High Power Committee
-
‘బంగారు’ గనులు
సాక్షి, అమరావతి: గతంలో ఎప్పుడూ లేనివిధంగా విలువైన 22 ఖనిజ లీజులకు ఒకేసారి వేలం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సూచించిన 9 బ్లాకులు, రాష్ట్ర మైనింగ్ శాఖ ఎంపిక చేసిన 13 బ్లాకులకు త్వరలో వేలం నిర్వహిస్తారు. వీటిలో 21 బ్లాకులకు కాంపోజిట్ లీజులు, ఒకటి సాధారణ లీజుకు ఇస్తారు. అనంతపురం జిల్లాలో 9,740 హెక్టార్లలో 10 బంగారు గనులు ఇందులో ఉన్నాయి. రామగిరి నార్త్, సౌత్, బొక్సంపల్లి నార్త్, సౌత్, జవ్వాకుల ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ బ్లాకులుగా బంగారు గనులకు కాంపోజిట్ లీజులు ఇస్తారు. అలాగే శ్రీకాకుళం జిల్లా బటువ, విజయనగరం జిల్లా పెద్దలింగాలవలస, నంద, ములగపాడు, గరికపేట, శివన్నదొరవలస, బుధరాయవలసలో మాంగనీస్ గనులు లీజుకు ఇవ్వనుంది. వీటిలో తొలి రెండింటిని మైనింగ్ శాఖ ఎంపిక చేయగా మిగిలిన ఐదింటిని జీఎస్ఐ నిర్థారించింది. ప్రకాశం జిల్లా లక్ష్మక్కపల్లె, అద్దంకివారిపాలెంలో ఇనుప ఖనిజం, కడప జిల్లా ఉప్పరిపల్లెలో వజ్రాల గని, నెల్లూరు జిల్లా మాసాయపేటలో బేస్మెటల్ గనికి లీజులు ఇవ్వనుంది. ఈ 21 గనుల్లో జీ–4 (ప్రాథమిక స్థాయి) సర్వే ద్వారా ఖనిజ లభ్యతను గుర్తించారు. దీనిద్వారా తవ్వబోయే ఖనిజం గురించి పూర్తి సమాచారం తెలియదు. జీ–3, జీ–2, జీ–1 స్థాయి సర్వేలు చేశాకే అక్కడ ఎంత ఖనిజం ఉంది, ఏ గ్రేడ్ది ఉందనే వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం జీ–4 సర్వే ఆధారంగా వేలం పాటలు నిర్వహించి కాంపోజిట్ లీజులు ఇస్తారు. ఈ లీజు తీసుకుంటే వెంటనే మైనింగ్కు అవకాశం ఉండదు. లీజు పొందిన వారే మలి దశ సర్వేలు చేయించుకోవాలి. ఇందుకు కొన్నేళ్లు సమయం ఇస్తారు. ఆ తర్వాత ఆ లీజులను సాధారణ లీజులుగా మారుస్తారు. ఇవి కాకుండా విజయనగరం జిల్లా చిన్నబంటుపల్లిలో మాంగనీస్ గనికి సాధారణ లీజుకు వేలం నిర్వహించనున్నారు. నేడు హైపవర్ కమిటీ సమావేశం ఈ లీజుల వేలానికి విధివిధానాలు ఖరారు చేసేందుకు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. రిజర్వు ధర, ప్రీమియం, వేలం ఎలా నిర్వహించాలనే అంశాలను ఈ కమిటీ ఖరారు చేస్తుంది. వాటి ప్రకారం 22 బ్లాకులకు మైనింగ్ శాఖ టెండర్లు పిలుస్తుంది. వీటన్నింటికీ లీజులు ఖరారైతే ఒకేసారి భారీ స్థాయిలో లీజులు మంజూరు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంది. ఇప్పటికే ఎటువంటి ఆటంకాలు లేకుండా గొర్లగుట్ట లైమ్స్టోన్, గుటుపల్లి ఇనుప ఖనిజం బ్లాకుల లీజుల్ని కేటాయించినందుకు కేంద్రం రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షల రివార్డును ఏపీకి ప్రకటించింది. -
పోలవరంపై హైపవర్ కమిటీ భేటీ రద్దు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సోమవారం జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ రద్దయింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పూర్తయిన తర్వాత హైపవర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పోలవరంతో సహా 16 జాతీయ ప్రా జెక్టుల పనుల పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ నేతృత్వంలో హైపవర్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ భేటీ వర్చువల్ విధానంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని కేంద్ర జల్ శక్తి శాఖ శుక్రవారం ప్రకటించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కావడం.. లోక్సభ, రాజ్యసభల్లో కేంద్ర జల్ శక్తి శాఖకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉండటంతో పంకజ్కుమార్ వాటిలో నిమగ్నమయ్యారు. దాంతో హైపవర్ కమిటీ సమావేశాన్ని రద్దు చేశారు. -
ఆ కమిటీని రద్దు చేస్తాం: హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: జీవో 111 పరిధిలోకి రాని ప్రాంతాలపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్ కమిటీ నామమాత్రంగా మారిందని హైకోర్టు మండిపడింది. సంవత్సరాలు గడుస్తున్నా నిర్ణయం తీసుకోని ఈ కమిటీని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారులే ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ మండిపడింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ముందు దాఖలైన ఓ కేసు విచారణలో భాగంగా సీఎస్ సోమేశ్కుమార్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, వాటర్వర్క్స్ ఎండీ దానకిషోర్ల నేతృత్వంలో హైపర్ కమిటీని ఏర్పాటు చేశామని 2018లో చెప్పినా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 111ను సమర్ధవంతంగా అమలు చేయాలని, వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను జీవో 111 పరిధిలోకి పొరపాటుగా చేర్చారంటూ దాఖలైన పలు పిటిషన్లను ధర్మాసనం మరోసారి విచారించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు హైపవర్ కమిటీ ఇప్పటికి 28 సార్లు సమావేశమైందని ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ సంజీవ్కుమార్ నివేదించగా ‘ఎటువంటి నిర్ణయం తీసుకోలేనప్పుడు 100 సార్లు సమావేశమైతే ఏంటి?’ అంటూ ధర్మాసనం మండిపడింది. ఈ వ్యవహారానికి సంబంధించి కమిటీ తీసుకున్న నిర్ణయాలతోపాటు కమిటీ సమావేశాలకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. చదవండి: అందుకు భార్య సమ్మతి అవసరం లేదు: హైకోర్టు -
రేపు సాయంత్రం ఏపీ పదో తరగతి ఫలితాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదల కానున్నాయి. ఎస్సెస్సి బోర్డు మార్క్స్ మెమోలను కూడా రేపే విడుదల చేయనుంది. 2020–21 విద్యార్థుల ఫలితాలు, గ్రేడ్లతోపాటు 2019–20 టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు కూడా ప్రకటించనుంది. కోవిడ్ కారణంగా ఈ రెండు విద్యాసంవత్సరాల్లో పబ్లిక్ పరీక్షలను నిర్వహించని సంగతి తెలిసిందే. ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించి ఫలితాలు విడుదల చేయనున్నారు. హైపవర్ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే జీవో 46ను విడుదల చేసింది. ఫలితాలను గణించడానికి అనుసరించనున్న విధివిధానాలను అందులో వివరించింది. గ్రేడ్ల విధానంలో విద్యార్థుల ఉత్తీర్ణతను ప్రకటించనున్నారు. 2019–20 విద్యార్థులు రాసిన మూడు ఫార్మేటివ్ పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఒక సమ్మేటివ్ పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. మొత్తం 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ ఇస్తారు. అన్ని సబ్జెక్టులకు ఇదే విధానం అనుసరిస్తారు. వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే విధానం. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిలై ఆ తరువాత పరీక్షలకు హాజరైనవారికి వారి ఇంటర్నల్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 20 అంతర్గత మార్కులను 5తో రెట్టింపుచేసి 100 మార్కులుగా పరిగణించి గ్రేడ్ ఇస్తారు. -
అన్ని సబ్జెక్టుల మార్కుల ఆధారంగా గ్రేడ్లు
సాక్షి, అమరావతి: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ప్రకటించేందుకు మార్కుల విధానాన్ని హైపవర్ కమిటీ ఖరారు చేసింది. బుధవారం కమిటీ తుది సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించనుంది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఎస్సెస్సీ బోర్డు ఫలితాల విడుదలపై తుది కసరత్తు చేపట్టనుంది. ఆపై వారం పది రోజుల్లో ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలియజేశాయి. అన్ని మార్కుల యావరేజ్తో గ్రేడ్లు ఎస్సెస్సీ పరీక్షల్లో విద్యార్థులకు వారి ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల్లోని అన్ని సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతకు ముందు ఆయా సబ్జెక్టుల్లో ఎక్కువ శాతం మార్కులు వచ్చిన(బెస్ట్ 3) సబ్జెక్టుల యావరేజ్ను పరిగణనలోకి తీసుకుని గ్రేడ్లు ఇవ్వడంపై కమిటీ దృష్టి పెట్టింది. అయితే బెస్ట్ 3 ప్రకారం కాకుండా అన్ని సబ్జెక్టుల మార్కుల యావరేజ్ను పరిగణనలోకి తీసుకోవడం వల్ల అందరికీ మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆ ప్రకారం ఫలితాలివ్వాలని కమిటీ చర్చించింది. ఈ విధానంలోనే 2020–21, 2019–20 విద్యా సంవత్సరాల విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించనున్నారు. ► 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఫార్మేటివ్–1, ఫార్మేటివ్–2 మార్కులను తీసుకుని గ్రేడ్లు ప్రకటిస్తారు. ఎఫ్ఏ(ఫార్మేటివ్ అసెస్మెంట్) పరీక్షలకు సంబంధించి లిఖిత పూర్వక పరీక్షలు, ఇతర పరీక్షలను విభజిస్తారు. ఎఫ్ఏ–1లోని లిఖిత పరీక్షకు సంబంధించిన 20 మార్కులను 70 శాతానికి పెంపుచేస్తారు. ఇతర 3 రకాల పరీక్షలకు సంబంధించిన 30 మార్కులను 30 శాతంగా పరిగణిస్తారు. ఉదాహరణకు 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఒక విద్యార్థికి ఎఫ్ఏ–1 లిఖిత పూర్వక పరీక్షలో 20 మార్కులకు 18 మార్కులు వస్తే వాటిని 70 శాతానికి పెంపుచేసి 31.5 మార్కులుగా పరిగణిస్తారు. మిగతా మూడు విభాగాల్లో 30 మార్కులకు 27 మార్కులు సాధించి ఉంటే వాటిని 30 శాతానికి కుదింపుచేసి 13.5 మార్కులు వచ్చినట్టుగా పరిగణిస్తారు. మొత్తంగా ఎఫ్ఏ–1లో ఆ విద్యార్థికి 45 మార్కులు వచ్చినట్టుగా ప్రకటిస్తారు. అదే విధంగా ఎఫ్ఏ–2 మార్కులనూ విభజిస్తారు. ఎఫ్ఏ–2లో ఆ విద్యార్థికి 47 మార్కులొస్తే కనుక ఆ రెంటినీ కలిపి 100 మార్కులకు 92 మార్కులు సాధించినట్టుగా.. గ్రేడును నిర్ణయిస్తారు. ► 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకూ గ్రేడ్లపై కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ విద్యాసంవత్సరంలో విద్యార్థులు ఫార్మేటివ్ అసెస్మెంటు(ఎఫ్ఏ) పరీక్షలు 3, సమ్మేటివ్ అసెస్మెంటు (ఎస్ఏ) పరీక్ష ఒకటి రాసి ఉన్నారు. ఫార్మేటివ్ 1, 2, 3ల మార్కులను 50గా తీసుకుంటారు. సమ్మేటివ్ పరీక్షలు 100 మార్కులకు నిర్వహించినందున వాటిని యావరేజ్ చేసి 50గా తీసుకుంటారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులను రెండింటినీ కలిపి 100 శాతానికి యావరేజ్ చేసి గ్రేడ్లు ఇవ్వనున్నారు. -
ఆ ఘటన కలిచివేసింది: దివ్య దేవరాజన్
సాక్షి, హైదరాబాద్: అమీన్పూర్లో జరిగిన ఘటన కలిచివేసిందని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈఘటనపై మూడు ఎఫ్ఐఆర్లు ఇప్పటివరకు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటికి ముగ్గురు నిందితులను అరెస్టయ్యారని, అక్కడ ఉన్న చిన్నారులను ప్రభుత్వ హోంకి తరలించామని వెల్లడించారు. నేటి నుంచి హైపవర్ కమిటీతో విచారణ జరుగుతుందన్నారు. డీజీపీ మహేందర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ అనాథాశ్రమాలపై విచారణ చేస్తున్నామన్నారు. పాప పోస్ట్మార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. 429 ప్రైవేట్ హోమ్స్ లో విచారణ చేస్తున్నామని ఆమె వెల్లడించారు. చివరిగా చిన్నారి స్టేట్మెంట్ ఇచ్చిందని, అందులో చిన్నారి బంధువు కూడా వైర్తో దాడి చేసినట్లు తెలిపిందన్నారు. ఆశ్రమంలో అమ్మాయిపైనా అఘాయిత్యం జరిగినట్లు చిన్నారి తెలిపిందని పేర్కొన్నారు. ఆగస్టు 20న హైపవర్ కమిటీ ప్రాథమిక నివేదిక అందిస్తుందని దివ్యదేవరాజన్ తెలిపారు. -
