Health sector
-
ఆరోగ్య రంగంలో ‘ఏఐ’ విప్లవాత్మక పాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య ఆరోగ్య రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవాత్మక పాత్ర పోషిస్తోందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)– ఢిల్లీ డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. పెరుగుతున్న దేశ జనాభా దృష్ట్యా ముందస్తు రోగ నిర్ధారణ, వేగవంతమైన చికిత్సల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మహమ్మారి వ్యాధుల నిర్ధారణ, తీవ్రత అంచనా, వ్యాధి విశ్లేషణలకు ఏఐ పరిపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. ఎయిమ్స్–ఢిల్లీలోని చాలా విభాగాలు ఇప్పటికే రోగనిర్ధారణ, రోగి–కేంద్రీకృత సేవల్లో ఏఐని వినియోగిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో ఏఐ వినియోగంలో ఎయిమ్స్ ఢిల్లీని అత్యుత్తమ కేంద్రంగా ప్రభుత్వం గుర్తించిందని, ప్రాథమిక స్థాయిలోనే ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో గత మూడేళ్లుగా డెర్మటాలజీ, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ వంటి విభాగాల్లో పరిష్కారాలను అభివృద్ధి చేయడం, పరీక్షించడం, అమలు చేయడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి ఎయిమ్స్ అవిశ్రాంతంగా పని చేస్తోందన్నారు. ఏఐ ఆధారిత సీసీటీవీ కెమరాలతో అధీకృత సిబ్బంది డేటాబేస్తో ముఖాలను పోల్చడానికి, ముఖాలను గుర్తించడానికి ఉపయోగిస్తున్నామని, అంతేగాక వీటితో అనధికార ఎంట్రీలను నిరోధించడం ద్వారా భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురష్కరించుకొని ఎయిమ్స్లో నిర్వహించిన సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎయిమ్స్ పరిధిలో పాలనా పరంగా తీసుకొచి్చన సంస్కరణలు, రోగులకు అందుబాటులోకి తెచ్చిన సౌకర్యాలను ఆయన వివరించారు. ఇటీవలే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఏఐ వినియోగం కోసం ఎయిమ్స్ ఢిల్లీని ప్రధాన సంస్థగా నియమించారని, దీని ద్వారా దేశవ్యాప్తంగా 20 సంస్థల కన్సారి్టయంకు ఎయిమ్స్ ఢిల్లీ నాయకత్వం వహిస్తోందని తెలిపారు. మిగతా వివరాలు ఆయన మాటల్లోనే.. 4 వేలకు చేరువలో బెడ్లు..: ప్రస్తుతం ఎయిమ్స్కి ప్రతి రోజూ సగటున 15వేలకు పైగా రోగులు ఓపీడీ సేవలకై వస్తున్నారు. కోవిడ్ తర్వాత ఓపీడీ కేసుల సంఖ్య 20–30 శాతం పెరిగింది. వీరికి కనీసంగా 15వేల మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ఇక రోగులకై కోవిడ్ వరకు 2,600 వరకు బెడ్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 3,600లకు పెంచాం. ఇందులో మాతా, శిశు బ్లాక్లోనే ఏకంగా 425 బెడ్లను పెంచగా, సర్జికల్ బ్లాక్లో 200ల బెడ్లు అదనంగా ఏర్పాటు చేశారు. రోగులకు మందుల అందుబాటులో ఉంచేందుకు ఇటీవలి కాలంలో 4 అమృత్ ఫార్మసీలను అందుబాటులోకి తెచ్చాం. ఇక ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా 30 వేల మంది రోగులకు చికిత్స అందించాం. దేశం నలుమూలల నుంచి వివిధ వ్యాధులతో వచ్చి వారిని ఒక్కరినీ తిరిగి పంపడం లేదని, ప్రతి ఒక్కరికీ వైద్యం అందిస్తున్నాం. వివిధ రాష్ట్రాల్లోని ఎయిమ్స్ ఆస్పత్రుల్లోని రోగులకు సైతం రిఫరెన్స్ల ఆధారంగా టెలీకన్సల్టేషన్ విధానంలో ఆరోగ్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. రోగుల సహాయకులకు 1,516 బెడ్లు.. ఇక రోగులకు సహాయకులుగా వచ్చే వారికి ఎలాంటి ఇక్కట్లు లేకుండా 5 విశ్రాంతి సదన్లను ఏర్పాటు చేయగా, అందులో 1516 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటే ఓపీడీ సహా ప్రతి కేంద్రం వద్ద వెయిటింగ్ ఏరియాలను ఏర్పాటు చేశాము. ఆస్పత్రి పరిధిలో పర్యావరణహిత ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు ఎల క్ట్రిక్ షటిల్బస్ సరీ్వసులు నడుపుతున్నాం. రోగు ల నుంచి ఎలాంటి ఫిర్యాదులైనా స్వీకరించి వాటి ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సంతుష్ట్ పోర్టల్ను ఏర్పాటు చేశాం, దీనిద్వారా రోగులకు మరింత మెరుగైన సేవలను అందించే వీలు కలుగుతోంది. ఆస్పత్రిలో రోగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని సీఎస్ఆర్ నిధులను సమకూర్చుకున్నాం. ఇప్పటికే 15కి పైగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు రూ.150 కోట్లకు పైగా నిధులను సమకూర్చాయి. ఇందులో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఏకంగా రూ.108 కోట్లు అందించింది. డిజిటల్ పాలన.. ఎయిమ్స్లో పారదర్శకతను పెంచేందుకు వీలుగా పూర్తిగా డిజిటల్ పాలనను అందుబాటులోకి తెచ్చాం. పేపర్లెస్గా మార్చాలని నిర్ణయించి, ఇప్పటికే ఈ–హాస్పిటల్ ప్రోగ్రామ్ను అమలు చేస్తున్నాం. 100 శాతం ఈ–ఆఫీస్ ప్రక్రియతో నడుస్తున్న దేశంలోని మొదటి ఆస్పత్రి ఎయిమ్స్ ఒక్కటే. ఎయిమ్స్లో ప్రస్తుతం ఫిజికల్ ఫైల్స్ వినియోగం లేదు. 6 నెలల్లో 17,000 ఈ–ఫైళ్లు, 1.11 లక్షల రసీదులు జారీ చేశాం. డిజిటల్ ప్రొక్యూర్మెంట్ రీఫారŠమ్స్లో భాగంగా స్టోర్లలో ఆటోమేషన్, డిజిటల్ ప్రొక్యూర్మెంట్ లైబ్రరీ ఉన్నాయి. ఈ కొనుగోలు విధానంతో సగటు కొనుగోలు ధర 10 శాతం నుంచి 200 శాతం తగ్గింది. దీంతో వార్షిక పొదుపు రూ. 100 కోట్లుగా ఉంది. ఇక నియామకాల్లోనూ పూర్తిగా ఆన్లైన విధానమే కొనసాగుతోంది. నోటిఫికేషన్ మొదలు పరీక్ష, నియామకపత్రాల జారీ, అపాయింట్మెంట్ ఆర్డర్ల వరకు పూర్తిగా ఆన్లైన్ విధానంలో పూర్తి పారదర్శకతను తెచ్చాం. -
2025 నాటికి దేశ ఆరోగ్య రంగం మార్కెట్
సాక్షి, అమరావతి: ఆదాయపరంగా దేశంలో అతిపెద్ద రంగాల్లో ఒకటిగా ఆరోగ్య రంగం నిలుస్తోంది. ఆస్పత్రులకు వెళ్లాల్సిన పని లేకుండానే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్లోనే వైద్యులతో సంప్రదింపులు, మందులు ఇంటికే పంపడం వంటివాటితో ఆరోగ్య రంగం వేగంగా విస్తరిస్తోంది. పాశ్చాత్య దేశాలతో పోల్చితే భారత్లో తక్కువ ఖర్చుకే వైద్యం లభిస్తుండటంతో విదేశీయులు చికిత్సల కోసం మనదేశానికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో 2025 నాటికి దేశ ఆరోగ్య సంరక్షణ రంగం 638 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బజాజ్ ఫైనాన్స్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఒక అధ్యయనం నిర్వహించింది. బజాజ్ ఫైనాన్స్ అధ్యయనం ప్రకారం.. » 2016లో 110 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశ ఆరోగ్య రంగం మార్కెట్ 2023 నాటికి 372 బిలియన్ డాలర్లకు చేరుకుంది. » 2016–23 మధ్య 22.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదైంది. గత పదేళ్లలో 17.5 శాతం సీఏజీఆర్ చోటు చేసుకుంది. » ప్రధానంగా ఆస్పత్రులు, ఫార్మాస్యూటికల్స్, డయాగ్నోస్టిక్స్, ఇతర పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి. » 2021లో ఫార్మా మార్కెట్ 42 బిలియన్ డాలర్లు ఉండగా 2024లో 65 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అలాగే డ్రగ్స్, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ ఆశాజనకమైన వృద్ధి చోటు చేసుకుంటోంది. నాలుగు రెట్లు పెరిగిన మెడికల్ టూరిజంఅభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర గుండె, కిడ్నీ, తదితర ప్రధానశస్త్రచికిత్సలకు వ్యయం 20 శాతంపైగానే తక్కువ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి భారత్కు చికిత్సల కోసం వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇలా 2020 నుంచి 2024 మధ్య దేశంలో మెడికల్ టూరిజం నాలుగు రెట్లు పెరిగింది. 2024లో 7.69 బిలియన్ డాలర్లుగా ఉన్న మెడికల్ టూరిజం మార్కెట్ 2029 నాటికి 14.31 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. 2048 నాటికి 12% పడకలు పెరుగుదలటైర్ 2–6 నగరాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్, స్పెషాలిటీ క్లినిక్స్లో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. 2048 నాటికి దేశంలోని ఆస్పత్రుల్లో పడకల సంఖ్య 12 రెట్లు పెరగనుంది. అయితే జపాన్లో ప్రతి వెయ్యి మందికి 13, చైనాలో 4.3, అమెరికాలో 2.9 చొప్పున పడకలు ఉండగా మన దేశంలో 1.3 మాత్రమే ఉన్నాయి. ఇక 2018తో పోలిస్తే 2022 నాటికి దేశంలో వైద్యుల సంఖ్య 1.1 రెట్లు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) 2021 నివేదిక ప్రకారం.. ఆరోగ్య రంగంపై దేశ జీడీపీలో అమెరికా 17.4, యునైటెడ్ కింగ్డమ్ (యూకే) 12.4, కెనడా 12.3 శాతం చొప్పున వెచ్చించాయి. భారత్ 3.3 శాతం మాత్రమే ఖర్చు పెట్టింది. -
ఇండోనేషియాలో స్టార్లింక్ సర్వీస్.. 'మస్క్' నెక్స్ట్ ప్లాన్ అదేనా!
విశాలమైన ఇండోనేషియా ద్వీపసమూహంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్ను మెరుగుపరచాలనే లక్ష్యంతో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్, ఇండోనేషియా హెల్త్ మినిష్టర్ 'బుడి గునాడి సాదికిన్' ఆదివారం స్పేస్ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించారు.ఇలాన్ మస్క్ (Elon Musk), ప్రాంతీయ రాజధాని డెన్పసర్లోని ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగిన ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం ప్రైవేట్ జెట్ ద్వారా ఇండోనేషియా రిసార్ట్ ద్వీపం బాలికి చేరుకున్నారు.ఇండోనేషియాలో స్టార్లింక్ సర్వీస్ అందుబాటులోకి రావడం వల్ల దేశంలోని సుదూర ప్రాంతాల్లోని లక్షలాది మంది ఇంటర్నెట్ని యాక్సెస్ చేయడానికి సహాయపడుతుందని మస్క్ పేర్కొన్నారు. తక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రదేశాలకు కనెక్టివిటీని తీసుకురావడానికి నేను చాలా సంతోషిస్తున్నానని అన్నారు. ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే ప్రజలు ఏమైనా నేర్చుకోవచ్చు.ఇండోనేషియా ప్రభుత్వం దేశంలోని గొప్ప నికెల్ వనరులను ఉపయోగించి ఈవీ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటోంది. కాబట్టి టెస్లా ఆ దేశంలో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉంది. ఇండోనేషియాలో టెస్లా తయారీ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. -
మందులకు భారీగా వ్యయం
సాక్షి,అమరావతి: వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రోగులకు సరఫరా చేసే మందుల విషయంలోనూ అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడంపై ప్రత్యేక దృష్టిసారించింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మందుల సరఫరాకే ఏకంగా రూ.2,230 కోట్లను ఖర్చుచేసింది. గ్రామాల్లోని డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలుగల మందులను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రుల్లో మందులకు తీవ్ర కటకట ఉండేది. ఆ పరిస్థితులకు చెక్ పెడుతూ సరఫరా విధానంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు, మందుల బడ్జెట్ కేటాయింపులను ప్రస్తుత ప్రభుత్వం పెంచింది. దీంతో ఆస్పత్రుల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు ఎంతో మెరుగుపడ్డాయి. రూ.200 కోట్ల నుంచి రూ.500కోట్లకు పెంపు.. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా కోసం ఏటా సుమారు రూ.200 కోట్లు మాత్రమే ఖర్చుచేసేవారు. ఆస్పత్రుల్లో రోగుల తాకిడికి సరిపడా మందుల బడ్జెట్ ఉండేది కాదు. కేవలం 229 రకాల మందులను మాత్రమే అరకొరగా సరఫరా చేసేవారు. దీంతో ఆస్పత్రుల్లో మందులకు తీవ్ర దుర్భర పరిస్థితులు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ఈ క్రమంలో.. ఆస్పత్రుల్లో మందుల కోసం బడ్జెట్ను పెంచింది. ఏటా రూ.500 కోట్ల మేర బడ్జెట్ను కేవలం మందుల సరఫరాకే వె చ్చిస్తోంది. అంతేకాక.. మందుల సంఖ్యను 608కు పెంచింది. ఇలా 2019 నుంచి ఇప్పటివరకూ కేవలం మందుల సరఫరాకే రూ.2,230 కోట్ల మేర ఖర్చుచేశారు. దీన్నిబట్టి పరిశీలిస్తే గత టీడీపీ ప్రభుత్వం కంటే రెట్టింపునకు పైగా ఈ ప్రభుత్వం మందుల కోసం ఖర్చుచేసినట్లు స్పష్టమవుతోంది. విలేజ్ క్లినిక్స్లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 172, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పీహెచ్సీలు, విలేజ్ క్లినిక్స్కు మూడు నెలలకు సరిపడా మందులను ముందే పంపిణీ చేస్తున్నారు. ఇక మిగిలిన పెద్ద ఆస్పత్రులకు అక్కడి అవసరాలకు అనుగుణంగా నిరంతరం సరఫరా చేస్తున్నారు. గ్రామ స్థాయిలోనే 105 రకాల మందులు.. ఇక గ్రామస్థాయిలోనే 105 రకాల మందులను విలేజ్ క్లినిక్స్లో అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేకూరుస్తోంది. గత టీడీపీ హయాంలో జ్వరం, దగ్గు, తలనొప్పి వస్తే డోలో, పారాసెటిమాల్ కూడా లభించని దుస్థితి గ్రామాల్లో ఉండేది. ఈ పరిస్థితులకు చెక్పెడుతూ ఏకంగా గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ రూపంలో మినీసైజ్ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. వీటిలో 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, ఏకంగా 105 రకాల మందులు ఉంటున్నాయి. దీంతో థైరాయిడ్, యాంటి థైరాయిడ్, రక్తంలో కొలె్రస్టాల్ సాంద్రతను తగ్గించే మెడిసిన్, హృదయనాళ సంబంధిత సమస్యలకు వాడే మందులు, యాంటి టీబీ మెడిసిన్, యాంటి లెప్రసీ మెడిసిన్, యాంటి ఎపిలెప్సీ మెడిసిన్, ఇతర ఔషధాలు గ్రామస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి రెండు వారాలకు ఒకసారి వైద్యులు వెళ్తున్నారు. మరోవైపు.. టెలీ మెడిసిన్ విధానంలో గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ ఫిజీషియన్ కన్సల్టేషన్లు ఇక్కడే లభిస్తున్నాయి. ఈ వైద్యుల ప్రి్రస్కిప్షన్ మేరకు విలేజ్ క్లినిక్స్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఉచితంగా ప్రజలకు మందులు అందిస్తున్నారు. -
టెక్నాలజీ ఎక్కడికి దారితీస్తుందో గానీ, మున్ముందు వైద్యమంతా ఏఐ మయమే!
మనిషి మెదడు, కృత్రిమ మేధ రెండింట్లో ఏది గొప్ప అన్న చర్చ ఇప్పటిది కాదు. ఏఐ చాట్బాట్ల రాకతో ఇది మరింత ఊపందుకుంది. ఏఐ వల్ల ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావనేది ఒక వాదన. దీనివల ఉద్యోగావకాశాలు తగ్గిపోవడమే గాక తప్పుడు సమాచారం మొదలుకుని ప్రాణహాని దాకా ఎన్నో సమస్యలు తలెత్తవచ్చనే వాదన మరొకటి. వెనకాముందూ చూసుకోని పక్షంలో అంతిమంగా కృత్రిమ మేధ మానవాళిని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకుంటుందని భయపడేవాళ్లూ ఉన్నారు. ఈ చర్చోపచర్చలతో నిమిత్తం లేకుండా ఏఐ ఇప్పటికే మన జీవితాల్లోకి పూర్తిగా చొచ్చుకొస్తోంది. కీలకమైన ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ వాడకం నానాటికీ పెరిగిపోతోంది. మున్ముందు దీని పరిణామాలెలా ఉంటాయన్నది ఆసక్తికరం... ఇప్పటికే వినియోగంలో... ఏ కంప్యూటరో, మరోటో తనకిచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకొని, పూర్తిగా విశ్లేషించి అచ్చం మనిషి మాదిరిగా ప్రతిస్పందించగలగడమే కృత్రిమ మేధ అని చెప్పుకోవచ్చు. అలా చూస్తే ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ వాడకం ఈనాటిది కాదు. గుండె పరీక్షల్లో మొదటిదైన ఈసీజీ మొదలుకుని అల్ట్రా సౌండ్, ఎకో కార్డియోగ్రఫీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరికరాల్లో ఏఐ వాడకం ఏళ్లుగా ఉన్నదే. వీటిల్లో మొత్తం ప్రక్రియను పర్యవేక్షించి రిపోర్టు జనరేట్ చేసేది ఏఐ సాయంతోనే. కంటిలోని రెటీనా ఫొటోలను చూసి సమస్యను పసిగట్టడంలో ఏఐ ఇప్పటికే కంటి డాక్టర్లతో పోటీపడుతోంది. రొమ్ము క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించడంలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. యాంజియోగ్రాం తదితర అతి సంక్లిష్టమైన వైద్య వీడియోలను కూడా సమగ్రంగా చక్కని చికిత్స మార్గాలను సూచించే దిశగా దూసుకుపోతోంది ఏఐ! మెదడులోని న్యూరాన్ల ఆధారంగా కనిపెట్టిన డీప్ లెర్నింగ్ కాన్సెప్టు ఏఐలో అత్యంత కీలకం. ఇచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకోవడంతో సరిపెట్టకుండా తన దగ్గర అప్పటికే ఉన్న సమాచారంతో క్రోడీకరించి, విశ్లేషించి, మరింత మెరుగైన, సమగ్రమైన ఫలితాలు వెల్లడించడం దీని ప్రత్యేకత. ఎన్నో ఉపయోగాలు... ► వైద్యులు–రోగి సంభాషణను, పరీక్ష ఫలితాలను బట్టి కచ్చితమైన రోగ నిర్ధారణ చాట్ జీసీటీ ఫోర్ వంటి చాట్బాట్లతో ఇప్పటికే సాధ్యపడుతోంది. ► మెడికల్ రికార్డుల నిర్వహణలో ఏఐ బాగా ఉపయోగపడనుంది. తద్వారా డాక్టర్లకు ఎంతో సమయం ఆదా చేయడమేగాక రోగి సమాచారాన్నంతా లోతుగా విశ్లేషించి సమగ్రమైన డిశ్చార్జ్ సమ్మరీని అలవోకగా అందిస్తుంది. ► డిశ్చార్జ్ సమయంలో ఇచ్చే ట్రీట్మెంట్ చార్ట్లోని మందులను గుర్తించి, వాటి సైడ్ ఎఫెక్టులు తదితరాలను రోగికి స్పష్టంగా చెబుతుంది. డ్రగ్స్ తాలూకు నెగెటివ్ ఇంటరాక్షన్పై అలర్ట్ చేయగలుగుతుంది. ► ఇన్సూరెన్స్ పేపర్లను సరిగా విశ్లేషించి క్లెయిం సులువుగా, త్వరగా జరిగేలా చూస్తుంది. మెడికల్ డిసీజ్ కోడింగ్లోనూ బాగా ఉపయోగపడుతుంది. ► వైద్య విద్యలోనైతే ఏఐ విప్లవాన్నే తేనుంది! సంక్లిష్టమైన అంశాలను బొమ్మలు, టేబుల్స్లా, చార్టుల రూపంలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పటంలో, మెడికల్ రీసర్చ్లో కీలక పాత్ర పోషించనుంది. ► రోబోటిక్ పరికరాలతో మమేకమై సంక్లిష్టమైన ఆపరేషన్లలో వైద్యులకు సహకరించనుంది. ► కోవిడ్ వంటి మహమ్మారులను ముందుగానే గుర్తించడంలోనూ ఏఐ ఉపయోగపడొచ్చు. ► టెలీ మెడిసిన్నూ ఏఐ కొత్త పుంతలు తొక్కించగలదు. రోగి ఆస్పత్రికి వచ్చే పని లేకుండానే సమస్య గుర్తింపు, వైద్యం, పర్యవేక్షణ జరిగిపోతాయి. ► కొత్త మందులను కనిపెట్టడం మొదలుకుని జన్యు అధ్యయనం ద్వారా ప్రతి వ్యక్తికీ పర్సనలైజ్డ్ మెడిసిన్ సూచించగలదు. సమస్యలూ తక్కువేమీ కాదు... ► ఆరోగ్య సమాచారం తాలూకు గోప్యత చాలా కీలకం. ఏఐతో దీనికి చాలా ముప్పుంటుంది. ► ఏఐ సలహాలు అన్నివేళలా కరెక్టుగా కాకపోవచ్చు. కొన్ని రకాల వైద్య సలహాలివ్వడంలో చాట్జీపీటీ వంటివి చిత్త భ్రాంతికి గురైనట్టు ఇప్పటికే తేలింది. అలాగని వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి వస్తే వైద్యులకు అదో అదనపు బరువుగా మారొచ్చు. ► డ్యూటీ డాక్టర్ల పనులను ఏఐ ఇప్పటికే చేసేస్తోంది. కనుక మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వంటి హెచ్చు నైపు ణ్యం అక్కర్లేని ఉపాధి అవకాశాలకైతే ఏఐ సమీప భవిష్యత్తులోనే పూర్తిగా గండి కొట్టవచ్చు. ► ప్రజారోగ్యానికి సంబంధించిన విధాన నిర్ణయాలను ఏఐ ప్రభావితం చేస్తే వాటిలో వ్యక్తి స్వేచ్ఛ వంటివాటికి ప్రాధాన్యం లేకుండా పోవచ్చు. చివరగా... ఆరోగ్య రంగంపై ఏఐ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ప్రఖ్యాత న్యూ ఇంగ్లండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ ఓ కొత్త జర్నల్నే ప్రారంభించనుంది. ఇరువైపులా పదునున్న కత్తి వంటి ఏఐని విచక్షణతో వాడుకోవాల్సిన బాధ్యత మాత్రం అంతిమంగా మనదే. -
ఉపాధి, నైపుణ్యాభివృద్ధి
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి తాలూకు ఫలాలు యువత, ఆదివాసీలతో పాటు సమాజంలో అన్ని వర్గాలకూ చేరేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మౌలిక, అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా అపారమైన ఉపాధి అవకాశాలను కల్పించడం, ఉత్పత్తి రంగ వృద్ధికి ఊతమివ్వడం, స్వాతంత్య్రానంతరం నిర్లక్ష్యానికి గురైన ఇతర రంగాల్లోనూ ఉపాధి సృష్టికి కృషి చేయడం తమ లక్ష్యమన్నారు. గుజరాత్ ప్రభుత్వం సోమవారం గాంధీనగర్లో ఏర్పాటు చేసిన రోజ్గార్ మేళాను ఉద్దేశించి మోదీ వర్చువల్గా ప్రసంగించారు. ‘‘దేశంలో రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా స్టార్టప్లు పని చేస్తున్నాయి. ఇవి ఉపాధి కల్పించమే గాక లక్షలాది మంది యువకులకు స్వయం ఉపాధి దిశగా స్ఫూర్తినిస్తున్నాయి. స్టార్టప్లకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు అవసరమైన బ్యాంకు గ్యారంటీలు కూడా అందజేస్తోంది’’ అని వివరించారు. ‘‘గుజరాత్లో గత ఐదేళ్లలో లక్షన్నర మంది యువకులకు ప్రభుత్వోద్యోగాలు లభించాయి. 2023లో మరో పాతిక వేల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి’’ అన్నారు. ఆరోగ్య రంగంలో ఆత్మనిర్భరత ఆరోగ్య రంగంలో విదేశాలపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మోదీ తెలిపారు. ఆరోగ్య, వైద్య పరిశోధనలపై బడ్జెట్ అనంతర వెబినార్నుద్దేశించి ఆయన మాట్లాడారు. వైద్య రంగానికి సంబంధించిన ఎలాంటి పరికరాలనూ, టెక్నాలజీనీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా స్వయంసమృద్ధంగా మార్చాల్సిన బాధ్యత దేశ పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలపై ఉందన్నారు. ఈ దిశగా తామిప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. స్వాతంత్య్రానంతరం చాలా ఏళ్లపాటు సమీకృత ధోరణి, దీర్ఘకాలిక విజన్ లేమి దేశ వైద్య రంగ వృద్ధికి ముందరి కాళ్ల బంధంగా ఉండేవన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని చెప్పారు. ‘‘నేను ఫార్మా మార్కెట్ రూ.4 లక్షల కోట్లకు విస్తరించింది. ప్రైవేట్ రంగం, వైద్య విద్యా రంగం మధ్య సరైన సమన్వయముంటే ఇది రూ.10 లక్షల కోట్లకు విస్తరించగలదు. కరోనా కల్లోలం సంపన్న దేశాలను కూడా అల్లాడించింది. దాని దెబ్బకు ప్రపంచమంతా ఆరోగ్యంపై దృష్టి పెడుతున్న ఈ తరుణంలో భారత్ మాత్రం మరో అడుగు ముందుకేసి వెల్నెస్పై దృష్టి పెట్టింది. మనమిప్పుడు ప్రపంచం ముందుంచిన ‘ఒక భూమి, ఒకే ఆరోగ్యం’ విజన్ అందులో భాగమే. మనుషులకే గాక జంతు, వృక్షజాలాలన్నింటికీ ఒకే తరహాలో సమగ్ర ఆరోగ్య రక్షణ కల్పించడమే దీని ఉద్దేశం. అంతేగాక ఆరోగ్య సేవలు అందుబాటు ధరల్లో ఉండేలా చూడటం కూడా మా ప్రభుత్వ ప్రాథమ్యాల్లో ఒకటి. అందుకే ఆయుష్మాన్ భారత్ పథకం కింద చేపట్టిన చర్యల ద్వారా పేద రోగులకు ఇప్పటికే రూ.80,000 కోట్లు ఆదా అయ్యాయి’’ అని చెప్పారు. మార్చి 7ను జన్ ఔషధీ దివస్ జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. 9,000 జన్ ఔషధీ కేంద్రాల వల్ల పేద, మధ్యతరగతి వారికి రూ.20 వేల కోట్ల దాకా ఆదా అయిందన్నారు. వేసవిలో జాగ్రత్త: మోదీ రానున్న వేసవిలో తీవ్ర ప్రతికూల వా తావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా ప్రజలతో పాటు వైద్య నిపుణులకు, స్థానిక సంస్థలకు సమగ్ర అవగాహన కల్పించాలని మోదీ సూచించారు. వేసవి సన్నద్ధత దిశగా చేపట్టిన చర్యలను ఆయన సారథ్యంలో ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు వివరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు ఆహార ధాన్యాల నిల్వలను ఎఫ్సీఐ వీలైనంతగా పెంచాలని మోదీ సూచించారు. వచ్చే వర్షాకాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలను మోదీ దృష్టికి తెచ్చారని ప్రధాని కార్యాలయం పేర్కొంది. -
వర్సిటీల్లో విద్యార్థుల హెల్త్రికార్డ్
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల విద్యార్థుల ఆరోగ్య రికార్డులను తయారు చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారులకు సూచించారు. గవర్నర్ అధ్యక్షతన గురువారం రాజ్భవన్లో ‘యూనియన్ బడ్జెట్ 2023–24లో ప్రతిపాదించిన ఆరోగ్యరంగ కార్యక్రమాలు, కేటా యింపులు’అనే అంశంపై వివిధ కేంద్ర వైద్యసంస్థలు, ఇతర సంస్థల అధిపతులు, ప్రతినిధులు, పలువురు డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. గవర్నర్ మాట్లాడుతూ కేంద్రబడ్జెట్–2023లో ఆరోగ్యరంగానికి భారీ కేటాయింపులతో సుస్థిర ఆరోగ్య సంరక్షణ రంగాన్ని రూపొందించడానికి మార్గం ఏర్పడిందన్నారు. కేంద్రబడ్జెట్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు రూ.89,155 కోట్లు కేటాయించడంవల్ల ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలు, సేవలను అద్భుతంగా మార్చడా నికి వీలు కలుగుతుందన్నారు. వైద్య విద్య, పారా మెడికల్ రంగం, ఆయుష్మాన్ భారత్ కోసం బడ్జెట్లో కేటాయింపులు భారీగా పెరిగాయని, దీనివల్ల ఈ పథకం కింద మరో 40 కోట్ల మందిని ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకు రావాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య పరిశోధనలకు కేటాయింపులు పెరగ డం ఆ రంగంలో నూతన ఆవిష్కరణలు పెరుగుతా యని, నాణ్యమైన పరిశోధనలకు దోహదపడుతుందని గవర్నర్ అన్నారు. నర్సింగ్ విద్యకు అంతర్జాతీయ డిమాండ్ కొత్త మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రుల ఆధునికీకరణకు రూ.6,500 కోట్లు కేటాయించారని గవర్నర్ వివరించారు. కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలు రాబోతున్నాయని, మనదేశంలో నర్సింగ్ విద్యకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ రంగం మరింత వృద్ధి చెందిందన్నారు. బడ్జెట్సహా వివిధ అంశాలపై సమావేశానికి వచ్చిన ప్రముఖులు వ్యాసాలు రాసి పంపితే వాటిని పుస్తకరూపంలో ప్రచురిస్తామని గవర్నర్ తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ ఈ దశాబ్దకాలంలో దేశంలో ఎంబీబీఎస్ సీట్లు 87 శాతం, పీజీ మెడికల్ సీట్లు 105 శాతం, మెడికల్ కాలేజీల సంఖ్య రెట్టింపు అయ్యాయన్నారు. సమావేశంలో సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందుకుమార్, జాతీయ పోషకా హార సంస్థ డైరెక్టర్ డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. -
Budget 2023: ఆరోగ్య రంగానికి బడ్జెట్ పెంచండి..!
