద్దాం. వినూత్న సృజనలు, ఆవిష్కరణలపై మీ సమయాన్ని, డబ్బును వెచ్చించండి’ అంటూ ఉద్విగ్నభరిత ప్రసంగం చేసింది. ఆ సదస్సులో పదిహేనేళ్ళ బాలిక వినీశ చేసిన ప్రసంగానికి ప్రపంచ ప్రతినిధులంతా లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు. స్వీడన్కు చెందిన గ్రెటా థన్బర్గ్ అందరు పిల్లల్లా ఎదగలేదు. ఎనిమిదేళ్ల వయసులోనే వాతావరణ మార్పులు చేసే చేటు పైనా, పర్యావరణ మార్పుల పైనా, కాలుష్యం పైనా దృష్టి పెట్టింది. కాలుష్యం కారణంగా వాతావరణంలో చోటు చేసుకుంటోన్న భయానక మార్పుల గమనించి బాధపడేది. చదువుకుంటున్నా సరే... ఎప్పుడూ పర్యావరణంపైనే దృష్టి. తల్లితండ్రులకు ఇది నచ్చేది కాదు. చదువు మానేసి పర్యావరణం అంటూ తిరిగితే ఎలా అనుకున్నారు. అలాగని కూతురి ఇష్టాన్ని అడ్డుకోలేదు. దాంతో చదువుతో పాటు పర్యావరణ అంశాలపై ఉద్యమాల స్థాయికి ఎదిగింది. పదిహేనేళ్ళ వయసులో స్వీడన్ పార్లమెంటు భవనం ఎదుట ఒంటరిగా వాతావరణ మార్పులకు నిరసనగా ఆందోళనకు దిగింది. ఆమెకు మద్దతుగా దేశంలోని పలు విద్యాసంస్థల్లో విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. ‘మీ తరం వాళ్లు చేస్తోన్న పాపం మీ తర్వాతి తరాలకు శాపంగా మారుతోంది. మీ వల్ల మేము చాలా నష్టపోతున్నాం. దయచేసి ఇప్పటికైనా విధ్వంసాన్ని ఆపండి’ అని గ్రెటా నినదించింది. ఇవాళ పర్యావరణం అంటే ప్రపంచంలో అందరికీ గుర్తొచ్చే చిన్న వయసు ఉద్యమకారిణిగా నిలిచింది. మన కళ్ళెదుట కనిపిస్తున్న ఈ ముగ్గురి కథ మనకు ఏం చెబుతోంది? ఆ సంగతి అతి కీలకం. పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకు ఎలాంటి విద్యాబుద్ధులు నేర్పాలి? ఎంతసేపూ వాళ్ళ మార్కుల గురించి, వాళ్ళు చేయబోయే ఉద్యోగాల గురించేనా మన ధ్యాసంతా! మార్కులు, కెరీరే కాదు... వారికి తాము ఉన్న ఈ భూగోళం మీద కూడా ప్రేమ, అవగాహన పెంచాలి. అదే ఇప్పుడు మానవాళికి కీలకం. తల్లితండ్రులు తమ పిల్లల మెదడులో ఆకుపచ్చ విత్తనాలు నాటాల్సిన సమయం ఇదే. ప్రస్తుతం ప్రకృతి ఎదుర్కొంటున్న విపత్తులకూ, వినాశనానికీ అదే పరిష్కారం. నిజానికి బ్లెస్సీ, వినీశ, గ్రెటా– ఈ ముగ్గురికీ పర్యావరణాన్ని ప్రేమించమని ఎవరూ నేర్పలేదు. చుట్టూరా ఉన్నా ప్రకృతిని చూసి తమంతట తాముగా ఆ ఆకుపచ్చబాటలో అడుగులు వేశారు. కాకపోతే ముగ్గురి తల్లిదండ్రులూ ఈ బంగారు తల్లుల హరిత ప్రయత్నాలను అడ్డుకోలేదు. అదే ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది. పర్యావరణం కోసం, ప్రకృతి కోసం పసి ప్రాయంలోనే మనసులు పారేసుకున్న ముగ్గురూ అమ్మాయిలే కావడం విశేషం. ఈ ముగ్గురు బంగారు తల్లుల పసిడి ఆలోచనలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలి. కోట్లాది మందికి ప్రకృతి పాఠాలు నేర్పాలి. -
మాటలు సరే! చేతల మాటేమిటి?
ప్రపంచంలోని 20 భారీ ఆర్థిక వ్యవస్థలు... అంతా కలిపితే అంతర్జాతీయ వాణిజ్యంలో 75 నుంచి 80 శాతం ఉన్న దేశాలు... ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల జనాభాకూ, ప్రపంచ భూభాగంలో దాదాపు సగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాల అధినేతలు ఒక్కచోట కలిస్తే? ప్రపంచ పరిణామాలు, పర్యావరణ, వాణిజ్య సమస్యలపై రెండు రోజులు చర్చిస్తే? ఐరోపా సమాజం, మరో 19 దేశాల అంతర్ ప్రభుత్వవేదికగా ఏర్పాటైన ‘జి–20’ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు ప్రాధాన్యం అందుకే! ఇటలీ రాజధాని రోమ్లో అక్టోబర్ చివర 2 రోజులు జరిగిన ఈ సదస్సులో గత రెండేళ్ళలో తొలిసారిగా దేశాధినేతలు వ్యక్తిగతంగా కలిశారు. మరి, ఈ సదస్సు ఆశించిన ఫలితాలు అందించిందా అంటే అవుననలేం. భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీల లోగానే నియంత్రిస్తామంటూ నేతలు లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. కానీ, కర్బన తటస్థతను సాధించేందుకు కచ్చితమైన తుది గడువు పెట్టనే లేదు. కేవలం ఉద్గారాల్ని తగ్గిస్తే చాలదని తెలిసినా, కార్యాచరణ శూన్యం. అందుకే, ‘ప్రజలు, ప్రపంచం, సౌభాగ్యం’ ఇతివృత్తంగా సాగిన ఈ సదస్సుతో కొంత ఆశ, ఎంతో నిరాశ మిగిలాయి. 2015 నాటి ప్యారిస్ వాతావరణ ఒప్పందానికి తగ్గట్టు దీర్ఘకాలిక పర్యావరణ లక్ష్యాలను పెట్టుకోవాలనీ, శుద్ధమైన విద్యుత్ జనకాలకు త్వరితగతిన మారాలనీ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన ఇటలీ ప్రధాని పేర్కొన్నారు. కానీ, ప్రపంచంలో మూడింట రెండు వంతులకు పైగా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు కారణమైన ఈ 20 దేశాల గ్రూపు స్పష్టమైన తుది గడువుతో ముందుకు రాలేదు. కోవిడ్పై పోరు, ఆరోగ్య వసతుల మెరుగుదల, ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడం లాంటి వివిధ అంశాలపై ప్రపంచ నేతలు చర్చించారు. కానీ, రష్యా, చైనాలు తమ ప్రతినిధుల్ని ఈ సదస్సుకు పంపనే లేదు. వివిధ కారణాలతో మెక్సికో, జపాన్, దక్షిణాఫ్రికా నేతలు హాజరు కానే లేదు. వర్ధమాన దేశాలు పర్యావరణహిత ఇంధన లక్ష్యాన్ని చేరుకొనేలా ఏటా 100 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7.49 లక్షల కోట్లు) సాయం అందించడానికి కట్టుబడి ఉన్నట్టు ‘జి–20’ ప్రకటించింది. కానీ, బొగ్గుతో నడిచే విద్యుత్కేంద్రాలకు అంతర్జాతీయ ఆర్థిక సాయం ఆపేస్తామన్న నేతలు తమ దేశంలో అలాంటి విద్యుదుత్పత్తికి ఎప్పుడు స్వస్తి పలుకుతారో మాట ఇవ్వనే లేదు. ప్రపంచ నేతలు ఎంతసేపటికీ బరువైన మాటలతో గారడీ చేస్తున్నారన్నది గ్రేటా థన్బెర్గ్ లాంటి పలువురు పర్యావరణ ఉద్యమకారుల వాదన. ‘జి–20’ సదస్సులో అధినేతల తుది ప్రకటన సైతం వారి వాదనకు తగ్గట్టే ఉంది. అదే విచారకరం. సదస్సు ముగింపు వేళ... పర్యావరణ సంక్షోభంలో తరచూ విస్మరణకు గురయ్యే మూడు మౌలిక అంశాలను గుర్తు చేస్తూ ఉద్యమకారులు థన్బెర్గ్, వానెస్సా నకాటే బహిరంగ లేఖ రాశారు. పర్యావరణ సంక్షోభంపై జాగు చేయడానికి లేదన్నారు. ఏ పరిష్కారమైనా సరే పర్యావరణ మార్పు వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొంటున్న వారికి న్యాయం చేసేదిగా ఉండాలన్నారు. అత్యంత భారీగా కాలుష్యం చేస్తున్నవారు తమ ఉద్గారాలపై అసంపూర్ణమైన గణాంకాలు చెప్పి, తప్పించుకుంటున్నారని ఆరోపించడం గమనార్హం. ఈ 16వ ‘జి–20’ సదస్సుకు హాజరైన భారత ప్రధాని మోదీ విడిగా పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు, సింగపూర్ ప్రధాని సహా పలువురితో సమావేశమయ్యారు. వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లోని హరిత ప్రాజెక్టులకు అభివృద్ధి చెందిన దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో కనీసం ఒక శాతం ఆర్థిక సాయం అందించడం లక్ష్యంగా పెట్టుకోవాలని మోదీ పేర్కొన్నారు. చైనా వ్యతిరేకించడంతో ఆగిన న్యూక్లియర్ సప్లయిర్స్ గ్రూప్ సభ్యత్వాన్ని భారత్కు ఇవ్వాలనీ, అలాగే అవసరమైన సాంకేతికతను అందించాలనీ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను భారత్ చేరుకోవడం వాటితో ముడిపడి ఉందనీ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తేల్చేశారు. భారత్ అలా తన వాదన వినిపించడం బాగానే ఉంది. సదస్సు ఫలవంతమైందన్న మోదీ మాటలను ఆ మేరకే అర్థం చేసుకోవాలేమో! ఎందుకంటే, పర్యావరణ అంశాలపై పెట్టుకున్న అనేక ఆశలను ‘జి–20’ సదస్సు నెరవేర్చనేలేదని సాక్షాత్తూ ఐరాస ప్రధాన కార్యదర్శే అనేశారు. వెనువెంటనే గ్లాస్గోలో జరుగుతున్న ‘కాప్–26’ సదస్సులోనైనా మెరుగైన ఫలితాలు వస్తాయన్నదే ఇక మిగిలిన ఆశ. ఈ ఏడాది చివరికే జనాభాలో 40 శాతానికి కోవిడ్ టీకాల లాంటి మాటలైతే ‘జి–20’ దేశాధినేతలు అన్నారు. ధనిక, బీద దేశాల మధ్య టీకాల అందుబాటులో తేడాలను తగ్గించే వ్యూహం లేదు. ప్రస్తుతం ప్రపంచం ముంగిట ఉన్న పర్యావరణ అత్యవసర పరిస్థితి పరిష్కారంలోనూ అదే ధోరణి. రోమ్ నుంచి నేరుగా గ్లాస్గోలో ‘కాప్–26’కు వారు హాజరవుతున్నారు. అక్కడ 100కు పైగా దేశాల నేతలతో రెండు రోజులు చర్చలు... గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించే బృహత్ ప్రణాళికపై రెండు వారాల పాటు అధికారుల మల్లగుల్లాలు. కానీ, పర్యావరణ సంక్షోభంపై విజయం సాధించాలంటే ప్రగాఢమైన వాంఛ, మరింత పకడ్బందీ కార్యాచరణ అవసరం. వివిధ దేశాధినేతల సమష్టి రాజకీయ సంకల్పంతోనే అది సాధ్యం. అందుకు ప్రధాన భాగస్వామ్యదేశాల మధ్య నమ్మకం కీలకం. కానీ, ప్రపంచంలో అత్యధిక స్థాయిలో కర్బన ఉద్గారాలకు కారణమైన చైనా పక్షాన అధ్యక్షుడు షీ జిన్పింగ్ ‘కాప్–26’కు హాజరవడం లేదు. లిఖితపూర్వక ప్రకటనతోనే సరిపెడుతున్నారు. ఇలాంటివి ఎన్నో. అందుకే, నిన్నటి ‘జి–20’ లానే, నేటి ‘కాప్–26’లోనూ అద్భుతమైన ఫలితాలు ఆశించడం కష్టమే. సదస్సులన్నీ అరుదైన ఫోటో సందర్భాలుగానే మిగిలితే, అసలు సమస్యలు తీరేదెలా? -
గ్రేటా: భారత్లో కరోనాను అడ్డుకోవాలి.. ప్రపంచ దేశాల సహాయం అవసరం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డ్ స్థాయిలో పెరుగుతోంది. భారత్లో కరోనా సెకండ్ వేవ్ వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. రోగులు ఆక్సిజన్, బెడ్ల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ప్రాణాలు కూడా పోతున్నాయి. భారత్లో కరోనా పరిస్థితులపై ప్రపంచ పర్యావరణ హక్కుల కార్యకర్త గ్రేటా థన్బర్గ్ స్పందించారు. ఇండియా పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్కర సమయంలో భారత్కు ప్రపంచ దేశాలు సహాయం చేయాలని కోరారు. భారత్లో కరోనా సెకండ్ వేవ్.. ఫస్ట్ వేవ్ మించి విధ్వంసం సృష్టిస్తోందనే చెప్పాలి. ఏప్రిల్ నెలలో వరుసగా నాలుగవ రోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ఇక దేశ వ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్లోని ఈ దారుణ పరిస్థితి చూసి స్పందిస్తూ గ్రెటా థన్బర్గ్ ఆవేదన చెందుతూ.. భారత్ ప్రస్తుతం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని, ఈ ఆపద నుంచి బయటపడటానికి ప్రపంచ దేశాలు భారత్కు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. "భారతదేశంలో కరోనా కారణంగా జరుగుతున్న దారుణ పరిణామాలను చూసి ఇండియాకు అవసరమైన సహాయాన్ని వెంటనే ప్రపంచ దేశాలు అందించాలి" అని గ్రేటా ట్వీట్ చేశారు. దేశంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్ కొరత తీవ్రంగా ఏర్పడిందని..దీంతో అనేక మంది రోగులు మరణిస్తున్నారని తెలిపింది. కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి జాతీయ రాజధానితో సహా పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రులు వైద్య ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ( చదవండి: కరోనా: 24 గంటల్లో కొత్తగా 3,46,786 కేసులు ) Heartbreaking to follow the recent developments in India. The global community must step up and immediately offer the assistance needed. #CovidIndia https://t.co/OaJVTNXa6R — Greta Thunberg (@GretaThunberg) April 24, 2021 -
దిశ రవి.. ఎఫ్ఎఫ్ఎఫ్ అంటే ఏమిటి?
న్యూఢిల్లీ: జూలై 2020న బహు తక్కువ మందికి పరిచయం ఉన్న మూడు చిన్న పర్యావరణ పరిరక్షణా బృందాలకు చెందిన వెబ్సైట్లను మూసివేసి, వారిపైన ఉపా చట్టం ప్రయోగిస్తామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించినప్పుడు మొదటసారి వీరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటి ప్రస్తుతం టూల్కిట్ కేసులో అరెస్టయి పోలీసు కస్టడీలో ఉన్న దిశ రవికి సంబంధించిన వెబ్సైట్. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’’ఇండియా చాప్టర్కి దిశరవి సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఖలిస్తానీ సానుభూతి పరులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు వీరిని అరెస్టు చేసిన విషయం తెలిసందే. ఏమిటీ ఎఫ్ఎఫ్ఎఫ్ ? అసలింతకీ ఏమిటీ ఎఫ్ఎఫ్ఎఫ్? ఎఫ్ఎఫ్ఎఫ్ ఇండియా అనేది∙పర్యావరణ పరిరక్షణా సంస్థ. ఇది ప్రాజెక్టులకు అనుమతులు తదితరాలపైనా, పర్యావరణ సమస్యలపైనా, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చే నోటిఫికేషన్లపైనా ఈమెయిల్ క్యాంపెయిన్ చేస్తుంది. మతవిద్వేష అంశాలు.. అయితే ఎఫ్ఎఫ్ఎఫ్ ఇండియా వెబ్సైట్ ‘‘భారత సార్వభౌమాధికారానికి, శాంతికి, ప్రశాంతతకు, ప్రమాదకరంగా మారింది’’అని ఢిల్లీ పోలీసులు జూలై8, 2020న వెబ్సైట్ బాధ్యులకు నోటీసులు జారీ చేశారు. అలాగే వెబ్సైట్లో ‘‘మతపరమైన విద్వేషపూరిత అంశాలు, మెటీరియల్’’ఉన్నదని, ఇది సెక్షన్ 18 ప్రకారం(తీవ్ర వాద చర్యకు ఉసిగొల్పేదిగా, లేదా అందుకు కుట్రపన్నేదిగా)ఉన్నదని, ఇది అన్లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్(యుఏపీఏ)కిందకి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. అయితే ఆ తరువాత వెంటనే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఎఫ్ఎఫ్ వెబ్సైట్ని తిరిగి తెరిచేందుకు అనుమతించారు. ఆ తరువాతి రోజు నుంచి వెబ్సైట్ తిరిగి ఆరంభించారు. అయితే అప్పటి నుంచి ఆ వెబ్సైట్పై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఎఫ్ఎఫ్ఎఫ్ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అని అర్థం. అంటే మన భవిష్యత్తు కోసం శుక్రవారాన్ని కేటాయించండి అని. ప్రభుత్వాల చైతన్యం కోసం శుక్రవారాన్ని కేటాయించండి అన అర్థం. ప్రభుత్వ వర్గాల్లో పర్యావరణ చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రతి శుక్రవారం విద్యార్థులు నిరసన తెలిపే లక్ష్యంతో స్వీడన్కి చెందిన పర్యావరణ ఉద్యమకారణి గ్రేటాథన్బర్గ్ 2018లో ఎఫ్ఎఫ్ఎఫ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఏడాదికి ఎఫ్ఎఫ్ఎఫ్ ఇండియా చాప్టర్ని స్థాపించారు. ప్రస్తుతం ఇది దేశంలోని పలు నగరాల్లో ఉంది. దేశవ్యాప్తంగా 150 మంది పూర్తిస్థాయి పర్యావరణ కార్యకర్తలు ఇందులో పనిచేస్తున్నారు. ఇతర దేశాల్లోని ఏకీభావం ఉన్న పర్యావరణ పరిరక్షణా సంస్థలతో కలిసి ఎఫ్ఎఫ్ఎఫ్ పనిచేస్తుంది. అటవీ సంరక్షణకోసం ప్రచారోద్యమం గోవాలోని మొల్లెం అటవీప్రాంత పరిరక్షణ, జమ్మూలోని రైకా ఫారెస్ట్ పరిరక్షణోద్యమం, మధ్య ప్రదేశ్లోని దుమ్నా నేచర్ పార్క్ల పరిరక్షణలు ఈ పర్యావరణ సంస్థ చేపట్టిన ప్రచారకార్యక్రమాల్లో ప్రధానమైనవి. అరే కాలనీలో మెట్రో ప్రాజెక్టుకోసం వేలాది చెట్లను నరికివేస్తున్నప్పుడు 2019, అక్టోబర్లో, ఎఫ్ఎఫ్ఎఫ్ కార్యకర్తలకీ పోలీసులకీ మధ్య ఘర్షణ తలెత్తడంతో ఎఫ్ఎఫ్ఎఫ్కార్యకర్తలను కొందరిని అరెస్టు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ ప్రజల ఉద్యమం ‘‘పర్యావరణ న్యాయం కోసం ప్రపంచ ప్రజల ఉద్యమం’’(గ్లోబల్ పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ క్లైమేట్ జస్టిస్) అనే నినాదంతో తమ వెబ్సైట్ లక్ష్యాన్ని ఈ ఎఫ్ఎఫ్ఎఫ్ సంస్థ సుస్పష్టంగా వెబ్సైట్లో ఉంచింది. ‘‘సమగ్ర, పర్యావరణ సమతుల్యత కోసం నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా ఉద్యమం నిర్వహిస్తామని, పర్యవారణ సమతుల్యత కోసం అహింసా మార్గంలో క్లైమేట్ స్ట్రయిక్, లేదా శాంతియుత ప్రదర్శనలు నిర్వహిస్తామని, తద్వారా రాష్ట్రప్రభుత్వాలు పర్యావరణ సంక్షోభాన్ని నిలువరించే చర్యలు చేపట్టేలా ఎఫ్ఎఫ్ఎఫ్ ఇండియా కృషి చేస్తుందని ఈ సంస్థ తన వెబ్సైట్లో స్పష్టం చేసింది. కుట్రదారులంటోన్న పోలీసులు ఏది ఏమైనా, దిశ, నికితా జాకబ్, శాంతాను ములుక్ లు రైతుల ఆందోళనకు మద్దతు పలికే గ్రేటాథన్ బర్గ్ టూల్కిట్ ని ట్వీట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రైతుల ఆందోళనను అవకాశంగా తీసుకొని భారత దేశాన్ని అస్థిరపరిచే ‘అంతర్జాతీయ కుట్ర’గా దీన్ని పోలీసులు అభివర్ణిస్తున్నారు. గ్లోబల్ క్లైమేట్ స్ట్రయిక్ 2019 సెప్టెంబర్లో ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ సంస్థ వాతావరణ మార్పులపై గ్లోబల్ క్లైమేట్ స్ట్రయిక్ కార్యక్రమంలో భాగంగా భారత్లో సైతం పలు ప్రదర్శనలు నిర్వహించింది. మొదట పర్యావరణ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన ఈ సంస్థకు చెందిన కార్యకర్తలు అనంతరం ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్సీ ఉద్యమాల్లో ఎఫ్ఎఫ్ఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతోన్న రైతు ఆందోళనకి సైతం తమ మద్దతు తెలిపారు. అయితే వీరి ప్రథాన లక్ష్యం మాత్రం పర్యావరణ పరిరక్షణే. వీరంతా వాతావరణ మార్పులపై చైతన్యం తీసుకొచ్చే ప్రచార కార్యక్రమాల్లో భాగమై ఉంటారు. అందులో భాగంగా వీరు సరస్సులను శుభ్రపరచడం, పార్కులను పరిశుభ్రం చేయడం, సమస్యాత్మకంగా మారిన పర్యావరణ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తారు. చదవండి: #AT21: ఆ వయసులో నేను.. చదవండి: దిశ రవి అరెస్టుపై స్పందించిన ఆమె స్నేహితుడు -
వైరల్: గ్రెటా నిజస్వరూపం ఇదేనా?