నిర్లక్ష్యమే కారణం
సాక్షి, అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్లో జరిగిన ప్రమాదం వెనుక యాజమాన్యం నిర్లక్ష్యమే ఎక్కువగా ఉందని హైపవర్ కమిటీ నిగ్గు తేల్చింది. భద్రతా నియమాలను సక్రమంగా పాటించకపోవడం, ప్రమాద సంకేతాలను హెచ్చరికలుగా పరిగణించకపోవడం వల్లే ఈ అనర్థం సంభవించిందని స్పష్టం చేసింది. అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి నివేదిక సమర్పించింది. కమిటీ సభ్యులైన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్తో కలసి నాలుగు వేల పేజీల నివేదికను నీరబ్ కుమార్ ముఖ్యమంత్రికి అందజేశారు. ఇందులో నివేదిక 350 పేజీలు కాగా అనుబంధాలతో కలిపి మొత్తం 4,000 పేజీలు ఉన్నట్లు నీరబ్ కుమార్ మీడియాకు తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన సీఎం... నివేదిక అందిన అనంతరం కమిటీ సభ్యులుగా ఉన్న విశాఖ కలెక్టర్ వినయ్చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కేంద్ర ప్రభుత్వం నియమించిన సభ్యులు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డైరెక్టర్ డాక్టర్ అంజన్రాయ్, చెన్నైకి చెందిన సీపెట్ డైరెక్టర్ ఎస్కే నాయక్, కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ డైరెక్టర్ భరత్ కుమార్ శర్మలతో సీఎం జగన్¯ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కమిటీ నివేదికలో ముఖ్యాంశాలు ► ఎల్జీ పాలిమర్స్లో ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడంలో తప్పు జరిగింది. ఎల్జీ పాలిమర్స్లో 2019 డిసెంబర్లో రిఫ్రిజిరేటర్ పైపులు మార్చారు. దీనివల్ల కూలింగ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతింది. అప్పట్లో ఫ్యాక్టరీలో ఉష్టోగ్రతను కొలిచే పరికరాన్ని ట్యాంకు కింది భాగంలో అమర్చారు. దీనివల్ల ట్యాంకు మధ్యభాగం, పైభాగంలో ఎంత టెంపరేచర్ ఉందో తెలుసుకోలేకపోయారు. ఈ తరహా గ్యాస్ లీకేజీ ఘటన దేశంలోనే మొదటిది. ► స్టైరీన్ పాలిమరైజేషన్ అవుతోందని డిసెంబర్లోనే రికార్డు అయినా యాజమాన్యం దీన్ని హెచ్చరికగా భావించలేదు. ► ఒకవైపు ట్యాంకుల్లో ఉష్ణోగ్రత భారీగా పెరగడం, స్టైరీన్ బాష్పీభవనం చెందడం (బాయిలింగ్ పాయింట్), ఆవిరి రూపంలో బయటకు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ► స్టైరీన్ ఆవిరి రూపంలో బయటకు వెళ్లడానికి కారణాలను బొమ్మల రూపంలో కమిటీ నివేదికలో వివరించింది. పలు రకాలుగా సమాచార సేకరణ... ► ఎల్జీ పాలిమర్స్లో గత మే 7వ తేదీన తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరగ్గా మే 10న కమిటీ ప్రమాద స్థలాన్ని సందర్శించింది. సాంకేతిక నిపుణులతో కలిసి పరిశ్రమలో ప్రమాదానికి కారణమైన ట్యాంక్, కంట్రోల్ రూంతో, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. యాజమాన్యాన్ని ప్రశ్నించి సమాధానాలు రాబట్టింది. ► సాంకేతిక నిపుణులైన ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కేవీ రావు, ఐఐపీఈ ప్రొఫెసర్ వీఎస్ఆర్కే ప్రసాద్, ఏయూ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఎస్.బాలప్రసాద్కు బాధ్యతలు అప్పగించి కమిటీ సమాచారాన్ని సేకరించింది. ► బాధితులతో పాటు ప్రత్యక్ష సాక్షులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణవేత్తలు, పరిశ్రమల అభిప్రాయాలను తీసుకుంది. సీబీఆర్ఎన్, ఎన్డీఆర్ఎఫ్, సీఎస్ఐఆర్, ఎన్ఈఈఆర్ఐ, ఏపీపీసీబీ నుంచి కూడా పూర్తి వివరాలను సేకరించింది. ► విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ , వీఎంఆర్డీఏ, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, సీఈఎస్ఓ, బాయిలర్స్ డిపార్ట్మెంట్, ఏపీపీసీబీ, పరిశ్రమల శాఖ, కార్మికశాఖ, అగ్ని మాపక శాఖల నివేదికలను పరిశీలించింది. ► జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నుంచి నియమితులైన కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సీహెచ్వీ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ పి.జగన్నాధరావును కలిసి సమాచారం సేకరించింది. ► 250 ఈ మెయిల్స్, 180 ఫోన్కాల్స్తో పాటు 1,250 ప్రశ్నలతో వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం తీసుకుంది. మీడియా, వివిధ రాజకీయ పక్షాల నుంచి కూడా సమాచారం సేకరించింది. ► కమిటీలో ఐదుగురు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, నలుగురు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిపుణులున్నారు. 11 వాల్యూమ్లతో 4 వేల పేజీల నివేదికను కమిటీ రూపొందించింది. కమిటీలోని 9 మంది సభ్యులూ నివేదికను ఆమోదించారు. అయితే మీడియాలో వచ్చినట్లుగా ఇది గ్యాస్ లీక్ కాదని, ‘అన్ కంట్రోల్డ్ స్టైరీన్ వేపర్ రిలీజ్’ అని కమిటీ పేర్కొంది. ప్రమాదాల నియంత్రణకు నివేదికే దిక్సూచి: సీఎం వైఎస్ జగన్ ► ఎల్జీ పాలిమర్స్లో చోటు చేసుకున్న ప్రమాదంపై హైపవర్ కమిటీ అందచేసిన నివేదిక భవిష్యత్తులో పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకంగా ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. పరిశ్రమల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఈ నివేదిక ఒక ఆరంభం కావాలన్నారు. అవసరమైతే ప్రస్తుత చట్టాల్లో మార్పులు, సవరణలు చేస్తామన్నారు. ► ప్రమాదం జరిగినప్పుడు హెచ్చరించే అలారం పరిశ్రమలో 36 చోట్ల ఉన్నప్పటికీ అవి సక్రమంగా పని చేయలేదని హైపవర్ కమిటీ నివేదికలో పొందుపర్చిందని సీఎం చెప్పారు. అలారం మోగకపోవడం లాంటి లోపాల వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం చోటు చేసుకుంటోందన్నారు. తరలింపు లేదా మార్పులు.. ► ఘటనపై హైపవర్ కమిటీ నివేదిక మేరకు నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను దూరంగా తరలించడం లేదా గ్రీన్, వైట్ కేటగిరీ పరిశ్రమలుగా మార్పులు చేసుకోవాలని నిర్దేశిస్తామని సీఎం జగన్ చెప్పారు. ► పరిశ్రమలకు సంబంధించి అన్ని శాఖలు మరింత పటిష్టంగా కార్యాచరణ ప్రణాళికతో పాటు ప్రొటోకాల్ సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రజల రక్షణ, పరిశ్రమల్లో భద్రత పట్ల ప్రభుత్వం ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలిసేలా హైపవర్ కమిటీ నివేదికను ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించారు. -
ఎల్జీ గ్యాస్ లీకేజీ: ప్రమాదానికి కారణమదే
సాక్షి, అమరావతి : విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది నివేదికను సమర్పించింది. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించిన నివేదికలో పలు ముఖ్య అంశాలను ప్రస్తావించింది. ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ 4వేల పేజీల నివేదికలో కీలక విషాయాలను వెల్లడించింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని కమిటీ నివేదికలో పేర్కొంది. సీఎంకు నివేదిక సమర్పించిన అనంతరం కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. విశాఖలో జరిగింది కేవలం గ్యాస్లీకేజీ మాత్రమే కాదని అనియంత్రిక స్టైరిన్ కూడా పెద్ద ఎత్తున విడుదలైందని తెలిపారు. ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలను కాపాడం చాలా కీలకమైన విషయామని, అయితే ఎల్జీ పాలిమర్స్ విషయంలో తీవ్ర తప్పదం జరిగిందని పేర్కొన్నారు. 2019 డిసెంబర్లో రిఫ్రిజిరేషన్ పైపులు మార్చారని, దీనివల్ల కూలింగ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించామని చెప్పారు. (ఎల్జీ గ్యాస్ లీకేజీపై హైపర్ కమిటీ నివేదిక) సైరన్ ఆన్ చేయకపోవడం అతి పెద్ద నిర్లక్ష్యం ‘ఫ్యాక్టరీలో ఉష్టోగ్రత కొలిచే పరికరం ట్యాంకు కింది భాగంలో అమర్చారు. దీనివల్ల ట్యాంకు మధ్యభాగంలో పైభాగంలో ఎంత టెంపరేచర్ నమోదు అవుతోంది తెలుసుకోలేకపోయారు. స్టైరిన్ పాలిమరైజేషన్ అవుతోందని వారికి డిసెంబర్లోనే రికార్డు అయింది. కానీ దీనిని వారు హెచ్చరికగా భావించలేదు. ఓ వైపు ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరగడం, స్టైరిన్ బాయిలింగ్ పాయింట్కు చేరడం, ఆవిరి రూపంలో బయటకు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. స్టైరిన్ ఆవిరి రూపంలో బయటకు వెళ్లడానికి కారణాలేంటో పూర్తిగా డయాగ్రామ్ రూపంలో నివేదికలో పొందుపరిచాం. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే... స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన తరువాత కూడా ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫ్యాక్టరీలో 36 చోట్ల అల్లారం పాయింట్లున్నాయి.. ప్రమాదం జరిగినా సైరన్ మోగించలేదు. ఎల్జీ పాలిమర్స్లో అల్లారం ఆన్ చేయకపోవడం అతి పెద్ద నిర్లక్ష్యం. స్టైరిన్ను అదుపు చేసేందుకు కావాల్సిన రసాయనాలు పూర్తిస్థాయిలో ఫ్యాక్టరీలో లేవు. ఒకవేళ ఇలాంటి రసాయనాలు అందుబాటులో ఉంటే స్టైరిన్ను త్వరగా న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉండేది. ఈ రసాయనాలను గుజరాత్ నుంచి తెప్పించాల్సి వచ్చింది. అప్పటికే ట్యాంకుల్లో టెంపరేచర్ పూర్తిగా పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాలపై అధ్యయనం కేవలం ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదానికే పరిమితం కాకుండా దీనికి సంబంధించిన అన్ని విభాగాల పనితీరుపైనా మేము విచారణ చేశాము. పారిశ్రామిక అభివృద్ధి ముఖ్యమే కాని.. దానితోపాటు పరిశ్రమల భద్రత, పర్యావరణ సంరక్షణ కూడా ముఖ్యమే. దీని కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలో చర్చించాము. ఎల్జీ పాలిమర్స్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన ఫ్యాక్టరీ జనావాసాల్లో ఉండేందుకు వీల్లేదు అని నివేదికలో స్పష్టంగా చెప్పాము. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రమాదాలపై అధ్యయనం చేసి ఇలాంటి ఫ్యాక్టరీలు ఎక్కడ ఉండాలనే దానిపై సూచనలు చేశాం. చాలా ఫ్యాక్టరీల్లో స్టైరిన్లాంటి కెమికల్స్ వాడుతుంటారు ఇలాంటి ఫ్యాక్టరీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిబంధనలు సూచించాం. పరిశ్రమల భద్రతకు సంబంధించి ఒకే ఏజన్సీకి అధికారాలివ్వాలని సూచించాం. ప్రమాదకర రసాయనాల ఫ్యాక్టరీలను జనావాసాల కంటే దూరంగా ఏర్పాటుచేయాలి. మాస్టర్ ప్లాన్ తయారు చేసే సమయంలోనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్జీ పాలిమర్స్ను వేరే ప్రాంతానికి తరలించడం మంచిది అనే మా అభిప్రాయం’ అని నివేదికలోని వివరాలు వెల్లడించారు. -
అల్లారం ఆన్ చేయకపోవడం అతి పెద్ద నిర్లక్ష్యం
-
ఎల్జీ పాలిమర్స్ ఘటన: నేడు హైపవర్ కమిటీ నివేదిక
సాక్షి, తాడేపల్లి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంపై హైపవర్ కమిటీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నేడు నివేదికను సమర్పించనుంది. అటవీ పర్యావరణం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ సభ్యులుగా హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మే 7న ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ ఘటనపై ఆరు ప్రత్యేక కమిటీలతో పాటు హైపవర్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ఐదు గ్రామాల బాధిత ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, సీనియర్ జర్నలిస్ట్లతో హైపవర్ కమిటీ చర్చించింది. ప్రమాదం జరిగిన తీరు, భవిష్యత్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను కమిటీ ఇవ్వనుంది. -
