house owner
-
ఆరున్నర లక్షల కరెంటు బిల్లు.. అవాక్కైన ఇంటి యజమాని!
సాక్షి, యాదాద్రి జిల్లా: ఇంట్లో రెండు బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్నప్పుడు, సాధారణంగా కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మహా అయితే.. రేయింబవలు వేసిన 400 నుంచి 500 మించి రాదు. మహా అయితే వెయ్యి రూపాయలు వస్తుందేమో. కాకపోతే ఓ ఇంటికి ఎంత బిల్ వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. మండుటెండలో ఇంటి కరెంట్ బిల్లు చూసిన యజమానికి చెమటలు పట్టడమే కాకుండా.. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగు చూసింది.జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్పేట గ్రామానికి చెందిన డీ పరశురాములు ఇంటికి విద్యుత్తు బిల్లు రీడింగ్ తీసేందుకు సోమవారం ట్రాన్స్కో సిబ్బంది వచ్చారు. ప్రతి నెలా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు సబ్సిడీ వర్తించే సర్వీస్ నంబర్.. సోమవారం మీటర్ రీడింగ్ను స్కాన్ చేస్తుండగా ఒక్కసారిగా రూ.6,72,642 బిల్లు వచ్చింది.రీడింగ్ ఒక్కసారిగా 5,40,927 యూనిట్లు వాడినట్టు రావడంతో ఇంటి యాజమాని అవాక్కయ్యాడు. గృహజ్యోతి కింద సబ్సిడీ వస్తున్న విద్యుత్తు బిల్లు ఏకంగా రూ.6,72,642 రావడం ఏంటని ట్రాన్స్కో సిబ్బందిని ప్రశ్నించాడు. ఈ విషయమై ట్రాన్స్కో ఏఈ ప్రభాకర్రెడ్డిని వివరణ కోరగా.. రీడింగ్ తీస్తున్న సమయంలో హై ఓల్టేజ్ వచ్చినట్టయితే రీడింగ్ జంప్ అయ్యి పెద్ద మొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అధిక బిల్లు వచ్చిన మీటర్ను టెస్టింగ్ కోసం పంపినట్టు ఆయన పేర్కొన్నారు. -
పనిపిల్లపై యజమాని కుటుంబం దాష్టీకం
గురుగ్రామ్: పదమూడేళ్ల పనిపిల్ల పట్ల ఓ ఇంటావిడ దారుణంగా ప్రవర్తించింది. హరియాణాలోని గురుగ్రామ్ పట్టణంలోని సెక్టార్ 51 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పనికి కుదిర్చిన వ్యక్తితో కలిసి ఎట్టకేలకు తల్లి.. ఆమె కూతురుని విడిపించుకుంది. తాను అనుభవించిన చిత్రహింసను కూతురు ఏడుస్తూ చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. బిహార్కు చెందిన ఈమె తన కూతురును జూన్ 27వ తేదీన ఒకావిడ ఇంట్లో పనికి కుదిర్చింది. ఇంట్లో ఉంచుకుని, పనికి నెలకు రూ.9,000 జీతం ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకుంది. ‘‘ మొదట్లో రెండు నెలలు మాత్రమే నా కుతురుకు జీతం ఇచ్చారు. ఆ తర్వాత చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఇంటి పని అంతా చేయించుకుని ఇష్టమొచి్చనట్ట కొట్టేవారు. పెంపుడు కుక్కతో కరిపించేవారు. యజమాని ఇద్దరు కుమారులు నా బిడ్డను లైంగికంగా వేధించారు. బలవంతంగా బట్టలూడదీసి ఫొటోలు, వీడియోలు తీసేవారు. అసభ్యంగా తాకేవారు. యజమానురాలు ఇనుప కడ్డీ, సుత్తితో కొట్టి చిత్రహింసలు పెట్టేది. బయటకు తప్పించుకునిపోకుండా గదిలో బంధించేవారు. కట్టేసి అరవకుండా నోటికి టేప్ అంటించారు. చేతులపై యాసిడ్ పోశారు. విషయం బయటకు పొక్కితే చంపేస్తామని బెదిరించేవారు. నా బిడ్డకు రెండు రోజులకు ఒకసారి భోజనం పెట్టేవారు. ఇంతటి దారుణాలు తెలిశాక స్థానిక వ్యక్తితో కలిసి ఎట్టకేలకు ఆ బిడ్డను విడిపించుకున్నా’’ అని టీనేజర్ తల్లి వాపోయారు. -
గుండె గు‘బిల్లు’!.. ఖాళీగా ఉన్న ఇంటికి రూ. 7,97,576 కరెంట్ బిల్లు
సాక్షి, ఉప్పల్: ప్రతి నెల రూ. 200 నుంచి రూ. 300 వరకు వచ్చే విద్యుత్ బిల్లు ఏకంగా రూ. 7,97,576 రావడంతో ఇంటి యాజమానుల గుండె ఆగినంత పనైంది. ఇదేమని విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తే డీడీ కట్టి మీటర్ను చెక్ చేయించుకోవాలని, లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనని గద్దించారు. ఈ సంఘటన ఉప్పల్ ఏఈ పరిధిలో హైకోర్డు కాలనీలో చోటు చేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం... ఉప్పల్ హైకోర్టు కాలనీకి చెందిన పాశం శ్రీదేవి పేరిట రెండు మీటర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఖాళీ పోర్షన్కు ఉన్న విద్యుత్ మీటరుకు ప్రతి నెల రూ. 300లోపు మిని మం బిల్లు వచ్చేది. అయితే మే నెలకు సంబంధించి జూన్లో వచ్చిన బిల్లు ఆన్లైన్లో చెక్ చేయగా ఏకంగా రూ. 7,97,576లు రావడంతో ఇంటి యాజమానుల గుండె ఆగినంత పనైంది. వెంటనే విద్యుత్ అధికారులను సంప్రదిస్తే నిర్లక్ష్య సమాధానం చెబుతూనే మీటరు టెస్టింగ్కు డీడీ కట్టుకొని చెక్ చేయించుకోవాల్సిందిగా లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనంటూ చేతులు దులిపేసుకున్నారు. దీంతో చేసేది లేక రూ. 150 డీడీ కట్టి మౌలాలిలో మీటర్ చెక్ చేయించారు. మీటరు డిఫెక్ట్ ఉన్నట్లు రిపోర్టులో రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై వివరణ కోసం మాట్లాడేందుకు యత్నించగా ఉప్పల్ సర్కిల్ ఏడీఈ బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. చదవండి: పాలమూరులో ‘అవతారపురుషుడి’ హల్చల్ -
ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిలకు తెలియకుండా.. ఫ్లాట్లో
జైపూర్: ఓ ఇంటి యజమాని పాడు పని చేశాడు. అమ్మాయిలకు రెంట్ ఇచ్చిన ఫ్లాట్లో వాళ్లకు తెలియకుండానే రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. బెడ్రూం, బాత్రూంలో స్పై కెమెరాలు పెట్టి తరచూ వాళ్ల అశ్లీల దృశ్యాలను వీక్షించాడు. ఫ్లాట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంట్ పోవడంతో అమ్మాయిలు ఎలక్ట్రిషన్ను పిలిపించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతను వైర్లు పరిశీలిస్తుండగా ఐదారు సీక్రెట్ కెమెరాలు కన్పించాయి. దీంతో కంగుతిన్న ముగ్గురు అమ్మాయిలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు యజమానిని ఏఫ్రిల్ 27న అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం నిందితుడికి మే 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. చదవండి: నడుస్తున్న ట్రక్కు నుంచి మేకల చోరీ.. ఆ తర్వాత కారుపై జంప్.. ధూమ్ సినిమాను తలపించిన దొంగతనం రాజస్థాన్ ఉదయ్పూర్లో ఈ ఘటన జరిగింది. ఇంటి యజమాని పేరు రాజేంద్ర సోని. సీసీటీవీల వ్యాపారం చేస్తున్నాడు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎంటెక్ చేసిన ఇతడు ఐటీ నిపుణుడు. స్పై కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలో బాగా తెలుసు. అందుకే అమ్మాయిలు సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు డూప్లికేట్ కీ ఉపయోగించి ఫ్లాట్లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశాడు. ఉచిత వైఫై అందిస్తానని చెప్పి రూటర్ కూడా ఇన్స్టాల్ చేశాడు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. ఇలా సీక్రెట్గా వీడియోలూ చూడటం తన బలహీనత అని చెప్పుకొచ్చాడు యజమాని. చాలా కాలంగా ఇలా చేస్తున్నట్లు తెలిపాడు. కాగా.. ఈ ముగ్గురు అమ్మాయిలు 8 నెలల క్రితం ఈ ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలను ఇన్ని రోజులు గమనించలేకపోయామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. పాపం ప్యాంటు ఊడి ఇబ్బందిగా.. -
ఇంటర్లో తక్కువ మార్కులొచ్చాయని ఇల్లు అద్దెకివ్వని ఓనర్.. ఎక్కడో తెలుసా?
మంచి ఉద్యోగం రావాలంటే బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు మంచి మార్కులుంటేనే ఇల్లు అద్దెకు లభిస్తుంది. వినటానికి ఇది కొత్తగా అనిపించినా ఇది అక్షరాలా నిజం. ఈ సంఘటన ఇటీవల బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో వెలుగులోకి వచ్చిన సంఘటనలో హౌస్ బ్రోకర్, హౌస్ ఓనర్, రెంట్ కోసం వచ్చిన వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ ట్విటర్ అకౌంట్ ద్వారా వైరల్ అయింది. ఇందులో 'మీ మార్కులు మీ జీవితాన్ని నిర్ణయిస్తాయో లేదో తెలియదు కానీ బెంగళూరులో అద్దెకి ఉండాలంటే మాత్రమే నిర్ణయించేది మీ మార్కులే' అని శుభ్ అనే వ్యక్తి ట్విటర్ ద్వారా షేర్ చేశారు. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో 76 శాతం మార్కులు వచ్చాయనే కారణంతో బెంగళూరులో ఒక ఇంటి ఓనర్ మా కజిన్కు ఇల్లు అద్దెకు ఇవ్వలేదని, ఇది అస్సలు నమ్మలేకపోతున్నానని శుభ్ ట్వీట్ చేశారు. నిజానికి యోగేష్ అనే వ్యక్తి అద్దె ఇంటికోసం బ్రోకర్ ని సంప్రదించాడు. అతడి ప్రొఫైల్ యాక్సెప్ట్ చేసిన హౌస్ ఓనర్ లింక్డ్ఇన్, ట్విట్టర్ వంటి ఫ్రొఫైల్స్ తో పాటు పదవతరగతి, ఇంటర్ మార్క్స్ కార్డ్స్, పాన్, ఆధార్ కార్డుతో పాటు 150 నుంచి 200 పదాల్లో తన గురించి ఇంట్రో రాసి పంపాలని చెప్పాడు. (ఇదీ చదవండి: ఎగిరే కారు వచ్చేసిందండోయ్! రూ. 6.5 లక్షలతో ఇంటికి తీసుకెళ్లొచ్చు..) హౌస్ ఓనర్ చెప్పినవన్నీ యోగేష్ చేశారు. అయితే ఇంటర్లో 76 శాతం మార్కులు వచ్చాయనే కారణంగా ఇల్లు అద్దెకు ఇవ్వడం కుదరదని చెప్పాడు. ఈ సంభాషణకు సంబంధించిన సమాచారం మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ ఇప్పటికి 15 లక్షల మందికి పైగా చూసారు. కొంతమంది రాబోయే రోజుల్లో బెంగళూరులో అద్దె ఇంటికోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా పెడతారేమో అంటూ కామెంట్ చేసాడు. "Marks don't decide your future, but it definitely decides whether you get a flat in banglore or not" pic.twitter.com/L0a9Sjms6d — Shubh (@kadaipaneeeer) April 27, 2023 ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
టు లెట్.. టేక్ కేర్
హిమాయత్నగర్: నగరంలోని ఇల్లు ఎవరిదైనా అద్దెకు ఉందని యాడ్ కనిపిస్తే చాలు. క్షణాల్లో కొత్త ఫోన్ నంబర్ నుంచి ఇంటి యజమానికి ఫోన్ వస్తుంది. ‘నేను ఆర్మీలో అధికారిని, మీ ఇల్లు అద్దెకు ఉన్న విషయాన్ని ఇప్పుడే వెబ్సైట్లో చూశాను. మీ ఇల్లు నాకెంతో నచ్చింది’, అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్మీ అధికారులంటే ప్రజల్లో ఉన్న ఓ గొప్ప నమ్మకాన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. మీరు ముందుగా మా అకౌంట్కు కొంత డబ్బు పంపండి అది ఓకే అయితే వెంటనే మీకు ఏడాదికి సరిపోయే ఇంటి అద్దె డబుల్ చెల్లిస్తామంటూ మాయ మాటలు చెప్తూ లక్షల రూపాయిలు కాజేస్తున్నారు. కేవలం ఆర్మీ అధికారులు మోసం చేయరనే ఒక నమ్మకంతో అమాయక ప్రజలు లక్షల పోగొట్టుకుంటూ సైబర్క్రైం పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ కొట్టేస్తున్నారు ఆర్మీలో పనిచేసే అధికారుల ఇల్లు అద్దె అంతా కూడా ఆర్మీనే చెల్లిస్తుంది. ఆరు నెలల నుంచి ఏడాదికి సరిపోయే అద్దెతో పాటు ఆరు నెలల అడ్వాన్స్ ముందుగానే మీ అకౌంట్లో పడుతుందని చెబుతున్నారు. దీనికి ఇంటి యజమాని ఓకే చెప్పడంతో పథకాన్ని రచిస్తున్నారు. ముందుగా మీకొక లింకు పంపుతాము దానికి కేవలం రూ. 5 పంపండి మీకు రూ. 10 వస్తాయి మా ఆర్మీ నుండంటూ సూచిస్తున్నారు. వెంటనే వాళ్లు పంపిన లింకుకు రూ. 5 పంపగానే రూ. 10 వస్తున్నాయి. ఆ తర్వాత నెల అద్దె రూ. 12 వేలు ఉంటే రెండునెలలవి రూ. 24 వేలు పంపమంటున్నారు. అవి పంపినప్పటి నుంచి సైబర్ కేటుగాళ్ల డ్రామా మొదలవుతుంది. ఏదో టెక్నికల్ సమస్య ఉందంటూ మళ్లీ పంపాలని కాజేస్తున్నారు. ఇదే తరహాలో వారం క్రితం ఓ గృహణి పలు దఫాలుగా వారు చెప్పిన లింకుకు ఒక్కరోజులో రూ. 12 లక్షలు పంపింది. ఇంకా ఇంకా అడగడంతో అప్పటికి ఆమె మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆర్మీ అధికారుల పేర్లు చెబుతూ ఈ దందా చేస్తున్నవారంతా కూడా రాజస్థాన్, యూపీకి చెందిన వారిగా సైబర్క్రైం పోలీసులు గుర్తించారు. (చదవండి: దయచేసి ఆ గుర్తులను తొలగించండి.. టీఆర్ఎస్ విజ్ఞప్తి) -
ఒంటరిగా ఉన్న యువతి ఇంట్లోకి వెళ్లి.. పిస్తోల్తో బెదిరించి..