గ్రెటా థన్బర్గ్.. కొద్ది రోజులుగా ఈ పేరు భారత్లో మారుమోగుతోందీ. కారణం ఆమె ఢిల్లీలో ఉద్యమించిన రైతులకు మద్దతు తెలపడమే కాదు. ఎప్పుడెప్పుడు ఏయే ఉద్యమాలు చేయాలో రాసి ఉన్న టూల్కిట్ రిలీజ్ చేసి వివాదానికి తెర లేపడమే! దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఈ టూల్కిట్తో సంబంధం ఉన్నవాళ్ల గురించి పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో గ్రెటా ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. డొక్క ఎండుకుపోయి ఉన్న పేద పిల్లల కళ్లెదురుగా గ్రెటా థన్బర్గ్ సుష్ఠుగా భోజనం చేస్తోంది. వారు ఆత్రంగా ఆమె వైపు, అక్కడ ఉన్న ఆహార పదార్థాల వైపు దీనంగా చూస్తున్నట్లుందీ ఫొటో. గ్రెటాకు, ఆ పేద పిల్లలకు మధ్య ఓ అద్దపు కిటికీ అడ్డుగా ఉంది. ఈ ఫొటో చూసిన చాలామంది ఇదే నిజమనుకుని నోరెళ్లబెట్టారు. అంతేకాదు, పైకి నీతులు చెప్పే ఆమె అసలు అవతరాం ఇదీ అని ఎగతాళి చేశారు. ఆమెను నానారకాలుగా తిట్టిపోశారు. కానీ ఇది ఫేక్ ఫొటో. రెండు వేర్వేరు ఫొటోలను ఒకే దగ్గర చేర్చి అందరినీ బురిడీ కొట్టించారు. 2007లో ఆఫ్రికాలో తీసిన బక్కచిక్కిన పేద పిల్లల ఫొటో ఒకటి కాగా, గతేడాది డెన్మార్క్లో గ్రెటా మధ్యాహ్న భోజనం చేస్తుండగా దిగిన ఫొటో మరొకటి. ఈ రెండింటినీ కలిపేసి ఫేక్ ఫొటో సృష్టించి కావాలని దాన్ని వైరల్ చేస్తున్నారు. కాబట్టి ఒక్కోసారి కంటికి కనిపించేదంతా నిజం కాదు. కాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని అన్నదాతలు కొన్ని రోజులుగా రోడ్లమీదకొచ్చి నిరసనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఈ ఆందోళనల సెగ ప్రపంచానికి తాకింది. దీంతో ఎందరో విదేశీ సెలబ్రిటీలు రైతులకు తమ మద్దతు తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి, 18 ఏళ్ల గ్రెటా థన్బర్గ్ కూడా వారికి సంఘీభావం తెలుపుతూ ట్వీట్ చేసింది. అయితే మతం, జాతి, భాష, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివిధ గ్రూప్ల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారన్న కారణంతోపాటు విదేశాల నుంచి కుట్రలు సాగిస్తున్న ఆరోపణలతో ఆమెపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ వెనక్కు తగ్గని గ్రెటా ఇప్పటికీ రైతులకు మద్దతు ప్రకటిస్తున్నానని పేర్కొనడం గమనార్హం. చదవండి: దిశను అందుకే అరెస్టు చేశారు: విన్సెంట్ గ్రెటా టూల్కిట్: బెంగళూరు యువతి అరెస్ట్ -
దిశ రవికి మద్దతుగా యువత వినూత్న నిరసన
ముంబై: ప్రస్తుతం దేశంలో టూల్కిట్ వివాదం నడుస్తోంది. రైతుల ఉద్యమానికి సంబంధించిన ఈ టూల్కిట్ని గ్రెటా థన్బర్గ్ షేర్ చేశారు. అయితే దీన్ని బెంగళూరుకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశ రవి ఎడిట్ చేశారని.. ఫలితంగా జనవరి 26న ఎర్రకోట వద్ద హింస చెలరేగిందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో దిశ రవితో పాటు శాంతను ములుక్, నికితా జాకోబ్ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిపై నాన్ బెయిల్బెల్ వారెంట్ జారీ చేశారు. అయితే ప్రభుత్వ చర్యలపై దేశ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం డిజిటల్ మీడియా వేదికగా యువత ‘‘ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేశంలో ఆందోళనను అణచివేస్తోంది’’ అనే నినాదాన్ని ప్రచారం చేస్తోంది యువత. ఈ మేరకు ‘‘ఫింగర్ఆన్యువర్లిప్స్’’, ‘‘ఫ్రీదిశారవి’’ అనే హ్యాష్ట్యాగ్లను ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నోటిపై వేలు ఉంచిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోన్నారు నెటిజనులు. ఫోటోలతో పాటు మరికొందరు ‘‘మీకిది తెలుసా.. సామాన్యులను ఇబ్బందులకు గురి చేసే ప్రభుత్వ చర్యల గురించి అస్సలు మాట్లాడొద్దు’’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఫోటోలు, కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా పర్యావరణ కార్యకార్త ఒకరు మాట్లాడుతూ.. ‘‘పెదవులపై వేలు ఉంచుకోవడం అనేది ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించడానికే కాక దిశ రవితో పాటు అరెస్ట్ అయిన మిగతా వారికి సంఘీభావం తెలపడానికి ప్రతీక. వీరిని ప్రభుత్వం కఠినమైన యూఏపీఏ ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసింది. వారికి సంఘీభావంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెదవుల మీద వేలు ఉంచుకుని నిరసన తెలపుతున్నాం. మన దేశంలో ఎవరైనా నిరసన తెలిపితే.. ఉద్యమం చేస్తే.. వారిని సంఘ విద్రోహక శక్తులుగా ముద్రిస్తున్నారు. కానీ వాస్తవం అది కాదు. నిరసన తెలుపుతున్న వారంతా ప్రజల స్థితిగతులు మార్చాలని.. అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్న వారు’’ అన్నారు. ‘‘దేశంలో మిడతల దాడి, గత పదేళ్లుగా రైతుల ఆత్మహత్యలు, ఒక్క రోజులోనే ఉల్లి ధర మూడు సార్లు పెరగడం వంటి విషయాల గురించి మీకు తెలిసినప్పుడు.. మీరు దానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. జస్ట్ మీ పెదవుల మీద వేలు ఉంచుకోండి.. కామ్గా ఉండండి. నియమ్గిరి పర్వతాల్లో, గోవాలో అక్రమ మైనింగ్ గురించి తెలిసినా.. మొలెం అడవుల్లో కార్చిచ్చు రగిలిందని తెలిసినా.. వచ్చే ఆరేళ్లలో మన భవిష్యత్తు ఒకేలా ఉండదని తెలిసినా మీరు కామ్గా ఉండండి.. ఏం మాట్లడకుండా.. మీ పెదవుల మీద వేలు పెట్టుకుని నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకంటే దేశంలోని ఏ అంశం మీదనైనా మీరు స్పందిస్తే.. మీ మాటల్ని వక్రీకరించి.. మిమ్మల్ని చట్ట ప్రకారం దోషులుగా ప్రకటించి కోర్టులో నిలబెడతారు. కనుక ఏం జరిగినా కామ్గా ఉండండి.. ప్రశ్నించొద్దు’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు నెటజనులు. ‘‘ఫింగర్స్ఆన్యువర్లిప్స్’’ అనేది శాంతియుతమైన డిజిటల్ నిరసన ప్రదర్శన. ‘‘సామాన్యులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా యువత తమ స్వరాన్ని వినిపిస్తుంది. మౌనంగా ఉండమని వారిని భయపెట్టలేం. అలా చేసిన కొద్ది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతుకలు పెరుగుతాయి’’ అని తెలియజేయడమే ఈ నిరసన ప్రధాన ఉద్దేశం. చదవండి: దిశ రవికి గోవధ ఇష్టం ఉండదు.. అందుకే టూల్కిట్ వివాదం: పాక్ కీలక వ్యాఖ్యలు -
‘టూల్కిట్’ అంటే ఏంటో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా కొందరు ప్రముఖులు రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు. అందులో స్వీడన్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ కూడా ఉన్నారు. రైతు ఉద్యమానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో గ్రెటా థన్బర్గ్ ఒక టూల్కిట్ని షేర్ చేశారు. ఇది రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు థన్బర్గ్పై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. ఇక జనవరి 26వ తేదీన ఢిల్లీలో రైతుల ఆందోళన సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలకు టూల్కిట్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ వివాదం కారణంగా బెంగుళూరుకు చెందిన 22 ఏళ్ల దిశ రవి అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై కూడా పై సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలన్నిటింకి మూల కారణం టూల్కిట్. అసలు ఏంటీ టూల్కిట్.. దీనిపై అంతర్జాతీయంగా వివాదం తలెత్తడానికి గల కారణాలేమిటి.. అందులో దిశ రవి పాత్ర ఏమిటి.. అనే విషయాలు తెలుసుకుందాం.. టూల్కిట్.. ‘టూల్కిట్’ అంటే ఓ డాక్యుమెంట్. దేని గురించి అయినా వివరించే ఓ పత్రం, బ్లూ ప్రింట్ లాంటిది అని చెప్పవచ్చు. చరిత్రలో ఎన్నో ఉద్యమాలు నడిచాయి. కొన్ని ప్రపంచ గతినే మార్చేశాయి. తాజాగా గతేడాది అమెరికాలో ‘‘బ్లాక్ లైవ్స్ మాటర్’’, పర్యావరణానికి సంబంధించి క్లైమేట్ స్ట్రైక్ క్యాంపెయిన్ లాంటివి ఉన్నాయి. ఒకప్పుడు ఇలాంటి ఉద్యమాలు జరిగితే అందుకు సంబందించిన కార్యాచరణ, వ్యూహాలకు సంబంధించిన ప్రణాళికను కాగితాల మీద ముద్రించేవారు. దానిని ఆ ఉద్యమానికి మద్దతు తెలిపే వారికి చేరేలా చూసేవారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆ స్థానంలోకి టూల్కిట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏ ఉద్యమం అయినా సరే దానికి సంబందించిన ఒక డాక్యుమెంట్ను సిద్ధం చేస్తారు. దీనినే టూల్కిట్ అంటారు. ఆ ఉద్యమంలో పాల్గొనాలనుకునే వారు, దానిపై ఆసక్తి ఉన్నా వారు ఎవరైనా సరే ఈ టూల్కిట్ని చదివితే ఉద్యమానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. అంటే ఉద్యమంలో ఏ రోజున ఎలాంటి కార్యక్రమం ఉంటుంది.. ఎక్కడెక్కడ ర్యాలీలు, దీక్షలు ఉంటాయి.. ఉద్యమం ఎలా ముందుకు వెళ్తోంది అనే సమాచారం టూల్కిట్ ద్వారా తెలుస్తుంది. ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి.. ఉద్యమానికి మద్దతు పెంచడానికి ఈ టూల్కిట్ని సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేస్తుంటారు. ప్రపంచం నలుమూలలా ఉన్న మద్దతుదారులను ఏకం చేయడంలో ఈ టూల్కిట్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. గ్రేటా థన్బర్గ్ పాత్ర ఇలాంటి టూల్కిట్నే గ్రేటా థన్బర్గ్ ట్విట్టర్లో షేర్ చేశారు. దీనిలో దేశరాజధానిలో జరుగుతున్న ఉద్యమం ఏంటి.. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు ఏంటి అనే వివరాలు ఉన్నాయి. ఈ టూల్కిట్లో ‘‘రైతులు సంపన్నలుగా, స్వాలంభన సాధించడానికి ఉద్దేశించిన ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ చట్టాలు అమల్లోకి వస్తే.. వ్యవసాయం కార్పొరేట్, అంతర్జాతీయ సంస్థల గుప్పిట్లోకి వెళ్తుంది. వాటి ప్రధాన లక్ష్యం లాభాలు. దాని కోసం ప్రకృతిని దోచుకుంటారు’’ అని దీనిలో ఉంది. దిశ పాత్ర ఏంటి అయితే రైతులకు మద్దతుగా గ్రెటా థన్బర్గ్ షేర్ చేసిన టూల్కిట్ని దిశ రవి ఎడిట్ చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని దిశ రవి అంగీకరించినట్టుగా చెప్తున్నారు. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. టూల్కిట్లోని రెండు మూడు లైన్లను ఎడిట్ చేసిన దిశ రవి ఆ తర్వాత అందులో అభ్యంతరకర విషయాలు ఉన్నాయంటూ తిరిగి గ్రేటాకు ట్వీట్ చేసింది. రైతులకు మద్దతివ్వడం కోసం ఇలా చేసానని ఆమె విచారణలో వెల్లడించారు. అంతేకాకుండా జనవరి 11న దిశ రవి, శాంతాను, నికితా అంతా జూమ్ యాప్ద్వారా వీడియో కాల్లో మాట్లాడుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను త్వరలోనే కోర్టులో ప్రవేశపెడతామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా గ్రెటా థన్బర్గ్ షేర్ చేసిన టూల్కిట్ను ఖలికిస్తాన్ ఉగ్రవాదులు తయారుచేసినట్లుగా ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ టూల్కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ముగ్గురు యువతుల అరెస్ట్పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రపూరింతగానే వీరిని అరెస్ట్ చేసిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. చదవండి: టూల్కిట్ వివాదం: కీలక విషయాలు వెల్లడి -
దిశ రవికి గోవధ ఇష్టం ఉండదు.. అందుకే
న్యూఢిల్లీ/బెంగళూరు: ‘‘దిశ వాళ్లకు సాఫ్ట్ టార్గెట్. తను ఒక పోస్టర్ గర్ల్ లాంటిది. కాబట్టి తనను అరెస్టు చేస్తే మిగతా వాళ్లు గొంతెత్తాలంటే కాస్త వెనకడుగు వేస్తారు కదా. అందుకే ఇలా చేశారు’’ అని బెంగళూరుకు చెందిన యువ పర్యావరణవేత్త దిశ రవి స్నేహితుడు వినీత్ విన్సెంట్ అన్నారు. మ్యుజీషియన్గా పనిచేస్తున్న ఆయన, తన ఫ్రెండ్ను అరెస్టు చేయడం తనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొన్నారు. కాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలో భాగంగా, ఢిల్లీలో జనవరి 26న జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వీడిష్ యువకెరటం గ్రెటా థంబర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ టూల్కిట్ వివాదానికి దారి తీసింది. ఈ అంశంపై దృష్టి సారించిన ఢిల్లీ పోలీసులు దిశ రవి, శాంతను ములుక్, నికితా జాకబ్ అనే ముగ్గురు యువతులపై అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రెటా షేర్ చేసిన టూల్ను ఎడిట్ చేసి హింసకు ప్రేరేపించారన్న ఆరోపణలతో దిశ రవి, నికితను అరెస్టు చేశారు. శాంతను కోసం గాలిస్తున్నారు. వీరి అరెస్టు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన దిశ రవి ఫ్రెండ్ విన్సెంట్.. ‘‘దిశ అరెస్టు విషయం నన్ను షాక్కు గురిచేసింది. అదే సమయంలో జరిగేది ఇదే కదా అని కూడా అనిపించింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలను అంతతేలికగా తీసుకోలేం. సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడితే మీరు అరెస్టు అవుతారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని జైళ్లో పెడతారు. అంతే కదా. దిశకు ఇలా జరిగిందంటే.. మనం కూడా ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోక తప్పదని అర్థమవుతోంది. ఏదేమైనా, అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పిన దిశకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నా. దిశకు జీవ హింస ఇష్టం ఉండదు. గోవులను వధిస్తే తను తట్టుకోలేదు. అంతేకాదు, వాటి నుంచి పాలు సేకరిస్తూ, ఓ వస్తువులా భావించడం వంటి అంశాలకు తను వ్యతిరేకం. అందుకే మొక్కల ఉత్పత్తుల ద్వారానే ఇలాంటి అవసరాలు తీరే ఉద్దేశంతో నెలకొల్పిన కంపెనీలో తను పనిచేస్తోంది. దయచేసి యువత ఉద్దేశం ఏమిటో మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఇదొక్కటే. దిశ లాంటి వాళ్లను అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. తనతో ఒక్కసారి మాట్లాడి చూడండి. తనేమీ ఎక్కడికి పారిపోవడం లేదు కదా. తను అలాంటి పిరికి మనస్తత్వం కలది కాదు. ఆలోచించండి’’ అని విన్సెంట్ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. దిశ అరెస్టును ఆయన ఈ సందర్భంగా ఖండించారు. చదవండి: టూల్కిట్ కేసు : కీలక విషయాలు వెల్లడి -