దేశవ్యాప్తంగా ఆరోగ్య సౌకర్యాలు, మౌలిక సదుపాయాల అవసరం పెరుగుతున్నందున ఆరోగ్యరంగానికి 2023–24 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. వారి అభిప్రాయాను ఒక్కసారి పరిశీలిస్తే... న్యూఢిల్లీ కేటాయింపులు 40 శాతం పెరగాలి వరుసగా, 2021–22 – 2022–23 ఆర్థిక సంవత్సరాలను చూస్తే, ఆరోగ్య రంగం కోసం బడ్జెట్ కేటాయింపులు సుమారు 16.5 శాతం పెరిగాయి. రానున్న బడ్జెట్లో ఆరోగ్య రంగానికి నిధులు 30–40 శాతం పెరగాలి. ఆరోగ్యం పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిండానికి ప్రయత్నం జరగాలి. పాఠశాల పాఠ్యాంశాల్లో ఆరోగ్యవంతమైన జీవన ప్రాముఖ్యతను తప్పనిసరిగా చేర్చాలి. మధుమేహం, ఇతర జీవనశైలి వ్యాధులపై స్థానిక సంస్థలు, చాంబర్లు, సంఘాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వం తప్పనిసరిగా పంచాయతీ స్థాయిలో ప్రాథమిక క్లినిక్లను ఏర్పాటు చేయాలి. అవి సక్రమంగా పనిచేసేలా కూడా చూసుకోవాలి. టెలిమెడిసిన్ను సులభతరం చేయడానికి వీలుగా ఆయా క్లినిక్లను డిజిటలీకరించాలి. – సాకేత్ దాల్మియా, పీహెచ్డీసీసీఐ ప్రెసిడెంట్ రోగనిర్ధారణ వేగంగా జరగాలి ప్రస్తుత పరిస్థితుల్లో త్వరిత, ఖచ్చిత, వేగవంతమైన రోగనిర్ధారణ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన డిమాండ్. సమర్థవంతమైన ఆరోగ్య నిర్వహణ, అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రణ, రోగికి వేగవంతంగా కోలుకోవడం వంటి కీలక సానుకూలతకు దోహదపడే అంశం ఇది. ఈ దిశలో దేశంలో బహుళ–వ్యాధుల నిర్ధారణ ప్లాట్ఫారమ్లు అలాగే తక్కువ ధరలో సేవలు లభించే డయాగ్నోస్టిక్స్, వెల్నెస్ ప్రమోషన్ సెంటర్లు అవసరం. ఈ అంశాలపై రానున్న బడ్జెట్ దృష్టి సారించాలి. వెల్నెస్ పరీక్షలు, ఆయుష్ చికిత్సలను ఆరోగ్య బీమాలో కవర్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం పాలసీ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేయాలి. పరిశోధనలకు ప్రోత్సాహం, ఇందుకు తగిన నిధుల కల్పన అవసరం. దీనివల్ల ఆరోగ్య సంరక్షణ వ్యయాలు ప్రతి వ్యక్తికి సంవత్సరానికి దాదాపు రూ. 1,000 వరకూ తగ్గుతాయి. – అజయ్ పొద్దార్, సైనర్జీ ఎన్విరానిక్స్ చైర్మన్, ఎండీ ఆరోగ్య బీమాపై దృష్టి అవసరం భారత్లో హెల్త్కేర్పై తలసరి బీమా వ్యయం ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. దేశంలో 75 శాతం మందికిపైగా ప్రజలకు ఆరోగ్య బీమానే లేదు. ఈ సమస్యను ఎదుర్కొనడంపై రానున్న బడ్జెట్ దృష్టి పెట్టాలి. – సిద్ధార్థ ఘోష్, ఎన్ఎంఐఎంఎస్ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ గత రెండేళ్లలో ఇలా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023–24 వార్షిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె బడ్జెట్ రూపకల్పనపై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించడం జరిగింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు వార్షిక బడ్జెట్ కేటాయింపులు రూ.73,932 కోట్లు. 2022–23లో ఈ కేటాయింపులు దాదాపు 16.5 శాతం పెరిగి రూ.86,200 కోట్లకు చేరాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో) ఆరోగ్య రంగానికి కేటాయింపులు దాదాపు ఒక శాతంగా ఉండడం గమనార్హం. -
2022 REWIND: ఉద్యోగాల జాతర.. ఆరోగ్యానికి ఆసరా..
రాష్ట్రంలో 2022 ఏడాది ఎన్నో కీలక పరిణామాలకు సాక్షిగా నిలిచింది. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ, వైద్యారోగ్య రంగంలో కీలక పథకాలు, మార్పులతో సానుకూలతలు కనిపించగా.. పోడు భూముల వివాదం, ఉపాధ్యాయుల సమస్యలు వంటివి నిరసనలు, ఆందోళనలకు తెరలేపాయి. ఒక్క ఏడాదిలోనే ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు రావడం రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనకరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలను ఏర్పాటు చేసే అంశంలో ఈ ఏడాది ముందడుగు పడింది. రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి పెండింగ్లో ఉన్న గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో పలు రంగాల్లో 2022 తెచ్చిన ప్రత్యేకతలేమిటో చూద్దాం.. – సాక్షి, హైదరాబాద్ అడవి పెరిగింది.. ‘పోడు’గొడవ పెరిగింది! రాష్ట్రంలో పోడు భూముల సమస్య మరోసారి చర్చనీయాంశమైంది. ఈ సమస్యపై ప్రభుత్వపరంగా పరిశీలన జరుగుతున్నపుడే గొత్తికోయల చేతుల్లో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్యకు గురికావడం కలకలం రేపింది. అటవీశాఖ అధికారులు, సిబ్బందిలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పోడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కచ్చితమైన విధానాన్ని రూపొందించాలనే డిమాండ్లు వచ్చాయి. మరోవైపు తెలంగాణకు హరితహారం ఎనిమిదో ఏడాదిలోకి అడుగిడింది. ఈ ఏడాది హరితహారం లక్ష్యం 19.54 కోట్ల మొక్కలుకాగా 20.25 కోట్ల మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల రహదారుల వెంట సుమారు లక్ష కిలోమీటర్ల మేర రహదారి వనాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్గా హైదరాబాద్కు గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలో పులుల సంచారం పెరిగింది. ఆసిఫాబాద్లో ఒకరు పులి దాడిలో మృతి చెందారు. వైద్య విద్యలో రికార్డు.. ఆరోగ్యానికి తోడ్పాటు రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం 2022లో కీలక ముందడుగు వేసింది. ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వ రంగంలో ఎనిమిది మెడికల్ కాలేజీలను స్థాపించడం, తద్వారా రాష్ట్రంలో 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రావడం, తొమ్మిది జిల్లాల్లో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించే పథకాన్ని ప్రారంభించడం ప్రశంసలు పొందాయి. మిగతా జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని, సమాంతరంగా నర్సింగ్, పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక వైద్యారోగ్య మంత్రిగా హరీశ్రావు బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచింది. ఆయన ఆధ్వర్యంలో అన్ని విభాగాలపై నెలవారీ సమీక్షలు జరుగుతున్నాయి. సంస్కరణలకూ తెరలేచింది. దారిన పడిన ఆర్టీసీ దివాలా అంచుకు చేరిన ఆర్టీసీని ఈ ఏడాది చిన్న ఆలోచన మళ్లీ నిలిపింది. డీజిల్ సెస్ పేరుతో చార్జీల సవరణ చేపట్టి ఆదాయాన్ని పెంచుకుని.. నష్టాల ఊబి నుంచి కొంతమేర బయటపడింది. సెస్ల రూపంలో టికెట్ చార్జీలను పెంచి ధైర్యం చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రాకుండా పలు చర్యలు చేపట్టడం కలసివచ్చింది. ఇదే సమయంలో డిపో స్థాయి నుంచి ప్రధాన కార్యాలయం దాకా సిబ్బంది పనితీరును సమీక్షించి మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఓరియంటేషన్లు, ప్రత్యేక శిక్షణలు, స్టడీ టూర్లు, వ్యక్తిగత పనితీరు మెరుగుపడటం, 100 డేస్ చాలెంజ్, శ్రావణమాసం చాలెంజ్, దసరా పండుగ చాలెంజ్, హెల్త్ చాలెంజ్, ఫిట్నెస్ చాలెంజ్ వంటి కార్యక్రమాలతో సిబ్బంది పనితీరు సమూలంగా మారింది. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనట్టుగా 45 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. కొత్త కొలువుల జాతర.. రాష్ట్రంలో 2022 ఏడాది కొలువుల జాతరను తీసుకువచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనంతస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 80వేల మేర ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్–4 కేటగిరీలో 9 వేల కొలువులు, ఇంజనీరింగ్ విభాగాలు, ఇతర శాఖల పరిధిలో మరో 5వేల కొలువులకు ప్రకటనలు విడుదలయ్యాయి. రాష్ట్రస్థాయి పోలీస్ నియామకాల బోర్డు ద్వారా దాదాపు 17 వేల ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడ్డాయి. వైద్య విభాగాల్లోనూ ఖాళీల భర్తీ చేపట్టారు. గురుకుల విద్యా సంస్థల్లోనూ 12 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. ‘రోడ్ల’కు మంచి రోజులు తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర రహదారులకు పూర్తిస్థాయి నిర్వహణ పనులకు ఈ ఏడాదే గ్రీన్సిగ్నల్ పడింది. ఈ మేరకు ప్రభుత్వం రూ.2,500 కోట్లు మంజూరు చేసింది. కనీసం నాలుగు వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక రోడ్లు భవనాల శాఖలో ఈ ఏడాది భారీ మార్పులు జరిగాయి. కొత్తగా 472 అదనపు పోస్టులు మంజూరు చేయడంతోపాటు 3 సీఈ, 10 సర్కిల్, 13 డివిజన్, 79 సబ్డివిజన్ కార్యాలయాలను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలగిన సవాళ్లు.. కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గడంతో 2022లో విద్యా సంస్థల్లో పునరుత్తేజం కనిపించింది. అదే సమయంలో ఎన్నో సవాళ్లూ ఎదురయ్యాయి. కార్పొరేట్కు దీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దుతామంటూ ‘మన ఊరు–మనబడి’పథకాన్ని ప్రారంభించినా ఆచరణలో నిరాశే ఎదురైంది. తొలి విడతగా 9 వేలకుపైగా బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా పెట్టుకోగా 1,200 స్కూళ్లలోనే పూర్తయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లలో బదిలీలు, ప్రమోషన్లు, 317 జీవో వల్ల ఏర్పడ్డ సమస్యలపై ఉపాధ్యాయులు ఆందోళనలు చేశారు. టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అడుగు ముందుకు పడలేదు. మరోవైపు ఇంజనీరింగ్, ఇతర కోర్సుల ఫీజుల పెంపు వంటివి విద్యార్థులపై భారం వేశాయి. ఇక ఈ ఏడాది కొత్తగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడం, పలు మైనారిటీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడం పెద్ద సంఖ్యలో విద్యార్థులకు లబ్ధి చేకూర్చింది. కేంద్రంతో తప్పని ‘పంచాయితీ’! 2022 ఏడాది మొదట్లోనే కేంద్ర, రాష్ట్రాల మధ్య వివిధ అంశాలపై మొదలైన ‘పంచాయితీ’చివరికి మరింత ముదిరింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు తగ్గాయని, శాఖల వారీగా వచ్చే నిధుల జాడేలేకుండా పోయిందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. తెలంగాణ చేపట్టిన పలు పథకాలకు నిధులివ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం మొండిచేయి చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ఆరోపించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద నిబంధనలకు విరుద్ధంగా రైతు కల్లాలు నిర్మించారంటూ కేంద్రం పేర్కొనడం, అందుకు సంబంధించిన రూ.150 కోట్లను తిరిగివ్వాలని పట్టుపట్టడం అగ్నికి ఆజ్యం పోసింది. కేంద్రం తీరు సరిగా లేదని, రాష్ట్రానికి రావాల్సిన రూ.1,100 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ ధర్నాలు, నిరసనలు నిర్వహించింది. ఇక వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గింపు ఈ ఏడాదే అమల్లోకి వచ్చింది. డయాలసిస్ బాధితులకు పింఛన్ల మంజూరు కూడా మొదలైంది. ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో రాష్ట్రం సత్తా చాటింది. -
దేశ ఆరోగ్య వ్యయంలో సగం భారం ప్రజలదే
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యారోగ్య రంగంలో ఎన్ని పథకాలు తీసుకువస్తున్నా.. వైద్య సదుపాయాలు పెంచుతున్నట్టు చెప్తున్నా.. ప్రజలపై భారం మాత్రం తగ్గడం లేదు. దేశంలో ఆరోగ్యంపై జరుగుతున్న మొత్తం వ్యయంలో సగం ఖర్చును ప్రజలే సొంతంగా భరించాల్సిన పరిస్థితి ఉంది. ఇది పేద, మధ్య తరగతి వర్గాలపై మోయలేని భారంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం ఖర్చు గణనీయంగా పెరిగినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చు అవసరమైన మేర పెరగడం లేదని, ప్రజలపైనే భారం పడుతోందని స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదికలోనే.. దేశంలో రాష్ట్రాల వారీగా ఆరోగ్యంపై ప్రభుత్వాలు, ప్రజలు చేస్తున్న ఖర్చుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. 2018–19 నాటి అంచనాల ప్రకారం తయారు చేసిన ఈ నివేదికపై ఇటీవల పార్లమెంటులోనూ చర్చ జరిగింది. దాని ప్రకారం దేశంలో ఆరోగ్యంపై మొత్తంగా రూ.5,96,440 కోట్లు వ్యయం అవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి భరిస్తున్నది రూ.2,42,219 కోట్లే. అంటే సుమారు 41 శాతం మాత్రమే. అదే ప్రజలు సొంతంగా చేసిన ఖర్చులు రూ.2,87,573 కోట్లు (సుమారు 48శాతం) కావడం గమనార్హం. ఇక ప్రైవేటు ఆరోగ్య బీమా ద్వారా అందుతున్నది రూ.39,201 కోట్లు (6.57 శాతం), మిగతా సొమ్ము వివిధ స్వచ్చంద సంస్థలు, ఇతర మార్గాల ద్వారా ఆరోగ్య ఖర్చుల కోసం అందుతోంది. ప్రభుత్వాల వ్యయం పెరుగుతున్నా.. ఆరోగ్యం కోసం ప్రజలు చేస్తున్న సొంత ఖర్చు తగ్గుతోందని.. ప్రభుత్వాల వ్యయం పెరుగుతోందని కేంద్ర నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015–16లో ప్రభుత్వాల ఖర్చు సుమారు 30 శాతం వరకే ఉండగా ఇప్పుడు 41 శాతానికి చేరింది. ప్రజలు సొంతంగా చేస్తున్న ఖర్చు 62 శాతం నుంచి 48 శాతానికి తగ్గింది. ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వాల వాటా గణనీయంగా పెరగడం మంచి పరిణామమే అయినా.. సగం కూడా లేకపోవడం, మిగతా భారం ప్రజలపై పడటం సరికాదని నిపుణులు చెప్తున్నారు. మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజల ఖర్చు 10 శాతం వరకే ఉండాలని, ప్రభుత్వాలే వ్యయం పెంచాలని స్పష్టం చేస్తున్నారు. యూపీలో ఎక్కువ ఖర్చు దేశంలో ఆరోగ్యానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో రూ.78,297 కోట్లు ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నారు. మహారాష్ట్రలో రూ.66,703 కోట్లు, పశ్చిమబెంగాల్లో రూ.45,277 కోట్లు, కేరళ రూ.34,548 కోట్లు, తమిళనాడులో రూ.32,767 కోట్లు, కర్ణాటకలో రూ.32,198 కోట్లు, రాజస్థాన్లో రూ.29,905 కోట్లు, గుజరాత్లో రూ.26,812 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో రూ.25,828 కోట్లు, మధ్యప్రదేశ్లో రూ.20,725 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వాలే భరించే ఖర్చు ప్రకారం చూస్తే.. ఉత్తరాఖండ్ 61 శాతంతో టాప్లో నిలిచింది. నివేదికలో ముఖ్యాంశాలివీ.. ► దేశంలో 2018–19 సంవత్సరానికి మొత్తం ఆరోగ్య వ్యయం రూ.5,96,440 కోట్లు (ఇది జీడీపీలో 3.16 శాతం.. తలసరి ఖర్చు రూ.4,470). ► మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు రూ.2,42,219 కోట్లు (తలసరి రూ.1,815)కాగా.. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 34.3 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 65.7 శాతంగా ఉంది. ►కేంద్రం జాతీయ ఆరోగ్య మిషన్పై చేస్తున్న వ్యయం రూ.30,578 కోట్లు, డిఫెన్స్ మెడికల్ సర్వీసెస్ కింద రూ.12,852 కోట్లు, రైల్వే హెల్త్ సర్వీసెస్ రూ.4,606 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) రూ.4,060 కోట్లు, ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్కు రూ.3,226 కోట్లు, అన్ని ప్రభుత్వ ఆర్థిక ఆరోగ్య బీమా పథకాల ద్వారా ఖర్చులు కలిపి రూ.12,680 కోట్లు. ► ఆరోగ్యంపై ప్రజలు సొంతంగా చేసిన ఖర్చులు రూ.2,87,573 కోట్లు (మొత్తం ఆరోగ్య వ్యయంలో 48.21 శాతం.. తలసరిన చూస్తే రూ.2,155), ప్రైవేటు ఆరోగ్య బీమా ద్వారా అందుతున్నది రూ.39,201 కోట్లు (6.57 శాతం). ►మొత్తంగా ఆరోగ్యానికి అయ్యే ఖర్చులో రూ.93,689 కోట్లు ప్రభుత్వ ఆస్పత్రులకు, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,55,013 కోట్లు (28.69%). ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్సరీలు, కుటుంబ నియంత్రణ కేంద్రాలకు కలిపి చేసే ఖర్చు రూ.41,875 కోట్లు, ఇతర ప్రైవేట్ ప్రొవైడర్లకు (ప్రైవేట్ క్లినిక్లతో సహా) రూ.23,610 కోట్లు, పేషెంట్ ట్రాన్స్పోర్ట్, ఎమర్జెన్సీ రెస్క్యూ ప్రొవైడర్లకు రూ.18,909 కోట్లు, మెడికల్ అండ్ డయాగ్నస్టిక్ లేబొరేటరీలకు రూ.21,162 కోట్లు, ఫార్మసీలకు రూ.1,22,077 కోట్లు, ఇతర రిటైలర్లకు రూ.643 కోట్లు, ప్రివెంటివ్ కేర్ ప్రొవైడర్లకు రూ.28,841 కోట్లు, హెల్త్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్సింగ్ ప్రొవైడర్లు, ఇతర ఆరోగ్య సంరక్షణలకు దాదాపు రూ. 21,612 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరిన్ని నిధులు ఇతర అవసరాలకు ఖర్చవుతున్నాయి. ► తెలంగాణలో జీఎస్డీపీలో మొత్తం ఆరోగ్య ఖర్చు 1.8 శాతంగా ఉంది. ఇందులో ప్రభుత్వ ఖర్చు 0.7 శాతం, ప్రజలు సొంతంగా చేస్తున్న ఖర్చు 0.9 శాతం, ఆరోగ్య బీమా, ఇతర వ్యవస్థల ద్వారా 0.2శాతం ఖర్చు జరుగుతోంది. దేశంలో ఆరోగ్యంపై వ్యయం తీరు ఇలా.. (రూ.కోట్లలో) అంశం 2015–16 2016–17 2017–18 2018–19 ప్రభుత్వ ఖర్చు 1,61,863 1,88,010 2,31,104 2,42,219 ప్రజల సొంత ఖర్చు 3,20,211 3,40,196 2,76,532 2,87,573 ప్రైవేట్ బీమా కంపెనీలు 22,013 27,339 33,048 39,201 క్యూబాలో జనం సొంత ఖర్చు 8 శాతమే.. ప్రపంచంలో ఆరోగ్యంపై చేస్తున్న ఖర్చులో ప్రజలు సొంతంగా చేస్తున్నది 36 శాతమే. మన దేశంలో అది 48 శాతంగా ఉంది. అదే క్యూబా వంటి దేశంలో కేవలం 8 శాతమే. మన దేశంలో ప్రజల ఖర్చు తగ్గుతూ వస్తున్నట్టు కేంద్ర గణాంకాలు చెప్తున్నా.. ప్రభుత్వాలు భరించే మొత్తం గణనీయంగా పెరగాల్సి ఉంది. బడ్జెట్లో ఆరోగ్యానికి కేటాయింపులు పెంచడం వల్ల ప్రజల జేబు ఖర్చు తగ్గుతుంది. ప్రైవేట్ బీమా కంపెనీలు ఆరోగ్య రంగంలో భాగస్వామ్యం కావడం, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్, ఇతర ఆరోగ్య పథకాలతో ప్రయోజనం ఉంటోంది. డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ జేబు ఖర్చు 10శాతం లోపే ఉండాలి ఆరోగ్య వ్యయంపై ప్రభుత్వ లెక్కలు సరిగా లేవని అనిపిస్తోంది. మాకున్న అంచనా ప్రకారం 80శాతం ఆరోగ్య ఖర్చును ప్రజలే భరిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నా.. అది ప్రజలపై పెను భారమే. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరోగ్యంపై ప్రజలు చేస్తున్న ఖర్చు కేవలం 10 శాతమే. డెన్మార్క్, చెకోస్లావేకియా, చైనా, వియత్నాం, ఉత్తర కొరియా వంటిచోట్ల ఎక్కువగా ప్రభుత్వాలే ఖర్చు చేస్తున్నాయి. అమెరికా వంటి చోట్ల బీమా పథకాలు ఉన్నాయి. కానీ బీమా కంపెనీలు ఎక్కువ ధరలతో కూడిన మందులు ఇవ్వడానికి, ఖర్చుకు ముందుకు రావు. అమెరికాలో వస్తున్న సమస్య ఇదే. అందువల్ల దేశంలో ప్రభుత్వమే ఖర్చు పెంచాలి. – డాక్టర్ యలమంచి రవీంద్రనాథ్, ప్రముఖ వైద్యుడు, ఖమ్మం -