బనశంకరి(బెంగళూరు): ఇంట్లో అద్దెకు ఉండే యువతిని పిస్తోల్తో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఇంటి యజమానిని ఆదివారం అశోక్నగర పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్కు చెందిన అనిల్ రవి శంకర్ప్రసాద్ నిందితుడు. టైల్స్ వ్యాపారం కోసం ఇతను నగరంలో ఉంటున్నారు. ఇతని ఇంట్లో పశ్చిమ బెంగాల్కు చెందిన యువతి గత మార్చి నుంచి బాడుగకు ఉంటోంది. ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్న యువతి ఇంటికి తరచూ స్నేహితులు వస్తుండటంతో అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిరోజుల క్రితం యువతి స్నేహితుడితో కలిసి ఉండటాన్ని గమనించిన ఇంటి యజమాని కేసు పెట్టిస్తానని బెదిరించాడు. ఏప్రిల్ 11న యువతి ఇంటిలోకి వచ్చిన అనిల్ తన లైసెన్స్ రివాల్వర్తో వచ్చి బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం ఇంటి యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: ప్రేమను చంపుకోలేక.. ప్రాణం తీసుకుంది -
చేనేత కార్మికుడి మృతి.. ఇంటి యజమాని అమానుషం
జనగామ: అనారోగ్యంతో మరణించిన చేనేత కార్మికుడి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువచ్చేందుకు యజమాని నిరాకరించిన విషాద ఘటన గురువారం జనగామ జిల్లా కేంద్రం వీవర్స్ కాలనీలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన మండల శంకర్(60) నాలుగున్నర దశాబ్దాలుగా చేనేత వృత్తిని నమ్ముకుని అద్దింట్లో ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల పాటు కరోనాతో నమ్ముకున్న వృత్తి నట్టేట ముంచేయగా, ప్రస్తుతం పెరిగిన నూలు ధరలతో పట్టుచీర వ్యాపారం అట్టడుగు స్థాయికి పడిపోయింది. చీరల తయారీ, అమ్మకాలు మందగించడంతో కొన్ని నెలలుగా కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో మానసికంగా కుంగిపోయిన శంకర్ అనారోగ్యం పాలై ఇంటి వద్దనే మృతిచెందాడు. కార్మికుడు మృతి చెందడంతో అద్దె ఇంటి యజమాని మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు నిరాకరించడంతో అక్కడే ఉన్న బంధువుల ఖాళీ స్థలంలో చివరి మజిలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం మానవత్వంతో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మినాగరాజు విజ్ఞప్తి చేశారు. మృతునికి భార్మ నిర్మల, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. -
‘ఎంజీఎం’ బాధితుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని ఓనర్
హసన్పర్తి: నిమ్స్లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల దాడి బాధితుడు కడార్ల శ్రీనివాస్ (37) మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లేందుకు యజమాని నిరాకరించాడు. హనుమకొండలోని కుమార్పల్లిలో అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకురాగా యజమాని అభ్యంతరం చెప్పాడు. తన ఇంట్లోకి తీసుకు రావద్దని చెప్పడంతో భీమారంలోని ఆయన సోదరుడి ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. హనుమకొండ ఆర్డీఓ వాసుచంద్ర, శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందించారు. శ్రీనివాస్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుతో మాట్లాడినట్లు చెప్పారు. -
ఫోన్లో ఎంటర్ చేయగానే లక్ష రూపాయలు మాయం!
బాలానగర్: ఇంటిని అద్దెకు ఇస్తానని ఆన్లైన్లో పోస్ట్పెట్టిన వ్యక్తి రూ.లక్ష పోగొట్టుకున్న ఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. బాలానగర్ డివిజన్కు చెందిన గన్ను తిరుపతయ్య సాయినగర్లోని ఫ్లాట్ను అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్ డాట్ కమ్లో 2వ తేదీన పోస్ట్ చేయగా.. నేను మీ ఇంటిని అద్దెకు తీసుకుంటానని ఓ వ్యక్తి రిప్లే ఇచ్చాడు. నెలకు రూ.15 వేల అద్దె 3 నెలల అడ్వాన్స్గా ఇవ్వాలని తిరుపతయ్య కోరగా గుర్తు తెలియని ఆ వ్యక్తి గూగుల్ పే నుంచి మీ అకౌంట్ వివరాలు పంపాలని కోరగా బాధితుడు పంపాడు. కాసేపటి తర్వాత మీ దగ్గర నుంచి నాకు మెసేజ్ రాలేదని ఓసారి రూ.45 వేలు ఎంటర్ చేసి చూపండి అని చెప్పగా తిరుపతయ్య అదే విధంగా చేయగా రెండు దఫాలుగా రూ.45 వేలు, మరోసారి రూ.10 వేలు తిరుపతయ్య అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
దారుణం: కాళ్లు చేతులు కట్టేసి.. నోట్లో చీర కొంగు కుక్కి..
సాక్షి, అల్వాల్: నల్లాలు పని చేయడం లేదని ఇంట్లోకి పిలిచి ఇంటి యజమానురాలిని చార్జింగ్ కేబుల్తో కాళ్లు చేతులు కట్టేసి నోట్లో చీర కొంగు కుక్కి ల్యాప్టాప్ కేబుల్ను గొంతుకు బిగించి దారుణంగా హత్య చేసిన సంఘటన అల్వాల్ పరిధిలో గురువారం వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కానాజీగూడ సత్యసాయి కాలనీకి చెందిన మంగతాయారు(75) కుమారుల్లో ఒకరు ఆర్మీలో కల్నల్గా పనిచేస్తుండగా, మరొకరు అమెరికాలో ఉంటున్నారు. కుమార్తె ఆమె ఇంటికి సమీపంలోనే ఉంటోంది. మంగతాయారు కుమారుడు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో సమీపంలో ఉన్న సోదరికి ఫోన్ చేశాడు. కుమార్తె ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉండటంతో చుట్టు పక్కల వాకాబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మంగతాయారు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న రాజేష్ను ప్రశి్నంచగా ముక్తసరిగా సమాధానం చెప్పి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దీంతో అనుమానం వచి్చన పోలీసులు అతడి ఇంట్లో గాలించగా బాత్రూమ్లో మంగతాయారు కాళ్లు చేతులు కట్టి పడేసి విగతజీవిగా పడిఉంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న రాజేష్కు గతంలో పలుమార్లు భార్యతో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో మంగతాయారు జోక్యం చేసుకొని అతడిని మందలించిందని తెలిసింది. అయితే 10 రోజుల క్రితం అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతోపాటు రాజేష్కు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన రాజేష్ బుధవారం మధ్యాహ్నం ఇంటి టెర్రస్ పై మొక్కలు చూసేందుకు వెళ్తున్న మంగతయారును నల్లాలు పనిచేయడం లేదని ఇంట్లోకి పిలిచి ల్యాప్టాప్ కేబుల్ వైర్ గొంతుకు బిగించి దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని బాత్రూంలో పారవేశాడు. అనంతరం ఆమె చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులను తీసుకొని వెళ్లి ప్రైవేటు ఫైనాన్స్లో కుదువపెట్టి డబ్బులు తీసుకొని అప్పులు తీర్చుకున్నాడు. రాత్రి వరకు ఏమీ తెలియనట్లు ఇంట్లోనే ఉన్నాడు. డబ్బుల కోసమే వృద్ధురాలిని హత్య చేశాడా మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మణప్పురం సంస్థకు రూ.30 లక్షలు టోకరా మాజీ కార్పొరేటర్ దారుణ హత్య.. ఖండించిన సీఎం -
దారుణం: కరోనా సోకిందని ఖాళీ చేయించారు..
పాలకుర్తి (వరంగల్ రూరల్): కరోనా వచ్చిన వారిపై ప్రేమచూపకున్నా.. వారిని హేళనగా చూడొద్దని, అలాంటి వారిని ఆదరించాలని ఎంత చెప్పినా.. కొంతమంది మారడంలేదు. అందుకు ఉదాహరణే ఈఘటన. సొంత ఇల్లు లేకపోవడంతో జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కిరాయి ఇంట్లో నివాసముంటున్న ఈగ సుగుణమ్మ అనే వృద్ధురాలకి కరోనా సోకింది. దీంతో ఇంటి యజమాని ఆమెను బయటకు వెళ్లిపోవాలని చెప్పడంతో దిక్కుతోచిని స్థితిలో పడింది. దీంతో స్పందించిన స్థానిక వార్డు సభ్యుడు వీరమనేని హన్మంతరావు సదరు వృద్ధురాలిని ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్పించారు. అయితే సుగుణమ్మకు ఇద్దరు కుమారులు ఉండగా.. ఒకరు హన్మకొండలో నివాసం ఉంటున్నాడు. మరో కుమారుడు కుటుంబ కలహాల నేపథ్యంలో వేరుగా ఉంటున్నట్లు సమాచారం. -
కరోనా భయంతో వృద్ధురాలిని గెంటివేసిన ఇంటి యజమాని
జగ్గయ్యపేట అర్బన్: కరోనా వచ్చిందని 65 ఏళ్ల వృద్ధురాలిని ఇంటి యజమాని అమానుషంగా నడిరోడ్డు మీదకు నెట్టేసిన ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శనివారం చోటుచేసుకుంది. బొజ్జ సామ్రాజ్యం అనే వృద్ధురాలు పట్టణ శివారులోని పద్మావతినగర్లోని అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు గతంలో ఇంటిని అమ్మేసి కన్న తల్లిని ఒంటరిగా వదిలేసి ఆ డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమె అద్దె ఇంట్లో ఉంటూ పెన్షన్ డబ్బుతో జీవనం వెళ్లదీస్తోంది. ఆమెకు కరోనా సోకిందన్న సమాచారం తెలుసుకున్న ఇంటి యజమాని సామాన్లతో సహా బయటకు గెంటేశాడు. దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు ఆరుబయట దీనావస్థలో పడి ఉండటంతో విషయం తెలుసుకున్న స్థానిక సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ చినబాబు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి ఇంటి యజమానిని హెచ్చరించి తిరిగి ఆమెను ఇంటిలోకి చేర్చారు. మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా ఇల్లు, పరిసరాలు శానిటేషన్ చేయించారు. వెంటనే ఎస్ఐ ఈ విషయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వృద్ధురాలిని స్థానిక గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లో చేర్చుకుని వైద్య సేవలందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. -
ఆన్లైన్ క్లాసులు వింటున్న బాలికపై అత్యాచారం
జగద్గిరిగుట్ట: మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి, బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగద్గిరిగుట్ట పరిధిలోని ఎల్లమ్మబండకు చెందిన బాలిక (15), తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్లగా.. ఇంట్లో ఆన్లైన్ క్లాసులు వింటూ ఒంటరిగా ఉంటున్నది. అదే క్రమంలో ఇంటి యజమాని కుమారుడు మధుసూదన్ రెడ్డి (27) బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. దీనిని వీడియోలో చిత్రీకరించాడు. విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పెడతానని బాలికను భయపెట్టాడు. మనోవేదనకు గురైన బాలిక ఈనెల 12న విషం తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. బాలికను చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చిన్నారి వైద్యం కోసం వెళ్తూ..) -
కానిస్టేబుళ్లకు కరోనా సోకిందని..