ఎల్జీ పాలిమర్స్ ఘటన.. త్వరలోనే తుది నివేదిక
సాక్షి, అమరావతి: ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సేకరించిన సమాచారం ఆధారంగా తుది నివేదికను త్వరలో సిద్ధం చేయనున్నామని హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ కమిటీ ఇప్పటికే సంబంధం ఉన్న అందరి నుండి సలహాలు, సూచనలు ప్రశ్నలు సేకరించడం జరిగిందన్నారు. దానిలో భాగంగా 243 రిప్రజెంటేషన్ 175 టెలిఫోన్, పబ్లిక్, వాట్సాప్ ను రిసీవ్ చేసుకున్నామని పేర్కొన్నారు. దాని ఆధారంగా కమిటీ ఒక ప్రశ్నావళి రూపొందించి ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఇతర రెగ్యులేటరీ అథారిటీ ద్వారా అందించడం జరిగిందని, ఇంకా ఎల్జీ పాలిమర్స్ నుంచి జవాబు అందాల్సి ఉందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను హైపవర్ కమిటీ తుది జాబితాలో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. మే నెలలో విశాఖపట్నం సందర్శించిన హైపవర్ కమిటీ స్టేక్ హోల్డర్స్ అందరితో సుదీర్ఘ చర్చలు నిర్వహించిందన్నారు. జూన్ 15న ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు, నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఘటనలపై విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వచ్చే వారంలో హైపవర్ కమిటీ మరిన్ని సమావేశాలు రెగ్యులేటరీ ఆథారిటీతో కలిపి నిర్వహించనుందని ఆయన తెలియజేశారు. -
గ్యాస్ లీకేజీ ఘటన: ముగిసిన విచారణ
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మూడు రోజుల విచారణ పూర్తి అయింది. దీనిపై ఈ నెల 20 లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని హైపవర్ కమిటీ చైర్మన్, భూమి శిస్తు చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఎ) నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి మొత్తం సమాచారాన్ని సేకరించి, దానిని క్రోడీకరించి సమగ్ర నివేదికను రూపొందించడానికి వీలుగా హైపవర్ కమిటీ సన్నాహాలు చేస్తోంది. (ఎల్జీ పాలిమర్స్కు ఎన్వోసీ ఇవ్వలేదు) గ్యాస్ లీక్ అయిన సమయంలో పని చేసిన జర్నలిస్టులు, జీవీఎంసీ ఫైర్ సిబ్బంది అభిప్రాయాలను కమిటీ సభ్యులు సేకరించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ప్రతినిధులు హైపవర్ కమిటీకి పలు సూచనలు చేశారు. మనుషులు, జంతువులపై స్టైరిన్ గ్యాస్ ప్రభావంపై పరిశోధనలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన ఆధారంగా ఇతర ప్రమాదకర పరిశ్రమల స్థితిగతులపైనా అధ్యయనం చేయాలని కోరారు. ముఖ్యంగా ప్రజల్లో మానసిక ఆందోళన తొలగించే ప్రయత్నం అత్యవసరమని పేర్కొన్నారు. (‘మేఘాద్రి’లో స్టైరిన్ లేదు) -
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ విచారణ
-
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై హైపవర్ కమిటీ విచారణ
-
హైపవర్ కమిటీ సమావేశం ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ సంస్థలో గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, భూమి శిస్తు చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఎ) నీరబ్కుమార్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ వివేక్ యాదవ్, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ వినయ్చంద్ పాల్గొన్నారు. గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి మొత్తం సమాచారాన్ని సేకరించి, దానిని క్రోడీకరించి సమగ్ర నివేదికను రూపొందించడానికి వీలుగా హైపవర్ కమిటీ సన్నాహాలు చేస్తోంది. సంఘటన ఎలా జరిగింది. లీకేజీకి సంబంధించిన అంశాలు విపులంగా పరిశీలించనుంది. వివిధ కమిటీల నివేదికలను పరిశీలించి, పర్యావరణ, సాంకేతిక నిపుణుల అభిప్రాయాలు తెలుసుకొని, ప్రజల వినతులు అధ్యయనం చేసి.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరి నుంచి సమాచారం సేకరించడానికి కమిటీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పలు నివేదికలు రావడంతో పూర్తిస్థాయి ముసాయిదా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఇందుకోసం మూడు రోజులపాటు హైపవర్ కమిటీ వివిధ వర్గాలతో వరుసు భేటీలు నిర్వహించనుంది. చదవండి: బాబాయ్ భ్రష్టు పట్టించారు -
గ్యాస్ లీక్ ఘటనను విశ్లేషించనున్న కమిటీ
-
గ్యాస్ లీక్పై విచారణకు హైపవర్ కమిటీ
సాక్షి, అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై కారణాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి (హై పవర్) కమిటీని నియమించింది. కారణాలను అన్వేషించడంతోపాటు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఫార్సులు చేయాలని కమిటీని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీకి నీరబ్కుమార్ ప్రసాద్ నేతృత్వం అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సభ్యులుగా ఉండే ఈ కమిటీలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ సభ్య కన్వీనరుగా వ్యవహరిస్తారు. అధ్యయనం చేయాల్సిన అంశాలివీ.. ► గ్యాస్ లీకేజీకి కారణాలతోపాటు భద్రతా ప్రమాణాలను కర్మాగారం పాటించిందా లేదా? అనే అంశాలను కమిటీ విచారించాలి. ► పరిసర గ్రామాలపై గ్యాస్ లీకేజీ ప్రభావం దీర్ఘకాలం ఉంటే నివారణ చర్యలపై కూడా సిఫార్సు చేయాలి. ► యాజమాన్యం నిర్లక్ష్యమే గ్యాస్ లీక్కు కారణమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ సిఫార్సు చేయాలి. ► నివారణ చర్యలు, భద్రతా తనిఖీలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలి. ► ఈ తరహా పరిశ్రమలకు సంబంధించి కమిటీ పరిశీలించిన ఇతర ముఖ్యమైన అంశాలను కూడా నివేదికలో పేర్కొనవచ్చు. ► కమిటీ నెల రోజుల్లోగా ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలి. ► నివారణ చర్యలపై సూచనల కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలు/ నిపుణులను కమిటీ సహాయకులుగా హైపవర్ కమిటీ చైర్మన్ ఎంపిక చేసుకోవచ్చు. ► కమిటీకి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిని ప్రభుత్వం ఆదేశించింది. రూ.30 కోట్లు విడుదల ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో బాధితులకు నష్టపరిహారం చెల్లించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం జగన్ మోహన్రెడ్డి విశాఖపట్నం వెళ్లి బాధితులను పరామర్శించి నష్టపరిహారం ప్రకటించారు. సీఎం ఆదేశం మేరకు ప్రమాదం జరిగిన మరుసటి రోజునే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.30 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తక్షణమే చెల్లించాలని ఆదేశం ► ఒక్కో మృతుని కుటుంబానికి రూ.కోటి చొప్పున తక్షణమే పరిహారం చెల్లించాలని ఉత్తర్వులు. ► వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లింపు. ► రెండు, మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి రూ.లక్ష, ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స పొందిన వారికి రూ. 25 వేల చొప్పున చెల్లిస్తారు. ► గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చెల్లిస్తారు. ► ప్రమాదం జరిగిన మరుసటి రోజే బాధితులందరికీ నష్టపరిహారం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై అధికార వర్గాల హర్షం. ► ఆపన్నులకు, బాధితులకు సహాయం అందించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు తానే సాటి అని ఈ చర్య ద్వారా నిరూపించుకున్నారన్న పలువురు ఐఏఎస్లు. ప్రతి అంశంలోనూ సీఎం జగన్ ఇదే రకమైన వేగాన్ని ప్రదర్శిస్తున్నారని, నిర్ణయాల్లోనూ, అమల్లోనూ అదే తీరు కనబరుస్తున్నారని ప్రశంస. -
గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ ప్రారంభం
సాక్షి, విశాఖ : ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ ఘటనపై శుక్రవారం ఐఏఎస్ల హైపవర్ కమిటీ విచారణ ప్రారంభమైంది. కమిటీ ఛైర్మన్ సీనియర్ ఐఏఎస్ అధికారి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవెన్.. కమిటీ కన్వీనర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు వివేక్ యాదవ్, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్లు ఈ విచారణలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు అరగంటకు పైగా కంపెనీలో గ్యాస్ లీక్ అయిన తీరుపై అధికారులు, కార్మికులను విచారించారు.(గ్యాస్ లీక్ ఘటన: ఎక్స్గ్రేషియా విడుదల) ప్రజలేవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి పరిస్థితి కొంత మేర అదుపులోకి వచ్చిందని, ప్రజలేవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హైపర్ కమిటీ సభ్యుడు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికల్ వలవెన్ అన్నారు. శుక్రవారం గ్యాస్ లీకేజీ ఘటనపై హైపర్ కమిటీ విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన సాంకేతిక నిపుణులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రమాదంపై విచారణ ప్రారంభించాము. కంపెనీ అలారం మోగకపోవడంపై విచారణ చేస్తాము. గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తాము. ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సంబంధించిన స్టోరేజ్ ట్యాంక్లను పరిశీలిస్తాము. ప్రత్యేక బృందం పరిస్థితులను పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం గ్యాస్ ట్యాంక్ ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయ’’ని తెలిపారు. -
గ్యాస్ లీకేజీ ఘటన : హైపవర్ కమిటీ ఏర్పాటు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం : విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం తెల్లవారుజామున ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన స్టైరిన్ విషవాయువును పీల్చడం ద్వారా 12 మంది మృతి చెందగా, వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదకర ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హైపవర్ కమిటీకి సీనియర్ ఐఏఎస్ అధికారి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ చైర్మన్గా నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కరికలవలవన్, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా, పీసీబీ మెంబర్ సెక్రటరీ వివేక్ యాదవ్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. (గ్యాస్ లీక్.. 12కు చేరిన మృతులు) ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ వెలువడటానికి గల కారణాలపై ఈ కమిటీ సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎల్జీ పాలిమర్స్ పుట్టుపూర్వోత్తరాలను ఆరా తీయనుంది. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా చేపట్టిన విస్తరణ కార్యకలాపాలు, దీనికి సంబంధించిన అనుమతి పత్రాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. కంపెనీ కార్యకలాపాల్లో అనుమతులు, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలు చోటు చేసుకుంటే దానికి గల కారణాలను ఈ కమిటీ అన్వేషించనుంది. విచారణలో ఎదురైన అంశాలు, ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం వెల్లడించిన అభిప్రాయాలతో కూడిన సమగ్ర నివేదికను నెల రోజుల్లోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయాల్సి ఉంటుందని ప్రభుత్వం హైపవర్ కమిటీకి సూచించింది. (పరిశ్రమల శాఖను అప్రమత్తం చేసిన మంత్రి) -