YSRCP Plenary: వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో హైలైట్స్
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. టీడీపీ హయాంలో హెల్త్ డిపార్ట్మెంట్ (వైద్య, ఆరోగ్య శాఖ) అప్పటి సీఎం చంద్రబాబు వెల్త్ (ఆదాయం) కోసం పనిచేస్తే.. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల వెల్నెస్ (ఆరోగ్యం) కోసం పనిచేస్తోందని చెప్పారు. బాబు వైద్య శాఖలో అవినీతిని విస్తరించారని, సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్నారని వివరించారు. చదవండి: చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తథ్యం: విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ ప్లీనరీలో శుక్రవారం వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మీద తీర్మానంపై మంత్రులు రజని, సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ చర్చించారు. మంత్రి రజని మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు వైద్య రంగంలో మార్పు తేలేకపోయారని, సీఎం వైఎస్ జగన్ మూడేళ్లలో అద్భుత మార్పు తెచ్చారని చెప్పారు. 2019 ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించి, ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన రంజక పాలన అందిస్తున్నారని చెప్పారు. ఆయన పాలనలో చేపడుతున్న కనీవినీ ఎరుగని అభివృద్ధితో 2024లోనూ ఇదే విధమైన చారిత్రక విజయాన్ని అందుకుంటారని తెలిపారు. వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో హైలైట్స్.. ♦రూ. 5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారందరికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపు. తద్వారా రాష్ట్రంలోని 85 % (1.40 కోట్ల) కుటుంబాలకు ఉచితంగా మెరుగైన వైద్యం. ♦టీడీపీ హయాంలో ఈ పథకం కింద కేవలం 1059 చికిత్సలు అందిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,446 చికిత్సలు అందుతున్నాయి. చికిత్సల సంఖ్యను ఇంకా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ♦వెఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్య పెంపు. పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం ♦గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకానికి రూ.5,171 కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలోనే రూ.5,100 కోట్లు ఖర్చు చేసింది. టీడీపీ హయాంలో రోజుకు సగటున 1500 మందికి వైద్యం అందించగా.. ఇప్పుడు రోజుకు సగటున 3 వేల మందికి పైగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం పొందుతున్నారు. ♦వైఎస్సార్సీపీ ప్రభుత్వం 104, 108 సేవలకు జీవం పోసింది. మండలానికి ఒకటి చొప్పున 104, 108 వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసింది. ♦వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 11 వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రులను బలోపేతం చేస్తోంది. ♦రూ.12 వేల కోట్లకు పైగా ఖర్చుతో రాష్ట్రంలో 16 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చంద్రబాబుకు శ్రీరామచంద్రుడితో పోలికా! పదవి కోసం సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును లోకేష్ శ్రీరామచంద్రుడితో పోల్చడం హాస్యాస్పదం. లోకేశ్ తనను తాను రాక్షసుడితో పోల్చుకుంటున్నాడు. అతను రాక్షసుడు కాదు.. కమెడియన్. మా నాయకుడు జగన్ కోసం ఏమైనా చేయడం కోసం నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. 50 శాతానికి పైగా పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్పిన నాయకుడు సీఎం జగన్. 2024లో 175కు 175 సీట్లు గెలుస్తాం. ఇందుకోసం ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. – మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ నాడు ఆరోగ్యశ్రీ ఉండి ఉంటే నా చెల్లి బతికి ఉండేది.. పుట్టుకతో ఉండే గుండె జబ్బు కారణంగా నా సోదరి 1999లో మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నా చెల్లికి మెరుగైన వైద్యం అందించలేకపోయాం. అప్పట్లో ఆరోగ్య శ్రీ పథకం ఉండి ఉంటే నా చెల్లి ప్రాణాలతో ఉండేది. 2004లో వైఎస్సార్ సీఎం అయ్యాక పేదల ఆరోగ్యానికి భరోసా ఇవ్వడం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం పథకాన్ని పూర్తిగా పక్కనపెట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్ తనయుడిగా పథకాన్ని ఊహించని రీతిలో వైఎస్ జగన్ బలోపేతం చేశారు. రాష్ట్రంలో ఉన్న 11 వైద్య కళాశాలల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు హయాంలో నిర్మించినవి కావు. టీడీపీ ప్రభుత్వ ఆస్పత్రులను నరకానికి నకళ్లుగా మార్చింది. – మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు -
విద్య, వైద్యంలో అద్భుతాలే లక్ష్యం
సిరిసిల్ల/మెట్పల్లి(కోరుట్ల): విద్య, వైద్యరంగాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మూడేళ్లలో అద్భుత ఫలితాలు సాధిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో చల్మెడ జానకీదేవి పేరుతో రూ.2కోట్లతో నిర్మించిన స్కూల్ భవనాన్ని శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలసి ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘మన ఊరు.. మన బడి’లో రూ.7,300 కోట్లతో 2,600 స్కూళ్లలో 12 రకాల వసతులు కల్పించి ఇంగ్లిష్ మీడియంగా మార్చుతున్నామని వివరించారు. ఇటీ వల అమెరికా వెళ్లినప్పుడు అనేక మంది ప్రవా సులు సొంతూళ్లలో తమ పూర్వీకుల పేరిట స్కూల్ భవనాలు కట్టించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పా రన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ (సీఎస్ ఆర్)లో భాగంగా అనేక కార్పొరేట్ సంస్థలు పేద లకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్ల డించారు. కాగా, వేములవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మధ్యమానేరు ముంపు గ్రామాల్లో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు డెక్కన్ అగ్రి రిసోర్సెస్ కంపెనీతో ఎంవోయూ పూర్తిచేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్దే విజయం రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్దే విజయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మంత్రులు ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్తో కలసి పాల్గొన్నా రు. కాంగ్రెస్కు కుల, బీజేపీకి మత రాజకీయాలు చేయడం తప్ప అభివృద్ధిపై వాటికి చిత్తశుద్ధి లేదని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ చిల్లర మాటలతో గల్ఫ్ దేశాల్లోని లక్షలాది మంది భారతీయుల జీవి తాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. కాగా, మెట్లచి ట్టాపూర్లో రూ.160 కోట్ల పెట్టుబడితో ధాత్రి, రూ.1,060 కోట్ల పెట్టుబడితో భువి బయో సంస్థలు ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోరుట్ల లో వీఫై ఐటీ సంస్థ ఏర్పాటు చేసే కాల్సెంటర్ ఒప్పందపత్రాలను యజమానులకు అందజేశారు. -
Telangana: త్వరలో 13వేల పోస్టులు భర్తీ
సాక్షి,మణికొండ(హైదరాబాద్): దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఏటా రూ.11 వేల కోట్లు ప్రజల ఆరోగ్యానికి ఖర్చుచేస్తున్నామని వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు చెప్పారు. ప్రజలకు సమీపంలోనే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి వారి సుస్తీని తొలగిస్తున్నామన్నారు. వైద్యరంగంలో ఖాళీగా ఉన్న 13 వేల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. బుధవారం ఆయన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి నార్సింగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో టీ–డయాగ్నొస్టిక్స్ మినీ హబ్, టీ–డయాగ్నొస్టిక్మొబైల్యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లో బస్తీ దవాఖానా, ఆరోగ్య పరీక్షా కేంద్రాలను కనుక్కునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యను తొలగించేందుకే మొబైల్యాప్ను రూపొందించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పనితీరును మెరుగుపర్చేందుకూ యాప్ ద్వారా ప్రజలు ఫిర్యాదులు చేయొచ్చని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రికార్డులను భద్రపరిచే వ్యవస్థను ప్రస్తుతం సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రారంభించామని, రాబోయే రోజుల్లో దీన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని తెలిపారు. నిమ్స్లో మరో 2వేల బెడ్లతో.. రాష్ట్రంలో బ్రిటిష్వారు కట్టిన గాంధీ ఆసుపత్రి, నిజాం నవాబులు కట్టిన ఉస్మానియా ఆసుపత్రులు మాత్రమే గతంలో ఉండేవని ప్రస్తుతం హైదరాబాద్ నలువైపులా 4 సూపర్స్పెషాలిటీ ఆసుపత్రులను రూ.1,200 కోట్లతో నిర్మిస్తున్నామని హరీశ్రావు చెప్పారు. వాటిల్లో 4వేల బెడ్లతోపాటు నిమ్స్లో మరో 2వేల బెడ్లను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. 7లక్షల చదరపు అడుగులతో కొత్త భవనం నిర్మించి గచ్చిబౌలిలోని టిమ్స్ను 2వేల పడకల ఆసుపత్రిగా మారుస్తామని తెలిపారు. ప్రస్తుతం టీ–డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారని, త్వరలో వాటిని 134కు పెంచుతామని ప్రకటించారు. విద్య, వైద్యానికి పెద్దపీట: మంత్రి సబితారెడ్డి పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, వారు జబ్బు చేస్తే చూపించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం భారీగా నిధులను కేటాయిస్తోందని మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోనూ త్వర లో బస్తీ దవాఖానాలుఏర్పాటు చేస్తామన్నారు. చదవండి: దక్షిణ డిస్కంలో తొలి లైన్ఉమెన్గా శిరీష -
ఆరోగ్యానికి రూ.64 వేల కోట్లు
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగం బలోపేతానికి రూ.64 వేల కోట్లతో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ వారణాశిలో ప్రారంభించారు. భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను ఎదుర్కోవడానికి, ఆరోగ్య రంగంలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా ఈ పథకం తీసుకొచ్చారు. నాలుగేళ్లలో గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టనుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్లో తొమ్మిది వైద్య కళాశాలలను కూడా ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్ధ నగర్, వారణాశిలలోలు పర్యటించిన ప్రధాని మోదీ ఆరోగ్య రంగంపై కేంద్రం తీసుకోబోతున్న చర్యలు వివరించారు. ‘‘ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెంచడం అనేది దశాబ్దాల క్రితమే జరిగి ఉండాల్సింది’’ అని వారణాశిలో మోదీ వ్యాఖ్యానించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ఆరోగ్య రంగంలో ఉన్న అంతరాలను తగ్గిస్తుందని అన్నారు. ‘‘మా కన్నా ముందు అధికారంలో ఉన్న వారు ఆరోగ్య సేవలను డబ్బు సంపాదనకు, కుంభకోణాలకు ఓ సాధనంగా వినియోగించుకున్నారు. గతంలో ప్రజల సొమ్ము కుంభకోణాల్లోకి వెళ్లేది... ఇప్పుడా సొమ్ము పెద్ద ప్రాజెక్టులకు వినియోగపడుతోంది. ఎన్డీయే ప్రభుత్వం వైద్య, ఆరోగ్య సదుపాయాలపై దూకుడు విధానం అవలంభిస్తాం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం ప్రభుత్వంలో ఉండి కూడా వారు వైద్య రంగం సర్వతోముఖాభివృద్ధికి పాటుపడలేదని మోదీ విమర్శించారు. గ్రామాల్లో సరిపడా ఆసుపత్రులు లేవు, ఒక వేళ ఆసుపత్రులు ఉంటే వాటిలో వైద్యులు ఉండేవారు కాదన్నారు. ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల సదుపాయాలు లేవని... ఆయా సమస్యలన్నింటినీ ఈ మిషన్ పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. ఈ మిషన్ దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, మహమ్మారులను ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని, ఆరోగ్య రంగానికి మరింత ఆత్మవిశ్వాసం అందిస్తుందన్నారు. ఆరోగ్య రంగం బలోపేతం వల్ల ఉపాధి అవకాశాలు మరింత మెరుగవతాయన్నారు. సదుపాయాలన్నీ ఉన్న ఓ ఆసుపత్రి ఏర్పాటు వల్ల సమీప పట్టణంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. ఈ సందర్భంగా వారణాశిలో రూ.5,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా పది కీలక రాష్ట్రాల్లోని 17,788 గ్రామీణ ఆరోగ్య, వెల్నెస్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచనున్నారు. దీంతోపాటు 11,024 అర్బన్ హెల్త్, వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.. -
ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మసీ కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో భారత్ ఆరోగ్య రంగంలో ఎనలేని పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామి నాథన్ ప్రశంసించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మసీ కేంద్రంగా అవతరించిందని అన్నారు. ఎన్డీటీవీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆది వారం ఆన్లైన్ ద్వారా ఆమె పాల్గొన్నారు. పోలియో నిర్మూలన, మాతా శిశు సంరక్షణ కోసం వేసే వ్యాక్సిన్ల ద్వారా భారత్ ఆరోగ్య రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిందని కొనియా డారు. అయితే కరోనా దెబ్బతో ఇతర అనారోగ్య సమస్యలకు భారత్ సహా ఇతర దేశాల్లో కూడా చికిత్స దొరకక పోవడం విచారకరమని అన్నారు. భారత్లో పౌష్టికాహార లోపంతో అయిదేళ్ల లోపు చిన్నారులు అధికంగా మృత్యువాత పడుతున్నారని యూనిసెఫ్ నివేదికను ప్రస్తావించిన ఆమె కరోనా ఈ దుస్థితిని మరింత తీవ్రం చేసిందని అన్నారు. కరోనా సంక్షోభంతో భారత్ సహా చాలా దేశాల్లో పేదరికం పెరిగిపోయిందని, పౌష్టికాహారం లభిం చక ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయన్నారు. -
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ షురూ
న్యూఢిల్లీ: దేశ పౌరుల ఆరోగ్య సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించనుంది. ఇందులోభాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’కు శ్రీకారం చుట్టింది. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక చర్యలకు నడుం బిగించామని డిజిటల్ మిషన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. డిజిటల్ మిషన్లో భాగంగా పౌరులకు డిజిటల్ హెల్త్ ఐడీ కార్డును జారీచేయనున్నారు. గతంలో పోల్చితే సాంకేతికతను ఆరోగ్యరంగానికి మరింతగా జోడించడంతో సత్వర వైద్యసేవలు పెరిగాయని మోదీ అన్నారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీపీఎంజేఏవై) మూడో వార్షికోత్సవం రోజునే ఈ కార్యక్రమం మొదలవడం విశేషం. పీఎంజేఏవై కింద పేదలకు రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. పీఎంజేఏవై కింద 2 కోట్ల మంది ఇప్పటికే ఉచితంగా పలు వ్యాధులకు చికిత్స తీసుకున్నారని మోదీ చెప్పారు. డిజిటల్ హెల్త్ ఐడీ కార్డుతో ప్రయోజనాలు.. వ్యక్తి ఆధార్ కార్డు లేదా మొబైల్ నంబర్ను ఉపయోగించి 14 అంకెలు ఉండే డిజిటల్ హెల్త్ ఐడెంటిఫికేషన్(ఐడీ) నంబర్ కేటాయిస్తారు. ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలు, గత మెడికల్ రిపోర్టులు, కుటుంబ వివరాలు, ఉండే ప్రాంతం, చిరునామా తదితరాలను తీసుకుంటారు. కార్డులో పౌరుల ఆరోగ్య చరిత్ర నిక్షిప్తమై ఉంటుంది. వ్యక్తికి హఠాత్తుగా ఆరోగ్య సమస్య ఎదురైతే తోడుగా ఆస్పత్రికి హెల్త్ కార్డు తీసుకెళ్తే హెల్త్ హిస్టరీ సాయంతో సరైన చికిత్స సకాలంలో పొందే అవకాశాలు బాగా మెరుగుపడతాయి. దీంతో వేరే ప్రాంతాల, వేరే రాష్ట్రాల పౌరులకూ చికిత్స చేయడం అక్కడి వైద్యులకు సులభం అవుతుంది. పేద, మధ్య తరగతి వర్గాలకు సైతం ఈ సౌకర్యం ఎంతో ప్రయోజనకరం. ఖాతా వివరాలను ఒక మొబైల్ అప్లికేషన్తో అనుసంధానిస్తారు. హెల్త్కేర్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ, హెల్త్కేర్ ఫెసిలిటీస్ రిజిస్ట్రీస్గా దీనిని పిలుస్తారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఏ) తరహాలో యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్(యూహెచ్ఐ)ను ఈ వ్యవస్థలో వాడనున్నారు. వైద్యులు, వైద్యశాలలు, డయాగ్నస్టిక్ ల్యాబ్, ఫార్మసీలు యూహెచ్ఐ ద్వారా రోగుల గత రిపోర్ట్లను తీసుకుంటాయి. తద్వారా సత్వర వైద్య సేవలు అందిస్తాయి. దేశంలో ఎంత మంది ఏ విధమైన వ్యాధులతో బాధపడుతున్నారో తెలిస్తే.. ప్రభుత్వం సైతం తగు విధంగా విధానపర ‘ఆరోగ్య’ నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. టెలీ మెడిసన్ వంటి సదుపాయాలు ఈ హెల్త్ కార్డు ద్వారా సులభంగా పొందొచ్చు. దీంతో టెలీ మెడిసిన్ వ్యవస్థ మరింతగా విస్తరించనుంది. -
గిరిజన ప్రాంతాల్లో ఏం వసతులు కల్పించారు?