మహబూబాబాద్ రూరల్: కరోనా లాక్డౌన్ సమయంలో విధులు నిర్వర్తించిన తమకు ఇప్పుడు వైరస్ సోకపోవడంతో పట్టించుకునే వారే లేకుండా పోయారని జిల్లాకు చెందిన స్పెషల్ పార్టీ పోలీసు కానిస్టేబుళ్లు సారంగపాణి, కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం వారు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రత్యేక పోలీసు దళంలో పనిచేస్తున్న సుమారు 20 మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకగా, హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచించారని తెలిపారు. అయితే, తమలో ఒకరు అద్దె ఇంట్లో ఉంటుండగా, యజమాని కుటుంబంలో వివాహం ఉండడంతో లోనకు రావొద్దన్నారని చెప్పారు. ఇంకొకరి ఇంట్లో చిన్న పిల్లలు ఉండడంతో వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. అయితే, తా మిద్దరం ఆస్పత్రిలో ఉంటామంటే రెండు రోజుల అనంతరం వసతి చూపిస్తామని వైద్యాధికారులు చెప్పారని పేర్కొన్నారు. దీంతో దిక్కుతోచక జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపాన గుట్టల ప్రాంతంలో తలదాచుకుంటున్నామని తెలిపారు. అధికారులు స్పందించి తాము ఆస్పత్రిలో చికిత్స పొందేలా చూడాలని వేడుకున్నారు. కాగా, ఇద్దరు కానిస్టేబుళ్లు గుట్టల్లో ఆశ్రయం పొందున్న విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో ఎస్పీ కోటిరెడ్డి రంగంలోకి దిగారు. ఇంటి యజమానులతో పాటు కానిస్టేబుళ్లతో చర్చించగా వారు సోమవారం రాత్రి పొద్దుపోయాక ఇళ్లకు చేరుకున్నారు. -
భర్తకు కరోనా పాజిటివ్.. అమానవీయం..
ఆల్కాట్తోట యాళ్లవారి వీధిలో ఓ వ్యక్తికి కరోనా సోకింది. దీంతో ఆమె భార్యను ఆమె అద్దెకుంటున్న ఇంటి యజమాని, స్థానికులు లోపలికి వెళ్లనీయకుండా ఇంటికి తాళాలు వేసేశారు. దీంతో ఆమె ఆరుబయటే ఆ రాత్రంతా ఉండాల్సిన పరిస్థితి. చివరికి పోలీసులు, అధికారులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు ఆమెను లోపలికి అనుమతించారు. కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో కరోనా మహమ్మారి దెబ్బకు ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఆమెను చూసేందుకు, అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ మండలంలోని అధికారులే దహన సంస్కారాలు చేయించాల్సిన పరిస్థితి. ఈ రెండు అమానవీయ సంఘటనలు జిల్లాలో గురువారం చోటు చేసుకున్నాయి. కరోనా మహమ్మారి మనుషుల్లో భయాన్ని నింపడమే కాదు.. మానవత్వాన్ని కొంచెమైనా లేకుండా చేస్తోందనేందుకు ఈ సంఘటనలే నిదర్శనం.. తూర్పుగోదావరి ,ఆల్కాట్తోట(రాజమహేంద్రవరం రూరల్): భర్తకు కరోనా పాజిటివ్. ఆయనను బొమ్మూరు కోవిడ్ కేర్ సెంటర్కు తరలించి, భార్య ఇంటిలోనే ఉంటోంది. ఆమె బయటకు వెళ్లి వస్తుందన్న కారణంతో ఆమె ఉంటున్న ఇంటి యజమాని ఇంటికి తాళం వేశారు. పోనీ పక్కవీధిలో ఉన్న సొంతింటికి వెళ్లి తలదాచుకుందామనుకుంటే అక్కడా స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. చివరికి చేసేదేం లేక తాను అద్దెకు ఉంటున్న ఇంటి ముందే ఆరుబయట కూర్చోవలిసిన దుస్థితిని బుర్రిలంక సచివాలయ హెల్త్ సెక్రటరీ కల్యాణి ఎదుర్కొంది. ఆల్కాట్తోట యాళ్లవారివీధిలో జరిగిన ఈ సంఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణిని అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసి, ఆమెను తన ఇంటిలోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఆల్కాట్తోట ప్రాంతం యాళ్లవారివీధికి చెందిన బుర్రిలంక సచివాలయ హెల్త్ సెక్రటరీ కళ్యాణి అద్దె ఇంటిలో ఉంటోంది. బుర్రిలంక గ్రామంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆమె వైద్యసేవలు అందిస్తోంది. ఈలోపు ఆమె భర్తకు కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్లో ఉండేలా వైద్యాధికారుల నుంచి అనుమతులు తీసుకుంది. స్థానికులు అభ్యంతరం చెప్పడంతో అతడిని బొమ్మూరు కోవిడ్ కేర్సెంటర్కు తరలించారు. ఆమె మాత్రం అద్దె ఇంటిలోనే హోమ్ క్వారంటైన్లో ఉంది. అయితే కళ్యాణి ఇంటి నుంచి బయటకు వెళ్లి రావడంతో ఇంటి యజమాని ఆమె లేని సమయంలో ఇంటికి తాళం వేశారు. ఈలోపు ఇంటికి చేరుకున్న కళ్యాణి తాళం వేసి ఉండడంతో ఇంటి యజమానితో మాట్లాడగా.. ఇక్కడ ఉండడానికి వీల్లేదని తెలిపారు. దీంతో పక్కవీధిలో ఉన్న తన సొంతింటికి వెళ్లింది. అక్కడ కూడా స్థానికులు రానివ్వకపోవడంతో ఆమె అద్దెకుంటున్న ఇంటికి వచ్చి బుధవారం రాత్రి నుంచి అక్కడే కూర్చుని ఉంది. గురువారం ఉదయం కూడా వర్షంలోనే కూర్చొని తన బాధను వీడియో తీసి వాట్సప్ గ్రూపుల్లో పెట్టి తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంది. టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అర్బన్ జిల్లా దక్షిణమండల డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు, టూటౌన్ ఎస్సైలు లక్ష్మీ, అశోక్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. కళ్యాణి ఇంటిలో ఉంటే తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని, బయట తిరగడం వల్ల అభ్యంతరం వ్యక్తం చేశామని స్థానికులు డీఎస్పీ వెంకటేశ్వర్లకు వివరించారు. దీంతో డీఎస్పీ నగరపాలకసంస్థ అధికారులతో మాట్లాడి ఆ ఇంటిని శానిటైజేషన్ చేయించి కళ్యాణిని ఇంటిలోకి పంపించారు. కళ్యాణి ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్సై లక్ష్మీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చికెన్ తిన్న తర్వాతే స్పృహ తప్పింది....
చందానగర్: అనుమానాస్పద స్థితిలో ఓ కుటుంబంలోని తల్లి, కూతురు, కొడుకు స్పృహ కోల్పోయారు. ఇంటి యజమానే చికెన్లో మత్తుమంది కలిపి ఆపై లైంగిక దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చందానగర్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన ఓ కుటుంబం కొద్ది సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చింది. శేరిలింగంపల్లిలోని సందయ్యనగర్లో బాధిత మహిళ (35), భర్త, కూతురు (15) కొడుకు (10) నివాసం ఉంటున్నారు. వీరు కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరి ఇంటి యజమాని అయిన గంగాధర్ ‡(45) మసీద్బండలో ఉంటూ టైలర్గా పని చేస్తున్నాడు. సందయ్యనగర్ లోని తన ఇంటిలోని ఒక పోర్షన్ వీరికి అద్దెకు ఇవ్వగా.. మిగతా పోర్షన్లు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల ఇంటిని యజమాని అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలో మంగళవారం గంగాధర్ తన అసిస్టెంట్లు నగేష్ (48), గణేష్(40)తో కలిసి వచ్చాడు. చికెన్ తీసుకువచ్చి అద్దెకుంటున్న మహిళకు వండిపెట్టమని ఇచ్చారు. సదరు మహిళ చికెన్ వండి ఇవ్వగా.. వారు తిన్న తర్వాత మిగిలిన చికెన్ను ఆమెకు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 4 గంటల ఆ చికెన్ తిన్న తల్లి, కుతురు, కొడుకు సృహ కోల్పోయారు. కూలీ పనులు ముగించుకొని రాత్రి 9 గంటలకు భర్త ఇంటికి వచ్చాడు. వచ్చే సరికి భార్య, కూతురు, కొడుకు స్పృహతప్పి పడి ఉన్నారు. ఆందోళన చెందిన అతను స్థానికుల సహాయంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించగా స్పృహలోకి వచ్చారు. చికెన్ తిన్న తర్వాత తాము స్పృహ కోల్పోయామని భర్తతో మహిళ చెప్పింది. చికెన్లో మత్తు మందు కలిపి ఇచ్చి అనంతరం తల్లి, కూతరుపై లైంగిక దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బాధితులు బుధవారం చందానగర్ పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి యజమానిని, అసిస్టెంట్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితులకు పరీక్షలు చేయించామని రిపోర్ట్స్ వచ్చాకే మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డారా..? లేదా...? అన్న విషయం తెలుస్తుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. తల్లీకూతుళ్లు ఉస్మానియాలో, కొడుకు నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికెన్ తిన్న తర్వాతే స్పృహ తప్పింది.... ఇంటి యజమాని గంగాధర్, నగేష్, గణేష్లు మంగళవారం సాయంత్రం వచ్చి చికెన్ వండి ఇవ్వమని ఇచ్చారని బాధిత మహిళ తెలిపింది. మిగిలిన చికెన్ ఇవ్వగా కూతురు, కొడుకుతో పాటు తాను తిన్నామని తెలిపింది. కొద్ది సేపటికే కళ్లు తిరిగి స్పృహ కోల్పోయామని ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదన్నారు. గత మూడు రోజులుగా వారు ఇక్కడికి వస్తున్నారని, వారితో గుర్తు తెలియని అమ్మాయిలు వస్తున్నారని చెప్పింది. రూ.20 వేలు ఇస్తామని పోలీసులకు చెప్పవద్దని మధ్యవర్తులచే ముగ్గురు వ్యక్తులు చెప్పించారని పేర్కొంది. -
కరోనా బాధితురాలిపై అమానుషం
-
కరోనా బాధితురాలిపై అమానుషం
సాక్షి, తిరుపతి: రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో కొంతమంది కరోనా బాధితుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. తాజగా తిరుపతిలో కరోనా వైరస్ బాధితురాల పట్ల ఓ ఇంటి యజమాని అమానుషంగా వ్యహరించారు. కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని వచ్చిన చంద్రకళ అనే మహిళను తమ ఇంట్లోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న చంద్రకళ తన ఇద్దరు కుమార్తెలతో నడిరోడ్డు మీద ఇంటి యజమాని అనుమతి కోసం పడిగాపులు కాశారు. చంద్రకళ కొన్నేళ్ల నుంచి తన భర్త, ఇద్దరు పిల్లలతో సుందరయ్య నగర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల చంద్రకళకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెతోపాటు కుటంబం మొత్తం క్వారంటైన్కు వెళ్లారు. 14 రోజులపాటు క్వారంటైన్ను పూర్తి చేసుకున్న తర్వాత వారికి నెగటివ్గా రిపోర్టు వచ్చింది. అనంతరం ఇంటికి వచ్చిన వారి పట్ల ఇంటి యజమాని వ్యవహరించిన తీరుతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. -
కొడుకు మృతి.. ఇంట్లోకి రావొద్దన్న ఇంటి యజమాని
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సభ్యసమాజం తలదించుకునేలా మానవత్వం మంటకలిసింది. ఈ సంఘటన తంగళ్లపల్లి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. తంగళ్లపల్లిలోని రెడ్డివాడలో అద్దె ఇంట్లో నివాసముంటున్న మ్యాన అమిత్ (27) గురువారం ఉదయం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తే ఇళ్లు శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని అనుమతించలేదు. గత్యంతరం లేక అమిత్ కుటుంబసభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా తంగళ్లపల్లి ఊరి చివరికి శ్మశానం వద్దకు మృతదేహాన్ని తరలించారు. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం మ్యాన అమిత్ తండ్రి సుదర్శన్ గతంలో మృతిచెందగా తల్లి సువర్ణతోపాటు తన సోదరులతో కలిసి మండలకేంద్రంలో ఓ ఇంట్లో పదినెలలుగా అద్దెకు ఉంటున్నారు. టెక్స్టైల్ పార్కులో మరమగ్గాల కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి మ్యాన సువర్ణ బీడీల పనిచేస్తోంది. గురువారం తెల్లవారుజామున అమిత్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడంతో ఆరోగ్యం అతడిని హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే అమిత్ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడు. కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు దహనసంస్కారాలు నిర్వహించేందుకు తంగళ్లపల్లి అద్దె ఇంటికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తుండగా ఇంటి యజమాని ఇంట్లోకి తీసుకురావడానికి అనుమతించలేదు. ఎంత ప్రధేయపడినా ఒప్పుకోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆటోలో తంగళ్లపల్లి ఊరిచివర శ్మశానవాటిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడి నుంచే అమిత్కు అంతిమయాత్ర నిర్వహించాల్సి వచ్చింది. గూడు లేని పక్షులవలే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మనసున్న చాలా మందిని కంటతడి పెట్టించింది. అమిత్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున చేయూత అందించాలని అంతేకాకుండా ఉండడానికి గూడు కల్పించాలని తంగళ్లపల్లివాసులు కోరుతున్నారు. చలించిపోయిన పోలీసులు అక్కడే మానేరు వాగు ఒడ్డున పికెటింగ్ నిర్వహిస్తున్న సీఐ సర్వర్, పోలీస్ సిబ్బంది అమిత్ కుటుంబసభ్యుల పరిస్థితి చూసి చలించిపోయారు. సీఐ సర్వర్ రూ.10 వేలు, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి మరో రూ.5 వేలు ఆర్థికసాయం అందించారు. -
కరోనా నుంచి కోలుకొని ఇంటికి.. ఊహించని షాక్
సాక్షి, శ్రీకాళహస్తి: మహమ్మారి కరోనా వైరస్ నుంచి కోలుకున్నాననే ఆనందం కాసేపైనా ఆమెకు లేకుండా పోయింది. కనీస దయ, జాలి, కరుణ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకి వెళ్లగొట్టాడు తను అద్దెకుంటున్న బిల్డింగ్ యజమాని. ఈ అమానవీయ ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి తహశీల్దార్ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వరిస్తున్న ఓ మహిళా ఉద్యోగికి కరోనా పాజిటివ్గా తేలింది. అయితే చికిత్స అనంతరం కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యి కోటి ఆశలతో తను అద్దెకుంటున్న ఇంటికి చేరుకుంది. కానీ ఆ మహిళను ఇంటి యజమాని అడ్డుకున్నాడు. అమె అద్దెకుంటున్న ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో ఈ ఊహించని పరిణామం ఏర్పడటంతో ఏం చేయాలో పాలుపోక నడిరోడ్డుపై సదరు మహిళ నిల్చునే పరిస్థితి ఏర్పడింది. అయితే తమ సహోద్యోగి పరిస్థితి తెలుసుకున్న శ్రీకాళహస్తి తహశీల్దారు ఆమెకు వేరొకచోట బస ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై స్థానికులు మహిళా ఉద్యోగికి అండగా నిల్చోగా ఇంటి యజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కలతచెంది.. కాలినడకన బయలుదేరి.. డాక్టర్ దంపతులపై పూల వర్షం -
‘నువ్వు పిసినారివి రా’..