కరోనా: హైపవర్ కమిటీ,మంత్రివర్గ ఉపసంఘం భేటీ
-
చంద్రబాబు సంఘ విద్రోహ శక్తా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నాయని, ప్రపంచంలోని తెలుగువారంతా ఈ ప్రత్యేక సమావేశాలను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై అంబటి మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మూడు ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ చరిత్రాత్మక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారని, ఈ బిల్లును రాష్ట్ర ప్రజలందరూ హర్షించాలని కోరారు. ‘ఐదేళ్ల క్రితం 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. అంతకుమునుపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముందు కర్నూలు రాజధానిగా కొంతకాలం ఆంధ్ర రాష్ట్రం పరిపాలన కొనసాగింది. తెలుగువారంతా ఒకేప్రాంతంగా ఉండాలన్న భాషాప్రయోక్త రాష్ట్రాల భావనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేశారు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర నాలుగు ప్రాంతాలను కలిపి ఉమ్మడి రాష్ట్రం కొనసాగింది. మన భాష ఒక్కటే.. యాసలు వేరు. సమైక్య ఉద్యమం జరిగినప్పుడు నందమూరి తారకరామారావు ‘తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది’ అన్న పాటతో చైతన్యం కల్పించారు. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒక్కటే అని ఆనాడు నందమూరి చాటిచెప్పారు. కానీ ఆయన వారసులుగా చెప్పుకునేవారు, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు తుళ్లూరు నాది, మందడం నాది, ఉద్దండరాయపురం నాది.. అన్ని కలిసిన అమరావతి నాదే నాదే అంటున్నారు. విశాఖపట్నం నాది కాదు, కర్నూలు నాది కాదు, అమరావతి మాత్రమే నాది అనే సంకుచిత స్థాయికి చంద్రబాబు ఎందుకు దిగజారిపోయారు’ అని అంబటి మండిపడ్డారు. గతంలో తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నాది.. హైదరాబాద్లోని ప్రతి అంగుళం నాది అనే భావనతో శాసనసభకు వెళ్లేవాడినని, కానీ పరిణామక్రమంలో హైదరాబాద్ ఏమైందో అందరికీ తెలుసునని అన్నారు. దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూ ఏకైక మహానగరంగా హైదరాబాద్ ఎదిగిందని, మన హైదరాబాద్ బ్రహ్మాండంగా ఎదిగిందని మనమంతా గర్వించామని, కానీ, తెలంగాణ ఉద్యమం, సమైక్య ఉద్యమాలు జరిగి.. చివరకు హైదరాబాద్ నుంచి మెడ పట్టుకొని మనల్ని బయటకు గెంటారా? లేదా? అని ప్రశ్నించారు. ఈ మహానగరం మాదేనని తెలంగాణవారు తిరుగుబాటు చేశారని, రాజధాని ఏర్పాటు సంబంధించి ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, రాజధాని ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను ప్రజలు ఆయనపై పెడితే.. ఆయన మాత్రం అసలైన అమరావతిని విస్మరించి.. అమరావతి పేరిట కృష్ణా జిల్లా వైపును ఎన్నుకున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో ఉన్న అసలైన అమరావతిని నిర్లక్ష్యం చేసి.. ఆ పేరును వాడుకొని అటువైపు.. అమరావతిలో ల్యాండ్పూలింగ్ పేరిట చంద్రబాబు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మండిపడ్డారు. అమరావతి పేరిట చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదా? అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అమరావతిలో పెద్ద కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డారని, రాజధాని విషయంలో ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేయలేదని, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు.. ఇలా అన్ని తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టారని గుర్తు చేశారు. బలహీనవర్గాలను దెబ్బతీసేందుకు రాజధాని విషయంలో చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారని, ఆయన, టీడీపీ నేతలు బినామీ పేర్లతో అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపించారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో ఉండే సౌకర్యాన్ని వదిలిపెట్టి.. అర్ధంతరంగా చంద్రబాబు ఎందుకు పారిపోయి వచ్చారని ప్రశ్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టి దౌర్జన్యం చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతా? లేక సంఘవిద్రోహ శక్తా? అని ధ్వజమెత్తారు. రాజధాని కోసం చంద్రబాబు పోరాటం చేయడం లేదని, కేవలం తన బినామీల కోసమే ఆయన పోరాటం చేస్తున్నారని అంబటి స్పష్టం చేశారు. అందరూ బాగుండాలనేవిధంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన చేస్తున్నారని, అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలనే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణ వల్ల చంద్రబాబుకు వచ్చే నష్టమేంటని అంబటి సూటిగా ప్రశ్నించారు. ఇలా అధికారాన్ని వికేంద్రీకరించడం వల్ల మళ్లీ ఎలాంటి ఉద్యమాలు రావు అని అన్నారు. నిజమైన రైతులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అన్యాయం చేయబోదని పేర్కొన్నారు. ఇప్పుడున్నవారంతా నిజమైన రైతులు కారని పేర్కొన్నారు. అమరావతి విషయంలో సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ ఒకే వాదన వినిపిస్తున్నారని, కానీ, రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కమలంలో పచ్చపుష్పాలు ఎక్కువయ్యాయని అంబటి ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణమంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలా మారిందని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొందని తెలిపారు. చంద్రబాబునాయుడు మొదట ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకించారని, తర్వాత సమర్థించారని తెలిపారు. ఇప్పుడు విశాఖను వ్యతిరేకించిన వారు, తర్వాత సమర్థిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు అమరావతిపై ప్రేమ లేదని, కేవలం వారు కొనుక్కున్న భూములపైనే ప్రేమ ఉందని విమర్శించారు. అమరావతి రైతులకు ఎలాంటి సమస్యలున్నా చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు మాటలు విని ఎవరూ మోసపోవద్దని కోరారు. -
ఎందుకు భయం.. విశాఖ ఏమైనా అరణ్యమా?
సాక్షి, అమరావతి: ‘విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని పెడతామంటే.. ప్రతిపక్ష టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు.. విశాఖపట్నం ఏమైనా అరణ్యమా?’ అని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సూటిగా ప్రశ్నించారు. సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ తీరుపై, ఎల్లో మీడియా ప్రచారంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మావోయిస్టులు ఉన్నారని ఎల్లో మీడియాతో టీడీపీ నేతలు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి గత ప్రభుత్వం అమరావతికి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. అమరావతిలో జరిగింది రాజధాని నిర్మాణామా? లేక రియల్ ఎస్టేట్ వ్యాపారమా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 1600 ఎకరాల భూములను 125 ఆర్గనైజేషన్లకు కేటాయించిందని, 1300 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలకు ఒకవిధంగా, ప్రైవేటు సంస్థలకు మరోవిధంగా భూకేటాయింపులు జరిపి.. అనేక అవకతవకలకు పాల్పడిందని విమర్శించారు. అమరావతిలోని భూములను టీడీపీ స్వాహా చేసిందని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. అన్ని ప్రాంతాల మీద భారాన్ని మోపి.. అమరావతిలో తాను, తనకు చెందిన 20, 30 మంది మాత్రమే అభివృద్ధి చెందాలని చంద్రబాబు చూస్తున్నారని, అందుకే అమరావతిలోని భూములన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దుర్భరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని,అనంతపురం జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదవుతుందని, వానల కోసం అక్కడి ప్రజలు కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారని తెలిపారు. అనంతపురంలోని దుర్భర కరువు పరిస్థితులను చూసి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కంటతడి పెట్టారని, ఇక్కడి ప్రజలకు కనీసం గంజి కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని సూచించారని గుర్తు చేశారు. ఇక, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ఎక్కువగా వలసలు చోటుచేసుకుంటున్నాయని, అక్కడ బతుకుదెరువు లేక, చేసుకోవడానికి పనిలేక అక్కడి ప్రజలు వలస వెళుతున్నారని, శ్రీకాకుళం మత్య్సకారులు పాకిస్థాన్లో పట్టుబడితే.. సీఎం జగన్ కల్పించుకొని వారిని విడిపించి.. ఇక్కడికి తీసుకొచ్చారని, వారికి ఐదు లక్షల చొప్పున సీఎం ఆర్థికసాయం అందించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తమ ప్రభుత్వం రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోదని బుగ్గన స్పష్టం చేశారు. వందేళ్ల తప్పులను సరిదిద్దాలనుకుంటున్నామని, ఐదేళ్లది కాదని తెలిపారు. ప్రజానామస్మరణ చేసుకుంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకెళుతున్నారని చెప్పారు. -
హై పవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం
అమరావతి: హై పవర్ కమిటీ నివేదికకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం సమావేశమైన మంత్రిమండలి భేటీ పలు కీలక అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సంబంధించి శాసనసభలో ప్రతిపాదించే బిల్లుపై చర్చించి ఆమోదముద్ర వేసింది. అలాగే రాజధాని రైతులకు చెల్లిస్తున్న పరిహారానికి సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇచ్చే పరిహారాన్ని పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రైతులకు చెల్లిస్తున్న పరిహారం రూ. 2500 నుంచి రూ. 5000కు పెంచడాన్ని మంత్రిమండలి ఆమోదించింది. అలాగే, పరిహారం చెల్లింపు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకూ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సీఆర్డీఏను అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ నిర్ణయాలు రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ రూ.2500 నుంచి 5వేలకు పరిహారం పెంపు భూములు ఇచ్చిన రైతులకు కౌలు 15 ఏళ్లకు పెంపు శాసన రాజధానిగా అమరావతి పరిపాలన రాజధానిగా విశాఖపట్నం న్యాయ రాజధానిగా కర్నూలు స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం మంత్రివర్గం భేటీ అనంతరం స్పీకర్ అధ్యక్షతన జరిగిన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, ఇక టీడీపీ తరఫున ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం జరిగింది. కాగా సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. చదవండి: సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అమరావతికి అన్నీ ప్రతికూలతలే మూడు కమిటీలూ వికేంద్రీకరణకే ఓటు అమరావతిలో అలజడికి కుట్రలు.. మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధే ధ్యేయం -
చర్చంతా మూడు చుట్టే..