సాక్షి, హైదరాబాద్: గిరిజన సలహా మండలి తీర్మానాలను 2013 నుంచి ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకున్న చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. గిరిజన ప్రాంతాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, కనీసవసతులు కూడా కల్పించడం లేదంటూ ఆదివాసి సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు పి.శ్రీనివాస్ దాఖ లు చేసిన ప్రజాహిత వ్యాజ్యా న్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిల ధర్మాసనం ఇటీవల విచారించింది. ‘గిరిజనులకు రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని అమలు చేయడం లేదు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయడం లేదు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు కనీసం వైద్యం అందడం లేదు. ప్రాథమిక వైద్యం కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్లు లేవు. విద్యుత్, రవాణా వంటి కనీస సదుపాయాల కల్పనలోనూ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. జీవనోపాధి కోసం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లోకి అటవీ, పోలీస్ అధికారులు వెళ్లి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గిరిజన సలహా మండలి 2013 నుంచి అనేక సిఫార్సులు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు’ అని పిటిషనర్ తరఫున న్యాయ వాది పీవీ రమణ వాదనలు వినిపించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేప ట్టామని, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫు స్పెషల్ జీపీ హరీందర్ నివేదించారు. తదుపరి విచారణను కోర్టు నవంబర్ 10కి వాయిదా వేసింది. -
కొరతలతో రోగుల కలత
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న ఊరట లేకుండా బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్లు పంజా విసరటం మొదలైంది. కరోనా వైరస్ కేసులతో పోలిస్తే ఇవి తక్కువైనా అన్ని రాష్ట్రాల్లోనూ వీటి జాడ కనబడటం ఆందోళన కలిగించే అంశం. ఇంతవరకూ 12,000కు పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఇవింకా పెరిగే అవకాశం కూడా వుందని నిపుణులు చెబుతున్న మాటలు దడ పుట్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఒక రోగికి ఎండోస్కోపీ చేసినప్పుడు అతనిలో ఈ మూడు రకాల ఫంగస్లూ వున్నట్టు తేలింది. చివరకు ఆయన మరణించాడు. నిపుణులంటున్నట్టు ఈ ఫంగస్లు అంటువ్యాధులు కావచ్చు...కాకపోవచ్చు. దీనిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. కానీ వీటి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మహమ్మారిగా గుర్తించారు. కరోనా అరికట్టడానికి రోగులపై మోతాదుకు మించి వాడిన స్టెరాయిడ్లవల్ల ఈ ఫంగస్లు పుట్టుకొస్తు న్నట్టు గుర్తించారు. ఫంగస్ల నియంత్రణకు అనుసరించాల్సిన విధానాలు తదితరాలపై ఇప్పటికే వైద్యులకు అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో ఇది ఎక్కువున్నట్టు తెలుసు కున్నారు. కానీ విషాదమేమంటే చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో వుండటం లేదు. ఈ నెల 19నాడే ఢిల్లీ హైకోర్టు ఈ పరిస్థితిని గుర్తించి ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాయో గాలించి, ఆ మందులు తక్షణం అందుబాటులో వుండేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటికే వాటిని ఉత్పత్తి చేసే సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని, ప్రపంచ మార్కెట్లో కూడా కేంద్రం కొనుగోలు చేయడానికి సిద్ధంగా వున్నదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం వారణాసిలోని ఆరోగ్య సిబ్బందినుద్దేశించి జరిపిన ఆన్లైన్ సమావేశంలో ఫంగస్ ఇన్ఫెక్షన్లపై ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఏం ప్రయోజనం? పది రోజలు గడుస్తున్నా ఢిల్లీలో ఈ వ్యాధిగ్రస్తులకు ఎక్కడా మందులు దొరకటం లేదు. అక్కడే కాదు...మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి వుంది. వ్యాపారులు డబ్బు చేసుకోవడానికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఫిర్యాదులొస్తున్నా పట్టించుకునేవారు కరువ య్యారు. ఈ విషయంలో కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మొదలుకొని విపక్షా లన్నీ కోరాయి. కానీ ఫలితం లేదని, పది రోజుల తర్వాత కూడా పరిస్థితి యధాతథంగా వున్న దని ప్రధాన నగరాల్లోని ఆసుపత్రుల్లో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనిస్తే అర్థమవు తుంది. ఆంధ్రప్రదేశ్ ఈ ఫంగస్ కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నట్టు వెనువెంటనే ప్రకటిం చింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా వెనకబడే వున్నాయి. కరోనా అయినా, దాని పర్యవసానంగా వస్తున్న ఫంగస్ వ్యాధులైనా ఎలా వ్యాపించాయి.. కారకులెవరు అనే ప్రశ్నలు ఇంకా తేలవలసివుంది. కనీసం మందుల లభ్యత విషయంలోనైనా కేంద్రం అప్రమత్తంగా లేకపోవటం...న్యాయస్థానాలు ఆదేశించినా ఫలితం లేకపోవటం దిగ్భ్రాంతికరం. మొన్నటి వరకూ ఆక్సిజన్ కొరతతో సతమతమైన రోగులు ఇప్పుడు ఈ ఫంగస్ నివారణకు మందులు దొరక్క అల్లాడుతున్నారు. ఢిల్లీలో ఒక ప్రభుత్వాసుపత్రికి రోజుకు 3,000 ఇంజక్షన్లు కావాల్సివుండగా కేవలం 350 మాత్రమే వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా వున్నదో గ్రహించవచ్చు. ఢిల్లీ ఆసుపత్రులకు వారానికి 30,000 అవసరమైతే 3,850 మాత్రమే వస్తున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. శ్రీనగర్ వంటిచోట్ల ఈ ఫంగస్లకు సరైన చికిత్స అందించేవారు లేకపోవటంతో అక్కడివారు ఎంత దూరమైనా లక్ష్యపెట్టక మహా రాష్ట్ర, గుజరాత్ వంటిచోట్లకు రావాల్సివస్తోంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా దేశ పౌరులు ఇలాంటి దుస్థితిలో వుండటం మనకు అప్రదిష్ట తెస్తుందన్న ఇంగిత జ్ఞానం కూడా పాలకులకు లేకుండాపోతోంది. పంటి నొప్పితో మొదలై సైనస్గా మారి, ఆ తర్వాత నోటికి, కనుబొమలకు వ్యాపించి, చివరకు కళ్లనూ, మెదడునూ కూడా దెబ్బతీసి ప్రాణాలు హరిస్తున్న ఈ ఫంగస్లకు చెందిన మందులు అందుబాటులో వుంచాలని గుర్తించకపోవటం విచారకరం. ఒకవైపు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా వెల్లడవుతున్న ప్రతి ఒక్క కేసుకూ, బయటపడని 23 కేసులుండొచ్చని నీతి ఆయోగ్ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్ఫెక్షన్లు వున్నా పరీక్షల్లో బయటపడని స్థితి. ఒకపక్క కరోనా వైరస్ జనం ప్రాణాలతో ఆటలాడుతుంటే... వ్యాక్సిన్ల కొరత, మందుల కొరత జనంలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ఫంగస్లకు ఇస్తున్న ఇంజెక్షన్లు కూడా మోతాదు మించితే ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మొదలుకొని రాష్ట్రాల్లో ఆ శాఖను చూసేవారి వరకూ అందరూ చురుగ్గా స్పందించాలి. ఎలాంటి లోటుపాట్లకూ తావు లేకుండా చూడాలి. తగినంతమంది నిపుణుల్ని అందుబాటులో వుండేలా చూసుకోవాలి. అదే సమయంలో ఇంజెక్షన్ల వాడకం హేతుబద్ధంగా వుండేట్టు తగిన మార్గదర్శకాలు రూపొందించాలి. కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి నిర్దిష్టమైన ప్రోటోకాల్ కొరవడటం వల్లే ఈ ప్రమాదకర మైన ఫంగస్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు వీటి విషయంలో కూడా నిర్లక్ష్యంగా వుంటే మరేం జరుగుతుందో అనూహ్యం. అందుకే మందులు అందుబాటులో వుండేలా చూడటంతోపాటు రోగులకు ఉచిత చికిత్స అందేందుకు ప్రభుత్వాలన్నీ తగిన చర్యలు తీసుకోవాలి. -
AP Budget 2021: ఆరోగ్యశ్రీ పథకానికి రూ.2,258 కోట్లు
సాక్షి, అమరావతి: ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం ఆరోగ్య రంగానికి రూ.9,426.49 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఈ మొత్తాన్ని రూ.13,830.44 కోట్లకు పెంచింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, 104, 108 పథకాలకు నిధుల కొరత లేకుండా కేటాయింపులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నాడు నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధి పనులకు రూ.1,535 కోట్లు కేటాయించింది. వైద్యవిధాన పరిషత్కు గతేడాది కంటే రూ.77.32 కోట్లు ఎక్కువగా ఇచ్చింది. తొలిసారిగా బడ్జెట్లో కోవిడ్ టీకా కోసం రూ.500 కోట్లు, కోవిడ్ నియంత్రణకు రూ.500 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆరోగ్య రంగానికి బడ్జెట్లో 4,403.95 కోట్లు అధికంగా కేటాయించడం విశేషం. పేద రోగులకు భరోసా పేద రోగులకు భరోసానిస్తూ 2,400 జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చడంతోపాటు దేశంలోనే మొదటిసారిగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత రాష్ట్రానిది. అంతేకాకుండా రెండ్రోజుల క్రితమే ఖరీదైన బ్లాక్ ఫంగస్ చికిత్సనూ ఆరోగ్యశ్రీలో చేర్చారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉచిత చికిత్సకు అవకాశం కల్పిస్తున్న ఈ పథకానికి ఈ ఏడాది రూ.2,258.94 కోట్లు కేటాయించింది. రూ.5 లక్షల వార్షికాదాయంలోపు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,088 కొత్త అంబులెన్సు (108, 104)లను కొనుగోలు చేసిన ఘనత ప్రభుత్వానిది. ఇప్పుడు ప్రతి మండలానికి 108, 104 వాహనాలు ఉన్నాయి. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో 108 అంబులెన్సులు అద్భుతమైన సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణుల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 104 వాహనాలు ఇంటి వద్దకే వెళ్లి మందులిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాలకు కలిపి బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించారు. చదవండి: ప్రాణం విలువ తెలిసిన వాడిని: సీఎం జగన్ -
AP Budget 2021: కోవిడ్పై పోరుకు రూ.1000 కోట్లు
సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కోవిడ్ కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా మహమ్మారిపై పోరు కోసం బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక బడ్జెట్లో ఆరోగ్య రంగానికి మొత్తం 13,840.44 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు.. ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు.. కోవిడ్పై పోరాటానికి రూ.1000 కోట్లు.. ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్కు రూ.100 కోట్లు.. శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్ల చెప్పున కేటాయించింది. -
ఆరోగ్య రంగం.. హైదరాబాద్కు 5వ స్థానం
న్యూఢిల్లీ: ఆరోగ్య మౌలిక సదుపాయాల విషయంలో దేశంలోని ఎనిమిది అతిపెద్ద పట్టణాల్లో పుణె ముందుంది. ప్రధాన పట్టణాల్లో ఆరోగ్య సదుపాయాలను విశ్లేషిస్తూ హౌసింగ్ డాట్ కామ్ పోర్టల్ ‘భారత్లో ఆరోగ్యరంగ స్థితి’ పేరుతో ఒక నివేదికను బుధవారం విడుదల చేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్, కోల్కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె పట్టణాల్లోని ఆరోగ్య సదుపాయాలను ఈ నివేదికలో విశ్లేషించి ర్యాంకులను కేటాయించింది. ప్రతీ 1,000 మంది ప్రజలకు ఎన్ని ఆస్పత్రుల పడకలు అందుబాటులో ఉన్నాయి, గాలి, నీటి నాణ్యత, పారిశుద్ధ్యం, నివాసయోగ్యతా సూచీ తదితర అంశాల ఆధారంగా పట్టణాలకు ర్యాంకులను కేటాయించింది. 40 శాతం స్కోర్ను ఒక్క ఆస్పత్రుల్లోని పడకల ఆధారంగానే నిర్ణయించింది. అహ్మదాబాద్, బెంగళూరు రెండు, మూడో స్థానాల్లో నిలవగా.. ముంబై ఎంఎంఆర్, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ఢిల్లీ ఎన్సీఆర్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రతీ వెయ్యి మందికి 3.5 పడకలు ఆరోగ్య మౌలిక సదుపాయాల విషయంలో పుణె దేశంలోనే మెరుగ్గా ఉంది. ‘‘పుణెలో ప్రతీ వెయ్యి మంది ప్రజలకు 3.5 పడకలు అందుబాటులో ఉన్నాయి. భారత జాతీయ సగటుతో పోలిస్తే ఇది ఎంతో అధికం. జాతీయ స్థాయిలో కేవలం ప్రభుత్వరంగంలోని ఆరోగ్య సంరక్షణ సదుపాయాలనే పరిగ ణనలోకి తీసుకుంటే ప్రతీ వెయ్యి మందికి సగటున ఒక్క పడక కూడా లేదు. అర పడకే అందుబాటులో ఉంది. అదే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కలిపి చూస్తే 1.4 పడకలు ఉన్నాయి. అదే ప్రపంచ సగటు 3.2 పడకలుగా ఉంది’’ అని హౌసింగ్ డాట్ కామ్ తెలిపింది. నివాస అనుకూలత, నీటి నాణ్యత, స్థానిక ప్రభుత్వాలు చేపట్టిన చర్యల పరంగా చూస్తే పుణె ఎక్కువ స్కోరు సంపాదించింది. రెండో స్థానంలో ఉన్న అహ్మదాబాద్లో 1,000 మంది ప్రజలకు 3.2 ఆస్పత్రి పడకల లభ్యత ఉంది. బెంగళూరులో భిన్నం బెంగళూరు నగరం కొన్ని అంశాల్లో మెరుగ్గాను.. అదే సమయంలో మరికొన్ని అంశాల్లో దారుణంగాను ఉంది. ఆస్పత్రి పడకల లభ్యత, నివాస సౌలభ్యం విషయంలో మెరుగ్గా ఉంటే.. వాయు నాణ్యత, నీటి నాణ్యత, నీటి లభ్యత, మున్సిపల్ పనితీరు అంశాల వల్ల మూడో ర్యాంకుకు పరిమి తం అయింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండడం తెలిసిందే. దీనికితోడు నీటి నాణ్యత, పారిశుద్ధ్యం పనితీరు దారుణంగా ఉండడం వల్ల జాబితాలో అట్టడుగు స్థానా నికి పరిమితం అయింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఢిల్లీతోపాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ఉన్నాయి. ఆరోగ్యానికి కేటాయింపులు భారీగా పెంచాలి ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఆరోగ్యసంరక్షణపై వ్యయాలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక అభిప్రాయపడింది. హైదరాబాద్లో గాలి నాణ్యత మెరుగు భాగ్యనగరంలో ఆస్పత్రి పడకలు తక్కువగా ఉన్నప్పటికీ.. వాయు నాణ్యత, పారిశుద్ధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ అంశాల్లో మెరుగైన స్కోరు సంపాదించింది. నగరంలోనూ ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు ఎక్కువగా పశ్చిమ, సెంట్రల్ సబర్బన్ ప్రాంతాల్లోనే కేంద్రీకృమైనట్టు నివేదిక పేర్కొంది. ‘‘భారీగా పెరిగిపోతున్న నగర జనాభా కారణంగా నీటి సరఫరాపై ఒత్తిడి పెరిగుతోంది. సరఫరా మించి డిమాండ్ ఉండడంతో నీటికి కొరత ఏర్పడు తోంది’’ అని తెలియజేసింది. నివాస సౌలభ్యం విషయంలో హైదరాబాద్కు తక్కువ స్కోరును, ఆస్పత్రి పడకలు, మున్సిపల్ పనితీరు అంశాల్లో మధ్యస్థ స్కోరును కేటాయించింది. -
2021లో భారత్ వృద్ధి 12.5 శాతం!
వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ 2021లో భారీగా 12.5 శాతం పురోగమిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ఇదే జరిగితే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను భారత్ తిరిగి సాధించగలుగుతుంది. కాగా 2022లో భారత్ వృద్ధి 6.9 శాతంగా ఉంటుందని పేర్కొంది. కోవిడ్–19 మహమ్మారి సవాళ్లలోనూ 2020లో వృద్ధి సాధించిన పెద్ద ఎకానమీగా చైనా నిలబడిన సంగతి తెలిసిందే. 2020లో భారత్ ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం క్షీణించగా, చైనా 2.3 శాతం వృద్ధి సాధించింది. 2021లో ఆ దేశం 8.6%, 2022లో 5.6 శాతం పురోగతి సాధిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచబ్యాంక్తో కలిసి త్వరలో వార్షిక ‘స్పింగ్’ సమావేశాలు నిర్వహించనున్న బహుళజాతి బ్యాకింగ్ దిగ్గజం– ఐఎంఎఫ్ తాజాగా వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ను ఆవిష్కరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 6 శాతం వృద్ధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గత అంచనాలను ఐఎంఎఫ్ మెరుగుపరచింది. 2020లో 3.3 శాతం క్షీణించిన గ్లోబల్ ఎకానమీ.. 2021, 2022లో వరుసగా 6 శాతం, 4.4 శాతం పురోగమిస్తుందని అంచనావేసింది. 2020 అక్టోబర్ నివేదికతో పోల్చితే 2020కి సంబందించి క్షీణత అవుట్లుక్ 1.1 శాతం మెరుగుపరచింది. 2020 చివరి ఆరు నెలల్లో పలు దేశాల్లో కఠిన లాక్డౌన్ ఆంక్షలు సడలించడం దీనికి కారణమని తాజా అవుట్లుక్ వివరించింది. లాక్డౌన్ ఆంక్షలు తగ్గడం వల్ల ఆర్థికరంగం క్రియాశీలత అంచనాలకు మించి మెరుగుపడిందని తెలిపింది. దీనికి అనుగుణంగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను 2021, 2022ల్లో వరుసగా గతంకన్నా 0.8 శాతం, 0.2 శాతం మెరుగుపడినట్లు వివరించింది. చదవండి: (అదానీ గ్రూప్ సరికొత్త రికార్డ్) ఆరోగ్యరంగంపై భారీ వ్యయాలు అవుట్లుక్లోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు ద్రవ్యపరమైన మద్దతుకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. పర్యాటక రంగమూ మెరుగుపడలేదు. ప్రస్తుతం ఆరోగ్య రంగంపై అధిక వ్యయాలు చేయాలి. హెల్త్కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడాలి. కోవిడ్–19 ప్రభావానికి గురైన కుటుంబాలు అలాగే సంస్థలకు ద్రవ్యపరమైన మద్దతు అవసరం. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్న దేశాల్లో సరళతర ద్రవ్య విధానాలను కొనసాగించాలి. ప్రతి దేశం ఫైనాన్షియల్ స్థిరత్వానికి తగిన చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలి. సంక్షోభం ఒక్కసారి ముగిసిన వెంటనే, రికవరీ వేగవంతం, ఉత్పత్తి పెంపుసహా ఆర్థిక వ్యవస్థల పటిష్ట పునర్నిర్మాణానికి తగిన ముందస్తు చర్యలను, వ్యూహాలను ప్రభుత్వాలు సిద్ధం చేసుకోవాలి. పర్యావరణ అనుకూలమైన పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాతావరణ మార్పుల ప్రతికూలతలను తద్వారా నివారించుకోవచ్చు. ఉత్పాదక సామర్థ్యాన్ని మెరుగుపరచుకోడానికి డిజిటల్ ఇన్ఫ్రాపై పెట్టుబడులను పెంచాలి. అసమానతలను తగ్గించడానికి సామాజిక సహాయ సహకారాలను పటిష్టం చేసుకోవాలి. సవాళ్లు పొంచి ఉన్నాయ్.. అటు అంతర్జాతీయంగా, ఇటు వివిధ దేశాల్లో అంతర్గతంగా రికవరీ వేగం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న దశలో ఈ అవుట్లుక్ను విడుదల చేస్తున్నాం. ఇంకా మనం వైరస్ను ఓడించలేదన్న విషయాన్ని గమనించాలి. పైగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లే ఎక్కువ ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే తాజా అవుట్లుక్ను విడుదల చేస్తున్నాం. – గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ నెల లాక్డౌన్తో జీడీపీ నష్టం 2 శాతం: బీఓఎఫ్ఏ భారత్ ఎకానమీ రికవరీ ఇంకా విస్తృత ప్రాతిపదికన పటిష్టంగా లేదని అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఏ) సెక్యూరిటీస్ మంగళవారం హెచ్చరించింది. పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి భారత్ నెలపాటు లాక్డౌన్ విధిస్తే, ఎకానమీ 1 నుంచి 2 శాతం వరకూ పతనం అవుతుందని అంచనావేసింది. పూర్తి స్థాయి లాక్డౌన్ను తిరిగి ప్రకటించనప్పటికీ, రాత్రి పూట కర్ఫ్యూలు, స్థానిక లాక్డౌన్ విధింపు ద్వారా కరోనా సెకండ్ వేవ్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇది కూడా ఎకానమీపై ప్రతికూలత చూపే అంశమేనని తెలిపింది. 2021–22లో భారత్ ఎకానమీ 9% వృద్ధి రేటును నమోదుచేసుకోవచ్చని అంచనావేసిన సంస్థ, దీనికి ప్రధాన కారణాల్లో బేస్ ఎఫెక్ట్ (2020–21లో అతి తక్కువ ఎకానమీ గణాంకాలు) ఒకటని తెలిపింది. సెకండ్వేవ్తో జీడీపీ నష్టం 0.3 శాతమే: యూబీఎస్ కోవిడ్–19 కేసులు ఫిబ్రవరి నుంచీ తిరిగి పెరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా లేదా రాష్ట్రాల వ్యాప్తంగా కఠిన లాక్డౌన్ విధింపు మరోసారి ఉండబోదన్న అభిప్రాయాన్ని స్విస్ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో వైరస్ సెకండ్వేవ్ సమస్య ఉన్నప్పటికీ, దీని ప్రతికూల ప్రభావం ఎకానమీపై 20 నుంచి 30 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర మాత్రమే ఉంటుందని యూబీఎస్ విశ్లేషించింది. 2021–22లో భారత్ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం పురోగమిస్తుందన్న తమ సంస్థ అభిప్రాయంలో మార్పులేదని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ తన్వీ గుప్తా జైన్ మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్య పరపతి విధానం దాదాపు యథాతథంగా కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. అయితే రివర్స్ రెపో రేటు 25–40 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని తన్వీ అభిప్రాయపడ్డారు. -
ఆరోగ్య రంగంలో అపార అవకాశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంలో పెట్టుబడులకు దేశవ్యాప్తంగా అనుకూల పరిస్థితులున్నాయని, ఇందులో ఏపీలోని మెడ్టెక్ జోన్ కూడా ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. ఆసుపత్రులు, వైద్య పరికరాలు, వైద్య బీమా, టెలీమెడిసిన్ తదితర అంశాల్లో పెట్టుబడుల అవకాశాలపై రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, సీఈవో అమితాబ్కాంత్, అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ సర్వాల్లు మంగళవారం విడుదల చేశారు. మెడ్టెక్ జోన్ను వైద్య పరికరాల తయారీ కేంద్రంగా నీతి ఆయోగ్ ప్రస్తావించింది. కరోనా మహమ్మారి చెలరేగిన సమయంలో 15,000 వెంటిలేటర్లు, 10 మిలియన్ల డయాగ్నస్టిక్ కిట్లు, ఐదు లక్షల ఎన్–95 మాస్కులు, 2 లక్షల పీపీఈ కిట్లు ఉత్పత్తైనట్లు తెలిపింది. ‘క్రిటికల్ కాంపొనెంట్లు తయారీ చేసే సంస్థలు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఈ రంగంలో పెట్టుబడులకు మెడ్టెక్ జోన్ అనుకూలం’’ అని నివేదికలో పేర్కొంది. కోవిడ్ సంక్షోభం విసిరిన సవాలు అనేక అవకాశాలకు దారితీయటం వల్ల ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. నివేదికలో ఇతర అంశాలివీ.. ఆరోగ్యంతోపాటు ఉపాధి.. భారత్లో ఆరోగ్య రక్షణ రంగం 2016 నుంచి ఏటా 22% చొప్పున పెరుగుతూ వస్తోంది. ఇది 2022లో 372 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. 2015లో ఆరోగ్య రంగం ప్రత్యక్షంగా 4.7 మిలియన్ల మందికి ఉపాధి కల్పించగా 2022 నాటికి 7.5 మిలియన్లకు పెరుగుతుందని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) అంచనా వేసింది. ఆరోగ్య రంగం ఆదాయపరంగా, ఉద్యోగాలపరంగా అతిపెద్ద రంగాలలో ఒకటిగా మారింది. జీవనశైలి వ్యాధుల పెరుగుదల, ప్రభుత్వ –ప్రైవేటు భాగస్వామ్యం, డిజిటల్ టెక్నాలజీ వినియోగం వైద్య రంగం ఎదుగుదలకు కారణం. చికిత్స కోసం విదేశీయుల రాక.. మెడికల్ వీసాతో 2017లో విదేశాల నుంచి 4,95,056 మంది వస్తే 2019లో 6,97,000 మంది భారత్కు వచ్చారు. అఫ్గానిస్థాన్, పాకిస్తాన్, ఒమన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, నైజీరియా, కెన్యా, ఇరాక్ నుంచి ఎక్కువగా వస్తున్నారు. గుండె, ఆర్థోపెడిక్, అవయవాల మార్పిడి, న్యూరో, ఆంకాలజీ, బేరియాట్రిక్స్ తదితర చికిత్సల కోసం ఎక్కువ మంది విదేశీయులు వస్తున్నారు. అధునాతన వైద్య విధానాలతోపాటు ఆయుర్వేదం, యోగా ఇతర సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. -
ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా బెటర్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని అంచనావేసినప్పటికీ, అంతకుమించి మంచి ఫలితాన్ని అందించే బాటలో పయనిస్తోందని ఆర్థికశాఖ తన తాజా నివేదికలో పేర్కొంది. వ్యాక్సినేషన్ విస్తృతితో ఆర్థిక పురోగతి మరింత ఊపందుకుంటుందన్న విశ్వాసాన్ని నివేదిక వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితిలో దేశం ఆరోగ్య రంగంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. కరోనా వైరెస్ సెకండ్ వేవ్ను భారత్ పటిష్టంగా అరికట్టగలిగిందని ఆర్థికశాఖ పేర్కొంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా వంటి కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరిగినప్పటికీ, మ్తొతంగా పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపింది. మహమ్మారి సమస్య కొనసాగుతున్నప్పటికీ, మూడవ త్రైమాసికంలో 0.4 శాతం జీడీపీ వృద్ధి నమోదుకావడం సానుకూల అంశమని పేర్కొంది. మూడవ త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఇండస్ట్రియల్ అవుట్లుక్ సర్వే ఆశావాద దృక్పదాన్ని వెలువరించిన అంశాన్ని నివేదిక ప్రస్తావించింది. ఉత్పిత్తి, ఆర్డర్ బుక్, ఉపాధి అవకాశాలు మూడవ త్రైమాసికంలో పెరిగిన అంశాన్ని సర్వే స్పష్టం చేసిందని వివరించింది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో 24.4 శాతం క్షీణించగా, రెండవ త్రైమాసికంలో క్షీణ రేటు 7.3 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. -
కోవిడ్ పట్ల అప్రమత్తం