భోపాల్: దొంగతనం అంటే మాటలా..? ముందుగా దానికి ఓ పక్కా ప్లాన్ ఉండాలి. దానికి అనుగుణంగా స్కెచ్ గీసుకోవాలి. అలా చేస్తే గానీ అనుకున్న పని అవ్వదు. సరిగ్గా ఓ దొంగ ఇలానే చేశారు. పక్కా ప్లాన్తో ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే అక్కడ దొంగకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతంలో ఓ దొంగ రాత్రంతా ఎంతో కష్టపడి ప్రభుత్వ సంస్థలో ఇంజనీర్గా పనిచేస్తున్న పర్వేష్సోని ఇంట్లోకి అతికష్టం మీద కిటికీలు తొలగించి ప్రవేశించాడు. తీరా లోపలికి వెళ్లి చూస్తే షాక్కు గురయ్యాడు. ఇళ్లు మొత్తం వెతికినా దోచుకెళ్లడానికి కావాల్సిన విలువైన వస్తువులు ఏమీ లేకపోవడంతో నిరుత్సాహపడ్డాడు. ఇంతవరకు తాను పడిన కష్టానికి ఫలితం దక్కనందుకు కోపంతో ఇంటి యజమానికి ఒక లేఖ రాసి టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయాడు. ఆ లేఖలో ‘నువ్వు చాలా పిసినారివిరా.. కనీసం కిటికీ తొలగించడానికి పడిన శ్రమకు కూడా తగిన ఫలితం దక్కలేదు. ఈ రాత్రంతా వృథా అయ్యింది’ అని హిందీలో రాసి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం పర్వేష్ ఇంట్లో పనికి వచ్చిన మహిళ ఇంటిలోని వస్తువులన్నీ కిందపడి ఉండటంతో షాక్ అయ్యింది. టేబుల్ మీద ఉన్న లేఖ చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చేతిరాత పరిశీలన నిపుణులకు పంపారు. పర్వేశ్ ఇల్లు జాయింట్ కలెక్టర్, న్యాయమూర్తి ఇంటికి దగ్గరలో ఉండడంతో కేసుని సీరియస్గా తీసుకుని, సీసీ టీవీ పుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. -
ఓయోతో ఇంటి యజమానులకు ఆదాయం
సాక్షి, హైదరాబాద్: పర్యాటకులకు విభిన్న రకాల బస సదుపాయాలను అందించే ఆన్లైన్ ఆధారిత సంస్థ ఓయో నగరంలోని భవన యజమానులకు ఆదాయవనరుగా మారిందని ఓయో ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరవాసి ఐటి ఉద్యోగి అరవింద్ తన 30 ఏళ్ల నాటి భవనాన్ని ‘ఓయో 15141 టౌన్విల్లా గెస్ట్ హౌజ్’గా మార్చడం ద్వారా హోటల్ పరిశ్రమకు పరిచయం అవడంతో పాటు అనూహ్యమైన ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. అలాగే మహ్మద్ హబీబ్ మొయినుద్దీన్ కూడా తన నివాసాన్ని స్పాట్ ఆన్ 47525 డెక్కన్ లాడ్జ్గా మార్చి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటున్నారు. ఇలాగే మరెందరో ఓయోతో ప్రయోజనం పొందారని వివరించారు. ‘మాస్టర్ క్లాసెస్’ టూర్ ప్రస్తుతం హైస్కూల్ విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో మెడిసిన్ చదవాలని ఆశిస్తున్న విద్యార్థుల కోసం వెస్టిండీస్కు చెందిన జారŠజ్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ దేశవ్యాప్తంగా ‘మాస్టర్ క్లాసెస్ ఫర్ హైస్కూలర్స్’ టూర్ నిర్వహిస్తోంది. నగరంలోని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఈ కార్యక్రమం బుధవారం ప్రారంభం కానుందని నిర్వాహక సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరంతో పాటు బెంగుళూరు, ముంబయి, ఢిల్లీలోనూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. నగరంలో ఈ టూర్కి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరోసైన్స్ డా.కేశవకుమార్ మందలనేని శ్రీకారం చుట్టారని వివరించారు. -
బాలికపై ఇంటి యజమాని లైంగికదాడి
సనత్నగర్: ఓ బాలికపై ఇంటి యజమాని లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహమూబ్నగర్ కోస్గి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం నగరంలోని బల్కంపేట ప్రాంతానికి వచ్చి స్థిరపడింది. భర్త చనిపోవడంతో భార్య ఇళ్లల్లో పనిచేస్తూ కుమార్తెను (10)ను చదివిస్తోంది. స్థానిక దాసారం బస్తీలో ఉంటున్న వీరు బుధవారం ఇల్లు ఖాళీ చేసి బల్కంపేట బీజేఆర్నగర్ ప్రాంతంలోని మరో ఇంట్లో అద్దెకు దిగారు. గురువారం ఉదయం తల్లి పనిలోకి వెళ్లగా బాలిక ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన ఇంటి యజమాని నిమ్మగడ్డ రామ్ప్రసాద్ నామెను ఇంట్లోకి తీసుకెళ్ళి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆమె ఎస్సార్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న రామ్ప్రసాద్ కోసం గాలిస్తున్నారు. -
హౌస్ ఓనర్కు ముందుగానే అభినందనలు
సినిమా: హౌస్ ఓనర్ చిత్రానికి విడుదలకు ముందే అభినందనలు వర్షిస్తున్నాయని ఆ చిత్ర దర్శకురాలు, నటి లక్ష్మీరామకృష్ణన్ ఆనందంలో తేలిపోతున్నారు. కమర్శియల్గా విజయం సాధించిన చాలా చిత్రాలు కొన్నాళ్లే ప్రేక్షకుల్లో గుర్తుంటాయి.అలా చాలాకాలం గుర్తిండిపోయే చిత్రాలు కొన్నే ఉంటాయి. అలాంటి వాటిలో దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ చిత్రాలు కచ్చితంగా చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు.అలా ఈమె తెరకెక్కించిన ఆరోహణం, అమ్మణి చిత్రాల తరువాత తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం హౌస్ ఓనర్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్ తెలుపుతూ హౌస్ ఓనర్ చిత్రం జనరంజకంగానే కాకుండా, అందరినీ ఆలోచింపజేసే చిత్రంగా ఉంటుందన్నారు. చిత్రాన్ని తనకు సన్నిహితులు, విశ్లేషకులు అయిన కొంది మందికి ప్రదర్శించినట్లు తెలిపారు. చిత్రం చూసిన వారందరూ చక్కని సందేశంతో కూడిన కమర్శియల్ అంశాలతో కూడిన చిత్రం అని అభినందించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో ఆడుగళం కిశోర్ ప్రధాన పాత్రలో నటించగా, నటి విజీ చంద్రశేఖర్ కూతురు లవ్లీన్ను కథానాయకిగా పరిచయం చేసినట్లు చెప్పారు. తన నటన ఆమె తల్లి విజీ చంద్రశేఖర్, నటి సరిత గర్వపడేలా ఉంటుందన్నారు. నటన అనేది కుటుంబం సొత్తు అన్నట్టుగా లవ్లీన్ నటించిందని అన్నారు. నటి శ్రీరంజని కూడా మంచి పాత్రను పోషించినట్లు చెప్పారు. ఇక సంగీతదర్శకుడు జిబ్రాన్ సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిస్తుందని అన్నారు. హౌస్ఓనర్ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా విడుదల చేయనున్నట్లు లక్ష్మీరామకృష్ణన్ తెలిపారు. -
ఈసారైనా పరిష్కారమయ్యేనా?