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆలోచనంతా మూడు రాజధానుల మధ్యే తిరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ అంశమే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ చేసి తీరాల్సిందేనన్న చర్చ పట్టణాల నుంచి గ్రామసీమల వరకూ పాకింది. కొత్తగా ఏర్పాటైన గ్రామ సచివాలయాల దగ్గరా ఇదే అంశంపై జనం మాట్లాడుకుంటున్నారు. అటు ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం నుంచి ఇటు కర్ణాటక సరిహద్దులోని అనంతపురం వరకూ ఎక్కడికి వెళ్లినా ఎవరి నోట విన్నా ఇదే మాట నానుతోంది. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని, లేకపోతే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర మరింత వెనుకబడిపోయి మరోసారి విభజన వాదం పుట్టుకురాక తప్పదనే వాదన ప్రబలంగా వినిపిస్తోంది. - రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అభివృద్ధిపై సూచనల కోసం ఏర్పాటైన జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ, ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు(బీసీజీ) సైతం మూడు రాజధానులు ఏర్పాటు చేయడంతోపాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని తమ నివేదికల్లో నొక్కి చెప్పాయి. - ఆ రెండు నివేదికలపై అధ్యయనం కోసం మంత్రులు, ఉన్నతాధికారులతో ఏర్పాటైన హైవపర్ కమిటీ కూడా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న విషయాన్ని గుర్తించింది. - రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు తమ జిల్లాలను అభివృద్ధి చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారని హైపవర్ కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. - అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందేనంటూ ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు జరుగుతున్నాయి. - పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఇదే డిమాండ్ను ముక్తకంఠంతో వినిపిస్తున్నారు. - బీసీజీ, జీఎన్ రావు కమిటీల నివేదికలను అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతోంది. - నాలుగుసార్లు సమావేశమైన హైపవర్ కమిటీ ఎక్కడెక్కడ ఏయే వనరులు ఉన్నాయో గుర్తించి, వాటిని వినియోగించుకోవడం ద్వారా అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి రోడ్ మ్యాప్ రూపొందించే కసరత్తు జరుగుతోందని ప్రకటించింది. - విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ నానాటికీ తీవ్రతరమవుతోంది. - అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ ఎజెండాగా సోమవారం రాష్ట్ర మంత్రివర్గం, అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల దృష్టంతా దీనిపైనే కేంద్రీకృతమై ఉంది. -
ఎల్లుండి కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం ఉదయం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 9 గంటలకు సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 13 జిల్లాల సమగ్రాభివృద్ధిపైన, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపైన హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక మీద చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. రాజధానితోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై జీఎన్ రావు, బీసీజీ నివేదికలతోపాటు గతంలో శివరామకృష్ణన్ ఇచ్చిన నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ తన నివేదికను సోమవారం కేబినెట్కు సమర్పించనుంది. అనంతరం దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసేందుకు, అలాగే పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియల్, లెజిస్లేచర్ వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు వీలుగా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. కేబినెట్ సమావేశానంతరం సోమవారం ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. -
రాజధాని రైతులకు మరింత మేలు చేస్తాం
సాక్షి, అమరావతి: రాజధాని రైతులకు ఇంతవరకూ జరిగిన దాని కంటే మెరుగైన ప్రయోజనం చేకూరుస్తామని రాష్ట్ర సమగ్రాభివృద్ధి–వికేంద్రీకరణపై ఏర్పాటైన హైపవర్ కమిటీ సభ్యుడు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులతో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా వారికి మరింత మేలు చేస్తామని, రాజధాని రైతులు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని.. ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని కోరారు. చంద్రబాబు మాయలో పడొద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని హైపవర్ కమిటీ సభ్యులు కలిశారు. రైతులకు సంబంధించిన అంశాలు, జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై చర్చించిన అంశాలు, ఇతర విషయాలపై కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం మంత్రి కురసాల కన్నబాబుతో కలిసి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇది కూడా ఒక భాగమని.. దాని అభివృద్ధి తమ బాధ్యతేనని స్పష్టం చేశారు. రైతులకు చేయాల్సిన మేలు గురించి ముఖ్యమంత్రి కూడా కొన్ని సూచనలు చేశారని, వాటిని కూడా నివేదికలో పొందుపరుస్తామన్నారు. తమ ప్రభుత్వానికి రాష్ట్ర సమగ్రాభివృద్ధి పట్ల స్పష్టమైన విధానం, ప్రణాళిక ఉందని తెలిపారు. అవసరమైతే మరోసారి హైపవర్ కమిటీ సమావేశమవుతుందన్నారు. సీఎం దృష్టికి రైతుల సమస్యలు రాజధాని గ్రామాలకు చెందిన రైతులు తన వద్దకు వచ్చి వారి సమస్యలు చెప్పారని, వార్షిక కౌలు, పెన్షన్ సరిపోవడం లేదని తెలిపారన్నారు. రైతుల సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని, హైపవర్ కమిటీ నివేదికలోనూ ఆ విషయాలను పొందుపరుస్తామని బొత్స చెప్పారు. రైతులతో మాట్లాడేందుకు తాము సిద్ధమని, తమ అభిప్రాయాలను సీఆర్డీఏ అధికారులకు తెలపాలని రైతులకు సూచించామన్నారు. ‘రాజధానిలో 25 శాతానికిపైగా పూర్తయిన భవనాలన్నింటినీ తప్పకుండా పూర్తిచేసి వాడుకలోకి తెస్తాం. అన్నింటికీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల కోరికలు, అభిప్రాయాలను హైపవర్ కమిటీలో చర్చించాం. వాటన్నింటినీ క్రోడీకరించి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తాం’ అని బొత్స తెలిపారు. తమకు వచ్చిన సిఫార్సులో అమరావతిని శాసన రాజధానిగా చేయాలనుందని.. దానిపై చర్చిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం రైతులకు బ్రాండ్ అంబాసిడర్ అని, ఏ రైతుకు చిన్న కష్టం వచ్చినా పెద్ద ఉపద్రవంగా భావిస్తామని, వారికి నష్టం జరగదన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ. చిత్రంలో మంత్రి కన్నబాబు అసెంబ్లీ తాత్కాలికమని చంద్రబాబు చెప్పలేదా? అమరావతిపై ఐఐటీ మద్రాసు ఇచ్చిన నివేదిక పూర్తి వాస్తవమని మంత్రి బొత్స పేర్కొన్నారు. బీసీజీ నివేదికలో చెప్పిన దాన్ని తప్పంటే ఎలాగని.. కొన్ని పత్రికలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అసెంబ్లీ తాత్కాలికమని ఎవరు చెప్పారంటూ చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నాడని.. మరి గతంలో ఎప్పుడూ అది శాశ్వతమని చంద్రబాబు ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. అసెంబ్లీ భవనం శాశ్వతమని చంద్రబాబు అన్నాడని ఎవరైనా చెబితే తాను తలవంచుకుని వెళ్లిపోతానని సవాల్ విసిరారు. ఇప్పుడు అసెంబ్లీ శాశ్వతమని చెబుతున్న చంద్రబాబు.. మరో అసెంబ్లీ భవనానికి ఎందుకు పునాది వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబు ఆలోచిస్తాడని, ఏ పనిచేసినా అందులో తనకేంటని చూస్తాడని బొత్స ఆరోపించారు. జోలె పట్టిన డబ్బులు ఏం చేశాడు? చంద్రబాబు దేనికి జోలె పడుతున్నాడని.. వచ్చిన డబ్బును ఏంచేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో రాజధాని కోసం హుండీ పెట్టాడని.. ఆ డబ్బు ఏంచేశాడో ఎవరికీ తెలియదన్నారు. రాజధానికి 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కావాలని జగన్మోహన్రెడ్డి చెబితే దాన్ని వక్రీకరించారని విమర్శించారు. పచ్చని పంటలు పండే భూములను తీసుకోవద్దని జగన్ చెప్పారని.. ఆయన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టారు. బీజేపీతో జనసేన కలవడంపై స్పందిస్తూ.. వారి విధానం వారిదని, ఉనికి కోసం అవన్నీ జరుగుతున్నాయన్నారు. -
అన్ని జిల్లాల అభివృద్దే మా ధ్యేయం : బొత్స
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్దే తమ ప్రభుత్వం ధ్యేయం అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతి రైతులకు మరింత లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం వైఎస్ జగన్ సూచనలు చేశారని బొత్స వెల్లడించారు. మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలు చర్చిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో హైపవర్ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్ కమిటీ శుక్రవారం సీఎం వైఎస్ జగన్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై.. హైపవర్ కమిటీ సభ్యులు సీఎం వైఎస్ జగన్కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రైతుల అంశంపైనా సీఎం వైఎస్ జగన్తో చర్చించినట్టు తెలిపారు. కమిటీ రిపోర్ట్లోని అంశాలను కూడా సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సమగ్ర ప్రణాళికలతో రాష్ట్ర అభివృద్ధిపై ప్రజల మనోభావాల మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ప్రాంతీయ అసమానతలపై దృష్టి సారించినట్టు వివరించారు. కమిటీ రిపోర్ట్ను కేబినెట్ ముందు ఉంచుతామని తెలిపారు. కేబినెట్ భేటీలో అన్ని విషయాలను సీఎంకు చెబుతామని అన్నారు. అన్నివర్గాలు బాగుపడాలన్నదే తమ తాపత్రయమని చెప్పారు.అమరావతి రైతులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాయలో పడొద్దని సూచించారు. వ్యక్తిగత స్వార్థంతో చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులెవరూ అధైర్య పడొద్దన్నారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలన్నీ పూర్తిచేస్తామని చెప్పారు. అమరావతిలో నిర్మించిన అన్ని భవనాలను ఉపయోగించుకుంటామని తెలిపారు. అమరావతిపై చంద్రబాబు అఖిలపక్షం అభిప్రాయం కోరలేదని గుర్తుచేశారు. 13 జిల్లాలతోపాటు అమరావతి ప్రాంతాలు అభివృద్ధి చేస్తామన్నారు. ఉనికి కాపాడుకోవడం కోసమే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. -
రేపు సీఎం జగన్తో భేటీ కానున్న హైపవర్ కమిటీ
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్ కమిటీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం కానుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. రాజధాని రైతుల సమస్యలపై హైపవర్ కమిటీ సభ్యులు సీఎం వైఎస్ జగన్తో చర్చించనున్నారు. ఇప్పటికే జీఎన్ రావు, బీసీజీ నివేదికలను హైపవర్ కమిటీ పరిశీలించిన సంగతి తెలిసిందే. మూడు సార్లు సమావేశమైన కమిటీ సభ్యులు రెండు నివేదికలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే రేపు చివరిసారిగా సీఎం వైఎస్ జగన్తో హైపవర్ కమిటీ భేటీ కానుంది. కాగా, పరిపాలన వికేంద్రీకరణపై ఈ నెల 20న ఏపీ అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. -
మీ అభిప్రాయాలు, సందేహాలు చెప్పండి
సాక్షి, అమరావతి: అమరావతి గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ అభిప్రాయాలు, సలహాలను కోరింది. 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ సీఆర్డీఏ కమిషనర్కు వ్యక్తిగతంగా గానీ, పోస్టు, ఇ–మెయిల్ ద్వారా గానీ తాము చెప్పదలచుకున్న విషయాలను పంపాలని సూచించింది. హైపవర్ కమిటీ మూడో సమావేశం విజయవాడలో సోమవారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన జరిగింది. సమావేశం వివరాలను కమిటీ సభ్యులు, మంత్రులు పేర్ని నాని, కన్నబాబు, కొడాలి నాని మీడియాకు వివరించారు. రాజధాని గ్రామాల రైతులే కాకుండా ఎవరైనా తమ అభిప్రాయాలు పంపవచ్చని పేర్ని నాని తెలిపారు. ప్రతి సమావేశంలోనూ తాము రాజధాని రైతుల గురించి చర్చిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే చాలామంది రైతులు మంత్రి బొత్స సత్యనారాయణ, కొడాలి నానితోపాటు తన వద్దకు వచ్చి అభిప్రాయాలు వ్యక్తం చేసి తమ ప్రతిపాదనలు చెబుతున్నారని వివరించారు. ఈ అంశాలన్నింటినీ తాము ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో పొందుపరుస్తామన్నారు. వికేంద్రీకరణ అంశాన్ని రాజకీయంగా వాడుకుని, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని, మహిళల్ని తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారని చంద్రబాబును విమర్శించారు. అన్ని అంశాలపైనా రాజధాని రైతులు తమతో మాట్లాడుతున్నారని, చంద్రబాబు ప్రేరేపిత శక్తులు దాడి చేస్తాయనే భయంతో ఆందోళన చెందుతున్నారని చెప్పారు. జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను తయారు చేస్తున్నామని, ఈ నెల 17న మరోసారి కమిటీ సమావేశం జరపాలని నిర్ణయించినట్లు వివరించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు: కన్నబాబు సంక్రాంతి పండుగ సమయంలోనైనా చంద్రబాబు రైతుల్ని రెచ్చగొట్టి తప్పుదారి పట్టించకుండా ప్రశాంతంగా ఉండనివ్వాలని మంత్రి కన్నబాబు హితవు పలికారు. భూములిచ్చిన రైతులది ఒక ఆందోళనైతే చంద్రబాబుది మరో ఆందోళనని విమర్శించారు. ఆయన కుటుంబ సభ్యులు నారావారిపల్లి వెళ్లి పండుగ చేసుకుంటున్నారని, రైతుల్ని మాత్రం పండుగ చేసుకోవద్దంటున్నారని మండిపడ్డారు. డీజీపీ గౌతం సవాంగ్పై అవమానకరంగా విమర్శలు చేస్తున్నారని, ఇది పద్ధతి కాదన్నారు. ముడాలో కలపాలని కోరాం: కొడాలి నాని మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను సీఆర్డీఏ పరిధి నుంచి తొలగించి ముడా పరిధిలోకి తేవాలని కమిటీ దృష్టికి తీసుకువచ్చినట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు. పోర్టును త్వరితగతిన చేపట్టాలని కూడా కోరామన్నారు. ఎయిర్పోర్టు, జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, ఎక్స్పోర్టు, ఇంపోర్టును దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ, ఆక్వా పరిశ్రమల్ని మచిలీపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరినట్లు వివరించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాల వారిగా అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ..