టూల్కిట్ వివాదం: కీలక విషయాలు వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ : టూల్కిట్ వ్యవహారంలో ముగ్గురు యువతుల అరెస్ట్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. అరెస్ట్ల ప్రక్రియను షూరు చేశారు. తొలుత ఓ యువతిని అరెస్ట్ చేయగా.. అనంతరం మరో ఇద్దరిని అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వీడన్కు చెందిన అంతర్జాతీయ పర్యవరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్కిట్తో ఈ ముగ్గురు యువతులు (దిశరవి, శాంతాను, నికితా జాకబ్) ఎడిట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం బెంగళూరుకు చెందిన యువ యాక్టివిస్ట్ దిశరవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయగా.. 24 గంటలు గడవకముందే శాంతాను, నికితాలపై ఢిల్లీ హైకోర్టు నాన్బెయిల్వారెట్ జారీచేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు నికితను అరెస్ట్ చేయగా.. శాంతాను పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అరెస్ట్ నుంచి నాలుగు వారాల పాటు తనకు విముక్తి కల్పించాలని కోరుతూ నికితా బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా.. రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో చోటుచేసుకున్న హింసకు సంబంధించిన ఘటనలో ఈ ముగ్గురు యువతుల పాత్రపై ఢిల్లీ పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా వివరాలు తెలిపారు. ‘జనవరి 26న జరిగిన హింసాత్మక ఘటనతో దిశరవి, శాంతాను, నికితా జాకబ్కు ప్రత్యక్షంగా సంబంధముందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం. స్వీడన్ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ తయారుచేసిన టూల్కిట్ను తొలుత దిశరవి ఎడిట్ చేశారు. అనంతరం శాంతాను, నికితా దీనిలో భాగస్వామ్యం అయ్యారు. కెనడాకు చెందిన చెందిన ఓ యువతి అందించిన సలహాలు, సూచనల ఆధారంగా సోషల్ మీడియాలో ఆ టూల్కిట్ను షేర్ చేశారు. టూల్కిట్ను టెలిగ్రామ్ ద్వారా గ్రెటా వీరికి షేర్ చేశారు. టూల్కిట్ గూగుల్ డాక్యుమెంట్ను ఎడిట్ చేసిన వారిలో దిశ ఒకరు. ఆ డాక్యుమెంట్లో మార్పులు చేర్పులతోపాటు వ్యాప్తి చేయడంలో దిశ కీలక కుట్రదారు. అంతేకాకుండా జనవరి 11న వీరంతా జూమ్ యాప్ద్వారా వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను త్వరలోనే కోర్టులో ప్రవేశపెడతాం. మరికొన్న విషయాల కోసం విచారణ జరుపుతున్నాం’ అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా గ్రెటా థన్బర్గ్ షేర్ చేసిన టూల్కిట్ను ఖలికిస్తాన్ ఉగ్రవాదులు తయారుచేసినట్లుగా ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ టూల్కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ముగ్గురు యువతుల అరెస్ట్పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రపూరింతగానే వీరిని అరెస్ట్ చేసిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. టూల్కిట్ వివాదం: పాక్ కీలక వ్యాఖ్యలు -
టూల్కిట్ వివాదం: నికితాపై నాన్బెయిలబుల్ వారెంట్
సాక్షి,న్యూఢిల్లీ: రైతుల ఆందోళనకు మద్దతుగా స్వీడన్కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ ట్వీట్తో రాజుకున్న టూల్ కిట్ వివాదం మరింత ముదురుతోంది. 'టూల్కిట్ కేసు'లో దిశా రవిని అరెస్టు చేసిన ఢిలీ పోలీసులు మరో కీలక చర్య చేపట్టారు. ముంబై హైకోర్టు న్యాయవాది, కార్యకర్త నికితా జాకబ్, శాంతనులపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం స్పెషల్ సెల్ బృందం నికితా ఇంటికి వెళ్లినపుడు, ఆమె ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరిశీలించినట్లు తెలిపారు. కానీ ఆ రోజు సమయాభావం వల్ల నికితను ప్రశ్నించలేదు. మళ్లీ వస్తామని చెప్పామనీ, అప్పటినుంచి నికిత పరారీలో ఉందని ఆరోపిస్తూ వారెంట్ ఇష్యూ చేశారు. నికితా జాకబ్, దిశా రవి ఇతరులు పాల్గొన్న ఒక జూమ్ సమావేశంలో రైతు ఆందోళనకు సంబంధించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసేందుకు, నిరసన కారుల్లో ఆందోళనన పెంచేందుకు కుట్ర పన్నారని పోలీసులు ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిశా రవి అరెస్ట్ను ఖండించారు. ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి అని వ్యాఖ్యానించారు. రైతులకు మద్దతు ఇవ్వడం నేరం కాదని ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే థన్బర్గ్పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు పర్యావరణ, సామాజిక కార్యకర్త దిశా రవిని ఆదివారం అరెస్ట్ చేశారు. దేశద్రోహ కుట్ర కేసు నమోదు చేసి ఐదు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. బెంగళూరు ఐటీ సిటీకి చెందిన దిశా రవి రైతు ఆందోళనకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు సపోర్ట్ చేస్తూ గ్రెటా థన్బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్ కిట్ను దిశా రవి అప్లోడ్ చేశారు. దీని వెనుక ఖలిస్థాన్ అనుకూల సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే టూల్కిట్ డాక్యుమెంట్లోని రెండు లైన్లను మాత్రమే తాను ఎడిట్ చేశానని దిశా పోలీసు విచారణలో వెల్లడించారు. డాక్యుమెంట్లోని అంశాలు అభ్యంతకరంగా ఉన్నందున దానిని తొలగించాలంటూ థన్బర్గ్ను కోరారని వివరణ ఇచ్చారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో కీలక వ్యక్తిగా దిశ ఉన్నారు. దిశా రవి అరెస్టుపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా కేంద్రం తీసుకొచ్చి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సుదీర్ఘంగా సాగుతోంది. ఈ క్రమంలో రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసకు దారితీసింది. ఎర్రకోటపై జెండా ఎగురవేయడం వివాదాన్ని రేపింది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా గ్రెటా ట్వీట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్ వేర్పాటువాదులు టూల్ కిట్ని రూపొందించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. (రైతు ఉద్యమం : దీప్ సిద్దూ అరెస్టు) చదవండి : రైతు ఉద్యమం : వారికి భారీ ఊరట Arrest of 21 yr old Disha Ravi is an unprecedented attack on Democracy. Supporting our farmers is not a crime. — Arvind Kejriwal (@ArvindKejriwal) February 15, 2021 -
ఢిల్లీ పోలీసుల అదుపులో దిశ
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: బెంగళూరు ఐటీ సిటీకి చెందిన పర్యావరణ, సామాజిక కార్యకర్త దిశా రవి (22)ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ స్వీడన్కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్ కిట్ను దిశా రవి అప్లోడ్ చేశారు. ఈ టూల్కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందంటూ ఈనెల 4న ఢిల్లీ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. ‘టూల్కిట్ గూగుల్ డాక్యుమెంట్ను ఎడిట్ చేసిన వారిలో దిశ ఒకరు. ఆ డాక్యుమెంట్లో మార్పులు చేర్పులతోపాటు వ్యాప్తి చేయడంలో దిశ కీలక కుట్రదారు’అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ డాక్యుమెంట్లో ట్విట్టర్లో తీవ్ర ప్రచారోద్యమం సహా రైతు సంఘాలకు మద్దతుగా చేపట్టాల్సిన వివిధ చర్యలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత దౌత్యకార్యాలయాల వద్ద నిరసనలు వంటివి ఉన్నాయి. దేశంలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చేందుకు ఆమె కుట్ర పన్నిందనే ఆరోపణలకు అసలైన సాక్ష్యం ఆ టూల్కిట్నేనని అంటున్నారు. ఆమె ల్యాప్టాప్, సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని, విచారణ చేపట్టారు. దిశను ఢిల్లీ పోలీసులు బెంగళూరులోని నివాసంలో ఉండగా శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ కోర్టులో హాజరు పరిచారు. టూల్కిట్ను ఈ నెల 3వ తేదీన దిశ ఎడిట్ చేశారనీ, ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర కూడా ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. విచారణ సమయంలో దిశ కన్నీరు పెట్టుకున్నారు. రైతు ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు టూల్కిట్ డాక్యుమెంట్లోని రెండు లైన్లను మాత్రమే ఎడిట్ చేశానని ఆమె తెలిపారు. డాక్యుమెంట్లోని అంశాలు అభ్యంతకరంగా ఉన్నందున దానిని తొలగించాలంటూ థన్బర్గ్ను కోరినట్లు కూడా వెల్లడించారు. మేజిస్ట్రేట్ దేవ్ సరోహా ఆమెను ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26వ తేదీన ఢిల్లీలో రైతుల ఆందోళన సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలకు టూల్కిట్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీంతో టూల్కిట్ రూపకర్తల సమాచారం అందించాలంటూ గూగుల్, ట్విట్టర్లను కోరారు. ఆ రెండు సంస్థలు ఇచ్చిన వివరాల మేరకు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థికపరమైన అలజడులను సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ ఈనెల 4వ తేదీన ఖలిస్తాన్ అనుకూల పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, దిశా రవి ‘ఫ్రైడే ఫర్ ఫ్యూచర్’అనే క్యాంపెయిన్కు సహ వ్యవస్థాపకురాలు. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ చేసి ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజర్ పనిచేస్తున్నారు. బెంగళూరులోని సోలదేవనహళ్లిలో దిశా నివాసం ఉంటున్నారు. కాగా, దిశ అరెస్టును సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తీవ్రంగా ఖండించింది. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. -
గ్రెటా టూల్కిట్: బెంగళూరు యువతి అరెస్ట్
సాక్షి, బెంగళూరు : దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన రిపబ్లిక్ డే హింసాత్మక ఘటనలో పోలీసులు మరో ముందడుగు వేశారు. గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో చెలరేగిన హింసకు సంబంధించి బెంగుళూరుకు చెందిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో హింస చెలరేగే విధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో 21 ఏళ్ల దిశరవి అనే పర్యవరణ ఉద్యమకారినిని ఆదివారం అరెస్ట్ చేశారు. స్వీడన్కు చెందిన పర్యవరణ యాక్టివిస్ట్ గ్రెటా థన్బర్గ్ కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న దీక్షలకు గ్రేటా మద్దతు తెలపడం, ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ దేశంలో పెను ప్రకంపనలు రేపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు గ్రేటా షేర్ చేసిన టూల్కిట్ ఖలికిస్తాన్ ఉగ్రవాద సంస్థలు తయారు చేసినట్లు ఉందంటూ ఢిల్లీ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రైతు దీక్షలకు మద్దతు తెలుపుతూ.. దేశ అంతరిక వ్యవహారాల్లో తలదూర్చారని ఆరోపిస్తూ పలువురు అంతర్జాతీయ ప్రముఖులపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగానే గ్రెటా టూల్కిట్తో సంబంధముందని భావిస్తున్న బెంగళూరు యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పర్యవరణ పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా ‘ఫ్రైడే ఫర్ ఫ్యూచర్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 4న ఆమెపై ఢిల్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
నాటి రాళ్లు నేటి పూలు.. మన్నించు మారియా!
ఆరేళ్ల క్రితం.. ‘సచిన్ ఎవరో నాకు తెలీదు’ అని టెన్నిస్ తార మారియా షరపోవా అన్నందుకు ఆగ్రహించిన సచిన్ అభిమానులు ఇప్పుడు ఆ షరపోవాకే.. ‘మన్నించు మారియా, నువ్వన్నది కరెక్టే. అతడు నీకు తెలిసి ఉండాల్సినంత మనిషి కాదు’ అని ఆమె ఫేస్బుక్లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఆమెకు లైకుల మీద లైకులు కొడుతున్నారు. రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన విదేశీ ప్రముఖుల్ని హెచ్చరిస్తూ.. ‘ఇది మా సొంత విషయం’ అని సచిన్ ట్వీట్ చేయడమే ఇందుకు కారణం. ఢిల్లీ సరిహద్దులలో కొన్ని నెలలుగా రైతు ఉద్యమం జరుగుతోంది. ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలు తమ మెడకు ఉరి వంటివి కనుక వాటిని రద్దు చేయాలని రైతుల డిమాండ్. ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఎన్ని విడతలుగా చర్చలు జరిగినా ఒక ఫలవంతమైన ముగింపు రావడం లేదు. ఈలోపు వివిధ కారణాల వల్ల కనీసం 170 మంది ఉద్యమ రైతులు మరణించారని వస్తున్న వార్తలతో ప్రపంచం నలుమూలల నుంచి రైతుల డిమాండ్కు ట్వీట్ల ద్వారా మద్దతు లభిస్తోంది. స్వీడన్ నుంచి పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థన్బర్గ్, బార్బడోస్ పాప్ గాయని రిహాన్నా వంటివారు రైతులకు తమ సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. విదేశీ సానుభూతి పరులకు వ్యతిరేకం గా పెట్టిన ట్వీట్ ఆయన అభిమానుల ఆగ్రహానికి కారణం అయింది. ‘భారత్ తన సార్వభౌమాధికారం విషయంలో రాజీకి రానవసరం లేదు. బయటి శక్తులు వీక్షకులుగా ఉండొచ్చు కానీ, భాగస్వాములు కాదగరు’ అని థన్బర్గ్, రిహాన్నాలను ఉద్దేశించే సచిన్ ఆ ట్వీట్ పెట్టారు. ∙∙ నిప్పు జ్వాల గాలి దిశను బట్టి వ్యాíపిస్తుంది. ఆగ్రహ జ్వాల ఎటువైపు అధాటున మళ్లుతుందో ఎవరూ ఊహించలేరు. సచిన్ను ‘క్రికెట్ దేవుడు’ అని ఆరాధించిన ఆయన అభిమానులు.. రైతులకు మద్దతు ఇస్తున్న విదేశీయుల్ని సచిన్ ‘హద్దుల్లో ఉండండి’ అని అర్థం వచ్చేలా హెచ్చరించినందుకు ఆయనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసన నేరుగా లేదు. పరోక్షంగా ఉంది. పరోక్షంగా ఉన్నప్పటికీ శక్తిమంతంగా ఉంది. రష్యన్ టెన్నిస్ దిగ్గజం మారియా షరపోవా ఆరేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా ‘సచిన్ ఎవరో నాకు తెలియదు’ అని అన్నందుకు ఆగ్రహోదగ్రులైన భారతీయులు, ముఖ్యంగా మలయాళీలు షరపోవా ఫేస్బుక్ వాల్పై కూర్చొని ఆనాడు ఆమెను అనరాని మాటలు అన్నారు. చాలావరకు అవి భారతీయ భాషల్లో ఉన్నాయి కనుకు షరపోవాకు అర్థమయ్యే అవకాశం లేదు. ఇంగ్లిష్లో ఉన్న కామెంట్స్నైనా ఆమె పట్టించుకున్న దాఖలాలు లేవు. కాని ఇప్పుడు అదే సచిన్ అభిమానులు.. అదే షరపోవా ఫేస్ బుక్ వాల్ మీదకు వెళ్లి ఆమెకు సారీ చెబుతున్నారు. ‘మన్నించు మారియా, నువ్వన్నది కరెక్టే. అతడు మీకు తెలిసి ఉండాల్సినంత మనిషి కాదు’ అని పోస్ట్ల మీద పోస్ట్లు పెడుతున్నారు. ఒకరైతే.. ‘మారియా, ఇండియా రండి. నా రెస్టారెంట్లో మీ కోసం ప్రత్యేకంగా షవర్మా, కుళిమంతీ (బిర్యానీ) చేయించి పెడతాను’ అని ఆమెను ఆహ్వానించారు. నాడు మారియాపై పడిన రాళ్లే, ఇప్పుడు పూలుగా మారుతున్నాయి. ‘డియర్ మారియా, వి ఆర్ సారీ. సచిన్కి సపోర్ట్ చేస్తూ ఆనాడు మీపై సైబర్ అటాక్ చేసినందుకు బాధపడుతున్నాం’ అని ఒకరు; ‘మారియా, ఆరోజు నాకు పరిణతి లోపించింది. సచిన్ తెలియదు అన్నందుకు నిన్ను నానా మాటలు అన్నాను. నన్ను క్షమించు’ అని ఇంకొకరు పోస్టు పెట్టారు. ఒక మహిళ అయితే.. ‘సారీ సిస్టర్, యువర్స్ ట్రూలీ’ అంటూ షరపోవాకు లైకుల మీద లైకులు కొట్టారు. ఈ ప్రేమ జ్వాల అంతకంతకూ పెరిగిపోయి, సచిన్ ఉండే ముంబై మీదుగా రైతులు పోరాడుతున్న ఢిల్లీ వరకు వ్యాపించేలా మారియాపై పూల వర్షం కురుస్తోంది. ఆ పూల వానను రైతుల పోరాటానికి ఆశీస్సులనే అనుకోవాలి. రిహాన్నా, గ్రెటా థన్బర్గ్ -
గ్రెటా థన్బర్గ్పై కేసు నమోదు!