సాక్షి, ఆమదాలవలస : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీలో భవనాల క్రమబద్ధీకరణపై చేపట్టిన బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) అనుకున్న ఫలితం ఇవ్వడంలేదు. ఈ స్కీం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉంటుంది. భవన యజమానులకు ఊరట కలగడంతోపాటు మున్సిపాలిటీకి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తుంది. ఇంతవరకు భాగానే ఉన్నా పథకంలో భాగంగా వచ్చిన దరఖా స్తులను పరిష్కరించడంలో అధికార యంత్రాంగం, పాలకవర్గం పట్టించుకోవడం లేదు. మరో వైపు మున్సిపల్ అధికారులు గృహాలకు కొలతలు వేసి అధిక మొత్తంలో అపరాధ రుసుం విధిస్తున్నారు. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు భవన యజమానులు వెనుకంజ వేస్తుండడంతో మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతోంది. ఇప్పటివరకు 101 దరఖాస్తులు బీపీఎస్ కింద తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానించడంతో మున్సిపాలిటీ పరిధిలో 101 దరఖాస్తులు వచ్చాయి. తొలివిడతలో 46, రెండో విడతలో 21 దరఖాస్తులు పరిష్కరించారు. మున్సిపాలిటీకి సుమారు రూ.49లక్షల వరకు ఆదాయం వచ్చింది.వాస్తవంగా ప్రభుత్వం విధించిన గడువు గత ఏడాది అక్టోబరు 30తో ముగియగా నవంబరు 30వరకు గడువు పెంచు తూ మరో ఉత్తర్వులు జారీ చేశారు. గడువు పెంచడం తప్ప ఇంతవరకు దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇటీవల ఈ గడువును ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పెంచినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కొత్త జీవో ప్రకారం దరఖాస్తుదారుడు తొలుత రూ.10వేలు మీసేవ కేంద్రంలో అపరాధ రుసుం చెల్లించి మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. అక్రమ నిర్మాణాలకు అడ్డా ఆమదాలవలస మున్సిపాలిటీలోని 23వార్డులలో సుమారు 12వేల గృహాలు ఉన్నాయి. ఇందులో 1985కు ముందు నిర్మించిన ఇళ్లకు మున్సిపాలిటీ నుంచి అనుమతులు అవసరం లేదు. ఆ తరువాత నిర్మించిన భవనాలకు 199లో బీఆర్ఎస్(బిల్డింగ్ రెగ్యూలైజేషన్ స్కీం) కింద, 2007లో బీపీఎస్ స్కీం కింద అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మళ్లీ 2016–17లో బీపీఎస్ స్కీం కింద తమ గృహాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరుతు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలో సుమారు 1000కు పైగా అక్రమ నిర్మాణాలు(అనుమతులు) లేని గృహాలు ఉన్నాయని అధికారిక సమాచారం. అందులో ప్రస్తుతం 101 మంది నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వారిలో కొంతమంది యజమానులకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని, కొంతమందికి మున్సిపల్ అధికారుల అండదండలు ఉన్నాయని, అందుకే వారు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది భవన యజమానులు మున్సిపల్ పాలకులకు, అధికారులకు మామ్మూళ్లు ఇస్తూ మేనేజ్ చేసుకుంటున్నట్లు బహిరంగ ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారులు పాలకులు స్పందించి మున్సిపల్ ఆదాయాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
మరణిస్తే.. శవం ఇంటికి తేవద్దంటున్న ఓనర్
అంపశయ్యపై భర్త.. ఎప్పుడు మృతి చెందుతాడో తెలియని పరిస్థితి. మరోవైపు భర్త చనిపోతే మృతదేహాన్ని ఇంటికి తీసుకు రావద్దంటూ అద్దెకు ఉంటున్న ఇంటి యజమానితో పాటు, సమీపంలో ఉన్న వారు ఆదేశాలు. శవాన్ని ఎక్కడకు తీసుకెళ్లాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ భార్యకు మరో పిడుగులాంటి వార్త.. తమ బ్యాంకులో మీ భర్త చేసిన మోసాలకు మీరే బాధ్యత వహించాలని, మరణించిన తర్వాత వచ్చే ఇన్సూ్యరెన్స్ చెల్లిస్తానని హామీ పత్రం రాయాలని బ్యాంకు అధికారుల బెదిరింపులు. లేకుంటే కేసు పెడతామని, పోలీసులు తీసుకెళ్తారని భయభ్రాంతులకు గురి చేసే మాటలు. దీంతో ఎటూ పాలుపోని బాధితురాలు ఉబికి వస్తున్న కన్నీటితో ఆస్పత్రి బయట కుప్పకూలి రెండు రోజులుగా అలాగే ఉండిపోయిన హృదయ విదారక ఘటన మంగళవారం వెలుగు చూసింది. ‘సాక్షి’ సేకరించిన వివరాల ప్రకారం.. లబ్బీపేట (విజయవాడ తూర్పు): కంకిపాడు మండలం ఉప్పులూరులో నివశించే మర్రివాడ వెంకయ్య స్థానికంగా ఉన్న బ్యాంకులో బంగారు రుణాలకు అప్రైజర్గా పని చేసేవాడు. మద్యానికి బానిసైన వెంకయ్య నిత్యం తాగుతూ ఉండేవాడు. ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో భార్య అనంతలక్ష్మి చికిత్స నిమిత్తం తొలుత ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ప్రభుత్వాస్పత్రిలో చేర్చింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న వెంకయ్య అక్యుట్ మెడికేర్ వార్డు (ఏఎంసీ) లో చికిత్స పొందుతున్నాడు. కోలుకోవడం కష్టమని, మూడు నాలుగు రోజులకన్నా ఎక్కువ బతకడని వైద్యులు తేల్చి చెప్పారు. శవం ఇంటికి తేవద్దంటూ.. ఉప్పులూరులోని ఓ ఇంట్లో వెంకయ్య అద్దెకు ఉంటున్నాడు. కాగా అంపశయ్యపై ఉన్న విషయాన్ని తెలుసుకున్న యజమాని మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకు రావద్దంటూ హుకుం జారీ చేశాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో భార్య అనంతలక్ష్మి ఉండిపోయింది. రెండో తరగతి చదువుతున్న తమ కుమార్తెను ఆడబిడ్డ ఇంటికి పంపి ఆస్పత్రిలో ఒంటరిగానే ఉంటోంది. గుండెను పిండేసే పిడుగులాంటి వార్త.. అంపశయ్యపై ఉన్న భర్త, మృతి చెందితే ఎక్కడకు తీసుకెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న అనంతలక్ష్మికి గుండెను పిండేసే పిడుగులాంటి వార్త మరొకటి తెలిసింది. తమ భర్త అప్రైజర్గా ఉన్న బ్యాంకు మేనేజర్ మరో ఇద్దరితో కలిసి ఆస్పత్రికి వచ్చి, మీ భర్త బ్యాంకును మోసం చేశాడని, అందుకు నీవే బాధ్యత వహించాలని చెప్పాడు. అంతేకాదు భర్త మృతి చెందిన తర్వాత వచ్చే ఇన్యూరెన్స్ డబ్బులు చెల్లిస్తానని హామీ పత్రం రాయాలని వత్తిడి చేశాడు. లేకుంటే కేసు పెడతామని, మిమ్మల్ని పోలీసు తీసుకెళ్తారంటూ బెదిరింపు ధోరణిలో వ్యవహరించడంతో ఏం చేయాలో తెలియక రెండు రోజులు కన్నీరు మున్నీరులా విలపిస్తూ ఉండిపోయింది. ఆమెను సమీప బెడ్ల వారు ఓదారుస్తూ ఉన్నారు. నేనేం పాపం చేశాను.. ‘నా భర్త మోసం చేశాడని చెపుతున్నారు. నాకే పాపం తెలియదు. ఆయన చేసిన తప్పులకు నేను బాధ్యత వహించాలంటున్నారు. నా పేరు మీద కూడా రూ.లక్ష రుణం తీసుకున్నట్లు చెపుతున్నారు. వాటన్నింటినీ భర్త మృతి చెందితే వచ్చే ఇన్సూ్యరెన్స్ డబ్బులతో చెల్లించాలని వత్తిడి చేస్తున్నారు. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. సొంతిల్లు కూడా లేదు.. ఏడేళ్ల కూతురు ఉంది. మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఆయన ఇక బతకరని వైద్యులు చెప్పేశారు. శవాన్ని ఎక్కడకు తీసుకెళ్లాలో తెలియడం లేదు. మరోవైపు కేసు పెడతాం. నిన్ను తీసుకెళ్తారు.. అంటున్నారు.’ అని కన్నీటిపర్యంతమవుతూ తెలిపింది. -
మంటకలిసిన మానవత్వం.. అనారోగ్యంతో ఉన్నాడని..
సభ్య సమాజం తలదించుకునేలా.. మానవత్వం మంట కలిసిందా అని ప్రశ్నించేలా ఓ విషాద ఘటన తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలో చోటుచేసుకుంది. సిరిసిల్ల నెహ్రూనగర్లోని అద్దె ఇంట్లో నివాసముంటున్న సిరిపురం వెంకటమల్లు(70)ను అనారోగ్యంతో ఉన్నాడనే కారణంతో చనిపోతే ఇల్లు శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని కనుకుంట్ల మల్లయ్య ఆసుపత్రి నుంచి ఇంట్లోకి రావడానికి అనుమతించలేదు. ఇంటిముందు ఉంచేందుకు సైతం ఒప్పుకోలేదు. దాంతో గత్యంతరం లేక వెంకటమల్లు కుటుంబసభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా ఇందిరమ్మకాలనీ ఊరు చివరకు తరలించారు. అక్కడే కప్పుకునే బట్టలతో గుడిసె లాంటిది ఏర్పాటు చేసుకొని వారం రోజులుగా చలిలోనే వెల్లదీస్తున్నారు. గురువారం వెంకటమల్లు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచాడు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): సిరిపురం వెంకటమల్లు ఎన్నో ఏళ్లుగా మరమగ్గాల కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సంవత్సర కాలంగా అనారోగ్యంగా ఉండటంతో పని చేయడం లేదు. తరచూ సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడు. సిరిసిల్ల నెహ్రూనగర్లో కనుకుంట్ల మల్లయ్య ఇంట్లో రూ.వెయ్యికి గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వారం రోజుల పక్షం రోజుల క్రితం వెంకటమల్లు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు ఇంటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయగా.. ఇంటి యజమాని మల్లయ్య ఇంట్లోకి తీసుకురావడానికి అనుమతించలేదు. ఎంత ప్రధేయపడినా ఒప్పుకోలేదు. దాంతో దిక్కుతోచని స్థితిలో ఆటోలో కార్మిక క్షేత్రం ఇందిరమ్మకాలనీ ఊరి చివరికి తీసుకొచ్చారు. ఊరి చివరన దుస్తులతో గుడిసె లాంటి నిర్మాణం ఏర్పాటు చేసుకొని చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ వెల్లదీస్తున్న క్రమంలో గురువారం ఉదయం 9 గంటలకు వెంకటమల్లు మరణించాడు. మృతుడికి భార్య స్వరూప, ఇద్దరు కూతుళ్లు మమత, రమ్య, కొడుకు మధన్ ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల వివాహం జరగగా.. కొడుకు మధన్ ఐటీఐ చదువుతున్నాడు. గూడు లేని పక్షుల వలే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మనసున్న చాలామందిని కంటతడి పెట్టించింది ఈ ఘటన. మనుషుల్లో మానవత్వం ఉందా లేక చచ్చిపోయిందా అని మనకి మనమే ప్రశ్నించుకునే పరిస్థితిని కల్పించింది ఈ సంఘటన. వెంకటమల్లు కుటుంబానికి ప్రభుత్వం తరఫున చేయూతనందించాలని, ఉండడానికి గూడు కల్పించాలని ఇందిరమ్మకాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కౌన్సిలర్ ఔదార్యం సిరిసిల్లటౌన్: కార్మిక క్షేత్రం సిరిసిల్లకు చెందిన సిరిపురం వెంకటమల్లు(65) అనే నేత కార్మికుడు గురువారం అనారోగ్యంతో చనిపోయాడు. పట్టణంలోని నెహ్రూనగర్కు చెందిన వెంకటమల్లు చాలా రోజులుగా స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గురువారం ఉదయం అనారోగ్యంతో చనిపోగా.. సొంతిల్లు లేక అతడి శవాన్ని యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో మృతదేహాన్ని తంగళ్లపల్లిలోని ఇందిరానగర్కు తరలించారు. కుటుంబసభ్యుల వద్ద అంత్యక్రియలు జరపడానికి డబ్బులు లేకపోవడంతో.. 15వ వార్డు కౌన్సిలర్ అన్నారం లావణ్యశ్రీనివాస్ రూ.5వేలు ఆర్థిక సాయం అందించారు. -
కిరాయిదారులపై కన్నేయనందుకు... యజమానికి జైలు..!