వ్యాక్సిన్లు, అవి పని చేస్తున్న తీరుపై, బ్రిటన్ లాంటి దేశాల్లో పరిణామాలపై దృష్టి పెట్టాలి. ఈ దిశగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు అవగాహన కల్పించాలి. టీకా విషయమై శిక్షణ ఇవ్వాలి. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్ను నిల్వ చేసే విషయం, ఇందుకు అవసరమయ్యే మౌలిక వసతుల గురించి ఆలోచించాలి. సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందన్న సమాచారం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలతో పాటు అధికార యంత్రాంగాన్ని కోరారు. బ్రిటన్ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలు విధించారని, ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. సూపర్ స్పెషాలిటీ సేవలపై దృష్టి పెట్లాలని ఆదేశించారు. ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇప్పుడున్న సదుపాయాలపై చర్చించారు. సెకండ్ వేవ్ వచ్చినా, తగిన చికిత్స అందించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. సగటున రోజుకు 65 వేల టెస్టులు చేస్తున్నామని.. టీచర్లకు, పిల్లలకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ నిల్వ, పంపిణీకి ఇప్పుడున్న సదుపాయాల గురించి, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల గురించి వివరించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన 2 నెలల్లోనే అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం ఉందని, తగిన సిబ్బంది కూడా ఉన్నారని చెప్పారు. ఇందుకోసం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ.మల్లికార్జున, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రతి పల్లెకు ఫ్యామిలీ డాక్టర్
వైద్యుడు ఆయా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆరోగ్య మిత్ర, ఆశా వర్కర్లు వెంట వెళతారు. డాక్టర్ సేవలు అందించడానికి విలేజ్ క్లినిక్ వేదికగా ఉంటుంది. అవసరమైతే హోం విజిట్స్ కూడా చేయాలి. పల్లెల్లో సగటున 1,500 – 2,000 కుటుంబాలకు ఒక డాక్టర్ ఉంటాడు కనుక కొంత కాలానికి పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులపై అతనికి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. దీంతో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వస్తుంది. వైద్యం చేయడం సులభమవుతుంది. ఇందుకోసం అవసరమైతే 104 సర్వీసులు పెంచుకోవాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: పల్లెల్లోకి డాక్టర్లను పంపించడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాల స్థితిగతులు, వనరుల సమీకరణ, పనులు జరుగుతున్న తీరు, ఆరోగ్య శ్రీ అమలుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి మండలంలో కనీసం 2 పీహెచ్సీలు ఉండాలని, ప్రతి పీహెచ్సీలో కనీసం ఇద్దరు చొప్పున.. మొత్తం నలుగురు డాక్టర్లు ఉండాలని, ప్రతి డాక్టర్కు కొన్ని గ్రామాలను కేటాయించాలని చెప్పారు. ఆ డాక్డర్ ప్రతి నెల కనీసం రెండు సార్లు తనకు నిర్దేశించిన గ్రామాలకు వెళ్లి వైద్యం అందించాలని, తద్వారా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితుల మీద అతనికి అవగాహన ఏర్పడుతుందన్నారు. ఈ మేరకు తదుపరి సమావేశం నాటికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ కొత్త వ్యవస్థను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తారనే దానిపై తేదీలను కూడా ఖరారు చేయాలని చెప్పారు. ఈ కొత్త వ్యవస్థ కోసం ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉదారంగా ఉండాలన్నారు. తద్వారా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరోగ్య కార్డుల్లో నమోదు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని, మెరుగైన వైద్యం కోసం వారు సరైన ఆస్పత్రికి రిఫరెల్ చేయగలుగుతారన్నారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్, అధికారులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. నిధుల లోటు రాకూడదు ► ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాలకు ఏకంగా రూ.16,270 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశాం. ఈ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నందున నిధులు కూడా ఆ మేరకు ఇచ్చేలా చూడాలి. నాడు–నేడు కింద కొత్తగా చేపట్టే మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన సాగాలి. ► మార్చి 31 నాటికి వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ల పనులు జనవరి నెలాఖరు కల్లా ప్రారంభం కావాలి. నిర్మాణాలు పూర్తయ్యాక జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆస్పత్రులను నడపాలి. ► వీటి నిర్వహణలో నిరంతరం ఆ ప్రమాణాలు పాటించేలా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. మొదట్లో బాగున్నా.. సరైన శ్రద్ధ, దృష్టి లేకపోతే మళ్లీ పరిస్థితులు మొదటికి వచ్చే అవకాశాలున్నాయి. అలాంటి పరిస్థితి రాకూడదు. అద్భుతంగా కట్టడమే కాకుండా, ఆస్పత్రులను సరైన ప్రమాణాలతో నడపడం అత్యంత కీలకం. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సత్వరమే చర్యలు ► ‘పలాస సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయి. కడప సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు మొదలు పెట్టాం. 2023 జూన్ నాటికి ఆ పనులు పూర్తి చేస్తాం. ఐటీడీఏల పరిధిలోని ఐదు మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి ఈ వారంలోనే రివర్స్ టెండరింగ్ నిర్వహించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. పాడేరు, పిడుగురాళ్ల, పులివెందులలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఈ వారంలోనే రివర్స్ టెండరింగ్కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మచిలీపట్నం మెడికల్ కాలేజీకి నెలాఖరులోగా టెండర్లు ఆహ్వానిస్తాం’ అని అధికారులు వివరించారు. ► మిగిలిన 12 చోట్ల మెడికల్ కాలేజీల ఏర్పాటుపైనా సత్వరమే చర్యలు తీసుకుని, యుద్ధ ప్రాతిపదికన కదలాలని సీఎం అధికారులను ఆదేశించారు. పీహెచ్సీల్లో నాడు –నేడు పనులను 2021 సెప్టెంబర్ నాటికి.. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. హెల్ప్ డెస్క్ కీలకం ► ఆరోగ్యశ్రీ అమలు తీరును, కార్డుల పంపిణీ, ఆరోగ్య ఆవసరాలపై సీఎం సమీక్షించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగులో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే 2,436 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ► ఆరోగ్య ఆసరా కింద ఇప్పటి వరకు 836 ప్రొసీజర్లకు ఆర్థిక సహాయం చేస్తున్నామని, అదనంగా 638 ప్రొసీజర్లకు కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించగా, దీన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ► ప్రైవేట్ ఆస్పత్రుల నుంచే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలని సీఎం సూచించారు. అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలతో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ► నెట్వర్క్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలపై అధికారులు సీఎంకు వివరాలు అందజేశారు. అన్ని ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు కావాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. ► ‘ఒక పేషెంట్గా మనం ఆస్పత్రులకు వెళ్లినప్పుడు ఎలాంటి సమాచారం, సహకారం ఆశిస్తామో.. అలాంటి సహకారాన్ని, సమాచారాన్ని ఆరోగ్యమిత్రలు అందించాలి. ఆరోగ్యశ్రీ, హెల్ప్డెస్క్ల సర్వీసు ప్రతి రోజూ మెరుగు పడాలి. పేషెంట్లకు పూర్తి స్థాయిలో సంపూర్ణ సేవలు అందేలా చూడాలి. రిఫర్ చేయడం.. అంబులెన్స్లను రప్పించుకోవడం తదితర అంశాలపై ప్రొటోకాల్, ప్రొసీజర్లపై గ్రామ సచివాలయాల్లోని ఏఎన్ఎంలకు శిక్షణ ఇవ్వాలి. పేషెంట్ల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి’ అని సీఎం తెలిపారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు రోగికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే ఆస్పత్రులు ఏవన్నది పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. 104 నంబర్కు ఫోన్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్లాలన్న దానిపై పేషెంట్కు అవగాహన కల్పించాలి. పేషెంట్ తన గ్రామం, మండలం పేరు చెప్పగానే.. అందుబాటులో ఉన్న రిఫరల్ ఆస్పత్రులు ఏవేవి.. ఎక్కడెక్కడ ఉన్నాయన్న వివరాలు చెప్పాలి. వెంటనే ఆరోగ్య సిబ్బంది ద్వారా వారికి సరైన సహాయం, సహకారం అందించేలా చూడాలి. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు ► ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్న కొన్ని ఆస్పత్రులు రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఆధారాలు సేకరించి ఆయా ఆస్పత్రులపై జరిమానాలు కూడా విధించామని చెప్పారు. అలాంటి ఆస్పత్రులను ప్యానెల్ నుంచి తొలగించడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ► అంబులెన్స్ల నిర్వహణ సమర్థవంతంగా ఉండేందుకు నిరంతరం పరిశీలన చేయించాలని సీఎం ఆదేశించారు. అవి ఎప్పుడూ మంచి కండిషన్లో ఉండాలన్నారు. అవసరం అనుకుంటే.. మండలాల జంక్షన్లలో అదనంగా అంబులెన్స్లు అందుబాటులో ఉంచేలా చూడాలని సూచించారు. -
ఈ దఫా ‘నెవ్వర్ బిఫోర్’ బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ (2021–22) ఈ దఫా ‘ఇంతకు ముందెన్నడూ చూడని’ (నెవ్వర్ బిఫోర్) విధంగా ఉంటుందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారమన్ పేర్కొన్నారు. మహమ్మారి కరోనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కొని, వృద్ధిబాటలోకి దూసుకుపోయే బడ్జెట్ను ఈ సారి ప్రవేశపెడుతున్నట్లు ఆమె వివరించారు. మహమ్మారి సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వస్తున్న ఈ తరహా బడ్జెట్, 100 సంవత్సరాల భారత్ ముందెన్నడూ చూసి ఉండదని ఆమె అన్నారు. ఆరోగ్యం, మెడికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) టెలీమెడిసిన్ నిర్వహణలో నైపుణ్యత పెంపు అంశాలపై పెట్టుబడుల పెంపు ప్రస్తుత కీలక అంశాలని శుక్రవారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆమె అన్నారు. ‘నెవ్వర్ బిఫోర్’ బడ్జెట్ రూపకల్పనలో అందరి భాగస్వామ్యం అవసరం అని కూడా ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరి 1వ తేదీన సీతారామన్ పార్లమెంటులో 2021–22 బడ్జెట్ను ప్రవేశపెడతారని భావిస్తున్నారు. ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్న తరుణంలో ఆర్థికమంత్రి ఈ రంగాన్ని ప్రస్తావించడం గమనార్హం. మెడికల్ టెక్నాలజీలో అవకాశాలు: ఫార్మా కార్యదర్శి అపర్ణ దేశంలో మెడికల్ టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి ఎస్.అపర్ణ తెలిపారు. ఈ రంగం వృద్ధి బాటలో ఉందని, మరింత విస్తరణకు అవకాశం ఉందని అన్నారు. సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో మెడికల్ టెక్నాలజీ భవిష్యత్ అన్న అంశంపై శుక్రవారం ఆమె మాట్లాడారు. ‘భారత్లో 4,000 పైచిలుకు హెల్త్టెక్ స్టార్టప్స్ ఉన్నాయి. ఆవిష్కరణలు, వ్యవస్థాపకత స్ఫూర్తికి ఇది నిదర్శనం. యువతలో ఉన్న స్వాభావిక ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రస్తుత సంవత్సరంలో ఈ రంగానికి అపూర్వ ఆర్థిక సహాయాన్ని చూశాం. దేశంలో తొలిసారిగా మెడికల్ టెక్నాలజీ రంగానికి వచ్చే అయిదేళ్లపాటు సుమారు రూ.7,500 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. వైద్య పరికరాల పార్కుల రూపంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా ఈ ఆర్థిక మద్దతు కొనసాగుతోంది. వైద్య పరికరాలకూ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఉన్నాయి’ అని వివరించారు. -
వందేళ్లలో ఘోర సంక్షోభమిది
ముంబై: ఆర్థికంగా, ఆరోగ్య పరంగా గడిచిన వందేళ్లలో ప్రపంచం ఎన్నడూ ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కోలేదని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కోవిడ్తో ఉద్యోగాలు, ఉత్పత్తి, సంక్షేమం వంటి అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఊహించని ప్రతికూల పరిణామాలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ఎన్నెన్నో సంక్షోభాలను తట్టుకుని నిలిచిన భారత ఆర్థి క, ద్రవ్య వ్యవస్థలకు ఇది అత్యంత విషమ పరీక్ష’ అన్నారాయన. శనివారమిక్కడ ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ కాన్క్లేవ్లో దాస్ మాట్లాడారు. దేశ ద్రవ్య వ్యవస్థను చక్కదిద్దడానికి ఆర్బీఐ ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని, ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలు ఫలితాలనిస్తున్నాయన్నారు. లాక్డౌన్లోను, తదనంతరం కూడా ఆర్థిక వృద్ధి క్షీణించిందని, ఫలితంగా బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగాయని దాస్ చెప్పారు. బ్యాంకుల మూలధనం క్షీణించిందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు రీ క్యాపిటలైజేషన్ పథకం అమలు చేయాల్సి ఉందన్నారు. అన్లాక్ ప్రక్రియతో ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. పరిశ్రమ మెరుగ్గా స్పందించింది ‘ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం, విశ్వాసాన్ని పెంపొందించడం, వృద్ధిని పునరుద్ధరించడం ఆర్బీఐ తక్షణ కర్తవ్యాలు. నిజానికి సంక్షోభ సమయంలో భారతీయ పారిశ్రామిక రంగం, సంస్థలు మెరుగైన రీతిలో స్పందించాయి. చెల్లింపు వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు ఎలాంటి ఆటుపోట్లకు గురికాకుండా నిలిచాయి’ అని దాస్ వ్యాఖ్యానించారు. సప్లయ్ చెయిన్ పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది? డిమాండ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేదెప్పుడు? ఆర్థికాభివృద్ధిపై కరోనా ప్రభావం ఎలా ఉండనుంది వంటి అంశాలపై ఇంకా స్పష్టత లేదన్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షిస్తూ.. బ్యాంకింగ్ వ్యవస్థ ఎలాంటి ఒడిదుడుకులకూ లోను కాకుండా చూస్తూ.. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు ఆర్బీఐ కృషి చేస్తోందన్నారు. ఫైనాన్షియల్ రంగం మాత్రం ఆంక్షల సడలింపుల కోసం ఎదురు చూడకుండానే తిరిగి మామూలు స్థితికి రావాల్సిన అవసరముందని చెప్పారు. రిజల్యూషన్ కార్పొరేషన్.. ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక సంస్థలతో వ్యవహరించడానికి చట్టబద్ధత కలిగిన ’రిజల్యూషన్ కార్పొరేషన్’ అవసరమని శక్తికాంత దాస్ చెప్పారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటుతో ఆయా సంస్థలను ముందుగానే గుర్తించి హెచ్చరిండానికి, వీలైతే పునరుద్ధరించడానికి వీలుంటుందన్నారు. ‘దీని ఏర్పాటుతో పాటు ఇతర నిబంధనలతో కూడిన ఫైనాన్షియల్ రిజొల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్(ఎఫ్ఆర్డీఐ) బిల్లును ప్రభుత్వం 2017లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే, డిపాజిటర్ల డబ్బు కు రక్షణ ఉండదంటూ వ్యతిరేకత వ్యక్తం కావడంతో దాన్ని వెనక్కి తీసుకుంది’ అని వివరించారు. కానీ రిజల్యూషన్ కార్పొరేషన్ అవసరం చాలా ఉందన్నారు. -
ఆరోగ్యం @ మేకిన్ ఇండియా
ఆరోగ్య రంగంలో మేక్ ఇన్ ఇండియా పరికరాలు, ఐటీ ఉత్పత్తులను విరివిగా వినియోగించడం, టెలీ మెడిసిన్కు మరింత ప్రాచుర్యం కల్పించడం.. ఈ అంశాలపై విరివిగా చర్చ జరగాల్సి ఉంది. ఆరేళ్లలో మా ప్రభుత్వం 4 అంశాలపై దృష్టి పెట్టింది. మొదటిది వ్యాధి నివారణ.. రెండోది చవకగా వైద్య సేవలు. మూడోది సరఫరాలో మెరుగైన విధానాలు అవలంబించడం. నాలుగోది యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు. న్యూఢిల్లీ: మానవీయ అభివృద్ధి కోణంలో ప్రపంచమంతా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.ఆరోగ్య రంగంలో దేశాలు సాధించే అభివృద్ధి ప్రాముఖ్యత ఈ కరోనా సంక్షోభ సమయంలో మరింత పెరిగిందన్నారు. ‘ఆరోగ్య రంగంలో మేక్ ఇన్ ఇండియా పరికరాలు, ఐటీ ఉత్పత్తులను విరివిగా వినియోగించడం, టెలీ మెడిసిన్కు మరింత ప్రాచుర్యం కల్పించడం.. ఈ అంశాలపై విరివిగా చర్చ జరగాల్సి ఉంది’ అన్నారు. ముఖ్యంగా టెలీ మెడిసిన్కు మరింత ప్రాచుర్యం కలిగించేందుకు నూతన విధానాలను రూపొందించాల్సి ఉందన్నారు. బెంగళూరులోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన వీడియో సందేశం ఇచ్చారు. పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్లు.. తదితర ఉత్పత్తులు దేశీయంగా పెద్దసంఖ్యలో తయారు కావడం అభినందనీయమన్నారు. కరోనాపై పోరులో ఆరోగ్య సేతు యాప్ కూడా గణనీయ పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచం చూపు వైద్య సిబ్బంది వైపు... ప్రస్తుత కష్ట సమయంలో ప్రపంచమంతా డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తల వైపు ఆశగా, కృతజ్ఙతతో చూస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. వైద్య సిబ్బందిపై దాడులు చేయడం, వారితో దురుసుగా ప్రవర్తించడం ఆమోదనీయం కాదని మోదీ పేర్కొన్నారు. కొందరిలో ఉన్న మూక మనస్తత్వం వల్ల ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయన్నారు. దీనిపై వైద్య రంగమంతా ఆందోళన చెందుతున్న విషయం తనకు తెలుసన్నారు. కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్నవారిలో వైద్య సిబ్బంది కీలకమన్నారు. ‘వైద్యులు, వైద్య సిబ్బంది సైనికులతో సమానం. ఆర్మీ యూనిఫాంలో లేని సైనికులు వారు. కరోనా కనిపించని శత్రువే కానీ మన వైద్యులు అపజయం ఎరగని సైనికులు’ అన్నారు. వైద్యులపై హింసాత్మక ఘటనలను నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోవిడ్–19 చికిత్సలో పాలు పంచుకుంటున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై హింసకు పాల్పడడం నాన్ బెయిలబుల్ నేరమని, అందుకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముందని స్పష్టం చేస్తూ కేంద్రం ఏప్రిల్లో ఒక ఆర్డినెన్స్ను జారీ చేసిన విషయం తెలిసిందే. గంగ దసరా సందర్భంగా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మేకిన్ ఏపీ.. తొలి అడుగు మేకిన్ ఇండియాకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటుండగా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా ముందడుగు వేసింది. రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ విభాగాలూ... తమ అవసరాల కోసం జరిపే కొనుగోళ్లలో 25 శాతాన్ని స్థానిక ఎంఎస్ఎంఈల నుంచే చేయాలంటూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, రాజ్యాంగ బద్ధమైన సంస్థలు, ఎస్పీవీలు, సొసైటీలు, ట్రస్టులు, ప్రభుత్వరంగ సంస్థలకు వర్తిస్తాయి. ఈ 25 శాతంలో 4 శాతాన్ని ఎస్సీ/ఎస్టీలు నిర్వహిస్తున్న సంస్థల నుంచి, 3 శాతాన్ని మహిళలు నిర్వహిస్తున్న సంస్థల నుంచి తప్పనిసరిగా కొనుగోలు చేయాలని తన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. విదేశీ వస్తువుల జాబితా వెనక్కి స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించేలా సీఏపీఎఫ్ (కేంద్ర సాయుధ బలగాలు) క్యాంటీన్లలో విదేశీ వస్తువుల విక్రయాలను నిషేధిస్తూ తీసుకొచ్చిన వెయ్యి విదేశీ ఉత్పత్తుల జాబితాను ప్రభుత్వం ఉపసంహరించింది. జూన్ 1 నుంచి విక్రయాల జాబితా అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, కేంద్రీయ పోలీస్ కల్యాణ్ భండార్ మే 29న జారీ చేసిన ఈ జాబితాలో కొన్ని దేశీయ ఉత్పత్తులు కూడా ఉన్నాయని అందువల్లనే కేంద్ర హోం శాఖ సోమవారం ఈ జాబితాను ఉపసంహరించిందని అధికారులు తెలిపారు. త్వరలోనే కొత్త జాబితాను విడుదల చేస్తామన్నారు. భారత కంపెనీలైన డాబర్, వీఐపీ ఇండస్ట్రీస్, యురేకా ఫోర్బ్స్, జాక్వెర్, నెస్లే వంటి సంస్థలకు చెందిన వస్తువులు కూడా తొలగింపునకు గురైన వస్తువుల లిస్టులో ఉన్నాయి. -
హెల్త్కు వెల్త్
న్యూఢిల్లీ: ‘‘ఆరోగ్య రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. పౌరుల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్నాం’’ అని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగుపరచడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల ఆధునీకరణపై దృష్టి సారించారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆసుపత్రుల సంఖ్యను పెంచనున్నారు. ఆరోగ్యం అంటే వ్యాధులు సోకితే ఆస్పత్రుల్లో చికిత్స చేయడమే కాదు, ప్రజలు రోగాల బారిన పడకుండా పూర్తి ఫిట్గా ఉండేలా చూడడం కూడా. ఇందుకోసం ఈ సారి ప్రజారోగ్యమే అంతిమ లక్ష్యంగా కేంద్రం కొనసాగిస్తున్న ఎన్నో పథకాలను విస్తరించాల్సిన అవసరం గురించి సీతారామన్ వివరించారు. గత బడ్జెట్తో పోల్చి చూస్తే ఆరోగ్య రంగ నిధుల్ని 8శాతం పెంచారు. ఆయుష్మాన్ భారత్ విస్తరణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల పథకం ఆయుష్మాన్ భారత్–ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై) విస్తరించడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు (పీపీపీ) భాగస్వామ్యంతో ఆయుష్మాన్ భారత్ పథకం కింద మరిన్ని ఆస్పత్రులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ఆస్పత్రుల ఏర్పాటు ప్రైవేటు వ్యక్తులకి లాభదాయం కాకపోతే వయబిలిటీ గ్యాప్ కింద ప్రభుత్వమే నిధుల్ని సమకూరుస్తుంది. దీని కోసం దేశవ్యాప్తంగా 112 జిల్లాలను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వచ్చే ఆస్పత్రులు లేని చోట కొత్త ఆస్పత్రుల్ని ఏర్పాటు చేస్తారు. తద్వారా యువతకు ఎన్నో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి చెప్పారు. ఆయుష్మాన్ భారత్కి గత బడ్జెట్లో రూ.6,400 కోట్లు కేటాయిస్తే, ఈ సారీ అంతే మొత్తాన్ని కేటాయించారు. 2018లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. భారత్ జనాభాలో దాదాపుగా 40శాతం మందికి లబ్ధి చేకూరేలా, నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. 10.74 కోట్ల కుటుంబాలకు చెందిన దాదాపుగా 50 కోట్ల మంది ఈ పథకం లబ్ధి దారులుగా ఉన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019, నవంబర్ 25 నాటికి ఆయుష్మాన్ భారత్ కింద 11.4 కోట్ల మందికి ఇ–కార్డుల్ని జారీ చేశారు. ప్రతీ జిల్లాలో ఓ మెడికల్ కాలేజ్ దేశంలోని ప్రతీ జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉందని, దీన్ని అధిగమించడానికి ప్రైవేటు–ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రతీ జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రికి మెడికల్ కాలేజీని అనుంబంధంగా ఏర్పాటు చేస్తామన్నారు. భూమి, మౌలిక సదుపాయాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే రాష్ట్రాల్లో వీటికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. రోగులు– వైద్యుల నిష్పత్తిలో వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ పథకం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. సరిపడినంత స్థాయిలో రెసిడెంట్ డాక్టర్స్ డిప్లొమా/ ఫెలో బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కోర్సులను ఆఫర్ చేసే ఆసుపత్రులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యాంశాలు.. ► మిషన్ ఇంద్ర ధనుష్ (ప్రభుత్వ వాక్సినేషన్ కార్యక్రమం) కింద అయిదు వైరస్లు సహా 12 కొత్త తరహా వ్యాధుల్ని తీసుకువచ్చారు. ► ప్రజల జీవన విధానంలో వచ్చే మార్పుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల నివారణ కోసం ఫిట్ ఇండియా ఉద్యమం, అందరికీ సురక్షిత మంచినీరు అందించడం కోసం జలజీవన్ మిషన్ , దేశంలో పారిశుద్ధ్య వ్యవస్థని మెరుగుపరిచి పరిశుభ్రంగా ఉండడం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నిరుపేదలకు వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. ► ఆయుష్మాన్ భారత్ కిందకి వచ్చే ఆసుపత్రుల సంఖ్యను టైర్ 2, టైర్ 3 నగరాల్లో పెంచాలని నిర్ణయం. ప్రస్తుతం ఈ పథకం కింద 20 వేలకుపైగా ఆసుపత్రులు ఉన్నాయి. మరో వెయ్యి ఆస్పత్రులు పెంచడానికి చర్యలు ► ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లా స్థాయిలో మెడికల్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచడం. ► ప్రజలకు అందుబాటు ధరల్లో మందులు దొరికేలా అన్ని జిల్లాల్లో జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు. జనరిక్ మెడిసిన్స్ని విక్రయించే ఈ దుకాణాలను నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు. ► వైద్య పరికరాల దిగుమతులు, విక్రయం ద్వారా వచ్చే పన్నుల్ని ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగం. కొన్ని నిర్దిష్ట వైద్య పరికరాల దిగుమతులపై 5శాతం ఆరోగ్య సెస్ విధింపు . ప్రస్తుతం భారత వైద్య పరికరాల రంగం 80 నుంచి 90 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడింది. ఈ నిర్ణయంతో రెండు రకాలుగా ప్రయోజనాలున్నాయని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీకి చెందిన సమన్వయకర్త రాజీవ్ నాథ్ అన్నారు. వైద్య పరికరాల రంగం మేకిన్ ఇండియాకు ఊతమిస్తుందని, మౌలిక సదుపాయాలకు ఈ నిధుల్ని వినియోగించడం వల్ల జాతీయ ఆరోగ్య రంగ భద్రతపై నెలకొన్న ఆందోళనలు తొలగిపోయే అవకాశాలున్నాయని అన్నారు. ► ఆరోగ్య రంగ అధికారులు మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వ్యాధులపై పోరాటం చేయాలి. ► క్షయ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది అన్న నినాదంతో ట్యూబర్ కొలాసిస్ (టీబీ)పై పోరుబాట. 2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం అడుగులు. -
ఆరోగ్యరంగానికి ‘అవినీతి’ రోగం!
సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్య రంగంలో అవినీతి పేద రోగు లకు శాపమవుతోంది. అభివృద్ధి చెందుతున్న, తక్కువ ఆదాయ దేశాల్లో ముఖ్యంగా ఈ పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య భవిష్యత్కు అవినీతి అతి పెద్ద ముప్పుగా పరిణమించిందని ‘లాన్సెట్’ సంస్థ అధ్యయనం తేల్చింది. ఆధునిక వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, ప్రజలకు చేర్చడంలో అవినీతి ప్రతిబంధకంగా మారిందని తెలిపింది. ఆరోగ్య రంగానికి భారీగా విదేశీ సాయం లభిస్తుండటంతో అవినీతి మరింత పెచ్చుమీరిందని పేర్కొంది. అవినీతి పేదలకు మరింత హానిగా తయారైందని అభిప్రాయపడింది. ఇతర రంగాల్లో కన్నా ఆరోగ్య రంగంలో అవినీతి చాలా ప్రమాదకరమైందని విశ్లేషించింది. వ్యాధులను నియంత్రించడానికి జరిగే ప్రయత్నాలన్నింటినీ అవినీతి బలహీనపరుస్తుందని తెలిపింది. ఆరోగ్య రంగం అవినీతికి ఆకర్షణీయమైన రంగంగా మారిందని అభిప్రాయపడింది. సార్వత్రిక ఆరోగ్య కవరేజీని చేరుకోవడానికి చేసే ప్రయత్నాలకు అవినీతి అడ్డుగా తయారైందని తెలిపింది. వైద్య సిబ్బంది గైర్హాజరు కూడా అవినీతే ఆరోగ్య రంగంలో అవినీతిని లాన్సెట్ ఆరు రకాలుగా విభజించింది. 1) ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు తమ వైద్య సేవలను పక్కనపెట్టి ప్రైవేట్ ప్రాక్టీసులో నిమగ్నమై ఉండటాన్ని మొదటి రకం అవినీతి అని లాన్సెట్ పేర్కొంది. సర్కారు వారికి డబ్బు చెల్లిస్తున్నా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించాల్సిన సమయంలో వేరే చోట పనిచేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారని తెలిపింది. జవాబుదారీతనం, కఠిన చర్యలు లేకపోవటంతో ఈ పరిస్థితి నెలకొందని అభిప్రాయపడింది. 2) ఆరోగ్య రంగంలో రోగుల నుంచి అనధికారికంగా వసూలు చేయడం రెండో రకం అవినీతి అని పేర్కొంది. 3) మందులను పక్కదారి పట్టించడం వంటివి మూడో రూపం అవినీతి కిందకు వస్తాయి. 4) వైద్య సేవల్లో అవినీతి నాలుగో రూపం కిందకు వస్తుంది. వైద్య సేవల ఖర్చులను పెంచడం ద్వారా రోగులను ప్రమాదంలో పడేస్తారు. అనేక దేశాల్లో సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా బాధితులపై భారం మోపుతున్నారు. చికిత్సలు, రిఫరల్స్ పద్ధతుల్లో రోగుల నుంచి డబ్బు వసూలు చేయడం కూడా అవినీతి కిందకే వస్తుంది. ఈ అవినీతి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో జరుగుతుంది. 5) అవినీతి ఐదో రూపం పక్షపాతం. వైద్య సేవల్లో రికమండేషన్లు లేదా సామాజిక హోదా కలిగిన వారికి మరింత ఆరోగ్య సంరక్షణ కల్పించడం వంటివి దీని కిందకు వస్తాయి. దీంతో సాధారణ రోగులు తీవ్రంగా నష్టపోతారు. 6) అవినీతి ఆరో రూపం డేటా తారుమారు. అంటే వైద్య సేవలు చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టించడం, మోసపూరిత చర్యలకు పాల్పడటం. టీకా వంటి ప్రజారోగ్య కార్యకలాపాల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది. దీనిలో నిర్దిష్ట వైద్య కార్యక్రమాల కోసం డేటాను పదేపదే ఎక్కువగా చూపుతారు. ఆరోగ్య రంగంలో వ్యక్తిగత అవినీతి కార్యకలాపాలు చిన్న స్థాయిలో కనిపిస్తాయి. కానీ అవి లక్షలాది మంది రోగులపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని లాన్సెట్ తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కానీ అవి రోగులకు అందుబాటులోకి రావడం లేదని తెలిపింది. రాష్ట్రంలో ఇది అవినీతి కాదా..? ఆరోగ్య రంగంలో అవినీతిపై లాన్సెట్ అధ్యయనం తెలంగాణలోని కొందరు అధికారుల తీరును కూడా వేలెత్తి చూపే అంశంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో తొమ్మిది జిల్లాల పరిధిలో జిల్లా స్థాయి ఆసుపత్రుల నిర్మాణానికి సర్కారు నడుం బిగించింది. దీనిలో భాగంగా గద్వాల, మహబూబాబాద్, నారాయణపేట, నిర్మల్, కొమురంభీం, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగులోని ఏరియా ఆసుపత్రులను జిల్లా ఆసుపత్రులుగా నిర్మించనుంది. వాటిల్లో అధునాతన మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 576.78 కోట్ల నిధులను ప్రతిపాదించగా, ప్రభుత్వం రూ. 214.12 కోట్లకు ఇప్పటికే అనుమతించింది. జిల్లా ఆసుపత్రులను నిర్మించే బాధ్యతను తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) తీసుకుంటుంది. ఈ నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్ను నియమిస్తారు. నిబంధనల ప్రకారం ఆర్కిటెక్ట్కు ఒక శాతం కమీషన్ ఇస్తారు. కానీ ఒక అధికారి తనకు సంబంధించిన ఒక ఆర్కిటెక్ట్కు అనుమతి ఇవ్వాలని, అంతేగాకుండా 5 శాతం కమీషన్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. అంటే రూ.కోట్లు చేతులు మారే అవకాశముంది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఒక శాతం మాత్రమే ఆర్కిటెక్ట్కు కమీషన్ కింద ఇస్తామని, అంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవని టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆర్కిటెక్ట్ కమీషన్ పెంచితే రోగులకు ఇచ్చే మౌలిక సదుపాయాల కల్పనలో రాజీపడాల్సిందే. ఇది కూడా ఆరోగ్య రంగంలో అవినీతిగానే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అందరికీ ఆరోగ్య‘సిరి’
సాక్షి, అమరావతి: పేదవారి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ రాష్ట్ర సర్కారు బడ్జెట్లో వైద్య రంగానికి పెద్దపీట వేసింది. కనీవినీ ఎరుగని రీతిలో వైద్య ఆరోగ్య శాఖకు తాజా బడ్జెట్లో రూ.11,398.93 కోట్లను కేటాయించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 35 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం విశేషం. అంతేగాక ప్రతి పేదవాడికీ ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంతివైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి పునర్వైభవం తీసుకొచ్చింది. ఈ పథకానికి ఏకంగా రూ.1,740 కోట్లు కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఈ స్థాయిలో ఎప్పుడూ కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. వెయ్యి రూపాయలు బిల్లు దాటితే చాలు.. దాన్ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి వారికి ఉచితంగా వైద్యం అందించాలన్న బలమైన ఆశయంతో ఈ పథకానికి భారీ కేటాయింపులు చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యాన్ని గత సర్కారు ఆపేయడం తెలిసిందే. దీనికి ముగింపు పలుకుతూ.. ఇప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకూ సేవలను విస్తరించింది. గతంలో ఉద్యోగుల వైద్యపథకంలో మాత్రమే ఉన్న కొన్ని జబ్బులను ఇప్పుడు ఆరోగ్యశ్రీలోనూ చేర్చి దాదాపు రెండువేల జబ్బులకు ఉచితంగా వైద్యమందించేలా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారికి సైతం ఉచిత వైద్యమందేలా నిర్ణయించింది. తద్వారా మధ్య తరగతి వారికీ సర్కారు ఆరోగ్య భరోసా కల్పించింది. ఈ ఏడాది దేశ బడ్జెట్ రూ.27,86,349 కోట్లు అయితే ఇందులో ఆరోగ్య రంగానికి కేటాయించింది రూ.62,659 కోట్లు. అంటే కేవలం 2.2 శాతం మాత్రమే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూ.2,27,974 కోట్లు కాగా, ఇందులో ఆరోగ్యశాఖకు రూ.11,398.93 కోట్లు కేటాయించడమంటే ఆరోగ్య రంగానికి 5 శాతం కేటాయింపులు జరిపినట్టు అవుతుంది. 108, 104 బలోపేతం వైఎస్సార్ హయాంలో అద్భుతంగా నడిచిన 108 అంబులెన్సులు, 104 సంచార వైద్యశాలల సేవలు ఆయన మరణానంతరం నిర్వీర్యం కావడం తెలిసిందే. ఇప్పుడు వీటికి కూడా పునర్వైభవం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది. మండలానికొక వాహనాన్ని కేటాయించాలన్న ఉద్దేశంతో ఈ రెండు పథకాలకు 323.14 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే ఇది 80 శాతం పైనే. ఇందులో 108 వాహనాలకు రూ.143.38 కోట్లు, 104 వాహనాలకు రూ.179.76 కోట్ల నిధులు వెచ్చించనుంది. క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని పెంచిన రాష్ట్ర సర్కారు వారికోసం ఈ బడ్జెట్లో రూ.455 కోట్లను కేటాయించింది. ఆశా వర్కర్ల వేతనాలను రూ.3 వేల నుంచి రూ.పది వేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెంచడం తెలిసిందే. గురజాలలో ప్రభుత్వ వైద్యకళాశాల గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉన్న గురజాల నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మించేందుకు రూ.66 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే పాడేరులో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ప్రస్తుతం గురజాలలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 300 పడకల ఆస్పత్రిగా ఉన్నతీకరించి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తారు. మరోవైపు విజయనగరంలో కొత్తగా ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేస్తూ రూ.66 కోట్లు కేటాయించింది. మరోవైపు ఆయుష్ వైద్యకళాశాలల అభివృద్ధికి గతేడాది రూ.30 కోట్లు ఇస్తే ఈ ఏడాది రూ.52 కోట్లు కేటాయించారు. బడ్జెట్లో ప్రధానమైన వాటికి కేటాయింపులు ఇలా.. (రూ.కోట్లల్లో) ఆరోగ్యశ్రీ - 1,740 108 - 123.09 104 - 141.47 ఆశావర్కర్లకు - 455 ఉద్యోగుల వైద్యానికి - 200 రేడియాలజీ సర్వీసులు - 25 మందుల కొనుగోళ్లకు - 126 -
వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి భారీ కేటాయింపులు
సాక్షి, అమరావతి : ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. వైద్య రంగానికి ప్రాధాన్యం కల్పిస్తూ బడ్జెట్లో రూ.11,399 కోట్లు కేటాయించారు. దివంగత ముఖ్యమంతి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆరోగ్యశ్రీ పథకానికి పునర్వైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.1740 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. 5 లక్షలలోపు ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని అన్నారు. 108 అంబులెన్స్లకు రూ.143 కోట్లు కేటాయించారు. వైద్యరంగానికి చేయూత.. ఆస్పత్రుల్లో మౌలిక వసతులకు రూ.1500 కోట్లు ఆశావర్కర్లకు పెంచిన రూ.10 వేల వేతనానికి రూ.455 కోట్లు మెడికల్ భవనాలకు రూ.68 కోట్లు వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కళాశాలకు రూ.66 కోట్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల-గురజాలకు రూ.66 కోట్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల-విజయనగరంకు రూ.66 కోట్లు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు రూ. 50 కోట్లు రాష్ట్ర కేన్సర్ ఇనిస్టిట్యూట్కు రూ.43 కోట్లు -
ఆరోగ్యానికి ఆయుష్షు..
న్యూఢిల్లీ: గత రెండు బడ్జెట్లతో పోల్చితే ఈసారి ఆరోగ్య రంగానికి కేంద్రం నిధులు గణనీయంగా పెంచింది. వైద్య విద్యను బలోపేతం చేసే దిశగా మెడికల్ కాలేజీలను నవీకరించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిధులు కేటాయించారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్లో రూ. 62,659.12 కోట్లు ప్రతిపాదించారు. 2018–19 బడ్జెట్ (రూ. 52,800 కోట్లు)తో పోల్చితే 19 శాతం పెంచారు. కేంద్రం కీలకంగా భావిస్తున్న బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్–ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై)కు రూ. 6,400 కోట్లు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ నెలకొల్పడానికి రూ. 249.96 కోట్లను కేటాయించారు. ఇక జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ఆ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రూ. 1,349.97 కోట్లు ప్రతిపాదించారు. జాతీయ ఆరోగ్య మిషన్కు రూ. 32,995 కోట్లు కేటాయించారు. అయితే ఎన్హెచ్ఎం కార్యక్రమమైన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్ఎస్బీవై) పథకానికి భారీగా కోత పెట్టారు. ఈసారి కేవలం రూ. 156 కోట్లు మాత్రమే కేటాయించారు. జాతీయ ఎయిడ్స్, ఎస్టీడీ నియంత్రణ కార్యక్రమానికి గతేడాది కంటే రూ. 400 కోట్లు పెంచి రూ. 2,500 కోట్లు కేటాయించారు. ఇక ఎయిమ్స్కు గత బడ్జెట్లో రూ. 3,018 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ. 3,599.65 కోట్లకు పెంచారు. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమానికి రూ. 40 కోట్లు, కేన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల నియంత్రణ కార్యక్రమానికి రూ. 175 కోట్లు కేటాయించారు. కార్పొరేట్ ఆస్పత్రులు, పెద్ద ఆస్పత్రుల్లో వైద్యానికి సంబంధించిన టెర్షియరీ కేర్ పోగ్రామ్లో రూ. 200 కోట్లు కోత పెట్టి రూ. 550 కోట్లు ప్రతిపాదించారు. నర్సింగ్ సర్వీసులకు రూ. 64 కోట్లు, ఫార్మసీ స్కూళ్లు, కాలేజీకు రూ. 5 కోట్లు, జిల్లా ఆస్పత్రులు, రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు (పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్) అప్గ్రేడ్ చేయడానికి రూ. 800 కోట్లు, జిల్లా ఆస్పత్రులను కొత్త మెడికల్ కాలేజీలుగా మార్చడానికి రూ. 2,000 కోట్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను (అండర్ గ్రాడ్యుయేట్), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను బలోపేతం చేయడానికి రూ. 1,361 కోట్లు ప్రతిపాదించారు. సంప్రదాయ వైద్యానికి రూ. 1,939.76 కోట్లు సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించే దిశగా మోదీ ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖకు సుమారు 15 శాతం అధికంగా నిధులిచ్చింది. ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి (ఆయుష్) వైద్యానికి సంబంధించి రూ. 1,939.76 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఆయుష్ నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రూ. 92.31 కోట్లు ప్రతిపాదించారు. ఇక అటానమస్ సంస్థలైన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ వైద్యానికి సంబంధించి వరుసగా.. రూ. 292.31 కోట్లు, రూ. 118.53 కోట్లు, రూ. 152.65 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేయాలంటే రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో రూ.100 లక్షల కోట్లను కేంద్రం వెచ్చించాల్సి ఉంటుంది. విదేశీ బీమా మధ్యవర్తిత్వ సంస్థల్లో 100 శాతం ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్డీఐ) వల్ల భారత ఆరోగ్య రంగానికి పరోక్షంగా లబ్ధిచేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రగతిశీల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. - గౌతమ్ ఖన్నా సీఈవో హిందుజా ఆసుపత్రి–ఎంఆర్సీ -
బీడీఎస్లూ ఎంబీబీఎస్ చేయొచ్చు..
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఇంటర్కు బదులు నాలుగేళ్ల ప్రీమెడికల్ కోర్సు ఉంటుంది. అది పూర్తి చేసిన వారికి వచ్చే మార్కులు, ర్యాంకుల ఆధారంగా ఎంబీబీఎస్, డెంటల్, ఫిజియోథెరపీ, నర్సింగ్ వంటి కోర్సులకు వెళ్తారు. దాదాపు అలాంటి ఎంబీబీఎస్ కోర్సును రూపొందించే పనిలో కేంద్రం నిమగ్నమైంది. ఆ మేరకు ఎంబీబీఎస్ కోర్సులో సమూల మార్పులు చేసేందుకు జాతీయ విద్యా విధానం–2019 ముసాయిదా రంగం సిద్ధం చేసింది. వైద్య విద్యకు వెళ్లాలనుకునే వారికి ప్రాథమిక కోర్సు ప్రారంభించి అనంతరం వారి నైపుణ్యం ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ కోర్సుల్లో చేరేలా అవకాశం కల్పిస్తారు. నర్సింగ్, డెంటల్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారు ఎంబీబీఎస్ కోర్సులో తర్వాత చేరేలా (లేటరల్ ఎంట్రీ) మరో ప్రతిపాదన సిద్ధం చేశారు. డెంటల్ కోర్సులో ఉండగా మధ్యలో ఎంబీబీఎస్లో చేరాలనుకుంటే ప్రత్యేక పరీక్ష ద్వారా అవకాశం కల్పించాలన్నది మరో అవకాశం. అందుకు సైన్స్ విద్యార్థులందరికీ ఏడాది లేదా రెండేళ్లు కామన్ కోర్సు ఉండాలని.. తర్వాత డెంటిస్ట్, నర్సింగ్, మెడిసిన్ స్పెషలైజేషన్ పెట్టాలని సూచించింది. లేటరల్ ఎంట్రీకి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటుందని, వారు ‘నీట్’రాయాల్సిందేనని జాతీయ విద్యా విధానంలోని వైద్య విద్య ముసాయిదాలో పేర్కొన్నట్లు రాష్ట్రానికి చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రామీణులకు వైద్య విద్య.. మెడిసిన్, నర్సింగ్, డెంటల్కు చెందిన పలు కౌన్సిళ్లను వాటికి సంబంధించిన ప్రమాణాలు చూడటం, కాలేజీల్లో తనిఖీలు చేయడం, అక్రెడిటేషన్లు ఇవ్వడం వరకే పరిమితం చేయాలని విద్యా విధానం ముసాయిదా సూచించింది. ఫీజుల వ్యవస్థలోనూ మార్పులు తేవాలని, వాటి నిర్ణయాధికారం సంస్థలకే ఇవ్వాలని పేర్కొంది. అయితే 50 శాతం మందికి స్కాలర్షిప్లు ఇవ్వడంతో పాటు, 20 శాతం మందికి పూర్తి స్కాలర్షిప్లు ఇవ్వాలని పేర్కొంది. విద్యకయ్యే ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు వైద్య విద్య అందేలా చూడాలని చెప్పింది. ఎంబీబీఎస్ విద్యార్థులకు కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ కూడా ఉండాలని పేర్కొంది. ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ మెడికల్ పీజీకి ప్రవేశంగా ఉండాలని వివరించింది. అంటే మెడికల్ పీజీకి ఇక నీట్ పరీక్ష ఉండదన్నమాట. వాటిని బోధనాసుపత్రులుగా చేయాలి.. ఆరోగ్య రంగంలో వృత్తి నిపుణులు తక్కువగా ఉన్నారని, దీన్ని అధిగమించడానికి సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక కమిటీ నియమించాలని ముసాయిదా సూచించింది. ఆరోగ్య రంగంలో ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు దేశంలోని 600 జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా ఆధునీకరించాలని పేర్కొంది. మెడికల్ పీజీ సీట్లను కూడా పెంచాలని సూచించింది. మెడికల్ ప్రాక్టీస్ను ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ నుంచి వేరు చేయాలని పేర్కొంది. అయితే కేంద్ర ముసాయిదాపై దంత, నర్సింగ్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తుండగా, ఉన్న మెడికల్ విద్యా వ్యవస్థను అనవసరంగా నాశనం చేస్తున్నారని సీనియర్ వైద్యులు పెదవి విరుస్తున్నారు. అయితే వైద్య విద్యలో ఆచరణాత్మకమైన పద్ధతులను కేంద్ర విద్యా విధానం తీసుకురావట్లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
బ్రిటన్ వీసా రుసుము రెట్టింపు!