-
హై పవర్ కమిటీ భేటీ వివరాలు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు భేటీ అయిన హై పవర్ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి పేర్ని నాని భేటీ వివరాలను మీడియా ముందు వెల్లడించారు. జిల్లాల వారిగా అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. అలాగే రాజధానిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై కూడా చర్చ జరిపినట్లు మంత్రి తెలిపారు. రాజధాని రైతుల సమస్యలను సీఆర్డీఏ కమిషనర్కు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వానికి ఏమి చెప్పదలుచుకున్నారో జనవరి 15లోపు రాత పూర్వకంగా లేదా ఈ-మెయిల్ ద్వారా వారి దృష్టికి తీసుకెళ్లొచ్చని సూచించారు. ‘ఎవరైతే రాజకీయం కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నారో.. వారికి తప్ప అందరికీ న్యాయం జరగబోతుంది. రైతులతో పాటు రాజకీయంగా ప్రేరేపితం చేసిన వారు ప్రీ ప్లాన్డ్ గా కొంతమంది ఆందోళన చెస్తున్నారు. వీటి వెనకాల టీడీపీ నేతలు ఉన్నారు. రైతులు కూడా మంత్రులను వ్యక్తిగతంగా కలుస్తున్నారు. వారి వినతులు కూడా చెప్తున్నారు. వాటన్నింటినీ స్వీకరిస్తాం’ అని అన్నారు. అలాగే ఈనెల 17న మరోసారి కమిటీ భేటీ అవుతుందని మంత్రి పేర్నినాని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సినిమాల్లో బ్రహ్మనందంలా తయారయ్యారని వ్యవసాయ శాఖ కన్నబాబు విమర్శించారు. ఆయనకి బాధ కలిగితే పండుగ చేసుకోకూడదు, ఆనందం కలిగితే పండగ చేసుకోవాలా అని ప్రశ్నించారు. అసత్యాలతో పండగపూటైనా వాళ్ళని ప్రేరేపించకుండా ఉంటే చాలని, సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ ని కూడా విమర్శిస్తున్నారు మండిపడ్డారు. -
వైఎస్సార్ అవార్డుల ఎంపికకు కమిటీ
సాక్షి, అమరావతి: దివంగత మహానేత వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. ప్రజా సేవా కార్యక్రమాలు చేసేవారికి అవార్డుల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కమిటీ సభ్యులుగా సలహాదారులు దేవుపల్లి అమర్, కె.రామచంద్రమూర్తి, జీవీడీ కృష్ణమోహన్, ఐఏఎస్ అధికారులు ప్రవీణ్ ప్రకాష్, కె.దమయంతి, ఉషారాణి, కోన శశిధర్, జేవీ మురళి, ఐఐఎస్ అధికారి టి.విజయకుమార్ రెడ్డి నియమితులయ్యారు. ప్రతి ఏడాది ఆగస్టు 15, జనవరి 26వ తేదీన వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. -
ముగిసిన హై పవర్ కమిటీ భేటీ
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన హై పవర్ కమిటీ సమావేశం ముగిసింది. రాజధానిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై కమిటీ చర్చించింది. ఆయా నివేదికలోని వివిధ అంశాలపై కమిటీ భేటీ కావడం ఇది మూడోసారి. ఈనెల 17న మరోసారి కమిటీ భేటీ అవుతుందని మంత్రి పేర్నినాని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కొడాలి నాని, మేకపాటి గౌతమ్రెడ్డి, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారుడు అజేయ్ కల్లాం, సీఎస్ నీలం సాహ్ని, వివిధ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. -
జనవరి 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
-
ఈనెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ నెల 20వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా హై పవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాజధాని సహా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో చర్చించే అవకాశం ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదిక, గతంలో కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే ఈ నెల 18న కేబినెట్ భేటీ కానుంది. చదవండి: అందరి నోటా అదేమాట.. వికేంద్రీకరణే ముద్దు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటాం ముగిసిన హై పవర్ కమిటీ భేటీ వికేంద్రీకరణకే పెద్దపీట -
చంద్రబాబు రోజుకో డ్రామా చేస్తున్నారు
-
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారు
-
ఈ నెల 13న మరోసారి భేటీ అవుతాం
-
ముగిసిన హై పవర్ కమిటీ భేటీ
-
హై పవర్ కమిటీ భేటీ ప్రారంభం
-
ముగిసిన హై పవర్ కమిటీ భేటీ
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన హై పవర్ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కమిటీ మెంబర్ కన్వీనర్ నీలం సాహ్ని నేతృత్వంలో ఆర్టీసీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం జరిగింది. అధికార వికేంద్రీకరణతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని హై పవర్ కమిటీ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కొడాలి నాని, మేకపాటి గౌతమ్రెడ్డి, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వివిధ శాఖల ముఖ్య అధికారులు, జీఎన్ రావు హాజరయ్యారు. జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై మంత్రులు, అధికారులు ఈ భేటీలో చర్చించారు. -
నేడే హై పవర్ కమిటీ భేటీ
-
విశాఖతో ఉత్తరాంధ్ర అభివృద్ధి: మంత్రి అవంతి
-
ఏ ప్రాంతానికి నష్టం జరగకుండా సీఎం నిర్ణయం..
సాక్షి,విశాఖపట్నం : రాజధాని విషయంలో ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఏ ప్రాంతానికి నష్టం జరగకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం, అభివృద్ధిపై ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం దీనిపై స్పందించిన మంత్రి.. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్తో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్త చేశారు. మూడు రాజధానుల నిర్ణయంపై అన్ని ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అవంతి తెలిపారు. రాజధాని అంశాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆరోపించేవారు నిరూపించాలని మంత్రి సవాలు చేశారు. మద్యం రేట్లు పెంచితే టీడీపీ నాయకులకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రమంతా అభివృద్ధి జరగడం ఆగదని చెప్పారు. -
ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన హైపవర్ కమిటీ నియమాకాన్ని స్వాగతిస్తున్నానని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన విష్ణుకుమార్రాజు.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే తమ పార్టీ నిర్ణయమని తెలిపారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ. లక్ష కోట్లు ఒక ప్రాంతంలో వెచ్చించి అభివృద్ధి చేయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. తాత్కాలిక కట్టడాల పేరుతో చంద్రబాబు చదరపు గజానికి రూ. 12వేలు వెచ్చించారని, అదే విశౠఖలో అయితే రూ. 4వేలతో పూర్తయ్యేదని పేర్కొన్నారు. చంద్రబాబు నిర్ణయం వల్లే ఇప్పుడు అమరావతి రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేసిన రూ. వందల కోట్లతో విశాఖలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. గతంలోనే విశాఖను రెండో రాజధానిగా చేయాలని శివరామకృష్ణన్ కమిటీ కూడా సూచించిందని చెప్పారు. -
నిపుణుల కమిటీ నివేదిక పరిశీలనకు హై పవర్ కమిటీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది. జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు ఇతర నివేదికలను ఈ హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. 10మంది మంత్రులు సహా మొత్తం 16మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అలాగే ఈ కమిటీ ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు (బీసీజీ) నివేదికల్లోని అంశాల సమగ్ర, తులనాత్మక పరిశీలన చేయనుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్రావు నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఇవే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని బీసీజీని సైతం ఇప్పటికే ప్రభుత్వం కోరింది. వచ్చే నెల మొదటి వారంలో ఈ సంస్థ నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసి రిపోర్టు సమర్పించడం కోసం మంత్రులు, సీనియర్ ఐఏఎస్లతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని శుక్రవారం కేబినెట్ తీర్మానం చేసింది. ఇక ఈ కమిటీలో ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, హోంమంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్య, మార్కెటింగ్ శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ, పౌర సరఫరాల శాఖమంత్రి కొడాలి నాని, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్,సీసీఎల్ఏ, చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, లా సెక్రటరీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిమెంబర్ కన్వీనర్గా ఉన్నారు. మూడు వారాల్లోగా ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందచేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అవసరం అనుకుంటే హై పవర్ కమిటీ అడ్వకేట్ జనరల్ సలహాలు తీసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
హైపవర్ కమిటీపై సర్కార్ నిర్ణయంతో మరో మలుపు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు భావించిన సంగతి తెలిసిందే. సమ్మె సమస్య పరిష్కారానికి ఈ మేరకు జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు చేస్తామని, దీనిపై మీ నిర్ణయం తెలుపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. హైపవర్ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ విముఖత వ్యక్తం చేసింది. 1947 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ (పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం) ప్రకారం కార్మికులంతా కంపెనీ నిబంధనలకు లోబడి పనిచేయాలని, కానీ ఆర్టీసీ కార్మికులు ఏ చట్టాలను పట్టించుకోవడం లేదని ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ సెక్షన్ 10 ప్రకారం లేబర్ కమిషన్కు ఈ సమ్మె విషయమై ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె లేబర్ కోర్టు పరిధిలో ఉందంటూ కోర్టు దృష్టికి తెచ్చింది. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామంటూ హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కమిటీ ఏర్పాటును ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా స్వాగతించారు. అయితే, ప్రభుత్వం ఇందుకు విముఖత చూపడంతో హైకోర్టు ఈ అంశంలో ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
ఎన్నికల్లో ధన ప్రవాహానికి ఈసీ చెక్
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రలోభాలు, అక్రమ నగదు పంపిణీని అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్ మంగళవారం అత్యున్నత స్దాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆర్థిక, భద్రతా ఏజెన్సీల అధిపతులకు చోటు కల్పించారు. ఎన్నికల నిఘాపై బహుళ శాఖల కమిటీగా పిలిచే ఈ అత్యున్నత కమిటీలో సీబీడీటీ, ఈడీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వంటి సంస్థల ఉన్నతాధికారుల భాగస్వామ్యం ఉండేలా ఈసీ చర్యలు చేపట్టింది. ఇక బీఎస్ఎఫ్ డీజీ రజనీకాంత్ మిశ్రా, సీఆర్పీఎఫ్ డీజీ రాజీవ్ భట్నాగర్, సీఐఎస్ఎఫ్ డీజీ రాజేష్ రంజన్, సహస్త్త్ర సీమా బల్ డీజీ ఎస్ దేశ్వాల్,నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డీజీ అభయ్ కుమార, ఆర్పీఎఫ్ డీజీ అరుణ్ కుమార్, పౌరవిమానయాన భద్రతా బ్యూరో డీజీ రాకేష్ ఆస్ధానా ఈ కమిటీలో ఆహ్వానితులుగా ఉంటారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నల్లధన ప్రభావం, నగదు ప్రవాహాలను అడ్డుకునేందుకు ఈసీ ఈ అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది. -
‘హైపవర్’ వేతనాలేవి?