సాక్షి, సిటీబ్యూరో: 2007 ఆగస్టు... హబ్సిగూడలోని బంజారా నిలయంలో మకాం వేసిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు గోకుల్చాట్, లుంబినీపార్క్ల్లో పేలుళ్లకు పాల్పడి ఉడాయించారు. 2013 ఫిబ్రవరి... మరోసారి సిటీని టార్గెట్ చేసిన ఐఎం టెర్రరిస్టులు అబ్దుల్లాపూర్మెట్లోని అద్దె ఇంట్లో షెల్టర్ తీసుకున్నారు. అదును చూసుకుని దిల్సుఖ్నగర్లో బాంబులు పేల్చారు. 2013 డిసెంబర్... ముంబైకి చెందిన మోడల్ను ఈవెంట్ పేరుతో సిటీకి రప్పించిన కొందరు దుండగులు నిజాంపేటలోని అద్దె ఇంటికి తీసుకెళ్లి బంధించారు. ఆపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ మూడు సందర్భాల్లోనూ పోలీసులు టెనెంట్స్ (ఆయా ఇళ్లల్లో అద్దెకు ఉన్న వారు) వివరాలు సేకరించేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. కేవలం ఇవే కాదు... అద్దెకు దిగిన ముష్కరులు చేసిన నేరాలు, ఘాతుకాలకు సిటీలో కొదవే లేదు. దీంతో టెనెంట్స్ వాచ్ పక్కాగా అమలు చేయాలని, కిరాయిదారుల పూర్తి వివరాలు సేకరించడంతో పాటు పోలీసులకూ సమాచారం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఇప్పటికీ దీనిపై స్పష్టమైన విధానం అమలులోకి రాలేదు. దేశ రాజధానిలోనూ.. దేశ రాజధాని ఢిల్లీకి వలసల బెడద ఎక్కువ. ఉద్యోగం, చదువు, వైద్యం తదితర అవసరాల నిమిత్తం నిత్యం వేలాదిమంది అక్కడికి వెళ్తుంటారు. వీరంతా ఎక్కువగా అద్దె ఇళ్లల్లోనే నివసిస్తుంటారు. దీనిని అసాంఘిక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఉద్యోగాల ముసుగులో అద్దె ఇళ్లల్లో తిష్టవేసిన ముష్కరులు పేలుళ్లకు పాల్పడటం నుంచి ఇంటి యజమానులనే దోచుకోవడం, హత్యలు వంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఆయా సందర్బాల్లో పోలీసులు నిందితుల ఆచూకీ కనిపెట్టేందుకు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వస్తోంది. అద్దెకు దిగి, నేరాలు చేసిన వారి వివరాలు యజమానుల వద్ద లేకపోవడంతో ఇప్పటికీ అనేక కేసులు కొలిక్కిరాలేదు. ఢిల్లీ పోలీసు సీరియస్.. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కొన్నేళ్ల క్రితమే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇళ్లను అద్దెకు ఇచ్చే యజమానులు కచ్చితంగా కిరాయిదారులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి, వాటిని స్థానిక పోలీసుస్టేషన్లో అందించాలని, పోలీసుల ద్దారా అద్దెకున్న వారిని వెరిఫై చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విచారణ నామమాత్రంగా కాకుండా అదనపు పోలీసు కమిషనర్ స్థాయి అధికారిచే చేయించాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇళ్ల యజమానులు వీటిని పక్కాగా అమలు చేస్తున్నారా? లేదా? అనేది సరిచూసే బాధ్యతను బీట్ కానిస్టేబుళ్లకు అప్పగించారు. నిత్యం గస్తీ నిర్వహించే వీరు ఎవరైనా ఇంటి యజమానులు ఈ ఉత్తర్వులను ఉల్లంఘించారా? అనే అంశాన్ని పక్కాగా పరిశీలిస్తుంటారు. అడ్డంగా బుక్కైన నిరంజన్... తూర్పు ఢిల్లీలోని పాండవ్నగర్కు చెందిన నిరంజన్ మిశ్రా తన ఇంటిని నాలుగేళ్ల క్రితం కొందరికి అద్దెకు ఇచ్చారు. అప్పటి నుంచి వారి వివరాలు సేకరించడం, స్థానిక పోలీసుస్టేషన్లో అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. నెల రోజుల క్రితం పెట్రోలింగ్ విధుల్లో ఉన్న హెడ్–కానిస్టేబుల్ రాజ్కుమార్ దీనిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిరంజన్పై ఐపీసీలోని సెక్షన్ 188 (ప్రభుత్వ అధికారి ఆదేశాలను బేఖాతరు చేయడం) సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గత గురువారం నిరంజన్ను దోషిగా తేలుస్తూ నెల రోజుల జైలు శిక్ష విధించారు. ఈ నేపథ్యంలోనే నిరంజన్ చర్య క్షమించరానిదని వ్యాఖ్యానించారు. ఇకపై ప్రతి యజమాని కిరాయిదార్ల వివరాలు సేకరించడం తప్పనిసరని స్పష్టం చేశారు. నగరంలో అమలుకు దూరమే... సిటీలోనూ ఈ విధానం అమలు చేయాలని 2007 నుంచి పోలీసులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. నేరాల కోసం వస్తున్న ముష్కరులకు షెల్టర్ దొరక్కుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అమలులోకి రాలేదు. ఒకప్పుడు ప్రత్యేకంగా ‘టెనెంట్స్ వాచ్ ఫామ్’ దరఖాస్తులను రూపొందించి ఠాణాల వారీగా అందుబాటులో ఉంచేవారు. అప్పట్లో ఇంటి యజమానులు పోలీస్టేషన్కు వెళ్ళి వీటిని అందించాల్సి వచ్చేది. దీంతో అనేక మంది ఆసక్తి చూపడం లేదని భావించి పోలీసు అధికారిక యాప్ ‘హాక్ ఐ’లో లింకు ఇచ్చినా ఫలితం లేదు. ‘ఢిల్లీ తీర్పు’తో అయినా పోలీసులు తమ విధానాలు మార్చుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. టెనెంట్స్ వెరిఫికేషన్ విధానం కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే ప్రజా భద్రతా చట్టంలో సవరణలు చేసి ఈ అంశాన్ని చేర్చాలని కోరుతున్నారు. -
మంటగలిసిన మానవత్వం
నకిరేకల్ : మానవత్వం మంటగలిసింది. శాస్త్ర, సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా ప్రజల్లో మూఢత్వం మాత్రం పోవడం లేదు. అద్దె ఇంట్లో ఉంటున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చనిపోవడంతో అద్దె ఇంటి వారు మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లమనడంతో కాలనీలోని రోడ్డుపైనే చెట్టుకింద ఉంచి శుక్రవారం దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. వివరాలు.. తిప్పర్తికి చెందిన పిశిక వెంకన్న (47) నకిరేకల్లో అద్దె ఇంట్లో నివా సం ఉంటున్నాడు. వెంకన్న ప్రస్తుతం తిప్పర్తి మండలం అల్లిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. వెంకన్నకు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె వికలాంగురాలు. భార్య లక్ష్మి ఇంటి వద్ద కుట్టు మిషన్ కుడుతూ కుటుంబం జీవనం సాగి స్తుంది. వెంకన్న పదేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడడంతో ఆర్థికంగా చితికిపోయాడు. అతనికి వ స్తున్న వేతనం కూడా చేసిన అప్పులకు సరిపోవడం లేదు. అనారోగ్యంతోనే కన్నుమూశాడు. అద్దె ఇంట్లో ఉండడంతో అద్దె ఇంటి వారు మృతదేహాన్ని తీసుకెళ్లాలని తెలిపారు. దీంతో కుటుం బీకులు కాలనీలోని రోడ్డు పక్కన ఉన్న చెట్టు కింద మృతదేహాన్ని ఉంచారు. నడివీధిలో భార్య, పిల్లలు దీనంగా రోదిస్తుండడంతో స్నేహితులు వెంకన్న కుటుంబానికి రూ.10వేల సాయం చేశారు. దీంతో చెట్టుకింద ఉంచే కార్యక్రమాలు నిర్వహిం చి ఊరు శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. తదనంతరం స్థానిక పద్మశాలీ సంఘం ప్రతి నిధులు వెంకన్న కుటుంబీకులను అంత్యక్రియలు పూర్తయ్యేవరకు తమ పద్మశాలీ భవనంలో కార్యక్రమాలు చేసుకునే విధంగా కుటుంబీకులకు వసతి కల్పిస్తామని తెలిపారు. వారు అక్కడికే 10 రోజుల పాటు ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. -
మూగజీవిపై ఇంటి యజమాని ప్రతాపం
సాక్షి, విశాఖపట్నం ,గాజువాక: అత్తపై కోపాన్ని దుత్తపై చూపించాడన్న సామెతను నిజం చేశాడో ప్రబుద్ధుడు. తన ఇంట్లో అద్దెకున్న వారిని ఏమీ చేయలేక వారు పెంచుకొంటున్న కుక్కపై తన ప్రతాపం చూపించాడు. అద్దెకున్న వారు ఇంట్లోలేని సమయంలో ఒక పెద్ద కర్ర తీసుకొని వారి కుక్కను చావబాదాడు. ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు సంబంధిత వ్యక్తిపై గాజువాక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారు. వివరాల్లోకెళ్తే... ఫ్లోరా కలీం అనే మహిళ తమ కుటుంబంతో కలిసి స్థానిక చినగంట్యాడ ఈ – సేవా కేంద్రం సమీపంలోని బి.రవిబాబు ఇంట్లో అద్దెకు నివాసముంటున్నారు. యజమాని అనుమతితో ఒక కుక్కపిల్ల (చార్లెస్ రూబీ)ను కూడా తీసుకొచ్చి పెంచుకొంటున్నారు. ఏడాది కాలంగా ఇంటి యజమానికి, ఆమెకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. అగ్రిమెంట్ అమల్లో ఉండగానే ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని ఒత్తిడి చేయడంతో ఫ్లోరా నిరాకరించారు. తనకున్న ఇబ్బందులను వివరించి కొద్దికాలంపాటు ఇల్లు ఖాళీ చేయలేనని తెలిపారు. ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం నడుస్తుండగానే ఈ నెల 23న సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తమ చర్చి ఫాదర్ మెమోరియల్ ప్రేయర్కు కుటుంబంతో సహా ఆమె వెళ్లిపోయారు. ఆ సమయంలో కుక్కను బాల్కనీలో కట్టారు. రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి వచ్చిన వారికి కుక్క శబ్ధం చేయకపోవడంతో ఏదో అనుమానం శంకించింది. తీరా బాల్కనీలో చూస్తే కుక్క అపస్మారక స్థితిలో పడి ఉంది. దాన్ని కదిపి చూసేసరికి నోటి నుంచి నురగలు కక్కడం, ఒక్కసారిగా రక్తంతో కూడిన వాంతి చేసుకోవడంతో ఆందోళన చెందారు. అనంతరం తేరుకొని కుక్కకు వైద్యం చేయించారు. ఈ విషయంపై జంతు సంరక్షణ సొసైటీ ప్రతినిధులతో కలిసి గాజువాక పోలీసులకు 25వ తేదీ న ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు పోలీసుల పరిశీలనలో ఉంది. -
మంటగలిసిన మానవత్వం
కాచిగూడ: గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురాకుండా ఇంటి యజమాని అడ్డుకున్న సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వి.నాగేశ్వరరావు (66) తిలక్నగర్ శివాలయం సమీపంలోని ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి బుధవారం రాత్రి గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు అతడిని కేర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. నాగేశ్వర్రావు మృతిపై ఇంటి యజమానులకు సమాచారం అందించగా మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని వారు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రినుంచే నేరుగా స్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులను ఇంటి యజమానులు మల్లమ్మ, మంజులు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవడమేగాక, ఇంటికి తాళంవేసి బయటకు గెంటేశారు. దీంతో మృతుడు నాగేశ్వర్రావు భార్య, కుమారుడు, కుమార్తె, వర్షంలో తడుస్తూ బయటే కూర్చోవాల్సి వచ్చింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి యజమానిని మందలించి వారిని ఇంట్లోకి పంపించారు. అయినా వారు ఇంట్లోకి నలుగురిని మాత్రమే అనుమతించి షరతులు విధించడం గమనార్హం. ఇంట్లో ఎలాంటి కర్మకాండలు చేయరాదని ముందే హెచ్చరికలు జారీ చేశారు. -
కువైట్లో భారత మహిళపై దాడి
కువైట్ : ఓ ఇంటి యాజమాని తన ఇంట్లో పని చేస్తున్న భారత మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ తలకు, చేతులకు గాయాలయ్యాయి. అయితే యాజమాని సోదరే బాధిత మహిళను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న ఆ మహిళ కువైట్లోనే పనిచేస్తోన్న తన సోదరుడితో కలిసి దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తనపై జరిగిన దాడికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ను కూడా ఫిర్యాదుతో పాటు అందజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందింతుడి కోసం గాలిస్తున్నారు. -
గొంతులు కోసి.. మహిళల దారుణహత్య..