లండన్: యూరోపియన్ యూనియన్ బయటి దేశాల నుంచి బ్రిటన్కు వచ్చే వలసదారులపై విధించే హెల్త్ సర్చార్జీని ఆ దేశం డిసెంబరు నుంచి రెండింతలు చేయనుంది. దీంతో భారత్ సహా పలు దేశాల నుంచి బ్రిటన్కు వెళ్లే పౌరులు, విద్యార్థులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వీసా ఫీజు కింద మరింత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వలస వీసాదారులు ఏడాదికి 200 (దాదాపు రూ. 19,400) పౌండ్లు, విద్యార్థి వీసా కలిగినవారు ఏడాదికి 150 (దాదాపు రూ. 14,540) పౌండ్లు సర్చార్జీ కింద చెల్లిస్తున్నారు. ఈ రుసుము వీసా ఫీజులో కలిపి ఉంటుంది. తాజాగా ఈ మొత్తాన్ని బ్రిటన్ రెండింతలు చేయాలని నిర్ణయించింది. దీంతో వలస వీసాదారులు 400 (దాదాపు రూ. 38,800) పౌండ్లు, విద్యార్థి వీసాదారులు 300 (దాదాపు రూ. 29,080) పౌండ్లను చెల్లించాల్సి ఉంటుంది. బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవల పథకం (ఎన్హెచ్ఎస్)కు నిధుల సమీకరణ కోసం హెల్త్ సర్చార్జీని 2015లో ప్రవేశపెట్టారు. తాజా పెంపు కారణంగా ఎన్హెచ్ఎస్కు ఏడాదికి 22 కోట్ల పౌండ్ల అదనపు నిధులు అందుతాయి. బ్రిటన్ పౌరులతోపాటు 6 నెలలకు పైగా ఆ దేశంలో ఉండేందుకు వీసా మంజూరైన వారంతా ఈ రుసుము చెల్లించాలి. అయితే తాజా పెంపు నుంచి యూరోపియన్ యూనియన్ దేశాల పౌరులను మినహాయించారు. వారూ చెల్లించడం సమంజసమే: మంత్రి ఆరోగ్య పథకాన్ని వలసదారులకూ వర్తింపజేస్తున్నందున వారి నుంచి ఈ పథకానికి నిధులను సేకరించడం సమంజసమేనని బ్రిటన్ వలసల శాఖ మంత్రి కరోలిన్ నోక్స్ చెప్పారు. ‘అవసరమైనప్పుడు మా ఆరోగ్యసేవల పథకం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీర్ఘకాలం బ్రిటన్లో ఉండే వలసదారులు ఈ సేవలను వాడుకోవడాన్ని మేం స్వాగతిస్తాం. కానీ ఇది మా దేశానికి సంబంధించినది, అంతర్జాతీయ ఆరోగ్య పథకం కాదు. వలసదారులకూ మేం ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నందున వారు కూడా ఇందుకు కొంత మొత్తం చెల్లించడం సమంజసంగా ఉంటుంది.’ అని ఆమె వివరించారు. బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తర్వాత డిసెంబరులో సర్చార్జీ పంపు అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన బిల్లును గురువారమే హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రవేశపెట్టారు. బ్రిటన్లో ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం ఉండాలనుకునే వలసదారులు.. స్వదేశానికి తిరిగొచ్చే వరకూ ఈ హెల్త్ సర్చార్జీని ప్రతి ఏటా చెల్లించాలి. -
దీక్షగా ‘ఆయుష్మాన్ భారత్’
ఇటానగర్: సుమారు 50 కోట్ల మందికి ఆరోగ్య రక్షణ కల్పించే ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ను ప్రభుత్వం దీక్షగా చేపడుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమైన ఈ పథకంతో ఆరోగ్య రంగంలో సమూల మార్పులు వస్తాయన్నారు. మోదీ గురువారం అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్లో టోమో రీబా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ భవనానికి శంకుస్థాపన చేశాక నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిమితిలో ఆరోగ్య రక్షణ కల్పించే వ్యవస్థను దేశంలో ప్రవేశపెట్టేందుకు ఇదే తగిన సమయం’ అని అన్నారు. అరుణాచల్ పర్యటనపై చైనా నిరసన ప్రధాని మోదీ అరుణాచల్లో పర్యటించడాన్ని చైనా తప్పు పట్టింది. ఆ భూభాగం తమ అధీనంలోని దక్షిణ టిబెట్లో భాగమని పునరుద్ఘాటించింది. సరిహద్దు వివాదాన్ని సంక్లిష్టం చేసేలా వ్యవహరించొద్దని భారత్కు సూచించింది. మోదీ పర్యటనపై భారత్కు దౌత్య మార్గాల్లో తీవ్ర నిరసన తెలుపుతామని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి షువాంగ్ చెప్పారు. సరిహద్దు సమస్యలపై చైనా వైఖరి స్పష్టంగా ఉందన్నారు. -
ఆరోగ్య భాగ్య విధాత
స్వస్థ భారతం స్వాతంత్య్రం వచ్చిన 1947 నాటితో పోలిస్తే ఇప్పటికి ఆరోగ్య రంగంలో గణనీయమైన వృద్ధి చోటు చేసుకుంది. మనదేశ ఆరోగ్యరంగం పురోగతి చోటు చేసుకుందని చెప్పేందుకు చాలా తార్కాణాలే ఉన్నాయి. ఉదాహరణకు ఒకనాడు విదేశాల్లోనే సాధ్యమనుకున్న సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఇరవై ఏళ్ల కిందట కూడా ధనవంతులు గుండె ఆపరేషన్ల కోసం విదేశాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఒక మోస్తరు ఆసుపత్రుల్లో కూడా గుండెశస్త్రచికిత్సలు ప్రతిరోజూ పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. ఇక గుండె, కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తుల వంటి కీలకమైన అవయవాల మార్పిడి శస్త్రచికిత్సల సంఖ్య ఎంతగానో పెరిగింది. దాంతో అప్పట్లో మనం విదేశాలకు వెళ్లడం మానేయడం అనే పరిణామం ఎలా ఉన్నా... విదేశీయులే ఇక్కడికి రావడం అనే ఒక ట్రెండ్ మొదలైంది. దాంతో హెల్త్ టూరిజం ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రజల ఆయుఃప్రమాణం దాదాపు రెట్టింపు కంటే ఎక్కువే అయ్యింది. మందులను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి మనమే అనేక దేశాలకు మందులను, వ్యాక్సిన్లను ఎగుమతి చేసే స్థితిలో ఉన్నాం. మశూచీ లాంటి మహమ్మారులను పూర్తిగా నిర్మూలించాం. ఇక వైద్య పరీక్షలను చేసే ఉపకరణాల తయారీ విషయానికి వస్తే... దాదాపు 90 శాతం చిన్న చిన్న వైద్యపరీక్షా సాధనాలను మనమే తయారు చేసుకుంటున్నాం. వైద్య విద్య కూడా గణనీయంగానే అభివృద్ధి చెందింది. స్వాతంత్రం వచ్చే నాటితో పోలిస్తే వైద్య కళాశాలల సంఖ్య ఈ 70 ఏళ్లలో ఇరవై రెట్లు పెరిగింది. అలాగే ఒకనాడు చిన్న చిన్న వైద్య అవసరాల కోసం విదేశాలకు వెళ్లే పరిస్థితి నుంచి విదేశీయులే వారికి ఇక్కడ చవగ్గా లభ్యమవుతున్న వైద్య సదుపాయాల కోసం ఇక్కడికే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఈ పురోభివృద్ధి సామాన్యుడికి ఏమేరకు అందిందనే అంశం మాత్రం ఇంకా ప్రశ్నార్థకమే. శీర్షికలవారీగా ఆయా అంశాలను పరిశీలిస్తే... ఆయుః ప్రమాణాలు పెరిగినప్పటికీ... ఆరోగ్యరంగంలో వచ్చిన మార్పులతో మన దేశవాసుల ఆయుఃప్రమాణం బాగానే పెరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో భారతీయుల ఆయుఃప్రమాణం 32 ఏళ్లు మాత్రమే. కానీ తాజాగా ఇప్పుడు 2016 నాటి లెక్కల ప్రకారం మన దేశవాసుల ఆయుఃప్రమాణం 68.3 ఏళ్లు. దీన్ని బట్టి మన ప్రజలకు మంచి ఆరోగ్యం అందుతోందనే భావన వస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం వేరు. బొగ్గు, పెట్రోలియం, విద్యుత్ వంటి శక్తి వనరుల వినియోగాలతో క్రమంగా అన్ని రకాల కాలుష్యాలు పెరుగుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగం విపరీతమైంది. శారీరక శ్రమ చేయడం నామోషీ అయ్యింది. మొక్కలు నాటకపోవడం, చెట్లు నరకడంతో అనర్థాలు పెరుగుతున్నాయి. వీటి కారణంగా ఊబకాయం, అధిక రక్తపోటు, రక్తనాళాల్లో అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం, దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుల వంటి నాన్కమ్యూనికబుల్ డిసీజ్లు బాగా పెరిగిపోయాయి. నేటి సమాజంలో పైన పేర్కొన్న జబ్బుల్లో ఏదో ఒకదానితో బాధపడేవారు ప్రతి ఇంట్లోనూ ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి జబ్బులు తగ్గాయా లేక పెరిగాయా అనేది ఆలోచించాల్సిన అంశం. మందుల లభ్యత మంచికా... చెడ్డకా? కొన్ని కొత్త మందులు కనిపెట్టాక అవి రోగనిరోధక శక్తికి బాసటగా నిలవడంతో కొన్ని జబ్బులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఉదాహరణకు... మశూచీ వ్యాక్సిన్ కనిపెట్టాక ఆ రోగం పూర్తిగా మటుమాయం అయ్యింది. అలాగే అనేక రకాల వ్యాక్సిన్లు, మందుల కారణంగా ఇప్పుడు పోలియో పూర్తిగా అదుపులో ఉంది. ధనుర్వాత మరణాలు, క్షయ రోగుల సంఖ్య దాదాపుగా అదుపులోకి వచ్చింది. ప్లేగు లాంటి జబ్బులు కనబడటం లేదు. కలరా, టైఫాయిడ్ వంటి జబ్బులకు సమర్థమైన మందులు అందుబాటులో ఉన్నాయి. 70 ఏళ్ల కిందట మన దేశం అనేక ఔషధాలను దిగుమతి చేసుకునే స్థితిలోనే ఉంది. ఇప్పుడు చాలా మందులను ఎగుమతి చేసేంతగా దేశం అభివృద్ధి చెందింది. అయితే 2000 సంవత్సరంలో డబ్ల్యూటీఓ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)లో చేరి మన ప్రాసెస్ పేటెంటు చట్టాన్ని ప్రాడక్ట్ పేటెంట్గా మార్చుకున్నందున చాలా నష్టపోయాం. అయినప్పటికీ మనదేశం ఇంకా మందులను ఎగుమతి చేసే పరిస్థితుల్లోనే ఉండటం విశేషం. అయితే మందుల లభ్యత ఇంత విశేషంగా ఉన్నా ఇక్కడ మన దేశ విధాన రూపకర్తలు ఆలోచించాల్సిన కీలకమైన అనేక జటిల అంశాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ప్రజలకు అవసరమైన మందులను గురించి వివరిస్తూ... 116 ఔషధాలు ఉంటే ప్రజారోగ్యానికి అవి చాలని 1975లో హాథీ కమిటీ పేర్కొంది. అయితే ఆ సంఖ్య 150గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్పింది. అన్ని జబ్బుల వైద్య చికిత్స కోసం మొత్తం 256 మందులు అవసరమని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. కానీ ప్రస్తుతం మన దేశ మార్కెట్లో 85,000 ఫార్ములేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చాలావరకు అవసరమైన, అర్థరహితమైన కాంబినేషన్లు, ప్రమాదకరమైన మందులే ఉన్నాయి. ఈ దృష్టి కోణంలో ఆలోచించినప్పుడు మందుల లభ్యత అన్నది అభివృద్ధేనా లేక ప్రతికూల అంశమా అన్నది కీలక చర్చనీయాంశం. వైద్యపరీక్ష ఉపకరణాల విషయంలో... ఇక వైద్య ఉపకరణాల విషయానికి వస్తే... దాదాపు 90 శాతం చిన్న చిన్న వైద్యపరీక్ష సాధనాలను మనమే తయారు చేసుకునే స్థాయికి వచ్చాం. కానీ సీటీ స్కాన్, ఎమ్మారై, పెట్ స్కాన్ వంటి అనేక పైస్థాయి వైద్య పరీక్ష సాధనాలను మాత్రం ఇంకా విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. నగర ప్రజల అవసరాలను మినహాయిస్తే... పట్టణాలు, మారుమూల గ్రామాలకు వాటి లభ్యత ఇంకా చేరువ కాలేదు. ఆ మాటకొస్తే కొన్ని జిల్లా కేంద్రాల్లోనూ అత్యున్నత స్థాయి వైద్య నిర్ధారణ పరీక్ష ఉపకరణాలు అందుబాటులో లేవు. వైద్య విద్య – మెడికల్ కాలేజీలు... ఈ 70 ఏళ్లలో మన దేశంలో ప్రైవేటు వైద్యకళాశాలల సంఖ్య పెరిగింది, స్వాతంత్య్రం వచ్చిన నాటికి మన దేశంలో మొత్తం 23 మెడికల్ కాలేజీలు ఉండేవి. కానీ ఇప్పుడు (2016) నాటికి వాటి సంఖ్య 439కి పెరిగింది. స్వాతంత్య్రం వచ్చిన నాటితో పోలిస్తే మెడికల్ కాలేజీల సంఖ్య దాదాపు 20 రెట్ల అభివృద్ధి కనిపిస్తున్నా ఇది సరిపోదు. ప్రస్తుతం ప్రతి 2000 మంది రోగులకు ఒక పడక మాత్రమే అందుబాటులో ఉంది. దాదాపు ప్రతి ఏడాది 50,000 మంది డాక్టర్లు అందుబాటులోకి వస్తున్నారు. అయినా ఈ సంఖ్య సరిపోదు. 2034 నాటికి 35 లక్షల పడకలు అవసరమవుతాయనేది ఒక ఉజ్జాయింపు లెక్క. ప్రజల ఆరోగ్యానికి బాధ్యత వహించేలా చేసే ‘సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్’ అనే అంశం మీద వైద్యవిద్యార్థులకు ప్రేమా, గౌరవం రెండూ ఉండటం లేదు. కుప్పలు తెప్పలుగా డబ్బులు సంపాదించి పెట్టే స్పెషలైజేషన్ మీదే ఇప్పుడు వైద్య విద్యార్థుల దృష్టి ఉంటోంది. ఇక 70 ఏళ్ల వైద్య భారతాన్ని గొప్పగా ఆవిష్కరించుకుంటూ... ఇంతగా అభివృద్ధి చెందిందని మనం గొప్పలు చెప్పుకుంటున్న వేళ ఆక్సిజన్ అందక యూపీలో సుమారు 70 మంది చిన్నారులు మృతిచెందడం ఒక మాయనిమచ్చ. హెల్త్ టూరిజం పెరుగుతూనే ఉన్నప్పటికీ... ప్రస్తుతం దేశంలోని ఆసుపత్రుల్లో కార్పొరేట్ రంగ ప్రభావం విస్తృతమవుతోంది. ఆరోగ్య పర్యాటకం అనే అంశంలో ఒకనాడు దాదాపు ఏమీ లేని పరిస్థితి నుంచి ఇప్పుడు మనదేశం రూ. 19, 226 కోట్లు (మూడు బిలియన్ల అమెరికన్ డాలర్లు) ఆర్జించే స్థితిలోకి వచ్చింది. 2020 నాటి అంచనా లెక్కల ప్రకారం ఇది రూ. 51,270 కోట్లు (8 బిలియన్ యూఎస్ డాలర్లు)కు చేరనుంది. అయితే కార్పొరేట్ రంగంలో హార్ట్, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్, మూత్రపిండాల మార్పిడి చికిత్సలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మెదడులోని అత్యంత సున్నితమైన సర్జరీలు వీలుకాని చోట్లలోనూ రేడియేషన్ ఇవ్వగల స్టీరియోటాక్టిక్ రేడియేషన్ చికిత్సలను అందించగల అత్యాధునిక స్థాయి వైద్యకేంద్రాలు ఇక్కడ కొత్తవి ఎన్నో వస్తున్నాయి. దాంతో పాశ్చాత్యదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకునే చాలా మంది విదేశీయులు సైతం భారత్కే తరలి వస్తున్నారు. కానీ మనదేశస్తులకే వాటిని అందిపుచ్చుకునేంత ఆర్థిక స్తోమత లేదు. అంటే విదేశీయుల కరెన్సీలతో పోల్చుకున్నప్పుడు వాళ్లకు చాలా చవకగా లభ్యమయ్యే చాలా ఆధునాతన వైద్య సదుపాయాలు స్వదేశీయులకు మాత్రం అందడం లేదు. అందరికీ ఆరోగ్యం కోసం జరగాల్సిందేమిటి? చిన్న చిన్న అంశాలపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించడం ద్వారానే చాలా ఆరోగ్యరంగంలో పెద్ద పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది. దాంతో సమాజమూ ఆరోగ్యంగా మారే అవకాశమూ ఉంది. ఉదాహరణకు...అందరికీ పుష్టికరమైన పోషకాహారం లభ్యత ద్వారా ఆరోగ్యం బాగుటుంది. అయితే సమాజంలోని 30 శాతం మందికి ఆహార లభ్యత లేని కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి జబ్బులు వస్తున్నాయి. మరో 30 శాతం మందికి ఆహారం ఎక్కువైన కారణంగా డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధులు వస్తున్నాయి. అందుకే అందరికీ సమతులాహారం అందేలా విధానాల రూపకల్పన జరగాలి. చాలా గ్రామాల్లో ఇప్పటికీ రక్షిత మంచినీళ్లు దొరకడం లేదు. దాంతో చిన్న చిన్న గ్రామాల్లోనూ ‘సీసాలలో మంచినీళ్లు’ కొనుక్కోవాల్సిన పరిస్థితి. కాబట్టి ‘కొనుక్కోగలిగితేనే నీళ్లు’ అనే ప్రస్తుత పరిస్థితి నుంచి ‘ఆరోగ్యం కోసం అందరికీ నీళ్లు’ అనే విధంగా ప్రభుత్వాలు సురక్షితమైన మంచినీరు అందించాలి.మంచినీళ్లు లభ్యం కావడం లేదు కానీ... అలాంటి చోట్ల కూడా జబ్బులను ప్రేరేపించే మద్యం, సారాయి వంటివి మాత్రం విరివిగా దొరుకుతున్నాయి. ప్రభుత్వాలే మద్యాన్ని ఒక లాభదాయకమైన ఆదాయ వనరుగా చూస్తూ, మద్యం మీద భారీగా వ్యాపారం చేస్తున్నాయి. ఇది సరికాదు. అలాగే పొగతాగడం హానికరం అనే సూచనను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది. పనిచేసే అలవాటును మరింతగా ప్రోత్సహించాలి. పనిచేయడం వల్ల ఆదాయం వస్తుంది. ఆదాయం బాగుంటే ఆరోగ్యానికి అవసరమైన అన్ని సౌకర్యాలూ, అంశాలను కొనుక్కోవచ్చు. కానీ మనం మన పిల్లలను స్కూలు దశ నుంచే క్రమంగా శారీరక శ్రమకు దూరం చేస్తున్నాం. దాంతో పని అలవాటుతో పాటు వ్యాయామాలు సైతం కొరవడి జబ్బులు వస్తున్నాయి.ఆహారం, నీళ్లు, పని, దురలవాట్లు దూరం చేయడం అనే ఈ ప్రాథమిక అంశాలతోనే చాలావరకు సమాజాన్ని ఆరోగ్యవంతం చేయడంతో పాటు... అనేక రుగ్మతలను మొదట్లోనే తుంచేయవచ్చు. అనేక జబ్బులను సమర్థంగా నివారించవచ్చు. – డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి, ప్రముఖ వైద్య నిపుణులు -
వైద్య ఆరోగ్యశాఖలో మరో 432 పోస్టులు
తల్లీ పిల్లల ఆరోగ్య కేంద్రాలకు ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో మరో 432 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. వివిధ జిల్లా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసే తల్లీ పిల్లల ఆరోగ్య కేంద్రాల్లో వీటిని భర్తీ చేయాలని నిర్ణయించిన వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కరీంనగర్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా తాండూర్, సంగారెడ్డి, జనగాం, ఖమ్మం, నల్లగొండ జిల్లా ఆస్పత్రులు సహా హైదరాబాద్లోని కింగ్కోఠి, సుల్తాన్ బజార్లోని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసే తల్లీ పిల్లల ఆరోగ్య కేంద్రాల్లో ఈ పోస్టులను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆయా కేంద్రాలకుగాను 180 స్టాఫ్నర్సులు, 45 మెడికల్ ఆఫీసర్లు, 18 అనెస్థిటిస్ట్స్, 36 కౌన్సెలర్స్, 27 థియేటర్ అసిస్టెంట్లు, 36 గార్డులు, 36 కంటింజెంట్ వర్కర్లు, 18 ఎల్టీఎస్లు, 18 ఓబీజీవైలు, 18 డీఈవో పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వీటిని భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిత్వ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
ఎవరికీ పట్టని ‘ఆరోగ్యం’
ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు చేయాలన్న సంకల్పం మూడేళ్లుగా మూలనబడి మూలుగుతోంది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో కనీసం 2.5 శాతం మొత్తాన్ని ఆరోగ్య రంగానికి కేటాయించాలన్న నిర్ణయమూ నాలుగేళ్లుగా అటకెక్కింది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తున్నా ఈనాటికీ దేశంలో ఆరోగ్య సదుపాయాలు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు చేయదల్చుకున్నామని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన ముసాయిదా రూపొందిందని వార్తలు వెలువడ్డా ఆ విషయంలో ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేదు. 2012 మార్చిలో యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇకపై జీడీపీలో 2.5 శాతం నిధుల్ని ఆరోగ్య రంగానికే కేటాయి స్తామని ప్రకటించారు. అంతేకాదు... వచ్చే అయిదేళ్లలో రూ. 3 లక్షల కోట్లు ఖర్చు చేసి పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను రూపొందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. యూపీఏ సర్కారు ఆ తర్వాత మరో రెండేళ్లు అధికారంలో ఉన్నా ఆ వాగ్దానాల ఊసే లేదు. ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ ఆ పరిస్థితిలో మార్పేమీ లేదు. ఈసారి కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ. 47,352 కోట్లు కేటాయిం చారు. అంతక్రితం వార్షిక బడ్జెట్తో పోలిస్తే ఇది దాదాపు పదివేల కోట్ల రూపా యలు ఎక్కువే. కానీ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నాక లెక్కేస్తే ఇది 2011–12 బడ్జెట్ కేటాయింపు కన్నా తక్కువంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈసారి కూడా ఈ కేటాయింపు జీడీపీలో 0.29 శాతం మాత్రమే! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ మన దేశంలో ఆరోగ్య రంగానికి వెచ్చిస్తున్న మొత్తం జీడీపీలో 1.2 శాతం మించడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో మనకంటే ఆరోగ్యానికి తక్కువ వెచ్చించే దేశం పాకిస్తాన్ మాత్రమే. ఈ విషయంలో ఆ దేశంకన్నా మెరుగ్గా ఉన్నామని చెప్పుకునే స్థితి ఉండటం ఎంత సిగ్గుచేటు! దేశంలో ఇప్పటికీ వైద్యంలో ప్రైవేటు రంగానిదే పైచేయి. పట్టణ ప్రాంతాల్లో 70 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 63 శాతంమంది ప్రైవేటు వైద్యంపైనే ఆధారపడుతు న్నారని ఇటీవలి సర్వేలో తేలింది. బాలింతల మరణాలు, శిశు మరణాలు ఈమధ్య కాలంలో తగ్గుముఖం పడుతున్న సంగతి నిజమే అయినా అవి ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయి. మనదేశంలో లక్షకు 167మంది బాలింతలు మరణిస్తున్నారు. ఈస్తోనియా(2), గ్రీస్(3) పోలాండ్(5)తో పోలిస్తే మనం ఎక్కడో ఉన్నాం. శిశు మరణాల్లోనూ అదే స్థితి. ప్రతి వేయిమంది పిల్లలకూ 39మంది కళ్లు తెరవకుండానే కన్నుమూస్తున్నారని తాజా సర్వే చెబుతోంది. జపాన్, స్వీడన్లాంటిచోట వేయికి రెండు మరణాలు కూడా లేవు. చిలీ(6), శ్రీలంక(8), సిరియా(12)తో పోల్చినా మనం ఎంతో వెనకబడి ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు వైద్యం అందు బాటులో లేకపోవడం వల్లా, వారికి వైద్య నిపుణుల సలహాలు లభించకపోవడం వల్లా ఈ దుస్థితి ఏర్పడుతోంది. వైద్యం కోసం పౌరులు భారీ మొత్తం ఖర్చు చేయ వలసివచ్చే దేశాల జాబితాలో కూడా మనమే ముందున్నాం. మన దేశంలో ప్రజా రోగ్యానికయ్యే వ్యయంలో 58 శాతాన్ని పౌరులే భరించుకోవాల్సివస్తోంది. థాయ్ లాండ్లాంటి దేశంలో 11 శాతం, వియత్నాంలో కూడా 49శాతం ఉన్నదంటే మన దుస్థితి అర్థమవుతుంది. జీడీపీలో కనీసం 2.5 శాతాన్ని ఖర్చు చేస్తే తప్ప ఈ స్థితి మారదని నిపుణుల బృందం రెండేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నిజానికి నిధుల పెంపు సంగతలా ఉంచి ఉన్న నిధులు సద్వినియోగం అయ్యేలా చూడటం అవసర మని ప్రజారోగ్య కార్యకర్తలు అంటారు. ఆ విషయంలోనూ విఫలమవుతున్నాం. ప్రభుత్వాసుపత్రుల్లో బిడ్డల్ని కని, పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించే తల్లుల ఖాతాలకు రూ. 6,000 బదిలీ చేస్తామని నూతన సంవత్సర ఆరంభంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మొత్తం ప్రసవాల్లో నాలుగోవంతు ప్రభుత్వాసు పత్రుల్లో జరిగినా ఇందుకు ఏడాదికి రూ. 5,000 కోట్లకు పైగా వ్యయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలా చూస్తే జాతీయ ఆరోగ్య పథకాలకు కేటాయించిన రూ. 27,153 కోట్లలో అధికభాగం బాలింతలకే వెళ్తుంది. మిగిలిన మొత్తంతో ప్రామాణికమైన వైద్య సదుపాయాలను కల్పించడం సాధ్యంకాదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టం చేస్తే హృద్రోగాలనూ, కేన్సర్వంటి వ్యాధులనూ సకా లంలో గుర్తించి చికిత్స అందించే అవకాశం ఉంటుంది. అందువల్ల శస్త్రచికిత్సల వరకూ వెళ్లే అవసరం తగ్గుతుంది. పౌష్టికాహారం, మంచినీరు, పారిశుద్ధ్యం మెరుగు పరిస్తే అనారోగ్య సమస్యలను నివారించడం సులభమవుతుంది. విద్యారంగాని కిచ్చే ప్రోత్సాహం కూడా ఈ కృషిలో తోడ్పడుతుంది. కానీ దేనిలోనూ ప్రభుత్వాలు పూర్తి విజయం సాధించలేకపోతున్నాయి. నిజానికి ప్రభుత్వ ప్రమేయం అధికంగా ఉండాల్సిన రెండు కీలక రంగాలు విద్య, వైద్యం అని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అంటారు. ఈ రెండుచోట్లా సంపూర్ణ సేవలు అందించడం ప్రైవేటు రంగానికి అసాధ్యమని చెబుతారు. చిత్రమేమంటే పౌరులకు ప్రాణావసరమైన ఈ రెండు రంగాలనూ మన ప్రభుత్వాలు ప్రైవేటు రంగానికి విడిచిపెట్టాయి. అక్కడ వారి అతీగతీ ఎలా ఉందో గ్రహించలేక పోతు న్నాయి. రైతుల ఆత్మహత్యలు పరిగణనలోకి తీసుకున్నా, గ్రామీణప్రాంతాల్లో జరిగే ఇతర ఆత్మహత్యలను గమనించినా అందులో అధికభాగం రుణభారం వల్లనేనని సులభంగానే తెలుస్తుంది. ఇంట్లో ఎవరికైనా ప్రాణాంతక వ్యాధి వస్తే, శస్త్ర చికిత్స అవసరమైతే అధిక వడ్డీలకు అప్పు చేయక తప్పని స్థితి ఏర్పడుతుంది. వాటి వరకూ పోనవసరం లేదు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవానికయ్యే వ్యయం కనీసం రూ.15,000 నుంచి రూ. 20,000 వరకూ ఉంటుంది. వైద్య రంగంపై సమగ్రమైన దృక్పథం ఉంటే తప్ప ఈ స్థితి మారదు. నిధులు సమకూర్చడంలో, అవసరమైన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడంలో చొరవ ప్రదర్శిస్తే తప్ప ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరచడం సాధ్యం కాదు. ఈ విషయంలో ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవడం అవసరం. -
బయో టెర్రరిజం, అంటువ్యాధులపై యుద్ధం