సాక్షి, కొత్తగూడెం: సింగరేణిలో హైపవర్ కమిటీ వేతనాలను అమలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కోలిండియాలో కనీస వేతనాలు అమలు చేస్తున్నప్పటికీ ఇక్కడ విస్మరించడంపై కార్మికులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో 2012లో జరిగిన ‘హైపవర్’ ఒప్పందానికి నేటికీ సింగరేణిలో మోక్షం కలగని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు అనే మాటే ఉండదని అందరినీ రెగ్యులర్ చేస్తామని గత ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభలో కూడా క్రమబద్ధీకరణపై హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అనేక ఏళ్లుగా కనీస వేతనాలు సైతం లేకుండా వెట్టిచాకిరి చేస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే సీఎం హామీ ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా.. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. క్రమబద్ధీకరణ విషయం పక్కనబెడితే.. కనీస వేతనాల అమలులో కూడా కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కోలిండియాలో హైపవర్ కమిటీ వేతనాల చెల్లింపు అమలు అవుతున్నప్పటికీ సింగరేణిలో మాత్రం ఆ ఊసే లేదు. హైపవర్ వేతనాలు చెల్లించేందుకు 2012 సెప్టెంబరు 9న ఒప్పందం జరిగింది. ప్రకృతి విరుద్ధంగా గనుల్లో కాలుష్య వాతావరణంలో పనిచేస్తున్న కార్మికులకు పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని హైపవర్ వేతన కమిటీ సూచించింది. ఈ మేరకు వేతనాలను చెల్లించకపోవడం దారుణమని కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25,367 మందికాంట్రాక్ ్ట కార్మికులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ సింగరేణి పురోగతిలో ఉందంటే అందులో కాంట్రాక్ట్ కార్మికులదే కీలక పాత్ర. సింగరేణి వ్యాప్తంగా 24,747 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. కార్పొరేట్ ఏరియాలో 905 మంది, కొత్తగూడెం ఏరియాలో 2,379, మణుగూరులో 1,604, ఇల్లెందులో 740, భూపాలపల్లిలో 1,109, రామగుండం–1లో 1,583, రామగుండం–2లో 1,875, రామగుండం–3లో 1,759, శ్రీరాంపూర్లో 1,486, మందమర్రిలో 1,126, బెల్లంపల్లిలో 2,151, అడ్రియాల లాంగ్వాల్ వద్ద 560, జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో 2,470 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. అదేవిధంగా కోల్ ట్రాన్స్పోర్ట్, లోడింగ్, అన్లోడింగ్, సులభ్ కాంప్లెక్స్ లలో మరో 5,000 మంది కార్మికులు పని చేస్తున్నారు. నర్సరీల్లో 270 మంది, కన్వేయన్స్ డ్రైవర్లు 350 మంది ఉన్నారు. సింగరేణిలో ప్రకృతి విరుద్ధ వాతావరణంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ కార్మికులతో పాటు సమానంగా కష్టపడుతున్నప్పటికీ వారిని రెండోతరగతి పౌరులుగా గుర్తిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. అలాగే రక్షణకు సంబంధించిన పరికరాలు సైతం వీరికి ఇవ్వని దుస్థితి నెలకొంది. ఎండాకాలంలో దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేసే తమకు కనీసం మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం లేదని కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోతున్న కార్మికులు 2012లో జరిగిన 9వ వేతన సమావేశంలో కుదిరిన ఒప్పందం మేరకు కోలిండియా పరిధిలోని కోల్కారిడార్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు. అయితే కోలిండియా పరిధిలోని బొగ్గు పరిశ్రమలు ఆ మేరకు చెల్లిస్తున్నాయి. కానీ సింగరేణిలో మాత్రం చెల్లించటం లేదు. ఫలితంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. సింగరేణి యాజామాన్యం ఇప్పటికైనా స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించాలి. ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు అన్నెబోయిన వెంకన్నపీఎఫ్ వర్తింపజేయాలి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ సింగరేణిలో కొన్ని విభాగాల్లో అమలు చేయడం లేదు. ప్రధానంగా నర్సరీ, సులభ్కాంప్లెక్స్, కన్వేయన్స్, కోల్ ట్రాన్స్ఫోర్ట్ విభాగాల్లో కనీస వేతనం అమలు చేయడం లేదు. ఉదయం నుంచి రాత్రివరకు వచ్చే లారీలను ఎక్కి వాటిలో ఉన్న బొగ్గు హెచ్చుతగ్గులను సరిచేస్తూ సంస్థకు ఆర్థికంగా ఉపయోగపడే కార్మికులకు కనీసం పీఎఫ్ వర్తింపజేయకపోవడం దారుణం.– సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (ఇఫ్టూ)రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెమెళ్ల సంజీవ్ -
ఘనంగా జిల్లాల సంబురాలు
♦ రాష్ట్రావతరణ తరహాలో జరపాలి.. కేబినెట్ భేటీలో నిర్ణయం ♦ అన్ని జిల్లాలు ఒకే సమయంలో ప్రారంభించాలి ♦ ఒకట్రెండు రోజుల్లో ముహూర్తం ఖరారు ♦ మొదట పోలీస్ పరేడ్, తర్వాత జాతీయ జెండా ఆవిష్కరణ ♦ ఆ వెంటనే కలెక్టర్ కార్యాలయాల ప్రారంభం.. మంత్రులతో బహిరంగ సభలు ♦ 31 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం సూత్రప్రాయ ఆమోదం ♦ కొత్త జిల్లాలకు తెలంగాణ ప్రముఖుల పేర్లపై చర్చ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావతరణ వేడుకల తరహాలో జిల్లాల ఆవిర్భావ సంబురాలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో పాత జిల్లాలు సహా మొత్తం 31 జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. కొత్త జిల్లాల ప్రారంభం, జిల్లాల పేర్లు, కేకే నేతృత్వంలోని హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదికపైనే భేటీలో ప్రధాన చర్చ జరిగినట్లు తెలిసింది. కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాల సరిహద్దుల విషయంలో ఆయా జిల్లాల స్థానిక మంత్రులు ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. ఒకే ముహూర్తానికి ప్రారంభం కొత్తగా ఏర్పడబోయే జిల్లాలన్నింటినీ ఒకే సమయంలో ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఒకట్రెండు రోజుల్లో ముహూర్తాన్ని ఖరారు చేయనున్నారు. కొత్త జిల్లాల్లో మొదట పోలీసు బలగాల పరేడ్, తర్వాత జాతీయ పతాకావిష్కరణ, ఆ వెంటనే కలెక్టర్ కార్యాలయ ప్రారం భం ఉంటుంది. కలెక్టర్లు బాధ్యతలు తీసుకున్న అనంతరం బహిరంగ సభల్లో మంత్రులు పాల్గొననున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనేలా ప్లాన్ చేసుకోవాలని సీఎం సూచించారు. జిల్లాల పరిధిలోని కొత్త రెవెన్యూ డివిజన్లు, మండల కార్యాలయాలు, కొత్త పోలీసు స్టేషన్లను ఎమ్మెల్యేలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నేతలు పాల్గొనాలని, ఈ అంశంపై మంత్రులు తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల పరిధిలోకి వెళ్లడానికి కొన్ని మండలాలు, గ్రామాల ప్రజలు నిరాకరిస్తున్నారన్న అంశంపైనా కేబినెట్లో చర్చ జరిగింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఆయా జిల్లాల మంత్రులు కలెక్టర్లతో సమన్వయం చేసుకుని నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. మొత్తంగా 31 జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినా తుది నోటిఫికేషన్లో వెల్లడిస్తామని మంత్రులతో సీఎం అన్నారు. మరోవైపు అలంపూర్ నియోజకవర్గాన్ని గద్వాల నియోజకవర్గంలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలంపూర్, రాజోలి మండలాలను ప్రతిపాదిత వనపర్తి జిల్లాలో ఉంచాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాలను మహబూబ్నగర్ జిల్లాలో ఉంచాలని నిర్ణయించారు. కొత్త జిల్లాల పేర్లపై చర్చ కొత్త జిల్లాల పేర్లపైనా కేబినెట్లో చర్చించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, సురవరం ప్రతాప్రెడ్డి, రాజు బహదూర్ వెంకట్రామిరెడ్డి, వెంకటస్వామి, మహేంద్రనాథ్, పీవీ నరసింహారావు, రాజన్న, భద్రాద్రి, జోగులాంబ, కొమురం భీం పేర్ల ఖరారుపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే భూపాలపల్లికి ప్రొఫెసర్ జయశంకర్, సిరిసిల్లకు రాజన్న, గద్వాలకు జోగులాంబ, ఆసిఫాబాద్కు కొమురం భీం పేర్లు ఖరారు చేసినట్లు సీఎం ప్రకటించారు. మిగతా జిల్లాల పేర్లపై ఆలోచించాలని, తెలంగాణ ఆత్మగౌరవం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రముఖుల పేర్లపై ఆలోచనలు చేయాలన్నారు. ఎస్సీ గురుకులాలకు సీఎం కితాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. రెసిడెన్షియల్ స్కూళ్ల విధానంపై పదేళ్ల నుంచి బాగా స్పందన వస్తోందని, రాష్ట్రానికి, గురుకులాలకు ఆదర్శంగా ఉన్న ఎస్సీ గురుకులాలను సీఎం అభినందించారు. మైనార్టీలు అధికంగా ఉన్నచోట ఎక్కువగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి, వాటిని విజయవంతం చేయాలన్న అంశంపై చర్చించారు. మైనారిటీ గురుకులాల కార్యదర్శి షఫీ ఉల్లాను సీఎం అభినందించారు. ఎస్సీ గురుకులాల సక్సెస్ వెనుక ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కృషి ఎంతో ఉందని, ఆయన బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అవసరమైతే బీసీ, గురుకులాలను ఆయనకే అప్పజెప్పాలన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తంచేశారు. బంగారు తెలంగాణ భవిష్యత్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లోనే ఉందని పేర్కొన్నారు. -
అలంపూర్ను వనపర్తిలో కలపొద్దు
హైపవర్ కమిటీకి ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్ల వినతి సాక్షి, హైదరాబాద్: రెండు నదుల మధ్య ఉన్న అలంపూర్, గద్వాల (నడిగడ్డ) నియోజకవర్గాలను యథాతథంగా జోగులాంబ జిల్లాలోనే ఉంచాలని, రాజకీయ ప్రయోజనాల కోసం అలంపూర్ను వనపర్తి జిల్లాలో చేర్చితే చారిత్రక తప్పిదమవుతుందని ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్కుమార్ ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయమై జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సభ్యులకు, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్కు శుక్రవారం వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ, జోగులాంబ జిల్లా కోసం ఉద్యమాలు చేసి ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయితే అలంపూర్ నియోజకవర్గంతోపాటు కొత్తగా ఏర్పాటు కానున్న ఉండవల్లి మండలాన్ని వనపర్తిలో కలుపుతున్నారని వచ్చిన వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. దేవాలయం ఉన్న అలంపూర్ లేకుండా జోగులాంబ జిల్లా ఏర్పాటు చారిత్రక తప్పిదమవుతుందన్నారు. తప్పిదాలకు తావులేకుండా గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లాకు సరైన రూపం ఇవ్వాలని ప్రజల తరఫున ప్రభుత్వానికి విన్నవించామన్నారు. సంపత్కుమార్ మాట్లాడుతూ, అలంపూర్ను వనపర్తి జిల్లాలో కలుపుతున్నారనే వార్తలతో.. జోగులాంబ జిల్లా ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారన్న సంతోషం నాలుగు రోజుల్లో మటుమాయమైందన్నారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాలను సంపూర్ణంగా జోగులాంబ జిల్లాలోనే ఉంచాలని, అలా చేయని పక్షంలో జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా చేసినట్లవుతుందని అన్నారు. -
కొనసాగిన ‘కొత్త’ వినతులు
• మూడో రోజూ హైపవర్ కమిటీతో పలువురు నేతల భేటీ • గద్వాల, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ జిల్లాల • ప్రతిపాదనలే పరిశీలించాం: కేకే • ముగిసిన కమిటీ గడువు...నేడు సీఎంకు నివేదిక సాక్షి, హైదరాబాద్: ‘‘అనవసర అపోహలు వద్దు. కేవలం గద్వాల, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ నాలుగు జిల్లాల ప్రతిపాదలను పరిశీలించడం వరకే మేము పరిమితం. మండలాలపై వినతులు తీసుకున్నాం. కొత్త జిల్లాలు కావాలని వస్తున్నారు. వాటిని వినడమే కానీ చేసేదేమీ లేదు. మరికొన్ని కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనా చేయడం లేదు. కమిటీ గడువు గురువారంతో ముగిసింది. నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తాం ’’ అని కొత్త జిల్లాలపై ఏర్పాటైన హైపవర్ కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు (కేకే) తెలిపారు. మూడో రోజైన గురువారం కూడా కొత్త జిల్లాల కోసం హైపవర్ కమిటీకి వినతులు అందాయి. కేవలం నాలుగు జిల్లాలనే కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారని తెలిసినా ఇబ్రహీంపట్నం, సత్తుపల్లి, సమ్మక్క-సారలమ్మ (ములుగు), పీవీ (హుజూరాబాద్) జిల్లాలు కావాలని విజ్ఞప్తులు అందాయి. ఖమ్మం పరిధిలోని సత్తుపల్లిని ప్రత్యేక జిల్లాగా చేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి వినతి పత్రం అందజేయగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్బీ నగర్ నియోజకవర్గాలను కలిపి ఇబ్రహీంపట్నం చేయాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కోరారు. మరోవైపు మంత్రి చందూలాల్ కూడా కమిటీని కలిశారు. గతంలో ములుగు ప్రాంతాన్ని సమ్మక్క -సారలమ్మ జిల్లా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచే శారు. మలుగును జిల్లా చేయాలని కమిటీని కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ను కలిసి మరోసారి విన్నవించనున్నట్లు చెప్పారు. హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాలను కలిపి 14 మండలాలతో కొత్తగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని హుజూరాబాద్ నియోజకవర్గ నేతలు హైపవర్ కమిటీని కోరారు. అనంతరం వారు తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా సమావేశమవగా వారికి మద్దతుగా మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బి.వినోద్ ఈ భేటీకి హాజరయ్యారు. పీవీ జిల్లా ఏర్పాటు విజ్ఞప్తిని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఒకవైపు గద్వాల జిల్లాకు జోగులాంబ పేరు పెడతామని చెబుతూ.. జోగులాంబ ఉన్న ఆలంపూర్ను వనపర్తిలో కలపడం ఏమిటని కమిటీని కలిసిన ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిరసన తెలిపారు. ఆలంపూర్, ఉండవెల్లిని వనపర్తిలో కలపొద్దని కమిటీకి విన్నవించారు. కాగా, మూడు రోజుల్లో హైపవర్ కమిటీకి ప్రధానంగా దేవరకొండ, మిర్యాలగూడెం, ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం/ములుగు, సమ్మక్క- సారలమ్మ, ఇబ్రహీంపట్నం, సత్తుపల్లి జిల్లాలు కావాలంటూ విజ్ఞప్తులు అందాయి. గడువు ముగియడంతో కమిటీ తన నివేదికను గురువారం రాత్రి లేదా శుక్రవారం సీఎం కేసీఆర్కు సమర్పించనుంది. జ్యుడీషియల్ కమిటీ వేయాలి: పొన్నాల జనగామను జిల్లా చేయాలని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కమిటీని కలసి వినతిపత్రం ఇచ్చారు. జిల్లాల ఏర్పాటులో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా జ్యుడీషియల్ కమిటీని నియమించాలని కోరారు. ఒకవిధంగా సర్కారు ఏకపక్షంగానే జిల్లాలను విభజిస్తోందని ఆరోపించారు. చివరి నోటిఫికేషన్లో జనగామ కొత్త జిల్లాగా ఉంటుందని ఆశిస్తున్నట్లు మీడియాకు వివరించారు. -
కాంట్రాక్టర్ల ఎంపికకు కమిటీలెందుకు?