సాక్షి, బెంగళూరు: ఉద్యాన నగరిలో హంతకులు చెలరేగిపోయారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని గొంతుకలు కోసి రక్తపుటేరులు పారించారు. బ్యాటరాయనపుర, సుద్దగుంటేపాళ్య పోలీస్స్టేషన్ల పరిధిలో ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. బ్యాటరాయనపుర పరిధిలోని కస్తూరిబానగర 5 వక్రాస్ 6 వ మెయిన్రోడ్డులో శివరామ్, కవితా(26) దంపతులు నివాసం ఉంటున్నారు. శివరామ్ నాయండహళ్లి ప్లైవుడ్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతను గురువారం ఉదయం దుకాణం విదులకు వెళ్లగా 9 గంటల సమయంలో కవితా తన ఇద్దరు పిల్లలైన లిఖిత్, హర్షిత్ లను పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి చేరుకుంది. ఈ సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు చాకుతో గొంతుకోసి ఆమెను హత్యచేశారు. బీరువాలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. 9.50 సమయంలో కవిత తండ్రి ఇంటికి రాగా ఈ ఉదంతం వెలుగు చూసింది. బ్యాటరాయనపుర పోలీసులు డాగ్స్క్వాడ్, వేలిముద్రనిపుణులతో చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. అదనపు పోలీస్కమిషనర్ బీకే.సింగ్, డీసీపీ అనుచేత్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇంటిని ఖాళీ చేయనందుకు మహిళ గొంతుకోసిన యజమాని ఇంటిని ఖాళీ చేయలేదని అద్దెకు ఉంటున్న మహిళను గొంతుకోసి హత్యచేసిన యజమాని ఉదంతం సుద్దగుంటెపాళ్య పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కమలమ్మ అనే మహిళ ప్రైవేటు కంపెనీలో స్వీపర్గా పనిచేస్తోంది. సుద్దగుంటెపాళ్య గుండుతోపులో జగదీశ్ అనే వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకొని తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటుంది. ఇంటి లీజు అవధి ముగియడంతో ఖాళీ చేయాలని యజమాని జగదీశ్ సూచించాడు. అయితే అడ్వాన్స్ వెనక్కి ఇవ్వాలని, అంతవరకు ఖాళీ చేసే ప్రసక్తే లేదని కమలమ్మ స్పష్టం చేసింది. ఈక్రమంలో జగదీశ్ స్నేహితులైన సంతోష్, కేశవ్తో కలిసి బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో కమలమ్మ ఇంటికి వెళ్లారు. ఇంట్లోనుంచి ఇద్దరు పిల్లలను బయటికి పంపించి కమలమ్మతో గొడవపడ్డారు. ఓ దశలో జగదీశ్, మిగతా ఇద్దరూ కలిసి కమలమ్మ గొంతు కోసి ఉడాయించారు. రక్తపుమడుగులో పడి ఉన్న తల్లిని పిల్లలు ఇరుగుపొరుగు వారి సాయంతో బౌరింగ్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. సుద్దగుంటెపాళ్య పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి సంతోష్, కేశవ్ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న జగదీశ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
పసి మొగ్గపై పైశాచికం
అభంశుభం తెలియని 17ఏళ్ల మూగ, చెవుడు యువతిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన సంఘటన విజయవాడలోని భవానీపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 55ఏళ్ల సాంబశివరావు అనే వ్యక్తి చిన్నారిపై నెల రోజులుగా ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాడని తల్లి సోమవారం భవానీపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భవానీపురం (విజయవాడ పశ్చిమ): మూగ, చెవుడు, ఆపై మతిస్థిమితంలేని బాలికపై ఒక వ్యక్తి నెల రోజులుగా లైంగికదాడి చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి తల్లి భవానీపురం పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు.. గొల్లపూడి సారాయి కొట్టు సెంటర్లో ఓ మహిళ నివసిస్తోంది. భర్తతో పదేళ్ల కిందట విడిపోయిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తెకు వివాహం చేసింది. ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ మతిస్థిమితంలేని చిన్నకుమార్తె(17)తో కలిసి జీవిస్తోంది. గన్నవరం మండలం జక్కులనెక్కలం గ్రామానికి చెందిన వీర్ల సాంబశివరావు(55) కుమార్తె గొల్లపూడిలో నివసిస్తోంది. ఆమె ఇంటిలోనే బాలికతల్లి అద్దెకు ఉంటూ, ఆ ఇంట్లోనే పాచిపనులు చేస్తోంది. తన కుమార్తె ఇల్లు నిర్మిస్తుండటంతో సాంబశివరావు నాలుగురోజులు ఇక్కడుంటే మూడు రోజులు స్వగ్రామం వెళ్లొస్తున్నాడు. సాంబశివరావు నెల రోజులుగా తల్లి ఇంట్లో లేని సమయంలో మతిస్థిమితంలేని బాలికపై లైంగికదాడి చేస్తున్నాడు. బాలిక సైగలద్వారా తల్లికి విషయం చెప్పడంతో ఆమె సాంబశివరావును నిలదీ సింది. తమపైనే ఆరోపణలు చేస్తావా అంటూ వారిని బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదుచేసి బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
అద్దె ఇల్లు... బతికినంత వరకే...
తల్లీదండ్రీ లేరు. ఉన్న ఒక్కగానొక్క అన్న రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఆస్పత్రి మార్చురీలో శవం. అద్దె ఇంటికి మృతదేహాన్ని తేవద్దని ఇంటి యజమాని షరతు. ఏం చేయాలో తెలియని అయోమయస్థితిలో చెల్లెలు బోరున విలపించింది. మంగళవారం తిరుపతిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సరిగ్గా రెండు వారాల కిందట నగరంలో పేరున్న ఓ జర్నలిస్టు భార్య అనారోగ్యంతో అకస్మాత్తుగా కన్నుమూసింది. అద్దె ఇంట్లోకి వద్దని ఆ ఇంటి యజమాని పట్టుబట్టారు. చేసేది లేక బయటే అంత్యక్రియలు జరిపారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : పైన చెప్పినవి ఏ ఒక్కరి సమస్యో కాదు. నగరంలో అద్దెకుండే కుటుంబాలందరిదీ. బతికున్నంత వరకూ ఆప్యాయంగా కబుర్లు చెప్పే ఇళ్ల యజమానులు ప్రాణం పోయాక శవాలను దూరం పెడుతున్నారు. ఈ దురాచార సంస్కృతి తిరుపతిలో మళ్లీ వేళ్లూనుకుంటోంది. రాను రాను మంచితనం, మానవత్వం మాయమవుతున్నాయి. అద్దె ఇళ్లలో 80 వేల కుటుంబాలు... శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి నగరంలో లక్షా పది వేలకు పైగా ఇళ్లున్నాయి. ఇందులో 80 వేలకు పైగా కుటుంబాలు అద్దెకుంటున్నాయి. పిల్లల చదువుల కోసమనో, వ్యాపారాల కోసమనో పల్లెల నుంచి నగరానికి వచ్చి స్థిరపడ్డ వారే ఎక్కువ. కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, తమళనాడు, బెంగళూర్ ప్రాంతాల నుంచి వచ్చి అద్దె ఇళ్లల్లో ఉండే పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. చనిపోతే శవం బయటే... అద్దెకుండే కుటుంబాల్లో కొంత మంది ఇంట్లోనే అనా రోగ్యంతో చనిపోతారు. మరికొంత మంది బయట రోడ్డు ప్రమాదాల్లో కన్ను మూస్తారు. ఇంకొంత మంది చికిత్స పొందుతూ ఆస్పత్రుల్లో చనిపోతుంటారు. ప్రాణం ఎక్కడ పోయినా పలువురు ఇళ్ల యజమానులు మాత్రం శవాన్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. బయటి వ్యక్తుల ప్రాణం ఇంట్లో పోతే అరిష్టమని, ఇల్లు మూసేయాల్సి ఉంటుందన్న మూఢ నమ్మకాలను పెంచుకుంటున్నారు. బాగా చదువుకున్న వారు సైతం నాగరికతను మర్చిపోయి పాత తరం మనుషుల్లా ఆలోచిస్తున్నారు. మనిషి దూరమైన బాధతో కన్నీరు మున్నీరయ్యే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం మరిచి మృతదేహాలను బయటే ఉంచాలని నిర్దయగా చెప్పడం ఎంత వరకూ న్యాయమో ఆలోచించడం లేదు. ఈ విషయంలో మార్పు రావాల్సి ఉంది. చట్టాన్ని అతిక్రమించడమే... ఇంటి యజమాని ప్రతి నెలా అద్దె వసూలు చేసుకుంటారు. అద్దెకుండే ఇంట్లో శుభ కార్యక్రమాలు, విందులు, వినోదాలుంటే తానూ పాల్గొంటాడు. అదే మనిషి కన్నుమూస్తే మాత్రం అటు వైపు చూడరు సరికదా...ఒక్కసారిగా భయం, సెంటిమెంట్ గుర్తొస్తుంది. ఇంట్లోకి మృతదేహం వద్దని చెప్పడమే కాకుండా వెంటనే ఇల్లు ఖాళీ చేయమని చెప్పే ఘనులూ ఉన్నారు. అయితే చట్టం దీన్ని ఒప్పుకోదు. జీవించడానికి ఎలాంటి స్వేచ్ఛను కల్పించారో, చనిపోయాక కూడా అదే స్వేచ్ఛను కల్పించాలని ఏపీ బిల్డింగ్ రెంట్ ఎవిక్షన్ కంట్రోల్ యాక్టు 1960 చెబుతోంది. ప్రతి నెలా అద్దె చెల్లిస్తున్న నేపథ్యంలో ఇంటి యజమానులు ఎలాంటి హక్కుల్ని కలిగి ఉంటారో, స్వేచ్ఛాయుత జీవనానికి సరిపడ హక్కుల్ని అద్దెదారులూ కలిగి ఉంటారన్నది విస్మరిస్తున్నారు. ఇది చాలా అమానుషం ... అద్దె ఇళ్ల యజమానులు అమానుషంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. తిరుపతిలో ఈ తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది యజమానులు సామాజిక బా ధ్యతను మర్చిపోతున్నారు. మానవీయ దృక్ఫథాన్ని మర్చిపోతున్నారు. మనుషుల్లో మార్పు రావాలి. గంగవరపు శ్రీదేవి, రచయిత్రి మనుషులు మారాలి... అద్దె ఇళ్లలో ఉండే వారు చనిపోతే ఇంటి యజమానులు శవాన్ని నిరాకరించడం దారుణం. బంధువు చనిపోయి బాధల్లో ఉన్నవారికి మరింత క్షోభను మిగిల్చే అంశమిది. మానవీయ దృక్పథంతో మనుషులు మారాలి. మంచితనాన్ని పది మందికీ పంచాలి. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మేధావులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలి. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి డైరెక్టర్, తిరుపతి -
మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని ఓనర్
-
‘ఆ కథ మాత్రం మనసులోంచి పోలేదు’
తమిళ దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్ తన కొత్త సినిమాకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై దర్శకురాలు మాట్లాడుతూ.. ముంబాయి వెళ్లినప్పుడు హిందీ చిత్రాన్ని చూశానని ఆ చిత్రం తన మనసులోంచి పోలేదని ఆమె చెప్పారు. అమ్మణి చిత్రం తరువాత తన తాజా చిత్రానికి గత ఏడాది తమిళ జనజీవనాన్ని అతలాకుతలం చేసిన తుపాన్ నేపథ్యంలో ఒక చిత్రం చేయాలని భావించానని అన్నారు. ఆ చిత్ర నిర్మాతను కలిసి హక్కుల కోసం చర్చించినా, అది సెట్ కాలేదన్నారు. అయితే ఆ కథ మాత్రం తన మనసులోంచి పోలేదన్నారు. దీంతో ఆ సినిమా స్ఫూర్తితో తానే ఒక కథను రెడీ చేసుకున్నానని చెప్పారు. ఒక యువ దంపతుల సొంత ఇల్లు కల ఇతివృత్తంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి హౌస్ ఓనర్ అనే టైటిల్ను నిర్ణయించిట్లు ఆమె తెలిపారు. ఏమిటి అసలు విషయం ఏమిటో చెప్పకుండా హౌస్ ఓనర్ అంటున్నారు అని అనుకుంటున్నారా ? ప్రస్తుతం సమాజంలో మధ్య తరగతి కుంటుంబానికి చెందిన చాలామందికి సొంత ఇల్లు కలే. అలాంటి ఒక యువ దంపతుల డ్రీమే హౌస్ ఓనర్. ఈ సినిమా షూటింగ్ను త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు లక్ష్మీరామకృష్ణన్ చెప్పారు. ఈ చిత్రంలో అశోక్ సెల్వన్ హీరోగా, హీరోయిన్ గా ఐశ్వర్య రాజేశ్ నటించనున్నారు. -
ఇల్లు ఖాళీ చేయమంటే సెబాస్టియన్ బెదిరింపులు
-
బెడ్ రూంలో స్పై కెమెరాలు
-
మైనర్ బాలికకు ఇంట్లో పని ఇప్పిస్తానని చెప్పి
-
మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని యజమాని
-
సికింద్రాబాద్లో కిలాడీజంట
-
కాశీబుగ్గలో ఇంటి ఓనర్ అమానుషం
-
అద్దె ఇంట్లో మరణిస్తే... చావే!