⇒ ప్రజారోగ్య బిల్లు–2017 ముసాయిదా తయారు ⇒ 1897 నాటి అంటువ్యాధుల చట్టం స్థానే కొత్తది ⇒ రాష్ట్రాల అభిప్రాయాలు కోరుతూ కేంద్రం లేఖ సాక్షి, హైదరాబాద్: బయో టెర్రరిజం, ప్రమాదకరమైన అంటువ్యాధులపై యుద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం 1897 నాటి అంటు వ్యాధుల చట్టాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయిం చింది. దానిస్థానే ప్రజారోగ్య (అంటు వ్యా ధులు, బయో టెర్రరిజం, విపత్తు నిర్మూ లన, నియంత్రణ, నిర్వహణ)బిల్లు–2017కు రూప కల్పన చేసింది. బిల్లు ముసాయిదాను రాష్ట్రా లకు పంపించింది. దీనిపై అభిప్రాయా లు పంపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు విజ్ఞప్తి చేసింది. దాదాపు 120 ఏళ్ల క్రితం ఏర్పాటైన అంటువ్యాధుల చట్టం– 1897 ప్రస్తుత పరి స్థితులకు అనుగుణంగా లేదు. బయో టెర్ర రిజం ద్వారా వ్యాధుల వ్యాప్తి అంశాలు పాత చట్టంలో లేవు. ఇన్నేళ్లలో అనేక అంటువ్యా ధులు ఉనికిలోకి వచ్చాయి. వాటిని నిర్మూలించడం, నియంత్రించడమే ప్రధాన లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు. ప్రమాదకరంగా బయో టెర్రరిజం.. నేరుగా యుద్ధం చేయకుండా జంతువులు, మనుషులు, ఇతరత్రా పద్ధతుల్లో వైరస్ను ప్రజల్లో వ్యాపింపజేయడం ద్వారా నష్టం చేకూర్చేందుకు ఉగ్రవాదులు, శత్రు దేశాలు ప్రయత్నిస్తుంటాయి. తద్వారా దేశంలో పెద్ద ఎత్తున జన సమూహం అనారోగ్యంతో చని పోయే పరిస్థితులు తలెత్తుతుంటాయి. బయో టెర్రరిస్టు ఏజెంట్లు ఆంత్రాక్స్, ట్రెంచ్ ఫీవర్, గ్లాండర్స్, క్యూ ఫీవర్, ప్లేగ్, కలరా తదితర బ్యాక్టీరియాలను ప్రజల్లోకి పంపుతారు. ఎబోలా, లస్సా ఫీవర్, ఎల్లో ఫీవర్, డెంగీ వంటి వైరస్లనూ సమాజంలోకి వదిలే అవ కాశం ఉంది. ఇలా దాదాపు 36 రకాల బ్యాక్టీ రియాలు, వైరస్లు, ఫంగీ, టాక్సిన్స్లను బయో టెర్రరిజంలో ఉపయోగించేవిగా గుర్తించారు. ఆంత్రాక్స్ను పోస్టల్ కార్డుల ద్వారానూ.. కరపత్రాల ద్వారానూ వ్యాపిం పజేసే ప్రమాదమూ ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వివిధ దేశాలు ఇలాంటి బయో టెర్రరిజాన్ని వాడుకుంటున్నాయి. ఉగ్ర వాదులూ దీన్నో సాధనంగా ఉపయోగించు కుంటున్నారు. 1984లో అమెరికాలోని డల్లాస్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పాల్గొనకుండా రెస్టారెంట్లు, స్టోర్లు తదితర చోట్ల సాల్మొనిల్లా టైఫీమురియం అనే బ్యాక్టీరియాను కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు వ్యాపింపజేశాయి. దీంతో 750 మంది ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యారు. అలాగే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆంత్రాక్స్ను జంతువులపై ప్రయోగించారు. 1972లో ఇద్దరు అమెరికా విద్యార్థులు షికాగోలోని ప్రజా నీటి సరఫరా ట్యాంకుల్లో టైఫాయిడ్ బ్యాక్టీరియాను వ్యాపింపజేశారు. 1993లో టోక్యోలో ఒక మత సంస్థ ఆంత్రాక్స్ బ్యాక్టీరి యాను వ్యాపింపజేసింది. ఇలా బయో టెర్రరి జానికి సంబంధించి వందల ఉదాహరణ లున్నాయి. ఇటువంటి వాటికి దేశంలో చెక్ పెట్టాలనేదే కొత్త చట్టం ఉద్దేశం. ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో రాష్ట్రాల్లోకి కేంద్ర బలగాలు.. ఆరోగ్య రంగం రాష్ట్రాలకు సంబం ధించిన అంశం. అయితే బయో టెర్రరిజం, ఇతర అంటువ్యాధుల వ్యాప్తిని నివారించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే కేంద్ర బలగాలు రాష్ట్రాల్లోకి నేరుగా ప్రవేశించేందుకు నూతన చట్టం వీలు కల్పిస్తుంది. ఎవరి మీదనైనా.. సంస్థలపైనా అనుమానం ఉంటే ఎటువంటి హెచ్చరికలు లేకుండా వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అలాగే బయో టెర్రరిజం కుట్రలో భాగంగా వైరస్, బ్యాక్టీరియా ఉన్న వ్యక్తి తాను వైద్యం చేయించుకోనంటే కుదరదు. వారిని బలవంతంగా పట్టుకొచ్చి చికిత్స చేయిస్తారు. మానవ హక్కుల పేరుతో ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. కాగా, ఈ బిల్లును తాము స్వాగతిస్తున్నా మని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
వైద్యరంగంలో అద్భుతానికి భారత్ వేదిక
న్యూఢిల్లీ: బ్రెయిన్ డెడ్ రోగులు తిరిగి ప్రాణం పోసుకున్న సందర్భాలు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేవు. అలాంటి రోగులపై వైద్య పరీక్షలు నిర్వహించడం పలు దేశాల్లో చట్ట విరుద్ధం, అనైతికం కూడా. అలాంటి రోగుల చచ్చిన మెదళ్లపై తాను ప్రయోగాలు నిర్వహించడమే కాకుండా, వారికి తిరిగి ప్రాణం పోస్తానని చెబుతున్నారు ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్కు చెందిన డాక్టర్ హిమాంషు బన్సల్. తనను తాను ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఇసాక్ న్యూటన్తో పోల్చుకునే డాక్టర్ బన్సల్ స్వతహాగా ఆర్థోపెడీషియన్. తన రివిటలైఫ్ సెన్సైస్ కంపెనీ తర ఫున వైద్య రంగంతో వినూత్న ప్రయోగాలు నిర్వహించడం ఆయనకు అలవాటే. బ్రెయిన్ డెడ్కు పునర్ ప్రాణంపోసే తన ప్రాజెక్టుకు డాక్టర్ బన్సల్ ‘రీ ఎనిమా ప్రాజెక్ట్’ అని పేరుకూడాపెట్టారు. ఈ ప్రాజెక్టు గురించి విన్న తోటి డాక్టర్లే నవ్వుతున్నారు. కొందరు ఇది వృధా ప్రయాస అని వాదిస్తుండగా, ఇది అనైతికమని మరికొందరు వాదిస్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి ఎన్ని విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా డాక్టర్ బన్సల్ తన ప్రయోగానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయంలో అమెరికాలోని బయోటెక్ సంస్థ బయోక్వార్క్తో ఒప్పందం కూడా చేసుకున్నారు. జన్యు కణాల చికిత్స, లేజర్ చికిత్సలతోపాటు నరాల్లో ఉత్ప్రేరణ కల్పించడం ద్వారా చచ్చిన మెదడుకు ప్రాణం తెప్పించేందుకు కృషి చేస్తున్నానని డాక్టర్ బన్సల్ తెలిపారు. బ్రెయిన్ డెడ్ రోగులపై ఇలాంటి ప్రయోగాలు నిర్వహించడం అమెరికాలో చట్ట విరుద్ధమే కాకుండా, అనైతికమని, భారత్లో ఇలాంటి ప్రయోగం నిర్వహించేందుకు తాము ముందుకు రావడానికి ఇదో కారణం కాగా, భారత్లో వైద్య ఖర్చులు తక్కువవడం మరో కారణమని అమెరికా బయోక్వార్క్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఒక్క రోగిపై ఈ ప్రయోగానికి అమెరికాలో ఆరేడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, అదే భారత్లోనైతే అందులో పదోవంతు ఖర్చు అవుతుందని వారు అంటున్నారు. ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్లో బ్రెయిన్ డెడ్ రోగులు ఎక్కువగా ఉంటున్నారని, అందుకనే తన ప్రయోగానికి ఆ ఊరును ఎన్నుకున్నానని డాక్టర్ బన్సల్ తెలిపారు. తన ప్రయోగానికి ‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ అనుమతి ఉందని ఆయన చెబుతున్నారు. కేవలం డ్రగ్స్పై ప్రయోగాలకు మాత్రమే అనుమతి మంజూరుచేసే అధికారం కలిగిన ఈ సంస్థ డాక్టర్ బన్సల్ ప్రయోగానికి ఎలా అనుమతి ఇచ్చిందో అర్థంకాని విషయం. ఇదే విషయమై భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ను సంప్రదించగా తమకు ఇలాంటి ప్రయోగాలపై నియంత్రణాధికారాలు లేవని అన్నారు. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)యే ఏవైనా చర్యలు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. తమకూ తగిన రెగ్యులేటరీ అధికారాలు లేవని ఇటీవల వైద్య కళాశాలల కేసు విషయంలోనే సుప్రీం కోర్టుకు విన్నవించుకున్న ఎంసీఐ ఈ విషయంలో చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం లేదు. ‘ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు. నేను బతికున్న మనుషులపై ప్రయోగాలు చేయడం లేదు. శ్మశానానికి వెళుతున్న బ్రెయిన్ డెడ్ రోగులపైనే ప్రయోగాలు చేస్తానంటున్నాను. మహా అంటే వారు శ్మశానానికి వెళ్లడం 15 రోజులు ఆలస్యం అవుతుంది. ప్రయోగం సక్సెస్ అయితే వైద్య చరిత్రలోనే అదో అద్భుతం అవుతుంది’ అని బన్సల్ వ్యాఖ్యానించారు. -
4 పెద్దాసుపత్రులు
నగరంలో వెయ్యి పడకల హాస్పిటళ్ల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశం గ్రామీణ ప్రాంత ప్రభుత్వ వైద్యులు పనిచేసేచోటే ఉండక్కర్లేదు సమీపంలోని పట్టణంలో నివాసానికి అవకాశం కల్పిస్తాం అదనపు వేతనం కూడా అందజేస్తాం పల్లెల్లో పనిచేయాలనే నిబంధన కచ్చితంగా అమలు ప్రతి జిల్లాలో నాలుగు చోట్ల ఎంఆర్ఐ, సీటీస్కాన్ యంత్రాలు నిర్లక్ష్య ధోరణిని వీడాలని అధికారులకు ఆదేశం రూ. 8,400 కోట్ల బడ్జెట్ కోరిన వైద్యారోగ్యశాఖ సాక్షి, హైదరాబాద్: నగరంలో గాంధీ, ఉస్మానియాలకు తోడుగా మరో నాలుగు వెయ్యి పడకల ఆసుపత్రులను నిర్మించాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. ఈ మేరకు స్థలాలను ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వైద్యులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపడుతోంది. వారు పనిచేస్తున్న చోటేగాకుండా సమీప పట్టణాల్లో నివసించేందుకు అనుమతించనుంది. దీంతోపాటు వారికి అదనపు వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే వీటిని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల సంఖ్య పెంచి, ప్రతి వైద్యుడు ఎన్ని గంటలు విధుల్లో ఉండాలో నిర్ణయించాలని సూచించారు. వైద్య విద్యార్థులే కాకుండా, ప్రభుత్వ వైద్యులంతా కచ్చితంగా కొంతకాలం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలనే నిబంధనను అమలు చేయాలని ఆదేశించారు. బడ్జెట్ సమీక్షల్లో భాగంగా శనివారం వైద్య ఆరోగ్యశాఖపై సీఎం సమీక్షించారు. వైద్య మంత్రి లక్ష్మారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ఉన్నతాధికారులు రాజేశ్వర్ తివారీ, రామకృష్ణారావు, శివశంకర్, సమాచార కమిషనర్ నవీన్మిట్టల్ ఇందులో పాల్గొన్నారు. రాజధానిలో నాలుగు పెద్దాసుపత్రులు హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియాలకు తోడుగా మరో నాలుగు వెయ్యి పడకల ఆసుపత్రులను నిర్మించాలని... అందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కింగ్కోఠి ఆసుపత్రి స్థాయిని పెంచి మల్టీ స్పెషాలిటీగా మారుస్తామని చెప్పారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మహిళలు, పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. వరంగల్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని... ఈ వర్సిటీ, మెడికల్ కాాలేజీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రస్తుతమున్న సెంట్రల్ జైలు ప్రాంతంలో నిర్మిస్తామని సీఎం వెల్లడించారు. ప్రతి జిల్లాలో కనీసం నాలుగు చోట్ల, మొత్తం 40 చోట్ల ఎంఆర్ఐ, సీటీస్కాన్, అల్ట్రా సౌండ్, మెమోగ్రఫీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కిడ్నీ, కాలేయం లాంటి అవయవాల మార్పిడికి అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపర్చాలని సూచించారు. బెడ్లపై దుప్పట్లు మార్చడమూ కష్టమేనా..? ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలగడం లేదని, నిర్లక్ష్య ధోరణిని వీడాలని అధికారులతో సీఎం పేర్కొన్నారు. ‘‘మీకు విపరీతమైన నిర్లక్ష్యం. ఉస్మానియా, గాంధీల్లో రోజూ దుప్పట్లు మార్చడం కూడా కష్టమేనా..? గవర్నర్ వెళ్లి చూస్తే గానీ మీకు జ్ఞానోదయం కాదా.. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్నట్లే మంచి బెడ్లు, బెడ్షీట్లు, పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. బెడ్షీట్లను ఎప్పటికప్పుడు మార్చాలి. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించాలి. గర్భిణుల ప్రసవ సమయంలో తమ కుటుంబీకులు కూడా వెంట ఉండేలా ప్రత్యేక గది అందుబాటులోకి తేవాలి. 108, 104 సేవలను మరింత బలోపేతం చేయడానికి అనువైన విధానం రూపొందించండి. జాతీయ రహదారుల మీద పెట్రోలింగ్ చేసే వాహనాలతో ఈ వాహనాలను అనుసంధానం చేయండి. ప్రమాదాలు సంభవించిన సమయంలో పోలీసు, ఆరోగ్యశాఖ సమన్వయంతో పనిచేయాలి..’’ అని సూచించారు. మళ్లీ ప్రతిపాదనలతో రండి వైద్యారోగ్య శాఖకు రూ.8,400 కోట్ల మొత్తాన్ని ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో ప్రణాళిక కింద రూ.5,200 కోట్లు, మిగతా నిధులు ప్రణాళికేతర వ్యయం కింద కోరారు. అయితే ఈ మొత్తంతో ఏం చేస్తారని సీఎం ప్రశ్నించగా... అధికారులు మూస సమాధానాలు ఇవ్వడంతో మండిపడ్డారు. వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రజలకు నమ్మకం కలగడం లేదని, ఖర్చు చేస్తున్న ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా ప్రతిపాదనలతో మళ్లీ రావాలని ఆదేశించారు. కాగా బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ శనివారం క్యాంపు కార్యాలయంలో 10 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించారు. వైద్యారోగ్యశాఖతో పాటు పురపాలన, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, ఐటీ శాఖల ప్రతిపాదనలపై అధికారులతో కలసి కసరత్తు చేశారు. -
ఆరోగ్యశాఖకు ఓసీఎస్ జ్వరం!
300-ఓసీఎస్..ఇప్పుడు ఇదే వైద్య ఆరోగ్యశాఖను కుదిపేస్తోంది. మూడు నాలుగేళ్ల రికార్డుల్లో తలదూర్చే పని కల్పిస్తోంది. ఎక్కడ ఏ లోపం ఉందో.. ఏ లెక్క తమ కొంప ముంచుతుందోనన్న ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ ఈ 300-ఓసీఎస్ ఏమిటంటే.. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు, థర్డ్ పార్టీ విధానంలో పని చేస్తున్న పారా మెడికల్ సిబ్బంది, వైద్యులకు సంబంధించిన వేతన బడ్జెట్ ఖాతా పేరే 300-ఓసీఎస్(అదర్ కాంట్రాక్చువల్ సర్వీస్). మరి దీని పేరెత్తితే ఉలికిపాటు ఎందుకంటే.. ఇటీవల విశాఖ జిల్లాలో ఈ ఖాతాలోని నిధుల వినియోగంలో కుంభకోణం బయటపడింది. దాంతో ఈ ఖాతా కింద గత మూడేళ్లలో జరిగిన నిధుల ఖర్చు వివరాలు పంపాలని ఆరోగ్య శాఖ డెరైక్టర్ నుంచి అన్ని జిల్లాలకు తాఖీదులు అందడంతో ఆ లెక్కలతో ఇప్పుడు ఆ శాఖ అధికారులు కుస్తీ పడుతున్నారు. రిమ్స్ క్యాంపస్ : 300 ఓసీఎస్ ఖాతా నిధుల వినియోగంలో జిల్లాలోనూ అధికారుల చేతివాటం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివరాల కోసం అడిగినప్పుడు అధికారుల తడబాటు ఈ అనుమానాలకు ఆస్కారమిస్తోంది. జిల్లాలో 76 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటలో 29 మంది వైద్యులు, 186 మంది నర్సులు, 10 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 13 మంది ఫార్మశిస్టులు.. వీరితో పాటు ఏజెన్సీ ప్రాంతంలో 115 మంది ఎంపీహెచ్డబ్ల్యు సిబ్బంది కాంట్రాక్టు, థర్డ్ పార్టీ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరందరికి మూడు నెలలకోసారి 300-ఓసీఎస్ ఖాతా కింద వేతన బడ్జెట్ విడుదలవుతుంది. నెలకు సుమారు *51 లక్షలు చొప్పున మూడు నెలలకు *1.53 కోట్లు విడుదలవుతాయి. అంటే ఏడాదికి సుమారు *6.12 కోట్లు. ఉద్యోగుల హాజరు, పనిదినాలను బట్టి ఇందులో కొద్దిపాటి హెచ్చు తగ్గులు ఉండొచ్చు. అయితే ఈ ఖాతా ద్వారా విడుదలవుతున్న నిధులు సద్వినియోగం అవుతున్నాయా లేదా అన్నదానిపై ఇంత వరకు స్పష్టత లేదు. కొందరు వైద్యాధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులు ఈ నిధుల వినియోగంలో చేతి వాటం చూపినట్టు సమాచారం. విశాఖపట్నంలో కూడా ఈ విధంగానే పని చేయకుండానే కొన్ని దొంగ పేర్లు పెట్టి నిధులు కాజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల వివరాలు పంపాలని ఆరోగ్య శాఖ డెరైక్టర్ ఆదేశించారు. జిల్లా వివరాలు పంపడంలో ఆలస్యం 2011 నుంచి 2014 వరకు మూడు ఆర్థిక సంవత్సరాలకు చెందిన ఖర్చుల వివరాలు పంపాలని తాఖీదులు అందడంతో జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పీహెచ్సీల వారీగా ఏ ఏడాది ఎంత బడ్జెట్ వచ్చింది. ఆ ఏడాది ఎంతమంది పని చేశారు. ఎన్ని నిధులు ఖర్చు చేశారన్న వివరాలు స్పష్టంగా పంపాలని ఆదేశించడంతో ఆ లెక్కల సేకరణలో అధికారులు తలమునకలుగా ఉన్నారు. ఎంత ఖచ్చితంగా ఉన్నా.. ఎక్కడో ఏవో చిన్న పొరపాట్లు జరగడం సహజమని, ఇప్పుడు ఆ వివరాలు వెలికితీస్తే విశాఖ అధికారుల మాదిరిగా తాము కూడా దొరికిపోతామేమోనన్న ఆందోళన జిల్లా అధికారులకు పట్టుకుంది. లెక్కలు తరచి తరచి చూస్తూ గడువు ముగిసినా కూడా వివరాలు పంపకుండా కాలక్షేపం చేస్తున్నారు. తప్పులు జరిగిన పీహెచ్సీల్లో వాటిని సరిదిద్దిన అనంతరం పక్కా వివరాలు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ వైద్య ఆరోగ్యశాఖలోనే సాగుతోంది. అందువల్లే ఇప్పటికీ కొన్ని పీహెచ్సీల వివరాలు సిద్ధం కాలేదని తెలిసింది. అధికారులనే వివరాలు కోరడం కంటే క్షేత్రస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 12 పీహెచ్సీల వివరాలు రావాలి దీనిపై డీఎంహెచ్వో కార్యాలయ పరిపాలనాధికారి వీర్రాజు వద్ద ప్రస్తావించగా 300-ఏసీఎస్ బడ్జెట్ వినియోగానికి సంబంధించి వివరాలు కోరుతూ హెల్త్ డెరైక్టరేట్ నుంచి ఆదేశాలు అందడం వాస్తవమేనని ధ్రువీకరించారు. 12 పీహెచ్సీల నుంచి వివరాలు అందాల్సి ఉందని, అవి అందిన వెంటనే పంపిస్తామని చెప్పారు. ఈ నిధుల వినియోగం జిల్లాలో ఎక్కడా అవకతవకలు జరగలేదని చెప్పారు. -
ఆ ఎయిమ్స్ ఉందా?
రాష్ట్రానికి ఎయిమ్స్ తరహా సంస్థను మంజూరు చేసిన కేంద్రం దీన్ని తన్నుకుపోయేందుకుకోస్తా నేతల యత్నం జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మేల్కోకపోతే తీవ్ర నష్టం ఎయిమ్స్ ఏర్పాటైతే అభివృద్ధి పథంలో పయనించనున్న ‘అనంత’ అనంతపురం :వైద్య, ఆరోగ్య రంగంలో జిల్లా అనంత దూరంలో వెనుకబడింది. రాయలసీమలోని మిగతా జిల్లాలతో పోల్చినా ఇక్కడ చెప్పుకోదగ్గ ఆస్పత్రి లేదు. కర్నూలులో ఎప్పటి నుంచో అభివృద్ధి చెందిన బోధనాస్పత్రి (మెడికల్ కాలేజీ, జనరల్ ఆస్పత్రి) ఉంది. చిత్తూరు జిల్లా తిరుపతిలో శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (సిమ్స్), కడపలో రాజీవ్గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్) ఉన్నాయి. ఎటొచ్చీ అనంతపురం జిల్లాలోనే చెప్పుకోదగ్గ ఆస్పత్రి లేదు. ఉన్న 500 పడకల సర్వజనాస్పత్రి నిధుల కొరత, సౌకర్యాల లేమితో అల్లాడుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో అనంతపురం పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లా వెనుకబాటు తనాన్ని చూసి కాకపోయినా..12 మంది ఎమ్మెల్యేలను అందించినందుకైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ‘అనంత’ అభివృద్ధిపై శ్రద్ధ చూపాల్సిన అవసరముందన్నది ‘అనంత’ ప్రజానీకం అభిప్రాయం. ఇలాంటి తరుణంలో ప్రతిష్టాత్మక ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) తరహా సంస్థను ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మేర భూమిని సేకరిస్తే, మిగతా ఖర్చంతా కేంద్రమే భరించి అత్యున్నత ప్రమాణాలతో వైద్యవిజ్ఞాన సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టును కూడా తరలించుకుపోయేందుకు అధికార పార్టీకి చెందిన కోస్తా ప్రాంత నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నిరంగాల్లో వెనుకబడ్డ అనంతపురం జిల్లాకు ఈ ప్రాజెక్టును తీసుకొచ్చేందుకు జిల్లా ప్రజాప్రతినిధులు ఏ మేరకు చొరవ చూపుతారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థులపై దాడులు చేయించడం, వారి తోటలను నాశనం చేయించడం లాంటి సంకుచిత చర్యలపై మాత్రమే దృష్టి సారించకుండా జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రజలు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో సీమ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే సూచనలు కనిపించడం లేదు. కనీసం కేంద్రం పూర్తిగా నిధులు చేకూర్చే ఇలాంటి ప్రాజెక్టుల ఏర్పాటులోనైనా వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లాలోని మేధావులు కోరుతున్నారు. కాగా, ‘ఎయిమ్స్’ను తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చొరవతో 1956లో ఢిల్లీలో ఏర్పాటు చేశారు. అప్పట్లో మన నాగార్జునసాగర్ డ్యాంను, ఎయిమ్స్ను నెహ్రూ ‘ఆధునిక దేవాలయాలు’గా అభివర్ణించారు. 2012లో ఎయిమ్స్ తరహా ఇన్స్టిట్యూట్లను భోపాల్, భువనేశ్వర్, జోధ్పూర్, పాట్నా, రాయ్పూర్లలో ఏర్పాటు చేశారు. ఎయిమ్స్ తరహా సంస్థ ఏర్పాటైతే? * వైద్య, ఆరోగ్య రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు అందుబాటులోకి వస్తాయి. * దాదాపు 50 విభాగాల్లో అత్యున్నత స్థాయి వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. * టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది దాదాపు 8 వేల మంది ఉంటారు. * ఎంబీబీఎస్, పీజీ, నర్సింగ్, పారా మెడికల్, మెడికల్ టెక్నాలజీ, మెడికల్ బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో వేలమంది విద్యార్థులకు సీట్లు దొరుకుతాయి. *అన్ని విభాగాల్లో కలుపుకుని దాదాపు రెండు వేల పడకల సామర్థ్యంలో ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్యం లభిస్తుంది. అనుకూలతలెన్నో ‘ఎయిమ్స్’ ఏర్పాటుకు జిల్లాలో చాలా అనుకూలతలు ఉన్నాయి. ‘లేపాక్షి నాలెడ్జ్ హబ్’ కోసం సేకరించిన 12 వేల ఎకరాల భూములు సిద్ధంగా ఉన్నాయి. హిందూపురం ప్రాంతంలో సేకరించిన ఈ భూములు బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్నాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వంద కిలోమీటర్లలోపే ఉంటుంది. ప్రాజెక్టు ఏర్పాటుకు అన్ని అనుకూలతలూ ఉన్న నేపథ్యంలో దాన్ని రాబట్టేందుకు జిల్లా ప్రజాప్రతిధులు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరముంది. -
సీమాంధ్ర ఆరోగ్య భరోసా: కొత్త సీఎం ఏం చేయాలి?
వైద్యుడు లేని ఊళ్లో ఉండొద్దన్నారు మన పెద్దలు. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటైన తరువాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో వైద్య సేవల సంగతేమిటి? సీమాంధ్ర ప్రాంతంలోని చాలా ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలను ఎలా అందించాలి? ప్రతిదానికి హైదరాబాద్ పరిగెత్తుకు రాకుండా అక్కడే వైద్య సదుపాయాలను ఎలా మెరుగుపరచాలి? అయిదు కోట్ల సీమాంధ్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా ఏది? సీమాంధ్రలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఏజెండాలో ప్రజారోగ్యమే పెద్ద ప్రశ్న! ఈ గణాంకాలను పరిశీలించంది. సీమాంధ్రలో విద్యుత్ సరఫరా అందక ఇంక్యుబేటర్లు పనిచేయక నాలుగు వేల మంది పిల్లలు చనిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు వేలాది ప్రాణాలను ప్రతి ఏటా కబళిస్తున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో ప్రజారోగ్యం పడకేసింది. ఆరోగ్య శ్రీ, 108 వంటి సేవలు అడుగంటిపోయాయి. ఒకప్పుడు కుయ్ కుయ్ కుయ్ మంటూ ఆరోగ్య భరోసా వినిపించిన 108 కూత ఇప్పుడు వినిపించడం లేదు. స్పెషాలిటీ వైద్య పరిశోధనా కేంద్రాలేవీ సీమాంధ్ర లో లేవు. అన్నిటికీ హైదరాబాదే శరణ్యం అన్న ధోరణి సీమాంధ్ర వైద్యరంగంలో ఉంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో ఏర్పడబోయే తొలి ప్రభుత్వం ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రజారోగ్యానికి ఎలాంటి భరోసా ఇవ్వాలి? మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వ వైద్యాన్ని ఎలా మెరుగుపరచాలి? ప్రజలు వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేరుకోవాలంటే ఏం చేయాలి? అట్టడుగు పేదకు అతిపెద్ద వైద్యం ఎలా అందుబాటులోకి తేవాలి? ప్రభుత్వ, ప్రైవేటు వైద్యాల సమన్వయంతో ఆరోగ్యాన్ని అందరికీ ఎలా పంచాలి? మీ సలహాల మూట విప్పండి! మీ సజెషన్ల మాట చెప్పండి!! మీరిచ్చే సలహా సీమాంధ్ర ఆరోగ్యానికి శ్రీరామరక్ష కావచ్చు. మీరిచ్చే సజెషన్ కోట్లాది ప్రజల పాలిట సంజీవని కావచ్చు.