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో పోరాటం కొనసాగిస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ ట్వీట్లు చేసిన స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి, 18 ఏళ్ల గ్రెటా థన్బర్గ్పై ఢిల్లీ పోలీసులు గురువారం కేసు నమోదు చేసినట్లు సమాచారం. మతం, జాతి, భాష, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివిధ గ్రూప్ల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారన్న కారణంతోపాటు విదేశాల నుంచి కుట్రలు సాగిస్తున్న ఆరోపణలతో ఆమెపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ గ్రెట్గా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాను ఇప్పటికీ రైతులకు మద్దతు ప్రకటిస్తున్నానని స్పష్టం చేస్తూ మరో ట్వీట్ చేశారు. బెదిరింపులు, కేసులు తన వైఖరిని మార్చలేవని తేల్చిచెప్పారు. భారత్లో రైతన్నల ఆందోళనలు, నిరసనలపై రెండు రోజుల క్రితం థన్బర్గ్ చేసిన ట్వీట్లు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. ఆమెను తప్పుపడుతూ భారత్లో పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదంటూ హితవు పలికారు. థన్బర్గ్ ట్వీట్లు వివాదాస్పదం కావడంతో ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు వీటిపై దర్యాప్తు ప్రారంభించారు. థన్బర్గ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది. ‘థన్బర్గ్కు సాహస బాలిక అవార్డివ్వాలి’ గ్రెటా థన్బర్గ్కు భారత ప్రభుత్వం సాహస బాలిక పురస్కారం ప్రదానం చేయాలని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ గురువారం పేర్కొన్నారు. దేశాన్ని అస్తిరపర్చేందుకు జరుగుతున్న కుట్రకు సంబంధించిన పత్రాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినందుకు గ్రెటా థన్బర్గ్కు ఈ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. రైతులకు మద్దతు పేరిట భారతదేశాన్ని అస్తిరపర్చేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యానికి విదేశీ సర్టిఫికెట్ అక్కర్లేదని తేల్చిచెప్పారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కేనని అన్నారు. అయితే, దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీయులు జోక్యం చేసుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. దేశాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు. విదేశీ శక్తులకు వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలుస్తోందని పేర్కొన్నారు. విదేశీ శక్తులకు పరాజయం తప్పదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ఆమోదించిన చట్టం విషయంలో విదేశీయుల జోక్యం ఏమిటని బీజేపీ నేత అమిత్ మాలవియా ప్రశ్నించారు. -
రైతులకు మద్దతు : గ్రెటా థన్బర్గ్పై కేసు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు పలికిన ప్రముఖ స్వీడిష్ యువ పర్యావరణ ప్రచారకురాలు గ్రెటా థన్బర్గ్ (18)పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 120-బీ, 153-ఏ సెక్షన్ల కింద ఆమెపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనంటూ ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతున్నామంటూ ట్వీట్లు చేసిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. భారతదేశంలో రైతు ఉద్యమంపై స్పందించిన గ్రెటా భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నామంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఒక కథనాన్ని కూడా షేర్ చేశారు. ఆ తర్వాత గూగుల్ డాక్యుమెంట్ ఫైల్ను షేర్ చేస్తూ చేసిన మరో ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ ‘టూల్కిట్’ సహాయం చేయాలనుకునే వారి కోసం అని రాశారు. దీంతో భారత ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చే కార్యాచరణ ప్రణాళికను వివరించే లింక్ ఈ ఫైల్లో ఉందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. గ్రెటా తర్వాత పాత పోస్ట్ను తొలగించి, అప్డేట్ చేసిన ట్వీట్ షేర్ చేసింది.కానీ, అప్పటికే చాలామంది ఆ నోట్ను డౌన్లోడ్ చేసుకోవడం గమనార్హం. శాంతియుతంగా ఉద్యమిస్తున్న రైతులకే తన మద్దతు అంటూ ఆమెపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన కొద్ది నిమిషాల తరువాత గ్రెటా మరోసారి నొక్కి వక్కాణించారు. ద్వేషం, బెదిరింపులు, మానహక్కుల ఉల్లంఘనలు ఇవేవీ తనను మార్చలేవంటూ ట్వీట్ చేశారు I still #StandWithFarmers and support their peaceful protest. No amount of hate, threats or violations of human rights will ever change that. #FarmersProtest — Greta Thunberg (@GretaThunberg) February 4, 2021 మరోవైపు గ్రెటా, రిహన్నాకు సపోర్ట్గా నిలిచిన బాలీవుడ్ నటులు, క్రికెటర్లపై సినీ నటి కంగన రనౌత్ విరుచుకుపడుతోంది. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న వారు రైతులు కాదు, వారు ఉగ్రవాదులంటూ నోరు పారేసుకుంది. అలాగే ఇండియాను అస్థిరపరిచేందుకు జరుగుతున్న అంతర్జాతీయ రహస్య పత్రాన్ని షేర్ చేసి గ్రెటా అతిపెద్ద తప్పు చేసింది..పప్పూ టీంలో అందరూ జోకర్లే...అంటూ విమర్శించింది. అటు రైతులకు మద్దతుగా ట్వీట్ చేసిన తాప్సీపై కూడా ‘బీ’గ్రేడ్ ఆర్టిస్ట్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. -
రైతుల కోసం రిహన్నా.. ఫూల్ అన్న కంగనా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే గణతంత్ర దినోత్సవం నాడు ఉద్యమం ఉద్రిక్తతంగా మారి హింస చేలరేగింది. ఇదిలా ఉండగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు రైతుల ఉద్యమానికి మద్దతునిస్తుండగా.. తాజాగా ఈ జాబితాలోకి హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నా చేరారు. ట్విట్టర్లో 100 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న రిహన్నా.. అన్నదాతలు చేస్తోన్న ఉద్యమంపై స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్లో రైతుల ఉద్యమానికి సంబంధించని ఓ న్యూస్ ఆర్టికల్ క్లిప్ని షేర్ చేస్తూ.. మనం ఎందుకు దీని గురించి మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు రిహన్నా. ఇక ఈ పేపర్ క్లిప్ సీఎన్ఎన్ది కాగా.. దీనిలో గణతంత్ర దినోత్సవ వేడుకల నాడు రైతు ఉద్యమం ఉద్రిక్తంగా మారడం.. హింస చేలరేగడంతో ఢిల్లీ చుట్టుపక్కల ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని తెలిపే కథనానికి సంబంధించింది. అలానే మయన్మార్లో ఆర్మీ దురగతాలను కూడా ప్రశ్నించారు రిహన్నా. (చదవండి: 6న దేశవ్యాప్త చక్కా జామ్) why aren’t we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S — Rihanna (@rihanna) February 2, 2021 ఇక రిహన్నా ట్వీట్కు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రిప్లై ఇచ్చారు. ‘‘దీని గురించి ఎవరు మాట్లాడటంలేదు ఎందుకంటే వారు దేశాన్ని విభజించాలని చూస్తోన్న ఉగ్రవాదులు. వీరు దేశాన్ని విభజిస్తే.. చైనా దాన్ని స్వాధీనం చేసుకుని అమెరికా లాంటి ఓ కాలనీని తయారు చేయాలని ఎదురు చూస్తోంది. నోర్మూసుకుని కూర్చో ఫూల్.. మీలాంటి డమ్మీలకు మా దేశాన్ని అమ్మం’’ అంటూ కంగనా ఘాటుగా రిప్లై ఇచ్చారు. No one is talking about it because they are not farmers they are terrorists who are trying to divide India, so that China can take over our vulnerable broken nation and make it a Chinese colony much like USA... Sit down you fool, we are not selling our nation like you dummies. https://t.co/OIAD5Pa61a — Kangana Ranaut (@KanganaTeam) February 2, 2021 ఇక రైతుల ఉద్యమానికి యువ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ మద్దతు తెలిపారు. భారతదేశంలోని రైతులకు సంఘీభావం తెలుపుతున్నాము అంటూ ట్వీట్ చేశారు. ఇక అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ కూడా రైతులకు మద్దతు తెలిపారు. -
నోబెల్ అవార్డు నామినేషన్లలో ట్రంప్ పేరు!
స్టాక్హోమ్: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి అవార్డు నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఈ ఏడాది అక్టోబర్లో బహుకరించే ఈ శాంతి పురస్కారం రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నోబెల్ అవార్డు నామినేషన్లో ట్రంప్ పేరు వినిపించడం ఆసక్తిని రేపుతోంది. ఆయనతో పాటు ఈ అవార్డు నామినేషన్లో స్వీడన్కు చెందిన 18 ఏళ్ల బాలిక, పర్యావరణ వేత్త గ్రెటా థన్బర్గ్, రష్యా అసమ్మతి నేత అలెక్సీ నావల్సీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లు కూడా ఉన్నాయి. కాగా బాల పర్యావరణ వేత్తగా గ్రెటా పలు కార్యక్రమాలు చేపుడుతున్న సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతూ... అంతర్జాతీయ సదస్సుల్లో పర్యావరణ సంరక్షణపై ప్రసంగించడమే గాక పర్యావరణ అంశాలపై ధైర్యంగా ఆమె గళం విప్పుతోంది. చిన్న వయసులోనే పర్యావరణంపై ఆమెకు ఉన్న అవగాహన, ఇతరులను కూడా పర్యావరణపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ సదస్సుల్లో ఆమె ప్రసంగం ప్రపంచ దేశాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆమె ఎన్నో అంతర్జాతీయ అవార్డులకు అందుకుంది. (చదవండి: అప్పుల ఊబిలో డొనాల్డ్ ట్రంప్..?) అలాగే రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ కూడా రష్యాలో శాంతియుత ప్రజాస్వాయ్యం కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్యలను వ్యతిరేకించే నావల్నీపై ఇటీవల విషయ ప్రయోగం కూడా జరిగింది. దీంతో అయిదు నెలల పాటు ఆయన జర్మనీలో చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల తిరిగి రష్యా వచ్చిన నావల్నీని అరెస్టు చేయడంతో రష్యాలో నిరసనలు వెల్లువెత్తాయి. అయితే వీరితో పాటు ఈసారి నామినేషన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉండటం విశేషం. అంతేగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో పాటు ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థ ప్రారంభించిన కోవ్యాక్స్ ప్రోగ్రామ్ కూడా ఈ అవార్టు నామినీల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నోబెల్ కమిటీ మాత్రం నామినీల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. (చదవండి: గ్రెటా థంబర్గ్ : లక్ష డాలర్ల భారీ విరాళం) -
ట్రంప్కు దిమ్మదిరిగే పంచ్!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరోసారి స్వీడిష్ యువ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. గతంలో ఒకసారి చిల్ ట్రంప్ చిల్ అంటూ ట్రంప్పై కౌంటర్ ఎటాక్ చేసిన గ్రెటా తాజాగా మరోసారి సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (‘‘చిల్ డొనాల్డ్ చిల్’’ ట్రంప్కు గట్టి కౌంటర్) లాస్ట్ పంచ్ నాదైయితే ఆ కిక్కే వేరప్పా అన్నట్టుగా లాస్ట్ పంచ్తో అదరగొట్టేశారు గ్రెటా. ట్రంప్పై తన ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు ఆయనపదవీ విరమణ సమయాన్ని కరెక్టుగా వాడుకున్నారు. గ్రెటా ట్వీట్ను పరిశీలించినవారు ఎవరైనా ఇదే ఫీల్ అవుతారు. తన ట్వీట్లో గ్రెటా ఏమన్నారంటే.. 'ఉజ్వలమైన, అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న సంతోషవంతమైన వృద్దుడిలా ట్రంప్ కనిపిస్తున్నారు. ఇలా చూడటం చాలా బాగుంది.' అంటూ గ్రెటా థన్ బర్గ్ ట్వీట్ చేశారు. దీనికి ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడుతున్న ఫోటోను షేర్ చేయడం విశేషం కాగా గత ఏడాది సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రసంగించిన గ్రెట్ ప్రపంచ పర్యావరణ అంశాన్ని ప్రపంచాధినేతలు నిర్లక్క్ష్యం చేస్తున్నారని నిర్భయంగా వ్యాఖ్యానించారు. ఇది ఇలాగే కొనసాగితే మీ బిడ్డలకు భవిష్యత్తు ఉండదంటూ అగ్రనేతలకు ఆమె చురకలంటించారు. అయితే దీనిపై స్పందించిన అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ 'ఆమె ఉజ్వలమైన, అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న చాలా సంతోషవంతమైన యువతిలా ఉంది. చూడటానికి చాలా బాగుంది.' అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు 'టైమ్' మేగజీన్ 2019 సంవత్సరానికి గాను 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా గ్రెటా పేరును ప్రకటించినప్పుడు చిల్ గ్రెటా చిల్!' అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్గా చిల్ చిల్ డొనాల్డ్ అంటూ గట్టి చురకలే అంటించిన సంగతి తెలిసిందే. కానీ తాజా పరిణామంలో ఆసక్తికర విషయం ఏమిటంటే ట్విటర్ ట్రంప్ను శాశ్వతంగా ఇప్పటికే నిషేధించింది.. సో.. లాస్ట్ పంచ్ కిక్ గ్రెటాదే కదా! He seems like a very happy old man looking forward to a bright and wonderful future. So nice to see! pic.twitter.com/G8gObLhsz9 — Greta Thunberg (@GretaThunberg) January 20, 2021 -
‘‘చిల్ డొనాల్డ్ చిల్’’ ట్రంప్కు గట్టి కౌంటర్
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్కు భారీ షాకిస్తూ.. డెమొక్రాట్ జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో స్వీడిష్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బెర్గ్ (17) ప్రతీకారం తీర్చుకున్నారు. గతంలో తనను అపహాస్యం చేసిన ట్రంప్కు సోషల్మీడియాలో గట్టి కౌంటర్ ఇచ్చారు. 'చిల్, డోనాల్డ్, చిల్' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ అవకాశం కోసం గ్రెటా 11 నెలలు వేచి చూడాల్సి వచ్చింది. (పాపం ట్రంప్.. కోర్టులో కూడా ఓటమే) తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు ఎదురుదెబ్బ తగులుతున్న సమయం చూసి ట్రంప్పై ఆమె సెటైర్లు వేశారు. ముఖ్యంగా ఓటమిని అంగీకరించలేక "స్టాప్ ది కౌంట్!" అంటూ కుపితుడైపోతున్న ట్రంప్ను ఆమె ట్రోల్ చేశారు. "చాలా హాస్యాస్పదం. డొనాల్డ్ యాంగర్ మేనేజ్మెంట్ సమస్యపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం స్నేహితుడితో కలిసి ఏదైనా మంచి పాత ఫ్యాషన్ సినిమాకు వెళ్లండి! చిల్, డొనాల్డ్, చిల్!" అంటూ థన్బర్గ్ గురువారం ట్వీట్ చేశారు. దీంతో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రంప్ను భారీగా ట్రోల్ చేస్తున్ననెటిజన్లు గ్రెటా ట్వీట్తో మరింత హంగామా చేస్తున్నారు. వ్యంగ్య కామెంట్లతో హల్ చల్ చేస్తున్నారు. లక్షల కొద్దీ 'లైక్'లు, వేలాది రీట్వీట్లతో సందడి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే పర్యావరణ హితం కోసం విశేష కృషి చేస్తున్న గ్రేటా థన్బర్గ్ను 2019లో టైమ్ మ్యాగజైన్ ఇయర్ ఆఫ్ ది పర్సన్ పేరుతో సత్కరించింది. ఈ సందర్బంగా చిల్ గ్రెటా అంటూ గ్రెటాను ట్రంప్ ఎగతాళి చేశారు. "చాలా హాస్యాస్పదం గ్రెటా తన యాంగర్ మేనేజ్మెంట్పై పని చేయాలి, ఆపై స్నేహితుడితో మంచి పాత ఫ్యాషన్ చిత్రానికి వెళ్లండి!! " అంటూ ట్వీట్ చేశారు. దీంతో మనసునొచ్చుకున్న గ్రెటా మంచి సమయం కోసం వేచి చూసి గట్టి కౌంటర్ ఇచ్చిందన్నమాట. కాగా తాజా ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ టార్గెట్గా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. So ridiculous. Donald must work on his Anger Management problem, then go to a good old fashioned movie with a friend! Chill Donald, Chill! https://t.co/4RNVBqRYBA — Greta Thunberg (@GretaThunberg) November 5, 2020 Greta held onto this for 11 MONTHS and dropped an absolute precision missile strike. pic.twitter.com/0MxnWSNKZ3 — Jim Harper (@NewsroomJim) November 6, 2020 -
జేఈఈ, నీట్లపై గళమెత్తిన గ్రెటా థన్బెర్గ్
కరోనా కరాళ నృత్యం చేస్తుంటే విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతూ జేఈఈ, నీట్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు భిన్నంగా కేంద్రం మాత్రం పరీక్షలకు పచ్చజెండా ఊపింది. సెప్టెంబర్ 1-6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) జరగనున్నట్లు వెల్లడించింది. మరోవైపు వచ్చే నెల 13న నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్–2020) పరీక్ష జరుగుతుండగా, కరోనా అనుమానితులకు ఐసోలేషన్ గదిలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తెలిపింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: పరీక్ష కేంద్రాల్లో ఐసోలేషన్ గదులు ) తాజాగా స్వీడిష్ యువ కెరటం, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బెర్గ్ విద్యార్థుల తరపున గళమెత్తారు. కరోనా కాలంలో భారత విద్యార్థులను జాతీయ పరీక్షలకు హాజరు కావాల్సిందేనని చెప్పడం అన్యాయమన్నారు. ఇప్పటికే అక్కడ లక్షలాది మంది వరదల వల్ల ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. కాబట్టి జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. కాగా ఇప్పటికే విద్యార్థులను కరోనా భయం వెంటాడుతుంటే, మరోవైపు అస్సాం, బిహార్, గుజరాత్, చత్తీస్ఘడ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఈ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం కూడా కష్టమేనన్నది ప్రతిపక్షాల వాదన. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలోనే పరీక్షలు నిర్వహించి తీరుతామని కేంద్రం తేల్చి చెప్పడం గమనార్హం. (చదవండి: జేఈఈ మెయిన్స్కు కరోనా ఆంక్షలు) -
గ్రెటా థంబర్గ్ : లక్ష డాలర్ల భారీ విరాళం
స్టాక్హోం: కరోనాపై పోరుకు ప్రముఖ స్వీడిష్ యువకెరటం, పర్యావరణ వేత్త గ్రెటా థంబర్గ్ లక్షడాలర్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. డానిష్ ఫౌండేషన్ నుంచి గెలుచుకున్న ఈ మొత్తాన్ని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) కు ఇస్తున్నట్లు గురువారం పేర్కొంది. కరోనా సంక్షోభం పిల్లలపై పెను ప్రభావం చూపిస్తోందని, రానున్న రోజుల్లో మరింత మంది దీని భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. వాతావరణ సంక్షోభం లానే ఈ కరోనా పిల్లలపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్న 17 ఏళ్ల గ్రెటా..పిల్లల విద్య, ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రతీ ఒక్కరూ తమ వంతుగా సహాయం చేయాలని కోరింది. గ్రెటా విరాళంపై స్పందించిన యూనిసెఫ్.. లాక్డౌన్ కారణంగా ఏర్పడిన ఆహారం, ఆరోగ్యం, విద్య వంటి వాటికి కొరత రాకుండా నిధులు సమకూర్చడానికి ఇది ఎంతో సహాయపడతాయని పేర్కొంది. ఇక వాతావరణ మార్పులపై అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్న గ్రెటా ఇటీవలె యూరప్లో పర్యటించారు. కరోనా లక్షణాలు బయటపడటంతో ఇంట్లోనే సెల్ప్ ఐసోలేషన్లో ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. (కరోనా: ‘స్వీడన్లో ఆ వెసులుబాటు లేదు’ ) -
కరోనా సోకలేదు.. కానీ.. : గ్రెటా థంబర్గ్
స్టాక్హోం: కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి నేపథ్యంలో తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని స్వీడిష్ యువకెరటం, పర్యావరణ వేత్త గ్రెటా థంబర్గ్ తెలిపారు. వాతావరణ మార్పుపై అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్న గ్రెటా.. వివిధ దేశాల్లో పర్యటిస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల మధ్య యూరప్లో పర్యటించారు. ఈ క్రమంలో తనకు కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అంతేగాకుండా తనతో పాటు ప్రయాణించిన తన తండ్రిలో వైరస్ లక్షణాలు వృద్ధి చెందుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. యువతలో కరోనా లక్షణాలు అంత త్వరగా బయటపడవని.. కాబట్టి వారు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించి మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎదుటివారిని ప్రమాదంలో పడేయవద్దని సూచించారు. (చదవండి: కరోనా వైరస్: ఎందుకంత ప్రమాదకారి?) ఆ వెసులుబాటు లేదు ‘‘గత రెండు వారాలుగా నేను ఇంట్లోనే ఉన్నాను. మధ్య యూరప్లో పర్యటించిన తర్వాత స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. నాతో పాటు నాన్న కూడా ప్రయాణించారు. మేమిద్దరం అమ్మా, సోదరికి దూరంగా వేరే అపార్టుమెంటు తీసుకుని బస చేస్తున్నాం. పది రోజుల క్రితం నాలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. గొంతు నొప్పి వస్తోంది. జలుబు చేసింది. అయితే నాన్న పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. తీవ్రమైన జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడేంత వరకు స్వయంగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించుకునే వెసులుబాటు స్వీడన్లో లేదు. చాలా మంది తమకు అనారోగ్యంగా ఉందని చెబుతున్నారు. ఇంట్లోనే ఉంటున్నారు. నేనింత వరకు కరోనా పరీక్ష చేయించుకోలేదు. కానీ నాలో లక్షణాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నేను ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే ఉండండి. మీ కారణంగా ఎవరికీ ఇబ్బంది రానీయకండి’’అని గ్రెటా తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చింది. (ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేశారా?) -
ఆ దేశాలు తప్ప.. మిగిలినవన్నీ..