మృతదేహాలను అనుమతించని ఇళ్ల యజమానులు అద్దెవాసులకు అవస్థలు యజమానితో సమానంగా హక్కు ఉందంటున్న చట్టం గ్రామాల్లో, పట్టణాల్లో.. ఎక్కడైనా నేడు అద్దెకు ఉండేవారికి చచ్చినా.. చావే. అద్దెకు ఉండేవారి కుటుంబాల్లో ఎవరైనా మృతిచెందితే ఆ మృతదేహాన్ని ఇంటి ఆవరణలోకి కూడా ఇంటి యజమాని రానివ్వడం లేదు. ఇక కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే.. వెంటనే ఖాళీ చేయాలని ఆదేశిస్తున్నారు. అద్దె ఇంట్లో ఉండేవారికి ఇది జీవితంలో ఒకసారైనా ఎదురయ్యే అనుభవం. ఇలా అమానుషంగా ప్రవర్తించేవారిలో బాగా చదువుకున్నవారే అధికమనే వాదన వినిపిస్తోంది. తిరుపతి : ప్రపంచం శాస్త్రరంగంలో ప్రగతి సాధిస్తోంది. నగరాలు, పట్టణాల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతోంది. 30 శాతం మందికి పైగా పట్టణాల్లో నివాసముంటున్నారు. చాలామంది ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కుంటూ పట్టణాల బాట పడుతున్నారు. ఈ క్రమంలో వారు అద్దె ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి నెల కొంది. అయితే అద్దె ఇళ్లలో నివసిస్తూ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే బతికున్నవాళ్లు నరకయాతన పడాల్సి వస్తోంది. ఇంట్లో మృతదేహాన్ని పెట్టేందుకు యజమానులు ఒప్పుకోవడం లేదు. అదే సమయంలో మృతదేహాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే అందరూ శవంతో బేరాలు ఆడతారు. అంబులెన్స్ దగ్గర నుంచి శ్మశానం చేరే వరకు అమ్మో శవమా... అంటారు. భారీ గా డబ్బులు డిమాండ్ చేస్తారు. పవిత్ర కార్యాన్ని ఎలా చేయాలో దిక్కుతోచని స్థితిలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఇది మానవత్వానికి చెందిన పెద్ద సమస్య. ఇటీవల కొన్నిచోట్ల ఎదురైన సంఘటనలు.. తిరుచానూరులో నివాసముంటున్న ఓ వ్యక్తి విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని భార్య, పిల్లలు తిరుచానూరులోని అద్దె భవనంలో నివాసముంటున్నారు. సదరు వ్యక్తి విజయవాడలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మృతదేహాన్ని తిరుచానూరుకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని ఇంటి లోపలికి తీసుకెళ్లకూడదని, బయటే ఉంచాలని ఇంటి యజమానులు గొడవపడ్డారు. చేసేదేమీ లేక బయటే ఉంచి తదుపరి కార్యక్రమం కానిచ్చారు. కొన్నాళ్ల క్రితం మదనపల్లిలో ఓ పల్లెలో కూడా ఇదే సంఘటన నెలకొంది. అద్దెకు నివాసముంటున్న రైతు ఆకస్మికంగా చనిపోవడంతో ఇంటి యజమానులు వచ్చి శవాన్ని బయటపెట్టాలని గొడవపడి శవాన్ని బయటపెట్టారు. మానవతే ఆదర్శం.. ఓ ముస్లిం మృతిచెందితే వారివారి ఆచారం ప్రకారం శ్మశానానికి తరలిస్తారు. ఎక్కడైనా మృత దేహాల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తారని తెలిస్తే వెంటనే వారు ఆ మృతదేహం బాధ్యత తీసుకుని కడవరకు సాగనంపుతారు. వారే దహన క్రియ ఖర్చులు కూడా పెట్టేవారు ఉన్నారు... ఇలా ఇటీవల చాలామంది అనాథ శవాలకు, ఎవరైనా పేదవారు మరణిస్తే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మృతదేహాలకు దహనక్రియలు నిర్వహిస్తున్నారు. అన్నీ తామై వారి భుజాన వేసుకుని కర్మకాండలు కూడా పూర్తిచేస్తుండగా, అద్దె ఇళ్ల యజమానులు అమానుషంగా ప్రవర్తిస్తుండడం శోచనీయం. చట్టం ఏం చెబుతోంది? ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ లీజ్ రెంట్ ఎవిక్షన్ కంట్రోల్ యాక్ట్ 1960 ప్రకారం అద్దెవాసులకు కొన్ని హక్కుల్ని చట్టం కల్పించింది. ఇందులో జీవించే, మరణానంతరం కర్మలకు సంబంధించిన హక్కులున్నాయి. ఇంటి యజమానితో సమానమైన హక్కుల్ని ఆ భవనం అద్దెవాసులు కలిగి ఉంటారు. తాను నివశించే భవనంలో యజమానికి ఎలాంటి వసతులు, స్వేచ్ఛ ఉంటాయో.. అదే అద్దెవాసులకు కూడా వర్తిస్తుంది. అద్దెవాసుల కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే ఇంటిలోకి రానివ్వకుండా అడ్డుకునే అధికారులు యజమానికి లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సొంత ఇల్లు, అయినవారు లేని సమయంలో అద్దె భవన కుటుంబం చుట్టుపక్కల నివసించేవారి సహకారంతో ఆచారాల ప్రకారం దానం చేసుకోవచ్చని చట్టం చెబుతోంది. వీటిని ఉల్లంఘించడం చట్టవిరుద్ధం. మృతదేహానికి జరగాల్సిన క్రియలను అడ్డుకుంటే హక్కుల్ని కాలరాసినట్టే. అలా ఎవరైనా చేసినా హక్కుల ఉల్లంఘన జరిగిందని రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. మానవ హక్కుల సంఘం చిరునామా : బ్లాక్ నెం-7, గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్, గృహకల్ప బిల్డింగ్, ఏపీ హౌస్ కార్పొరేటివ్ బిల్డింగ్, మొజంజాహీ రోడ్డు, నాంపల్లి, హైదరాబాద్, 040-24601572, 73. -
ఇంటి యజమానికి విద్యార్థి టోకరా
నర్సంపేట : నమ్మి గదిని అద్దెకు ఇచ్చిన ఇంటి యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ దివాకర్ కథనం ప్రకారం.. పాలకుర్తి మండలం పెద్ద తండాకు చెందిన గుగులోతు శ్రీనాథ్ ఖానాపురం మండలంలోని ఐనపల్లిలో విజేత ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. నర్సంపేట పట్టణంలోని టీఆర్ఎస్ కాలనీలో ఆకారపు కుమారస్వామి ఇంట్లోని గదిలో అద్దెకు ఉంటూ కళాశాలకు వెళ్లొస్తున్నాడు. కొద్దిరోజులు గా జల్సాలు, వ్యసనాలకు అలవాటుపడిన శ్రీనాథ్ ఆగస్టు 30న కుమారస్వామి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి బంగారు అభరణాలను ఎత్తుకెళ్లాడు. సాయంత్రం ఇంటి కి వచ్చిన కుమారస్వామి, కుటుంబ సభ్యులు ఇంట్లో చిందరవందరగా పడేసిన దుస్తులు, సామగ్రిని చూసి ఆందోళనకు గురై ఆభరణాలు చూసుకోగా అపహరణకు గురైనట్లు గుర్తించా రు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనాథ్ను రిమాం డ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశం లో ఎస్సైలు ఇ.హరికృష్ణ, హెడ్కానిస్టేబుళ్లు సదానందం, మల్లేశం పాల్గొన్నారు. -
నకిలీ పత్రాలతో యాజమానినే భయపెట్టాడు..
నాంపల్లి: నకిలీ దస్తావేజులు తయారు చేసి ఓ ఇంటి యజమానిని భయభ్రాంతులకు గురిచేసిన కిరాయిదారుడితోపాటు అతని అనుచరులను నాంపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నాంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని బజార్ఘాట్లో చోటుచేసుకున్న ఈ కేసుకు సంబంధించి ఇన్స్పెక్టర్ మధు మోహన్రెడ్డి తెలిపిన వివరాలివీ.. బజార్ఘాట్లో నివాసం ఉండే గణపతి రావుకు ఎనిమిది పోర్షన్లున్న భవనం ఉంది. దానిని ఎనిమిది మందికి అద్దెకిచ్చారు. షేర్గల్లీకి చెందిన సయీద్ అనే వ్యక్తికి 2009లో అద్దెకు దిగాడు. ఈ ఏడాది మేనెలలో ఇంటి యజమాని గణపతిరావు మరణించారు. హుమాయూన్ నగర్ ఉండే ఆయన కుమారుడు ప్రవీణ్ అద్దె కోసం సయీద్ వద్దకు ఇటీవల వెళ్లారు. అద్దె చెల్లించకుండా ఈ ఇల్లు తనదేనంటూ సయీద్ తిరగబడ్డాడు. ‘అద్దె లేదు.. ఇల్లు లేదు.. దిక్కున్నచోట చెప్పుకో’ అంటూ దబాయించాడు. ‘మీ తండ్రి నాకు అమ్మేశాడం’టూ దొంగ డాక్యుమెంట్లు, దొంగ రసీదులు చూపించారు. అంతటితో ఆగకుండా సిటీ సివిల్ కోర్టులో కేసు పెట్టాడు. మున్సిపల్ ట్యాక్స్ రసీదు, ఇళ్లు కొన్నట్టుగా ఇంటి యజమానికి నగదు చెల్లించిన రసీదు, ఎలక్ట్రిసిటీ, నల్లా కనెక్షన్ రసీదులు నకిలీవి సంపాదించాడు. ఈ రసీదులతో గోల్కొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేసే ముస్తాక్ అనే బ్రోకర్ సాయంతో సయీద్ తన పేరిట ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై కోర్టుకు నివేదించిన తప్పుడు డాక్యుమెంట్లతో ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కూపీ లాగితే డొంక కదిలింది. సయీద్ను అతని అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తే నిజాన్ని ఒప్పుకున్నారు. దీంతో సయీద్, ముస్తాక్, ఖలీమ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సయీద్ తమ్ముడు, భార్య పరారీలో ఉన్నారు. -
ఇల్లు ఖాళీ చేయమంటే ప్రాణం తీశాడు
పహాడీషరీఫ్ (హైదరాబాద్) : ఇల్లు ఖాళీ చేయాలని కోరిన యజమానిపై కిరాయిదారుడు దాడిచేసి కొట్టడంతో ఆ యజమాని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్లోని పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హబీబ్నగర్ ప్రాంతానికి చెందిన గౌస్ఖాన్ (40) ఇంట్లో వారం రోజుల క్రితం అహ్మద్ బిన్ సాదిక్ (27) అనే ఆటోడ్రైవర్ భార్యాపిల్లలతో కలిసి అద్దెకు దిగాడు. కాగా సాదిక్ రోజూ మద్యం తాగి వచ్చి భార్యను కొడుతూ రణరంగం సృష్టిస్తుండడంతో ఇల్లు ఖాళీ చేయాలని గౌస్ కోరాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం గౌస్ఖాన్ భార్య భానుబేగంతో సాదిక్ ఘర్షణ పడ్డాడు. అడ్డు వెళ్లిన గౌస్ఖాన్పై దాడిచేసి విచక్షణా రహితంగా కొట్టడంతో గౌస్ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
తాడేపల్లిగూడెంలో చోరీ
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): తాడేపల్లిగూడెం పట్టణంలోని రామారావుపేట- ఉంగరాలవారివీధిలో గల ఓ ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి 12 కాసుల బంగారం, కిలో వెండి, రూ.5 వేల నగదు దొంగిలించారు. ఇంటి యజమాని ముత్తారామదుర్గారావు ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ సూర్యభగవాన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కోరిక తీర్చలేదని ఆ ఇంటి ఓనర్ ఏం చేశాడంటే....
-
దొంగ దొరికి పోయాడు
కోస్గి(మహబూబ్నగర్): ఇంట్లో ఎవరూ లేరు...ఇక తనకు అడ్డే లేదని ధైర్యంగా తలుపు తాళాలు పగులగొట్టి దొంగతనానికి ఉపక్రమించిన ఓ వ్యక్తి.. అనుకోకుండా ఇంటి యజమానికి దొరికిపోయాడు. సోమవారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కోస్గి పట్టణంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి కథనం మేరకు..రామాలయం చౌరస్తా సమీపంలో దోమ ప్రసాద్ నివాసం ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం ప్రసాద్ కుటుంబసభ్యులు బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటి సమీపంలోనే టైలర్గా పనిచేసే బండ రాము అనే యువకుడు రాత్రి పది గంటల సమయంలో ఇంటి తాళాలు పగుల గొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. లోపలి నుంచి గడియ వేసుకొని బీరువా తాళాలు పగుల గొడుతుండగా ప్రసాద్ ఇంటికి వచ్చాడు. లోపలి నుంచి శబ్దాలు వస్తుండడం, తాళాలు పగిలి ఉండటం గమనించాడు. అతడు బయటి నుంచి గడియ పెట్టి చుట్టు పక్కల వారిని అప్రమత్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవటంతో అందరూ కలసి ఇంట్లో చిక్కిన రామును పట్టుకున్నారు. -
బాలిక ఒంటిపై వాతలు పెట్టిన యజమాని
తూ.గో: ఓ బాలికనుఇంటి యజమాని చిత్రహింసలకు గురి చేసి, ఒంటిపై వాతలు పెట్టిన ఘటన కాకినాడ పట్టణంలో వెంకట నగర్ కాలనీలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా భోగాపురం గ్రామానికి చెందిన బాలిక ఓ ఇంట్లో పని కుదిరింది. పనిలో చేరినప్పట్నుంచీ ఆ బాలికను ఇంటి యజమాని వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు. అక్కడితో ఆగకుండా ఆ బాలికను నానా ఇబ్బందులకు గురి చేస్తూ చిత్రహింసలు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆ బాలిక ఒంటిపై వాతలు కూడా పెట్టాడు. ఈ విషయం రాజీవ్ విద్యామిషన్ అధికారులకు తెలియడంతో బాలికను రక్షించారు.