* ‘పెద్దల’ ఇష్టప్రకారం చేసుకునేప్పుడు అధికారులెందుకు? * హై పవర్ కమిటీని రద్దు చేయాలన్న ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రమేశ్! * ‘సింగిల్ టెండర్’ ఆమోదించాలన్న ప్రభుత్వ పెద్దల ఒత్తిడిపై అసంతృప్తి * కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఆర్కే ఇన్ఫ్రాకు కట్టబెట్టిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: సాగునీటి శాఖలో రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ విలువైన టెండర్లను ఖరారు చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన హై పవర్ కమిటీకి పేరులో మాత్రమే పవర్ ఉంది. అది ప్రభుత్వ పెద్దల నిర్ణయాలకు తలొగ్గి వారి ఇష్టానుసారం నడుచుకోవాలే తప్ప నిబంధనల మేరకు వ్యవహరించేందుకు వీల్లేదు. ఈ నేపథ్యంలోనే పవర్ లేని ఈ కమిటీని రద్దు చేయాలంటూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్ ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. సీఎస్ నేతృత్వంలోని ఈ కమిటీలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (పి.వి.రమేశ్) కూడా సభ్యునిగా ఉన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డికి చెంది న ‘ఆర్కే ఇన్ఫ్రా’కు కట్టబెట్టాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో.. రమేష్ తన అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తూ సాగునీటి శాఖకు, ప్రభుత్వానికి ‘నోట్’ పం పారు. హై పవర్ కమిటీ పేరిట అడ్డగోలు వ్యవహారాలను అధికారుల మీద రుద్దడాన్ని తప్పుబట్టారు. రూ. 413 కోట్ల అంచనా వ్యయం తో కూడిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు గత జూలై 30న టెండర్లు పిలిచారు. ‘ఆర్కే-హెచ్ఈఎస్-కోయ’ జాయింట్ వెంచర్, ‘గాయత్రీ-డబ్ల్యూపీఐఎల్’ జాయింట్ వెంచర్లు టెండర్లు దాఖలు చేశాయి. ఒక్క ఆర్కే ఇన్ఫ్రా జేవీకే పనుల అర్హత ఉందని నిర్ధారించారు. ఒకే ఒక్క కంపెనీకి అర్హత ఉందని తేలితే.. టెండర్ను రద్దు చేసి మళ్లీ పిలవాలనే నిబంధన ఉంది. టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి చక్రం తప్పడంతో ‘సింగిల్ టెండర్’ అయినా.. ఆర్కే ఇన్ఫ్రాకే పనులు కట్టబెట్టాలని ప్రభుత్వ పెద్దల నుంచి నీటిపారుదల శాఖ అధికారులపై ఒత్తిడి వచ్చింది. ఫలితంగా ఆర్కే ఇన్ఫ్రా ప్రైస్ బిడ్, టెక్నికల్ బిడ్ ప్రక్రియలు అధిగమించింది. రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) కూడా ఓకే (సెప్టెంబర్ 4న) చేసేసింది. ఇక సీఎస్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ వంతు వచ్చింది. ఈ కమిటీ ఆమోదించకపోతే టెండర్ రద్దే మార్గం. దీంతో ప్రభుత్వ పెద్దలు సీఎస్పైనా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ‘సింగిల్ టెండర్’ అయితే రద్దు చేయాలని నిబంధనలుంటే.. మనం ఎలా ఆమోదముద్ర వేయగలమని పి.వి.రమేశ్ గట్టిగా వాదించినట్లు సమాచారం. ‘‘ ‘ఫస్ట్ కాల్’ లోనే సింగిల్ టెండర్కు ఆమోదం తెలపాల్సిన అవసరం ఏమిటి? సెకండ్ కాల్కు వెళ్లొచ్చుకదా? అని రమేశ్ ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దల ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకొనే పనైతే.. హైపవర్ కమిటీ ఎందుకు? అని రమేశ్ ప్రశ్నించినట్టు తెలిసింది.దీనిపై నీటిపారుదల శాఖకు, ప్రభుత్వానికి నోట్ పంపించారు.ఎస్ఎల్ఎస్సీ ఆమోదముద్ర వేసిన తర్వాత.. తుది నిర్ణయం కోసం నేరుగా ప్రభుత్వానికి పంపించాలని, నీటిపారుదల శాఖ మంత్రి లేదా సీఎం నిర్ణయం తీసుకోవడానికి ఫైల్ పంపితే సరిపోతుందని సూచించారు. ఈ నోట్ కలకలం సృష్టించింది. దీనిపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పెద్దల జోక్యంతో రమేష్ కూడా దారిలో పడినట్లు తెలిసింది. కాగా గత వారం జరిగిన హై పవర్ కమిటీ సమావేశంలో ‘సింగిల్ టెండర్’కు ఆమోదముద్ర వేశారు. తద్వారా రూ.413 కోట్ల విలువైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను 4 శాతం ఎక్సెస్తో రూ.430 కోట్లకు టీడీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రాకు ప్రభుత్వం కట్టబెట్టింది. -
ఏపి ప్రభుత్వం కొత్త అడుగు!
హైదరాబాద్: ఉన్నత విద్య విషయంలో ఏపి ప్రభుత్వం కొత్త అడుగు వేయనుంది. దేశంలో ఇతర రాష్ట్రాలలో మాదిరి రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు నడుం బిగిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కావలసిన నియమ నిబంధనలు, తగిన సూచనలు ఇవ్వడానికి ఓ హైపవర్ కమిటీని నియమించింది. అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 30 రోజులలోగా తగిన సూచనలు ఇవ్వాలని ఆ ఉత్తర్వులలో ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా కొత్త తరహా కోర్సులు ప్రారంభించాలని, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా అనువైన కోర్సులను ప్రారంభించాలన్న ఆలోచన ఉంది. ఆ దిశగా ఈ కమిటీ సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. ** -
హైలెవల్ కలేనా?
సాక్షి, నెల్లూరు: రెండు నియోజకవర్గాల ప్రజలకు వరప్రదాయిని అయిన నీటిపారుదల ప్రాజెక్టుకు ‘చంద్ర’గ్రహణం పట్టింది. గత ప్రభుత్వం మంజూరు చేసిన, అప్పట్లో మొదలైన అన్ని పనులను వెంటనే రద్దు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అన్ని శాఖల అధికారులను ఆదేశించడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని 3 లక్షల మందికి తాగునీరు, 95 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించతలపెట్టిన సోమశిల హైలెవల్ కెనాల్ నిర్మాణ పనులను చంద్రబాబు సర్కార్ పక్కన పెట్టింది. అన్ని పనులనూ రివ్యూచేసిన తర్వాతే హైపవర్ కమిటీ నిర్ణయం మేరకు పనులు చేయాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆర్థికలోటు నేపథ్యంలో గత ప్రభుత్వంలో వందల కోట్లతో మంజూరు చేసిన పనులను సర్కార్ రద్దుచేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సోమశిల హైలెవల్ కెనాల్ నిర్మాణ పనులు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. ప్రస్తుత సర్కార్ ఉన్న పరిస్థితిలో రూ.1585 కోట్ల భారీ మొత్తంతో పనులు చేపట్టడం సాధ్యం కాకపోవచ్చని ఇంజనీరింగ్ అధికారుల అభిప్రాయం. ఇదే జరిగితే జిల్లాలో మెట్టప్రాంతాల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారనుంది. రెండు నియోజక వర్గాల్లో సాగునీటి ఇబ్బందులతో పాటు తాగునీటి కష్టాలు తప్పవు. హైలెవల్ కెనాల్ నేపథ్యం సోమశిల నుంచి ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలకు సాగు,తాగు నీరు ఇవ్వాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మేకపాటి సోదరులతో పాటు ఆనం సోదరులు కాలువ విషయాన్ని ఆయనకు నివేదించారు. హైలెవల్ కెనాల్ ప్రయోజనాలను గుర్తించిన వైఎస్సార్ వెంటనే ప్రాజెక్ట్కు సంబంధించి నిపుణులతో కమిటీ నియమించారు. మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు హైలెవల్ కెనాల్ అవసరమని నిపుణులు తేల్చారు. అప్పట్లోనే రూ.100 కోట్లతో సోమశిల అధికారులు అంచనాలు రూపొందించారు. ఇంతలో వైఎస్సార్ ఆకస్మికంగా మృతిచెందారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు రూ.785 కోట్లతో మొదట అంచనాలు సిద్ధం చేశారు. అనంతరం వాటిని రూ.1,585 కోట్లకు పెంచారు. మొదటి విడతగా రూ.785 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చారు. గతేడాది ఏప్రిల్ 2న అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి సోమశిల ప్రాజెక్ట్ వద్ద శంకుస్థాపన చేశారు. తొలివిడతలో సోమశిల నుంచి మర్రిపాడు మండలం ప్రగల్లపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. జనవరిలో టెండర్ల ప్రక్రియ చేపట్టి మార్చిలో ముగించారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ తక్కువ మొత్తానికి టెండర్ దాఖలు చేయగా, ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇంతలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. చంద్రబాబు అధికారం చేపట్టి నెల గడిచినా హైలెవల్ కాలువ పనులు ప్రారంభించకపోవడంపై మెట్ట ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.