గ్రెటా థన్బర్గ్.. ఈ పేరు ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. స్పీడన్ దేశానికి చెందిన ఈ బాలిక.. ‘‘మీ అవసరాల కోసం మా భవిష్యత్తును నాశనం చేస్తున్నారు మీకెంత ధైర్యం’’ అంటూ ప్రపంచ దేశాలను ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రశ్నించింది. అభివృద్ది పేరుతో విచ్చలవిడిగా కార్భన్ ఉద్గారాలను విడుదల చేస్తూ పోతున్నారని.. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటని నిలదీసింది. కర్భన ఉద్గారాలు, వాతావరణ మార్పులు పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్న వేళ.. ఇందుకు సంబంధించిన తాజా నివేదిక.. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ప్రపంచంలోని చాలా సంపన్న దేశాలు భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్యసంస్థ తమ తాజా నివేదికలో తెలిపాయి. గ్లోబల్ వార్మింగ్, కర్భన ఉద్గారాలు భావితరాల ఆరోగ్యంపై, అభివృద్దిపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ప్రపంచంలోని ఏ దేశం కూడా పిల్లల అభివృద్ధి, భవిష్యత్తు, సమానత్వం విషయంలో సత్ఫలితాలను సాధించలేకపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ది లాంసెట్ జర్నల్, యునిసెఫ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఒక కమిషన్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం నార్వే, సౌత్ కొరియా, నెదర్లాండ్లో పిల్లలకు ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం లభిస్తున్నాయని వెల్లడించింది. అధిక పరిమాణంలో ఉద్గారాలను వెదజల్లుతున్న అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు మాత్రం ఈ విషయంలో వెనుకంజలో ఉన్నాయని పేర్కొంది. కమిషన్ సభ్యులు, న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్ మాట్లాడుతూ ప్రస్తుతం పిల్లలకు ఆరోగ్యం, విద్య, రక్షణ కల్పించడమే కాకుండా వారికి సురక్షిత భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రపంచ దేశాలపై ఉందని పేర్కొన్నారు. గత ఐదు శతాబ్దాలుగా బాలల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని.. అయితే అదే సమయంలో ఆర్థిక అసమానతలు కూడా పెరిగాయని తెలిపారు. మరోవైపు భూగోళం వేడెక్కడం, పర్యావరణానికి హాని కలిగించడం భవిష్యత్ తరాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయని నివేదికలో తెలిపారు. పర్యావరణ క్షీణత పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తుపై అత్యంత ప్రభావం చూపుతుందని కమిషన్ సభ్యులు సునీత నారయణ్ పేర్కొన్నారు. చేయని తప్పునకు వారు బలికాబోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక విప్లవం తరువాత ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు పెరిగాయని తెలిపారు. ఆఫ్రికాలోని రెండు దేశాలు మినహా మిగిలిన అన్ని దేశాలు పిల్లల ఆరోగ్యం, విద్య విషయంలో వెనుకబడి ఉన్నాయని రిపోర్టులో తెలిపారు. -
నేను నేనే
లిసీప్రియా కంగుజం వయసు 8 ఏళ్లు. వాతావరణ కాలుష్యం నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించేందుకు కంకణం కట్టుకుంది. ఆ వయసుకు కంకణం అనేది పెద్ద మాటే కానీ.. లిసీప్రియా మాటల్ని వింటే అది చాలా చిన్నమాటగా అనిపిస్తుంది. లిసీ మణిపూర్ అమ్మాయి. గ్రెటా థన్బర్గ్లా ఈ భూగోళాన్ని కాలుష్యం నుంచి కాపాడే ఉద్యమాన్ని చేతుల్లోకి ప్లకార్డులా తీసుకుంది. దాంతో మీడియా ఆమెను ‘గ్రెటా థన్బర్గ్ ఆఫ్ ఇండియా’ అని కీర్తిస్తోంది. ఇదే నచ్చడం లేదు లిసీకి! నాకో పేరు లేదా? నాకో వ్యక్తిత్వం లేదా? నాకో గుర్తింపు లేదా? అని మీడియాపై కోపగించుకుంటోంది ఆ చిన్నారి. ‘‘స్వీడన్ అమ్మాయి గ్రెటా 2019లో మాత్రమే క్లెయిమేట్ ఉద్యమం చేపట్టింది. నేను అంతకంటే ముందరే 2018 జూలై నుంచీ మన ప్రధానికి, దేశాధినేతలకు లేఖలు రాస్తున్నాను. కనుక ఇక నుంచీ నన్ను ‘గ్రెటా ఆఫ్ ఇండియా’ అని పిలవకండి’’అని ట్వీట్ పెట్టింది. ‘‘మా ఇద్దరి లక్ష్యాలూ ఒకటే అయినా నేను నేనే’’ అని కూడా అంది! చూస్తుంటే లిసీప్రియా గ్రెటాను మించిపోయేలా ఉంది. -
కేక్ దొరక్కపోవచ్చు కానీ, డిన్నర్ చేద్దాం..
సామాజిక స్పృహతో 17 ఏళ్ల స్వీడన్ అమ్మాయి అందరి మన్ననలు పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే..స్వీడన్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ తన పుట్టిన రోజు సందర్బంగా స్వీడన్ పార్లమెంట్ వెలుపల ఏడు గంటల పాటు నిరసన చేపట్టారు. ఆమె ప్రతి శుక్రవారం పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపడుతుంటారు. పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా వీక్లీ ఫ్రైడే నిరసన కార్యక్రమం చేపడుతున్నందుకు థన్బర్గ్కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. థన్బర్గ్ స్పందిస్తూ..తాను ఎప్పటిలాగే ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నిరసన దీక్ష చేపట్టానని తెలిపింది. తనకు పుట్టిన రోజున కేక్ దొరక్కపోవచ్చు కానీ, మనమందరం డిన్నర్ చేద్దామని భవిష్యత్తుకు భరోసా కల్పించేలా మాట్లాడింది. తాను గత ఏడాది కాలంగా చాలా బిజీగా ఉన్నానని.. జీవితంలో ఏ సాధించాలో సరియైన అవగాహన వచ్చిందని తెలిపింది. తాను చేస్తున్న కార్యక్రమాలు ప్రభావం చూపుతున్నాయని థన్బెర్గ్ హర్షం వ్యక్తం చేశారు. ధన్బర్గ్ పదిహేనేళ్ల వయస్సు నుంచే ప్రతి శుక్రవారం పాఠశాలకు డుమ్మా కొట్టి..స్వీడన్ పార్లమెంట్ వెలుపల కార్బన్ ఉద్గారాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టేవారు. ఆమె చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజలకు ప్రేరణ కలిగించారు. ఆమె చేస్తున్న కృషికి టైమ్స్ పర్స్న్ ఆఫ్ ది ఇయర్(2019) అవార్డు లభించింది. చదవండి: ట్రంప్– గ్రెటా ట్వీట్ వార్! -
గ్రెటా ది గ్రేట్
జోన్ ఆఫ్ ఆర్క్.. ది గ్రేట్ ! చే గువేరా.. ది గ్రేట్ ! మార్టిన్ లూథర్ కింగ్.. ది గ్రేట్! ఈ వరుసలో.. ఇప్పుడు గ్రెటా థన్బర్గ్.. ది గ్రేట్! ఏంటి! తోస్తే పడిపోయేట్లు ఉండే ఈ అమ్మాయా! ఆమె పడిపోవడం కాదు. ప్రపంచాన్ని నిలబెట్టడానికి పిడికిలి బిగించింది. అందుకే ఈ ఏడాది ప్రతి దేశంలోనూ గ్రెటానే.. ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’. దేశాలు ఈ టైటిల్ ఇవ్వకపోవచ్చు. దేశ దేశాల ప్రజలు ఇచ్చేశారు. ప్రకృతి విధ్వంసం గురించి వేలాదిమంది కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, చివరకు ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ వేదిక సైతం దశాబ్దాలుగా చేయలేకపోయిన పనిని ఆ చిన్నారి అతి తక్కువ వ్యవధిలో సాధించింది. పర్యావరణం పేరిట జరుగుతున్న రాజకీయాలను తోసిపారేసింది. ప్రకృతి రక్షణపై చిన్నచూపు చూస్తున్న ప్రపంచ నాయకులను ఐరాస వేదికగా ‘హౌ డేర్ యు’ అంటూ నిలదీసింది. అక్కడితో ఆగిపోలేదు. పర్యావరణం పట్ల ప్రపంచ దృక్పథాన్నే తాను మార్చివేసింది. అప్పటికే ప్రపంచాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడుకోవాలని పోరాడుతున్న వారికి కొండంత స్థైర్యం కలిగించింది. నిఘంటువులు చోటిచ్చాయి పర్యావరణ సమ్మె పేరిట 2018 ఆగస్టులో స్కూలు దాటి బయటకొచ్చిన ఆమె.. పదహారు నెలల వ్యవధిలో ప్రపంచాన్ని సుడిగాలిలా చుట్టేసింది. స్వీడిష్ పార్లమెంట్ ముందు ఒంటరిగా ‘పర్యావరణం కోసం పాఠశాల సమ్మె’ మొదలెట్టింది. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ అధినేతలను సవాలు చేసింది. పోప్ను కలిసింది. అమెరికా అధ్యక్షుడు వంకర ట్రంప్ను ఈసడించింది. 2019 సెప్టెంబర్ 20న తలపెట్టిన ప్రపంచ పర్యావరణ సమ్మె సందర్భంగా నలభై లక్షల మందికి ప్రేరణ కలిగించింది. మానవ చరిత్రలో అతిపెద్ద పర్యావరణ ప్రదర్శనకు నాయకత్వం వహించింది. లాటిన్ అమెరికా విప్లవ యోధుడు చేగువేరా తర్వాత అంతటిస్థాయిలో తన చుట్టూ వీరారాధనను సృష్టించుకుంది. కొందరు ఆమెను జోన్ ఆఫ్ ఆర్క్ అని పిలిచారు. కొందరు ఆమెను ప్రపంచ నిగూఢ రహస్యాన్ని తన చిరునవ్వులో దాచిన మోనాలీసాతో పోల్చారు. వీటన్నిటికి మించి ఆమె స్వీడన్ పార్లమెంటు ముందు కూర్చుని పలికిన ‘పర్యావరణ సమ్మె’ అనే పదాన్ని ఈ సంవత్సరం మొత్తంలో విశిష్ట పదంగా నిఘంటువులు సైతం పొందుపర్చాయి. ప్రభుత్వాలు తలవంచాయి ఇంతటి ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చిన గ్రెటా థన్బెర్గ్ అంతా చేసి 16 ఏళ్ల బాలిక. మానవ చరిత్రలో కెల్లా మహిమాన్విత ప్రసంగాల్లో మొదటిది ఐ హ్యావ్ ఎ డ్రీమ్ (నేను కల కంటున్నాను) అనే మార్టిన్ లూథర్ ప్రసంగంగా అందరికీ తెలుసు. ఐక్యరాజ్యసమితి వేదికపై నిల్చుని.. ‘‘మా చిన్ని ప్రపంచాన్ని, మా కలల్ని కూల్చివేయడానికి మీకెంత ధైర్యం’’ అంటూ గ్రెటా చేసిన ప్రసంగం ఆ స్థాయిలో నిలుస్తోంది. పర్యావరణ రక్షణకోసం పోరాడుతున్న వారికి, దాన్ని పట్టించుకోని వారికి మధ్య ఆమె నైతికపరమైన లక్ష్మణరేఖను గీసింది. తమ దేశాల్లో కాలుష్యానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలిస్తామని దేశాధినేతలు, ప్రభుత్వాలు సైతం అంగీకరించేటట్లు చేసింది. శారీరకంగా చూస్తే.. తోస్తే పడిపోయేటట్లు కనిపించే అర్భకురాలు. కానీ ప్రపంచంలో పర్యావరణానికి కలిగిస్తున్న అన్యాయాలను నిలదీస్తూ లెబనాన్ నుంచి లైబీరీయా వరకు లక్షలాది టీనేజ్ గ్రేటాలు పాఠశాలలు వదిలి పర్యావరణ సమ్మెలో పాల్గొనేలా చేసిన ప్రేరణ కర్త ఆమె. ‘టైమ్’ పత్రిక గ్రేట్ అంది గ్రెటా.. టైమ్ పత్రిక తరపున 2019 పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. జన్మ సార్థకతకు చిహ్నంగా అందరూ భావించే ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని కూడా ఆమె పట్టించుకోలేదు. ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రపంచనేతలు, సీఈఓల ముందు నిలబడి ప్రపంచాన్ని భయపెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పిందామె. ‘‘ప్రతిరోజూ నేను పొందుతున్న భయానుభూతిని మీరందరూ అనుభూతి చెందాలని కోరుకుంటున్నాను. తర్వాతే మీరు పనిలోకి దిగాలని నా ఆశ. కానీ భయపెట్టటంలోనూ బాధ్యత ఉంది’’ అని గుర్తు చేసిందామె. అధినేతలు ఫాలో అయ్యారు పసిపిల్లల కళ్ల నుంచి ప్రపంచాన్ని చూడటం అనేది మనసును మార్చడానికి అత్యుత్తమ విధానం అని అంటుంటారు. ప్రపంచాధినేతలు ఆమె కళ్లు వెలువరిస్తున్న భావాలను అర్థం చేసుకుంటున్నారు. వారిలో కాస్త నిజాయితీగా కనిపిస్తున్న వారు ఆమె మాటలకు దాసోహమవుతున్నారు. ‘‘మనం పెద్ద నాయకులమే కావచ్చు కాని ప్రతి రోజూ, ప్రతివారం పర్యావరణ పరిరక్షణపై అలాంటి సందేశాన్ని ప్రతిచోట నుంచి ఇస్తున్నప్పుడు మనం తటస్థంగా ఉండలేం’’ అంటూ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యువల్ మేక్రాన్ ఒప్పేసుకున్నారు. ‘‘ఈ పిల్లలు నేను మారడానికి సహాయపడ్డారు’’ అంటున్న ఆయన మాటలు ఇప్పుడు చాలామందికి కనువిప్పు కలిగిస్తున్నాయి. పర్యావరణ మార్పును పట్టించుకోని దేశాలపై పన్ను విధించాలని యూరోపియన్ యూనియన్ సిద్ధమైందంటే పసిపిల్లల నినాదాలు ఏ స్థాయిలో ఈ ప్రపంచంపై ప్రభావం చూపుతున్నాయో తెలుస్తుంది. ‘‘రేపు అనేది లేనప్పుడు, కనిపించనప్పుడు మనం జీవితాన్ని కొనసాగించలేం. కానీ మనందరికీ రేపు అనే భవిష్యత్తు ఉంది. అది అందరికీ కనబడుతోందని మాత్రమే మేం చెబుతున్నాం’’ అంటూగ్రెటా ప్రపంచ చిన్నారుల తరపున ప్రపంచాన్ని హెచ్చరిస్తోంది. అందుకే ప్రపంచం బాధను ఆమె తన భాధగా చేసుకుందని అంటున్నారు. ప్రపంచం బాధను, నిరాశను, నిస్పృహను, కోపాన్ని వ్యక్తీకరించడంతో సరిపెట్టుకోకుండా.. ఓటు హక్కు కూడా లేని కోట్లాదిమంది చిన్నారుల భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోతున్నప్పుడు... మనం బతకాలి అంటూ వేస్తున్న పెనుకేక గ్రెటా థన్బెర్గ్. – శోభారాజు క్లాస్ రూమ్లో మొదలైంది థన్బర్గ్ చదువుతున్న ప్రాథమిక పాఠశాల టీచర్ పర్యావరణ విపత్తుల గురించి చెబుతున్న ఒక వీడియోను క్లాసులో చూపించి వాతావరణ మార్పు వల్లే ఇదంతా జరుగుతోందని చెప్పినప్పుడు క్లాస్ మొత్తం షాక్కు గురైంది. పిల్లలందరూ త్వరలోనే తేరుకున్నారు. కానీ గ్రెటా కోలుకోలేకపోయింది. ధ్రువప్రాంతాల్లోని ఎలుగుబంట్లు ఆకలితో అలమటించడం, వాతావరణం పూర్తిగా మారిపోవడం, వరదలు ముంచెత్తడం చూసిన గ్రెటా 11 ఏళ్ల ప్రాయంలో తీవ్రమైన అలజడికి గురైంది. నెలలతరబడి మాట్లాడలేకపోయింది. అతి తక్కువ ఆహారం తీసుకోవడంతో ఆసుపత్రి పాలైంది. ఆ సమయంలో ఆమె పరిస్థితిని ‘అంతంలేని విషాదం’గా కన్నతండ్రే వర్ణించారు. మానవ మనుగడే ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై తనలో ఏర్పడిన గందరగోళం చివరకు ప్రాణాలమీదికి తెచ్చిందని గ్రెటా కూడా స్వయంగా చెప్పింది. -
ట్రంప్– గ్రెటా ట్వీట్ వార్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుజేసుకున్నారు. పర్యావరణ యువ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ను ప్రఖ్యాత పత్రిక ‘టైమ్’ పర్సన్ ఆఫ్ ది ఈయర్గా ప్రకటించడంపై మండిపడ్డారు. అది తెలివితక్కువ నిర్ణయమని టైమ్ పత్రికను విమర్శించారు. ‘గ్రెటా ముందు తన కోపాన్ని అదుపులో ఉంచుకోవడంపై దృష్టిపెట్టాలి. ఆ తరువాత ఓ ఫ్రెండ్తో కలిసి మంచి సినిమాకు వెళ్లాలి. చిల్.. గ్రెటా చిల్!’ అని గురువారం ట్రంప్ ట్వీట్ చేశారు. దీనికి స్పందనగా గ్రెటా థన్బర్గ్ తన ట్విట్టర్ బయోడేటాను మార్చారు. ‘నేను కోపాన్ని అదుపులో పెట్టుకోవడంపై దృష్టి పెట్టిన ఒక టీనేజర్ను. ప్రస్తుతం ఒక ఫ్రెండ్ తో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను’ అని ట్రంప్నకు రిటార్ట్ ఇచ్చారు. -
ప్రపంచాన్ని కదిలిస్తున్న బాల పర్యావరణవేత్తలు
మాడ్రిడ్: వారిద్దరూ స్కూలుకెళ్లి చక్కగా చదువుకుంటూ, ఆడుకుంటూ కాలం గడపాల్సిన వాళ్లు. కానీ పర్యావరణ పరిరక్షణపై వారికున్న ఆసక్తి ప్రపంచ దేశాల నేతల ముందు వక్తలుగా మార్చింది. మణిపూర్కు చెందిన ఎనిమిదేళ్ల లిసిప్రియా కంగుజమ్ వాతావరణంలో వస్తున్న మార్పులపై చర్యలు తీసుకోండి అంటూ ప్రపంచ అధినేతలను కోరుతోంది. స్పెయిన్ వేదికగా ఈనెల 13 వరకు జరుగుతున్న సీఓపీ25 వాతావరణ సదస్సులో భాగంగా ఆమె ప్రసంగించారు. ఆడుకోవాల్సిన వయసులో తమ భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె తండ్రి కేకే.సింగ్ మాట్లాడుతూ..తమ కూతురు ఇప్పటికే 21 దేశాల్లో వాతావరణ మార్పుల గురించి ప్రసంగాలు చేసిందన్నారు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో ‘హౌ డేర్ యూ ?’ అంటూ ప్రపంచ నేతలనుద్దేశించి ప్రశ్నించిన స్వీడన్ టీనేజర్ గ్రెటా థన్బర్గ్ (16) టైమ్స్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019గా నిలిచింది. మానవాళికి ఉన్న ఒకే గృహాన్ని నాశనం చేయవద్దంటూ ఆమె చేసిన పోరాటం మన్ననలు అందుకుందని టైమ్స్ మేగజీన్ బుధవారం తెలిపింది. వ్యక్తిగతంగా ఈ రికార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలు గ్రెటానే అంటూ టైమ్స్ ఆమెను కొనియాడింది. లిసిప్రియా, గ్రెటాలు ఇద్దరూ పర్యావరణం గురించి నిరసనల్లో పాల్గొనేందుకు స్కూలుకు సైతం సరిగా వెళ్లేవారు కాదు. టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా గ్రెటా థన్బర్గ్ -
సిగ్గుపడాలి; ఆమె ఓ ఆకతాయి!
బ్రెసీలియా: స్వీడన్కు చెందిన పర్యావరణ కార్యకర్త, వాతావరణ మార్పుపై ఉద్యమిస్తున్న గ్రెటా థంబర్గ్పై బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో అనుచిత వ్యాఖ్యలు చేశారు. గ్రెటా ఓ ఆకతాయి పిల్ల అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంపై గ్రెటా చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపడేశారు. అమెజాన్ అడవుల్లో ముగ్గురు గిరిజనులు కాల్పుల్లో మృతి చెందడంపై గ్రెటా స్పందించిన తీరు ఆయన ఆగ్రహానికి కారణమైంది. ప్రపంచ ఊపిరితిత్తులుగా పేరందిన అమెజాన్ అడవుల్లో ఇటీవల తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. అదే విధంగా అధిక సంఖ్యలో చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరాన్హా రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో శనివారం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. ఈ ఘటనపై స్పందించిన గ్రెటా... అడవుల అక్రమ నరికివేతను అడ్డుకున్నందుకే వారిని కాల్చి చంపారని ఆరోపించారు. ఈ విషయంపై మాట్లాడకుండా ఉన్నందుకు ప్రతీ ఒక్కరు సిగ్గుపడాలి అని బ్రెజిల్ అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో గ్రెటా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బోల్సోనారో.. ‘ప్రతీ చావుకు చింతించాల్సిందే. తనొక ఆకతాయి పిల్ల’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గిరిజనుల కాల్చివేత ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా అస్పెర్జర్ సిండ్రోమ్తో బాధ పడుతున్న గ్రెటా.. గతేడాది డిసెంబరులో పోలాండ్లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన కాప్24 సదస్సులో ప్రసంగించారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరిట వాతావరణ మార్పులపై అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ వాతావరణ మార్పులపై ప్రసంగాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. ఇక బోల్సోనారో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. అమెజాన్లో కార్చిచ్చు రగిలిన నేపథ్యంలో పర్యావరణ కార్యకర్తలే అడవిని తగులబెట్టారంటూ వ్యాఖ్యానించారు. -
గ్రేటాకు మరో ప్రపంచ అవార్డు
న్యూఢిల్లీ : ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం గళమెత్తి ప్రపంచ దేశాలను కదిలించిన స్వీడన్కు చెందిన 16 ఏళ్ల గ్రేటా థన్బెర్గ్కు మరో గుర్తింపు లభించింది. ఆమె రాసిన తొలి పుస్తకం ‘నో వన్ ఈజ్ టూ స్మాల్ టు మేక్ ఏ డిఫరెన్స్’ కు ‘వాటర్స్టోన్స్ ఆథర్ ఆఫ్ ది వరల్డ్’ అవార్డు లభించింది. వాటర్స్టోన్స్ బ్రిటన్కు చెందిన ప్రముఖ పుస్తకాల సంస్థ. ప్రపంచ పర్యావరణ రక్షణ ఆవశ్యకత గురించి గ్రేటా వివిధ దేశాల్లో చేసిన ప్రసంగాల సంకలమే ‘నో వన్ ఈజ్ టూ స్మాల్ టు మేక్ ఏ డిఫరెన్స్’ పుస్తకం. ఇది గత మే నెలలో మార్కెట్లోకి వచ్చింది. ఈ పుస్తకంతోపాటు ‘ది బాయ్, ది మోల్, ది ఫాక్స్, ది హార్స్’ పుస్తకానికి కూడా చార్లీ మ్యాక్సేకు ‘ఆథర్ ఆఫ్ ది వరల్డ్’ అవార్డు లభించింది. పిల్లల్లో నీతిని పెంపొందించే ఈ పుస్తకం వెయ్యి ప్రతులను మాత్రమే ప్రచురించారు. డిమాండ్ మేరకు మళ్లీ మళ్లీ ప్రచురించడంతో 20 వేల ప్రతులు ఇప్పటికే అమ్ముడు పోయాయి. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి గ్రేటా పేరు నామినేట్ అయిన విషయం తెల్సిందే. -
ఆమె టైమ్ ట్రావెలరా.. అంతా ట్రాష్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం స్వీడన్లో గళమెత్తి ప్రపంచంలోని వంద నగరాల్లో కొన్ని లక్షల గొంతలు తనలాగే గళమెత్తేలా స్ఫూర్తినిచ్చిన ‘క్లైమేట్ ఛేంజ్’ కార్యకర్త, 16 ఏళ్ల బాలిక గ్రేటా థన్బెర్గ్ నిజంగా ‘టైమ్ ట్రావెలరా (కాలంతోపాటు ఓ కాలం నుంచి మరో కాలంకు ప్రయాణించే శక్తి కలిగిన)’? సరిగ్గా 121 సంవత్సరాల క్రితం 1898లో కెనడాలోని యుకాన్ టెరిటరీలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ బాలిక ఓ బావి నుంచి నీళ్లు తోడుతున్న దృశ్యం ఫొటోను చూసినట్లయితే ఎవరైనా ఇలా ప్రశ్నించాల్సిందే. వాషింగ్టన్ యూనివర్సిటీ పురావస్తు విభాగంలో లభించిన ఓ ఫొటోను యూనివర్సిటీ వెబ్సైట్లో పోస్ట్ చేయగా, అచ్చంగా ఆమె మన గ్రేటాలాగా ఉందంటూ మరో నెటిజన్ రెండు ఫొటోలను కలిపి పోస్ట్ చేయడంతో ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నిజంగా ఆమె టైమ్ ట్రావెలర్. మన భవిష్యత్తు రక్షించేందుకు గతం నుంచి ఆమె భవిష్యత్తులోకి వచ్చారు. బ్యాక్ టు ది వ్యూచర్ సినిమా ఇది సాధ్యమని చెబుతోంది’ అని ఒకరు ట్వీట్ చేయగా, పలువురు ఆయనతో ఏకీభవిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ‘ఇదంతా ట్రాష్. కాకమ్మ కథలు మేము నమ్మం’ అన్నంటున్న వాళ్లు ఉన్నారు. ఏదేమైనా మన భవిష్యత్తును రక్షించేందుకు పోరాడుతున్నందున గ్రేటా నిజంగా ‘టైమ్ ట్రావెలర్’ అని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఫొటో మార్ఫింగ్ చేశారేమోనంటూ మరి కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
నాకు అవార్డులు అక్కర్లేదు... కేవలం..
వాషింగ్టన్ : పర్యావరణ పరిరక్షణకై విశేష కృషి చేస్తున్నందుకుగానూ స్వీడిష్ యువ కెరటం గ్రెటా థంబర్గ్ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఈ ఏడాది పర్యావరణ అవార్డు విజేతగా స్వీడన్, నార్వే ఆమె పేరును ప్రకటించాయి. ఈ క్రమంలో గ్రెటాకు అవార్డుతో పాటు 3 లక్షల యాభై వేల దానిష్ క్రోనర్లు(దాదాపు 35 లక్షల రూపాయలు) బహుమతిగా లభించాయి. అయితే గ్రెటా మాత్రం ఈ ప్రతిష్టాత్మక అవార్డును తిరస్కరించారు. తనకు అవార్డులు అక్కర్లేదని, వాతావరణ మార్పుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటే చాలు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న గ్రెటా ఈ మేరకు... ‘ వాతావరణ మార్పు ఉద్యమానికి ఇదే కాదు ఇలాంటి అవార్డులు ఏమీ అక్కర్లేదు’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘మన రాజకీయ నాయకులు, ప్రజల సహకారం మాత్రమే మనకు కావాలి. సైన్స్ చెబుతున్న వాస్తవాలు వారు గ్రహించాలి’ అని విఙ్ఞప్తి చేశారు. ఇక తనకు అవార్డు ప్రకటించిన సందర్భంగా అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... పర్యావరణం విషయంలో నార్డిక్(స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్) దేశాలు వ్యవహరిస్తున్న తీరును గ్రెటా విమర్శించారు. ‘ చాలా అందమైన మాటలు చెబుతారు. అయితే కర్భన ఉద్గారాల విషయానికి వచ్చేసరికి మాత్రం వెనకడుగు వేస్తారు. తలసరి ఆదాయం గురించి లెక్కిస్తారు గానీ ఒక్కక్కరు పర్యావరణానికి ఎలా హాని చేస్తున్నారో మాత్రం లెక్కలు వేయరు’ అని చురకలు అంటించారు. కాగా.. ‘‘నా కలల్ని, నా బాల్యాన్నీ మీరు దొంగిలించారు. వట్టి మాటలు మీవి. మీకేం పట్టదా? ప్రజలు జబ్బున పడుతున్నారు. చనిపోతున్నారు. మొత్తం పర్యావరణమే ధ్వంసమైపోయింది. కొద్దిమంది అదృష్టవంతులలో నేనొక దానిని. మేం బతికే ఉన్నాం. అంతరించిపోతున్న జీవజాతుల అంతిమ దినాలలో ఆఖరి శ్వాసను పీలుస్తూ కొన ఊపిరితో ఉన్నాం. మీకు డబ్బు కావాలి. అభివృద్ధి కావాలి. వాటి కోసం కట్టుకథలతో మమ్మల్ని మభ్యపెడుతున్నారు. హౌ డేర్ యూ!!’’ అంటూ అమెరికా కాంగ్రెస్ వేదికగా ప్రజాప్రతినిధులను, ప్రపంచ దేశాధినేతలను ప్రశ్నించి గ్రెటా పతాక శీర్షికల్లో నిలిచిన విషయం తెలిసిందే. కాగా అస్పెర్జర్ సిండ్రోమ్తో బాధ పడుతున్న 16 ఏళ్ల గ్రెటా.. గతేడాది డిసెంబరులో పోలాండ్లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన కాప్24 సదస్సులో ప్రసంగించారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరిట వాతావరణ మార్పులపై అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తూ ‘మా గురించి పట్టించుకోమని అడుక్కోవడానికి ఇక్కడకు రాలేదు. చాలా ఏళ్లుగా మమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయినా ఎన్నోసార్లు క్షమించాం. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు భవిష్యత్తును అంధకారం చేస్తాయి. ప్రజల చేతుల్లోనే నిజమైన అధికారం ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించి ప్రపంచ దేశాధినేతపై విరుచుకుపడ్డారు. ఇక కర్భన ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉందంటూ... భారత ప్రధాని మోదీకి సైతం ఓ పవర్ఫుల్ వీడియో మెసేజ్ పంపారు. -
‘నాకు మెరుగైన భవిష్యత్తు కావాలి’
న్యూఢిల్లీ : ‘నాకు మెరుగైన భవిష్యత్తు కావాలి. నా భవిష్యత్తు, మనందరి భవిష్యత్తును కాపాడాలనుకుంటున్నాను. అంతేకాదు భవిష్యత్ తరాలతో పాటు ప్రస్తుతం నా సాటి పిల్లలందరి భవిష్యత్తును కాపాడాలని కోరుకుంటున్నాను’ అంటూ రిధిమ పాండే నూయార్క్లో వాతావరణ మార్పులు, సంక్షోభం గురించి ఉద్వేగపూరిత ప్రసంగం చేసింది. ‘మన ప్రభుత్వం కాగితాల మీద మాత్రమే పనిచేస్తుంది. పర్యావరణ పరిరక్షణకై క్షేత్రస్థాయిలో అసలు ఏ చర్యలు తీసుకోవడం లేదు’ అని ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ప్రస్తుతం ప్రపంచమంతా పర్యావరణ కార్యకర్త గ్రెటా థంబర్గ్పై ప్రశంసలు కురిపిస్తున్న వేళ.. హరిద్వార్కు చెందిన పదకొండేళ్ల రిధిమాను.. ‘భారత గ్రెటా థంబర్గ్’ అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. గ్రెటా... ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తుంటే... రిధిమా సైతం పర్యావరణ పరిరక్షకు నడుం బిగించింది. వాతావరణ మార్పులపై 2017లో జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ను దాఖలు చేసి వార్తల్లో నిలిచింది. ఇక సోమవారం న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ ప్రణాళిక సదస్సుకు రిధిమ కూడా హాజరైంది. వాతావరణ మార్పులపై ఆయా దేశాల ప్రభుత్వాల వ్యవహారశైలికి వ్యతిరేకంగా థంబర్గ్తో పాటు నిరసన చేపట్టిన 16 మంది పిల్లల్లో రిథిమ కూడా ఒకరు. ఈ సందర్భంగా రిధిమ మీడియాతో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంగా ప్రక్షాళన కార్యక్రమంపై విమర్శలు గుప్పించింది. ‘ గంగను మనం అమ్మా అని పిలుస్తాం. అయితే ఆ నదిలోనే మురికి బట్టలు కూడా ఉతుకుతాం. చెత్త కూడా పారేస్తాం. ఇక ప్రభుత్వమేమో నదిని ప్రక్షాళన చేస్తామని చెబుతుంది. అయితే ఆ మాటలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. నేటికీ గంగ కాలుష్యానికి గురవుతోంది. ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడితేనే నదీ పరివాహక ప్రాంతంలో మానవాళి మనుగడ కొనసాగుతుంది అని పేర్కొంది. అదే విధంగా ప్లాస్టిక్ను నిషేధిస్తామని పలు ప్రభుత్వాలు చెప్పినప్పటికీ.. చిత్తశుద్ధి కనబరచడం లేదని విమర్శించింది. కాగా తన తండ్రితో కలిసి న్యూయార్క్ వెళ్లిన రిధిమ.. ఓ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఇంటర్వ్యూలో అర్హత సాధించి గ్రెటా వంటి తోటి పర్యావరణ ప్రేమికులను కలుసుకునే అవకాశం కలిగిందని హర్షం వ్యక్తం చేసింది. “I want a better future. I want to save my future. I want to save our future. I want to save the future of all the children and all people of future generations.” - Ridhima Pandey, one of 16 children who filed a complaint on climate crisis to the UN child rights committee. #UNGA pic.twitter.com/E8O2ZlmfAo — UNICEF India (@UNICEFIndia) September 24, 2019 -
అధినేతలపై చిచ్చర పిడుగు
కోటలు దాటే మాటలే తప్ప కాస్తయినా కదలిక లేని ప్రపంచ దేశాధినేతల తీరును వారి సమక్షం లోనే తూర్పారబట్టిన పదహారేళ్ల స్వీడన్ బాలిక గ్రెటా థన్బర్గ్ మనం ఎంతటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నామో మూడురోజులపాటు జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ శిఖరాగ్ర సదస్సులో ఎలుగెత్తి చాటింది. అంతకంతకూ పెరుగుతూపోతున్న భూతాపోన్నతి పర్యవసానాలు సమస్త మానవాళినీ కలవరపరుస్తున్నాయి. అకాల వర్షాలు, వరదలు, కరువులు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. నేలలు చవుడుబారి ఎడారులు విస్తరిస్తున్నాయి. అడవులు కార్చిచ్చులబారిన పడుతు న్నాయి. సముద్రాలు వేడెక్కుతున్నాయి. ధ్రువప్రాంతాల్లో మంచు పలకలు కరిగి విరుగుతున్నాయి. సముద్రమట్టాలు పెరుతుతున్నాయి. ముంచుకొచ్చే ముప్పు గురించి ఇవన్నీ ప్రకృతి పదే పదే మనకు చేస్తున్న హెచ్చరికలు. కానీ దేశాధినేతలు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని గంభీరమైన వాగ్దానాలు చేయడమే తప్ప, అందుకు అనుగుణమైన కార్యాచరణకు నడుం బిగించడం లేదు. అందుకే ప్రపంచ దేశాల అధినేతలనుద్దేశించి గ్రెటా థన్బర్గ్ ‘రానున్న ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో తెలిసి కూడా మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నార’ంటూ నిప్పులు చెరిగింది. ఆమె ధిక్కార స్వరానికి కొన్ని దేశాల అధినేతల నుంచి అనుకూల స్పందన వచ్చింది. అందులో మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. ‘వాతావరణ మార్పులను అరి కట్టేందుకు ఇంతవరకూ చాలా మాటలు చెప్పాం. ఇక చేతలు ప్రారంభించాల్సిన సమయం ఆస న్నమైంద’ని ఆయన పిలుపునిచ్చారు. ఒక సమగ్ర కార్యాచరణ, అంతర్జాతీయ స్థాయి ఉద్యమం అవసరమని సూచించారు. తమ వంతుగా శిలాజేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని ఇంతక్రితం ప్రకటించిన స్థాయి కంటే భారీగా పెంచుతున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి 2015 డిసెంబర్లో జరిగిన పారిస్ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో చరిత్రాత్మక ఒడంబడిక కుదిరినప్పుడు, 2020కల్లా ప్రపంచ దేశాలన్నీ దీనికి మించిన క్రియాశీలమైన కార్యా చరణ ప్రణాళికల అమలు ప్రారంభించాలని అది నిర్దేశించింది. ఎందుకంటే ఆ లక్ష్యాలకు కనీసం మూడింతలు మించితే తప్ప ఏమాత్రం ప్రయోజనం లేదు. నాలుగేళ్లు గడిచాక చూస్తే ఆమోదించిన ప్రణాళికలనైనా సక్రమంగా అమలు చేసే చిత్తశుద్ధిని ఏ దేశమూ చాటలేకపోయింది. ఫలితంగా కర్బన ఉద్గారాల తీవ్రత నానాటికీ పెరుగుతూ పోతోంది. తాజాగా ముగిసిన వాతావరణ శిఖరాగ్ర సదస్సు చూస్తే సంపన్న దేశాల బాధ్యతారాహిత్యం బయటపడుతుంది. ఈ సదస్సులో 60 దేశాల అధినేతలు తాము గతంలో అంగీకరించిన లక్ష్యాలకు మించి కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటా మని ప్రతినపూనగా అందులో మెజారిటీ దేశాలు చిన్న దేశాలే. ఇవన్నీ తక్కువ స్థాయి కాలుష్యకా రక దేశాలే. కర్బన ఉద్గారాలు అధికంగా విడిచే జాబితాలో అగ్రభాగాన ఉన్న అమెరికా, చైనాలు మాత్రం మౌనంగా ఉండిపోయాయి. అమెరికా అసలు పారిస్ ఒడంబడికకే తిలోదకాలిస్తోంది. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ఈ శిఖరాగ్ర సదస్సులో కేవలం 14 నిమిషాలు మాత్రమే కాలక్షేపంచేసి ఏ ప్రక టనా చేయకుండా నిష్క్రమించారు. పైగా గ్రెటా థన్బర్గ్ను ఎగతాళి చేస్తూ ట్వీట్ చేశారు. కొత్తగా అలయెన్స్ వంటి బడా బీమా సంస్థలు వాతావరణ మార్పుల్ని నిరోధించడానికి తీసుకునే చర్యలకు తమ సహకారం ఉంటుందని ప్రకటించడం ఉన్నంతలో ఊరటనిస్తుంది. అయితే శిఖరాగ్ర సద స్సులో థన్బర్గ్వంటి నిప్పులు కురిపించే కార్యకర్తల కృషి, వెలుపల రోడ్లపై పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు సాగించిన ఆందోళనవల్లే ఈమాత్రమైనా జరిగిందని గుర్తుంచుకోవాలి. నార్వే, అర్జెంటినా, ఇథియోపియా, టర్కీ తదితర 70 దేశాలు తాము గతంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు మించి కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటామని ముందుకొచ్చాయి. తమ కర్బన ఉద్గా రాలను పూర్తిగా తగ్గించుకుంటాయని వాగ్దానం చేసిన దేశాలన్నీ వాతావరణ మార్పుల వల్ల భూభా గాలను కోల్పోయే దేశాలే కావడం గమనార్హం. మార్షల్ ఐలాండ్స్ అందులో ఒకటి. పరిమిత భూభాగం ఉండి, తమ అవసరాలన్నిటికీ దిగుమతి చేసుకుంటున్న శిలాజ ఇంధనాలపైనే ఆధార పడే ఆ దేశం, 2050 కల్లా తాము కర్బన ఉద్గారాలను సంపూర్ణంగా పరిహరిస్తామని సదస్సులో ప్రక టించింది. డెన్మార్క్, ఫిజీ, గ్రెనెడా, లగ్జెంబర్గ్, మొనాకో, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, సెయింట్ లూసియా, స్విట్జర్లాండ్ వంటి మరో 15 దేశాలు కూడా ఈ బాటలోనే ఉన్నాయి. శిలాజేతర ఇంధన లక్ష్యాన్ని పారిస్ శిఖరాగ్ర సదస్సులో హామీ ఇచ్చిన 150 గిగావాట్ల నుంచి ఇప్పుడు 450 గిగావాట్లకు పెంచుతున్నట్టు ప్రధాని మోదీ చేసిన ప్రకటన హర్షించదగిందే అయినా కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ విషయంలో మన దేశం చేయాల్సింది చాలా ఉంది. పర్యా వరణ అనుమతులకు అనుసరించే విధానాలను మరింత కఠినం చేయాలి. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు అనుమతించడం పర్యావరణానికి హాని చేసేదే. వచ్చే డిసెం బర్లో చిలీలోని శాంటియాగోలో జరిగే ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) 25 సదస్సు వాతావరణ మార్పు ప్రమాదాన్ని అరికట్టడానికి తీసుకునే నిర్దిష్ట చర్యల్ని ఖరారు చేసే సందర్భం. అప్పటికల్లా ప్రతి దేశమూ కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యమెంతో, దాన్ని సాధించడానికి తాము అనుసరించదలచిన ప్రణాళికేమిటో ఆ సదస్సులో నిర్దిష్టంగా ప్రకటించాల్సి ఉంటుంది. పైగా ఆ లక్ష్యాలు పారిస్ శిఖరాగ్ర సదస్సులో ప్రకటించిన లక్ష్యాలకు మించి ఉండాలి. అయితే నిర్దేశించు కున్న లక్ష్యాలను ఉల్లంఘించే దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడం, వాటికి జవాబుదారీతనం అల వర్చడం తదితరాలు లేకపోవడం పెద్ద లోపమనే చెప్పాలి. కాప్ 25 సదస్సునాటికైనా ఆ దిశగా ఆలోచించడం ఉత్తమం. లేనట్టయితే భవిష్యత్తరాలకు సురక్షితమైన, భద్రమైన ప్రపంచాన్ని వార సత్వంగా అందించడం అసాధ్యమవుతుందని మరిచిపోరాదు. -
ఏమిటి ఈ పిల్లకింత ధైర్యం!
పిల్లలకు భయం తెలీదు. రాక్షసుడి మీసాలు పట్టుకుని కూడా లాగుతారు. ఆ మీసాల రాక్షసుడి కన్నా పెద్ద రాక్షసి.. ఈ భూమండల కాలుష్యం. దాని కోరలు పట్టిలాగింది గ్రెటా థన్బర్గ్! అయితే అవి కాలుష్యపు కోరలు కాదు. పాలకుల నిర్లక్ష్యపు కోరలు. ఎంత ధైర్యం.. ఈ చిన్నారి కార్యకర్తకు!! ‘‘ఐ హ్యావ్ ఎ డ్రీమ్’’ అన్నాడు మార్టిన్ లూథర్ కింగ్. వాషింగ్టన్లోని లింకన్ మెమోరియల్లో గుమికూడిన రెండు లక్షల మంది ఆ మాట విన్నారు. ప్రతిస్పందనగా పెద్ద హోరు!‘‘ఐ హ్యావ్ ఎ డ్రీమ్’’ అన్నాడు మరింత గట్టిగా ఆయన. మళ్లీ అదే హోరు. ఏమిటి ఆయన కల? ‘‘ఓ రోజు వస్తుంది. ఆ రోజు అమెరికాలో నల్లవారందరికీ స్వేచ్ఛ, తెల్లవారందరితో సమానత్వం అనే నా కల నిజమౌతుంది’’ అన్నాడు మార్టిన్. 1963 ఆగస్టు 28 నాటి ప్రసంగం అది. ‘‘హౌ డేర్ యు’’ అంది గ్రెటా థన్బర్గ్. పదహారేళ్ల అమ్మాయి! అగ్రరాజ్యాలన్నీ ఒక్కక్షణం ఫ్రీజ్ అయ్యాయి. ఏమిటి ఈ పిల్లకింత ధైర్యం! ‘హౌ డేర్ యు’ అని గ్రెటా అన్నది చిన్నా చితక మనుషుల్ని కాదు. దేశాధినేతల్ని. ఎంత ధైర్యం లేకపోతే, ‘మీ కింత ధైర్యమా?’ అని అడుగుతుంది!! ఏం చేశారు అధినేతలు అంత పెద్ద తప్పు? భూగోళం మసిబారిపోతుంటే చూస్తూ ఊరుకున్నారు! అదే వారిపై ఆమె కంప్లయింట్. సోమవారం ఐక్యరాజ్య సమితిలో గ్రెటా చేసిన ప్రసంగానికి ప్రపంచం ఫ్లాట్ అయిపోయింది. ‘‘అదీ అలా బుద్ధి చెప్పు’’ అని ఒకటే అభినందనలు. మార్టిన్ లూథర్ కింగ్ని, గ్రెటా థన్బర్గ్ని పోల్చడం కరెక్ట్ కాదు. ‘అటెన్షన్’ని పట్టుకోవడంలో మాత్రం.. తప్పదు, పోల్చాల్సిందే. ఇద్దరి ప్రసంగానికీ ఒకే ప్రతిస్పందన. ఒకే హోరు. నల్లజాతి అమెరికన్ల హక్కుల నాయకుడు లూథర్ కింగ్. ఈ భూగోళంపై భావితరాలకు ఉన్న ‘స్వచ్ఛమైన గాలిని పీల్చే హక్కు’కు ఒక పరిరక్షక కార్యకర్త గ్రెటా థన్బర్గ్.‘యు.ఎన్. క్లైమేట్ యాక్షన్ సమ్మిట్’కి న్యూయార్క్ వచ్చింది గ్రెటా. ప్రత్యేక ఆహ్వానంపై వచ్చింది. ప్రత్యేక ప్రసంగానికీ ఆమెకు ఆహ్వానం ఉంది. గ్రెటా మైక్ పట్టుకోగానే.. సూట్లు, బూట్లు వేసుకున్న పెద్దలంతా వినేందుకు సిద్ధమైపోయారు. ఆ స్కూల్ విద్యార్థిని ఎలా మాట్లాడుతుందో కొన్నాళ్లుగా ఆ పెద్దల దృష్టికి వస్తూనే ఉంది. క్లాసులు వదిలి స్కూలు బయట, స్కూలు వదిలి దేశం బయట ఆ స్వీడన్ అమ్మాయి నిరసన ప్రదర్శనలు జరపడం కూడా వారు టీవీల్లో చూస్తూనే ఉన్నారు. గ్రెటా మొదట తన దేశ పార్లమెంటును షేక్ చేసింది. తనూ, తన స్కూలు పిల్లలే.. పక్కన గ్రేట్ లీడర్స్ ఎవరూ లేరు! ‘బయటికి రండి. ఈ దేశం ఎలా ఉందో చూడండి. ఇదా మేం పీల్చవలసిన గాలి. ఇదా మీరు మా ఊపిరి తిత్తులకు ఇచ్చే ప్రాణవాయువు’’ అని సన్నటి గొంతులతో గర్జించారు పిల్లలు. స్వీడన్ ఎంపీలు కిటికీల్లోంచి తలలు బయటికి పెట్టి చూశారు. అమెరికన్ కాంగ్రెస్నూ గ్రెటా అండ్ గ్యాంగ్ వదిలిపెట్టలేదు. సముద్రం దాటి వచ్చి, సునామీలా వాషింగ్టన్ను చుట్టేశారు. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి మీటింగ్ హాల్లో మళ్లొకసారి గ్రెటా ‘క్లైమేట్ ఛేంజ్’ గర్జన.‘‘అమ్మాయ్.. ఏమివ్వబోతున్నావ్ మాకు సందేశం?!’’ మాట్లాడేందుకు గ్రెటా రెడీ అవగానే ముఖానికి వచ్చి తగిలిన ప్రశ్న. పైకి అది ప్రశ్నే గానీ, ‘చాల్లే కూర్చో’ అన్నట్లుగానే ఉంది. గ్రెటా బెదర్లేదు. చురుగ్గా చూసింది. ‘‘మీపై ఒక కన్నేసి ఉంచానని చెప్పడమే నా సందేశం’’ అంది! పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ నిశ్శబ్దంలోంచి గ్రెటా ఈటెల్లాంటి మాటలు ధ్వనించాయి. ‘‘ఇది తప్పు. ఈ టైమ్కి నేనిక్కడ ఉండకూడదు. స్కూల్లో ఉండాలి. కానీ స్కూలు వదిలిపెట్టి వచ్చాను. మీ బాధ్యతను మీకు గుర్తు చేయడానికి మా వంటి పిల్లల్ని మీ దగ్గరికి రప్పించుకుంటారా? హౌ డేర్ యూ?!’’ సభ అదిరిపడింది ‘‘నా కలల్ని, నా బాల్యాన్నీ మీరు దొంగిలించారు. వట్టి మాటలు మీవి. మీకేం పట్టదా? ప్రజలు జబ్బున పడుతున్నారు. చనిపోతున్నారు. మొత్తం పర్యావరణమే ధ్వంసమైపోయింది. కొద్దిమంది అదృష్టవంతులలో నేనొక దానిని. మేం బతికే ఉన్నాం. అంతరించిపోతున్న జీవజాతుల అంతిమ దినాలలో ఆఖరి శ్వాసను పీలుస్తూ కొన ఊపిరితో ఉన్నాం. మీకు డబ్బు కావాలి. అభివృద్ధి కావాలి. వాటి కోసం కట్టుకథలతో మమ్మల్ని మభ్యపెడుతున్నారు. హౌ డేర్ యూ!!’’ సభలో పిడుగు పడింది ‘‘అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు మాత్రం ఎటువైపో చూస్తుంటారు. ‘చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాం’ అని చెబుతుంటారు. కానీ ఏమీ జరగదు. పొంచి ఉన్న ముప్పు నుంచి మమ్మల్ని బయటపడేసే మీ ప్రయత్నమేదీ కనుచూపు మేరలో మాకు కనిపించదు. హౌ డేర్ యూ!!’’ సభ తత్తరపడింది ‘‘మీరు చెప్పింది వింటున్నాం అంటారు. విషమిస్తోన్న పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాం అంటారు. కానీ మీవి నమ్మకమైన మాటలు కావు. కోపంలోనో, బాధగానో నేను ఇలా అనడం లేదు. మిమ్మల్ని నమ్మలేను. రానున్న ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో తెలిసి కూడా మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. హౌ డేర్ యూ!!’’ సభ ఉలిక్కిపడింది ‘‘అన్ని సమస్యల్లానే కార్బన్ కాలుష్య సమస్య కూడా పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారు. ఏవో కొన్ని సాంకేతిక పరిజ్ఞాన విధానాలతో కర్బన వాయువుల్ని తగ్గించి, భూతాపాన్ని నియంత్రిస్తాం అంటున్నారు. కానీ మీ ప్రయత్నాల్లో మీరు విఫలం అవుతున్నారు. క్లైమేట్ ఛేంజ్ అనే మాట వినగానే ఇక్కడి సభ్యులు కుదురుగా కూర్చోలేకపోతున్నారు. వినేందుకు అవసరమైన పరిణతినీ కనబరచడం లేదు. హౌ డేర్ యూ?!’’ సభ భుజాలు తడుముకుంది ‘‘మీరు మమ్మల్ని గెలవనివ్వడం లేదు. మీ ద్రోహం మా యువతకు అర్థమౌతోంది. భావి తరాల కళ్లన్నీ మీ మీదే ఉన్నాయని గ్రహించండి. మమ్మల్ని ఓడించడమే మీ ఉద్దేశమైతే.. నేను చెబుతున్నా వినండి.. మేము ఎప్పటికీ మిమ్మల్ని క్షమించబోము. ఇక్కడికిక్కడే, ఇప్పటికిప్పుడే ఒక పరిషారం ప్రకటించాలి. ప్రపంచం మేల్కొంటోంది. మార్పు మొదలవుతోంది. అది మీకు ఇష్టమేనా.. లేకున్నా..’’ సభ నివ్వెరపోయింది. గ్రెటా ప్రసంగం ముగిసింది. ‘థ్యాంక్యూ’ అనే మాటతో ఆమె తన స్పీచ్ని ముగించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మంత్రముగ్ధుడై చూశారు! ‘‘అందమైన భవిష్యత్తు కోసం చూస్తున్న అద్భుతమైన యువతి. ఈ చిన్నారిని చూడ్డం సంతోషంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు. ఇండియా నుంచీ గ్రెటాకు ప్రశంసలు వెళ్లాయి. ‘‘బాగా చెప్పావు గ్రెటా. మిమ్మల్ని ఓడించడానికి మాకెంత ధైర్యం! ముఖం పగిలేలా భలే అడిగావు. రానున్న పర్యావరణ విపత్తుపై మా స్పృహలేనితనాన్ని చక్కగా ఎత్తి చూపావు. నీకు కృతజ్ఞతలు’’ అని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ట్వీట్ చేశారు. ఇంకో నటి ఆలియా భట్.. ‘‘వినండి. ఆలోచించండి. అప్రమత్తం కండి. కార్యాచరణకు దిగండి’’ అని ఏకంగా గ్రెటా స్పీచ్నే తన ట్విట్టర్ లో షేర్ చేశారు. చిన్నచిన్న విమర్శలూ వచ్చాయి గ్రెటా మీద. వయసుకు మించిన ఆగ్రహ ప్రదర్శన అసహజంగా ఉందనీ, సాధ్యాసాధ్యాలను తెలుసుకోలేని వయసనీ కొందరు కొట్టిపడేశారు. ఏమైనా గ్రెటా పేరు కన్నా ఆమెలో పేరుకుపోయిన మనోవేదననే పరిగణనలోకి తేసుకోవాలి. తన గురించి ఆమె మాట్లాడ్డం లేదు. తన తరం గురించి మాట్లాడుతోంది. ఈ తరం నేతలు దానిని గ్రహించాలి. రేపటి తరానికి స్వచ్ఛమైన భూమండలాన్ని కానుకగా ఇవ్వాలి. తిరుగుబాటు కార్యకర్త ఏడేళ్ల క్రితం బాలికల విద్య కోసం ఉద్యమించిన పాకిస్థానీ యువ తరంగం మలాలా అసాఫ్జాయ్లా.. ఇప్పుడు అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చిన టీనేజ్ పర్యావరణ ‘తిరుగుబాటు’ కార్యకర్త గ్రెటా థన్బర్గ్. స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ ఆమె పుట్టినిల్లు. తల్లి మలేనా ఎర్న్మేన్ అపేరా గాయని. తండ్రి స్వాంతే థన్బర్గ్ రచయిత, నటుడు. ఎనిమిదేళ్ల వయసప్పుడు తొలిసారిగా ఈ చిన్నారి ‘క్లైమేట్ ఛేంజ్’ అనే మాట వింది. ఆ వయసుకు అర్థం కాని విషయం అది. తర్వాత మూడేళ్లకు డిప్రెషన్లోకి వెళ్లిపోయింది! ఎప్పుడూ నిస్సత్తువగా, అనాసక్తితో అలా పడి ఉండేది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. తినేది కాదు. చివరికి ఆమె ‘ఆస్పెర్గర్ సిండ్రోమ్’తో బాధపడుతోందని వైద్యులు తేల్చారు. ‘ఓసీడీ’, ‘సెలక్టివ్ మ్యుటిజం’ వంటివి కూడా బయటపడ్డాయి. ‘ఆటిజం’తో వచ్చిన లక్షణాలు అవి. ‘‘నువ్వు చిన్నప్పుడు అలా ఉండేదానివట కదా’’ అని తెలిసినవాళ్లు ఎవరైనా ఇప్పుడు అడిగితే. ‘‘అవన్నీ కూడా నాకు సూపర్ పవర్ని ఇచ్చాయి’’ అని నవ్వుతూ చెబుతుంటుంది గ్రెటా. పద్నాల్గవ యేట తొలిసారిగా ఆమె.. ‘మన ఫ్యామిలీ కార్బన్ ఫుట్ప్రింట్ ను తగ్గిద్దాం. మాంసాహారాన్ని, విమాన ప్రయాణాలను మానుకుందాం’’అని అన్నప్పుడు గ్రెటా తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. తర్వాత ఆమె అభీష్టం ప్రకారమే మానేశారు. కార్బర్ ఫుట్ప్రింట్ అంటే ఒక మనిషి అలవాట్ల నుంచి సగటున ఏడాదికి విడుదలయ్యే కార్బన్ డైయాక్సైడ్. వాళ్లిచ్చిన ఆ చిన్నపాటి ప్రోత్సాహమే నేడు గ్రెటాను ఒక ఉద్యమకారిణిగా ఐక్యరాజ్యసమితి వరకు నడిపించింది. -
‘థ్యాంక్స్ గ్రెటా.. ముఖంపై గుద్దినట్లు చెప్పావ్’
న్యూఢిల్లీ : వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాధినేతలను నిలదీసిన 16 ఏళ్ల బాలిక గ్రెటా థంబర్గ్పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దేశాధినేతను ఉద్దేశించి ‘పర్యావరణం నాశనమైపోతోంది. ప్రజలు చనిపోతున్నారు. కానీ మీకు ఇవేమీ పట్టవు. డబ్బు, వృద్ధి అంటూ కథలు చెప్తారు. మా తరాన్నిమీరు మోసం చేయడానికి మీకెంత ధైర్యం(హౌ డేర్ యూ). మేం మిమ్మల్ని క్షమించబోం’ అంటూ బాలిక చేసిన ప్రసంగంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం గ్రెటా ప్రంసంగాన్ని కొనియాడారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సైతం గ్రెటా థంబర్గ్ ప్రసంగంపై స్పందించారు. ‘థ్యాంక్స్ గ్రెటా థంబర్గ్.. మీ తరాన్ని ఒక చోటకు తెచ్చి పర్యావరణ రక్షణపై మా తరానికి ముఖంపై గుద్దినట్లు చెప్పినందుకు. అలాగే పర్యావరణ మార్పుపై మేం ఇంకా బాగా తెలసుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పినందుకు అభినందనలు. మీమ్మల్ని ఓడించడానికి మాకెంత ధైర్యం? మనం బతకడానికి చివరకు మనకు ఈ ఒక్క గ్రహం మాత్రమే ఉంది’ అంటూ హౌ డేర్ యూ(How Dare You)అనే హాష్ ట్యాగ్ను జోడించి ట్విట్ చేసింది. (చదవండి : హౌ డేర్ యూ... అని ప్రపంచ నేతలను నిలదీసింది!) కాగా, ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సులో స్వీడన్కు చెందిన గ్రెటా థంబర్గ్ ప్రసంగిస్తూ.. ‘ మీ(ప్రపంచ దేశాధినేతలు) భూటకపు మాటలతో చిన్నప్పటి నుంచి నేను కన్న కలలను నాశనం చేశారు. భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. పర్యావరణ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. ప్రజలు చనిపోతున్నారు. ప్రస్తుతం పర్యావరణం అంతరించిపోయే మొదటి దశలో మనం ఉన్నాం. మీరు మాత్రం ఆర్థిక అభివృద్ధంటూ, డబ్బంటూ కట్టుకథలు అల్లుతున్నారు. మీకెంత ధైర్యం? గడిచిన 30 ఏళ్లలో ఈ సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా సమస్యలను వింటున్నామని మీరు చెబుతున్నారు. ఒకవేళ మీరు నిజంగా పరిస్థితిని అర్థం చేసుకొని ఉంటే సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యేవారు కాదు. అందుకే మిమ్మల్ని నేను నమ్మలేను. ప్రకృతికి హాని కలిగించే వాయువులను నివారించడంలో విఫలమై... నూతన తరానికి ఆరోగ్యకర వాతావరణాన్ని అందించకుండా ఉండేందుకు ఎంత ధైర్యం? యువత మిమ్మల్ని గమనిస్తోంది. ఇప్పుడు మీరు నవ్వుకున్నా... త్వరలోనే మా వేదన ఎంత తీవ్రమైనదో తెలుస్తుంది’ అని గ్రెటా థంబర్గ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. Thank you @gretathunberg for giving us the much needed punch in the face, for bringing your generation together and showing us that we need to know better, do more to save what is most critical. At the end of the day, we only have this one planet. #HowDareYou https://t.co/IiQ5NUavpD — PRIYANKA (@priyankachopra) September 24, 2019 -
హౌ డేర్ యూ... అని నిలదీసింది!
హౌ డేర్ యూ... అని ప్రపంచ దేశాధినేతలను నిలదీసిందో 16 ఏళ్ల బాలిక. ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు వేదికగా కడిగిపారేసింది. మా కలలను భగ్నం చేశారు. బాల్యాన్ని చిదిమేశారు. భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. పర్యావరణం నాశనమైపోతోంది. ప్రజలు చనిపోతున్నారు. కానీ మీకు ఇవేమీ పట్టవు. డబ్బు, వృద్ధి అంటూ కథలు చెప్తారు. మీకెంత ధైర్యం అని ఘాటుగా ప్రశ్నించింది స్వీడన్కు చెందిన గ్రెటా థంబర్గ్. మా తరాన్ని మీరు మోసం చేస్తున్నారు... మిమ్మల్ని ఎంతమాత్రం క్షమించబోమని హెచ్చరించింది. యువత మిమ్మల్ని గమనిస్తోంది.., ఇప్పుడు మీరు నవ్వుకున్నా... త్వరలోనే మా వేదన ఎంత తీవ్రమైనదో తెలుస్తుందంటూ ఆక్రోశంగా ప్రసంగించింది థంబర్గ్. ‘మీ భూటకపు మాటలతో చిన్నప్పటి నుంచి నేను కన్న కలలను నాశనం చేశారు. భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. పర్యావరణ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. ప్రజలు చనిపోతున్నారు. ప్రస్తుతం పర్యావరణం అంతరించిపోయే మొదటి దశలో మనం ఉన్నాం. మీరు మాత్రం ఆర్థిక అభివృద్ధంటూ, డబ్బంటూ కట్టుకథలు అల్లుతున్నారు. మీకెంత ధైర్యం? గడిచిన 30 ఏళ్లలో ఈ సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా సమస్యలను వింటున్నామని మీరు చెబుతున్నారు. ఒకవేళ మీరు నిజంగా పరిస్థితిని అర్థం చేసుకొని ఉంటే సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యేవారు కాదు. అందుకే మిమ్మల్ని నేను నమ్మలేను. ప్రకృతికి హాని కలిగించే వాయువులను నివారించడంలో విఫలమై... నూతన తరానికి ఆరోగ్యకర వాతావరణాన్ని అందించకుండా ఉండేందుకు ఎంత ధైర్యం? యువత మిమ్మల్ని గమనిస్తోంది. ఇప్పుడు మీరు నవ్వుకున్నా... త్వరలోనే మా వేదన ఎంత తీవ్రమైనదో తెలుస్తుంది’ అని గ్రెటా థంబర్గ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. -
‘నా మాటలు విన్సాలిన అవసరం లేదు’
వాషింగ్టన్ : ’నిద్ర పోతూ కలలు కనేందుకు ఇది సమయం కాదు.. సందర్భం అంతకన్నా కాదు.. మేల్కొనండి’ అంటూ పర్యావరణ ఉద్యమకారిణి, స్వీడన్ యువ కెరటం గ్రెటా థన్బెర్గ్(16) అమెరికా కాంగ్రెస్ సభ్యులకు విఙ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పులపై తాను చెప్పే మాటలు వినాల్సిన అవసరం లేదని..కేవలం శాస్త్రవేత్తల హెచ్చరికలపై దృష్టి సారిస్తే సరిపోతుందని సూచించారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరిట వాతావరణ మార్పులపై అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన థెన్బర్గ్ ఆరు రోజుల పాటు వాషింగ్టన్లో పర్యటించారు. ఈ సందర్భంగా బుధవారం అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో సభ్యులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘పర్యావరణ సంక్షోభాన్ని ఎవరూ తీవ్రమైన సమస్యగా పరిగణించడం లేదు. అదే అసలు సమస్య. సైన్స్ చెబుతున్న సత్యాలను వినండి. దాని సాక్షిగా అంతా ఏకం అవండి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తాయో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ఇక ప్రపంచ దేశాల్లో ఉద్దేశపూర్వకంగా ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలనుకున్న ఏకైక దేశమైన అమెరికా... కర్భన ఉద్గారాలను వెదజల్లడంలో మాత్రం అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ విషయంలో మార్పు రావాలి. మీ ప్రశంసలు నాకు అక్కర్లేదు. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను అరికట్టేందుకు నడుం బిగిస్తే చాలు’ అంటూ థెన్బెర్గ్ ఉద్వేగంగా ప్రసంగించారు.(చదవండి : థన్బెర్గ్ను కలవడం ఆనందం కలిగించింది : ఒబామా) కాగా వాతావరణ మార్పులపై అవగాహన సదస్సులు నిర్వహించే అమెరికా యువ న్యాయవాది బెంజీ బాకర్(21)థెన్బెర్గ్పై ప్రశంసలు కురిపించాడు. థెన్బర్గ్ వంటి వ్యక్తులు తమ పోరాటాన్ని రాజకీయ నాయకుల ముందుకు తీసుకురావడం గొప్ప పరిణామమని పేర్కొన్నాడు. ‘ ఒక అమెరికన్గా ఎంతో గర్విస్తున్నా. అదే విధంగా ఓ యువకుడిగా మిమ్మల్ని అర్థిస్తున్నా. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో కలిగే నష్టాలను అంచనా వేయండి. అందుకు తగ్గట్టుగా స్పందించండి. వాటిని రూపుమాపేందుకు చర్యలు తీసుకోండి. మాకు మీ సహాయం కావాలి’ అని కాంగ్రెస్ సభ్యులకు విఙ్ఞప్తి చేశాడు. ఇక పర్యావరణ సంక్షోభాన్ని రూపుమాపేందుకు థెన్బర్గ్ సహా యువ శాస్త్రవేత్తలు చేసిన సలహాలు, సూచనలను రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ప్రశంసించారు. అయితే వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్కు అమెరికా ఒక్కటే కారణం కాదని.. వర్ధమాన దేశాలుగా చెప్పుకొంటున్న కొన్ని దేశాలు వెదజల్లే కర్భన ఉద్గారాలతో పోలిస్తే అమెరికా కాస్త బెటర్గానే ఉందన్నారు. కర్భన ఉద్గారాలు వెదజల్లుతూ ఆ దేశాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయని పేర్కొన్నారు. రిపబ్లికన్ ప్రతినిధి గ్యారెట్ గ్రేవ్స్ మాట్లాడుతూ..కాలుష్యాన్ని వెదజల్లడంలో చైనా ముందుందని.. అటువంటి దేశాల గురించి ఎవరూ మాట్లాడటం లేదని విమర్శించారు. ఇందుకు స్పందనగా..‘ మీరు ఇతర దేశాల గురించి ఎలా మాట్లాడతారో వాళ్లు కూడా... తక్కువ జనాభా కలిగి ఉండి అత్యధిక కర్భన రసాయనాలు వెదజల్లుతున్న దేశం మీదేనని అంటున్నారు’ అని చురకలంటించారు. వ్యాధితో సతమవుతున్నా.. అస్పెర్జర్ సిండ్రోమ్తో బాధ పడుతున్న 16 ఏళ్ల గ్రెటా.. గతేడాది డిసెంబరులో పోలాండ్లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన కాప్24 సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్భంగా.. రాజకీయ నాయకులను ఉద్దేశించి.. ‘మా గురించి పట్టించుకోమని అడుక్కోవడానికి ఇక్కడకు రాలేదు. చాలా ఏళ్లుగా మమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయినా ఎన్నోసార్లు క్షమించాం. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు భవిష్యత్తును అంధకారం చేస్తాయి. ప్రజల చేతుల్లోనే నిజమైన అధికారం ఉంటుంది అంటూ వ్యాఖ్యానించి ప్రపంచ దేశాధినేతల దృష్టిని ఆకర్షించారు. ఇక కర్భన ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉందంటూ... భారత ప్రధాని మోదీకి సైతం ఓ పవర్ఫుల్ వీడియో మెసేజ్ పంపారు.(చదవండి : ‘మోదీ.. మీరొక చెత్త విలన్లా మిగిలిపోతారు’) -
థన్బెర్గ్ను కలవడం ఆనందం కలిగించింది : ఒబామా
వాషింగ్టన్ : స్వీడన్కు చెందిన 16 ఏళ్ల గ్రేటా థన్బర్గ్ పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తనను కలసిన థన్బెర్గ్ను ట్విటర్ వేదికగా అభినందించారు. అంత చిన్న వయసులో పర్యావరణ పరిరక్షణ గురించి థన్బెర్గ్ పోరాడడం గొప్ప విషయమని, ఆమెను కలవడం ఆనందం కలిగించిందని ఒబామా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒబామా థన్బర్గ్ను కలిసిన వీడియోనూ ఒబామా ఫౌండేషన్ విడుదల చేసింది. '' మీరు, నేను ఒక టీంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణకు పిడికిళ్లు బిగిద్దామని'' ఒబామా పేర్కొన్నారు. దీనికి థన్బెర్గ్ అనుకూలంగా స్పందిస్తూ ... ప్రపంచాన్ని ఎవరు ప్రభావితం చేయలేరని, వాతావరణం పట్ల సృజనాత్మకంగా వ్యవహరిస్తూ మీకు నచ్చినది చేయొచ్చని, అందుకు నా సహకారం తప్పక ఉంటుందని పేర్కొన్నారు . వాతావరణ మార్పుల తీవ్రతను ఇప్పటి యువతరం భరిస్తుందని, అందులోనూ పర్యావరణం కోసం పరితపిస్తున్న థన్బెర్గ్ లాంటివారు అసలే భయపడరని ఒబామా పేర్కొన్నారు. గత శుక్రవారం వాషింగ్టన్లోని వైట్హౌస్ ముందు నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో థన్బెర్గ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వాషింగ్టన్లో ఉన్న బరాక్ ఒబామాను తన్బెర్గ్ కలుసుకున్నారు. కాగా, సెప్టెంబర్ 20 న న్యూయార్క్లో జరగనున్న '' గ్లోబల్ క్లైమెట్ స్ట్రైక్'' లో ఇతర నిరసనకారులతో కలిసి ఆమె పాల్గొననున్నారు. -
మరోసారి గర్జించిన గ్రెటా థన్బెర్గ్
వాతావరణ మార్పులపై గళమెత్తిన 16 ఏళ్ల స్వీడిష్ యువకెరటం గ్రెటా థన్బెర్గ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. యూరోపియన్ పార్లమెంట్ పర్యావరణ కమిటీ ఆఖరి సమావేశ సభలో ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. పర్యాపరణ పరిరక్షణకోసం శరవేగంగా నడుం బిగించాలని ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. అటవీ నిర్మూలన, జంతువుల నాశనం, మహాసముద్రాల ఆమ్లీకరణ లాంటి వాటితో మనషి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ పిల్లలు, మనవలు భవిష్యత్తుకోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ గ్రెటా కన్నీంటి పర్యంత మయ్యారు. మన ఇల్లు కూలిపోతోంది..సమయం లేదు..అమూల్యమైన సమయం వృధా అయిపోతోంది.. ఇకనైనా ప్రతీ వ్యక్తి స్పందించాలంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. బ్రెగ్జిట్పై మూడు అత్యవసర సదస్సులు నిర్వహించిన బ్రిటన్ పర్యావరణానికి పొంచి వున్న ముప్పుపై మాత్రం ఎలాంటి స్పందన చూపించ లేదని విమర్శించారు. రాజకీయ నాయకులు పర్యావరణం తప్ప అన్నీ మాట్లాడతారు. వారికి మాతో (పర్యావరణంకోసం ఉద్యమిస్తున్న బాలలు) మాట్లాటడం ఇష్టం ఉండదు..నో ప్రాబ్లమ్..మాకు కూడా వారితో మాట్లాడాలని లేదు. ఓటు హక్కులేని మా మాటలు విశ్వసించకండి..కానీ సైంటిస్టులు, సైన్సు చెపుతున్న మాటల్ని అయినా నమ్మండి. సమయం మించిపోతోంది. ఇకనైనా మేల్కోండి. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోండి..లేదంటే అంతా శూన్యమే అంటూ నేతలకు చురకలంటించారు. వాతావరణ మార్పుల పరిణామాలను నిర్లక్ష్యం చేయొద్దంటూ కోరారు. మీ ఇల్లు కాలిపోతోంటే..ఎంత ఆందోళన చెందుతారో అలాంటి ఆందోళన, భయం ఇపుడు పర్యావరణం పట్ల ప్రపంచ నేతలకు ఉండాలని కోరారు. అలాగే కేథడ్రాల్ నోట్రడామ్ చర్చి అగ్ని ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఆమె యుద్ధ ప్రాతిపదికన దాని పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. పర్యావరణ రక్షణకు కూడా "కేథడ్రాల్-థింకింగ్" ఇపుడు అవసరమని గ్రెటా పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి గ్రెటా థన్బెర్గ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టులో స్వీడిష్ పార్లమెంట్ ఎదుట జరిపిన సోలో నిరసనతో థన్బెర్గ్ ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులకు స్ఫూర్తి దాయకంగా నిలిచింది. అంతేకాదు ఆమె స్ఫూర్తితోనే ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలలో ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ పేరుతో ప్రతీ శుక్రవారం పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా భారీ ఎత్తున యువత ఉద్యమిస్తోంది. What a privilege to meet the formidable Greta Thunberg. I gave her first look at the @GUENGL Climate manifesto and then we had a quick chat about who has the best trains. Surprise Surprise it's not Ireland! #ClimateEmergency pic.twitter.com/ftIRWTy7mq — Lynn Boylan MEP (@LNBDublin) April 16, 2019 .@GretaThunberg gives a shout out to the right wing @EPPGroup @ALDEgroup @ecrgroup! "I have read that some parties do not want me standing here because they so desperately do not want to talk about climate breakdown." 👏👏👏👏 pic.twitter.com/9IXY9gLttc — The Left in the European Parliament (@GUENGL) April 16, 2019 -
‘మోదీ.. మీరొక చెత్త విలన్లా మిగిలిపోతారు’
న్యూఢిల్లీ : పర్యావరణ సంక్షోభాన్ని రూపుమాపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపాలని స్వీడన్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రీటా తుంగ్బెర్గ్(16) ఆకాంక్షించింది. లేనిపక్షంలో ఆయన మానవ చరిత్రలో ఓ చెత్త విలన్లా మిగిలిపోతారని అభిప్రాయపడింది. ఈ మేరకు గ్రీటా మోదీకి విఙ్ఞప్తి చేస్తున్న వీడియోను బ్రుట్ ఇండియా అనే వీడియో పబ్లిషర్ ప్రసారం చేసింది. ‘డియర్ మిస్టర్ మోదీ.. పర్యావరణ సంక్షోభాన్ని అరికట్టేందుకు మీరు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం మాటలు మాట్లాడితే సరిపోదు. అలాగే చిన్న చిన్న విజయాలకు సంతోషించడం మొదలుపెడితే.. మీరు వైఫల్యం చెందుతారు. ఒకవేళ అదే జరిగితే మానవాళి చరిత్రలో మీరో చెత్త విలన్లా మిగిలిపోతారు. కానీ అలా జరగడం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు’ అంటూ గ్రీటా తన మెసేజ్లో పేర్కొంది. కాగా అస్పెర్జర్ సిండ్రోమ్తో బాధ పడుతున్న 16 ఏళ్ల గ్రీటా.. గతేడాది డిసెంబరులో పోలాండ్లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన కాప్24 సదస్సులో ప్రసంగించింది. ఈ సందర్భంగా.. రాజకీయ నాయకులను ఉద్దేశించి.. ‘మా గురించి పట్టించుకోమని అడుక్కోవడానికి ఇక్కడకు రాలేదు. చాలా ఏళ్లుగా మమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయినా ఎన్నోసార్లు క్షమించాం. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు భవిష్యత్తును అంధకారం చేస్తాయి. ప్రజల చేతుల్లోనే నిజమైన అధికారం ఉంటుంది అంటూ వ్యాఖ్యానించి ప్రపంచ దేశాధినేతల దృష్టిని ఆకర్షించింది. కాగా కర్భన ఉద్గారాలను నియంత్రించడం ద్వారా పర్యావరణ హిత కార్యక్రమాలు చేపడతామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నోసార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 121 దేశాల సహకారంతో 2030 నాటికి సోలార్ పవర్ ఉత్పత్తి పెంచేందుకు ఏర్పాటైన ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ గురించి అంతర్జాతీయ వేదికపై మోదీ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో గ్రిటా.. ఆయనకు మెసేజ్ పంపింది.